
‘అ అంటే అమలాపురం’.. అభిమానులకు చేదు అనుభవం
సీతమ్మధార/సీతంపేట: నగరంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ (పోర్టు స్టేడియం) వేదికగా శనివారం రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ యువతను ఉర్రూతలూగించింది. ఆయన అందించిన ఉత్సాహభరితమైన పాటలకు, డ్యాన్స్లకు యువతి, యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. రాత్రి 7 గంటలకే కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, దేవిశ్రీ ప్రసాద్ రాక కాస్త ఆలస్యం కావడంతో 8.30 గంటలకు మొదలైంది. అయితే, ఈ కార్యక్రమంలో నిర్వాహకుల తీరు అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. టికెట్ల విక్రయంలో భారీ మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఒకసారి స్కానింగ్ చేసి లోపలికి పంపిన టికెట్లను కూడా మళ్లీ అమ్మకానికి పెట్టినట్లు అభిమానులు గుర్తించి గొడవ చేశారు. కొంత మంది వ్యక్తులు బ్లాక్లో టిక్కెట్లు విక్రయించారని, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు.
హోరెత్తిన డీఎస్పీ మ్యూజికల్ కాన్సర్ట్