
శ్రీ చైతన్య విజయకేతనం
ఆరిలోవ: 10వ తరగతి ఫలితాల్లో ఉత్తరాంధ్ర జోన్ శ్రీ చైతన్య స్కూల్స్ విద్యార్థులు సత్తా చాటారు. అనీష యండ 599 మార్కులు సాధించి టాపర్గా నిలవగా, అబ్దుల్ సమీర భాను, బి.హృదయ శాంతి 598 మార్కులు సాధించి ద్వితీయ స్థానం సాధించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 40 మంది విద్యార్థులు 595 మార్కులు, 257 మంది విద్యార్థులు 590 మార్కులకు పైగా సాధించినట్లు విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. ఈ విజయంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందన్నారు. ఉత్తరాంధ్ర ఏజీఎం ఎం.వి.సురేష్, రీజినల్ ఇన్చార్జిలు ఆలీ, రమణ, శ్రీనివాస్, రామినాయుడు, ప్రసాద్, అకడమిక్ కోఆర్డినేటర్లు రాజేష్, ప్రిన్సిపాళ్లు, డీన్లు విద్యార్థులను అభినందించారు.