Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Expresses Shock Over Tragic Deaths Of Devotees At Simhachalam Temple In Visakhapatnam | Sakshi
Sakshi News home page

Simhachalam Tragedy: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

Apr 30 2025 7:00 AM | Updated on Apr 30 2025 10:30 AM

YS Jagan Expresses Shock Over Tragic Deaths of Devotees at Simhachalam Temple in Visakhapatnam

విశాఖ,సాక్షి : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

 చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

	సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement