మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు | - | Sakshi
Sakshi News home page

మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు

Dec 31 2025 8:44 AM | Updated on Dec 31 2025 8:44 AM

మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌లో అత్యాధునిక టోమోథెరప

మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌లో అత్యాధునిక టోమోథెరప

ఎంవీపీకాలనీ: క్యాన్సర్‌ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్‌ హాస్పటల్‌ ఎండీ డాక్టర్‌ వున్నా మురళీకృష్ణతో కలిసి ఈ సేవలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్‌ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్‌ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్‌ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌ దేశంలో లెవల్‌ 3 కేటగిరీ హాస్పటల్స్‌గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్‌ ట్యూమర్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్‌ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement