
కంప్యూటర్ ఇంజినీర్ అవుతా
జేఈఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరిలో 138 ర్యాంకు సాధించాను. ఇంటర్ శ్రీ చైతన్య రామన్ భవన్లో చదివాను. ఇంటర్లో 986 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి చైన్నె ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలని అనుకుంటున్నాను. నాన్న బీఎస్ఎన్ఎల్లో అకౌంట్స్ ఆఫీసర్, అమ్మ కృష్ణా కళాశాలలో బోటనీ లెక్చరర్. అక్క మెడిసన్ చదువుతోంది.
– డి.జి.ఎస్.ధర్మ ప్రతాప్, శ్రీనగర్, రామాటాకీస్ రోడ్
బ్రాండ్ కోసం ప్రయత్నిస్తా..
జేఈఈ మెయిన్స్లో దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. మంచి ఇంజినీరింగ్ కళాశాలలో చేరి నాకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ వచ్చేలా కృషిచేస్తాను. అడ్వాన్స్డ్ పరీక్ష కోసం రోజుకి 10 గంటల పాటు ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నాను. అధ్యాపకుల ప్రోత్సాహం, గైడన్స్, పాఠ్యాంశాలపై పట్టుసాధించడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. – ఎస్.పూజిత కృష్ణ

కంప్యూటర్ ఇంజినీర్ అవుతా