
శతాబ్ది ఉత్సవాల లోగో రూపకర్త ఏయూ విద్యార్థి
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల లోగోను క్యాంపస్ ఫైన్ఆర్ట్స్ విభాగం బీఎఫ్ఏ విద్యార్థి షేక్ రఫీ రూపొందించారు. ఈ లోగో రూపకల్పన కోసం వీసీ ప్రత్యేక కమిటీని నియమించారు. వర్సిటీలో ఆసక్తి ఉన్న ఆచార్యులు, విద్యార్థులతో లోగోను తయారు చేయించారు. శతాబ్ది ఉత్సవాలకు అద్దం పట్టేలా సిద్ధం చేసిన మూడు లోగోలను కమిటీ సభ్యులు ఎంపిక చేసి.. వాటిని వీసీ ముందుంచింది. వీటిలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి షేక్ రఫీ రూపొందించిన లోగోను ఎంపిక చేసి.. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేదికపై అతిథులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షేక్ రఫీను సత్కరించారు.