
మహనీయుల త్యాగఫలం ఏయూ
● బీచ్రోడ్డులో వాక్థాన్ నిర్వహణ
ఏయూక్యాంపస్/విశాఖ విద్య: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం బీచ్రోడ్డులో వాక్థాన్ నిర్వహించారు. ఏయూ ఉపకులపతి ఆచా ర్య జి.పి.రాజశేఖర్, పూర్వ ఉపకులపతులు, ఏయూ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్కె బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందన్నారు. వచ్చే సంవత్సరం ఇదే రోజున శతాబ్ది ఉత్సవాల వేడుకను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఏయూ విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్. ధనుంజయరావు, మాజీ వీసీలు ఆచార్య బీల సత్యనారాయణ, జి.ఎస్.ఎన్. రాజు, వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, వి.బాలమోహన్ దాస్, ఆర్.సుదర్శన రావు, ఎస్.రామకృష్ణ రావు, ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కె.వి.వి.రావు పాల్గొన్నారు. ఏయూ పరిపాలన భవనం వద్ద జరిగిన ప్రారంభోత్సవంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.
బీచ్రోడ్డులో వాక్థాన్ను ప్రారంభిస్తున్న వీసీ రాజశేఖర్