
వక్ఫ్బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
తాటిచెట్లపాలెం: ఇటీవల కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి సున్నీ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ మసీద్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. టీఎస్ఎన్ కాలనీలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం వీరు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతులకు సంఘీభావంగా చిన్నారులు, పెద్దలు, మహిళలు జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో సున్నీ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ యాక్ట్–2025ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్వీకులు 4, 5 శతాబ్దాల కిందట ఆస్తులను అల్లా పేరున వక్ఫ్(దానం) చేశారని, వాటిని పేదలకు, వితంతువులకు ఉపయోగపడే చూడాలని వారు కోరారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్, జనరల్ సెక్రటరీ ఎస్.కె.నూర్ అహ్మద్, హైదర్ ఆలీ సింకా, ఎస్.కె.అహ్మద్ వల్లీ, రహ్మతుల్లా బేగ్, మీర్ అబ్బాస్ హుస్సేన్, మునీర్ఖాన్, రహమతుల్లా, సయ్యద్ అమీర్ఖాన్, మహబూబ్ షరీఫ్, హమ్మద్ హబీబ్, లుక్మాన్ పాల్గొన్నారు.