ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

Apr 30 2025 12:52 AM | Updated on Apr 30 2025 12:52 AM

ఏర్పా

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

సింహాచలం: చందనోత్సవం ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పరిశీలించారు. డ్రై రన్‌ నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొండదిగువ కొత్త ఘాట్‌రోడ్డు, న్యూ గోశాలరోడ్డు, పాత గోశాల రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండదిగువ హోల్డింగ్‌ పాయింట్లలో వేచి ఉండేందుకు అనువుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి కొండైపెకి వెళ్లి క్యూలు, బారికేడ్లు, తాగునీరు, వైద్యశిబిరాలు, బయో మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జేసి మయూర్‌ అశోక్‌, భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాధుర్‌, సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవొ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సింహగిరిపైన, కొండదిగువన, తొలిపావంచా వద్ద, గోశాల జంక్షన్‌, అడవివరం జంక్షన్‌, ఇతర ప్రాంతాల వద్ద భద్రతా ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. పార్కింగ్‌ ప్రాంతాలు, సైన్‌ బోర్డులు, క్యూలు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ1
1/1

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement