
పుట్టిన రోజునే ప్రయాణం
ఈ నెల 18న చంద్రమౌళి తన జన్మదినం చేసుకున్నారు. అదే రోజున చంద్రమౌళి కుటుంబం, మరో రెండు కుటుంబాలు కలిసి కశ్మీర్ వెళ్లాయి. అక్కడ వారు ఆలయాల దర్శనం చేసుకున్నారు. ఆయన నాకు వరుసకు మావయ్య అవుతారు. ఇలా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా బాధించింది. సామాజిక కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొనేవారు. ఇటువంటి దారుణమైన సంఘటన జరిగినప్పుడు సహనం వహించడం, ఉపేక్షించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం.
– బి.చంద్రమౌళి, మృతుడి బంధువు