చమోలీ: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విష్ణుగడ్-పీపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఒక సొరంగంలో రెండు లోకో రైళ్లు (టన్నెల్ రైళ్లు) పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో మొత్తం 109 మంది కార్మికులు, అధికారులు ఉన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 9:30 గంటల సమయంలో షిఫ్ట్ మార్పు జరుగుతున్న వేళ చోటుచేసుకుంది. కార్మికులు, అధికారులను తీసుకెళుతున్న ఒక రైలు.. నిర్మాణ సామగ్రితో వెళ్తున్న మరో రైలును ఢీకొంది. సొరంగం లోపల వెలుతురు తక్కువగా ఉండటం, సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద తీవ్రతకు రైళ్ల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
#WATCH | Chamoli, Uttarakhand | Several workers injured after internal transport trains operating within the THDC hydropower project area at Pipalkoti, collided with each other.
SP Chamoli, Surjeet Singh says, "42 people have been admitted to the district hospital, out of which… pic.twitter.com/gxVEXHwScB— ANI (@ANI) December 31, 2025
ఈ ప్రమాదం కారణంగా సుమారు 60 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో 42 మందిని గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, మరో 17 మంది పీపల్కోటిలోని వివేకానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్రమైన గాయాలు అయినట్లు సమాచారం. జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, టీహెచ్డీసీ (టీహెచ్డీసీ)ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సొరంగం లోపల ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు భద్రతా నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. లోకో రైళ్ల రాకపోకల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడం, సొరంగం లోపల తగినంత వెలుతురు ఉండేలా చూడటంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. 2026కు పూర్తి కావాల్సిన ఈ 444 మెగావాట్ల ప్రాజెక్టు పనుల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: ‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్ టెస్ట్.. 180లోనూ తొణకని నీరు!


