కదం తొక్కిన ఎర్ర దండు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన ఎర్ర దండు

Dec 31 2025 8:47 AM | Updated on Dec 31 2025 8:47 AM

కదం తొక్కిన ఎర్ర దండు

కదం తొక్కిన ఎర్ర దండు

బీచ్‌రోడ్డులో సిటూ ‘రెడ్‌ షర్ట్‌’ర్యాలీ

ఏయూ క్యాంపస్‌: సీఐటీయూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఉదయం రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు భారీ కవాతు నిర్వహించారు. ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి మహాసభలు జరిగే ఏయూ కన్వెన్షన్‌ హాల్‌ ప్రాంగణం వరకు ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కవాతులో వలంటీర్లు సిటూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి, లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలి, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు, ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, సోషలిజం అజేయం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కులమత రహిత సమాజం కోసం, కార్మిక–కర్షక ఐక్యత వర్ధిల్లాలని, ప్రజా పోరాటాలు సాగాలని నినదిస్తూ ఈ ఎర్రదండు కవాతును నిర్వహించింది. కవాతులో సిటూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి కుమార్‌, రాష్ట్ర కోశాధికారి కె.ఆర్‌.కె.మూర్తి, నేతలు కె.లోకనాథం, కె.ఎం శ్రీనివాస్‌, పి.మణి, ఐద్వా ఆల్‌ ఇండియా నాయకురాలు డి.రమాదేవి, జిల్లా, జోన్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement