Ranga Reddy District News
-
అక్కడ విజయం.. ఇక్కడ సంబరం
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026● ప్రజావాణికి అధికారులు విధిగా హాజరవ్వాలి ● అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి కడ్తాల్లో..కందుకూరులో..ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు.నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ప్రశాంతంగా ఎంసెట్ మొయినాబాద్:ఎంసెట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, జేబీఐఈటీ కళాశాల, చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీల్లో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీ క్షలు జరిగాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్కు రిమాండ్
మీర్పేట: హిట్ అండ్ రన్ కేసులో కారు డ్రైవర్ను రిమాండ్కు తరలించారు. ఈ ఘటన మీర్పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 1వ తేదీన రాత్రి గాయత్రీ నగర్ వద్ద మీర్పేటకు చెందిన తండ్రీకొడులు జిలానీ, ఫైజల్ బైక్ వెళ్తున్నారు. సింగరేణి కాలనీకి చెందిన కారు డ్రైవర్ నీలకంఠం సత్యనారాయణ బైక్కు సైడ్ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సత్యనారాయణ కారులో కూర్చుని ఫైజల్ను తోసేయడంతో డివైడర్పై పడి గాయపడ్డాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు యత్నించగా జిలానీ బైక్ను కారుకు అడ్డుగా పెట్టాడు. ఆయన్ను ఢీకొట్టడంతో బానైట్పై పడ్డాడు. కారు ఆపకుండా రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను రిమాండ్కు తరలించారు. కడ్తాల్: న్యామతాపూర్లోని ఓ వ్యవసాయ పొలం వద్ద గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడు నల్లవోతుల లక్ష్మయ్య (30) గ్రామంలోని మద్దూరు రామిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 2న శనివారం ఉదయం పనికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఊరి శివారులోని ఓ బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు లక్ష్మయ్యగా గుర్తించడంతో బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదిరెడ్డి తెలిపారు. 40 అడుగుల లోతున్న బావిలో నుంచి శవాన్ని తీసేందుకు పోలీసులకు సహకరించిన స్థానికులు తానేషా, రాములును పీఎస్కు పిలిపించి సన్మానించడంతో పాటు నగదు అందించారు. ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్ ఉన్నారు. మొయినాబాద్: బంధువుల రిసెప్షన్కు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో పడుకున్న యువతి తెల్లవారే సరికి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని అజీజ్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అజీజ్నగర్కు చెందిన డప్పు చంద్రయ్య కుటుంబం ఆదివారం రాత్రి బంధువుల రిసెప్షన్కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు చంద్రయ్య నిద్ర లేచి చూడగా కూతురు చందన(19) కనిపించలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
షాబాద్: 108 వాహనంలో ఓ తల్లి ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. షాబాద్ 108 సిబ్బంది రాజేశ్, భూపాల్ సెల్పులు తెలిపిన ప్రకారం బిహార్కు చెందిన ఓ జంట ఎలికట్ట గ్రామంలో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కుమారికి మధ్యాహ్నం పురిటి నొప్పులురావడంతో ఆమె భర్త 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో ఆమెను షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువవడంతో సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. -
విషాదం నింపిన ప్రమాదం
● శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఇద్దరు యువ ఫొటోగ్రాఫర్ల దుర్మరణం ● శోకసంద్రంలో మృతుల కుటుంబాలు మంచాల: పొట్టకూటి కోసం ఇంటి నుంచి బయలు దేరిన ఫొటోగ్రాఫర్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని విషాదం నింపారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదల కుటుంబాలు. ఇప్పుడిప్పడే యువకులు చేతికి వచ్చి కుటుంబానికి ఆసరా ఉంటున్నారు. రోడ్డు ప్రమాదం వారి ఇళ్లలో చీకట్లు నింపింది. ఆదివారం సిద్దిపేటలోని శివం గార్డెన్లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రజ్ఞాపూర్ రింగ్రోడ్డు వద్ద కారు అదుపుతప్పడంతో మండల పరిధిలోని తిప్పాయిగూడకు చెందిన గ్యార గౌతమ్(21), ఆగాపల్లికి చెందిన అన్నారం అఖిల్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శోకసంద్రంలో తిప్పాయిగూడ తిప్పాయిగూడకు చెందిన గ్యార పెంటయ్య–మనోహర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు గౌతమ్ ఇప్పుడిప్పుడే పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి ప్రయాణంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే దేవుడు తీసుకెళ్లాడంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఆగాపల్లికి చెందిన అన్నారం సంతోష–శేఖర్ దంపతులకు ఒక్కగాను ఒక్క కొడుకుడు అఖిల్(23) కొన్ని రోజులుగా ఫొటోగ్రాఫర్ వృత్తిలో పని చేస్తున్నాడు. పనికి వెళ్లిన కొడుకు శవమై తిరిగిరావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు మేము ఎవరి కోసం బతకాలని రోదిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే అఖిల్ మృతితో ఆగాపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం మృతుల అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆగాపల్లికి చెందిన అనిరుద్ ప్రస్తుతం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్యార గౌతం (ఫైల్) అన్నారం అఖిల్ (ఫైల్) -
పంట భూముల జోలికి రావద్దు
● రైతు వారోత్సవాల్లో కర్షకుల ఆందోళన ● ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ మొయినాబాద్ రూరల్: కూరగాయలు, పూల మార్కెట్ నిర్మిస్తామంటూ తమ భూముల జోలికి రావొద్దని అజీజ్నగర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సోనియాదర్శన్, కమిషనర్ జాకీర్ అహ్మద్, మండల వ్యవసాయ, అభివృద్ధి అధికారులకు విన్నవించారు. సర్వే నంబర్లు 151, 176లోని భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వాపోయారు. ఈనిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చనివెల్లి అమరేందర్రెడ్డి, చాకలి యాదగిరి, మాణిక్యం, శంకరయ్య, రైతులు మాడి రాంచంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి, రాంభూపాల్, నరేందర్యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వైద్యరంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మధన్మోహన్రెడ్డి, కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రమేశ్రెడ్డి అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యకళాశాల విద్యార్థులె ‘ట్రోయ్ జియాంజ్’ పేరుతో గ్రాడ్యుయేషన్ ఘనంగా నిర్వహించారు. వేడుకలను శాసనమండలి చీఫ్ విఫ్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ వరదారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి ముఖ్యఅతిథులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యవృత్తి చెప్పటిన విద్యార్థులు వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సేవలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్యంలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి విద్యార్థి నిరంతర పరిశోధకుడిగా ముందుకు సాగాలని, తల్లిదండ్రులు కష్టాన్ని మరిచిపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్రెడ్డి, ప్రిన్సిపాల్ జోయారాణి, మెడికల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ గౌరి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
షాద్నగర్రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆర్డీఓ ఆర్ఎన్ సరిత అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజలు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వెళ్లాల్సివచ్చేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డివిజన్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాల్లోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. డివిజన్ స్థాయిలోని అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ డీఈ సురేష్, ఆర్అండ్బీ ఏఈ రాజశేఖర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి చేవెళ్ల: ప్రజా సమస్యల పరిష్కారంకోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి అన్నారు. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖల ద్వారా తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో హౌసింగ్ శాఖకు సంబంధించి 4, పెన్షన్ కోసం 1, ఎస్సీ కార్పొరేషన్ రుణాలకోసం 2 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్నిశాఖలకు సంబంధించి అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు ఇబ్రహీంపట్నం: డివిజన్ స్థాయి ప్రజావాణిని సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో అనంతరెడ్డి నిర్వహించారు. రాష్ట్ర ప్రజావాణి కో–ఆర్డినేటర్ రాకేష్రెడ్డి సందర్శించి పిటిషనర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో పొందుపరిచి, ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భూ భారతికి సంబంధించి 27, ఇందిరమ్మ ఇళ్లకు 4, ఇనామ్ భూములకు 4, సాదాబైనామా 3, విద్యుత్ శాఖకు సంబంధించి 3 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో అనంతరెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి విద్యుత్ శాఖ డీఈఈ నరేష్కుమార్, డీఎల్పీఓ సాధన, సీడీపీఓ వినీత, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
మర్రి చెట్ల తొలగింపు.. భారీగా ట్రాఫిక్ జాం
మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మొయినాబాద్ సమీపంలో మర్రి చెట్లు తొలగిస్తున్నారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మొయినాబాద్ సమీపంలోని తాజ్ సర్కిల్ వద్ద సోమవారం సాయంత్రం నుంచి జేసీబీలతో తవ్వి మర్రిచెట్లను మరో చోట ట్రాన్స్లొకేట్ చేసేందుకు తరలిస్తున్నారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాత్రి 8 గంటల వరకు భారీగా వాహనాలు నిలిచిపోయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంకర్పల్లి: పట్టణానికి చెందిన ఓ టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) నాయకుడు సోమవారం నిర్వహించిన తన కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. -
సేంద్రియ పద్ధతిలో సాగు మేలు
మంచాల: వ్యవసాయ పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పంటల సాగు విషయంలో నూతన పద్ధతులు అవలంబించాలన్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకొని నేలలో పోషకాల లోపాలను గుర్తించాలని, తదనుగుణంగా ఎరువులు వాడాలన్నారు. లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు నానో యూరియా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పచ్చి రొట్ట ఎరువులు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సుజాత, ఏఓ వెంకటేశ్, సర్పంచ్ మానస వినయ్, వ్యవసాయాధికారులు వనజాత, హరినాథ్, నవీన, లింగస్వామి, నిఖిత, సాయిసిరి, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇరువర్గాల ఘర్షణ.. అంబులెన్స్పై దాడి
కుల్కచర్ల: ఇరువర్గాల గొడవలో అంబులెన్స్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది, పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శంకర్నాయక్, నారాయణ కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో శంకర్నాయక్ కుటుంబీకులు 108కి ఫోన్ చేసి తాము గాయపడ్డామని చెప్పడంతో అంబులెన్స్ వచ్చి వారిని కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఈ క్రమంలో నారాయణ కుటుంబీకులు అంబులెన్స్ రాకముందే ఆస్పత్రికి చేరుకుని శంకర్ నాయక్ కుటుంబీకులపై దాడికి ప్రయత్నించారు. దీంతో వారు వాహనంలో ఉండిపోయారు. ఇది గమనించిన నారయణ కుటుంబీకులు ఇటుకలతో అంబులెన్స్పై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. అంబులెన్స్పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు -
సిగరెట్ పెట్టెల్లో 5.8 కిలోల గంజాయి
● శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత శంషాబాద్: సిగరెట్ పెట్టెల్లో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన హైడ్రోపోనిక్ గంజాయిని ఎయిర్ ఇంటెలి జెన్స్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. ఏకే 69 విమానంలో కౌలాలంపూర్ నుంచి శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోహన్ కందన్ అనే వ్యక్తి విలేజ్ అరైవల్ వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు. క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో బ్యాగేజీలో సిగరేట్ పెట్టెల్లో 5.8 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని కనుగొన్నారు. నిందితుడు మోహన్ కందన్తో పాటు గంజాయిని తీసుకునేందుకు వచ్చిన రిసీవర్ తమిళనాడుకు చెందిన సిద్దిఖ్ అలీ అనే వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు నిమిత్తం వారికి కస్టమ్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. -
హిందువులంతా సంఘటితమవ్వాలి
కుల్కచర్ల: హిందూ సంస్కృతి, సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలని వక్తలు ప్రథమేశానంద, యాదగిరి, హైందవి అన్నారు. శనివారం రాత్రి కుల్కచర్ల మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హిందూమత రక్షణ మనందరి భాధ్యత అన్నారు. అన్యమతస్తులు లౌకికవాదమంటూ హిందూమతాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హిందువులపై జరుగుతున్న దాడులను హిందువులు సైతం మన దగ్గర కాదులే, మనకు ఎందుకులే అనే విధానం అవలంబించడంతో ఐక్యత దెబ్బతిన దాడులు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ, ఆర్ఎస్ఎస్ సంఘ నాయకులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకో.. ఏమో..!
● ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగం పరిస్థితి ఇదీ ● కమిషనరేట్ మొత్తానికి షాద్నగర్ సెంటర్లోనే సిగ్నల్ ● రోడ్డు భద్రత అవగాహనపైనే పోలీసుల దృష్టి సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ. ఈ నాలుగో నగరిలో ప్రజలకు రక్షణ, పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు గతేడాది డిసెంబర్లో ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిషనరేట్ మొత్తానికి కేవలం షాద్నగర్ సెంటర్లో ఒక్కటే ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. ఈ సిగ్నల్ ఉన్న ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు సహా 150 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. రోడ్డు భద్రత అవగాహనకే ప్రాధాన్యత.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) మొత్తం 760 చ.కి.మీ. మేర విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల మూడు శాంతి భద్రతల జోన్లు ఉండగా.. కమిషనరేట్ మొత్తం ఒకటే ట్రాఫిక్ జోన్గా ఉండగా.. షాద్నగర్, మహేశ్వరం రెండు డివిజన్లు, షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నాలుగు ట్రాఫిక్ ఠాణాలున్నాయి. దీంతో కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఎన్ఫోర్స్మెంట్కు బదులుగా ట్రాఫిక్, రహదారి భద్రతపై అవగాహనకే ప్రాధాన్యమిస్తోంది. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో స్థానికులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, ఉల్లంఘనలకు జరిమానాలు, ఇతరత్రా అంశాలపై విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఇతరత్రా ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వెబ్సైట్కూ దిక్కేలేదు.. ఒక ట్రాఫిక్ సిగ్నల్.. విధుల్లో 150 మంది -
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రామ్ కరణ్ రెండు నెలల క్రితం తన భార్య రాధ(20), కుమార్తె నైనాతో కలిసి జల్పల్లి ఆర్.ఆర్.ఫాం హౌస్ ఎదురుగా ఉన్న ఓంకార్ పశువుల దాణా కంపెనీలో కార్మికుడిగా చేరి, అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న పని మీద బయటికి వెళ్లిన రామ్ కరణ్ మధ్యాహ్నం వచ్చి చూడగా కుమార్తె ఏడుస్తూ కనిపించింది. భార్య కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీఎం ఢీకొని యువకుడి దుర్మరణం షాబాద్: డీసీఎం ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిగూడ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన మనీష్దాస్(22) మల్లారెడ్డిగూడ స్టేజీ సమీపంలో అద్దె గదిలో ఉంటూ సీతారాంపూర్ సమీపంలోని సోలార్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు ఉండడంతో మధ్యాహ్నం స్థానికంగా కూరగాయలు తీసుకొని రోడ్డు దాటుతుండగా చేవెళ్ల వైపు నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం అతన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ ఆపకుండా వెళ్తుండగా షాబాద్ పోలీసులు సర్ధార్నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న ఆకాశ దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చిట్టీల పేరుతో మోసం భార్యాభర్తలపై బాధితుల ఫిర్యాదు మీర్పేట: చిట్టీల పేరుతో భార్యాభర్తలు మోసం చేసిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. బడంగ్పేట వైష్ణవికాలనీకి చెందిన సురేష్కుమార్, సౌజన్య దంపతులు స్థానికంంగా కొన్నేళ్ల నుంచి చిట్టీల పేరుతో కొంతమంది వద్ద నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చిట్టీల గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో చేసేది లేక దాదాపు 26 మంది బాధితులు ఆదివారం మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సురేష్కుమార్, సౌజన్యలు దాదాపు రూ.రెండు కోట్ల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు బైకులు స్వాధీనం
బైక్ల దొంగల అరెస్టు మొయినాబాద్రూరల్: కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మొయినాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఆరు బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మొయినాబాద్–సురంగల్ రోడ్డు లో క్రైమ్ టీమ్ పోలీసులు గస్తీ తిరుగుతుండగా మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం గోవింద్పల్లికి చెందిన హరిజన రామకృష్ణ, అదే మండలం కొంరెడ్డిపల్లికి చెందిన బద్దుల విజయ్కుమార్లు యమహా బైక్పై అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో గత ఐదు నెలలు గా మొయినాబాద్లో నాలుగు బైకులు, చేవెళ్ల, కూకట్పల్లిలో ఒక బైక్ చొప్పున చోరీ చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. చోరీకి గురైన ఆరు బైకులను స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్కు తరలించారు. -
ఇదిగో పరిష్కార వేదిక
షాద్నగర్: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. సమస్యలను విన్నవించేందుకు అధికారుల వద్దకు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు చెందిన వారు ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తోంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 3 జారీ చేసింది. ఈ నెల 4 నుంచి ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో .. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా ప్రజావాణి సేవలను క్షేత్ర స్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లా పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్, షాద్నగర్ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభం కానుంది. నోడల్ అధికారిగా ఆర్డీఓ జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. కలెక్టర్తో పాటుగా జిల్లా స్థాయి అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఆయా ఫిర్యాదులను శాఖల వారీగా విభజిస్తూ పరిష్కారానికి పంపిస్తుంటారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. హాజరు కానున్న డివిజన్ అధికారులు ప్రజావాణికి డివిజన్ పరిధిలోని ఆయా శాఖల అధికారులు హాజరుకానున్నారు. డివిజన్ స్థాయి వైద్యాధికారి, పంచాయతీ, వ్యవసాయ విస్తరణ, గృహ నిర్మాణ, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, మంచినీటి శాఖలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమానికి హాజరవుతారు. వీరు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను స్వీకరించి 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. లేదంటే తిరస్కరణ, పెండింగ్కు సంబంధించిన స్పష్టతను తప్పనిసరి దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్ నమోదు చేసి దరఖాస్తుదారుకు రసీదు అందజేస్తారు. దరఖాస్తుకు సంబంధించిన పరిస్థితిని ప్రజావాణి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయొచ్చు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సరిత, ఆర్డీఓ, షాద్నగర్ ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు ఆర్డీఓ అనంతరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులు డీఎల్పీఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఏడీఏ, డీఈఈ (ఆర్అండ్బీ), డీఈఈ (ఆర్డబ్ల్యూఎస్), సీడీపీఓ, ఏఎస్సీడీఓ, ఏటీడీఓ, ఏబీసీడీఓ, ఏఎండబ్ల్యూఓ, ఇతర శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఇచ్చే అర్జీలు స్వీకరించి తక్షణం పరిష్కారం చూపుతారని చెప్పారు. అధికారులు హాజరయ్యే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత చేరువగా ప్రజావాణి నేటినుంచి డివిజన్ కేంద్రాల్లో కార్యక్రమం ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహణ క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం -
కార్ఖానా కుంటను కాపాడండి
హయత్నగర్: చెరువులను కాపాడాల్సిన హైడ్రా అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే మెప్పు కోసం పనిచేస్తూ కాలనీ ప్రహరీని కూల్చి వేస్తారా అంటూ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. నాగోల్ సర్కిల్ పెద్దఅంబర్పేట్ డివిజన్ కుంట్లూర్ పరిధిలోని ప్రజయ్ గుల్మోర్ కాలనీ ప్రహరీని హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. కూల్చి వేసిన ప్రహరీని ఆదివారం మంచిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నర ఎకరాల్లో పక్కనే ఉన్న కార్ఖానా కుంట చెరువు కబ్జాకు గురై రెండు ఎకరాలు మాత్రమే మిగిలిందని అన్నారు. దానిని కాపాడలేని హైడ్రా అధికారులు 241 ఇళ్లు ఉన్న ప్రజయ్ గుల్మోర్ ప్రహరీని కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రహరీ కూల్చివేతతో కాలనీకి భద్రత లేకుండా పోయిందన్నారు. హైడ్రా పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు కృపాసాగర్, శివరామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొయినాబాద్: దేశ రక్షణకోసం అసువులుబాసిన వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కల్నల్ శ్రీనివాస్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో వచ్చే నవంబర్లో జరగనున్న 201 మద్రాసు ఇంజనీరింగ్ రెజిమెంట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల సన్నాహక సమావేశం ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 1971లో ఇండియా–పాకిస్తాన్ యుద్ధ సమయంలో తాను కమాండింగ్ ఆఫీసర్గా స్వయంగా పాల్గొన్న సందర్భాన్ని గుర్తుచేశారు. సైనికులు, మాజీ సైనికులు రెజిమెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్–యూజీ) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లోని పరీక్ష కేంద్రంలో మొత్తం 240 మందికి 240 మంది పరీక్ష రాశారు. వంద శాతం హాజరు నమోదైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ అనురాధ తెలిపారు. పరీక్ష రాయలేక విద్యార్థిని కన్నీటి పర్యంతం హయత్నగర్: నీట్ హాల్ టికెట్లో చిరునామా గందరగోళం కారణంగా ఓ విద్యార్థిని పరీక్షకు హాజరు కాలేకపోయిన ఘటన హయత్నగర్లో ఆదివారం జరిగింది. యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన కరకల రమేష్ కూతురు దుర్గా మీనాక్షి నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమైంది. తనకు ఇచ్చిన హాల్ టికెట్పై మాణిక్యమ్మ కాలనీ రాజేంద్రనగర్ హయత్నగర్ రంగారెడ్డి జిల్లా అని ఉంది. దీంతో ఈ అడ్రస్ హయత్నగర్లో ఉండవచ్చని భావించిన రమేష్ కూతురును తీసుకుని భువనగిరి నుంచి హయత్నగర్కు వచ్చారు. చివరి 20 నిమిషాల్లో హయత్నగర్లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్కు చేరుకున్నారు. ఈ సెంటర్ నెంబర్ ప్రకారం రాజేంద్రనగర్లో ఉందని నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో చివరి నిమిషంలో పరీక్షకు హాజరు కాలేక పోయిన విద్యార్థిని ఆమె తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. -
ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లి
గ్రేటర్లో బెంబేలెత్తిస్తున్న హిట్ అండ్ రన్ ప్రమాదాలు● అతివేగం, మద్యం మత్తులో దారుణాలు ● ద్విచక్ర వాహనదారులు, పాదచారులే బాధితులుసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో హిట్ అండ్ రన్ (వాహనంతో ఢీకొట్టి పారిపోవడం) ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెనక, పక్క నుంచి వాహనంతో ఢీ కొట్టి ఘటనా స్థలం నుంచి జారుకునే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అతివేగం, అలసట, మద్యం తాగి వాహనాలు నడపడంతోనే హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మానవత్వం మరిచి.. సాధారణంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ఎక్కువగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులే బాధితులవు తుంటారు. ఈ తరహా కేసులలో నిందితులు బాధితులను వెనకాల నుంచి ఢీ కొట్టేసి కనీసం క్షతగాత్రులు ఎలా ఉన్నారని చూడకుండా, మానవత్వం లేకుండా నాలుగైదు కిలో మీటర్ల వరకూ ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. చాలా వరకు హిట్ అండ్ రన్ కేసులు సీసీటీవీ కెమెరాలు లేని నిర్మానుష్య ప్రాంతంలో, రాత్రి వేళల్లో జరగడంతో ఈ తరహా కేసులు దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులపై, నిర్మానుష్య ప్రాంతాలలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువగా అవుతుంటాయి. సాధారణ రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే హిట్ అండ్ రన్ కేసులలో మరణాల శాతం ఎక్కువ. హిట్ అండ్ రన్ కేసుల్లో నిందితులు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, ఘటనా స్థలం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో బాధితులు మరణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఇలా.. . మీర్పేటలోని గాయత్రినగర్ నుంచి ఎల్బీనగర్ వైపు ద్విచక్ర వాహనంపై తండ్రీ కొడుకులు జిలానీ, ఫైజల్లు వెళుతుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు వారిని వెనక నుంచి ఢీకొట్టింది. కారు డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా.. జిలాని కారును ఆపేందుకు యత్నించాడు. అతడు కారు బానెట్పై ఉండగానే కారు ఆపకుండా డ్రైవర్ సుమారు 2 కి.మీ దూరం లాక్కెళ్లాడు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద ప్రయాణికులు అడ్డుకోవడంతో పరారయ్యాడు. ● దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అతివేగంగా వచ్చిన బెంజ్ కారు ఢీ కొట్టడంతో బ్రిడ్జిపై శ్యాంరాజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు మహ్మద్ అబ్దుల్ నవీద్ను పోలీసులు ఊటీలో పట్టుకున్నారు. ● గచ్చిబౌలిలో మద్యం మత్తులో కారు నడుపుతూ తరుణే అనే వ్యక్తి మరొక వాహనాన్ని ఢీ కొట్టాడు. ఘటనాస్థలి నుంచి పరారవుతున్న తరుణ్ను నిలువరించేందుకు యత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులును ఢీకొట్టి.. కిలో మీటరు దూరం వరకూ కారు బానెట్పై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ● 2022లో జూబ్లీహిల్స్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహ్మద్ రహీల్ ఆమీర్ తన ఇద్దరు స్నేహితులు సయ్యద్ అఫ్నాన్ అహ్మద్, మోహిత్ ఖాన్లు ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారు.. బెలూన్ విక్రయించే మహిళ కాజల్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాజల్కు తీవ్ర గాయాలు కాగా.. ఆమె రెండున్నర నెలల బాబు మరణించాడు. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన నేరాలు. ఈ ప్రమాదాలలో కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ కేసులను ప్రత్యేక కార్యాచరణతో దర్యాప్తు చేస్తున్నాం. – వి.శ్రీనివాసులు, డీసీపీ, మల్కాజిగిరి ట్రాఫిక్– 2 -
డ్రంకెన్ డ్రైవ్తో ప్రమాదం
ధారూరు: మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవేందర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు.. శనివారం రాత్రి రుద్రారం గ్రామానికి చెందిన బంటు వెంకటయ్య, అతని బావ పాండుతో కలిసి వికారాబాద్కు వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. ధారూరు సమీప ట్రాక్టర్ గ్యారేజీ సమీపంలో వీరి బైక్ను కారు ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న పెద్దెముల్ గ్రామానికి చెందిన ద్యావరి జయవర్దన్రెడ్డి మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలోకి ఈడ్చుకెళ్లాడు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. క్షతగాత్రుడి తండ్రి బంటు కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్పై కేసు -
మూగజీవాలు తరలిస్తున్న ముఠా అరెస్ట్
బొంరాస్పేట: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై కొంత కాలంగా మూగజీవాల తరలింపు, అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, కర్ణాటక రాష్ట్రం సేడం తదితర ప్రాంతాల నుంచి మేకలు, గొర్రెలను అపహరించి ఆయా పట్టణాలకు తరలించే అక్రమాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున బొంరాస్పేట చెరువు వద్ద ఎర్టిగా కారు నిలిపి ఉండడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అనుమాతంతో ఆరా తీశారు. వాహనంలో ఉన్న సంజయ్కుమార్, జగత్పాల్, రోషన్, టైగర్ను అరెస్టు చేసి విచారించగా వారు నేరం అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కో ఆప్షన్ ఎన్నిక ఎప్పుడో!
చేవెళ్ల: మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించినప్పటికీ సభ్యుల ఎన్నిక మాత్రం జరగడం లేదు. మైనార్టీ కోటా విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం లేక వాయిదా పడుతూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు అన్ని మున్సిపాలిటీలకంటే ముందుగానే చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ మార్చి 10న నోటిఫికేషన్ జారీ చేసి నామిషన్లు సైతం స్వీకరించారు. మొత్తం నలుగురు సభ్యుల్లో ప్రత్యేక అనుభవం కలిగిన ఇద్దరు, అల్పసంఖ్యాక వర్గం (మైనార్టీ) నుంచి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తం పది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రత్యేక అనుభవం ఉన్న కోటా నుంచి ఒకటి జనరల్, ఒకటి మహిళకు కేటాయించాలని స్పష్టత ఉన్నా, మైనార్టీ కోటాలో ఉన్న రెండు స్థానాలకు సంబంధించి నామినేషన్లు ఎక్కువగా రావడంతో పోటీ ఏర్పడింది. మైనార్టీ నేతల పట్టు పార్టీ తరఫున ఎవరిని బలపరిచాలని, ఎవరికి మద్దతు తెలపాలనే దానిపై కౌన్సిలర్లకు పార్టీ పెద్దలు నిర్ణయం చెప్పకపోవడంతో వాయిదా వేశారు. మార్చి 30న తేదీని ఖరారు చేసినప్పటికీ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. తదుపరి తేదీని ప్రకటిస్తామని చెప్పి నెలరోజులు దాటినా ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు. తాము పార్టీకోసం పనిచేశామని తమకే కేటాయించాలని మైనార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. దీంతో ఒకరికి ఇస్తే మరొకరు పార్టీకి వ్యతిరేకంగా మారతారనే ఆలోచనతో నచ్చజెప్పేందుకు పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఎవరూ సమయం కేటాయించకపోవడంతో ఆలస్యం అవుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ నామినేషన్ల స్వీకరణ పూర్తి నెలరోజులు దాటినా జరగని ఎన్నిక ప్రక్రియ మైనార్టీ కోటాలో కుదరని ఏకాభిప్రాయం పార్టీ పెద్దల నిర్ణయం కోసం ఎదురుచూపులుకోఆప్షన్ సభ్యుల ఎన్నికను త్వరలోనే పూర్తి చేస్తాం. ఇప్పటికే నామినేషన్లు పూర్తయ్యాయి. మైనార్టీ కోటకు సంబంధించి పలువురు పోటీ పడుతుండటంతో ఆలస్యమైంది. వారితో చర్చించి, ఎమ్మెల్యేతో మాట్లాడి ఎంపికను పూర్తి చేస్తాం. అంతా కలిసి మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతాం. – దేవర సమతావెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, చేవెళ్ల -
నేడు మరో భూ సర్వే
దుద్యాల్: గ్రామ శివారు 363 సర్వే నంబర్లో 85 మంది రైతులకు సంబంధించి 144 ఎకరాల అసైన్డ్ భూములకు అధికారులు సోమవారం ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కిషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దుద్యాల్ శివారులోని నెమళ్ల కుచ్చ అనే ప్రాంతంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 2025 డిసెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఆ భూములకు సంబంధించిన రైతుల అభిప్రాయా లు సేకరించారు. వారు భూములిచ్చేందుకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. భూము లు కోల్పోతున్న రైతులు కాస్తులో ఉన్న భూముల దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలని సూచించారు. భూములు ఇవ్వడానికి వెనకాడని రైతులు తాండూరు ఆర్డీఓ అనిత, తహసీల్దార్ కిషన్ భూములు కోల్పోతున్న 85 మంది రైతులతో ఏప్రిల్ 10న అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన రైతులు భూము లు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. కాస్తులో ఎక్కువ ఉండి రికార్డుల్లో తక్కువ ఉందని, రికా ర్డులో ఎక్కువ ఉండి కాస్తులో తక్కువ ఉన్న రైతులు చాలా మంది ఉన్నారని చెప్పారు. పరిహారం అందజేతకు ముందే వాటిని సరి చేయాలన్నారు. అందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో అంగీకారం తెలిపిన రైతులు 144 ఎకరాల అసైన్డ్ భూముల అనుభవదారుల గుర్తింపునకు ఎంజాయ్మెంట్ సర్వే -
‘సైబరాబాద్’లో గందరగోళం
● 65 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలకు బ్రేక్● రాత్రి బదిలీల ఉత్తర్వులు.. ఉదయం నిలిపివేత ● రాజకీయ ఒత్తిళ్లే కారణమంటున్న పోలీసు వర్గాలు ● పైరవీకారులకే కీలక పోస్టింగ్లంటూ విమర్శలు సాక్షి, సిటీబ్యూరో: పోలీసు అధికారుల బదిలీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం, ఒత్తిళ్లు మరోసారి బయటపడ్డాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఒకేసారి 65 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ఈ ఉత్తర్వులు హోల్డ్లో పెడుతున్నట్లు స్వయంగా కమిషనర్ ఆదివారం ఉదయం మౌఖికంగా చెప్పడంతో బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు గందరగోళంలో పడ్డారు. ఉత్తర్వులు ఇచ్చిన పోలీసు బాసే ఆ పోస్టింగ్ల్లో ఎవరూ బాధ్యతలు తీసుకోవద్దని చెప్పడంతో ఈ బదిలీలపై రాజకీయ నాయకుల ప్రమేయం, ఒత్తిళ్లు ఉన్నాయని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. సైబరాబాద్లోని 54 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ.. మరో పదకొండు మందిని మల్టీజోన్–2కు సరెండర్ చేస్తూ మొత్తం 65 మందిని బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. ఆదివారం ఉదయం పొలిటికల్ దెబ్బకు ఈ బదిలీలన్నీ నిలిచిపోయాయి. ఎంత ఖర్చు పెట్టయినా.. మరోవైపు ఈ బదిలీలు సక్రమంగా జరగలేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జోన్ స్థాయి అధికారులకు సన్నిహితంగా ఉండి.. వారు చెప్పినట్లు పనిచేసిన వారికి, నచ్చిన వారికి కీలక పోస్టింగ్లు దక్కాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సైబరాబాద్లో ఖరీదైన జోన్గా పేరున్న ఆ ప్రాంతంలో ఇన్స్పెక్టర్ల పోస్టింగ్లకు తీవ్ర పోటీ ఉండటంతో, ఎంత ఖర్చు పెట్టయినా సరే పోస్టింగ్ దక్కించుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అధికారులైతే ఏకంగా ముఖ్య నేతలతో చెప్పించుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నవారికే కీలక పోస్టింగ్లు దక్కాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా పనిచేసే వారికి కాకుండా పైవీకారులకు పెద్దపీట వేశారని పోలీసు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. -
శతం.. గురుకులం సొంతం
కొడంగల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో సర్కారు పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపారు. చాలా బడుల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చిన్నారులు శతశాతంతో ప్రభంజనం సృష్టించారు. బీసీ గురుకుల ప్రిన్స్పాల్ కె.నగేష్, సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ బి.రామదాసు, ఉపాధ్యాయ సిబ్బంది సమష్టి కృషి, విద్యార్థుల పట్టుదల ఇందుకునిదర్శనమని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెన్నుతట్టి.. ప్రోత్సహించి బోధన సిబ్బంది.. ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తూ, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తూ ప్రోత్సహించారు. వెనకబడిన వారిని వెన్నుతట్టారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి, సందేహాలను నివృత్తి చేస్తూ మెరికలుగా తీర్చిదిద్దారు. బీసీ గురుకులంలో 68 మందికి 68 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 65 మందికి 65 మంది ఉత్తమ మార్కులతో వంద శాతం పాసయ్యారు. పాఠశాలలో 500లకు పైగా మార్కులను 16 మంది విద్యార్థులు సాధించారు. సోలోమన్ 540, పి.సన్ని 537, భవాని ప్రసాద్, వరుణ్ సందేష్లు 533 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ బి.రామదాసు తెలిపారు. పది ఫలితాల్లో ప్రభంజనం తోడ్పడిన ప్రత్యేక తరగతులు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయి. ఉపాధ్యాయులు వె న్నంటి ఉంటూ.. ప్రోత్సహించారు. సందేహాలను నివృత్తి చేస్తూ భయాందోళన చెందకుండా చేశారు. ఆందోళన చెందకుండా 540 మార్కులు సాధించాను. – సోలోమన్, సాంఘిక సంక్షేమ గురుకులం, కొడంగల్సమష్టి కృషితో సాధ్యం ఉపాధ్యాయుల సమష్టి కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రత్యేక తరగతు లు నిర్వహిస్తూ.. వెనకబడిన వారికి సబ్జెక్టుపై అవగాహన కల్పించాం. వారితో మమేకమై ఆందోళన చెందకుండా చేశాం. పట్టుదలతో చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. – బి.రామదాసు, సాంఘిక సంక్షేమ గురుకుల, ప్రిన్సిపాల్, కొడంగల్ -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు
ప్రమాదంలో రైతు దుర్మరణం చేవెళ్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిగూడ బస్స్టేజీ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండాల అనుబంధ గ్రామమైన లక్ష్మీగూడ గ్రామానికి చెందిన కొలన్ దివాకర్రెడ్డి(26) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు భార్య పూజ, ఓ కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం తన కారులో స్వగ్రామం నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దివాకర్రెడ్డి కారులో ఇరుక్కు పోయి త్రీవంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయలు కావడంతో ప్రమాదాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలియడంతో గుండాల, లక్ష్మీగూడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబానికి ఆధారంగా ఉండాల్సిన వ్యక్తి మృతితో భార్య, కొడుకు ఆగమవుతారని గ్రామస్తులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పట్టాల పక్కన నిద్రించి.. చేయిపోగొట్టుకొని ఆస్పత్రి పాలైన కార్మికుడు తాండూరు రూరల్: తాగిన మైకంలో రైల్వే ట్రాక్పక్కన నిద్రించిన కార్మికుడు.. తన చేయిని పట్టాలపై పెట్టాడు. ఈ సమయంలో చేయిపై నుంచి రైలు వెళ్లడంతో చేయి తెగి పడింది. ఈ సంఘటన మండల పరిధి మిట్ట బాసుపల్లి గుంతబాసుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం కోటబాసుపల్లి అనుబంధ కాలని వడ్డెర కాలనీకి చెందిన పరమేష్, జగదీష్లు నాపరాతి గనుల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురు చంద్రవంచ దర్గా వద్ద కల్లు తాగడానికి వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తూ.. మిట్టబాసుపల్లి– గుంత బాసుపల్లి గ్రామాల సరిహద్దు సిమెంట్ కర్మాగారంలోకి వెళ్లేందుకు ఉన్న రైలు మార్గం పక్కన చెట్టుకింద నిద్రించారు. నిద్రలో పరమేష్ తన కుడి చెయ్యి రైలు పట్టాల మీద పెట్టాడు. గూడ్స్ రైలు అతని చేయిపై నుంచి వెళ్లడంతో చేయి తెగి పడింది. వెంటనే అతన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం బాధితున్ని నగరంలోని గాంధీకి తీసుకెళ్లారు. కూలీ పనులు చేసుకొని జీవించే పరమేష్.. చేయి కోల్పోయి జీవనోపాధి కోల్పోయాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. దుద్యాల్: ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధం అయింది. ఈ సంఘటన మండల పరిధి పోలేపల్ల అనుబంధ గ్రామమైన పల్లెగడ్డలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తడకలి కృష్ణయ్య ఎప్పటిలాగే తన పొలం వద్ద ఉన్న షెడ్డులో రెండు ఆవులు, రెండు దూడలను కట్టేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 7 గంటలకు పాకలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన సమీప రైతులు.. వెంటనే పాకలోని ఆవులు, దూడలను కాపాడగా.. వాటికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయి. అనంతరం 25 కిలో మీటర్ల దూరంలోని కొడంగల్ ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. సిబ్బంది వచ్చేలోగా కొట్టం కాలి బూడిదయింది. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కృష్ణయ్య కోరారు. కాగా.. పాక ప్రమాదశాత్తు తగల బడిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. -
రేపటి నుంచి డివిజన్స్థాయి ప్రజావాణి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: డివిజినల్ స్థాయిలో ఈ నెల 4 నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సంబంధిత ఆర్డీఓలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవో నంబర్ 3 ప్రకారం ఆర్డీఓల ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల పైబడిన వారి వివరాలు సేకరించాలన్నారు. నిబంధనల ప్రకారం మ్యాపింగ్తో డూప్లికేట్ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిశీలించి వివరాలను ధ్రువీకరించి తొలగింపు లేదా సవరణ చేపట్టాలని తెలిపారు. ఆమనగల్లు: పట్టణంలోని కోర్టులో జూనియర్ సివిల్జడ్జిగా శనివారం నారం అరుణ్కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కోర్టు జడ్జిగా ఉన్న కాటం స్వరూప బదిలీ కాగా హైదరాబాద్లోని సిటీ సివిల్కోర్టులో అసిస్టెంట్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న అరుణ్కుమార్ ఇక్కడికి వచ్చారు. పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయనకు ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, తలకొండపల్లి ఎస్హెచ్ఓ జానకిరాంరెడ్డి, కడ్తాల ఎస్హెచ్ఓ సైదిరెడ్డి, మాడ్గుల ఎస్హెచ్ఓ వేణుగోపాల్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులతో జడ్జి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పీపీ కార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో మే, జూన్ నెలల గోధుమల కోటా పంపిణీ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఎం.రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో మొత్తం 8,40,345 కుటుంబాలకు 8,81,497 కుటుంబాలు 104.90 శాతం మూడు నెలల బియ్యం కోటాను డ్రా చేసినట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లాకు కేటాయించిన 71,382.977 మెట్రిక్ టన్నుల బియ్యంలో 62,373.682 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గోధుమల కోటా విషయంలో ఒక నెల కోటా మాత్రమే ఇప్పటివరకు పంపిణీ చేశారని, మిగతా రెండు నెలల కోటా పదిహేను రోజుల వరకు కొనసాగుతుందన్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు సహా అందరూ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రాజిరెడ్డి సూచించారు. సాక్షి, సిటీబ్యూరో: ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్ నుంచి జవహర్లాల్ పోర్టుకు (జేఎన్పీటీ) ప్రాణ రక్షణ ఔషధాలను రవాణా చేసే శీతలీకరించిన కాన్కోర్ కంటైనర్ రేక్ ‘ఔషధి ఎక్స్ప్రెస్’ను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ శనివారం సనత్నగర్ ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో నుంచి ప్రారంభించారు. ప్రాణరక్షక ఔషధాలు, ఇతర సున్నితమైన వస్తువులను సురక్షితంగా రవాణా చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ను రూపొందించారు. దేశ ఫార్మాస్యూటికల్ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. నగరంలోని కీలక ఫార్మా ప్రాంతాలైన జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల, పటాన్చెరు, ముచ్చర్ల నుంచి జేఎన్పీటీ కారిడార్కు ఔషధి ఎక్స్ప్రెస్ మందులను సరఫరా చేయనుంది. కార్యక్రమంలో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీ సంజయ్ స్వరూప్, ద.మ.రైల్వే ఉన్నతాధికారులు కె.పద్మజ, ఈటీ పాండే, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మహేశ్వరం: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర అర్బన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుతు సత్యనారాయణ, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎల్పీఓ సాంభిరెడ్డి, జీహెచ్ఎంసీ బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, జల్పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకట్రాం, మహేశ్వరం మండల ప్రత్యేకాధికారి సుభాషిణి, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్ తహసీల్దార్లు చిన్న అప్పల నాయుడు, గోపాల్, ఇందిరా దేవి, మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి -
ఔటర్పై పల్టీకొట్టిన కారు
పహాడీషరీఫ్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘటన మరువక ముందే తుక్కుగూడ ఔటర్పై శనివారం ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నర్సింహ అనే వ్యక్తి ఐదుగురితో కలిసి కారులో (టీజీ 08 ఏఏ 4704) ఔటర్పై శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వస్తున్నాడు. ఉదయం 11.55 గంటల సమయంలో తుక్కుగూడ ఎగ్జిట్ నంబర్–14 సమీపంలో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆపడంతో, డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేక డివైడర్ను ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మరొకరు గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందని కారణంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇద్దరికి గాయాలు -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
అదనపు కలెక్టర్ వెంకటాచారి పరిగి: పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి సూచించారు. శనివారం ఆయన పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలపై వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలో భూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ రెవెన్యూ అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. -
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
మీర్పేట: డీజిల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మీర్ పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సారంగపాణి కథనం ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన మాలగరి గీత భర్త చనిపోవడంతో కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం బడంగ్పేట శ్రీమారుతీనగర్ కాలనీకి వచ్చి స్థానికంగా కూరగాయలు విక్రయిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కీర్తి (21) గండిపేటలోని ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగా శనివారం కళాశాలకు వెళ్లి మధ్యా హ్నం ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులు సమీపంలోని జయశంకర్కాలనీలో నివాసముండే బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి 4.30 గంటల సమయంలో డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసు కుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సోదరుడు క్యాబ్ డ్రైవర్ కావడంతో ఇంట్లో డీజిల్ను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్–2020 దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి పని చేస్తాయి. దరఖాస్తుల స్థితి, అనుమతులకు సంబంధించి గైడెన్స్, షార్ట్ఫాల్స్, చెల్లింపులకు సంబంధించి వివరాలు అందిస్తారు. ఎల్ఆర్ఎస్ పోర్టల్ వినియోగంపై సహకారం, అవసరమైన వారికి ప్రత్యక్ష హెల్ప్లైన్ సేవలు ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌరులు 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. -
డివైడర్ నుంచి దూసుకెళ్లి బైక్ను ఢీకొట్టి..
ప్రమాదంలో ఒకరి మృతి చేవెళ్ల: డీసీఎం డ్రైవర్ అతివేగం అజాగ్రత్తతో డివైడర్ నుంచి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్న ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన మల్కని నర్సింలు (45) నగరంలోని విద్యానగర్లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలో భార్య సువర్ణ కుటుంబసభ్యులు ఉంటున్నారు. వారంలో ఒకరోజు, సెలవు ఉన్న సమయంలో గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం మేడే సందర్భంగా సెలవు ఉండడంతో తన బైక్పై ఇంటికి వచ్చిన అతడు శనివారం ఉదయం తిరిగి నగరానికి బయలుదేరాడు. మార్గమధ్యలో చేవెళ్ల మండలం పామెన బస్స్టేజీ వద్దకు రాగానే ఎదురుగా చేవెళ్ల వైపు నుంచి వస్తున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ నుంచి దూసుకెళ్లి రోడ్డు అవతల వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నర్సింలు ఎగిరి దూరంగా పడడంతో కాలు విరిగి తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నా రు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
ఆమనగల్లు: మత్తు పదార్థాలకు అందరూ దూరంగా ఉండాలని ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ కోరారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు మత్తుపదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. విద్యార్థులు కొత్తగా వచ్చే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలని, వారు మంచివారా చెడ్డవారా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలని సూచించారు. ఎక్కడైనా మత్తుపదార్థాలు విక్రయించినా, మత్తు పదార్థాలతో పార్టీలు జరిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అనుమతి లేకుండా మద్యం పార్టీలు చేసినా, డ్రగ్స్ తీసుకున్నా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్ఐలు అరుణ్ కుమార్, స్వప్న, సిబ్బంది చిన్నాగౌడ్, శ్రీను, శివప్రసాద్, లింగం, సాయి శ్రీజ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ -
జాతరలో జంతుబలిపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల బీరప్ప జాతరలో జరిగిన జంతుబలిపై కేసు నమోదైంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివరాత్రి వెంకటేశ్ కథనం ప్రకారం.. ఆదిబట్లలో ఏప్రిల్ 27న బీరప్ప జాతరలో భాగంగా గొర్రె పొట్టేళ్లను దేవాలయం ముందు బలిచ్చారు. ఈ వీడియోలను కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. వీటిని చూసి చలించిన స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జీఓ క్రూయాలిటీ ప్రివెన్షన్ మేనేజర్ అడులపురం గౌతమ్ అనే వ్యక్తి ఏప్రిల్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జాతర నిర్వాహకులైన 15 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. భిక్షాటన చేస్తూ మృతి కందుకూరు: అనారోగ్యంతో ఓ భిక్షగాడు మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పులిమామిడిలోని కోటమైసమ్మ దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా అతను వెంకటయ్యచారి అలియాస్ పెంటయ్యచారి (60), ఆదిలాబాద్ జిల్లాగా గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ, మద్యం తాగుతూ రోడ్డు పక్కనే నివసించేవాడు. తరచూ ఫిట్స్ కూడా వచ్చేవి. శుక్రవారం రాత్రి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలిస్తే 87126 62687, 87126 62409, 87126 62369 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 11 నుంచి వేసవి శిబిరం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సహకారంతో గోషామహల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చిన్నారుల కోసం ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ శిక్షణ ఉంటుంది. ట్రాఫిక్పై అవగాహన, రోడ్డు భద్రతతోపాటు ఆత్మరక్షణ, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, కార్టూనింగ్, చేతిరాత మెరుగుపరచుకోవడం, వ్యక్తిత్వ వికాసం, ప్రాథమిక అత్యవసర వైద్యచికిత్స వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్లు ఈ నెల 3 నుంచి ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాల కోసం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ జి.హరీశ్ 87126 60655, లేదా కార్యాలయ అసిస్టెంట్ 98480 63345 నంబర్లలో సంప్రదించవచ్చు. 5 నుంచి చిత్రలేఖనంపై శిక్షణ నాంపల్లి: వేసవి సెలవుల్లో కిడ్స్ ఆర్ట్ క్యాంపు పేరిట ఆన్లైన్లో చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులు మే 5న ప్రారంభమై జూన్ 5వ తేదీన ముగుస్తాయని, వారానికి రెండురోజులు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. 7 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కోరారు. జేఎన్ఎఫ్ఏయూలో తర్ఫీదు పొందినవారు డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్ అనే అంశాలపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఫోన్: 63043 66780. -
అండర్పాస్ ఏర్పాటు చేయాలి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి వినతి చేవెళ్ల: మండలంలోని ఖానాపూర్ గేట్ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్–బీజాపూర్ రాహదారి విస్తరణలో సర్వీస్ రోడ్లు, అండర్పాస్లు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని ఖానాపూర్, నాంచేరి, రేగడిఘనాపూర్, దేవరంపల్లి, కిష్టాపూర్, ఇంద్రారెడ్డినగర్ గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఎన్హెచ్ఏఐ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా నాంచేరి సర్పంచ్ అశోక్, బీజేపీ నాయకుడు జయశంకర్గౌడ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు అంతా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డు అభివృద్ధిని చూసి ఆనందించాలో లేక ఏర్పడుతున్న ఇబ్బందులతో బాధపడాలో తెలియటం లేదని వాపోయారు. అండర్పాస్ లేకుండా రోడ్డును ఎత్తుగా వేస్తుండటంతో ఈ గేట్ వద్ద దాదాపు ఐదారు గ్రామాల ప్రజలు, రైతులతోపాటు అటు షాబాద్ మండలానికి, ఇటు వికారాబాద్జిల్లాలోని పలు గ్రామాలకు ఉన్న లింక్రోడ్డులు తెగిపోతున్నాయన్నారు. ఖానాపూర్, నాంచేరి, కిష్టాపూర్, రేగడిఘనాపూర్, దేవరంపల్లి గ్రామాలకు వెళ్లే మార్గం లేదన్నారు. ఇక్కడ అండర్పాస్ అవసరం ఉందన్నారు. దీంతో పాటు ఈరోడ్డుకు రెండు వైపులా సర్వీస్ రోడ్డు ఉంటేనే హైవే రోడ్డు పక్కల ఉన్న రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడి ఇక్కడి ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా రోడ్డు ఉండేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, చేవెళ్ల బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి, నాయకులు మాణిక్యరెడ్డి, శర్వలింగం, ఉమాశంకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతోనే అభివృద్ధి
చేవెళ్ల: పరస్పర సహకారంతో అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీలు ఉండాలని, తరువాత అభివృద్ధికోసం అందరూ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలకోసం ఎవరు మంచి పనిచేసినా అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. అనంతరం మహిళా సంఘాలకు వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మహిళాసంఘాల సభ్యులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించలేదని సర్పంచుల అసహనం సమావేశంలో ప్రొటోకాల్ పాటించలేదని పలువురు సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. సభావేదికపైకి మున్సిపల్ కౌన్సిలర్లను పిలిచి సర్పంచులను మాత్రం ఆహ్వానించలేదన్నారు. తాము కూడా ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చామని, తమను ఒక విధంగా కౌన్సిలర్లను ఒక విధంగా చూడడం సరికాదన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య -
పథకాలు అమలైతేనే ప్రజాపాలనకు అర్థం
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులైన ప్రజలకు నూరు శాతం సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత అధికారులపై ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం బొంగ్లూర్లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తేనే ప్రజాపాలనకు అర్థం ఉందన్నారు. అఽధికారులు కొందరు బాగా పని చేస్తున్నారని, మరి కొందరు చేయడం లేదన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తే బాగుంటుందన్నారు. గ్రామాలకు వెళ్లాలని, కార్యాలయాల్లో ఉంటే సరిపోదన్నారు. కబ్జా చేసిన భూములు లాగి పేదలకు పంచుతా.. పేదవాడు 60 గజాల జాగలో ఇళ్లు కట్టుకుంటే కూల్చివేస్తారు. కానీ నేడు పదుల ఎకరాల్లో భూములు కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మల్రెడ్డి అన్నారు. అలాంటి వారు ఎక్కడున్నా చెప్పండి వారి నుంచి గుంజుకొని పేదలకు పంచుతానన్నారు. కబ్జాదారులు సీఎం పేరు చెప్పినా, మంత్రుల పేరు చెప్పినా, తన పేరు చెప్పినా సహించేది లేదన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడైన పేదలకు దక్కేలా చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, హౌసింగ్ పీడీ చంప్లానాయక్, తహసీల్దార్ సునీత, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్రెడ్డి, గురునాథ్రెడ్డి, జీహెచ్ఎంసీ ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారయణరెడ్డి, ఇబ్రహీంపట్నం కమిషనర్ సుదర్శన్, డీఎస్ఓ వనజాత, నాయకులు ఈసీ శేఖర్గౌడ్, పాండురంగారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
పిల్లల ఎదుగుదలపై దృష్టి సారించాలి
షాద్నగర్: పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరికొత్త సవాళ్ల నుంచి రక్షించాలని సూచించారు. సెల్ఫోన్లకు అతుక్కపోకుండా నియంత్రిస్తూ వారి భవిష్యత్తును దృష్టికొని పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సైబర్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 14 ఏళ్లు దాటిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా హెచ్పీవీ టీకా తప్పనిసరి వేయించాలని చెప్పారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు తమ కాళ్ల తాము నిలబడేందుకు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను నిర్మిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు తాము తయారు చేసిన వస్తువులకు సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆర్డీఓ సరిత, మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్, ఏసీపీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత, ఏంఈఓ మనోహర్, ఎంపీడీఓ బన్సీలాల్, తహిసీల్దార్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్మయి -
రెడ్డి భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళం
బడంగ్పేట్: బాలాపూర్కు చెందిన పీపీరెడ్డి గ్రూప్ ఆఫ్ చైర్మన్, యాదాద్రి రెడ్డి సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాల్రెడ్డి రెడ్డి భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించి అందజేశారు. తిరుపతిలో నిర్మించే ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ నిర్మాణానికి భారీ విరాళం అందజేయడంపై రెడ్డి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపీరెడ్డిని శనివారం అభినందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మురళీకృష్ణారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, వినయ్కుమార్రెడ్డి, నరోత్తంరెడ్డి, కొలన్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
నియోజకవర్గ సభలను జయప్రదం చేయాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నియోజకవర్గ స్థాయిలో శనివారం నిర్వహించే సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సంబంధిత అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గం స్థాయి సభలు సమర్థవంతంగా నిర్వహించాలన్న ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పాఠశాల/మండల కార్యలయం/బహిరంగ ప్రదేశం/ఏదైనా ఇతర అనువైన వేదికను ఏర్పాటు చేసి ఉదయం 10 గంటలకు మండల స్థాయి సభలను ప్రారంభించాలని తెలిపారు. సభల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. సభలను రాష్ట్ర గీతంతో ప్రారంభించాలని, ముఖ్యమంత్రి సందేశం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చదివి వినిపించాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై చర్చించాలని, సభల్లో ఆర్డీఓలు, తహసీల్దార్, ఎంపీడీఓ, వార్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఉండేలా చూడాలన్నారు. మహిళలు, వృద్ధులు కూర్చునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రదర్శన కోసం స్క్రీన్, ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని, పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాగునీరు, నీడ కోసం ఏర్పాట్లు చేయాలని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం స్థాయి సభ బ్యానర్ ప్రదర్శించాలని వివరించారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) చంద్రారెడ్డి, (స్థానిక సంస్థలు) కిరణ్మయి, ఆర్డీఓలు, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సీపీఓ సౌమ్య, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ‘నీట్’ను పకడ్బందీగా నిర్వహించాలి ఈ నెల 3న నీట్ పరీక్ష నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులను ఉదయం 11 నుంచి కేంద్రాలకు అనుమతిస్తారని, మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా తీసుకోవడం జరుగుతుందని, ఏదైనా సమస్య తలెత్తి ధ్రువీకరణ పూర్తి కాకపోయినా, అభ్యర్థిని పరీక్ష గదిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారన్నారు. అయితే లిఖిత పూర్వక హామీ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. హామీ పత్రం నమూనా పరీక్ష కేంద్రంలో అందిస్తారన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి డిజిటల్ పరికరాలు అనుమతించరని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల రవాణాపై పోలీస్, రెవెన్యూ, తపాలా శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్ పత్రాల తరలింపు పకడ్బందీగా చేపట్టాలన్నారు. పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, వైద్య–ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి ఓఆర్ఎస్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి -
అభివృద్ధిని చూసి చేరికలు
షాబాద్: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొమరబండ సర్పంచ్ కుక్కల పద్మమ్మ గోపాల్, గ్రామస్తులు బసిలింగం, చిన్న శేఖర్, హరీష్, రాము, హరీష్, తదితరులు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు వస్తాయన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, నాయకులు ధర్మభిక్షం, గంధం అంజయ్య, మంగలి రాములు, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం
అబ్దుల్లాపూర్మెట్ : విద్యుత్ తీగలు అల్లుకోవడంతో వచ్చిన నిప్పుతో గడ్డివాము దగ్ధమైంది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాటసింగారం గ్రామంలోని సింగరేణికాలనీలో శుక్రవారం మధ్యాహ్నం రెండు విద్యుత్ తీగలు తగలడంతో నిప్పు రవ్వలు చెలరేగి సమీపంలో ఉన్న దర్నమోని లోకనాథంకు చెందిన ఎండు గడ్డి వాముపై పడ్డాయి. దీంతో గడ్డివాము కాలిబూడిదైంది. వెంటనే అప్రమత్తమైన బాధితుడు సమీపంలోనే ఉన్న పశువులకు ఎలాంటి హాని జరగకముందే దూరంగా తీసుకెళ్లాడు. ఉద్యోగాల పేరుతో మోసం మేడిపల్లి: ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్కు చెందిన వినయ్ రెడ్డి, బంధువు రిషితారెడ్డిలకు బోడుప్పల్కు చెందిన యశ్వంత్ రెడ్డి 2025 ఆగస్టులో లింక్డ్ఇన్ ద్వారా పరిచయమయ్యాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికిన యశ్వంత్రెడ్డి వారి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. అనంతరం కొన్నిరోజులు శిక్షణ పేరుతో నమ్మకం కలిగించాడు. నెల జీతం కూడా చెల్లించాడు. ఆ తరువాత మొహం చాటేశాడు. ఫోన్ చేస్తే స్పందించడం మానేశాడు. చివరకు వారి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసి పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం మేడిపల్లి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తైపె అఘాయిత్యం కేసులో తండ్రికి 20 ఏళ్ల శిక్ష
జీడిమెట్ల: కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి మేడ్చల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.35 వేల జరిమానా విధించింది. వివరాలు... బీహార్కు చెందిన అస్గర్ అలీ(36) భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి 2019లో నగరానికి వలస వచ్చి సుభాష్నగర్లోని గంపలబస్తీలో ఉంటున్నాడు. అస్గర్ దినసరి కూలీ కాగా, అతడి భార్య ఇళ్లల్లో పనిమనిషి. గతేడాది మే నెలలో అస్గర్ అలీ పెద్దకుమార్తె(15)పై లైంగికదాడికి పాల్పడగా చిన్న కుమార్తె గమనించి తల్లికి చెప్పింది. 2025 మే 6న బాధితురాలి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అదే నెల 8న కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం చార్జ్షీట్ దాఖలు చేయగా, మేడ్చల్ పాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె.వెంకటేష్ విచారణ జరిపి నిందితుడిని దోషిగా తేల్చారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం మంజూరు చేశారు. పోలీస్ కస్టడీకి నిందితుడు బంజారాహిల్స్: సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను ప్రేమపేరుతో మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడి జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. వివరాలు.. జూబ్లీహిల్స్కు చెందిన ఓ యువతిని ప్రేమపేరుతో లోబర్చుకుని రూ.13 లక్షల దాకా వసూలు చేశాడు. మణికొండకు చెందిన మరో యువతి వద్ద కూడా బంగారం తీసుకుని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో ఆయన సోదరుడు రాజీవ్ను కూడా మూడు రోజుల క్రితం రిమాండ్కు తరలించారు. అన్నదమ్ములిద్దరూ మరో 10 మంది స్నేహితులతో కలిసి ఇన్స్ట్రాగామ్లో అమ్మాయిలను ఆకర్షించి లక్షల రూపాయల మేర వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఎంతమంది యువతులను మోసం చేశారనే విషయం విచారణలో తేలనుంది. నిందితుడితోపాటు పబ్లు, హోటళ్లకు వెళ్తూ అమ్మాయిలకు వల వేస్తున్న మరికొంతమంది యువకులపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కారు ఢీకొని యువకుడి దుర్మరణం మర్రిగూడ(చింతపల్లి): అత్తగారింటి వద్ద తన కుమార్తె పురుడుకు వచ్చి వెళ్తుండగా కారు ఢీకొని యువకుడు మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గేట్ వద్ద జరిగింది. స్థానిక ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట్ గ్రామానికి చెందిన ఆవుల రవితేజ (22)కు ఇటీవల కుమార్తె జన్మించింది. గురువారం రవితేజ అత్తగారి ఊరైన నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం రోళ్లకల్లులో తన కుమార్తె పురుడు చేశారు. కార్యక్రమానికి మధు, అతడి స్నేహితుడు చేవెళ్ల సుజిత్కుమార్ కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చారు. పురుడు అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా.. మార్గమధ్యలో చింతపల్లి మండలం మదనాపురం గేటు వద్దకు రాగానే కారు రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవితేజ, సుజిత్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిద్దరినీ మాల్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రవితేజ శుక్రవారం మృతిచెందాడు. సుజిత్కుమార్ చికిత్స పొందుతున్నాడు. రవితేజ తండ్రి ఆవుల నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్తంభానికి కట్టి.. దారుణంగా కొట్టి.. కుత్బుల్లాపూర్: నిర్మాణ సంస్థకు చెందిన సైట్ ఇంజనీర్, మరో నలుగురు కూలీలు కలిసి ఓ వ్యక్తిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. పేట్బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సునీల్రామ్(35) కుటుంబంతో కలిసి కుత్బుల్లాపూర్ పరిధిలోని గోదావరి హోమ్స్కు వలస వచ్చి స్థానికంగా పాల్మీరా మిడోవ్స్ ప్రైడ్ ఇన్ఫ్రాలో కూలీగా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో సునీల్రామ్ వ్యక్తిగత విషయాలపై తన భార్యతో గొడవ పడసాగాడు. సమాచారం అందుకున్న సైట్ ఇంజనీర్ ప్రసాద్, మరో నలుగురు కూలీలు అక్కడికి చేరుకుని సునీల్రామ్ను బలవంతంగా అక్కడ నుంచి బయటకు తీసుకువెళ్లారు. అనంతరం అతనిపై దాడి చేసి స్తంభానికి కట్టేసి వెళ్లిపోయారు. శుక్రవారం సునీల్ రామ్ భార్య అక్కడికి వెళ్లి చూడగా అతడు మృతి చెంది ఉన్నాడు. సైట్ ఇంజనీర్, నలుగురు కూలీల వల్లే తన భర్త మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ్కుమార్కు దళితరత్న అవార్డు
చేవెళ్ల: మున్సిపల్ నూతన కమిషనర్గా బి.యాదగిరి బదిలీపై వచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉన్న వెంకటేశం బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి బి.యాదగిరి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. షాబాద్: పంట మార్పిడితో అధిక లాభాలు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భద్రు, కిరణ్బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని తాళ్లపల్లి రైతు వేదికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం ఒకే పంట సాగు చేయకుండా మార్పిడి చేయాలని అన్నారు. పత్తిలో హెడీపీఎస్ పద్ధతిన సాగు చేస్తే దిగుబడి వస్తుందన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేయాలన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులను అనుసరించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని చెప్పారు. రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి దండెం విజయచంద్ర, సర్పంచులు తాళ్ల స్వాతి మాణిక్యంగౌడ్, కుమార్, నర్సింలు, ఉపసర్పంచ్ ఆంజనేయులు, ఏఈఓ గీత తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
బహదుర్పురా: తాడ్బన్ వద్ద మూడు షాపుల్లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయణికులు సమాచారం ఇవ్వడంతో బహదుర్పురా పోలీసులు వెంటనే 8 ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసుల కథనం ప్రకారం... అబ్దుల్ సలీం, అబ్దుల్ హై, అలీలు తాడ్బన్లో కొంతకాలంగా ఉడ్ వర్క్, ఫైబర్ షీట్ షీల్డ్, ఏషియన్ పెయింట్ పాపులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో షాపులను యధావిధిగా మూసివేశారు. అయితే 11.30 గంటల ప్రాంతంలో పాపుల నుంచి పెద్ద ఎత్తున మంటలు రావటాన్ని స్థానికులు, ప్రయణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐదు గంటలు శ్రమించి ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు, బహదుర్పురా ఎమ్మెల్యే మహ్మద్ మోబిన్, స్థానిక కార్పొరేటర్లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై ఆరా తీశారు. ఒక షాపు నుంచి మరో రెండు షాపులకు మంటలు విస్తరించడంతో ప్లైవుడ్స్, పెయింట్, ఇతర ఫైబర్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. శుక్రవారం సాయంత్రం మళ్లీ పొగలు వ్యాపించడంతో చందులాల్ బారాదరి ఫైర్ అధికారులు మొగల్పురా నుంచి ఫైరింజన్ తెప్పించి అదుపుచేశారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న ఏషియన్ పెయింట్ యాజమని అలీ షాక్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో రూ.10 లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు షాపుల యాజమానులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నారు. షాపు యజమానులపై కేసు.. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని గతంలో పోలీసులు షాపుల యాజమనులకు సూచించినా పెడ చెవిన పెట్టారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు యజమానులు అబ్దుల్ సలీం, అలీ, అబ్దుల్ హైపై కేసు నమోదు చేశారు. 5 గంటలు శ్రమించి మంటలను ఆర్పివేసిన పోలీసులు, ఫైర్ సిబ్బంది తాడ్బన్లో ఘటన.. రూ.లక్షల్లో ఆస్తినష్టం -
కల్లు తాగొద్దన్నందుకు..
ఉరివేసుకొని బలవన్మరణం శంకర్పల్లి: కల్లుకు బానిసైనా ఓ వ్యక్తి.. దాన్ని తాగొద్దన్నందుకు మనస్తాపంతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన శ్రీశైలం (46) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏళ్ల నుంచి కల్లు తాగే అలవాటు ఉండగా ఆరోగ్యం పాడవుతుందని మానేయాలని కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో మూడు రోజుల నుంచి కల్లు మానేసిన ఆయన అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేశంపేట: ఆర్ఎంపీ వైద్యుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన భూయాకర్ రవీందర్ గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. కుటుంబంతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నారు. గతనెల 24న ఇంట్లో పెద్ద కుమారుడితో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రవీందర్ మరుసటి రోజున ఇంట్లో నుంచి క్లినిక్కు వెళ్లి అక్కడి నుంచి ఆమనగల్లు వైపు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. బంధువులు, తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం భార్య శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. కేశంపేట: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని వేములనర్వ గ్రామానికి చెందిన కుమ్మరి అంతమ్మ (70) కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఏప్రిల్ 30న పింఛన్ డబ్బులు తీసుకుంది. వాటితో శుక్రవారం మద్యం తాగి పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి కుమారుడు సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యుఏ) భద్రతా వ్యవస్థల క్రమబద్ధమైన నిర్వహణ, పారదర్శక పాలన,ఉమ్మడి స్థలాలపై దృష్టి పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. నారెడ్కో తెలంగాణ, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(ఎఫ్టీసీసీఐ), యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యు–ఫెర్వాస్) సంయుక్తంగా ఫెడరేషన్ హౌస్లో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ.. స్వీయ జనగణనకు మద్దతు ఇవ్వాలని నివాసిత సంఘాలను కోరారు. హైదరాబాద్లో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, గేటెడ్ లేఅవుట్లు, వాణిజ్య సముదాయాలు గణనీయంగా పెరిగాయని, ఎప్పటికప్పుడు చట్టబద్ధమైన పునరుద్ధరణలు, భద్రతా నిబంధనలను పాటించాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ విక్రంమాన్ సింగ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. -
ఔటర్పై ఆగితే అంతే ..
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్ను నిర్ణయించారు. కానీ.. చాలా మంది వాహనదారులు లేన్ డ్రైవింగ్ నిబంధన పాటించకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఔటర్పై అతి వేగంగా వస్తున్న వాహనాలు ముందు ఆగి ఉన్న వాహనాలను అంచనా వేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అతివేగం, నిర్లక్ష్యం కూడా ఔటర్పై రోడ్డు ప్రమాదాలలో కారణమేనని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తున్న కారు పెద్దగోల్కొండ ఔటర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొని.. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అక్కడికక్కడే అసువులు బాశారు. లేన్ డ్రైవింగ్ పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఔటర్పై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. ప్రమాదాలకు ఇవీ కారణాలే.. ● 158 కిలోమీటర్ల ఔటర్పై రోజూ 15 లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్ డ్రైవింగ్ (వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ● ఓఆర్ఆర్పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు. ● కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి. ఇలా వెళ్తే సేఫ్ జర్నీ ● ఔటర్ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1,2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్టంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. ● లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే అకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమ య్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం. అతివేగంతో అదుపు చేయలేక.. ఔటర్పై వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి. సాధారణంగా ఔటర్ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపు సర్వీ స్ లేన్పైనే ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్ లైట్లు ఆన్లోనే ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు. అలాగే ఓఆర్ఆర్ ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో రాంగ్ రూట్లో ప్రయాణించకూడదు. ఓఆర్ఆర్పై నిలిపి ఉంచుతున్న వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం ముందు వాహనానాన్ని అంచనా వేయలేకపోతున్న డ్రైవర్లు లేన్ డ్రైవింగ్ చేయకపోవడం, అతివేగం, నిర్లక్ష్యం ప్రాణాలను బలిగొంటున్నా చర్యలు శూన్యం పెద్దగోల్కొండ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం కుటుంబంలో విషాదం నింపిన ఘోర ప్రమాదం -
పెట్టుబడి పేరిట రూ.50 లక్షలకు టోకరా
బోగస్ చెక్కులతో బురిడీ.. ఇద్దరు స్కూల్ డైరెక్టర్ల అరెస్టు బంజారాహిల్స్: అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడి పేరిట డబ్బులు తీసుకుని బోగస్ చెక్కులు ఇచ్చిన ఇద్దరు స్కూల్ డైరెక్టర్లను బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్ కొట్టూర్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్–కమలాపురికాలనీలో బడ్స్ అండ్ ఫ్లవర్స్ పాఠశాల ఉంది. చనుబోయిన గోవింద్, ఆయన భార్య చనుబోయిన శ్రీదేవి డైరెక్టర్లుగా, కలిగెట్ల లక్ష్మీ ప్రసన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నారు. తమ పాఠశాలను బ్రాంచీలుగా విస్తరిస్తున్నామని, పెట్టుబడి పెడితే అధిక లాభాలిస్తామని గోవింద్, శ్రీదేవి చెప్పడంతో ఎస్ఎస్రెడ్డి అనే వ్యాపారి రూ.50 లక్షల పెట్టుబడి పెట్టాడు. లాభాల విషయమై వారు దాటవేస్తుండటంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు గోవింద్, శ్రీదేవిలను కోరాడు. ఈ మేరకు వారు గత నెల మొదటివారంలో ఆయనకు ఆరు చెక్కులు ఇచ్చారు. వాటిని బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్లగా అవి బ్లాక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్కులని తేలింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గోవింద్, శ్రీదేవిలను కలవడానికి పలుమార్లు స్కూల్కు వెళ్లగా బౌన్సర్లతో అడ్డుకుని దాడులు చేయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ని పూర్తి చేయాలి
షాద్నగర్రూరల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కనీసం లక్ష ఎకరాలకు నీళ్లవ్వలేదని, ప్రాజెక్టు 90శాతం పూర్తయిందని ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డి 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన తరువాతే మిగతా ప్రాంతాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ నాయకులు అర్జునప్ప, టీజీ శ్రీనివాస్, నర్సింలు, రాము, సత్యం, రవికుమార్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నకిలీ విత్తన విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో నకిలీ విత్తనాల నిర్మూలన అంశంపై జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తన రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో మూడు, డివిజన్ స్థాయిలో ఆరు, మండల స్థాయిలో 26 టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ, సీడ్ కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ, రవాణాశాఖల సమన్వయంతో ఈ బృందాలు పని చేస్తాయని చెప్పారు. జిల్లాలో 474 రిటైల్ విత్తన దుకాణాలు, తొమ్మిది సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 224 లైసెన్సు కలిగిన విత్తన హోల్డర్లు ఉన్నారని అన్నారు. పత్తి, మిర్చి పంటల్లో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా ఉందని, దీన్ని పూర్తిగా నియంత్రించేందుకు కట్టదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా తయారు చేసిన విత్తనాలు సహా అనధికారికంగా విక్రయించేవి, సరైన లేబులింగ్ లేని ప్యాకెట్లు, గడువు ముగిసిన విత్తనాలు, తక్కువ నాణ్యతతో కూడిన విత్తనాలను నకిలివీగా గుర్తించనున్నట్లు ప్రకటించారు. విత్తనాల నమూనాల సేకరణ, పరీక్షలు సహా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 420, ఈసీయాక్ట్ 1955, సీడ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. రైతులు విధిగా లైసెన్సు ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, అనధికారిక విక్రేతల వద్ద కొనొద్దని సూచించారు. సమావేశంలో హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్టీ) పత్తి విత్తనాలపై కూడా చర్చించారు. ఈ విత్తనాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించని జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలు కావడంతో వాటి సాగు చట్ట విరుద్ధమని, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం శిక్షార్హమని చెప్పారు. గ్లైఫోసేట్ వంటి రసాయనాల వినియోగం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉష పాల్గొన్నారు. -
మట్టి టిప్పర్ల పట్టివేత
కేశంపేట: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోల్కోనిగుట్ట తండా పంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్టు గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్ల డ్రైవర్లు ఉమేష్, విక్రమ్తో పాటు యజమాని రాఘవేందర్పై కానిస్టేబుల్ శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
మేయర్కు ఓటు!
సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకమండళ్లకు జరగబోయే ఎన్నికల్లో మేయర్లను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారా? అంటే.. కాదనలేమనే సమాధానమే అధికారుల నుంచి వస్తోంది. పది లక్షల జనాభా దాటిన నగరాల కార్పొరేషన్ల మేయర్ల ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించడంతోపాటు వారికి కార్యనిర్వాహక అధికారాలు కల్పించాలని సూచిస్తూ నీతి ఆయోగ్ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ సాగుతోంది. ‘మూవింగ్ టువార్డ్స్ ఎఫెక్టివ్ సిటీ గవర్నమెంట్– ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ మిలియన్ ప్లస్ సిటీస్’పేరిట అందజేసిన ఈ నివేదికలో మేయర్కు అధికారాలుండాలని సూచించింది. మేయర్ పదవికి స్థిరమైన కాలపరిమితి నిర్ణయించడంతోపాటు ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని పేర్కొంది. పారిశుధ్యంతోపాటు నీటి సరఫరా, పబ్లిక్ రవాణా వంటి విభాగాలు కార్పొరేషన్ పరిధిలో ఉండాలని కూడా సూచించింది. పెద్ద నగరాల్లో నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండటంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్తోపాటు చాలా కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల ద్వారా మేయర్లను ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. తద్వారా కౌన్సిల్లో బలం కోసం పార్టీల మధ్య పొత్తులు, పదవీకాలం పంచుకోవడం వంటివి నగర ఓటర్లకు అనుభవమే. ఇలాంటి ఇబ్బందులు లేని స్థిరమైన పదవీకాలం, స్వతంత్ర నిర్ణయాలు మేయర్కు ఉంటే జవాబుదారీతనంతోపాటు నగర పాలనలో స్థిరత్వం, వేగం కూడా ఉంటాయనేది నీతి ఆయోగ్ అభిప్రాయం. న్యూయార్క్, టోక్యో, లండన్ వంటి నగరాల్లో శక్తివంతమైన మేయర్ వ్యవస్థ వల్ల అభివృద్ధి సాధ్యమైందని ప్రస్తావించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో న్యూయార్క్, లండన్ వంటి నగరాలతోనే హైదరాబాద్ పోటీ అని ప్రస్తావించడం తెలిసిందే. సిటీకి కొత్త కాదు.. హైదరాబాద్ నగరానికి ప్రత్యక్ష మేయర్ ఎన్నిక కొత్తకాదు. జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందకముందు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు 2002లో జరిగిన మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్కు ఒక ఓటు, మేయర్కు మరొక ఓటు చొప్పున ఓటర్లు రెండు ఓట్లు వేశారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి మేయర్గా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత 2009–14 పాలకమండలిలో కాంగ్రెస్ –ఎంఐఎం పొత్తులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని పంచుకున్నాయి. కాంగ్రెస్ తరఫున బండ కార్తీకరెడ్డి, ఎంఐఎం తరఫున మాజిద్ హుస్సేన్లు మేయర్లుగా పదవీకాలాన్ని కూడా పంచుకున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ పరిధిలోనే తాగునీరు, డ్రైనేజీ, రక్షణ తదితర విభాగాలుండాలనే ఆలోచనలు గతంలోనూ జరిగాయి. ప్రస్తుతం క్యూర్ పరిధిలోని కార్పొరేషన్లు, పోలీసు, వాటర్, రెవెన్యూ, విద్యుత్ విభాగాలు వంటివి ఒకే ప్రాంగణంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. క్యూర్లోని మూడు కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నికపై చర్చ నీతి ఆయోగ్ సంస్కరణల నేపథ్యం.. కార్పొరేటర్కు ఒకటి, మేయర్కు మరో ఓటు పొత్తులు, పదవీకాలం పంచుకోవడానికి చెక్ -
’కారా’ ద్వారా పిల్లల దత్తత మేలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే వారు విధిగా కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి కొమ్మిశెట్టి సూచించారు. ఇతర మార్గాల ద్వారా పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో లీగల్ అడాప్షన్ పోస్ట్ కేర్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దత్తతపై సరైన అవగాహన లేక చాలా మంది తప్పుడు మార్గంలో పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటున్నారని, ఆ తర్వాత ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. చట్టబద్ధమైన దత్తత కోసం కేంద్ర ప్రభుత్వం కారా పోర్టల్ను తీసుకొచ్చిందని చెప్పారు. ఔత్సాహికులు ముందుగా ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని, లీగల్గా దత్తత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులకు రాజేంద్రనగర్ జోన్ జోనల్కమిషనర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం రాజేంద్రనగర్లోని జోనల్ కార్యాలయంలో యూసీడీ అధికారులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచి మరిన్ని ఎస్హెచ్జీ గ్రూపులను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘‘99 డేస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్’కార్యక్రమం కింద ఇప్పటి వరకు జోనల్లో మొత్తం 198 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు జోనల్ కమిషనర్కు వివరించారు. ఈ సంఖ్యను మరింత పెంచడానికి వార్డు స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఎస్హెచ్జీలు కీలకంగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్హత గల కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలని కమిషన పేర్కొన్నారు. -
ధర్మ రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
చేవెళ్ల: హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యతని వేదాంత గీత ఫౌండేషన్(నంద్యాల) సభ్యుడు అభినవ శంకరానందస్వామి, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్క చంద్రశేఖర్, మహిళా వక్త సరస్వతీ శిశు మందిర్ సంభాగ్ సమితి సభ్యురాలు శారదా దయానిధి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే బుధవారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సమాజా నిర్మాణంలో హిందూ సమాజం, మహిళల పాత్ర, కుటుంబ విలువలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆధునిక కాలంలో పాశ్యాత్య ప్రభావాల నడుమ మన సంప్రదాయలను మరిచిపోతున్నారని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మేళనంలో భక్తిగీతాలు, ధార్మిక నినాదాలు కార్యక్రమానికి మరింత ఉత్సవం నింపాయి. స్థానిక భక్తులు, యువకులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చదవలేక.. రాయరాక!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రూరల్ ఏరియాలోని విద్యార్థులతో పోలిస్తే.. అర్బన్ ఏరియాలోని విద్యార్థులు మాతృభాషపై పట్టుసాధించలేకపోతున్నారు. ఇక్కడ చదువుతున్న వారిలో మెజార్టీ విద్యార్థులు మొదటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. దీనికి బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు/కార్మికుల పిల్లలు తోడయ్యారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలను విశ్లేషిస్తే హిందీ, ఇంగ్లిష్తో పోలిస్తే తెలుగులోనే ఎక్కువ మంది ఫెయిలయ్యారు. హిందీలో కేవలం 94 మంది ఫెయిల్ అయితే.. ఇంగ్లిష్లో 761 మంది ఫెయిల్ అయ్యారు. ఇక తెలుగులో ఏకంగా 862 మంది ఫెయిల్ కావడం గమనార్హం. ఇంగ్లిష్, హిందీపై ఉన్న పట్టు మాతృభాషపై ఉండటం లేదు. అదే గ్రామీణ ప్రాంత ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లిష్లో తప్పిన వారిలో మెజార్టీ ఈ ప్రాంత వాసులే. ఇక గణితంలో 1,892 మంది, సైన్స్లో 1,737 మంది విద్యార్థులు ఫె యిల్ అవ్వడం విశేషం. రూ.లక్షల్లో ఫీజులు చెల్లించినా.. జిల్లాలో 1,024 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 52,946 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 49,217 మంది ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్/ ప్రైవేటు స్కూల్స్ నుంచి అత్యధికంగా 35,307 మంది హాజరు కాగా, వీరిలో 33,977 మంది ఉత్తీర్ణులయ్యారు. మరో 1,330 మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో మెజార్టీ విద్యార్థులు తెలుగు సబ్జెక్టులోనే ఉన్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లించి, ప్రత్యేక తరగతులు బోధించినా వందశాతం ఫలితాలు సాధించలేకపోయాయి. 708 స్కూల్స్లో 262 మాత్రమే వందశాతం ఫలితాలు సాధించాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉత్తీర్ణతలో జిల్లా వెనుకబాటుకు ఇది కూడా మరోకారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అర్బన్ మండలాల్లోనే అత్యధికం జిల్లాలోని రూరల్ మండలాలతో పోలిస్తే.. నగరానికి అతిసమీపంలో ఉన్న అర్బన్ మండలాల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తేలింది. మెజార్టీ విద్యార్థులు తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లోనే ఫెయిల్ అయినట్లు ఫలితాల విశ్లేషణను బట్టి అర్థమవుతోంది. శంషాబాద్ మండల పరిధిలో 1,700 మంది పరీక్షకు హాజరైతే 1,495 మంది మాత్రమే ఉత్తీర్ణత (87.94 శాతం) సాధించారు. ఇక్కడ 205 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. శంకర్పల్లిలో 1,140 మంది పరీక్షకు హాజరైతే 1,010 మంది మాత్రమే (88.60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 130 మంది ఫెయిల్ అయ్యారు. అబ్దుల్లాపూర్మెట్లో 1,998 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,776 మంది ఉత్తీర్ణత(88.89శాతం) సాధించారు. ఇక్కడ మొత్తం 222 మంది ఫెయిల్ అయ్యారు. రాజేంద్రనగర్లో 5,267 మంది పరీక్షకు హాజరు కాగా, 4,691 మంది ఉత్తీర్ణత (89.06శాతం) సాధించారు. ఇక్కడ ఏకంగా 576 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం విశేషం. మహేశ్వరంలో 1,613 మంది పరీక్షకు హాజరు కాగా 1,437 మంది ఉత్తీర్ణత (89.09 శాతం) సాధించారు. మొయినాబాద్లో 1,143 మంది పరీక్షకు హాజరు కాగా 1,028 మంది ఉత్తీర్ణత (89.94 శాతం) సాధించారు. గండిపేటలో 2,836 మంది పరీక్షకు హాజరు కాగా 2,566 మంది ఉత్తీర్ణత (90.48 శాతం) సాధించారు. శేరిలింగంపల్లిలో 6,266 మంది పరీక్షకు హాజరు కాగా 5,722 మంది ఉత్తీర్ణత (91.32 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలాపూర్లో 3,706 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,393 మంది (91.55 శాతం) ఉత్తీర్ణత సాధించారు. తెలుగులో 862 మంది విద్యార్థులు ఫెయిల్ హిందీలో 94, ఇంగ్లిష్లో 761 మంది.. పదో తరగతి ఫలితాల్లో వెల్లడి అర్బన్ ఏరియాలో అధ్వానం మాతృభాషపై కోల్పోతున్న పట్టు -
నామినేటెడ్ ఆశలు
పరిగి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం నామినేట్ పద్ధతిలో నియమించనుంది. పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు సభ్యుల నియామకానికి నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార పార్టీ నాయకుల్లో పదవులపై ఆశలు మొదలయ్యాయి. గతంలో ప్రతీ సహకార సంఘానికి 13 మంది చొప్పున డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగేవి. సంఘ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునేవారు. ఇలా ఎన్నికై న వారంతా కలిసి ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్గా నియమించేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ విధానానికి స్వస్తి పలికినట్లయింది. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. ఈనేపథ్యంలో పాత సంఘాలను రెండుసార్లు పొడిగించింది. ఆతర్వాత పలువురు చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవినీతి ఆరోపణలు రావడంతో గత డిసెంబర్ నుంచి ఇన్చార్జ్ అధికారులను కొనసాగిస్తోంది. ఎన్నికలపై స్పష్టత కరువు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గానూ పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్లకు సహకార సంఘాలున్నాయి. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ విషయంలో స్పష్టత రాలేదు. నామినేటెడ్ పద్ధతిలో ఒక్కో సంఘానికి ఎంత మందిని ఎంపిక చేస్తారనేది కూడా కచ్చితంగా తెలియడం లేదు. ఒక్కో సంఘానికి ముగ్గురిని, ఐదుగురిని ఎంపిక చేసి వారిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక విధివిధానాలు రావాల్సి ఉంది. నామినేటెడ్ చేసే సభ్యులలో జనరల్, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు మహిళా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఎంపిక ఎమ్మెల్యేలదే.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పరపతి కల్పనలో ప్రాథమిక సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతు వర్గాల్లో కీలకంగా ఉన్న ఈ పదువులు నియోజకర్గ పరిధిలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ కమిటీ పాలకవర్గాల తరహాలో సహకార సంఘాల్లోనూ ఇదే తీరుగా కొనసాగనుంది. దీంతో ఈ పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న నాయకులు స్థానిక ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికార పార్టీ నాయకులకు అవకాశాలు దక్కనున్నాయి. పీఏసీఎస్లలో పదవుల భర్తీపై నేతల్లో ఉత్కంఠ పైరవీలు ప్రారంభించిన ఆశావహులు ఎమ్మెల్యే సూచించిన వారికే పోస్టులు దక్కే అవకాశం -
‘ఆపరేషన్ ఆక్టోపస్’తో కదిలిన కేంద్రం
రెండు దఫాల్లో నిర్వహించిన హైదరాబాద్ పోలీసులు ● దీంతో బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు బహిర్గతం ● కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ● రాష్ట్రం నుంచి హాజరైనహైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదేశాల మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నిర్వహించారు. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంతో ఆయా అంశాలను వివరిస్తూ సజ్జనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) లేఖ రాశారు. దీంతో కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి వీసీ సజ్జనర్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలను నిరోధించాలంటే లోపాలు అధ్యయనం చేసి, మూలాల్లోకి వెళ్లాలని భావించిన సజ్జనర్ దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆక్టోపస్ను డిజైన్ చేశారు. తొలుత ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్–1’ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 16 రాష్ట్రాల్లో సోదాలు చేసి 117 మందిని అరెస్టు చేశారు. వీరిలో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలు అందించిన వారు (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), దళారులు ఉన్నారు. వీరి విచారణలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో రెండో విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ను ఏప్రిల్లో చేపట్టారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు వినియోగించిన 350 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటికి దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర అమాయకుల ధరాన్ని లూటీ చేశారని వెల్లడైంది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో బ్యాంకు అధికారుల పనిపట్టడానికి గత నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ చేపట్టారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన 16 ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్ల్లో దాడులు నిర్వహించాయి. ఫలితంగా పట్టుబడిన 52 మందిలో 32 మంది బ్యాంకు అధికారులు కాగా... 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో వివిధ బ్యాంక్లకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, క్లర్కులు ఉన్నారు. వీరి విచారణలో వెలుగులోకి వచ్చిన, దర్యాప్తులో గుర్తించిన అంశాలతో సజ్జనర్ ఆర్బీఐకి లేఖ రాయగా దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సమస్య పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎం.నాగరాజు, ఉన్నతాధికారులు, సీబీఐ డైరెక్టర్, ఇండియన్ సైబర్ క్రైౖ మ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు హైదరాబాద్ కొత్వాల్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. -
ఽభూముల ధరలు పెరుగుతాయ్
● అమ్ముకుంటే నష్టపోతారు ● రెండో హైదరాబాద్గా.. వికారాబాద్ ● స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ధారూరు: భవిషత్తులో వికారాబాద్ రెండో హైదరాబాద్గా అభివృద్ధి చెందనుందని, ఎవరూ కూడా తమ భూములు విక్రయించవద్దని శాససనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం ధారూరు మండలం గురుదోట్ల గ్రామ పంచాయతీ పరిధి వెనకతండా, కుక్కిందలో తొలుత లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని, అనంతరం నాగసమందర్లో నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించి మాట్లాడారు. వికారాబాద్ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధు లు సమకూర్చి, అభివృద్ధి చేస్తానని చెప్పారు. దీంతో మన ప్రాంతంలో భూముల ధరలు పెరిగే అవ కాశం ఉందని తెలిపారు. ఇప్పుడు భూములు అ మ్ముకుంటే.. ఆ తరువాత చింతించాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో రా ష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దు తూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వాలీబాల్ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, కుక్కింద, గురుదోట్ల సర్పంచు లు మణెమ్మ, రాములు, కాంగ్రెస్ కమిటీ జిల్లా కా ర్యదర్శి మహ్మద్ బాబాఖాన్, నాయకులు పాల్గొన్నారు. -
బేస్బాల్ విజేత జిల్లా జట్టు
డిచ్పల్లి (నిజామాబాద్రూరల్): రాష్ట్రస్థాయి బేస్బాల్ టోర్నమెంట్ బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ ద్వితీయ, నిజామాబాద్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు విజేతగా నిలిచింది. నల్లగొండ జిల్లా జట్టు ద్వితీయ, జనగామ జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన 6వ రాష్ట్ర బేస్బాల్ సబ్జూనియర్ టోర్నమెంట్ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులు మే 24 నుంచి 28 వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగే జాతీయ సబ్ జూనియర్ బేస్బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ఒలింపిక్ అబ్జర్వర్ లింగన్న, రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత, కోశాధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బంక్లు మూసి ఇబ్బంది పెట్టొద్దు
ధారూరు: ఉద్దేశ పూర్వకంగా బంక్లను మూసేసి, వాహనదారులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సాజిదాబేగం హెచ్చరించారు. హరిదాస్పల్లి సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్లో స్టాక్ ఉన్నప్పటికీ గురువారం సాయంత్రం మూసి ఉండడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బంక్ మూసి ఉండటాన్ని గమనించిన డీసీసీ కార్యదర్శి మమ్మద్ బాబాఖాన్ పెట్రోల్, డీజిల్ ఉన్నా బంక్ ఎందుకు మూసేశారని నిలదీశారు. రాత్రి వేళ బ్లాక్ మార్కెట్కు తరలించి, సొమ్ము చేసుకునే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు సిబ్బంది లేక తెరవలేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిషయాన్ని వెంటనే తహసీల్దార్తో పాటు ధారూరు సీఐ రఘురామ్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ హెచ్చరికలతో బంక్ తెరిచిన నిర్వాహకులు ప్రెట్ల్, డీజిల్ పంపిణీ చేశారు. తహసీల్దార్ సాజిదాబేగం -
ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ బదిలీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ సుధాకర్ బండారి ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థిపై ఆయన 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఓటింగ్ నిర్వహించారు. డాక్టర్ అనురాగిణిరెడ్డి, డాక్టర్ వినోద్, డాక్టర్ వినయ్, డాక్టర్ చంద్రకృష్ణ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ రాకేష్, డాక్టర్ శ్రీకర్, డాక్టర్ గాయిత్రీలతో కూడిన వైద్య బృందం ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించింది. హుడాకాంప్లెక్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 11వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 162 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్టు తెలిపారు. ఐటీ, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్, ఫార్మా, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేవా రంగం తదితర అనేక విభాగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ వంటి అర్హతలతో ఉన్న అభ్యర్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంపిక చేసుకుని, అదే రోజున ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://satg. `telangana.gov.in/prajapalana/ వెబ్ లింక్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తమ బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాల్సిందిగా కోరారు. -
రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
ఇబ్రహీంపట్నం: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆయా కోర్సులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదనే నెపంతో విద్యార్థులకు ఒరిజనల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తున్నాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్కుమార్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ చేపట్టిన పోరుబాట రెండోరోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇబ్రహీంపట్నంలో హైకోర్టు న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సెయింట్ కళాశాల వద్ద జరిగిన ఆందోళనలో రాజ్కుమార్ మాట్లాడారు. ఉన్నత చదువులకు వెళ్లేందుకు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థుల వద్ద ఒరిజనల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో నష్టపోతున్నారని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల వేధింపులతో పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, విద్యార్థులను వేధించకుండా ఒరిజినల్ సర్టిఫికెట్లు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రవణ్, ప్రశాంత్, సుభాష్, రవి, ప్రసాద్, శంకర్, ప్రవీణ్, శివ పాల్గొన్నారు. మరో కళాశాల వద్ద జరిగిన ఆందోళనలో రాష్ట్ర నాయకుడు రంగోలి అరుణ్గౌడ్, విద్యార్థి నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ -
వలస బతుకులు ఛిన్నాభిన్నం
శంకర్పల్లి: పొట్టకూటి కోసం.. కుటుంబ పోషణ కోసం.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బతుకున్న కార్మికుల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. మండలంలోని మహాలింగపురం ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం ఐదుగురు కార్మికులను బలితీసుకున్న విషయం తెలిసిందవే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పింటు (30) తలకు బలమైన గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. పవన్ కుమార్ (26) రెండు కాళ్లు విరిగాయి. వీర బహదూర్ (25)కు తుంటి ఎముకతో పాటు, పక్కటెముకలు విరగ్గా.. మిఽథున్(26)కు పాదంలో చీలిక వచ్చింది. మిగిలిన ఎనిమిది మందికి ఎముకల్లో ఎయిర్ గ్యాప్తో పాటు పాక్షికంగా గాయాలయ్యాయి. చనిపోయిన ఐదుగురు కార్మికుల మృతదేహలకు మంగళవారం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు తరలించారు. ప్రమాణాలు పాటిస్తున్నారా? ఎన్సీసీ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో జరిగిన ప్రమాదం అందరినీ షాక్కి గురి చేసింది. కంపెనీపై మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కంపెనీ ప్రతినిధులు చాలాసేపటి వరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని వెళ్లిన మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించకపోవడం, దర్యాప్తు అధికారులు వచ్చినప్పుడు సైతం అలాగే వ్యవహరించడం సందేహాలకు తావిస్తోంది. కంపెనీ యాజమాన్యం కార్మికుల భద్రత కోసం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దర్యాప్తు ప్రారంభం.. ఎన్సీసీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై కార్మిక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్బాబు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మనోహర్రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రతిమ కంపెనీకి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీసి, పరిసరాలను పరిశీలించారు. ఈదురుగాలుల కారణంగా 75నుంచి 80టన్నులు ఉండే మూవబుల్ గ్యాండ్రీ క్రేన్లు అసలు ఎలా కదిలాయని, ఆ అవకాశం ఉందా, ఇంకేదైనా టెక్నికల్ సమస్య కారణమా.. అని విచారిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులతో కలిసి కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ఎమ్మెల్యే యాదయ్య వెల్లడించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.25 లక్షలచొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, పాక్షిక గాయాలైన వారికి రూ.50 వేల పరిహారంతో పాటు పూర్తి వైద్య ఖర్చులు కంపెనీయే భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా మరణించిన వ్యక్తి ఉద్యోగ విరమణ కాల పరిమితి వరకూ నెల వేతనం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. కార్మికులకు అందించే నష్టపరిహారానికి సంబంధించిన ప్రకటనపై మంత్రి, కలెక్టర్తో చర్చించినట్లు తెలిపారు. ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రమాదం ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాదం ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు గాయపడిన కార్మికులకు మంత్రి వివేక్ పరామర్శ -
అర్హులందరికీ ‘కల్యాణలక్ష్మి’
మహేశ్వరం: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా చెక్కులు అందించాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డ పెళ్లి విషయంలో ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ మహిళలు, గర్భిణులు, ఆడబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, ఎంపీడీఓ శైలజ, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఆర్ఐలు స్వర్ణకుమారి, రాజిరెడ్డి, ఎంపీఓ రవీందర్రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
బంకుల్లో అవే బారులు
మొయినాబాద్: పెట్రోల్, డీజిల్ వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ వచ్చిందంటే చాలు వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి మొయినాబాద్లోని అన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే కనిపించాయి. మధ్యాహ్నం తరువాత రెండు బంకుల్లో స్టాక్ రావడంతో భారీగా వాహనాలు క్యూ కట్టాయి. ఒక్కో వాహనదారుడు ట్యాంక్ ఫుల్ చేయిస్తుండడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో వెనకాల వచ్చే వాహనదారులకు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది. -
అంబులెన్స్లలోఉద్యోగ అవకాశాలు
ఇబ్రహీంపట్నం రూరల్: కొంగరకలాన్లో హైడ్రా అధికారులు పర్యటించారు. ఓ కన్వెన్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని మంగళవారం హైడ్రా ఇన్స్పెక్టార్ సైదులు పరిశీలించారు. భూ పరిరక్షణ సమితి ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్యటించినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తుక్కుగూ: డివిజన్ పరిధిలోని ఇమూమ్గూడలో ఉన్న గ్రేస్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలితాదేవి ఆదేశాల మేరకు కందుకూరు డివిజన్ ఉప వైద్యధికారి డాక్టర్ గీత మంగళవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణ, రోగుల సేవల విషయంలో లోపాలను గుర్తించామన్నారు. యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు జారీ చేసినా సరి చేయలేదన్నారు. దీంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లి: మోకిల సీఐ వీరబాబును బదిలీ చేస్తూ ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనని కమిషనరేట్లోని క్రైం విభాగానికి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో శ్రీనివాస్రెడ్డిని నియమించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశామని, ప్రజలు సైతం మంచి సహకారాన్ని అందించారని వీరబాబు గుర్తు చేసుకున్నారు. నూతన సీఐ శ్రీనివాస్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతగిరి: అనంత పద్మనాభస్వామి ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు గాను మే 2న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం, ఈఓ టీ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందని తెలిపారు. వేలం హక్కులు పొందిన వారు మూడేళ్ల పాటు(మే 05 నుంచి ఏప్రిల్ 30 2029 వరకు) వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు. వికారాబాద్ మండలం గుడుపల్లి సర్వే నంబర్ 65లో 328 ఎకరాలు, కొత్తగడి గ్రామ సర్వే నంబర్ 175లో 219 ఎకరాలు, మరో సర్వే నంబర్ 176లో 324 ఎకరాలు, పులుసుమామిడి గ్రామ సర్వే నంబర్ 180లో 228 ఎకరాలు, మరో సర్వే నంబర్ 181లో 110 ఎకరాలు, నారాయణపూర్ సర్వే నంబర్ 135లో 1,334 ఎకరాలు, పరిగి మండలం బిజ్వారం గ్రామ సర్వే నంబర్ 169/ఆలో 206 ఎకరాలు, తాండూరు మండలం అంతారం గ్రామ సర్వే నంబర్ 205లో 25ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం కేశ్వాపూర్ గ్రామ సర్వే నంబర్ 105లో 803 ఎకరాల భూములు ఉన్నట్లు తెలిపారు. వీటికి కౌలు హక్కు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు రూ.2 వేలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన వచ్చని వారు తెలిపారు. -
ఈ–ఆఫీసు.. తుస్సు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పరిపాలనలో పారదర్శకత, సత్వర సేవల కోసం ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆన్లైన్లోని నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు సేవలను అమల్లోకి తెచ్చింది. ప్రతిశాఖ ఈ–ఆఫీసు ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా ఇప్పటికే జిల్లా అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతి అధికారికి ఒక ప్రత్యేక ఐడీ క్రియేట్ చేసి, పాస్ వర్డ్లను జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారికి పంపే ఫైళ్లన్నీ ఇకపై ఈ ఆఫీసు ద్వారానే పంపాలనే నిబంధన కూడా విధించారు. జిల్లాలో మాత్రం మెజార్టీ శాఖలు ఇప్పటికీ మాన్యూవల్గానే రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విద్య, వైద్య ఆరోగ్యశాఖ సహా కీలక విభాగాల్లోనూ ఇప్పటికీ మాన్యూవల్ పద్ధతే కొనసాగుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా ప్రభుత్వశాఖలు జారీ చేసే ప్రొసీడింగ్స్ మొదలు.. బిల్లుల చెల్లింపుల వరకు అంతా మాన్యువల్గానే కొనసాగిస్తున్నారు. పాడైపోయిన స్కానర్లు జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమం, ట్రెజరరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు సహా 50కిపైగా విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కో ఉన్నతాధికారి ఉంటారు. రాబోయే రోజులన్నీ సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉంటాయని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు జిల్లా ప్రజలకు సత్వర, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్ని విభాగాల్లో ఈ–ఆఫీసు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పెద్ద మొత్తంలో కంప్యూటర్లు, స్కానర్లు కొనుగోలు చేసి ఆయా విభాగాలకు అందజేసింది. మెజార్టీ కంప్యూటర్లు, స్కానర్లు పాడైపోయాయి. ఉన్న వాటిని అప్డేట్ చేయలేదు. సాఫ్ట్వేర్ వర్షన్ కూడా మారడంతో స్కానర్లు పని చేయని పరిస్థితి నెలకొంది. వీటి రిపేర్లకు ఆయా శాఖల వద్ద ఆశించిన స్థాయిలో బడ్జెట్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. భూభారతిలో అందిన దరఖాస్తులు, క్షేత్రస్థాయి నుంచి అందిన కీలక నివేదికలు, అధికారులు జారీ చేసే ప్రొసీడింగ్స్ అన్నీ ఇప్పటికీ మాన్యువల్గానే కొనసాగుతున్నాయి. ఐటీకి కేంద్రబిందువైన జిల్లాలో ఆశించిన స్థాయిలో ఈ ఆఫీసు సర్వీసులు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కీలకమైన రెవెన్యూ విభాగంలో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ తుది నివేదికలను ఇప్పటికీ మ్యాన్యువల్గానే అందించాల్సి వస్తోంది. ఆన్లైన్లోనే యాక్సెప్ట్/ రిజెక్ట్ చేసి అవకాశం ఉన్నప్పటికీ మాన్యువల్గా వచ్చిన ఫైళ్లను చూ సిన తర్వాతే సంతకాలు చేస్తుండటం గమనార్హం. విద్యాశాఖ సహా ఫుడ్ కంట్రోల్ విభాగం, తూనికలు కొలతలు, సీ్త్ర శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖలు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్శాఖ, సహకారశాఖ, మైనింగ్ విభాగం, ఎస్సీ కార్పొరేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, మత్స్యశాఖ, సివిల్ సప్లయ్ విభాగం సహా కీలక విభాగాలు ఇప్పటికీ మాన్యువల్గానే కార్యకలాపాలు కొనసాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా అధికారుల టేబుళ్లపై గుట్టలుగా ఫైళ్లు పేరుకపోయి కన్పిస్తున్నాయి. స్కానర్లు కరువు.. కంప్యూటర్లు పని చేయవు ప్రభుత్వ విభాగాల్లో కనిపించని ఆన్లైన్ సేవలు ప్రొసీడింగ్స్ సహా నివేదికలన్నీ మాన్యువల్గానే.. ఫైళ్ల క్లియరెన్స్లో ఎడతెగని జాప్యం -
శివార్లకు మహర్దశ
● అంతర్గత సీసీ రోడ్లకు స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ● తుర్కయంజాల్, తొర్రూరులో రూ.17.42 కోట్లతో పనులు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో విలీనమైన తుర్కయంజాల్ వార్డులోని ఏవీ నగర్ ఫేజ్–3, ఫేజ్–4, ఊషయ్య కాలనీ, లక్ష్మీగణపతి హ్యాపీ హోమ్స్, ఎస్సీ బస్తీ, సినర్జీ హోమ్స్, అభ్యుదయ నగర్, ద్వారకానగర్, శ్రీనివాస సిలికాన్ సిటీల్లో రూ. 5 కోట్లతో అంతర్గత రహదారులు నిర్మించనున్నారు. మంగళవారం స్పెషలాఫీసర్ జయేశ్రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఏవీనగర్ ఫేజ్–2, సాయిబృందావన్ కాలనీ, నల్లా నారాయణ కాలనీ, తుర్కయంజాల్ ఓల్డ్ విలేజ్ల్లో అంతర్గత రోడ్లకు మరో రూ. 5 కోట్లతో పనులకు ఆమోదం తెలిపింది. అలాగే.. శివసాయినగర్, ఆరెంజ్ అవెన్యూ కాలనీ, ఏవీనగర్ ఫేజ్–1, ఆదిత్యనగర్, మ్యాట్రిక్స్ రిచ్వ్యాలీ, టీచర్ గ్రిల్డ్కాలనీల్లో అంతర్గత రోడ్లకు రూ.3.92 కోట్ల పనులకు, తొర్రూరు వార్డులోని శ్రీ శ్రీనివాస రంగాపురం కాలనీ, శ్రీగణేశ్రంగాపురం కాలనీ, ఓంగణేశ్నగర్, గణేశ్నగర్, సాయిబృందావన్కాలనీ, జీవీఆర్ కాలనీ, సామ రెసిడెన్సీ, దుర్గా అంజనాద్రి కాలనీల్లో రూ. 3.50 కోట్లతో అంతర్గత రోడ్లకు ఆమోదం తెలిపింది. వీటి మొత్తం అంచనా వ్యయం రూ.17.42 కోట్లు. రెండంతస్తులతో మూసారాంబాగ్ సర్కిల్ కార్యాలయనిర్మాణానికి రూ.5.90 కోట్ల అంచనా వ్యయంతో పనులకు కూడా ఆమోదం తెలిపింది. -
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మొయినాబాద్: ఓ బంక్ వద్ద క్యూకట్టిన వాహనదారులుమళ్లీ అదే వరుస!ఇంధనం కష్టాలు మళ్లీ షురూ అయ్యాయి.. జిల్లాలోని పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. మరి కొన్ని బంకుల్లో వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు.. ముందు జాగ్రత్తగా ట్యాంక్లు ‘ఫుల్’ చేయిస్తున్నారు.. ఎందుకై నా మంచిదని ఏకంగా క్యాన్లు, వాటర్ బబుల్స్లో నింపుకెళ్తున్నారు.. ఒకవైపు ఎలాంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. – షాద్నగర్/చేవెళ్ల/మొయినాబాద్/కొత్తూరు/తుక్కుగూడ పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు మళ్లీ క్యూ కడుతున్నారు. జిల్లాలోని చాలా బంకుల్లో స్టాక్ లేకపోవడంతో మూసివేశారు. ఇంధనం అయిపోయిన వారు ఖాళీ బాటిళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఇంధనం కొరత లేదని ఓ వైపు అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో సామాన్యులు, రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. రోజూ సరఫరా చేసే చమురు కంపెనీలు మూడు, నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్లను పంపిస్తున్నారని, దీంతో సమస్య తలెత్తుతోందని బంకుల యజమానులు చెబుతున్నారు. నిల్వలు నిండుకొని.. ఇంధనం నిల్వలు సరిపడా లేకపోవడంతో పెట్రోల్ బంక్ల వద్ద నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీల నుంచి సరఫరాలో జాప్యంతో చాలా బంకుల్లో కొరత ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 349 పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిల్వలు నిండుకోవడంతో వీటిలో చాలా బంకులు మూతపడ్డాయి. మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఎక్కడ చూసినా నోస్టాక్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని బంకుల్లో స్టాక్ వచ్చిన వెంటనే వాహనదారులు క్షణాల్లో బారులు తీరుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు అత్యవసర సేవలకు వినియోగించే వాహనాల కోసం కొంత స్టాక్ నిల్వ చేసుకొని వారికి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకునే సమయం కావడంతో ఇంధనం లేక రైతులు పాట్లు పడుతున్నారు. పొంతలేని ప్రకటనలు ఇంధనం కొరత లేదని ఆయిల్ కంపెనీలు, అధికారులు ప్రకటిస్తున్నారు. వారు చెప్పే మాటలు, ప్రకటనలకు పొంతన లేకుండా ఉంది. మరోవైపు ఇంధన కొరతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిజంగానే తగ్గిపోయాయా లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎన్జీ, గ్యాస్ సిలిండర్ల కొరత సీఎన్జీ, గ్యాస్ సిలిండర్ల కొరత కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. సీఎన్జీ కోసం బంకుల ముందు వాహనాలు బారులు తీరుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల దొరక్క వినియోగదారులు తంటాలు పడుతున్నారు. బుకింగ్ చేసినా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంధనంపై ఆధారపడి జీవించే ఆటోవాలాలు, అద్దెకు కార్లు నడిపించే వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రయాణికులను ఒకచోట నుంచి మరో చోటికి తీసుకెళ్లాలంటే ఇంధనం తప్పనిసరని, లేదంటే పూడ గడవదని వాపోతున్నారు. దొరకదన్న ప్రచారంతో.. ఇంధనం వచ్చిన బంకుల్లో వాహనదారులు క్యూ కడుతున్నారు. ఓ వైపు కొరతతో పాటు ఇంధనం దొరకదేమోననే ఆందోళనతో వాహనాదారులు ఏకంగా ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు పెట్రోల్, డీజిల్ను పట్టణాలకు వచ్చి మరీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. బంకుల్లో బారులు ‘నో స్టాక్’ బోర్డులు వాహనదారుల కష్టాలు కొరత లేదంటున్న అధికారులు భిన్నంగా వాస్తవ పరిస్థితి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు ఇబ్రహీంపట్నం రూరల్: పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రజలకు నమ్మకం కల్పించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని కొన్ని బంకుల్లో పరిస్థితిపై సోమవారం జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్స్తో టె లీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొద్ది మందికే ఎక్కువ మొ త్తంలో విక్రయించకుండా చూడాలన్నారు. అనవసరంగా కొనుగోలు చేసి కృత్రిమ కొరతకు కారణం కావొద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆధారపడి.. ఆందోళనకు గురై -
ఉదయం మంట.. సాయంత్రం చల్లబడే..
చేవెళ్ల: సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉగ్రరూపం చూపిన భానుడు సాయంత్రానికి ‘కూల్’ అయిపోయాడు. ఉక్కపోతతో అల్లాడినవారు కాస్తా ఉపశమనం పొందారు. సాయంత్రం 4 గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ పొలాల వద్ద పశువుల పాకలు, రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. చల్లబడిన వాతావరణం మొయినాబాద్రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో సాయంత్రం ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో జనం సేదదీరారు. మరోవైపు వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం మొయినాబాద్: మండలంలో సాయంత్రం ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీస్తూ వర్షం పడింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరా నిలిచిపోయి అంతరాయం ఏర్పడింది. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంతోపాటు సురంగల్, అమీర్గూడ, చిన్నషాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. -
11న మెగా జాబ్ మేళా
హుడాకాంప్లెక్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మే 11న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమ లు, ఐటీ కంపెనీలు, ఇతర సేవా రంగ సంస్థ లు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటా యని తెలిపారు. అర్హులైన నిరుద్యోగులు ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://satg.telangana.gov.in/prajapalana వెబ్ లింక్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.ఆమనగల్లు: ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్రెడ్డిని సోమవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీనేత ఆచారి కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో కలిసిన ఆచారి ఈనెల 30న జరిగే తన కుమారుడు భరత్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు. బడంగ్పేట్: ఇటీవల మృతి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు తర్రె మల్లేష్యాదవ్, సర్కిల్ అధ్యక్షుడు రాళ్లగూడం రామకృష్ణారెడ్డి సంతాప సభ సోమవారం నాదర్గుల్లోని ఓ గార్డెన్లో నిర్వహించారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్గౌడ్, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్రెడ్డి తదితరులు హాజరయ్యారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ సిబ్బందికి రెండు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గ్యార పాండు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పాండు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో పంచాయతీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, అయినా వారికి రెండు నెలల వేతనాలు అందించడం లేదన్నారు. సిబ్బందిని 2వ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరీలన్నింటినీ కొనసాగించాలని, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన సర్పంచ్లు ఆన్లైన్లో పేర్లు లేని కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని, కార్మికుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పోచమోని కృష్ణ, భాస్కర్, రజిత, బాలమణి, సరిత తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యసంస్థల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండున్న రేళ్లు దాటినా నిధులు మంజూరు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశరథ, శ్రీనివాస్, జగదీష్, శ్రీకాంత్, ప్రసాద్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
ఇబ్బందిగా ఉంది
పెట్రోల్ కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడికి వెళ్లినా బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు, ఎక్కడ పెట్రోల్ దొరుకుతుందో తెలియడం లేదు. – శివకుమార్, షాద్నగర్ చర్యలు తీసుకోవాలి పెట్రోల్, డీజిల్ దొరకక పోవడంతో శుభకార్యాలకు వెళ్లాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధనం కొరత రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. – నర్సింహ, షాద్నగర్ -
వచ్చేది మన ప్రభుత్వమే
ఇబ్రహీంపట్నం: వచ్చేది మళ్లీ మన ప్రభుత్వమే అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఇబ్రహీంపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీపీ ఇందిర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి -
డంపింగ్యార్డును తరిమికొడదాం
అబ్దుల్లాపూర్మెట్: నగర శివారులోని బండరావిరాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకోటౌన్ పేరుతో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డును తరిమి కొట్టాలని అబ్దుల్లాపూర్మెట్, భూదాన్పోచంపల్లి మండలాలకు చెందిన పలువురు సర్పంచులు, రాజకీయ పార్టీ నేతలు ప్రతినబూనారు. బండరావిరాల సర్వేనంబర్ 268లోని ప్రభుత్వ భూమిలో డంపింగ్ యార్డును నెలకొల్పేందుకు సర్కారు జపాన్కు చెందిన ఓ కంపెనీకి స్థలం కేటాయించిందని ఇటీవల వచ్చిన వార్తా కథనాలతో ఆయా గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం చిన్నరావిరాలలోని ఓ ఫంక్షన్హాల్లో అన్ని పార్టీల నాయకులు, ఆయా గ్రామస్తులతో సమావేశం(అఖిలపక్షం) ఏర్పాటు చేశారు. పోరాటానికి సిద్ధం కావాలి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డును వ్యతిరేకించకపోతే బండరావిరాల, చిన్నరావిరాల, తారామతిపేట, గౌరెల్లి, బాచారం, సద్దుపల్లి, బలిజగూడ, అబ్దుల్లాపూర్మెట్, కవాడిపల్లి, దేశ్ముఖి, పిలాయిపల్లి, పెద్దగూడెం, పోచంపల్లిలోని మరికొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు, పీల్చే గాలి కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన దుర్వాసనతో ఈగలు, దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇక్కడి గ్రామాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, ఇప్పటికే క్రషర్లతో కొంత మేర సాగుకు ఇబ్బందులు ఉన్నాయని, ఈ డంపింగ్ యార్డుతో కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదముందన్నారు. మన గ్రామాలను, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అన్యాయాన్ని ఎదురించి పోరాడటానికి ప్రజలందరూ సిద్ధం కావాలని భీష్మించారు. డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాటం కోసం త్వరలోనే బాధిత గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ మండల సర్పంచులు విజయ్కుమార్, బాలకిషన్గౌడ్, మాధవీనవీన్, పోచంపల్లి మండల సర్పంచులు జంగయ్యయాదవ్, మహాలక్ష్మిదానయ్య, మహేశ్యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దాసుగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, బీజేపీ నేతలు నవీన్కుమార్, సురేష్గౌడ్, కొండల్గౌడ్, వివిధ సంఘాల నేతలు వెంకటేశ్, అరుణ్కుమార్, మహేందర్, లింగారెడ్డి, అశోక్యాదవ్, సతీష్రెడ్డి, బసవయ్య, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. ఎకోటౌన్కు వ్యతిరేకంగా అఖిలపక్షం సమావేశం -
మహిళ మృతిపై విచారణ
తుర్కయంజాల్: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతిపై పూర్తి విచారణ జరిపి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డాక్టర్ రవినాయక్, డాక్టర్ భానుప్రకాశ్, డాక్టర్ వినయ్ కోట బృందం వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లికి చెందిన కె.దివ్య వైద్యం నిమిత్తం ఈనెల 24న రాగన్నగూడలోని మహోనియా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చి, మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈఅంశంపై విచారణ చేసేందుకు మహేశ్వరం మెడికల్ కళాశాలకు చెందిన వైద్య బృందాన్ని నియమించారు. సోమవారం ఆ స్పత్రికి వచ్చిన వైద్యులు దివ్యకు అందించిన చికి త్స వివరాలను సేకరించడంతో పాటు పలు రిపోర్ట్లను పరిశీలించారు. ఐసీయూలోని సీసీ పుటేజీలను సైతం తీసుకున్నట్లు సమాచారం. డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ లక్ష్మీప్రసన్న, మండల వైద్యాధి కారి ప్రియాంక, డాక్టర్ శృతి పాల్గొన్నారు. -
స్వీయ గణన నమోదు చేసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో పాల్గొని వారి వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వీయగణన ఆన్లైన్ పోర్టల్ వెబ్సైట్ను సందర్శించి సెల్ఫ్ డిక్లరేషన్ ఐడీ పొందాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సెన్సన్ ఇన్చార్జి అధికారి శిరీష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజావాణికి 65 దరఖాస్తులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డి అదనపు కలెక్టర్ కిరణ్మయితో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజలు అందించే వినతులను సంబంధించి అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 65 ఫిర్యాదులు అందాయని వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 21, ఇతర శాఖలకు సంబంధించి 44 అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
చోరీ కేసులో కేటుగాడి అరెస్టు
షాద్నగర్రూరల్: మాయమాటలు చెప్పి బంగారంతో ఉడాయించిన ఓ కేటుగాడిని పోలీసులు కటకటాలకు తరలించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో డిటెక్టివ్ ఎస్ఐ శివారెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన నరేష్ ఈ నెల 18న హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా బస్సు కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి బస్టాప్లో నరేష్ దగ్గరకు వచ్చి ఉద్యోగం ఖాళీగా ఉందని, ఇప్పిస్తానని, మరిన్ని విషయాలు మాట్లాడుకుందామని లాడ్జికి తీసుకెళ్లాడు. ఇద్దరు మాట్లాడుతుండగా వాష్ రూంకు వెళతానని నరేష్ చెప్పడంతో మెడలోని చైన్, చేతి ఉంగరాలను తీసిపెట్టి వెళ్లాలని భిక్షపతి సూచించాడు. దీంతో నరేష్ తన మెడలో చైన్, చేతికి ఉన్న నాలుగు ఉంగరాలను తీసిపెట్టి వాష్రూంకు వెళ్లాడు. నరేష్ బయటకు వచ్చేలోపు భిక్షపతి గది బయట నుంచి గడియపెట్టి బంగారంతో ఉడాయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించి భిక్షపతిని అరెస్టు చేసి విచారించగా.. నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి బంగారు చైన్, 4 ఉంగరాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మినారాయణ, పట్టణ సీఐ సీతారం పర్యవేక్షణలో డీఎస్ఐ శివారెడ్డి, క్రై సిబ్బంది కేసును ఛేదించారు. -
జీతాలు రాక ఇబ్బందులున్నాయి
కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, మైసిగండి, ఆమనగల్లు, షాద్నగర్, మహేశ్వరం పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి వేతన కూలీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్మికులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్కుమార్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలల దినసరి వేతన కూలీలు మాట్లాడుతూ.. గత 13 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. రికార్డుల్లో లోపాలు ఉండటంతో జీతాలు అందడంలేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. అనంతరం గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్కుమార్లు.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, 15 రోజుల్లో జీతాలు కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కూలీలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, దినసరి వేతన కూలీలు సైదమ్మ, సంతోష, శోభ, చంద్రకళ, బుజ్జి, మస్రూ, సునీత, రాములు, భూదేవి, సత్యమ్మ, అలివేలు, స్వరూప, లక్ష్మి, మల్లమ్మ తదితరులు ఉన్నారు. -
బోనమెత్తి.. అమ్మకు ప్రణమిల్లి
షాబాద్: మండల పరిధిలోని మాచన్పల్లి కట్ట మైసమ్మకు గ్రామస్తులు బోనాలు ఘనంగా సమర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయం వద్ద బారులు తీరి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి నైవేద్యాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, నాయకలు, కార్యకర్తలు, తదితరులున్నారు. పంట మార్పిడితో నేలకు మేలు ఇబ్రహీంపట్నం రూరల్: తక్కువ యూరియాను వాడి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంభాలపల్లి గురునాథ్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని కప్పపహాడ్లో ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురునాథ్రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ రసాయనిక ఎరువులు వాడి భూసారాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. అవసరం మేరకు మాత్రమే రసాయనిక ఎరువులు ఉపయోగించాలన్నారు. ప్రకృతిని పరిరక్షించడం, పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చన్నారు. అంతకుముందు రైతులకు వివిధ అంశాలను డాక్టర్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్ వరప్రసాద్, చంద్రమోహన్ వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ డాక్టర్ యాదాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి ఉష, ఏడీ సుజాత, ఏఓ విద్యాధరి, సర్పంచ్ గీత, ఉప సర్పంచ్ రమేష్, ఉద్యాన అధికారి నవీన, ఏఈఓ శ్రవణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. బాలిక ఆత్మహత్య.. నిందితుడికి రిమాండ్ బంట్వారం: బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించామని కోట్పల్లి ఎస్ఐ శైలజ తెలిపారు. ఎస్ఐ తెలిపిన ప్రకారం.. కోట్పల్లి మండలం నాగసాన్పల్లికి చెందిన కాళ్ల సాకేత్.. బాలికను ప్రేమపేరుతో వేధించేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన బాలిక.. ఈ నెల 23న పురుగు మందు తాగి బలవన్మరణానికిపాల్పడింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25న మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. గృహిణి ఆత్మహత్య కేసులో ఇద్దరికి.. యాలాల: భర్త, తోటికోడలు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన గృహిణి కేసులో ఇద్దరిని సోమవారం పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన జటంగి దేవి(33)ని, ఆమె భర్త హన్మంతు నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. ఈ నెల 13న డబ్బుల విషయంలో గొడవ జరగగా.. మనస్తాపం చెందిన ఆమె గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు.. దేవి మృతికి కారణమైన హన్మంతు, తోటి కోడలు సావిత్రమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
ఆమనగల్లు: మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులుగా బీజేపీకి చెందిన చుక్కా అల్లాజీగౌడ్, కండె సీతమ్మ, హలీమాబేగం, కాంగ్రెస్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఎన్నికయ్యారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ అధ్యక్షతన కమిషనర్ శంకర్నాయక్ పర్యవేక్షణలో నాలుగు పదవులకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. సమావేశానికి వైస్ చైర్మన్ తల్లోజు గీత, కౌన్సిలర్లు దోళి, యశోదమ్మ, ఆంజనేయులు యాదవ్, పాపిశెట్టి రాము, నిరంజన్, రమేశ్, మహేశ్, అనిత, సునీత, నాగిళ్ల జగన్, అనూష, వెంకటయ్య, భాగ్యలక్ష్మి హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 8 మంది సభ్యులు కలిసి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారికి 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికై న వారికి మున్సిపల్ కమిషనర్ ధ్రువీకరణ పత్రాలు అందించారు. -
టీబీ నిర్మూలనకు కృషి చేద్దాం
పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులుఇబ్రహీంపట్నం రూరల్: టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పాపారావు పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కొంగరకలాన్లోని న్యూ గెలాక్సీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ పాపారావు మాట్లాడుతూ.. టీబీ బాధితులు సకాలంలో మందులు వాడితే తిరిగి మామూలు స్థితికి చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు నిరంతరం అందుబాటులో ఉంటాయని, సరైన పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీప్రసన్న, ఎల్మినేడు వైద్యులు డాక్టర్ రాజ్యలక్ష్మి, విశ్వనాథ్, డాక్టర్ జనార్దన్, టీబీ రెడియోగ్రాఫర్ శ్రీనివాస్రెడ్డి, టెక్నీషియన్ జైహింద్, సూపర్వైజర్ శివ, కోఅర్డినేటర్ జ్యోతి, సూపర్వైజర్ అజయ్కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పాపారావు -
ప్రొటోకాల్పై కలెక్టర్కు ఫిర్యాదు
మంచాల: ప్రొటోకాల్ పాటించకుండా పనులకు అడ్డుతగిలి, తనను అవమాన పర్చిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మండలంలోని ఆగపల్లి సర్పంచ్ లకుమల్ల ఉమ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25న గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చారన్నారు. కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత సమయాభావంతో ఆయన వెళ్లిపోయారని, మిగిలిన వాటిని సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రారంభించాలని సూచించారన్నారు. అనంతరం గ్రామంలో ఓ ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి వెళ్లిన తనను ఏర్పుల సంజీవ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కాలితో తన్నడంతో పాటు కత్తెర లాక్కొని రిబ్బర్ కట్ చేశారని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించకుండా, మహిళా సర్పంచ్నైన తనను అవమానించిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. -
యువకుడి అదృశ్యం
అబ్దుల్లాపూర్మెట్: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవడ గ్రామానికి చెందిన పొడుగు ఈశ్వరమ్మ, యెరుకులు దంపతులు కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా అనాజ్పూర్లోని రామోజీ ఫిల్మ్సిటీకి చెందిన సహారా క్వార్టర్స్లో నివాసముంటున్నారు. ఫిల్మ్సిటీలో పనిచేస్తున్న వారి చిన్న కుమారుడు ఏసుకుమార్(24) ఈ నెల 21వ తేదీన పనికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూడగా ఏసుకుమార్ కనిపించకపోవడంతో పాటు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆచూకీ కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత దోమ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు ఆదివారం రాత్రి సీజ్ చేశారు. మండల పరిధి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన అలవోని తిరుపతి.. తన వాహనంలో రాకొండ వైపునకు ఇసుక తీసుకెళ్తుండగా.. నమ్మదగిన సమాచారంతో పోలీసులు ట్రాక్టర్ను పట్టుకున్నారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని ఠాణాకు తరలించారు. తిరుపతిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వసంత్ జాదవ్ హెచ్చరించారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కుత్బుల్లాపూర్: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. కామారెడ్డి జిల్లా వెల్లగనూర్ గ్రామానికి చెందిన వీరారెడ్డి కుమారుడు రాజేందర్రెడ్డి (23) మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ స్థానికంగా ఉన్న వెంకట సాయిలక్ష్మీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం రాజేందర్రెడ్డి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా అస్తమాతో బాధపడుతున్న అతను చికిత్స పొందుతున్నాడు. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళల పరార్ జగద్గిరిగుట్ట: ఆల్విన్ కాలనీలో ఉన్న రెస్క్యూ హోం (పునరావాస కేంద్రం) నుంచి ఆదివారం ఏడుగురు మహిళలు పరారయ్యారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో వీరిని కౌన్సిలింగ్లో భాగంగా ఇటీవలే రెస్క్యూ హోమ్కు తీసుకు వచ్చారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ రావడంతో మెయిన్ గేట్ తెరిచారు. ఆ సమయంలో మొత్తం 9 మంది మహిళలు పరారవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఏడుగురు సిబ్బంది కళ్లు గప్పి పరారయ్యారు. సిబ్బంది అప్రమత్తమై మరో ఇద్దరిని పట్టుకున్నారు. రెస్క్యూ హోం నిర్వాహకురాలు నీలిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో కాల్స్తోమహిళకు వేధింపులు కుషాయిగూడ: అసభ్యకరంగా న్యూడ్ వీడియో కాల్స్తో నిత్యం వేధిస్తున్నాడని ఓ మహిళ సోమవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి మార్చి నెల నుంచి పలు ఫోన్ నెంబర్లతో వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాధులో పేర్కొంది. నిందితుడిని త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
తుక్కుగూడ: పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, వారికి సేవలు అందించాలని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. తుక్కుగూడ పరిధిలోని ఈ–సిటీలో సోమవారం ఫ్యూచర్సిటీ కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇప్పటి వరకు కలెక్టర్ కార్యాలయంలో కొనసాగిందని తెలిపారు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో ఈ–సిటీలో తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యాలయం ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కనే రవాణా పరంగా అందుబాటులో ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ శాశ్వత భవనం కోసం మీర్ఖాన్పేటలో ప్రభుత్వం 24 ఎకరాల స్థలం, భవన నిర్మాణానికి ప్రాథమికంగా రూ.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీ జి.సుధీర్బాబు, జాయింట్ సీపీ చందనా దీప్తి, డీసీపీలు కె.నారాయణరెడ్డి, శిరీష, యోగేష్ గౌతమ్, ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ, ఏసీపీలు జానకిరెడ్డి, అరుణ్కుమార్, కిషన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీజీపీ శివధర్రెడ్డి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయం ప్రారంభం -
సిటీ స్విమ్మర్ మరో రికార్డు
● సముద్రాన్ని ఈదిన నగర మహిళ ● 10.10 గంటల్లో శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకుని రికార్డు కాచిగూడ: అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా (45) మరో రికార్డును నెలకొల్పారు. కాచిగూడకు చెందిన క్వీనీ విక్టోరియా శ్రీలంకలోని తలైమీనార్ నుంచి తమిళనాడు రామేశ్వరం ధనుస్కోడి వరకు ఐదుగురు మహిళలతో కలిసి సముద్రాన్ని ఈది రికార్డును నెలకొల్పారు. గంధం క్వీనీ విక్టోరియా సారధ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ (42), తెలంగాణకు చెందిన మౌనిక (34), మహారాష్ట్రకు చెందిన స్మిత (52), విజయవాడకు చెందిన ధాత్రిక మండప (48)లు మహిళలు శ్రీలంకలోని తలైమినార్లో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి రామేశ్వరం ధనుస్కోడికి మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకున్నారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 10గంటల 10 నిమిషాలలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ఐదుగురు మహిళలకు కలిసి రామసేతువును ఈడదం ఇదే మొదటిసారి. ఈత నేర్చుకునేందుకు వెళ్లి.. ● అనంతలోకాలకు చిన్నారి ● మహబూబ్నగర్ జిల్లాలో ఘటన ● దిర్సంపల్లిలో విషాదం దోమ: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన కారవొని నాగేశ్కు ఏడేళ్ల బాలుడు శివకుమార్ ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం మహబూబ్నగర్ జిల్లా కొయిలకొండ మండలం కొత్లాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం పెద్దనాన్నతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అందరూ చూస్తుండగా శివకుమార్ బావిలోకి దూకాడు. ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో అక్కడే ఉన్న కొందరు గాలింపు చర్యలు చేపట్టారు. నీట మునిగిన బాలుడిని బయటికి తెచ్చారు. అప్పటికే శివకుమార్ చనిపోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాలిక బలవన్మరణం బంట్వారం: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోట్పల్లి మండలం నాగసాన్పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలికను ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో బాలిక రెండు రోజుల కిందట ఇంట్లోనే పురుగు మందు తాగింది. కుటుంబీకులు వెంటనే వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు సంగారెడ్డిలోని మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శైలజ తెలిపారు. -
ప్రాణం తీసిన చేపల వేట
● నీట మునిగి ఒకరి మృతి ● మరో యువకుడి గల్లంతు రాజేంద్రనగర్: హిమాయత్ సాగర్లో సరదాగా చేపల వేటకు వెళ్లి.. వలలు వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ఒకరు నీటిలో మునిగి మృత్యువాత పడగా.. మరొకరు గల్లంతయ్యారు. ఇంకొకరిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన ఆదివారం రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి హకీంపేట్ కాలనీకి చెందిన షాబాజ్ (24), సమీర్ (22), పీరంచెరువు ప్రాంతానికి చెందిన సల్మాన్ (22) స్నేహితులు. వీరు ముగ్గురు కలిసి ఆదివారం మధ్యాహ్నం ఆటోలో హిమాయత్ సాగర్కు వెళ్లారు. గేట్ల వద్ద ఉన్న నీటి గుంతలో వలలతో చేపలు పట్టసాగారు. నీటి లోతు తెలియని షాబాజ్, సల్మాన్, సమీర్ మరింత లోపలికి దిగారు. ఈత రాకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. సమీపంలో ఉన్నవారు గమనించి సమాచారం ఇవ్వడంతో రాజేంద్రనగర్ పోలీసులు చేరుకుని గజ ఈతగాళ్లతో వెతికించి సాయంత్రానికి షాబాజ్ మృతదేహాన్ని వెలికితీయించారు. సమీర్ను రక్షించారు. నీటిలో గల్లంతైన సల్మాన్ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. హిమాయత్ సాగర్లో చేపల వేటను పోలీసులు నిషేధించి.. హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. అయినా.. చేపల వేటకు అడ్డుకట్ట పడటంలేదు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
ట్యాంకర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
శంకర్పల్లి: ఆర్టీసీ బస్సు, యూ టర్న్ చేస్తున్న వాటర్ ట్యాంకర్ని బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటన మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు కథనం ప్రకారం.. మెహిదీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి శంకర్పల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. జన్వాడ గ్రామ శివారులోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద రాగానే.. ఓ వాటర్ ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటోంది. అతి వేగంతో ఉన్న బస్సు ట్యాంకర్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్ భాగం భారీగా దెబ్బతింది. డ్రైవర్ రవీందర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఫైర్ ఇంజన్ని పిలిపించారు. గ్యాస్ కట్టర్ సాయంతో క్యాబిన్ భాగాన్ని తొలగించి, డ్రైవర్ని బయటకు తీశారు. డ్రైవర్ కాలు విరగ్గా, కండక్టర్ ముక్కుకి, ప్రయాణికుడికి గాయాలయ్యాయి. అనంతరం వీరిని చికిత్స నిమిత్తం నార్సింగిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికుడికి గాయాలు -
ఇళ్లగణనలో బాధ్యతగా పాల్గొనాలి
ఇబ్రహీంపట్నం రూరల్: జనగణన మొదటి దశ ఇళ్ల జాబితా, ఇళ్ల గణన స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలు, అధికారులు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ సంగీతతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యావంతలు, ప్రజలు అందరూ స్వీయ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నారు. భారత ప్రభుత్వం జన గణన ప్రక్రియను రెండు దశల్లో చేపడుతోందని తెలిపారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన చేస్తారని చెప్పారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకు జనాభా గణన, కుల గణన ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి ఇళ్ల గణన స్వీయ నమోదు ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. ఇళ్లగణన కోసం మీ ఇంటి వద్దకు వచ్చే అధికారికి వివరాలు తెలియజేయాలని కోరారు. అధికారులకు సరైన సమాచారం ఇచ్చి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. నమోదు చేసిన వివరాలను స్క్రీన్షాట్ తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సెన్సస్ ఇన్చార్జి శిరీష, ఎన్నికల సెన్సస్ విభాగం అధికారి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
ఎయిర్పోర్ట్ పీఎస్
జీవో ఎప్పుడు..?ఎయిర్పోర్ట్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటై 14 నెలలు సాంకేతికంగా ఇంకా వేరుపడని వైనం ఒకే పీఎస్.. రెండు స్టేషన్ల కేసులు ప్రభుత్వ జీఓ విడుదలైతే పూర్తిస్థాయి ఠాణాగా ఏర్పాటు శంషాబాద్: ఏటా పెరుగుతున్న ప్రయాణికులు.. మరోవైపు విమానాశ్రయ విస్తరణ.. ఎయిర్పోర్ట్ అనుబంధ పరిశ్రమలు.. ప్రయాణికులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇలా ప్రతిరోజు లక్షకు పైగా జనాభాతో కిక్కిరిసిపోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శాంతిభద్రతలతో పాటు నేరాల నియంత్రణ కోసం ఎయిర్పోర్ట్లోనే గతేడాది మార్చి 1 ఆర్జీఐఏ పోలీస్ ఔట్పోస్టు స్టేషన్ను అప్పటి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రారంభించారు. పద్నాలుగు మాసాలుగా పోలీస్స్టేషన్ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నా దానికి పూర్తి స్థాయిలో పోలీస్స్టేషన్గా సాంకేతికంగా ఇంకా అనుమతి లభించలేదు. దీనికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల కావాల్సి ఉంది. 2008లోఆర్జీఐఏగా.. 2008 మార్చిలో 23 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. 2008 అక్టోబర్లో శంషాబాద్ పట్టణ కేంద్రంలో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్స్టేషన్ పేరుతో భౌగోళికంగా ఎయిర్పోర్ట్తో పాటు శంషాబాద్ పట్టణం, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్పహాడ్ రెవున్యూ ప్రాంతాన్ని కలిపి ప్రారంభించారు. విమానాశ్రయంలో వీఐపీల రాకపోకల బందోబస్తుతో పాటు నకిలీ పాస్పోర్టులు, వీసాలు, ఫేక్ సర్టిఫికెట్లు, ప్రమాదాలు ఇతరత్రా అనేక కేసులతో దర్యాప్తుతో పాటు పట్ణణానికి సంబంధించిన కేసుల దర్యాప్తు కూడా ఇక్కడే కొనసాగింది. గత నాలుగేళ్లుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణతో పాటు ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం కూడా రెట్టింప్పు అయ్యింది. దీనికి తోడు విమానాశ్రయంలో ఎరోసిటీ, అనేక ప్రత్యేక సెజ్లుగా ఏర్పాటు కావడంతో వివిధ రకాల కేసులు కూడా పెరుగుతువచ్చాయి. ఎయిర్పోర్ట్లో జరిగే ప్రతి చిన్న సంఘటనకు బాధితులు శంషాబాద్ పట్టణానికి చేరుకుని ఫిర్యాదు చేయడం భారంగా మారడంతో పోలీసులు కూడా ఉరుకులు.. పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక పోలీస్స్టేషన్ ఏర్పాటుకు మొగ్గుచూపి గతేడాది మిస్వరల్డ్ పోటీలకు ముందు ఎయిర్పోర్ట్లోనే ప్రత్యేక పోలీస్స్టేషన్ను ప్రారంభించింది. జీవో వస్తే.. బాధితుల నుంచి వెంటనే ఫిర్యాదులు స్వీకరించినా పట్టణంలో ఉన్న పోలీస్స్టేషన్ ద్వారానే నేటికి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. రెండు పోలీస్స్టేషన్ల కేసులు ఒకే పోలీస్స్టేషన్ సీరియల్ నంబర్లో కొనసాగుతున్నాయి. దీంతో సాంకేతికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. జీవో వస్తే సిబ్బంది సంఖ్య పెరిగితే పోలీసుల సేవలు కూడా మెరుగుపడే అవకాశముంది. మరిన్ని మార్పులు.. గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న శంషాబాద్ డీసీపీ జోన్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి మారింది. ప్రస్తుతం పట్టణంలో ఉన్న ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ శంషాబాద్ టౌన్ పోలీస్స్టేషన్గా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం హైదారాబాద్ నగరపాలక సంస్థలో ఉన్న అనేక ప్రాంతాలు కూడా ఇంకా శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నాయి. శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉంది. ఆర్జీఐఏ పోలీస్ ఔట్పోస్టు స్టేషన్కు జీవోతో పాటు, శంషాబాద్టౌన్గా ఏర్పాటు కానున్న ప్రస్తుత ఆర్జీఐఏ స్టేషన్కు భౌగోళిక మార్పుల కోసం పోలీసు అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు. -
హామీలన్నీ అమలు చేస్తాం
ఆమనగల్లు: ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రవాణ, బీసీ, సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానం వెళ్తున్న ఆయనకు ఆదివారం ఆమనగల్లు పట్టణంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా అన్ని రూట్లలో బస్సులను పెంచినట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థన మేరకు కల్వకుర్తి డిపోకు 20 కొత్త బస్సులు కేటాయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షాబుద్దీన్, వస్పుల శ్రీకాంత్, ఫరీద్, సురేశ్, అలీం తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
చెట్లను కొట్టేయొద్దు
● కేబీఆర్ పార్కు ఎదుట పర్యావరణవేత్తల ఆందోళన బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయంటూ పచ్చని చెట్లను కొట్టివేయడాన్ని తక్షణమే ఆపాలంటూ ‘సేవ్ కేబీఆర్’ సంస్థకు చెందిన ప్రకృతి ప్రేమికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణంలో భాగంగా 1942 చెట్లను కొట్టివేస్తున్నారని, ఇది హరిత హననం కిందకు వస్తుందని ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రీనరీని పెంచాలని, కాంక్రీట్ను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. వీరితో పాటు కేబీఆర్ పార్కు వాకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేబీఆర్ పార్కు ముందు ‘సేవ్ కేబీఆర్’ పేరిట ఆందోళన నిర్వహించారు. ప్రముఖ పర్యావరణవేత్త, సేవ్ కేబీఆర్ ప్రతినిధి కాజల్ గుప్తా మాట్లాడుతూ.. సహజసిద్ధ ఆక్సిజన్ కావాలంటే చెట్లను కాపాడాలన్నారు. బొంరాస్పేట: స్థానిక కవులు, సాహిత్య కృషిని వెలికి తీయడంలో వికారాబాద్ జిల్లా అనంత వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ వాగ్గేయకారుడు, జిల్లా ప్రముఖ కవి శ్రీ రాకమచర్ల వెంకటదాసు సంచికను ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పలువురు రాకమచర్ల సంకీర్తలను కీర్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి సంచికను ఆవిష్కరించారు. రాకమచర్ల సంకీర్తలను ప్రచారం చేయడంలో జిల్లా కవులు, రచయితల ప్రాత ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో అనంత వ్యవస్థాపకులు దోరవెటి చెన్నయ్య, అధ్యక్షుడు ఆశీర్వాదం, కార్యదర్శి కమలేశ్, ఉపాధ్యక్షుడు వడిచర్ల సత్యం, అనంత సభ్యులు రవూఫొద్దీన్, మధుసూదన్రావు, డాకన్న, సురేశ్, రమేశ్, మల్లికార్జున్, రవికృష్ణస్వామి, రామన్న తదితరులు పాల్గొన్నారు. -
గొప్ప సంఘ సంస్కర్త పోతులూరి
తాండూరు రూరల్: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్ప సంఘ సంస్కర్త అని శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మండలంలోని ఖాంజాపూర్ గుట్ట వద్ద విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందని కాలంలోనే స్వామివారు కాలజ్ఞానం ద్వారా భవిష్యత్ వాణి వినిపించారని కొనియాడారు. తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని పేర్కొన్నారు. కలియుగంలో జరిగే అనేక వింతలు, సామాజిక మార్పులు, విపత్తులను తన తాళపత్ర గంథాల్లో పొందుపరిచారని చెప్పారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తంరావు, శ్రీనివాసాచారి, ఎం.శ్రీనివాసాచారి, జయప్రసాద్, పులేందర్, యాదగిరి, పాండురంగాచారి, బాలకృష్ణ, వినోద్ కుమారాచారి, రమేష్, లక్ష్మణచారి, తిప్పన్నచారి తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మలకు అండగా ఉంటాం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి మండలి, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలకు అండగా ఉంటామన్నారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పంజుగుల విఠల్రెడ్డి అన్నారు. తన కుమారుడు పైలెట్ రోహిత్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విశ్వకర్మల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఖాంజాపూర్ గుట్ట వద్ద ఆలయ నిర్మాణానికి భూమిపూజ -
వాసవీమాతకు ప్రత్యేక పూజలు
మీర్పేట: అహింస ధర్మం ఆత్మ త్యాగానికి ప్రతీకగా ఆర్యవైశ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రోజు ఆలయాన్ని ప్రారంభించుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. వైశ్యులంతా ఐకమత్యంగా ఉండి ఏటా వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. మీర్పేట దీన్దయాల్నగర్లో నూతనంగా నిర్మించిన వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ, జయంతి వేడుకలకు ఆదివారం ఆమె హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. వాసవిమాత సంకల్పంతోనే దేవాలయ నిర్మించడం జరిగిందని, ఆ నిర్మాణంలో తన పాత్ర ఉండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్గుప్తా మాట్లాడుతూ.. ఆలయానికి భూమిని కేటాయించిన సబితారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాలాపూర్ మండలంలో పేద వైశ్య విద్యార్థుల చదువు కోసం విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తనవంతు సాయంగా రూ.50 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ తెరేటిపల్లి శ్రీనివాస్గుప్తా మాట్లాడుతూ.. ఆలయాన్ని నిత్యాన్నదాన కేంద్రంగా తీర్చడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి సురేష్గుప్తా, గందే వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్గుప్తా, మండల అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాస్గుప్తా పాల్గొన్నారు. -
బంగారు ఆభరణాల దొంగ అరెస్టు
ఆమనగల్లు: ఓ మహిళను రుణం ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాన్ని అపహరించిన దొంగ పోలీసులకు చిక్కాడు. ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామానికి చెందిన ముగురాల రాజేందర్గౌడ్ అలియాస్ రాజు అలియాస్ గోలి శివ పాత నేరస్తుడు. గతంలో వివిధ పోలీసు స్టేషన్లలో తొమ్మిమది కేసులు నమోదై ఉన్నాయి. ఈనెల 21న నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లకు చెందిన ఓ మహిళకు రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. తన బైక్పై ఎక్కించుకుని ఆమనగల్లు సమీపంలోని చింతలపల్లి సరిహద్దులో ఆమెను బెదిరించి మెడలో ఉన్న రూ.31 వేల విలువైన బంగారు ఆభరణాన్ని లాక్కున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఆమనగల్లు పట్టణంలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి సెల్ఫోన్, మోటార్బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
మూడుకు మూడే
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఉచిత బియ్యం పరేషాన్ పట్టుకుంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాలు డ్రై (బియ్యం నిల్వలేని)గా మారుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల కోటాను ఒకేసారి విడుదల చేయడంతో డ్రా చేసేందుకు లబ్ధి కుటుంబాలు తీవ్ర అగచాట్లు పడుతున్నాయి. మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బియ్యం అందుతాయో లేదోనని లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ దుకాణాలు అరకొర వసతులతో, ఇరుకైన గదుల్లో కొనసాగుతుండటంతో తగినంత స్టోరేజ్ సామర్థ్యం లేకపోవడంతో సమస్యగా తయారైంది. దీంతో పౌరసరఫరాల శాఖ బియ్యాన్ని దశలవారీగా పంపిణీ చేస్తోంది. లోడ్ వచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే స్టాక్ నిండుకోవడంతో షాపులను మూసి వేస్తున్నారు. అప్పటికే వచ్చిన బియ్యం ఖాళీ కావడంతో వేచి చూసిన లబ్ధిదారులు రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వస్తోంది. స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలియక, కార్డుదారులు షాపుల చుట్టూ నిత్యం చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. గడువు ముగింపు వేళ సందిగ్ధం ప్రస్తుత కోటా డ్రా చేయడానికి మరో మూడు రోజులే సమయం ఉండటంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది కార్డుదారులు రావడంతో షాపుల వద్ద రద్దీ పెరుగుతోంది. తమ కోటా సకాలంలో అందుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న లబ్ధిదారులు, దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. డీలర్లు కూడా అస్పష్ట సమాధానాలు ఇస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. ఎండల్లో ప్రజల ఇబ్బందులు తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా, తెల్లవారుజాము నుంచే రేషన్ కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా, చివరకు ‘స్టాక్ అయిపోయింది’ అనే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన మార్పులు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎండల్లో రేషన్ లబ్ధిదారుల పడిగాపులు ఉచిత బియ్యం పంపిణీలో అగచాట్లు తరచూ నిండుకుంటున్న కోటా ముంచుకొస్తున్న గడువు మిగిలింది ఇక మూడు రోజులే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు 21.46 లక్షల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు ఉచిత బియ్యం డ్రా చేసిన కుటుంబాల సంఖ్య 70 శాతం మించలేదు. మిగతా కుటుంబాలు కోటా డ్రా కోసం రేషన్ షాపుల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సాధారణంగా ప్రతి నెలా సుమారు 85 నుంచి 90 శాతం కుటుంబాలు సరుకులు డ్రా చేస్తుంటాయి. వివిధ కారణాలతో మిగతా 10 నుంచి 15 శాతం కోటా డ్రా కాదు. కేవలం మూడు రోజుల్లో సుమారు 15 నుంచి 20 శాతం వరకు లబ్ధి కుటుంబాలు ఉచిత కోటా డ్రా చేయాల్సి ఉంది. -
ట్రాఫిక్ నిలిపివేత.. హారన్ల మోత
మణికొండ: మండిపోతున్న ఎండలు.. ఆపై మిట్టమధ్యాహ్నం.. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధగంటకు పైగా వాహనాలను నిలిపివేయటంతో ప్రయాణికుల సహనం నశించింది. కొందరు కార్లలోంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం ఏంటంటే.. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్వాడలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పుప్పాలగూడ ఔటర్ టోల్గేట్తో పాటు మైహోం అవతార్ సర్కిల్లోనూ పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. పది నిముషాల్లోనే వేలాది వాహనాలు బారులుతీరాయి. అర్ధగంట పాటు నిలిపివేయడంతో కొందరు కార్లలోంచి దిగి వచ్చి వాగ్వాదానికి దిగారు. ‘ముఖ్యమంత్రి అయితే వారంలో మూడు, నాలుగు సార్లు తమను ఇబ్బందులకు గురిచేస్తారా? హెలికాప్టర్లో తిరగమనండి. లేదంటే సామాన్యుడిలా ట్రాఫిక్లో వెళ్లాలని చెప్పండి. మండుతున్న ఎండలో మమ్మల్ని ఇంతసేపు నిల్చోపెడతారా’? అంటూ నిలదీశారు. అంతలోనే సీఎం కాన్వాయ్ వస్తుండగా ఒక్కసారిగా హారన్లను మోగించి ఆయనకు వినిపించేలా నిరసన తెలిపారు. అనంతరం సీఎం కాన్వాయ్ వెళ్లిపోవటం, ట్రాఫిక్ జాం సమస్య సమసిపోయింది. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. సీఎం వస్తున్నారని ఎక్కడి వాహనాలు అక్కడే.. ఔటర్పై వాహనదారులనిరసన.. వాగ్వాదం తరచూ నరకయాతన పడుతున్నామని ఆవేదన -
బాధ్యతల స్వీకరణ
ఇబ్రహీంపట్నం రూరల్: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్కలెక్టర్గా పని చేశారు. జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం రూరల్: టీఎన్జీఓల సంఘం అర్బన్ యూనిట్ నూతన కమిటీ ఎన్నికను ఆదివారం నిర్వహించారు. పలుబాయి ఈశ్వర్ పర్యవేక్షణలో ఎన్నిక కొనసాగింది. అధ్యక్షుడిగా గోపాల్ నాయక్ (వ్యవసాయ శాఖ), కార్యదర్శిగా సాయితేజ (ట్రెజరీ), ఏంఏ ఫిరోజ్ (ఆడిట్ విభాగం), ఉపాధ్యక్షులుగా శ్రీపతికుమార్ (వ్యవసాయ శాఖ), రవి, జి.సాయికుమార్ (ట్రెజరీ), సంయుక్త కార్యదర్శిగా స్వాగ్యవతి (సీ్త్ర సంక్షేమశాఖ), ఆర్గనైజింగ్ సెక్రట్రీగా భిక్షపతి(రెవెన్యూ), ప్రచార కార్యదర్శిగా మల్లేష్ (గిరిజన సంక్షేమశాఖ), ఈసీ సభ్యులుగా బాలరాజు, శంకర్ రాథోడ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అడ్హక్ కమిటీ నాయకులు రంగయ్య, యశ్వంత్, శ్రీనివాస్, మాధవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ మానవత్వం చాటుకున్నారు. కందుకూరు మండలం మాలగూడూరు గ్రామానికి చెందిన బండి కరుణాకర్ ఆదివారం వ్యక్తిగత పనిమీద మీరాఖాన్పేటకు బైక్పై వచ్చి తిరుగుపయనమయ్యాడు. మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కరుణాకర్ను వెంటనే తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 108కు సమాచారం అందించగా మార్గమధ్యలో 108 వాహనం రావడంతో అందులో ఎక్కించి నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. అఫ్జల్గంజ్: మహాత్మాగాంధీ బస్టేషన్ ఆదివారం ప్రయాణికులతో కళకళలాడింది. ఆర్టీసీ మూడు రోజుల సమ్మె కారణంగా ఆగిపోయిన ప్రయాణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. బస్టేషన్ ఆవరణ లోని ప్లాట్ఫాంలు పూర్తిగా నిండిపోయాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ధారూరు: స్పీకర్ ప్రసాద్కుమార్ సతీమణి స్వర్గీయ గడ్డం శైలజా స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం మండల కేంద్రంలో సర్పంచ్ ప్రమీలగౌడ్ ప్రారంభించారు. ఇరుజట్ల తరఫున ఎస్ఐ రాఘవేందర్ టాస్ వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత అన్ని క్రీడల్లో పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వ కిరణ్కుమార్, లింగనపల్లి అశోక్ ముదిరాజ్, టీ మల్లేశం, బుజ్జయ్య గౌడ్, సంగమేశ్వర్, పంచాయతీ వారు సభ్యులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ప్రెస్క్లబ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
పంజగుట్ట: చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యాన్సర్ విషయంలో టెస్టులే కీలకమని ప్రెస్క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి రమేష్ వరికుప్పల అన్నారు. ప్రెస్క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం జర్నలిస్టులకు, వారి కుటుంబాల కోసం బసవతారకం ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 150 మందికి పైగా జర్నలిస్టులు ఈ పరీక్షలు చేయించుకున్నారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఎఫ్ఐఈఎఫ్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక వెంగళరావునగర్: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా లింక రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా వెల్లంకి శ్రీనివాస్ విజయం సాధించారు. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి వల్లభనేని అనిల్కుమార్, చిట్టినేని కిశోర్బాబులు పోటీ చేశారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి అమ్మిరాజు కనుమిల్లి, లంక రాజేంద్రప్రసాద్, పేర్ని రాంబాబు, కోశాధికారి పదవికి జి.భీముడు(శ్రీకాంత్), వెల్లంకి శ్రీనివాస్కుమార్లు పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారు రెండేళ్ళ పాటు (2026–28) తమ పదవుల్లో కొనసాగుతారని చౌదరి తెలియజేశారు. -
రైతు సంక్షేమమే ధ్యేయం
ఇబ్రహీంపట్నం రూరల్: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలోని దండుమైలారం, ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసాలకు గురికాకుండా ప్రభుత్వ మద్దతుతో నేరుగా ధాన్యం విక్రయించే అవకాశం కల్పిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, కౌన్సిలర్ ఆకుల యాదగిరి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, వ్యవసాయ శాఖ అధికారి విద్యాధరి, ఐకేపీ అధికారి సత్యనారాయణ, దండుమైలారం సర్పంచ్ నరేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
విన్యాసం..అద్భుతం
గచ్చిబౌలి: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం అరుదైన అంతర్జాతీయ ఘనతకు వేదికై ంది. కరాటే రంగంలో తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 1,212 మంది క్రీడా కారులు ప్రదర్శన ఇచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. జయంత్రెడ్డి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, విజన్ మార్షల్ ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలో 1,212 మంది కరాటే క్రీడాకారులు అత్యంత క్రమశిక్షణతో, ఏకదాటిగా తమ విన్యాసాలను ప్రదర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా సుమారు 10 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ ఫీట్లో భాగస్వాములయ్యారు. ఈ తక్కువ సమయంలో లక్షలాది పంచులు, బ్లాక్స్ నమోదయ్యాయి. గతంలో ఉన్న 8 నిమిషాల రికార్డులను అధిగమిస్తూ ఇంత భారీ సంఖ్యలో క్రీడాకారులు ఏకతాటిపైకి వచ్చి ఈ ఘనత సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి స్వప్నిల్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులకు ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా అందజేశారు. గ్రాండ్ మాస్టర్ జయంత్రెడ్డి, విఠల్, సుమన్ పాల్గొన్నారు. 10 రాష్ట్రాలు.. 11 నిమిషాలు.. 1,212 మంది క్రీడాకారులు గిన్నిస్ వరల్డ్ రికార్డులో కరాటే ప్రదర్శన -
డీజే నిర్వాహకులపై కేసు నమోదు
కేశంపేట: ఎలాంటి అనుమతులు లేకుండా డీజే నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ.. మండల పరిధిలోని చౌలపల్లి గ్రామానికి చెందిన ముష్రఫ్ తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన శివ (డీజే యజమాని) వద్ద పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మండల పరిధిలోని నిర్థవెళ్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా డీజేతో నృత్యాలు చేస్తూ అధిక శబ్దాలతో హోరెత్తిస్తుండగా గ్రామస్తులు డయల్ 100కు కాల్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి డీజేను సీజ్ చేశారు. య జమాని శివ, నిర్వాహకుడు ముష్రఫ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరహరి తెలిపారు. బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలు షాద్నగర్రూరల్: ట్రాక్టర్ అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బుర్ల ఇసాఖ్ వసంత దంపతులు తమ కుమారుడు యశ్వంత్, కుమారై అవనీకతో కలిసి ఆదివారం బైక్పై చర్చికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా హాజిపల్లి రోడ్డులో వెనుకనుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుర్ల ఇసాఖ్ వసంత, కుమారై అవనీకకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వసంత తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రణయ్ తెలిపారు. దూసుకొచ్చి ఢీ కొట్టినలారీ.. వ్యక్తి మృతి బాలానగర్: బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాదాచారిని ఢీకొట్టడంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలానగర్ నుంచి వై జంక్షన్ వైపు వెళుతున్న ఓ లారీ ఇందిరానగర్ యూటర్స్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతుడు ఇందిరానగర్ నివాసి బానోత్ కిషన్ (45)గా గుర్తించారు. బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
రాజకీయ కక్షతో సర్పంచ్పై దాడి
కొందుర్గు: సర్పంచ్పై దాడి జరిగిన సంఘటన జిల్లేడ్ చౌదరిగూడు మండలం పద్మారంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారం శివారులో ఈదమ్మ జాతరలో ఊరేగింపు నిర్వహిస్తుండగా ఓ ఎద్దుల బండి బోల్తా పడింది. దీంతో ఎల్కగూడ సర్పంచ్ బందయ్య బండ్లను మెల్లగా తోలండి, దెబ్బలు తగులుతాయని సూచించారు. ఇదే అదునుగా కొందరు యువకులు బందయ్యతో వాదించి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గమనించిన స్థానికులు సర్పంచ్ను చికిత్స నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అటునుంచి మెరుగైన చికిత్సకు శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా తమ వర్గానికి చెందిన వ్యక్తి సర్పంచ్గా ఓడిపోయాడని అక్కసుతో గ్రామానికి చెందిన రాంరెడ్డి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యే పరామర్శ జాతరలో పాల్గొనేందుకు గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానికులతో విషయం తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి బందయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గొడవకు గల కారణాలు తెలుసుకొని, బందయ్యపై దాడి చేసిన నిందితులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి
అబ్దుల్లాపూర్మెట్: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ.శ్రీనివాస్ కోరారు. శనివారం ఆయన సంఘం నాయకులతో కలిసి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఓపీఎస్లను జేపీఎస్లుగా మార్చాలని, జేపీఎస్లను నాలుగు సంవత్సరాల సర్వీస్ను నోషనల్ సీనియారిటీ కలిపించడంతో పాటు ఈ నెల 5వ తేదీన నిర్వహించిన కార్యదర్శుల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించిన కార్యదర్శుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మధుసుధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సతీశ్కుమార్, మహిళా ఉపాధ్యక్షులు వాణి, కవిత, కోశాధికారి పండరినాథ్, నాయకులు హరి నాయక్, మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సురేశ్, ప్రవీణ్, రాజేశ్గౌడ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్కు నాయకుల వినతి -
వృద్ధురాలి మెడలోనుంచి బంగారు గొలుసు చోరీ
ఇబ్రహీంపట్నం రూరల్: వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గోదాసు జంగయ్య, యశోద అనే వృద్ధ దంపతులు కొంగరకలాన్ డివిజన్లోని ఎస్బీఐ పక్కన నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి భోజనం చేసి, నిద్రకు ఉపక్రమించారు. వీరు ఉంటున్న గదికి కిటికీ తలుపు, గ్రిల్స్ లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి దూరారు. నిద్రపోతున్న యశోద (70) మెడలోని బంగారు లాక్కుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. చోరీ అనంతరం పక్కనే ఉన్న పొలాల నుంచి పారిపోయినట్లు గుర్తించారు. -
సమ్మె సఫలం.. కదిలిన ప్రగతి చక్రం
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు ఫలప్రదం కావడంతో శనివారం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద సంబురాలు జరుపుకొన్నారు. డిపో మేనేజర్ సుజాత, ఆర్టీసీ జేఏసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఈ సందర్బంగా కార్మికులు గేట్ మీటింగ్ పెట్టుకుని సమ్మెలో పాల్గొన్న వారికి, మద్దతునిచ్చిన వారందరికి, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న ప్రభుత్వానికి ఽకృతజ్ఞత తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సంబురాలుసీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న డీఎం సుజాతముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి కార్మికుల క్షీరాభిషేకం -
ట్రాఫికర్
మొయినాబాద్: స్థానికంగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్య తీవ్రమైంది. రహదారికి ఇరు పక్కల వాణిజ్య సముదాయాలు(షాపులు) ఉన్నాయి. కానీ ఆ షాపుల ముందు మాత్రం సరైన పార్కింగ్ స్థలాలు లేవు. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని సైతం యజమానులు చిన్న చిన్న బండి కొట్లు పెట్టడానికి అద్దెకు ఇస్తున్నారు. దీంతో షాపులకు, బండి కొట్ల వద్దకు వచ్చినవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపి వెళ్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే విధంగా హిమాయత్నగర్ చౌరస్తా నుంచి అజీజ్నగర్ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్, టైల్స్ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ట్రేడ్ లైసెన్స్లపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. దీంతో రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, వ్యాపార సముదాయాల ముందు ఖాళీ స్థలం ఎంత ఉంది. పార్కింగ్ స్థలం ఉందా అనే విషయాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ముందు ఉన్న స్థలాన్ని కబ్జాచేసి వాటిలో బండికొట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వారి వద్ద రోజు లెక్క అద్దెలు వసూలు చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. షాపుల ముందు అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. గత పదకొండు నెలలుగా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీఐపీ రూట్ అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిని వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించారు. సీఎం కొడంగల్ వెళ్లాలంటే ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా శాస న సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తన నియోజకవర్గం వికారాబాద్కు వెళ్లాలన్నా ఇదే రూట్లో వెళ్లాలి. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికా రాబాద్ వెళ్లి వస్తూ ఉంటారు. అందుకే పోలీసులు వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించారు. కానీ అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవడం లేదు. చలాన్లు వేయడమే విధి ట్రాఫిక్ పోలీసులు మొయినాబాద్ మాత్రం ఫొటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నిత్యం ట్రాఫిక్ జాం అవుతున్నా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేయకుండా రోడ్డు పక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి వేలకు వేలు చలాన్లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ నిత్యం ట్రాఫిక్ జాం షాపులు, హోటళ్ల ముందు లేని పార్కింగ్ రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు పట్టించుకోని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నాం మొయినాబాద్లో షాపుల ముందు సామాన్లు పెట్టినా, బండికొట్లు పెట్టినా వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశాం. మరోసారి తాఖీదులు ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెడతాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్ సమస్య వస్తుంది. ట్రాఫిక్ జాం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సతీష్, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల -
సవరణకు సై
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ వాల్యూకు.. బహిరంగ మార్కెట్లోని భూముల విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను సవరించాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతం, భూ స్వరూపం, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, బహిరంగ మార్కెట్లో ఆయా భూములు, ఇళ్లకు ఉన్న డిమాండ్ ఆధారంగా వ్యాల్యూను సవరించనున్నారు. ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నార్సింగి, కోకాపేట్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో వంద శాతానికిపైగా పెరిగే అవకాశం లేకపోలేదు. రూరల్ ఏరియాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం లేకపోలేదు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కదలిక.. ఔటర్ రింగ్రోడ్డు లోపల 39 సబ్రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వీటిలో నెలకు సగటున 21వేల నుంచి 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.350 నుంచి రూ.360 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రభుత్వానికి వస్తున్న ఇన్కమ్లో అపార్ట్మెంట్ల నుంచి 35శాతం, ఓపెన్ ప్లాట్ల నుంచి 23శాతం, ఇళ్ల నుంచి 20శాతం సమకూరుతోంది. అయితే ఒక్కో ఎస్ఆర్ఓ పరిధిలో భూముల ధరలు ఒక్కో విధంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే.. ప్రభుత్వ మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉంది. ఈ హెచ్చుతగ్గులను సరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2021లో భూముల మార్కెట్ విలువను 20శాతం పెంచుతూ అప్పటి ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2022లో 33 శాతం పెంచింది. తాజాగా మరోసారి భూ విలువను సవరించేందుకు సిద్ధమైంది. మార్కెట్ వాల్యూ శాసీ్త్రయంగా ఉండాలని ఓ ప్రైవేటు ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. భూముల మార్కెట్ విలువ పెంపునకు కసరత్తు జిల్లాలో 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం మే నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం మరింత గడువు కావాలంటున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ గచ్చిబౌలిలో అపార్ట్మెంట్కు సంబంధించి చదరపు అడుగు ధర ప్రస్తుతం రూ.3,000 ఉంది. దీన్ని కనీసం 60 శాతం (రూ.4,800) పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. నార్సింగి, మణికొండ, రాయదుర్గం, నానక్ రాంగూడ, కోకాపేట్, తదితర ప్రాంతాల్లోని వ్యాణిజ్య భూములు బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.వంద కోట్లకు పైనే పలుకుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లోని భూ విలువ ఆధారంగా ప్రధాన రోడ్ల వెంట గజం ధరను రూ.లక్ష వరకు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక మహేశ్వరంలో పుస్తక విలువ రూ.2,100 మాత్రమే ఉంది. అదే వాణిజ్య స్థలం విలువ రూ.10,200 ఉంది. ఇలాంటి చోట్ల రూ.2,100 ఉన్న విలువను కనీసం రూ.3,800 నుంచి రూ. 4,500 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. సవరించిన ఈ ధరలు మే మొదటి వారం నుంచే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుండగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం మాత్రం మరికొంత గడువు కావాలని కోరుతోంది. -
ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన సాగు
ఆమనగల్లు: రైతు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లురవి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. శనివారం ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను, మండల పరిధిలోని శంకరకొండతాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. శంకరకొండతాండాలో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సర్పంచ్ మండ్లి రాములు ఆధ్వర్యంలో గిరిజనుల సంప్రదాయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయా చోట్ల జరిగిన సభలలో ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు గణనీయంగా పెరిగిందని రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. కల్వకుర్తి అభివృద్ధే ధ్యేయం కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని చెప్పారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన వివరించారు. నియోజక వర్గంలో దాదాపు రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్గౌడ్, పీసీబీ సభ్యులు బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, మాజి వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, హౌసింగ్ డీఏ శైలజ, ఎంపీడీఓ మాధురి, ఏఈ శాలిని, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు వెంకటయ్య, మహేశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జగన్, మానయ్య, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. కడ్తాల్: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం వారు మండల కేంద్రంతో పాటు మక్తమాదారం గ్రామంలో పర్యటించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్, పలువురు లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ నందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా మక్తమాధారం గ్రామంలో పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతి, ఉప సర్పంచ్ యాదగిరిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి,, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ నాయకులు బాలరాజు, చందోజీ, రాఘవేందర్, రవి, షాబుద్దీన్, రాజేశ్, శ్రీకాంత్, అశోక్, కృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి -
మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం
కలెక్టర్ నారాయణరెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మే 10 వరకు కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ విధిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ కార్యాలయం(ఓఆర్జీఐ)హెచ్ఎల్ఓ జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయగణ నకు అవకాశం ఇచ్చిందన్నారు. స్వీయగణన చేసుకోవచ్చు ఇలా ముందుగా జనగణన అధికారిక (https:// se. census. gov. in) వెబ్సైట్కి వెళ్లాలి. కొత్త యూజర్గా రిజిస్టర్ అవ్వాలి. మీ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత కుటుంబ వివరాలు నమోదు చేయాలి. ఇంటి చిరునామా సహా కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటి రకం, సౌకర్యాలు (నీరు, విద్యుత్ మొదలైనవి). వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఇందులో పేరు, వయస్సు, లింగం, విద్య, ఉద్యోగం, వివాహ స్థితి, భాష, మతం వంటి అంశాలను నమోదు చేయాలి. ఆ తర్వాత నమోదు చేసిన వివరాలు మళ్లీ చెక్ చేసి సబ్మిట్ చేయాలి. ఎంటర్ చేసిన సమాచారాన్ని ఒకసారి చెక్ చేసి, ఫైనల్గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక అకనాలెడ్జ్మెంట్/రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీన్ని జాగ్రత్తపరుచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు సమాచారం ఇవ్వకూడదు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం కుదరదు. ● వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు నియమాలు తప్పనిసరి ● ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ స్నేహ యాచారం: ఫ్యూచర్సిటీ కింద గుర్తించిన ప్రాంతంలో నింబంధనల ప్రకారమే వెంచర్లు, ఇంటి నిర్మాణాలను చేపట్టాలని, ఆ విధంగా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించాలని ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ స్నేహ అన్నారు. శనివారం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో నింబంధనల అమలుపై వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్యూచర్సిటీతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ విధంగానే అనుమతులు పొందాల్సి ఉంటుందని చెప్పారు. ఫ్యూచర్సిటీ విలీన గ్రామాల్లో నింబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. అథారిటీ పరిధిలో నింబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఓ లక్ష్మీనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: డీజీపీ హోదాకు పదోన్నతి పొందిన సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
అండర్పాస్ ఏర్పాటుకు వినతి
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ రహదారి విస్తరణలో ఖానాపూర్ గేట్ వద్ద అండర్పాస్ నిర్మించాలని నాంచేరి సర్పంచ్ అశోక్, నాయకులు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శనివారం వారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైవే విస్తరణలో రోడ్డు ఎక్కువ ఎత్తులో నిర్మిస్తుండడంతో గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పాడుతాయన్నారు. ఖానాపూర్ గేట్ వద్ద అండర్పాస్ ఏర్పాటు చేస్తే ఖానాపూర్, నాంచేరి, దేవరంపల్లి, రేగడిఘనాపూర్, ఇంద్రారెడ్డి నగర్ గ్రామాలకు వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కేంద్రం ప్రభుత్వం, నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి అండర్పాస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆయన సానుకులంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, నాయకులు జైశంకర్గౌడ్, సాయిరాంగౌడ్, రాజలింగంగౌడ్, శ్రావణ్గౌడ్, వర్షవర్ధన్గౌడ్, గ్రామస్తులు, మండల నాయకులు ఉన్నారు. -
శాంతి వర్దిల్లినప్పుడే అభివృద్ధి
మోమిన్పేట: ప్రపంచంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సంస్థలు శాంతిని కాపాడటంలో కీలకంగా మారాయన్నారు. నేడు కొన్ని దేశాలు యుద్ధం చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి వర్ధిల్లినప్పుడే దేశాల అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం అన్ని దేశాలపై పడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అఖిల భారత శాంతి సంఘీభావ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరేందర్రెడ్డి, శుభప్రద్పటేల్ నాయకులు నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
మొయినాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం ప్రాంతానికి చెందిన మోలా హృదయ రాజు(58) పెద్దమంగళారంలో ఉంటూ కోఠిలోని సీపీడబ్ల్యూడీ(సెంటర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్)లో ఉద్యోగం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వస్తుండగా రాత్రి 7:30 గంటలకు మొయినాబాద్లోని జేబీఐటీ కళాశాల వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయాలు కాగా, కుడిచేయి విరిగింది. వెంటనే చికిత్సకోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వేడి నీటి సంపులో పడి వలస కార్మికుడి మృతి షాద్నగర్: వేడి నీటి సంపులో పడి ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం నందిగామ మండలం వీర్లపల్లి శివారులోని జాగృతి స్టీల్ పరిశ్రమలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండ్లా జిల్లా గౌరాచావర్ తాలుకా ముర్లిటోల గ్రామానికి చెందిన ఉమేశ్(27) కొంత కాలం క్రితం నందిగామకు వలస వచ్చి జాగృతి స్టీల్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. పరిశ్రమల్లో తయారైన ఇనుప చువ్వలను చల్లార్చడానికి వాడిన నీటిని సంప్లోకి వదులుతున్నారు. ఆ సంపులో నీరు వేడిగా ఉంటాయి. శనివారం ఉదయం విధుల్లోకి వెళ్లిన ఉమేశ్ సంప్ వద్దకు వెళ్లిన క్రమంలో ప్రమాదశాత్తు అందులో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పరిశ్రమ యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, సంపు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతోనే కార్మికుడు మృతి చెందినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
కొత్త కమిషనర్లొచ్చారు
తొందరపాటు నిర్ణయాలొద్దు ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు.మల్కాజిగిరి పోలీసు బాస్గా సుమతి ‘ఫ్యూచర్’ సీపీగా తరుణ్జోషి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో తొలిసారిగా పోలీసు విభాగంలో ఓ మహిళ పోలీసు బాస్గా నియమితులయ్యారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్గా ఉన్న 2006 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి బడుగుల సుమతి మల్కాజిగిరి పోలీసు కమిషనర్గా నియమితులయ్యారు. ఇక్కడి సీపీ అవినాష్ మహంతి బదిలీ అయ్యారు. ఆయనను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కు వెళ్లారు. రాష్ట్రానికి చెందిన మావోయిస్టు కీలక నేతలు లొంగుబాటు వ్యవహారంలో ఐజీ సుమతి కీలకంగా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపును పొందారు. అగ్ర కమాండర్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ సహా 591 మందికి పైగా మావోయిస్టు నాయకులు లొంగిపోయిన ప్రక్రియలో సుమతి కీలక పాత్ర పోషించారు. 2001లో సంయుక్త ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా వృత్తిని ప్రారంభించిన సుమతి.. వరంగల్లో తొలి పోస్టింగ్.. ఆ తర్వాత 2006లో కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారిణిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా, సీఐడీ మహిళా రక్షణ సెల్ డీఐజీగానూ సమర్థంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) హోదాలో ఉన్నారు. సుమతి స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగోట్ల. సాక్షి, సిటీబ్యూరో: ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనర్గా డాక్టర్ తరుణ్జోషి నియమితులయ్యారు. 2004 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఇక్కడ కమిషనర్గా పని చేసిన జి.సుధీర్బాబు ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తరుణ్ జోషిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్కు చెందిన తరుణ్ జోషి పటియాలలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేశారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణులై ఉమ్మడి ఏపీ కేడర్లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. 2014–2016 వరకు ఆదిలాబాద్ ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏసీబీ డైరెక్టర్ గా, రాచకొండ సీపీగా పని చేశారు. విధులు నిర్వర్తిస్తూనే ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తున్నారు. ఇప్పటికే ఓయూ నుంచి పోలీసు మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్ఎల్బీలో చేరిన ఆయన ఓయూలోనే టాప్ ర్యాంకర్గా నిలిచారు. పర్వతారోహణాన్ని హాబీగా మార్చుకున్నారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్ను అధిరోహించారు. ఇలా ఇప్పటి వరకు ఆయన పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించారు. -
పిలుస్తోంది దోస్త్
షాద్నగర్: విద్యార్థి దశలో డిగ్రీ విద్య కీలకం.. ఏటా కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నిర్వహిస్తున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవల ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి విడతకు సంబంధించి ఈనెల 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. పాలమూరు వర్సిటీకి అనుబంధంగా.. షాద్నగర్ పట్టణంలో పాలమూరు వర్సిటీకి అనుబంధంగా అధునాత వసతులతో విశాలమైన స్థలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించారు. స్మార్ట్ తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, తాగునీటి ప్లాంట్, సోలార్ ప్లాంట్, ఇంటర్నెట్ సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, బొటానికల్ గార్డెన్, కంపోస్టు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. కళాశాలను సందర్శించిన న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) బృందం కళాశాలకు బీ ప్లస్ గ్రేడ్ను కేటాయించారు. కోర్సులు ● బీఏ ఇంగ్లిష్, తెలుగు మీడియం ● సీడీసీఎస్ విధానం ప్రకారం బీఏ గ్రూపులో ఆర్ట్స్ సబ్జెక్టులతో పాటుగా కంప్యూటర్ సైన్స్, మాథ్యమెటిక్స్ బోధిస్తున్నారు. ● బీఎస్సీ లైఫ్ సైన్సెస్లో బొటనీ, జువాలజీ, సబ్జెక్టులతో పాటుగా కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సెరీకల్చర్ ● బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ ● ఈ విద్యా సంవత్సరం నుంచి ఉద్యోగ భద్రత కల్పించేందుకు గాను ఇంటర్న్షిప్ సౌకర్యంతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టారు. ● బీకాం రిటైల్ ఆపరేషన్, బీఎస్సీ హెల్త్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి. ఇంటర్న్షిప్ కాలంలో స్టైఫండ్ ఇవ్వనున్నారు. సులభంగా రిజిస్ట్రేషన్ ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు తమ హాల్ టికెట్ నంబర్తో దోస్త్ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సెల్ఫోన్కు వచ్చి పిన్ దోస్త్ ఐడీ ఆధారంగా సంబంధిత పోర్టల్లో లాగిన్ కావాలి. ఆసక్తి ఉన్న కోర్సును, కళాశాలను ఎంపిక చేసి ఐచ్చికాన్ని నమోదు చేయాలి. సీట్ల కేటాయింపు తర్వాత ఆన్లైన్లోనే రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అనంతరం నిర్ణీత తేదీల్లో కళాశాలల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. కావాల్సిన పత్రాలు ప్రవేశాలు పొందే విద్యార్థులు ముందుగానే అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇంటర్ మార్కుల మెమోతో పాటుగా 1 నుంచి 10వ తరగతి వరకు బోన్ఫైడ్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, అదనపు విద్యార్హతలుంటే సంబంధిత పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తొలివిడత వెబ్ ఆప్షన్స్ 30 నుంచి.. సీట్ల కేటాయింపు మే 14న ఈ ఏడాది నుంచి ఇంటర్న్షిప్తో కూడిన కోర్సులు రిజిస్ట్రేషన్ తేదీ రుసుము వెబ్ఆప్షన్స్ సీట్ల కేటాయింపు ఫేజ్–1 ఏప్రిల్ 15 – మే 7 రూ.200 ఏప్రిల్ 30– మే 8 మే 14 ఫేజ్–2 మే 15 – మే 25 రూ.400 మే 15 – మే 26 మే 30 ఫేజ్–3 మే 31 – జూన్ 15 రూ.400 మే 31 – జూన్ 16 జూన్ 20 -
అధునాతన వసతులు
షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అధునాతన వసతులు కల్పించాం. విశాలమైన మైదానం ఉన్న కళాశాలలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. – శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షాద్నగర్ డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కళాశాలలో అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్న్షిప్తో కూడిన కోర్సులు ప్రవేశపెట్టారు. – డాక్టర్ కమల, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షాద్నగర్ -
ఎండలకు జాగ్రత్తలు తప్పనిసరి
● మూడు రోజుల్లో పెండింగ్ బకాయిలు ● డీఆర్డీఓ శ్రీలత యాచారం: కూలీలు ఎండలకు జాగ్రత్త.. పనులు చేసే చోట నీడ, పనులకు వెళ్లేటప్పుడు సరిపడా తాగునీరు తీసుకెళ్లాలని డీఆర్డీఓ శ్రీలత ఉపాధి కూలీలకు సూచించారు. శుక్రవారం ఆమె గ్రామంలో కూలీలు పనిచేసే ప్రదేశాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండలకు పనులు చేయడం కష్టంగా ఉందని, పనులు చేసినా సకాలంలో బకాయిలు రాక పస్తులుంటున్నామని చెప్పారు. ఇందుకు స్పందించిన డీఆర్డీఓ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ బకాయిలు రెండు, మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఎండల తీవ్రత పెరగుతున్నందున కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలని, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, వడదెబ్బ తగిలితే వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతి కూలీ వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని, ఉదయం, సాయంత్రం పనులు చేయిస్తే కూలీలకు ఇబ్బంది ఉండదని వివరించారు. కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ఈజీఎస్ నర్సరీని సందర్శించి మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, యాచారం సర్పంచ్ మస్కు అనితశరణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
భరోసగమే!
వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడి చిన యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి. మిగిలిన వారికి ఎప్పుడో.. జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. ముంచుకొస్తున్న ఖరీఫ్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు. నత్తనడకన సాగు సాయం రెండు విడతల్లో.. అందింది రెండెకరాలకే ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు -
సమ్మెకు విపక్షాల మద్దతు
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాలు, పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇబ్రహీంపట్నం బస్ డిపోలోని సుమారు 50 అద్దె బస్సులు శుక్రవారం నడిచాయి. కండక్టర్లు లేకుండానే సగానికిపైగా బస్సులు రోడ్డెక్కాయి. సమ్మె కారణంగా డిపో ఆదాయం గణనీయంగా పడిపోయింది. శంకర్గౌడ్కు నివాళి సమ్మెతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్కు కార్మికులు నివాళి అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ర్యాలీని నిర్వహించారు. శంకర్గౌడ్ కుటుంబానికి తక్షణమే ఆర్థికసాయం అందించాలని జేఏసీ నేతలు యాదగిరి, శ్రీశైలం, అంజయ్య, టీఎస్రెడ్డి, కృష్ణ, జంగయ్య తదితరులు డిమాండ్ చేశారు. హామీల అమలులో విఫలం: మాజీ ఎంపీ సమ్మెలో ఉన్న కార్మికులకు సంఘీభావంగా మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్యగౌడ్ డిపో వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం కావడంతోనే కార్మికులు మనస్తాపం చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తవారిని రిక్రూట్ చేసి బస్సులను నడపాలనుకుంటే.. కొత్త సీఎంను రిక్రూట్ చేయాల్సివస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్, సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్యామల, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.మహేందర్, రాఘవేంద్రస్వామి, విజయ్, నారాయణయాదవ్, టి.రాంరెడ్డి తదితరుల పాల్గొన్నారు. కార్మికులకు సంపూర్ణ మద్దతు: సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య సమస్యలు పరిష్కరం అయ్యేంత వరకు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. కాంగ్రెస్ నియంతృత్వధోరణిని విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సామెల్, నర్సింహ, కిషన్, జగన్, బుగ్గరాములు, పి.కృష్ణ, శారద, సత్తన్న తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భవాని శేఖర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులసై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ జేఏసీ నాయకులు ప్రదీప్, భాస్కర్, యాదగిరి, శ్రవణ్, భరత్, వినోద్, సురేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. కండక్టర్లు లేకుండానే నడుస్తున్న అద్దె బస్సులు -
అధునాతన బస్ షెల్టర్కు శ్రీకారం
● నక్కలపల్లిలో రీసైకిల్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ ● భూమిపూజ చేసిన లయన్స్ క్లబ్ నేతలు మొయినాబాద్ రూరల్: ప్రజలకు ఉపయోగపడేలా పర్యావరణ హితమైన రీసైకిల్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షురాలు రామసుందరి, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఎల్.శ్రీనివాస్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీసతీష్ అన్నారు. నక్కలపల్లి పంచాయతీ అభ్యర్థన మేరకు కేజీరెడ్డి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్తో ఇందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బస్ స్టాప్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యర్థాల సేకరణ డ్రైవ్లో భాగంగా సేకరించిన ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి బస్ షెల్టర్ నిర్మాణానికి వినియోగిస్తున్నామని స్పష్టంచేశారు. ఇది 500 సంవత్సరాల వరకు మన్నేలా, 240 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను తట్టుకునేలా తయారు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా కేవలం చర్లపల్లి జైలులో మాత్రమే ఇలాంటి బస్ షెల్టర్ ఉందన్నారు. దీని నిర్మాణానికి సుమారు రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, కె.నాగేశ్వరి, కె.కరుణ, సాయిసత్య నారాయణరెడ్డి, విజ్ఞాన్ కళాశాల చైర్మన్ సతీష్, డాక్టర్ పి.సంయుక్త, బి.లింగం, గ్రామ సర్పంచ్ మంగళారం యాదయ్య, ఉప సర్పంచ్ గౌండ్ల నిరంజన్గౌడ్, వార్డు సభ్యులు మల్లేశ్, జీవన్, రవీందర్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు గౌరీ రవి, శ్రీకాంత్, భానుకుమార్, నవీన్, రమేష్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
తొందరపాటు నిర్ణయాలొద్దు
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. సమ్మె కారణంగా పలు చోట్ల కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నం డిపోలో కార్మికులు, నాయకులకు పలు సూచనలు చేశారు. శాంతియుతంగా సమ్మెలో పాల్గొనాలని, ఎట్టి పరిస్థితిలోనూ క్షణికావేశానికి లోను కావొద్దని సూచించారు. ఆవేశానికి లోనయ్యే కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా చూడాలని జేఏసీ నేతలకు సూచించారు. అతనితోపాటు ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్, మధు, డీవీఎం శంకర్నాయక్, డీఎం సుజాత, ఎస్ఐ చందర్సింగ్ ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు డీసీపీ సూచన -
గిన్నిస్ రికార్డ్ కరాటే ప్రదర్శనకు విద్యార్థుల ఎంపిక
మీర్పేట: నగరంలో ఈనెల 26న నిర్వహించనున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే ప్రదర్శనకు జిల్లెలగూడ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ద టెంపుల్ ఆఫ్ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ దాసరి జితేందర్కుమార్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ జైపాల్రెడ్డి, డైరెక్టర్ సురేష్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసూన తదితరులు అభినందించారు. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ సీఐ చొరవతో సద్దుమణిగిన వివాదం యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొండాపురం బాబయ్య ఓ భూ వివాదంలో తన కుటుంబ సభ్యుల నుంచి రావాల్సిన డబ్బులు అందడం లేదని, వెంటనే ఇప్పించాలని గ్రామంలోని సెల్టవర్ ఎక్కాడు. తనవారి నుంచి డబ్బులు ఇప్పిస్తేనే కిందికి దిగుతానని, లేదంటే దూకుతానని హెచ్చరికలు చేశాడు. సమాచారం అందుకున్న యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి అతనితో మాట్లాడారు. సీఐ హామీతో బాబయ్య సెల్టవర్ దిగివచ్చాడు. అతన్ని పీఎస్కు తీసుకెళ్లిన సీఐ బాబయ్య కుటుంబ సభ్యులను పిలిపించి డబ్బులు ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది. సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని బాబయ్యను మందలించి, ఇంటికి పంపించారు. చెట్టును ఢీకొట్టిన స్కూటీ యువకుడి దుర్మరణం షాద్నగర్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎలికట్ట శివారులో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ రాంచందర్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్కాలనీకి చెందిన సవాళ్ల స్వామి(23) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఫోన్ రావడంతో మళ్లీ వస్తాననిచెప్పి స్కూటీపై బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో ఎలికట్ట శివారులోని భారత్ పెట్రోల్పంపు సమీపంలో స్కూటీ అదుపు తప్పడి చెట్టును ఢీకొట్టింది. దీంతో స్వామి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఉదయం విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ఐ రాంచందర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రౌడీషీటర్కు రిమాండ్ ఆమనగల్లు: ఓ వ్యక్తిని బెదిరించి బైక్ను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్ను పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన రౌడీషీటర్ నేనావత్ పవన్కల్యాణ్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని బెదిరించి అతని బైక్ను ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లి వద్ద పోలీసులను చూసిన నేనావత్ పవన్కల్యాణ్ బైక్తో పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి అనంతరం చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించామన్నారు. నిందితుడిపై ఆమనగల్లు, మాడ్గుల, అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్లలో పదికి పైగా కేసు ఉన్నాయని తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి కొడంగల్ రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శుక్రవారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 18న మండల పరిధిలోని ప్యాలమద్ది గేటు సమీపంలో అనారోగ్య కారణంగా ఓ మహిళ కింద పడిందనే సమాచారాన్ని పోలీసులు అందుకొని 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మహిళను ఎవరైనా గుర్తిస్తే కొడంగల్ పోలీస్స్టేషన్లో వివరాలు తెలియజేయాలని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఫోన్ నెంబర్ 87126 70046లో సంప్రదించాలని తెలిపారు. -
పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి శంకర్పల్లి: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా శంకర్పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన తొండ రవిని నియమించినట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతికిరణ్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేలా పనిచేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ షాద్నగర్రూరల్: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాజమౌళి మహేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీసీ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మనళిని హాజరయ్యారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, సంక్షేమం కోసం సంఘంపని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాఘవేందర్గౌడ్, గోపాల్, అనిత, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో లక్ష్మీనృసింహుడి కల్యాణం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలో స్వయంభువుగా వెలిసిన శ్రీలక్ష్మీనృసింహస్వామి కళ్యాణోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ఆకుల ఆనంద్కుమార్, కౌన్సిలర్లతో కలిసి ఆలయ భక్త బృందం శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30న నిర్వహించే స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ప్రవీణ్కుమార్, తాళ్లపల్లి కృష్ణ, తమ్మల కృష్ణ, సొప్పరి లక్ష్మణ్, సూరమోని బాబు, శ్రీనివాసచారి, అశోక్రెడ్డి, అర్కే కృష్ణ, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
బ్రిడ్జి గుంతలో పడిన మహిళ
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు ఓ మహిళ బ్రిడ్జి గుంతలో పడింది. ఈ ఘటన తాండూరు పట్టణం పాత తాండూరు రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాణిక్ నగర్కు చెందిన ఆసియా బేగం కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి తాండూరులో మార్కెట్కు బయలుదేరింది. ఈ క్రమంలో బ్రిడ్జి పిల్లర్ల కోసం తవ్విన గుంతలో పడింది. స్థానికులు నిచ్చెన సాయంతో ఆసియాబేగంను బయటకు తీశారు. ఆమెను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెన్నెముక వద్ద బలమైన గాయం కావడంతో హైదరాబాద్కు తరలించి వైద్యం చేయిస్తున్నట్లు తెలిసింది. గుంత వద్ద కాంట్రాక్టర్ సూచిక బోర్డు పెట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
ఖర్గే వ్యాఖ్యలు దేశద్రోహమే ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు.మీర్పేట: కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మీర్పేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకున్న అనుభవంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఒక రైతుగా ఆలోచించి రైతుకు కష్టం రాకూడదని నిరంతరం సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం నిధులివ్వకున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు. మూసీలో గోదావరి పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెబుతున్న రిజర్వాయర్ కూడా కాళేశ్వరంలో భాగమేనని పేర్కొన్నారు. కేసీఆర్పై నిందలు వేస్తూ రైతులకు నష్టం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అర్కల భూపాల్రెడ్డి, పెద్దబావి ఆనంద్రెడ్డి, దీప్లాల్ చౌహాన్, అనిల్యాదవ్, సునితబాలరాజు, రామిడి రాంరెడ్డి, అర్కల కామేశ్రెడ్డి, దోమలపల్లి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలకు బాధ్యులను చేస్తూ పదిమంది అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక్కడ సాగిన వ్యవస్థీకృత అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే లోతైన విచారణ జరిపించాలన్నారు. కేవలం కిందిస్థాయి అధికారులపైనే కాకుండా వారి వెనుక ఉండి అక్రమాలను ప్రోత్సహించిన అదృశ్య శక్తులపై కూడా కేసులు నమోదు చేయించాలి అంటూ లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
షాద్నగర్ నియోజకవర్గంలో..
షాద్నగర్: నియోజకవర్గంలోని ఫరూఖ్నగర్లో రెండు మూడు గ్రామాల్లో తప్ప అన్ని గ్రామాల్లో బెల్టు షాపులున్నాయి. సుమారు రెండు వందలకు పైగా దుకాణాలు వెలిశాయి. కేశంపేటలో 28 గ్రామాలు ఉంటే అందులో ఒక్కో గ్రామంలో సుమారు ఆరు నుంచి ఏడు బెల్టు షాపులు ఉన్నాయి. దుకాణాదారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. కొత్తూరు.. ‘బెల్టు’ జోరు మండలంలోని ఇన్ముల్నర్వ, సిద్ధాపూర్, గూడూరు, తీగాపూర్తో పాటు పలు గ్రామాల్లో బెల్టు దుకాణాలు జోరుగా సాగుతున్నాయి. బయట మాత్రం కూల్డ్రింక్స్ సీసాలను పెట్టి లోపల మద్యం బాటిళ్లను ఉంచుతున్నారు. చీప్ లిక్కర్ మొదలుకొని బ్రాండెడ్ మద్యం వరకు లభిస్తోంది. కొందరు నిర్వాహకులు ఫోన్ చేస్తే చాలు ఎక్కడికై నా మద్యం, తిను బండారాలు సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో యువకులు మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ఇటీవల టెండర్లలో మద్యం దుకాణాలను దక్కించుకున్న కొందరు వ్యాపారులు అమ్మకాలను పెంచుకోవడానికి బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారు. నిత్యం పట్టణంలోని పలు దుకాణాల నుంచి బెల్టు షాపులకు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై మద్యం తరులుతోంది. కొందుర్గులో .. కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో బెల్ట్షాపుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందుర్గు మండలంలోని 22 పంచాయతీలకు గాను కొందుర్గు, బైరంపల్లి, అయోధ్యాపూర్తండా, చిన్నఎల్కిచర్ల, పర్వతాపూర్, చెర్కుపల్లి, విశ్వనాథ్పూర్ గ్రామాల్లో, జిల్లేడ్ చౌదరిగూడ మండలం తుమ్మలపల్లిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మిగతా గ్రామాల్లో సమయం సందర్భం లేకుండా ఎనీ టైం మద్యం లభిస్తోంది. కిరాణా దుకాణంలో మద్యం సీసాలు -
ప్లాట్లు మరింత లేట్!
యాచారం: ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిహారం చెల్లింపు విషయమై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మధ్య చోటుచేసుకున్న సవాల్, ప్రతిసవాళ్లతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఫార్మాసిటీ భూసేకరణ పరిహారం చెల్లింపు విషయంలో గతంలో జరిగిన అక్రమాలను పూర్తిగా తవ్వి తీయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అసలైన రైతులకు పరిహారంతో పాటు ప్లాట్లు ఇస్తే పర్వాలేదు కానీ రూ.కోట్లలో అక్రమంగా పరిహారం పొందినవారే తిరిగి ప్రభుత్వంపై నిందలు వేయడంపై అధికార పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించారు. ఇందులో సింహభాగం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్దలోనే పది వేల ఎకరాల వరకు తీసుకున్నారు. పైనాలుగు గ్రామాల్లో దాదాపు 3,500 మందికిపైగా రైతులు పరిహారం పొందినట్లు తెలుస్తోంది. ఛాలెంజ్గా తీసుకున్న సర్కార్ సుమారు 500 ఎకరాలకు సంబంధించిన కోట్లాది రూపాయల పరిహారం పక్కదారి పట్టిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొద్ది రోజుల క్రితం ఆయా గ్రామాల్లోని రాజకీయ పక్షాల నాయకులు అనర్హుల వివరాలతో కూడిన జాబితాను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది. దీంతో సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పూర్తి అక్రమాలను వెలుగులోకి తేవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. నక్కర్తమేడిపల్లిలో 250 ఎకరాలు, నానక్నగర్లో 150 ఎకరాలు, తాడిపర్తిలో 80 ఎకరాలు, కుర్మిద్దలో 150 ఎకరాలకుపైగా పరిహారాన్ని అనర్హులు తీసుకున్నారని ఆయా గ్రామాల నాయకులు కాంగ్రెస్ నేతలు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలో తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ఆరోపణలున్నాయి. మళ్లీ జాబితాలు ప్రభుత్వం నుంచి గతంలోనే పరిహారం పొంది, ప్రస్తుతం ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయించుకున్న రైతులతో కూడిన జాబితాను మళ్లీ ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా నక్కర్తమేడిపల్లి జీపీ వద్ద రైతుల జాబితాను ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు సూచించారు. ఫార్మాసిటీకి భూములిచ్చిన వారిలో నక్కర్తమేడిపల్లి నుంచి 1,281 మంది, కుర్మిద్దలో 574, తాడిపర్తిలో 380, నానక్నగర్లో 201 మంది రైతులు ప్లాట్లు పొందారు. వీరికి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే, పరిహారం అందజేతలో నకిలీలకు సహకరించిన యంత్రాంగం.. రిజిస్ట్రేషన్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. వీరిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈనేపథ్యంలో పారదర్శకమైన జాబితా తయారీకి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున డాక్యుమెంట్ల పంపిణీ ఇప్పట్లో కష్టమేననే చర్చ సాగుతోంది. డాక్యుమెంట్ల పంపిణీకి ఆలస్యమయ్యే అవకాశం జాబితాలో అనర్హులున్నారని అధికారులకు ఫిర్యాదులు నకిలీల ఏరివేతను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నక్కర్తమేడిపల్లిలో రై తుల జాబితాను ప్రకటించాం. ఇందులో నకిలీ పేర్లు ఉంటే ఫిర్యాదు చేయాలని గ్రామస్తులకు సూచించాం. వీటిని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాం. కొంత ఆ లస్యమైనా అసలైన లబ్ధిదారులకు ప్లాట్ల డాక్యుమెంట్లు అందజేస్తాం. నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో కూడా త్వరలోనే జాబితా ప్రకటిస్తాం. – అయ్యప్ప, తహసీల్దార్, యాచారం -
1 నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు
హుడాకాంప్లెక్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబారాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి స్వర్ణలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 సంవత్సరాల లోపు బాలబాలికలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. శిబిరాలను నిర్వహించేందుకు అనుభవజ్ఞులైన సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తాము నిర్వహించదలిచిన క్రీడా విభాగం, క్రీడా ప్రాంగణం వివరాలతో ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆమనగల్లు: పట్టణానికి ఐదు పడకల డయాలసిస్ సెంటర్ మంజూరైనట్లు జిల్లా వైద్యాధికారి డా.లలితా దేవి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలో నూతనంగా రూ.17.5 కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని గురువారం మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.నాగేందర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డయాలసిస్ సమస్యలతో బాధపడేవారికి అనుకూలంగా నూతన భవనంలో ఐదు పడకల సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీహెచ్సీ సూపరింటెండెంట్ నాగరాజు, వైద్యాధికారి డా.మైమునాబేగం, హెచ్ఈఓ తిరుపతిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్దకు గురువారం వచ్చిన ఆయన కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు కాటం రాజుగౌడ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు యాదగిరి, శ్రీహరి, నర్సింహ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ పదవుల కోసం నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ఆంజనేయులుయాదవ్, నాగిళ్ల జగన్, రమేశ్, అనూష, భాగ్యలక్ష్మి, యశోదమ్మ హాజరయ్యారు. చైర్మన్ పత్యానాయక్, వైస్ చైర్మన్ తల్లోజు గీత, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. సమావేశం నిర్వహణకు కనీసం 8 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా బీఆర్ఎస్కు చెందిన ఏడుగురు మాత్రమే హాజరు కావడంతో కోరం లేని కారణంగా వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ శంకర్ నాయక్ ప్రకటించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాత్రం ఎన్నిక నిర్వహించాలని వాగ్వాదానికి దిగారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈనెల 27న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
షాద్నగర్: ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి అన్నారు. షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామంలో గురువారం ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రగతి పోషణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి సీతా దయాకర్రెడ్డితోపాటు జిల్లా మహిళాభివృద్ధి అధికారి శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని 35 మంది గర్భిణులకు సీమంతాలు, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీతా దయాకర్రెడ్డి మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వినియోగంతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ సభ్యులు ప్రేమలత అగర్వాల్, బండి అపర్ణ, వచన్కుమార్, సీడీపీఓ ఉదయ, సర్పంచ్ రాజాగోపాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, వీరభద్రప్ప, జంగయ్య, ఏపీఓ అరుణ, ప్రగతి వెల్ఫేర్సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అలోక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
గాలివాన.. హైరానా
విరిగిపడిన చెట్ల కొమ్మలు ● విద్యుత్ సరఫరాకు అంతరాయం ● చల్లబడిన వాతావరణం మొయినాబాద్, మొయినాబాద్ రూరల్: ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. మొయినాబాద్ మున్సిపాలిలోని అజీజ్నగర్, ఎనికేపల్లి, హిమాయత్నగర్, చిలుకూరు, పెద్దమంగళారం, మొయినాబాద్, సురంగల్, ముర్తూజగూడ, అప్పోజీగూడ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం సుమారు అరగంటకు పైగా భారీ వర్షం పడింది. బలమైన ఈదురు గాలులకు అజీజ్నగర్, మొయినాబాద్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలను తొలగించిన అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆకాశం మబ్బులుపడి దాదాపు గంటన్నర సేపు వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాల్లో వరద నీరు చేరింది. మండుతున్న ఎండలకు ఇబ్బంది పడుతున్న జనం చల్లని వానతో ఉపశమనం పొందారు. -
టాటా.. బాయ్ బాయ్
దుద్యాల్: విద్యా సంవత్సరం ముగిసింది. నేటి నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిడంతో విద్యార్థులు వారివారి సొంతూర్లకు వెళ్లారు. ఈ విద్య సంవత్సరానికి సంబంధించి చిన్నారులు రాసిన పరీక్షల మూల్యాంకనం అనంతరం.. అందిన ప్రగతి నివేదిక ఆధారంగా.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రొగ్రెస్ రిపోర్టు కార్డులను వారి తల్లిదండ్రులకు అందజేసి, ప్రగతిని వివరించారు. కాగా.. మండల పరిధి చెట్టుపల్లితండా కస్తూర్బాగాంధీ బాలిక పాఠశాలలో బాలికలు తల్లిదండ్రులతో కలసి ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయులకు, తోటివారికి టాటా చెబుతూ.. మళ్లీ కలుద్దామంటూ ఇంటి బాట పట్టారు. ధారూరులో.. ధారూరు: మండల పరిధి పాఠశాలల్లో పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రకటించి, ఉపాధ్యాయులు వారికి గురువారం ప్రొగ్రెస్ రిపోర్టులను అందజేశారు. గురుదొట్ల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సెలవుల నేపథ్యంలో చిన్నారులు తోటివారికి బైబై చెబుతూ.. సొంతూళ్ల బాట పట్టారు. -
దోపిడీ కేసులో ఒకరి అరెస్టు
కందుకూరు: బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి చాకచక్యంగా దొంగలు దోచుకెళ్లిన ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన ఢిల్లీ నారాయణ ఈ నెల 16న మధ్యాహ్నం కందుకూరు ఎస్బీఐకు వచ్చి రూ.10 లక్షల నగదు తీసుకుని బైక్ డిక్కీలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. విషయాన్ని గమనించిన నలుగురు దొంగలు అతన్ని బైక్లపై అనుసరించారు. కందుకూరు గ్రామం దాటిన తర్వాత నారాయణను ఆపి అడ్రస్ అడుగుతున్నట్లుగా నటించారు. వెనుక మరో బైక్పై వచ్చిన మరో ఇద్దరు చాకచక్యంగా డిక్కీ తెరిచి నగదు తస్కరించారు. ఇంటికి వెళ్లి చూసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంసంజీవయ్యనగర్కు చెందిన మేకల నాని, నితిన్, అనిల్, సాయిలుగా గుర్తించారు. అంతా గ్రూప్గా ఏర్పడి తరచూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. వీరిలో నితిన్ హైదరాబాద్ అల్మాస్గూడ, రాజీవ్ గృహకల్పలో గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. అంతా ఆ గదిలోనే ఉండి చోరీలు చేసి మళ్లీ వారి స్వగ్రామానికి వెళ్లేవారు. గురువారం పోలీసులు నితిన్ గదికి వెళ్లగా మేకల నాని దొరికాడు. అతని నుంచి రూ.8 లక్షల నగదు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
లోడు ఓవర్.. ఒత్తిడిలో ఫీడర్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. వృద్ధిరేటు సాధారణంగా ఏటా 10 నుంచి 12 శాతం నమోదవుతుండగా ఈసారి ఏకంగా 30 శాతం మించిపోయింది. తొమ్మిది సర్కిళ్ల పరిధిలోని 80 శాతం 132 కేవీ సబ్స్టేషన్లు ఓవర్ లోడుతో హీటెక్కిపోతున్నాయి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు డీటీఆర్ల సామర్థ్యాన్ని పెంచకపోవడం, లోడ్ బ్యాలెన్స్ చేయకపోవడం, ఆయిల్ లీకేజీలను అరికట్టకపోవడం, ఎప్పటికప్పుడు టంగ్టెస్టర్తో లోడును పరిశీలించకపోవడం, వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. సైబర్సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కేవలం 22 రోజుల్లో 800కుపైగా డీటీఆర్లు కాలిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. విధిలేని పరిస్థితుల్లో ఇంజనీర్లు అనధికారిక ఎల్ఆర్ (లోడ్ రిలీఫ్)లను అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ఈ సమస్య ఎక్కువగా ఉంది. 100 కేవీ డీటీఆర్పై 130 యాంప్స్ లోడు గ్రేటర్లో 65 లక్షలకుపైగా విద్యుత్ కనెక్ష ఉండగా, వీటిలో 55 లక్షల గృహ, 8 లక్షల వాణిజ్య, 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. సమ్మర్ యాక్షన్ప్లాన్లో భాగంగా ఫిబ్రవరికి ముందే మెజార్టీ పవర్ ట్రాన్స్ఫార్మర్లను, డీటీఆర్లను మార్చారు. అయినా అంచనాలకు మించి విద్యుత్ వినియోగం అవుతోంది. 2024 మే 29న అత్యధికంగా 91.69 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. తర్వాత డిస్కం చరిత్రలోనే తొలిసారిగా 2026 ఏప్రిల్ 17న 100.56 మిలియన్ యూనిట్లు దాటింది. సైబరాబాద్, రాజేంద్రనగర్ సర్కిళ్లలోని పలు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లపై 130 యాంప్స్కు మించి లోడు పడుతోంది. ఇప్పటికే 20 నుంచి 25 సబ్స్టేషన్లు డేంజర్జోన్లో ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎల్ఆర్లు తప్పవనే హెచ్చరికలు లేకపోలేదు. భవిష్యత్తు డిమాండ్కు తగ్గట్లుగా కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిస్కం నిర్ణయించింది. అయితే మెజార్టీ సబ్స్టేషన్లు టెండర్ దశ దాటలేదు. చినుకు చిటపట.. ఇన్సులేటర్లు టపటపా పగటి ఉష్ణోగ్రతలకు ఫీడర్లు, డీటీఆర్లు, విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇన్సులేటర్లు హీటెక్కిపోతున్నాయి. పగుళ్ల మధ్య వర్షపు చినుకులు పడితే.. టప్మంటూ భారీ శబ్దంతో పేలిపోతున్నాయి. ఇంటిముందు కరెంట్ స్తంభంపై భారీ శబ్దాలు వస్తుండటం, షార్ట్సర్క్యూట్లు వెలుగు చూస్తుండటం, అగ్నికీలలు ఎగిరి ఆయిల్ లీకేజీలున్న డీటీఆర్లపై పడుతుండటం, వాటి నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇలా ప్రతి రోజూ 50 నుంచి 60 డీటీఆర్లు కాలిపోతున్నట్లు డిస్కం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పాడైన డీటీఆర్ను గుర్తించి, దాని స్థానంలో కొత్తది అమర్చేందుకు ఆరేడు గంటల సమయం పడుతోంది. రాత్రిపూట ఉక్కపోతకు తోడు ఇంట్లో కరెంట్ కూడా లేకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లు చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించడం లేదు. 1912 కాల్ సెంటర్ సైతం బిజీగా ఉంటోంది. విధి లేని పరిస్థితుల్లో ఎక్స్ వేదికగా ఫిర్యా దులను షేర్ చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. తేదీ పేలిన డీటీఆర్లు 22 52 21 72 20 72 19 62 18 54 గణనీయంగా విద్యుత్ డిమాండ్ హీటెక్కిపోతున్న సబ్స్టేషన్లు పేలిపోతున్న డీటీఆర్లు చేతులెత్తేసిన ట్రాన్స్కో అనధికారిక లోడ్ రిలీఫ్లు షురూ -
బయోమాస్ పెల్లెట్ స్టవ్లపై అవగాహన
చేవెళ్ల: బయోమాస్ పెల్లెట్స్ వినియోగంతో పర్యావరణానికి మేలుతోపాటు ఎల్పీజీ కోసం ఖర్చు చేసే లక్షకోట్ల సంపద దేశానికి మిగులుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో జేకేఎంఆర్ పౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రకాల బయోమాస్ పెల్లెట్ గ్యాసిఫైర్ స్టవ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పెల్లెట్స్ జొన్నసొప్ప, వరిపొట్టు, మక్కబుట్టలు, ఇతర వ్యవసాయ ఆధారిత మిగిలిపోయన వ్యర్థాల నుంచి తయారు చేయబడతాయన్నారు. చిరువ్యాపారులు, హోటల్స్ నిర్వాహకులకు ఈ స్టవ్లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇళ్లలో సైతం వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. కావాల్సిన వారికి జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా స్టవ్లను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, శంకర్పల్లి అధ్యక్షుడు దయాకర్రెడ్డి, చేవెళ్ల మున్సిపల్ కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, నాయకులు మాణిక్యరెడ్డి, సత్యనారాయణ, శర్వలింగం, ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వెంకట్రాంరెడ్డి, నందు, శ్రీకాంత్రెడ్డి, గణేశ్, విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కందుకూరు: రోడ్డు ప్ర మాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈసంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. రాచులూరుకు చెందిన గుంటి ప్రశాంత్(25) వృత్తిరీత్యా మత్స్యకారుడు. బుధవారం ఉదయం చేపల వేటకు బైక్పై ధన్నారం వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో బైరాగిగూడ గేట్ సమీపంలో ట్రాలీతో పాటు కాంక్రీట్ మిషన్, దానికి అనుసంధానంగా ఉన్న ఆయిల్ ఇంజన్తో ఉన్న ట్రాక్టర్ రాచులూరు గేట్ వైపు మరలుతోంది. దీనికి ఎలాంటి రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో వెనక ఉన్న ఆయిల్ ఇంజన్ను అంచనా వేయలేక బైక్తో ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దారి దోపిడీ ముఠా అరెస్టు బంజారాహిల్స్: ఆవారాగా తిరుగుతూ జల్సాలు, గంజాయి కోసం దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లో మెట్రోస్టేషన్ వద్ద అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్ శుభాంకర్ కుమార్ను రహమత్నగర్, బోరబండ ప్రాంతాలకు చెందిన బర్ల పవన్కళ్యాణ్ అలియాస్ డీజే పవన్, సాయిరాజ్ కుమార్ అలియాస్ చిట్టి, రేసు ప్రణీత్రెడ్డి, జశ్వంత్, అఖిల్, చందు, గోవు ఈశ్వర్ అటకాయించారు. దాడి చేసి బలవంతంగా మొబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి పవన్కళ్యాణ్, రేసు ప్రవీణ్రెడ్డి, గోవు ఈశ్వర్గౌడ్లను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
రికార్డుల నమోదులో నిర్లక్ష్యం వద్దు
యాచారం: పంచాయతీల్లో రికార్డుల నమోదులో నిర్లక్ష్యం వద్దని, ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్కలుండాల్సిందేనని జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని తమ్మలోనిగూడ పంచాయతీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పొరపాట్లను సరిచేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి అశోక్కు సూచించారు. సర్పంచులు అధికారులతో సమన్వయం చేసుకుంటే గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం ఈజీఎస్ నర్సరీని పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ఫ్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీలత, గ్రామ సర్పంచ్ దెంది రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ -
ఖర్గే వ్యాఖ్యలు దేశద్రోహమే
● ప్రధాని మోదీపై విమర్శలు సిగ్గుచేటు ● బీజేపీ జిల్లా నేత నర్సింహగౌడ్ కొత్తూరు: రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా, అభివృద్ధిపై మాత్రమే చర్చలు, విమర్శలు జరగాలని బీజేపీ జిల్లా కోశాధికారి అమడపురం నర్సింహ గౌడ్ అన్నారు. దేశ ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం మున్సిపాలిటీలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేసేటప్పుడు కనీస ఆలోచన ఉండాలన్నారు. కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఖర్గే ఇవేవీ పట్టించుకోకుండా మోదీని ఉగ్రవాది అనడం దారుణమన్నారు. ప్రధానమంత్రిని ఉగ్రవాదితో పోల్చడం దేశద్రోహంతో సమానమని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న నేతను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మోదీ పాలనను ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కేవలం తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రణధీర్గౌడ్, నాగరాజుచారి, మహేందర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రాఘవులు, హరికృష్ణ, శివకుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సుక్క.. ఎంచక్కా!
గాలివాన.. హైరానా ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. విచ్చలవిడిగా పర్మిట్ రూములు ● ఊరూరా జోరుగా బెల్ట్షాపులు ● పగలు రాత్రి తేడాలేకుండా మద్యం విక్రయాలు ● ఒక్కో బాటిల్కు అదనంగా వసూలు ● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ అధికారులు చేవెళ్ల: మండలంలోని 24 పంచాయతీలు, మున్సిపాలిటీలోని 11 వార్డుల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఆదాయం కోసం వైన్షాపుల యజమానులు గ్రామాలను పంచుకొని మద్యం సరఫరా చేస్తున్నారు. ఎకై ్సజ్శాఖ అధికారులు ఒక్కచోట కూడా తనిఖీ చేసి పట్టుకున్న దాఖలాలు లేవు. తమ బతుకులు బలైపోతున్నా బెల్టుషాపులు నిషేధించరా అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కౌకుంట్లలో ఇటీవలే బెల్టుషాపుల నిషేధానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మితే రూ.లక్ష, కొన్నవారికి రూ.50 వేల జరిమానా విధించటంతోపాటు పట్టించిన వారికి రూ.10వేల బహుమతి ప్రకటిస్తూ తీర్మానం చేశారు. మంచినీరు దొరకని ఊరంటూ ఉంటుందేమో కాని.. మద్యం దొరకని ఊరు లేదు. పట్టణ కేంద్రాల్లోనే కాదు జిల్లాలోని ఏ మారుమూల పల్లెలోకి తొంగిచూసినా మద్యం వాసన గుప్పుమంటోంది. వీధికో బెల్ట్షాపు దర్శనమిస్తోంది. ఉదయం, సాయంత్రం తేడా లేకుండా మద్యం వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్ బాటిళ్ల చందంగా జోరుగా సాగుతోంది. – సాక్షి, రంగారెడ్డిజిల్లా పల్లెల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు దుకాణాలు మద్యం ప్రియులకు అడ్డాలుగా మారు తున్నాయి. వైన్షాపు నిర్వాహకులతో కుమ్మకై ్క అమ్మకాలు జరుపుతున్నారు. క్వార్టర్కు రూ.10 అదనం, బీర్కు రూ.20, అదే ఫుల్బాటిల్కు రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక వైన్షాపుల ముందు ఉదయం 11 నుంచి రాత్రి 12 గంటల వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సరదాగా మొదలై.. తర్వాత అలవాటుగా మారుతోంది. మద్యం కోసం కొంతమంది అప్పులు చేస్తుండగా, మరికొంత మంది ఆస్తులు అమ్ముతున్నారు. తాగుడుకు డబ్బులు ఇవ్వడం లేదనే కారణంతో చివరకు తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యలను, పిల్లలను హత్య చేస్తున్న దాఖలాలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రతి దుకాణానికి 100 చదరపు మీటర్లలోపు పర్మిట్ రూం ఉండాలి. ప్యాకేజ్డ్ ఫుడ్డు మాత్రమే విక్రయించాలి. పర్మిట్ రూం వెలుపల మద్యం తాగడానికి వీల్లేదు. ఇందుకు విరుద్ధంగా కొన్ని దుకాణాలు వ్యవహరిస్తున్నాయి. చేపలు, చికెన్ ఫ్రై, బోటి, తలకాయ సూపు వంటి వాటిని కూడా ఇక్కడే వండివార్చుతున్నారు. సరైన పార్కింగ్ లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపి ఉంచి, ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్నారు. చీకటి పడిన తర్వాత రోడ్లపైనే మద్యం తాగుతూ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వాహనదారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. -
ఇంద్రారెడ్డి ఆశయాలను సాధిద్దాం
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ● కౌకుంట్లలో ఇంద్రారెడ్డి వర్ధంతికి హాజరైన నాయకులు చేవెళ్ల: ఇంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది చేవెళ్ల ప్రజలేనని.. నియోజకవర్గ ప్రజలకు ఇంద్రారెడ్డి కుటుంబ ఎప్పటికీ రుణపడి ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం దివంగత హోంమంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె చేవెళ్ల, ఖానాపురంగేట్, అంతారంగేట్ వద్ద ఆయన విగ్రహాలకు ఘన నివాళి అర్పించారు. అనంతరం మండల పరిధిలోని కౌకుంట్లలో ఆయన సమాధికి తనయులు కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, కుటుంబ సభ్యులు, పలువురు నాయకులతో కలిసి పూలమాలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డ అంటే స్వర్గీయ ఇంద్రారెడ్డి పేరు గుర్తుండి పోయేలా పాలన సాగించారన్నారు. ఆయన అనుచరులు పార్టీలకు అతీతంగా జిల్లాలో ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ఆయన ఆయన సాధనకు నిరంతరం కృషి చేద్దామన్నారు. ఆయన కలలు కన్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అంజనేయులు, ప్రభాకర్, పి.హన్మంత్రెడ్డి, కరుణాకర్రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశ్, శ్రీధర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, బాల్రాజ్, యాదయ్య, నర్సింలు, రవీందర్, మాధవ్గౌడ్, రామగౌడ్, రాజు, సురేందర్, వెంకటేశ్వర్రెడ్డి, గోపాలకృష్ణ, రాజు, చంద్రశేఖర్, ప్రభాకర్రెడ్డి, మాధవ్రెడ్డి, పలువురు నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాం మొయినాబాద్: ఇంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా నిలబెట్టిన చేవెళ్ల ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం దివంగత హోంమంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కేంద్రంలో ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇంద్రారెడ్డి కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె తనయుడు కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, సీనియర్ నేతలు షేక్ మహబూబ్, కృష్ణారెడ్డి, గడ్డం వెంకట్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు డప్పు రాజు, రవూఫ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జీఎన్ రాజు, మాజీ సర్పంచ్లు కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, సుధాకర్యాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు మాణిక్రెడ్డి, శ్రీనివాస్, నాయకులు రాంచందర్, సురేందర్గౌడ్, సూరియాదవ్, తిరుపతిరెడ్డి, నవీన్, అరవింద్, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు ఇంద్రారెడ్డి నగర్ కాలనీలోని ఆయన విగ్రహానికి మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. -
ఆర్టీసీ సమ్మెకు మద్దతు
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య ఇబ్రహీంపట్నం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం మద్దతు ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పాలకులు తుంగలో తొక్కారన్నారు. ఆర్టీసీ కార్మికుల 32 సమస్యల డిమాండ్ల పరిష్కారానికి వేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ నాలుగు వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమేనన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య షాబాద్: నాలుగు లేబర్ కోడులను రద్దు చేసే వరకు పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో మేడే వాల్ పోస్టర్లును విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడులను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపుతో అంతర్జాయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో లక్షలాది మంది కార్మికుల తరపున ఏఐటీయూసీ పోరాడాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ.. అన్ని రంగాల కార్మికులకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్లర్లు కార్మికులపై పెత్తనం చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల, బీసీ హక్కుల సాధన సమితి మండల కన్వీనర్ పామాలకు ఆనందం, ఏఐటీయూసీ మండల కన్వీనర్ నారాయణ, సహాయ కార్యదర్శి నర్సింలు, డీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, రఘురాం, మధూకర్, తదితరులున్నారు. -
ప్రగతి చక్రాలకు బ్రేకులు
షాద్నగర్: డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టారు. దీంతో బస్సులు బస్టాండ్కే పరిమితమయ్యాయి. హైదరాబాద్, మహబూబ్నగర్కు వెళ్లేందుకు ప్రతి రోజు షాద్నగర్ ప్రాంతం నుంచి విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. షాద్నగర్ డిపోలో నిర్విరామంగా పరుగులు తీస్తున్న బస్సులు సమ్మెతో నిలిచిపోయాయి. ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. బస్సులను అడ్డుకున్న కార్మికులు సమ్మె కారణంగా కార్మికులు విధులు నిర్వహించలేదు. దీంతో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ సీతారాం, తహసీల్దార్ నాగయ్య, ఎంవీఐ వాసు తదితరులు బస్టాండ్కు వెళ్లారు. ప్రవేటు డ్రైవర్లతో బస్సులను డిపో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు డిపో గేటు ఎదుట భైఠాయించి అడ్డుకున్నారు. రోజుకు రూ.18లక్షల నష్టం డిపోలో మొత్తం 88 బస్సులున్నాయి. ఆర్టీసీ బస్సులు 53, అద్దె బస్సులు 35. డిపోలో 340 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయితే బుధవారం కేవలం ఐదు ప్రైవేటు బస్సులను మాత్రమే నడిచాయి. ప్రతి రోజుకు ఆర్టీసీకి రూ.18లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. సమ్మె కారణంగా ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని కోల్పోతుంది. ప్రైవేటు వాహనదారుల దోపిడీ సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మెను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి దూరాన్ని బట్టి రూ.పది–రూ.50 వరకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రామానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. ప్రైవేటు వాహనాలను అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు నడిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి – వేమారెడ్డి, గుర్రంపల్లి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికై నా ఉచితంగా ప్రయాణించే వాళ్ళం. సమ్మె కారణంగా ఆటోలు, జీపుల్లో వెళ్లాల్సి వస్తుంది. ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. – అండాలు, లింగారెడ్డిగూడ, షాద్నగర్ -
నై చలేంగే..
ఆర్టీసీ సమ్మె హారన్ ఇబ్రహీంపట్నం: డిపోనకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ● ఆర్టీసీ జేఏసీ నాయకుడు శంకర్ నాయక్ మహేశ్వరం: మహేశ్వరం ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. తెల్లవారుజాము నుంచి డిపోలో పని చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషియన్లు, మెకానిక్లు, ఇతర కార్మికులు డిపో వద్దకు భారీగా చేరుకొని గేటు ఎదుట బైఠాయించారు. డిపోలో 75 ఆర్టీసీ బస్సులు( 63 ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, 12 ప్రైవేట్ బస్సులు)లో 12 ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు మాత్రమే ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో డిపోకే పరిమితమయ్యాయి. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా మహేశ్వరం సీఐ రాఘవేందర్రెడ్డి, ఎస్ఐలతో బందోబస్తు నిర్వహించారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాలకు కొన్ని ట్రిప్పులు నడిపారు. సమ్మె కారణంగా ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలు, ట్యాక్సీ కార్లలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆర్టీసీ జేఏసీ నాయకుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికై న ఆర్టీసీ సమ్మైపె జోక్యం చేసుకోవాలని కోరారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేస్తోందన్నారు. ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మెను విరమించమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మెకు చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. రెండేళ్లయినా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతోనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆపమని హెచ్చరించారు. డిపోలకే పరిమితమైన బస్సులు ఇబ్బంది పడిన ప్రయాణికులు జోరుగా ప్రైవేటు వాహనదారుల దోపిడీ -
నేడు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ పదవులకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నలుగురు సభ్యుల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు నిర్వహించనున్నారు. సమావేశానికి 15 మంది కౌన్సిలర్లతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరు కానున్నారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి, వ్యవసాయాధికారిణి విద్యాధరి ఇబ్రహీంపట్నం: రైతులందరూ జూన్ 2వ తేదీలోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని తహసీల్దార్ సునీతారెడ్డి, మండల వ్యవసాయాధికారిణి విద్యాధరి కోరారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, మీ సేవ కేంద్రాల సిబ్బందికి ఫార్మర్ రిజిస్ట్రేషన్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సమీప మీ సేవ కేంద్రాలకు భూమి పాస్ బుక్ వివరాలు, ఆధార్, ఓటీపీ వచ్చే ఫోన్తో వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రైతులందరికీ తగు సలహాలు సూచనలు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్, ఏఈఓలు శ్రవణ్, సృజన పాల్గొన్నారు. చెరువు శిఖంలోని బ్లూషీట్ల తొలగింపు సాక్షి, రంగారెడ్డిజిల్లా: శిఖం భూముల్లో వెలుస్తున్న రియల్ వెంచర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిభట్ల ఔటర్ రింగ్రోడ్డు సర్వీసు రోడు వెంట వెలుస్తున్న అక్రమ వెంచర్లపై బుధవారం ‘సాక్షి’జిల్లా ఎడిషన్లో ‘చెర’వులు శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఇందుకు స్పందించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హుటాహుటిన క్షేత్రస్థాయికి చేరుకున్నారు. జిలాన్ఖాన్ చెరువులో వెలసిన బ్లూషీట్లను తొలగించారు. పులిందర్వాగు సహా చెరువు కట్టను ధ్వంసం చేసిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ అధికారులు అంగీకరించారు. వెంచర్ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించారు. సర్వే నంబర్ 123, 124, 125, 434, 439, 440, 441, 442, 443లో 24.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ జిలాన్ ఖాన్ చెరువు విస్తరించి ఉందని, ఇందులో వెంచర్ ఏర్పాటుకు రెవెన్యూశాఖ ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని, అదే విధంగా ఔటర్ సర్వీసు రోడ్డు నుంచి వెంచర్లోకి బీటీ రోడ్డుకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇది పూర్తిగా అక్రమమని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి స్పష్టం చేశారు. నీటి వనరులను ధ్వంసం చేస్తున్న వెంచర్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే సంబంధిత తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
● ఆరు తులాల బంగారు ఆభరణాలు, 61 సెల్ఫోన్లు, కారు, రెండు బైక్లు స్వాధీనం ● పరారీలో మరో నలుగురు నిందితులు ● వివరాలు వెల్లడించిన చేవెళ్ల ఏసీపీ కిషన్ చేవెళ్ల: రద్దీ ప్రదేశాల్లో చోరీలకు పాల్పడుతున్న పలువురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు రిమాండ్కు తరలించారు. చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ బుధవారం విలేరులతో మాట్లాడుతూ.. ఈ నెల 17న షాద్నగర్ మండలం దూస్కల్ గ్రామానికి చెందిన జి.వెంకటయ్య శంకర్పల్లిలోని తన కూతురు వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. చేవెళ్ల బస్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలు తస్కరించారు. ఆయన వెంటనే చేవెళ్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుఽధీర్బాబు, చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్గౌతమ్, ఏసీపీ కిషన్ల పర్యవేక్షణలో ప్రత్యేక క్రైం టీం పోలీసులు గాలింపు చేపట్టింది. ఈ నెల 18న రాత్రి చేవెళ్ల క్రైం టీం పోలీసుల కల్లుగప్పి పారిపోతున్న దొంగలను దాదాపు ఏడు కిలో మీటర్లు వెంబడించి మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని ప్రతాపసింగారం వద్ద గ్రామస్తుల సహకారంతో పట్టుకున్నారు. ఈ ముఠాలో బేతంపల్లి మేరీ, దేవరకొండ రేణుక, పాలేరు సుష్మిత, ఆకుల గంగయ్య, ఇద్దరు మైనర్లును అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు బేతంపల్లి రాజశేఖర్, దేవరకొండ నాగేంద్ర, చందు, ఆకుల చరణ్కుమార్ తప్పించుకు పారిపోయారు. పట్టుబడిన ఈ ముఠా నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలతోపాటు 61 మొబైల్ ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక కారు, టీవీఎస్ జ్యూపిటర్ స్కూటీ, బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీస్స్టేషన్, బెంగళూరు, ఆర్పీఎస్ సికింద్రాబాద్ పరిధిలోనూ నేరాలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పట్టుబడిన మైనర్లను, నిందితులను ఈనెల 19న చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం దర్యాప్తు చేస్తుందన్నారు. కేసును ఛేదించేందుకు పనిచేసిన చేవెళ్ల క్రైం టీమ్ సీఐ భూపాల్శ్రీధర్, కానిస్టేబుల్స్ శివ, రమేశ్, ఇతర కానిస్టేబులను ప్రత్యేకంగా అభినందించారు. -
వేసవిలో మరమ్మతులు పూర్తి చేయండి
● రిపేర్లకు సంబంధించి నివేదిక సిద్ధం చేయండి ● కలెక్టర్ నారాయణరెడ్డి మహేశ్వరం: ప్రభుత్వ హస్టళ్లలలో మరమ్మతులుంటే విద్యార్థులకు, విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మహేశ్వరం గేటు సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలను అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలతో పాటు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలకలో రిపేర్లను గుర్తించి నివేదికను సిద్ధం చేయాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం హస్టల్లోని వంటశాల, మెస్, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎంసెట్ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు అందిస్తున్న కోచింగ్ వివరాలను తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థలలో అనేక మార్పులు వచ్చాయని.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుఽలకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి కేషురామ్, తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రత కరువు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని పలు జాతీయ రహదారులే కాదు అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఔటర్ రింగ్రోడ్డు సహా హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి(ఎన్హెచ్ 44), నాగార్జున సాగర్ రోడ్డు, విజయవాడ జాతీయ రహదారి, బీజాపూర్ జాతీయ రహదారి, శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. అనేక మంది మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయినా అధికారుల్లో చలనం కలగడం లేదు. గుంతలు తేలిన రోడ్లను పూడ్చాలనే సోయి ఉండడం లేదు. కానీ ప్రతి మూడు నెలలకోసారి ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకుండానే జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశమవుతుండటం హాస్యాస్పదంగా మారింది. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలుపై కనీస చర్చకూడా ఉండడం లేదు. తూతూ మంత్రంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారే కానీ.. రహదారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు లేకపోలేదు. బుధవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రత కమిటీ(డీఆర్ఎస్సీ) సమావేశం నిర్వహించింది. ఆర్ అండ్బీ కార్యనిర్వాహక ఇంజనీర్లు, ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు. అయితే రక్షణ చర్యలపై కనీస చర్చ లేకుండానే సమావేశం ముగించారు. యాక్షన్ ప్లాన్ లేదు.. నియంత్రణ చర్యలు లేవు తూతూ మంత్రంగా జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం -
ఉపాధ్యాయులే మార్గదర్శకులు
శంకర్పల్లి: పాఠశాల దశ నుంచి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్లో శంకర్పల్లి ఎంఈఓ సయ్యద్ అక్బర్ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్కుమార్, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా విద్యాధికారి సుశీందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్బర్ దంపతులను వారు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. 11 ఏళ్లుగా మండల విద్యాధికారిగా అక్బర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అనేది కేవలం ఉద్యోగానికి మాత్రమేనని.. వృత్తికి కాదన్నారు. అక్బర్ తన ఉపాధ్యాయ అనుభవాన్ని భవిష్యత్లోనూ విద్యార్థులకు సాయం చేసేందుకు తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో పలు మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు బుధవారం శంకర్పల్లిలో నిర్వహించిన మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని మండలంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. 11 ఏళ్లుగా ఎంఈఓగా పని చేసిన ఆయన ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేశారని, అందుకు నిరసనగా కార్యక్రమానికి తాము, తమ సంఘంలోని ఉపాధ్యాయులు వెళ్లవద్దంటూ మంగళవారం పీఆర్టీయూటీఎస్, ఎస్టీయూ, టీపీయూఎస్, టీయూటీఎఫ్, ఎస్జీటీయూ, టీఎస్యూటీఎఫ్ సంఘాలు తీర్మానించుకున్నాయి. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ -
నడిచిన అద్దెబస్సులు
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ అద్దె బస్సులు నడిచాయి. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో 137 బస్సులకు గాను 61 అద్దె బస్సులను అధికారులు నడిపించారు. డిపోలో సుమారు 800 మంది సిబ్బందికిగాను సుమారు 580 మంది సమ్మెలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఉదయం డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులకు మద్ధతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆ సంఘం నాయకులు ఎల్లేశ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు పనిబారం తగ్గించాలని, పేస్కేల్ అములు చేయాలని, ఆర్టీసీ ఆస్తులను కాపాడి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జగన్, యాదగిరి, డిపో జేఏసీ చైర్మన్ సీహెచ్ యాదగిరి, అబ్దుల్ రజాక్, జంగయ్య, నర్సింహ, లలిత, కల్పన, కార్మికులు పాల్గొన్నారు. బస్సు సౌకర్యం లేక పలువురు ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. వారు భారీగా చార్జీలు పెంచారు. ఆర్టీసీ సమ్మెతో సకాలంలో బస్సులు రాక ఇబ్బందులు పడ్డాం. గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాం. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – దీపిక, ప్రయాణికురాలు -
సోషల్ మీడియా వేదికగా వేధింపులు
యువకుడికి రిమాండ్ కడ్తాల్: సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తానంటూ యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని కడ్తాల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. కేశంపేట మండలం చౌలపల్లి పంచాయతీ పరిధిలోని మీనమోనిపల్లికి చెందిన అనపూలస గోవర్ధన్ కడ్తాల్ మండలానికి చెందిన ఓ యువతితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెబుతూ ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. అనంతరం సదరు యువతిని ఒంటరిగా కలవాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గోవర్ధన్ను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ తరలించాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. -
ధర్మ పరిరక్షణకే హిందూ సమ్మేళనం
మహేశ్వరం: భారతదేశంలోపి సనాతన హిందూ ధర్మం గొప్పదనం విశ్వవాప్తం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులందరినీ ఏకం చేయడం, సమాజంలో ప్రేరణాశక్తిని రగిలించడం, నిరంతరం ధర్మ పరిరక్షణ కోసం సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి సమ్మేనాలు అవసరమన్నారు. సమాజ శ్రేయస్సుకు హిందువులు ఏకతాటిపై నడవాలన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని ఇందుకు ప్రతి రూపమే హిందూ సమ్మేళనం అన్నారు. అనంతరం స్వామిజీని హిందూ సమ్మేళన నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. హిందూ సమ్మేళనానికి సహకరించిన వారిని నిర్వాహకులు ఘనంగా అభినందించి సన్మానించారు. సమ్మేళనంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యాభారతి ప్రచార విభాగం దక్షిణ క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్రెడ్డి, రాష్ట్ర సేవిక సమితి నాయకులు గంజాం పద్మజ భగవత్, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆదిత్య పరాశ్రీ స్వామిజీ


