
గిరగిర!
భానుడు
మండుతున్న ఎండలతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
భగభగ..
మీటర్
మధ్యాహ్నం 1–3 గంటలు, రాత్రి 10 గంటల తర్వాత హెవీలోడ్
తేదీ మధ్యాహ్నం 1 గంటకు రాత్రి 10 గంటలకు వినియోగం వినియోగం (మెగావాట్లలో) (మెగావాట్లలో) 17–ఏప్రిల్ 25.464 29.246 18–ఏప్రిల్ 26.741 29.952 19–ఏప్రిల్ 27.552 30.434 20–ఏప్రిల్ 27.857 31.272
విశాఖ సర్కిల్
పరిధిలో రోజూ
సాధారణ వినియోగం
12 మిలియన్
యూనిట్లు
ప్రస్తుతం
14–15 మిలియన్
యూనిట్లకు
చేరిక
డిమాండ్కు
అనుగుణంగా సరఫరా
చేసేందుకు
ఈపీడీసీఎల్
అష్టకష్టాలు
ఒక్కసారిగా
లోడ్ పెరగడంతో
సరఫరాలో
లోపాలు
ఇక మిట్ట మధ్యాహ్నం సమయంలో నడి నెత్తిన సూరీడు తాండవమాడుతున్న సమయంలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. అదేవిధంగా రాత్రి 10 గంటల సమయంలోనూ డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో సరఫరా కంటే 3 నుంచి 5 మెగావాట్లు అధికంగా వినియోగిస్తున్నారు.
ఆ గంటల్లో.. మంటలే..!
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. సాధారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మార్చి మూడో వారం నుంచి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కరెంటు వినియోగం కూడా పెరుగుతుంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. అప్పటి నుంచి డిమాండ్ పీక్స్కు వెళ్లిపోయింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. లోడ్ పెరుగుతుండటంతో సరఫరాలోనూ లోపాలు తలెత్తుతున్నాయి.