breaking news
Ranga Reddy District News
-
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
పహాడీషరీఫ్: హత్యలు, హత్యాయత్నాలతో ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి భంగం కలిగించే రౌడీషీటర్లను ఉక్కుపాదంతో అణచివేస్తామని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకీ రెడ్డి హెచ్చరించారు. బా లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని 15 మంది రౌడీషీటర్లకు గురువారం ఆయన, ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు.రౌడీషీటర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. గతంలో ఏం చేసేవారని తెలుసుకున్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, రాత్రి 10 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలని, అనంతరం బయటికి వెళ్లరాదన్నారు. ఏదైనా కేసులో ప్రమేయం అయినట్టు తేలితే పీడీ యాక్ట్, నగర బహిష్కరణకు సీపీకి ప్రతిపాదిస్తామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డి సూచనల మేరకు బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల ప్రతి కదలికపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. స్టేషన్ పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 57 మందిపై రౌడీషీట్ కొనసాగుతోందని వివరించారు. కౌన్సెలింగ్లో ఎస్సైలు సుధాకర్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆ 103 ఎకరాలు సర్కారువే
సాలార్జంగ్ వారసులకు సుప్రీం షాక్● గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్ భూములపై కీలక తీర్పు ● హైకోర్టు, కింది కోర్టుల ఉత్తర్వులను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం ● జాగీర్ల రద్దుతోనే ఆ భూములు ప్రభుత్వ పరమయ్యాయని స్పష్టీకరణ ● 8 వారాల్లోగా ‘రిజర్వ్ ఫారెస్ట్’ నోటిఫికేషన్ పూర్తి చేయాలని సీఎస్కు ఆదేశంసాక్షి, న్యూఢిల్లీ: గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అదిపూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అసలు వివాదం ఏమిటంటే? హయత్నగర్ మండలం సాహెబ్నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధీనంలోనే ఉందని పేర్కొంది. ఆ పత్రాలు చెల్లవు: సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది. అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంకై ్వరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది. అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో అప్పీల్ కూడా కొట్టివేత ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుసీ్త్ర దాఖలు చేసిన మరో పిటిషన్ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేల్చినందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. 8 వారాల్లోగా పూర్తి చేయండి.. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది. -
అధికార, ప్రతిపక్షాలను వెనక్కి నెట్టేసాం
కందుకూరు: సర్పంచ్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ సాధ మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి అన్నారు. గురువారం వారు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొంటూ పోటీపడి గెలిచిన సర్పంచులకు శుభాకాంక్షలు చెప్పారు. అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఒరవడిని భవిష్యత్లో జరిగే ఏ ఎన్నికలోనైనా కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువమోర్చా నాయకుడు సామ మహేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బొక్క సత్యనారాయణరెడ్డి, బొక్క సురేందర్రెడ్డి, సాధ ప్రవీణ్రెడ్డి, బొక్క పరశురాంరెడ్డి, కొత్తగూడ ఉప సర్పంచ్ ముచ్చర్ల రవీందర్, హనుమంతుల అరుణ్ పాల్గొన్నారు. -
ధ్యాన యాగం.. ఆధ్యాత్మిక యోగం
కడ్తాల్: ధ్యాన మహాయాగం కోసం మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం ముస్తాబవుతోంది. మండల కేంద్రం సమీపంలోని పత్రీజీ శక్తి స్థల్లో ఈ నెల 21న (ఆదివారం) వేడుకలు ప్రారంభమై, 31 వరకు కొనసాగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ప్రముఖ ఆధ్యాత్మిక, ధ్యాన గురువులు హాజరుకానున్నారు. ఈ మేరకు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పదమూడు సంవత్సరాలుగా.. 13 సంవత్సరాలుగా ఏటా డిసెంబర్లో ఇక్కడ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుంచి వేలాది మంది ధ్యానులు తరలిరానున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఉత్సవాలను విజయవంతం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే ధ్యానులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నారు. ఉచిత అన్నదాన కేంద్రం, శాశ్వత గదులతో పాటు తాత్కాలిక వసతి గృహాలు, కుటీరాలు నిర్మిస్తున్నారు. వేడుకలు జరిగినన్ని రోజులు ధ్యానం చేసేందుకు వీలుగా భారీ సభా ప్రాంగణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక సిద్ధం చేస్తున్నారు. శుద్ధమైన తాగునీటి సౌకర్యంతో పాటు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలు ధ్యాన మహాయాగంలో భాగంగా ప్రతిరోజు పత్రీజీ వీడియో సందేశం, ప్రముఖ ధ్యాన గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి. నిత్యం ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు సామూహిక వేణుగాన ధ్యానం, అఖండ ధ్యానం, ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ధ్యాన గురువుల సందేశాలు, గురు సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. విజయవంతం చేయాలి వేడుకలను విజయవంతం చేయాలని మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. పిరమిడ్ ఆవరణలో గురువారం ట్రస్ట్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో భాగంగా వివిధ దేశాలు, రాష్ట్రా లకు చెందిన గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, మేధావులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతిరోజు 25 వేల మంది ధ్యానులు, సందర్శకులు హాజరుకానున్నారని, ఈమేరకు 10 లక్షల మందికి ఉచి త అన్నదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పా రు. 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు దామోదర్రెడ్డి, మాధవి, జేజీ నారాయణ, చంద్రశేఖర్, మహేశ్వరి, మీడియా ఇన్చార్జి భాస్కరానంద, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, సర్పంచ్లు సేవ్యా, శ్రీను పాల్గొన్నారు. -
ఫాంహౌస్ల్లో వేడుకలకు అనుమతి తప్పనిసరి
మొయినాబాద్: ఫాంహౌస్ల్లో నిర్వహించే ఎలాంటి వేడుకలకైనా అనుమతులు తప్పని సరి తీసుకోవాలని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతం అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో శుక్రవారం ఫాంహౌస్ నిర్వాహకులు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో లిక్కర్ వినియోగిస్తే ఎకై ్సజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. పార్టీల నిర్వహణకు ఫాంహౌస్లు ఇచ్చే ముందు అందరి వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లేదంటే సంఘటనకు కారణమైనవారితోపాటు యజమానులు, నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి, ఎస్సైలు నర్సింహారావు, వెంకన్న, నయీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి.. అమాంతం పైకెళ్లి
హుడాకాంప్లెక్స్: బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20 లోపే ఉండగా తాజాగా హోల్సేల్ మార్కెట్లో రూ.35 పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్లో రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి కూరలోనూ ఉల్లిని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. తాజాగా వీటి ధరలు పెరగడంతో నెలకు రెండు మూడు కిలోలు కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం కేజీ లోపుతోనే సరిపెట్టుకుంటున్నారు. అమాంతం పెరిగిన ధరలు సరిహద్దులోని బంగ్లాదేశ్ నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోయాయి. కర్ణాటక, మహారాష్ట్ర, సహా తెలు గు రాష్ట్రాల్లో పండించిన పంటను పశ్చిమ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తు తం పంట దిగుబడి కూడా లేదు. గోదాముల్లో నిల్వ చేసిన కొద్ది పాటి పంటను కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. దీంతో గ్రేటర్ జిల్లాల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్కు రోజుకు సగటున 25 లారీల ఉల్లి దిగుమతి అవుతుంది.నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ. 1,500 నుంచి రూ.1,800 వరకు పలికింది. ఇక్కడికి రావాల్సిన ఉల్లి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండటంతో ధర అమాంతం పెరిగింది. గడ్డ సైజు ను బట్టి క్వింటాల్కు రూ.3,500 పలుకుతోంది. కొండెక్కిన కోడు గుడ్డు సాధారణంగా చలికాలంలో గుడ్డును ఎక్కువగా తీసుకుంటుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆమ్లెట్, ఉడికించిన గుడ్డును అందిస్తుంటారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన గుడ్లను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో గుడ్డుపై 65 పైసలు ఎక్కువ వస్తుండటంతో రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ హోల్సేల్ గుడ్డు ధర రూ.6.66 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.8 పలుకుతోంది. ఒకవైపు ఉల్లి.. మరోవైపు కోడిగుడ్డు ధరలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు చూస్తే దడ ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఉల్లి, కోడిగుడ్డు కాంబినేషన్ పెరిగింది. మాంసాహారాల్లోనే కాదు శాఖాహారాల్లోనూ ఉల్లి తప్పనిసరైంది. రోజు కు కనీసం ఒకటి రెండు గడ్డలు అవసరం. నెలకు మూడు నుంచి నాలుగు కిలోలు కొనే దాన్ని. ప్రస్తుత ధరలతో సగానికి తగ్గించాను. ఇక కోడిగుడ్డు రోజుకు బదులు.. వారానికి ఒకటి రెండుసార్లే కొనుగోలు చేస్తున్నాం. – కృష్ణవేణి, గృహిణి -
మత్తుకు బానిసలు కావొద్దు
మొయినాబాద్: విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో డీఎస్పీ సైదులు అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ రెవెన్యూలో ఉన్న కేఎల్హెచ్ యూనివర్సిటీలో గురువారం ఎన్ఎస్ఎస్ యూని ట్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో లైన్స్క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం పబ్ సంస్కృతి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చెడు అలవాట్లకు దారితీస్తుందని అరు. కేసులు నమోదైతే విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. వృత్తిపరమైన అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. యువత, విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండి.. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు మల్లేష్, చంద్రశేఖర్, వెంకటరాజు, భవానిసుష్మ, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు పిల్లలతో గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దారపల్లి యాదయ్య తన భార్య వరలక్ష్మి(32), కుమారులు రాంప్రసాద్(12), సాయి(10), కుమార్తె అఖిల(8)లతో కలిసి ఏడాది క్రితం తుక్కుగూడకు జీవనోపాధి నిమిత్తం వలస వచ్చారు. యాదయ్య పార పని చేస్తుండగా, వరలక్ష్మి హోటల్లో పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీన యాదయ్య ఇంట్లో ఉండగా, భార్య హోటల్కు వెళ్లింది. పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు తల్లి వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయారు. ఎంతకి ఇంటికి రాకపోవడంతో వారి ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై యాదయ్య పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. -
పల్లె పోరులో అద్వితీయ విజయాలు
భర్త కారోబార్.. భార్య సర్పంచ్ యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలువురి సర్పంచుల విజయం చర్చనీయాంశంగా మారింది. యాచారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మస్కు అనిత గెలుపొందారు. ఆమె భర్త శివశరణం ప్రస్తుతం గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వర్తిసున్నారు. అనిత కాంగ్రెస్ మద్దతుతో మాజీ ఎంపీపీ కొప్పు సుకన్యను 300 ఓట్ల తేడాతో ఓడించారు. మాజీ ఎంపీటీసీల భర్తల గెలుపు యాచారం: మండల పరిధిలోని మంతన్గౌరెల్లి ఎంపీటీసీగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన కొర్ర జ్యోతినాయక్ భర్త కొర్ర అరవింద్ నాయక్(కాంగ్రెస్) ఆ గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుదారుడైన యాదయ్యగౌడ్ను 200లకు పైగా ఓట్లతో ఓడించారు. యాదయ్యగౌడ్ ప్రస్తుతం యాచారం పీఏసీఎస్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మల్కీజ్గూడ గ్రామ ఎంపీటీసీగా సేవలందించిన డేరంగుల శారద ఆమె శంకర్ ప్రస్తుతం సర్పంచ్గా గెలుపొందారు. ఒక పర్యాయం ఎంపీటీసీ కందుకూరు: సర్పంచ్గా ఎన్నికై న సరికొండ పాండు 2019 నుంచి ఐదేళ్ల పాటు ఎంపీటీసీ సభ్యుడిగా కొనసాగారు. ప్రస్తుతం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధించారు. ఎంపీటీసీ అనంతరం సర్పంచ్గా గెలుపొందడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కారోబారే సర్పంచ్ యాచారం: మండల పరిధిలోని నస్దిక్సింగారం గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వర్తించిన బోడ కృష్ణ సర్పంచ్గా గెలుపొందారు. తన ప్రత్యర్థి చింతుల్ల చిత్తారి(కాంగ్రెస్) మీద వందకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. కారోబార్గా పనిచేస్తూ సమస్యలను గుర్తించానని, సర్పంచ్గా గెలుపొందడంతో బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తానని కృష్ణ పేర్కొన్నారు. నాడు తండ్రి.. నేడు కొడుకు యాచారం: మండల పరిధిలోని చింతపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా గతంలో తోట్ల మల్లయ్య బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమేశ్ ఆ గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. తక్కళ్లపల్లి తండా గ్రామ సర్పంచ్గా రమావత్ జగదీష్ సర్పంచ్గా పనిచేయగా ప్రస్తుతం ఆయన తల్లి కౌసల్య సర్పంచ్గా విజయం సాధించారు. గడ్డమల్లయ్యగూడ గ్రామంలో గతంలో అచ్చెన జంగయ్య ఆ గ్రామానికి సర్పంచ్గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం ఆయన భార్య మంగ సర్పంచ్గా గెలుపొందారు. నాడు ఎంపీపీ.. నేడు సర్పంచ్ కందుకూరు: మండల పరిధిలోని గుమ్మడవెల్లికి చెందిన పల్స మహేశ్గౌడ్ 1995–2001 వరకు ఉప సర్పంచ్గా, 2001–2006 మధ్య ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి ఎంపీపీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధించారు. ప్రజా మద్దతుతో ఈ విజయాలు సాధ్యం అయ్యాయని పేర్కొన్నారు. మూడోతరం నేత యాచారం: మండల పరిధిలోని తమ్మలోనిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా దెంది రాంరెడ్డి(కాంగ్రెస్) 489 ఓట్లతో గెలు పొందారు. వారి ఇంట్లో మూడో తరం సర్పంచ్గా పేరుగాంచారు. చింతపట్ల గ్రామ పంచాయతీ కింద తమ్మలోనిగూడెం అనుబంధ గ్రామంగా ఉండేది. ఆ గ్రామానికి 1959 మొదటి సారి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దెంది రాంనాథ్రెడ్డి సర్పంచ్గా గెలుపొందారు. తర్వాత రాంనాథ్రెడ్డి కుమారుడు పర్వత్రెడ్డి సర్పంచ్గా పనిచేశాడు. ప్రస్తుతం రాంరెడ్డి మూడోతరం సర్పంచ్గా గెలుపొందారు. అప్పుడు భర్త ఇప్పుడు భార్య కందుకూరు: మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో 2019–2024 జనవరి వరకు కాసుల రామకృష్ణారెడ్డి సర్పంచ్గా సేవలందించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా ఆయన భార్య కాసుల స్వాతి విజయం సాధించారు. దీంతో భార్య, భర్త ఇద్దరు సర్పంచ్లుగా గెలిచినట్లయింది. గతంలో ఎంపీటీసీగా.. కందుకూరు: మండల పరిధిలోని చిప్పలపల్లికి చెందిన సురమోని లలిత 2019 నుంచి ఐదేళ్ల పాటు ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె చెప్పారు. -
బడా నేతలకు ఝలక్!
యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ నేతలను ఖంగు తినేలా చేశాయి. పార్టీలోనే కీలక పదవులు.. కానీ సొంత గ్రామాల్లో మాత్రం ప్రజల నుంచి వారికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం పార్టీలో కీలక పదవుల్లో కొనసాగుతున్న నేతల స్వగ్రామాల్లో వారు పోటీలో నిలబెట్టిన సర్పంచ్, వార్డు సభ్యులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. రూ.లక్షలాధి ఖర్చు చేసి, కాళ్లకు గజ్జలు కట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా తమ మద్దతుదారులను గెలిపించుకోకపోవడం గమనార్హం. ఏళ్లుగా రాజకీయాల్లో అరితెరిన నాయకులు ఓటమిపాలు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. మద్దతు దారుల ఓటమిని తెలుసుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలు తమ పార్టీ నేతల వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. యాచారంలో ఉల్టా.. పల్టా! మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మేజర్ గ్రామాలైన యాచారంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న కొప్పు బాషా గ్రామ పంచాయతీ సర్పంచ్గా తన భార్య కొప్పు సుకన్య(మాజీ ఎంపీపీ)ను పోటీలో నిలబెడితే ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అంగోత్ వెంకటేష్ తక్కళ్లపల్లి తండాలో తన భార్య విజయను బరిలో పెడితే ఓడిపోయారు. గునుగల్లో పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్రెడ్డి సర్పంచ్గా పోటి చేసి ఓటమి పాలయ్యారు. మంతన్గౌరెల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ తన మద్దతుదారుడైన పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్యగౌడ్ను సర్పంచ్గా పోటీలో నిలబెడితే పరాజయం చెందారు. నక్కర్తమేడిపల్లిలో సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తన భార్య లావణ్యను సర్పంచ్ బరిలో నిలబెడితే ఓటమి చెందారు. నందివనపర్తిలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బిలకంటి చంద్రశేఖర్రెడ్డిలు కాంగ్రెస్ నుంచి పేరుమల్ల రవిని పోటిలో నిలబెడితే పరాజయం చెందారు. ఆయా పార్టీల్లో కీలక నేతలున్న గ్రామాల్లో వారి మద్దతుదారులు ఓటమిపాలు కావడంతో మండలంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఊర్లల్లో బోల్తాపడిన ఉద్దండులు పంచాయతీ ఎన్నికల్లో పలువురికి భంగపాటు ఊహించని ఓటమితో అంతర్మథనం రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వైనం -
తమ్ముడిపై అన్న విజయం
మహేశ్వరం: మండల పరిధిలోని పెండ్యాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి తోడబుట్టిన అన్నదమ్ములు పోటీ పడ్డారు. ఈ పోరులో తమ్ముడిపై అన్న విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి జైత్వారం జగనోహ్మన్రెడ్డి(అన్న), బీజేపీ బలపర్చిన అభ్యర్థి జైత్వారం శ్రీధర్రెడ్డి(తమ్ముడు) పోటీ పడ్డారు. బుధవారం ఫలితాల్లో జగన్మోహన్రెడ్డి 143 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. జగన్మోహన్రెడ్డికి 565 ఓట్లు, శ్రీధర్రెడ్డికి 422 ఓట్లు వచ్చాయి. -
సర్పంచులుగా అక్కాచెల్లెళ్లు
మహేశ్వరం: మూడో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్కాచెల్లెళ్లు సర్పంచ్లుగా గెలుపొందారు. మండల పరిధిలోని దిలావార్గూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా సభావత్ మంజుల(అక్క) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోత్వాల్ చెర్వుతండా గ్రామ సర్పంచ్గా జాటోత్ సుజాత(చెల్లి) గెలుపొందారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. వీరి పుట్టినిళ్లు దుబ్బచర్ల గ్రామం. మంజుల కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలవగా, సుజాత బీఆర్ఎస్ సపోర్ట్తో విజయం సాధించారు. పార్టీలు వేరైనా గ్రామ అభివృద్ధి విషయంలో చర్చించుకుంటామని వారు తెలుపుతున్నారు. సోదరీమణులు గెలవడంతో వారి బంధువులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
నా విగ్రహావిష్కరణ నేడే!
● బంధువులు, సన్నిహితులకు ఆహ్వానం ● విభిన్న కార్యక్రమంతో అందరినీ ఆకర్షిస్తున్న ‘అమెరికా ఆదర్శ రైతు’ ● తన వ్యవసాయ క్షేత్రంలో విగ్రహాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు మొయినాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యవసాయం చేసి, ఆదేశంలో ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్న ఓ వ్యక్తి వినూత్న కార్యక్రమంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.. ఆయనే కళ్లెం నర్సింహారెడ్డి. తాను బతికి ఉండగానే తనతో పాటు తన భార్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని కందికల్గేట్కు చెందిన కళ్లెం రాజిరెడ్డి, పెంటమ్మ దంపతులకు 1937లో నర్సింహారెడ్డి జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు. పుట్టింది రంగారెడ్డి జిల్లా కోహెడలో అయినా.. పెరిగింది అంతా చాంద్రాయణగుట్ట సమీపంలోని కందికల్గేట్లోనే. శాలిబండ హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు. చిన్నతనం నుంచే వ్యవసాయంపై మక్కువ. నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరంతా అమెరికాలో స్థిరపడటంతో 1975లో ఆయన కూడా అమెరికా వెళ్లారు. అక్కడ ఐదువేల ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 30 ఏళ్ల పాటు వ్యవసాయం చేశారు. రకరకాల పంటలు పండించి ఆదర్శరైతుగా నిలిచారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. మాతృభూమిపై మమకారం.. మాతృభూమిపై ఉన్న మమకారంతో 2005లో నర్సింహారెడ్డి తెలంగాణకు వచ్చారు. నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో మూడున్నర ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఓ వైపు పంటలు సాగుచేస్తూనే మరోవైపు పలు సాంస్కృతిక సంఘాలకు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. నీతోడుగా నేనుంటా.. గత ఏడాది డిసెంబర్లోనే తన వ్యవసాయ క్షేత్రంలో నర్సింహారెడ్డి తన భార్యతో కలిసి ఆయన విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. కానీ ఈ విగ్రహం బాగోలేదని భావించారు. ఇటీవల తన భార్య మరణించడంతో రాజస్థాన్ వెళ్లి తనతో పాటు భార్య విగ్రహాన్ని తయారు చేయించి వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చారు. శుక్రవారం బంధువులు, స్నేహితుల మధ్య వీటిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తన భార్యకు తానెప్పుడూ తోడుగా ఉంటానని, అందుకే ఆమె పక్కనే, తన విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయించానని చెబుతున్నారు. అందరూ రావాలని బంధువులు, సన్నిహితులను ఆహ్వానించారు. -
కట్టమైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
మొయినాబాద్: అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులు దోచుకెళ్లారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని సురంగల్లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్ పెద్దచెరువు కట్టపై ఉన్న మైసమ్మ దేవాలయంలోని హుండీని దుండగులు రాత్రి వేళ ధ్వంసం చేశారు. అందులో ఉన్న డబ్బులు దొంగిలించి హుండీని ఆలయం నుంచి 50 మీటర్ల దూరంలో పడేశారు. గురువారం ఉదయం చెరువుకట్టపైకి వెళ్లిన మున్సిపల్ సిబ్బంది ధ్వంసమైన హుండీని గమనించి గ్రామస్తులకు తెలియజేశారు. స్థానికులు పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీలో సేకరించారు. సురంగల్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద హుండీని దొంగలించడం ఇప్పటికీ మూడోసారి కావడం గమనార్హం. -
నిద్రలోనే నూరేళ్లు నిండాయి
● ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం ● దుకాణంలోకి దూసుకెళ్లిన కారు మైలార్దేవ్పల్లి: అతివేగం.. డ్రైవింగ్లో నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన తండ్రీకొడుకులు అసువులు బాశారు. నిద్రలోనే వారికి నూరేళ్లు నిండాయి. మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విశ్వనాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే యువకుడు తన స్నేహితులు మరో ఐదుగురితో కలిసి శంషాబాద్ నుంచి ఇన్నోవా కారులో తెల్లవారుజామున తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ప్రభు మహారాజ్ కుటుంబ సభ్యులు దుర్గానగర్ ప్రాంతంలో దుప్పట్లు, రగ్గుల విక్రయ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోజు మాదిరిగానే వారు దుకాణంలో నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కారు అతివేగంతో వచ్చి అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో నిద్రిస్తున్న ప్రభు మహరాజ్ (60), దీపక్ (25), సంతునాథ్ (27)పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రభు మహరాజ్, దీపక్ అక్కడికక్కడే మృతి చెందారు. సంతునాథ్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సయ్యద్ హుస్సేన్ నిద్ర మత్తులో ఉండటంతో పాటు మంచు కురుస్తుండటంతో కారు బీభత్సం సృష్టించిందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాయిచరణ్
ఆమనగల్లు: జాతీయ స్థాయి అండర్–17 విభాగం కబడ్డీ పోటీలకు మండల పరిధిలో ని దయ్యాలబోడు తండాకు చెందిన ఎన్.సాయిచరణ్ ఎంపిక్యాడు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయి చరణ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు మధ్యప్రదేశ్లో నిర్వహించనున్న జాతీయ పోటీలకు ఆయన్ను ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, అధ్యాపకబృందం విద్యార్థిని అభినందించారు. 19న పట్టుబడిన వాహనాల వేలం ఆమనగల్లు: ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా డిపాజిట్ చెల్లించాలని సూచించారు. రోహింగ్యా యువకుడి దారుణ హత్య పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శరణార్థులుగా నివాసం ఉంటున్న బర్మా దేశస్తుల(రోహింగ్యాలు) క్యాంప్లో ఓ యువ కుడు హత్యకు గురయ్యాడు. ఇన్స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ కాలనీలోని బర్మా(మయన్మార్) క్యాంప్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఆ దేశానికి చెందిన ముర్షీద్(19), అబ్దుల్లా (20) మద్యం మత్తులో చిన్న చిన్న విషయాలను మనసులో ఉంచుకొని పరస్పరం దూషించుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్లా ఇంట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి ముర్షీద్ వీపు, మెడ భాగాలలో విచక్షణా రహితంగా 15 పోట్ల వరకు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్లు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చిరు వివాదంతోనే 15 కత్తి పోట్లు పొడిచాడా? అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్త మవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నేరాల నియంత్రణకు పరిధులు చూడొద్దు నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: మహా నగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో పోలీసుస్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డు కాకూడదని నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని సూచించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో(టీజీ ఐసీసీసీ) బుధవారం మూడు కమిషనరేట్లకు సంబంధించి కీలక సమన్వయ సమావేశం సజ్జనర్ అధ్యక్షతన జరిగింది. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అవినాష్ మహంతి, జి.సుధీర్బాబులతో పాటు ఉన్నతాధికారులందరూ ఇందులో పాల్గొన్నారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో నేరగాళ్లు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి క్షేత్రస్థాయి అధికారులు తీసుకువచ్చారు. పోలీసులు కాలయాపన చేయడంతో నేరగాళ్లు తప్పించుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని సజ్జనర్ అన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి అన్నది చూడకుండా పోలీసులు వెంటనే స్పందించాలన్నారు. రౌడీ షీటర్లు, నేరగాళ్లు తరచూ తమ నివాసాలను మారుస్తున్నారని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడికి ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. -
పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్గా జ్యోతినరేందర్రెడ్డి
కేశంపేట: మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్గా తాండ్ర జ్యోతినరేందర్రెడ్డి ఎన్నికయ్యారు. తొలి విడతలో భాగంగా ఈనెల 11నసర్పంచ్తో పాటు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తయినా, కోరం లేకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ సమక్షంలో బుధవారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. పది మంది వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ హాజరయ్యారు. మూడో వార్డు నుంచి గెలుపొందిన జ్యోతికి ఐదుగురు వార్డు సభ్యులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ఉప సర్పంచ్గా ఎన్నికై నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. సీఐ నరహరి బందోబస్తును పర్యవేక్షించారు. 12 మంది ఉప సర్పంచ్ల ఎన్నిక ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గానూ 12 చోట్ల బుధవారం ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. చర్లపటేల్గూడ, ఉప్పరిగూడ ఉప సర్పంచ్ల ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు. ఉప సర్పంచ్లు వీరే.. దండుమైలారం జి.విజయలక్ష్మి, కప్పపహాడ్ పి.రమేశ్, కర్ణంగూడ వై.రవిందర్రెడ్డి, ముకునూర్ ఆర్.పావణి, నాగన్పల్లి పి.జంగయ్య, నెర్రపల్లి వేణుగోపాల్రెడ్డి, పోచారం ఎం.కృష్ణ, పోల్కంపల్లి కె.వెంకటేశ్, రాయపోల్ జి.శేఖర్రెడ్డి, తుర్కగూడ ఏనుగు వెంకట్రెడ్డి, తులేకలాన్ డి.జంగయ్య, ఎల్మినేడు ఎం.వెంకటప్రతాప్రెడ్డి ఉప సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ‘గండిపేట’లోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం గలీజవుతోంది. సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఏన్నాళ్ల నుంచి జరుగుతుందోగాని బుధవారం స్థానికులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. బుధవారం ఇక్కడ ఉన్న కట్టపై ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలోకి వదులుతున్నారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ను నిలదీశారు. స్థానికులు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్ను ప్రశ్నించారు. శివనాయక్కు సంబంధించిన వాహనమని.. హిమాయత్నగర్ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నట్లు డ్రైవర్ చెప్పాడు. దీంతో డీజీఎం నరహరి మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజు విద్యుత్ అంతరాయం 11 కేవీ ప్యూజ్ సెట్పై ఇనుప తీగను వేసిన గుర్తు తెలియని వ్యక్తి యాచారం: ఎన్నికల వేళ మండలంలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాలో బుధవారం తీవ్ర అంతరాయం కలిగింది. గుర్తు తెలియని వ్యక్తి గ్రామంలోని 11 కేవీ ఫ్యూజ్ సెట్పై ఇనుప తీగను వేశాడు. దీంతో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరాలో రెండు గంటలకు పైగా అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సరూర్నగర్ డివిజన్ ఎస్ఈ లక్ష్మీనారాయణ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను సందర్శించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పోలింగ్, కౌటింగ్ వేళ గ్రామంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉన్నతాధికారుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. -
హోరాహోరీ!
మహేశ్వరం మండల కేంద్రం వద్ద కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూడో విడత పంచాయతీ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలు బలపర్చిన మద్దతుదారుల మధ్య హోరాహోరీగా సాగాయి. ఏడు మండలాల్లోని 174 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించాయి. ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చిన కందుకూరు మండలం మీర్ఖాన్పేట సహా బేగరికంచె ఓటర్లు మాత్రం అధికార పార్టీని అంతర్మథనంలోకి నెట్టినప్పటికీ.. మిగతా చోట్ల హస్తం పార్టీకే పట్టం కట్టారు. ఇక యాచారం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య ఓటింగ్ నువ్వా.. నేనా అనేలా కొనసాగింది. కందుకూరులో 35 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వీటిలో 12 స్థానాలను బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోగా, మరో 13 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు జయకేతనం ఎగరేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి.కిషన్రెడ్డి స్వగ్రామమైన కందుకూరు మండలం తిమ్మాపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి జి.అంజమ్మను గెలిపించుకొని పట్టు నిలుపుకొన్నారు. ఇక ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి స్వగ్రామమైన కొత్తగూడలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొక్క సువర్ణ విజయం సాధించారు. తిమ్మాపూర్ సర్పంచ్ అంజమ్మను కేంద్ర మంత్రి అభినందించారు. మహేశ్వరం మండలంలో 30 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. హస్తం ఖాతాలో 12 స్థానాలు, బీఆర్ఎస్ ఖాతాలో 12 చొప్పున పడ్డాయి. ఐదు స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, ఒక చోట మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మండలంలో 14 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, ఎనిమిది చోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ మాత్రం ఐదు స్థానాలకే పరిమితమైంది. ఒక చోట బీజేపీ మద్దతుదారు విజయం సాధించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మళ్లీ తన పట్టు నిలుపుకొన్నారు. మంచాలలో అత్యధికం.. మెట్లో అత్యల్పం మూడో విడత ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలై.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. చలి తీవ్రతకు తోడు, విపరీతమైన మంచు కారణంగా ఉదయం మందకొండిగా సాగిన ఓటింగ్ ప్రక్రియ 11 తర్వాత ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వాళ్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మంచాల, యాచారం, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మండలాల పరిధిలోని మొత్తం 174 పంచాయతీలు, 1598 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో పది సర్పంచ్ స్థానాలు సహా 142 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు 559 మంది పోటీ పడ్డారు. 1,448 వార్డులకు 4,091 మంది పోటీపడ్డారు. కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి సర్పంచ్, 8 వార్డుల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 2,93,852 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2,53,371 మంది (86.22 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు, మహేశ్వరం పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు. అత్యధిక ఓటింగ్ శాతం మంచాల మండలంలో నమోదు కాగా, అత్యల్ప ఓటింగ్ శాతం అబ్దుల్లాపూర్మెట్లో రికార్డు అయింది. పోలింగ్ శాతం ఇలా..మండలం మొత్తం ఓటర్లు ఓటు వేసిన వారు శాతం అబ్దుల్లాపూర్మెట్ 35,267 27,864 79.01 ఇబ్రహీంపట్నం 31,835 28,502 89.53 కందుకూరు 50,874 44,686 87.84 మాడ్గుల 42,200 36,717 87.01 మహేశ్వరం 44,096 36,416 82.58 మంచాల 39,385 35,739 90.74 యాచారం 50,195 3,447 86.56 మూడో విడతలో గెలుపొందిన ఆయా పార్టీల మద్దతుదారులు ఇలా.. మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు అబ్దుల్లాపూర్మెట్ 07 04 01 02 ఇబ్రహీంపట్నం 05 08 01 – కందుకూరు 13 09 12 01 మాడ్గుల 23 06 – 03 మహేశ్వరం 12 12 05 01 మంచాల 10 08 02 03 యాచారం 10 07 05 02 -
జోక్యం చేసుకోలేం..
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై పిటిషన్ల దాఖలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వార్డుల్ఢసంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డీలిమిటేషన్లో భాగంగా చేపట్టిన జనాభా వివరాలు, మ్యాప్లు బహిర్గతం చేయడంతో వచ్చే నష్టమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 24 గంటల్లో వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించింది. వీటిపై అభ్యంతరాలు సమర్పించేందుకు పిటిషనర్లు, ప్రజలకు మరోరెండు రోజులు అవకాశం ఇచ్చింది (వాస్తవానికి ఈ నెల 17తో అభ్యంతరాలకు గడువు ముగిసింది). విభజనలో లోపాలున్నాయన్న పిటిషనర్ల వాదనపై.. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నిబంధనలు పాటించలేదు.. జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్యను పెంచుతూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పొన్న వెంకట్ రమణ, మరో ఇద్దరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లు (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996 ప్రకారం నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. అలియాబాద్ ప్రాంతాన్ని రెండు వార్డులుగా విభజించడంతో ప్రజా సౌకర్యాల లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ స్థానిక స్వపరిపాలనకు అంతరాయం కలిగిస్తుందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన అధ్యయన నివేదిక ఆధారంగా, జీవో 266 ప్రకారం డీలిమిటేషన్ కసరత్తు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అభ్యంతరాలపై రెండ్రోజులు గడువు పెంచిన హైకోర్టు మ్యాప్లు, జనాభా లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సూచన స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి న్యాయస్థానం విముఖత విస్తృత అధ్యయనం చేసిన తర్వాతే.. ‘డీలిమిటేషన్ నిబంధనల్లోని 5వ నిబంధన ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా వార్డుల ఏర్పాటు తప్పనిసరి. వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించకూడదు. విభజన తర్వాత వార్డుల జనాభా గణాంకాలను వెల్లడించలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో మ్యాప్లు, సరిహద్దు వివరణ, ఇంటి సంఖ్య వివరాలు లేవు. ఇలా ఉంటే ప్రజలు వార్డు పరిమితులను గుర్తించడం అసాధ్యం. అలాగే ప్రభుత్వం పరిపాలనా, భౌగోళిక సామీప్యతను ఉల్లంఘించింది. కొన్ని వార్డులు బహుళ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ప్రాథమిక నోటిఫికేషన్ను జీహెచ్ఎంసీ ప్రతినిధి జనరల్ బాడీ ముందు సరిగా ఉంచలేదు’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వార్డుల విభజన ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. విస్తృత అధ్యయనం, చర్చల తర్వాత చేపట్టామన్నారు. ‘ఇది ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు మున్సిపాలిటీల విస్తరణతో పరిపాలనలో సత్ఫతాలిస్తుంది. ఇప్పటికే 3,102 అభ్యంతరాలు వచ్చాయి. ప్రతిదానికీ ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాం. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, తగిన విధంగా స్పందిస్తాం’ అని చెప్పారు. పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జె. ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను అర్థవంతంగా పరిగణించలేదని, వార్డుల వారీగా జనాభా డేటాను బహిర్గతం చేయలేదన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి.. వార్డుల విభజన ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించారు. కాగా.. పారదర్శకత అవసరమని నొక్కి చెప్పారు. వార్డుల వారీగా జనాభా వివరాలు, ప్రామాణీకరించిన మ్యాప్లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలు రెండు రోజుల వ్యవధిలో మరిన్ని అభ్యంతరాలు లేవనెత్తవచ్చని హైకోర్టు సూచించింది. -
ఆమే కీలకం
● మండలంలోని పది గ్రామాల్లో మహిళా ఓటర్లే అధికం ● సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను శాసించనున్న అతివలు ఇబ్రహీంపట్నం: మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు, 140 వార్డులకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 31,835 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 15,780, మహిళలు 16,053 మంది, ఇతరులు ఇద్దరున్నారు. పురుషులకంటే 273 మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఒక్కో ఓటు కీలకమే.. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుల ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. అవే ఫలితాలను తారుమారు చేస్తాయి. ఏ ఒక్క ఓటు చేజారకుండా అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేశారు. అతి తక్కువగా కర్ణంగూడలో .. మండలంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామం కర్ణంగూడ. ఈ గ్రామంలో కేవలం 697 మంది ఓటర్లే ఉండటం గమనార్హం. అదేవిధంగా అత్యధికంగా దండుమైలారంలో 4,959 మంది ఉన్నారు. సుమారు రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికల కోసం నిరీక్షించిన అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో గెలవడం ఓ పరీక్షలా మారింది. అంగ, అర్థ, బంధు బలగాలతో ప్రచారంతోపాటు, ఓటర్లకు తాయిలాలను సమర్పించి ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీల మద్దతుదారులు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలతో పంచాయతీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం సాగింది. ఇక ఓటర్ల తీర్పు ఏరకంగా ఉంటుందో వేచిచూడాల్సిందే. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు గ్రామపంచాయతీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం చర్లపటేల్ గూడ 951 941 – 1,892 దండుమైలారం 2,456 2,503 – 4,959 ఎలిమినేడు 1,653 1,734 – 3,387 కప్పపహాడ్ 909 935 – 1,844 కర్ణంగూడ 339 358 – 697 ముకునూర్ 591 579 1 1,171 నాగన్పల్లి 865 864 1 1,730 నెర్రపల్లి 710 542 – 1,052 పోచారం 1,083 1,088 – 2,171 పోల్కంపల్లి 1,646 1610 – 3,256 రాయపోల్ 2,475 2,481 – 4,956 తుర్కగూడ 505 546 – 1,051 తులేకలాన్ 942 1,000 – 1,942 ఉప్పరిగూడ 855 872 – 1,727 -
కన్నతల్లే కర్కశురాలై
● అపార్ట్మెంట్ పైనుంచి బిడ్డను కిందకు తోసేసిన వైనం ● అక్కడికక్కడే మృతిచెందిన ఏడేళ్ల చిన్నారి మల్కాజిగిరి: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు నెట్టేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెల్పిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న వాదనలు చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విన్పిస్తున్నాయి. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం
కడ్తాల్: చరికొండకు చెందిన పాలకూర్ల లక్ష్మమ్మ–రాములుగౌడ్ కుటుంబం 30 ఏళ్లుగా ప్రజా ప్రతినిధులుగా సేవలందిస్తున్నారు. లక్ష్మమ్మ 1996లో తొలి సారి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం 2006లో జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో విజయంసాధించారు. అనంతరం ఆమె భర్త రాములుగౌడ్ 2019లో ఎంపీటీసీ సభ్యుడిగా సేవలు చేశారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వీరి కుమారుడు మహేందర్గౌడ్ సర్పంచ్గా పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది. నాడు తనయుడు.. నేడు తల్లి కడ్తాల్: మండల పరిధిలోని చల్లంపల్లి గ్రా మంలో రెండు పర్యాయాలు ఉత్కంఠగా సాగిన పోరులో నాడు తనయుడు, నేడు తల్లికి సర్పంచ్ పదవులు వరించాయి. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామం ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన నాయిని నరేందర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచారు. 2019లో బీసీలకు రిజర్వ్ కావడంతో ఆయన పోటీ చేయడం కుదరలేదు. ఇటీవల ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో నాయిని నరేందర్ తల్లి యశోధ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారు రేవల్లి మల్లమ్మపై 44 ఓట్లతో విజయం సాధించారు. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించిన దంపతులు కడ్తాల్: మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన దంపతులు వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించారు. 2018లో జీపీగా ఆవిర్భవించిన ఈగ్రామంలో 2019లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా, ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో తండాపెద్దలు సమావేశమై లోకేశ్నాయక్ను ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈనెల 14న జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. దీంతో లోకేశ్నాయక్ సతిమణి నీలావతి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి అంజమ్మపై 35 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లకు అభినందనలు -
పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలి
ఎమ్మెల్యే కాలె యాదయ్యచేవెళ్ల: స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని రావుపల్లి గ్రామ సర్పంచ్ గోటూరి రాంచంద్రయ్యగౌడ్, వార్డుసభ్యులతో కలిసి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను సన్మానించి.. స్వీట్లు తినిపించారు. ఆయనను కలిసిన వారిలో పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, ఉపసర్పంచ్ అనూషఅంజన్కుమార్, వార్డుసభ్యులు మల్లీశ్వరి, జ్యోతి వెంకటేశ్, గోపాల్, మాజీ ఉపసర్పంచ్ నాగిరెడ్డి, ప్రకాశ్రెడ్డి, గ్రామ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్లో చేరిక.. మండలంలోని నాల్యట గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎల్లయ్య, తన అనుచరులతో మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో న్యాలట గ్రామ నాయకులు, యవకులు ఉన్నారు. -
దొంగ ఓట్లు వేసినా పట్టించుకోలేదు
ఓటమిపాలైన అభ్యర్థుల ఆవేదన మొయినాబాద్ రూరల్: మండల పరిధిలోని కుత్బుద్దీన్గూడలో దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకుని రిటర్నింగ్ అధికారులు, పోలీసులకు అప్పగించినా పట్టించుకోలేదని ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ముజాహిద్ఆలీ, మిరాజుద్దీన్ ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కుత్బుద్దీన్గూడలో 1,725 మంది ఓటర్లు ఉన్నారని, ఈనెల 14న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 1,404 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ సమయంలో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వారిలో సుమారు పది మందిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కొద్దిసేపటి తర్వాత వదిలేశారని పేర్కొన్నారు. యూఎస్, దుబాయ్లో ఉన్న వారి పేర్లతో ఇతరులు వచ్చి ఓట్లు వేశారన్నారు. ఓటరు జాబితాలోని చాలా మంది హైదరాబాద్లో ఉంటారని, వీరి పేరుతో నగరం వచ్చిన వారిలో చాలా మంది దొంగ ఓట్లు వేశారని తెలిపారు. భోజనం చేస్తూ వ్యక్తి మృతి షాబాద్: భోజనం చేస్తుండగా గొంతులో అన్నం ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్కు చెందిన చిల్కమర్రి జంగయ్య (50) సోమవారం రాత్రి భోజనం చేస్తుండగా, ఒక్కసారిగా సరం పడింది. ఆయాస పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణం వదిలాడు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేందర్గౌడ్, సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ రాహుల్ గుప్త బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. గొడవలకు కారణమైన పలువురి బైండోవర్ చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాడులకు పాల్పడిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు చేవెళ్ల ఎస్ఐ సంతోష్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం 13 మందిని అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కృష్ణయ్య ఎదుట బైండోవర్ చేశామన్నారు. గత 14న సింగప్పగూడలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థి తరఫు వ్యక్తులు, గెలపొందిన సర్పంచ్ మద్దతుదారుడు వెంకటేశ్వర్రెడ్డిపై దాడి చేశారు. ఈకేసుతో సంబంధం ఉన్న వారిని బైండోవర్ చేసి, రూ.5 లక్షల పూచీకత్తుపై వదిలేశామన్నారు. కేసు నమోదైన వారిలో షేక్ ఫయాస్, అలీ హస్నన్, ములుగు ప్రమోద్రెడ్డి, మహమ్మద్ అర్షద్, ఎండీ ఆదిల్, ఎండీ ఫెరోజ్, ఎండీ అద్నాన్, ఎండీ సల్మాన్, అస్లాం, ఆరిఫ్, జాఫర్పాషా, రవికిరణ్రెడ్డి, ఎండీ సుమేర్ ఉన్నట్లు తెలిపారు. ఎయిర్హోస్టెస్తో అసభ్య ప్రవర్తన అబిడ్స్ పోలీస్స్టేషన్కు ఐఎస్ఓ గుర్తింపుఅబిడ్స్: అబిడ్స్ పోలీస్స్టేషన్కు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) సంస్థ అబిడ్స్ పోలీస్స్టేషన్కు 2025 గుర్తింపునిచ్చింది. సంస్థ ప్రతినిధులు అబిడ్స్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఏ ఇమాన్యుయేల్కు సర్టిఫికెట్ను అందజేసి ప్రశంసించారు. ఈ పోలీస్స్టేషన్లో సిబ్బంది పనితీరు, రిసెప్షనిస్ట్ సేవలు, పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల ప్రవర్తించే విధానాలు, పోలీస్స్టేషన్లో పరిశుభ్రత, స్టేషన్లో స్బింది ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని ఐఎస్ఓ అంతర్జాతీయ సంస్థ గుర్తింపు ప్రకటించింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇమాన్యుయేల్ మాట్లాడతూ...పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సరైన న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీస్స్టేషన్కు ఐఎస్ఓ గుర్తింపు లభించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తమ సిబ్బంది, ఎస్ఐలు, అందరి కృషి తోనే ఈ గుర్తింపు లభించందన్నారు. -
కేఎల్హెచ్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలు
మొయినాబాద్: నూతన ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యంలో విద్యార్థుల ప్రతిభకు ‘ఐడియా ఎక్స్ప్రో 2025’ వేదికగా నిలిచింది. అజీజ్నగర్ రెవెన్యూలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో డిజైనింగ్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఐడియా ఎక్స్ప్రో 2025 ఘనంగా నిర్వహించారు. తొలి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధ(ఏఐ), సమాచార సాంకేతికత, సామాజిక ఆవిష్కరణ వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ వైస్ చైర్మన్ మిహిర్కుమార్ పరియాల్, సీఎస్ఆర్, ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ సుదర్శనం, ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న బ్యాగు ప్రయాణికుడికి అప్పగింత -
అప్రమత్తంగా ఉండాలి
మహేశ్వరం: మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులు, అధికారులకు సహకరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆయన ఏసీపీ జానకిరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమతి లేని వారిని, ఓటరు కానివారిని పోలింగ్ బూత్ల్లోకి అనుమతించొద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
విభజనపై రగడ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ వార్డుల (కార్పొరే టర్ల డివిజన్ల) డీలిమిటేషన్పై మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు ఫిర్యాదులు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అడ్డగోలుగా చేశారని, కనీసం మేయర్కు తైలియకుండానే చేయడంలో ఆంతర్యమేటని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యాల కోసం డీలిమిటేషన్ అని చెబుతూ.. ప్రజలు, ప్రజాప్రతినిధులకు సైతం తెలియకుండా గోప్యంగా, త్వరితంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రెండు పార్టీ లకు అనుకూలంగా ఉండేలా చేశారని ఆరోపించారు. ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో డీలిమిటేషన్ చేశారంటూ బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ సభ్యులు డీలిమిటేషన్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్, మ్యాపుల పత్రాల్ని చించి సభలో విసిరేశారు. సభ ప్రారంభం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా, సాయంత్రానికి తీవ్ర గందరగోళానికి దారి తీయడంతో మేయర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సభ్యుల అభ్యంతరాలు, సూచనలన్నీ నోట్ చేసుకున్న కమిషనర్ వాటిని సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి నివే దించాల్సిందిగా సూచించారు. సభ వాయిదా అనంతరం బీజేపీ సభ్యులు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. విస్తీర్ణం పెరిగితే చాలదు కేవలం గూగుల్ మ్యాపులు, ల్యాప్టాప్లతో పని చేశారని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ (బీఆర్ఎస్) పునరుద్ఘాటించారు. దేశంలోనే పెద్దదిగా చూపేందుకు.. మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండా కేవలం విస్తీర్ణం పెంపుతోనే డీలిమిటేషన్ చేయడం తగ దన్నారు. కనీసం మేయర్, డిప్యూటీ మేయర్లకు కూడా తెలియకుండా హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. గతంలో ఎలాంటి సమాచారం లేకుండా కేవలం జీవో జారీతో డీలిమిటేషన్ చేశా రని గుర్తుచేశారు. డీలిమిటేషన్ సైంటిఫిక్గా ఉండాలని, ప్రజాప్రతినిధులతో మేయర్ కానీ, కమిషనర్ కానీ మరోమారు సమావేశం నిర్వహించాలని కోరారు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా మాట్లాడుతూ.. ఇది కేవలం పరిపాలనపరంగా తీసుకున్న నిర్ణయమని, 2011 తర్వాత జనాభా లెక్కలే సేకరించలేదని, అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన వార్డులను విభజించారంటూ, ఇది ఎంఐఎంకు నష్టం కలిగించేందుకు చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 12 మున్సిపాలిటీలు విలీనమయ్యాక రెండేళ్ల వరకు ఎన్నికలు జరగలేదని, ఆలోగా వందల కోట్లతో శివార్లలో మౌలికవసతుల పనులు జరిగాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్ వంగ మధుసూదన్రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, రాజీవ్గాంధీ తెచ్చిన 74వ రాజ్యాంగసవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజలతో, స్థానికసంస్థలతో సంబంధం లేకుండా చేస్తున్నారని తప్పుబట్టారు. తీవ్ర అభ్యంతరాలు పార్టీలకతీతంగా పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కనీసం కార్పొరేటర్లకు తెలియకుండా చేశారని, కొన్ని వార్డులు ముగ్గురి ఎమ్మెల్యేల పరిధిలోకి వెళ్లాయని, ఐదేళ్లుగా తాము ఎంతో కష్టపడి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రాంతాలు ఇప్పుడు తమ పరిధిలో లేకుండా పోతుండటంతో తమ ఓటర్లు మారి తమకు తీవ్ర నష్టం జరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వార్డునే కొత్తప్రాంతానికి మార్చడంతో తమ ముఖం ఎవరికి తెలుసని కొందరు ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వార్డులు, కొన్ని చోట్ల తక్కువ వార్డులు చేయడంపై కాంగ్రెస్–ఎంఐఎం పొత్తు ఉందని తమకు అనుమానంగా ఉందని బీజేపీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీలకతీతంగా ప్రాథమిక నోటిఫికేషన్కు ముందుగానే సమావేశాలు నిర్వహించాల్సిందని, కమిటీలు వేయాల్సిందని అన్నారు. -
ఉపాధి హామీ పేరు మార్చడం సరికాదు
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీసతీష్ మొయినాబాద్ రూరల్: మహాత్మాగాంధీ పేరుతో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీసతీష్ అన్నారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఎన్డీఏ సర్కార్పై పోరాటం తప్పదని స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు సర్పంచ్లుగా విజయం సాధిస్తున్నారని తెలిపారు. -
ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి
తుక్కుగూడ: కుష్టు వ్యాధి నివారణ కోసం ఇంటింటికీ తిరిగి, ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి అన్నారు. కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో మంగళవారం వైద్య సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అనుమానం ఉన్న వారిని దగ్గరలోని ఆరో గ్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య ఉప అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా పార మెడికల్ అధికారి సులోచన, సిబ్బంది పాల్గొన్నారు. కేన్సర్ వ్యాక్సిన్ అందించాలి 14 ఏళ్లు నిండిన ఆడపిల్లలందరికీ గర్భాశయ కేన్సర్ వ్యాక్సిన్ అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం హ్యూ మన్ పాపిలోనా వైరస్ వ్యాక్సిన్పై వైద్య సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యా క్సిన్ను అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా అందిస్తోందని, అర్హులైన ఆడపిల్లలందరికీ ఒక డోస్ చొప్పున ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. టీపీఎఫ్ మహాసభలను జయప్రదం చేయండి షాద్నగర్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ ప్రభాకర్ కోరారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం టీపీఎఫ్ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోకన్వీనర్ అర్జునప్ప, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య, ప్రజా కళామండలి జిల్లా కన్వీనర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం షాద్నగర్రూరల్: పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గిరిజన గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్రెడ్డి విద్యార్థినులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, మైక్రోబయోలజీ హెడ్ కళాజ్యోతి, బోటనీ హెడ్ స్పందన తదితరులు పాల్గొన్నారు. రేపు మెగా హెల్త్ క్యాంపు మీర్పేట: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, టీకేఆర్ వాకర్స్ అసోసియేషన్, హైదరాబాద్ శాలివాహన లయన్స్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18న (గురువారం) మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీర్పేట ఆర్ఎన్రెడ్డినగర్లోని అక్షర టెక్నో స్కూల్లో మలక్పేట యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించే హెల్త్క్యాంప్కు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. -
విద్యతోనే మార్పు సాధ్యం
మంచాల: విద్యతోనే మార్పు సాధ్యమని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకే ప్రాంగణంలో ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండడంతో అప్గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇంటర్నల్ రోడ్లు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్రావు, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ వెంకట ప్రసాద్, ఎంఈఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ క్షణం కీలకమే
అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ అబ్దుల్లాపూర్మెట్: మూడో విడతలో భాగంగా బుధవారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం నుంచే మొదలైన డబ్బు, మద్యం, మాంసం, తాయిలాల పంపిణీ మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఆతర్వాతి ప్రతీ క్షణం కూడా ఎంతో ముఖ్యమైనదని, బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అనేక అంశాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మేజర్ గ్రామపంచాతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారు ప్రతీ ఓటును కీలకంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థులెవరూ ఖర్చుకు వెనకాడకుండా, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆ ఊర్లలో నోట్ల వర్షం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్, కవాడిపల్లి, బలిజగూడ, ఇనాంగూడ, బాటసింగారం, జాఫర్గూడ, మజీద్పూర్, లష్కర్గూడ, దేశ్ముఖి, గుంతపల్లి, అనాజ్పూర్ గ్రామాల్లో ఓటర్లకు నోట్ల వర్షం కురుస్తోంది. బలిజగూడలో ఒక్కో ఓటరుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు అందినట్లు తెలుస్తోంది. బరిలో ఉన్నవారందరూ లెక్క పెట్టకుండా డబ్బులు పంచడంతో ఓటర్ల పంట పండుతోంది. మజీద్పూర్లో వరుసకు తోటికోడళ్లు ముగ్గురు, జాఫర్గూడలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. యువత, వలస ఓట్లే కీలకం మొదటి, రెండో దశ ఎన్నికల్లో పలు పంచాయతీల్లో యువత, వలస ఓటర్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపారు. తుది విడతలోనూ చాలా చోట్ల వారే కీలకంగా మారనున్నారు. దీంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాము బలపర్చిన వారికే ఈ ఓట్లు పడేలా రాజకీయ పార్టీలు సైతం రంగంలోకి దిగాయి. -
నేడే తీన్మార్
ఇబ్రహీంపట్నం: డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పోలింగ్ సామగ్రిని సరిచూసుకుంటున్న సిబ్బంది సాక్షి,రంగారెడ్డిజిల్లా/ఇబ్రహీంపట్నం: మూడో విడ త పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇబ్రహీంపట్నం డివిజన్లోని 5 మండలాలు, కందుకూరు డివిజన్లోని 2 మండలాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికేపోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల కోసం 1,969 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,809 మంది ఓపీఓలు, 55 మంది జోనల్ అధికారులు, 42 మంది ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, 193 మంది ఆర్ఓలు, 21 మంది మండల పర్యవేక్షణ అధికారులు, 22 ఎంసీసీ బృందాలు, 21 వ్యయ బృందాలు విధుల్లో పాల్గొంటున్నాయి. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి సర్పంచ్, 8 వార్డుల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం 174 పంచాయతీలు, 1,598 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో 10 సర్పంచ్ స్థానాలు సహా 142 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు 559 మంది, 1,448 వార్డులకు 4,091 మంది పోటీపడుతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 30 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 24 మంది మైక్రో అబ్జర్వర్లను ఇందు కోసం నియమించారు. ఉప సర్పంచ్ల ఎన్నిక పక్రియ అదేరోజు సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడి కాగానే ఉప సర్పంచ్ల ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఒకవేళ అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరగకుంటే మరుసటి రోజ ఉంటుంది. అప్పటికీ తేలకుంటే మరోమారు ఎన్నిక ప్రక్రియను చేపడతారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు మూడో విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్క అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏ చిన్నపొరపాటుకు ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. మంగళవారం మంచాల మండలంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లను మరోసారి చెక్ చేసుకోవాలని సూచించాారు. ఏమైనా లోపాలుంటే వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. మొదటి, రెండో విడతలో ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన 125 మంది ఉద్యోగులపై ఇప్పటికే చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నికలు జరగనున్న మండలాలు : 7 పోలింగ్ జరిగే పంచాయతీలు : 163 పోలింగ్ నిర్వహించే వార్డులు : 1,448 బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు : 559 పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు : 4,091 పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఎన్నికలు జరిగే మండలాలు: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మూడో విడత పల్లె పోరుకు సర్వం సిద్ధం -
విజేతలెవరో?
ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 73 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల ఉంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజేతలెవరో తేలి పోనుంది. అలుపెరుగని ప్రచారం వారం రోజులుగా ఇంటింటికీ, గడపడపకూ తిరిగి అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగించారు. ప్రచార ఘట్టంలో ఎవ్వరినీ కాదనకుండా హామీల వర్షం గుప్పించారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు, ఆకట్టుకునేందుకు మందు, విందు, గిఫ్ట్లు, నగదు చెల్లింపులు చేశారు. ప్రత్యర్థి అంత ఇచ్చాడంటే దానికంటే కొంత ఎక్కువిచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతూ తాయిలాలు సమర్పించుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల వరకు వెచ్చించినట్టు సమాచారం. పైకి గంభీరంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మత్రం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఆదరించేనా.. తిరస్కరించేనా.. లక్షలు ఖర్చు చేసినా ఓటర్లు తమను ఆదరిస్తారా.. అందలం ఎక్కిస్తారో లేదోనన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. శతవిధాలా ప్రయత్నించినా ఓటరు నాడిని మాత్రం పసిగట్టలేకపోయారు. చివరి నిమిషంలో ఏం జరుగుతుందో.. ఓటరు కరుణా కటాక్షాలు ఎవరిపై ఉంటాయోనని టెన్షన్తో గడుపుతున్నారు. ఏలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. గ్రామంలో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో నివసించే వారిని రప్పించి ఓట్లు వేసేవిధంగా ఎవరికివారే ఏర్పాట్లు చేశారు. ఇందుకు ప్రత్యేక సదుపాయాలు, ప్యాకేజీలు సమర్పించారు. కొన్నిచోట్ల తమ స్థాయికి మించి ఖర్చు చేశారు. బుధవారం సాయంత్రంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓటర్లు ఎవరిని తిరస్కరిస్తారో.. ఎవరికి పట్టం కడతారో తేటతెల్లం కానుంది. -
యువకుడి దారుణ హత్య
గోల్కొండ: తమ్ముడితో తగాదపడుతున్న వారిని వారించబోయిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి టోలిచౌకీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ తెలిపిన మేరకు.. హకీంపేట్ విరాట్నగర్ కుంటకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్(24) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ పోషణ కోసం ఇతను కాలేజీ నుంచి వచ్చిన తరువాత ఆటో నడుపుతున్నాడు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో తన తమ్ముడు అద్నాన్నుపై పారమౌంట్ కాలనీ గేట్ నెంబర్ 4 వద్ద కొందరు యువకులు దాడి చేస్తునట్లు తెలిసింది.వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి వారిని వారించాడు.ఈ క్రమంలో ఇర్ఫాన్పై బిలాల్ తన స్నేహితులతో దాడి చేశాడు. బిలాల్ తన వద్ద ఉన్న కత్తితో ఇర్ఫాన్ను చాతి, మెడ కింది భాగం, కడుపులో విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయాడు. ఇర్ఫాన్ను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఇర్ఫాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి కేపీహెచ్బీకాలనీ: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ ఉమర్ ఫరూక్ కేపీహెచ్బీ కాలనీలోని హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అతని స్నేహతుడు షేక్ సుల్తాన్ బాషాతో కలిసి బైక్ మీద హౌసింగ్ బోర్డు నుంచి హైటెక్ సిటీ వైపు వెళుతున్నారు. లులు మాల్ ఫ్లై ఓవర్ వద్ద ముందు వెళుతున్న హోండా కారు ఒక్కసారిగా రోడ్డుపై ఆగడంతో వెనుక ఉన్న మరో డిజైర్ కారు కూడా ఆగి నెమ్మదిగా వెళుతోంది. ఈ క్రమంల బైక్ అదుపు తప్పి కారును ఢీకొనడంతో ఇద్దరూ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా షేక్ ఉమర్ ఫరూక్ మృతి చెందగా షేక్ సుల్తాన్ భాషా విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఫరూక్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజులు..126 కెమెరాలు.. నిందితులను పట్టించిన నిఘా నేత్రం బంజారాహిల్స్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ ఖరీదైన నగలు, నగదు ఉన్న బ్యాగ్ను దారి మధ్యలో పోగొట్టుకోగా, బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు ఆరు రోజులు కష్టపడి 126 కెమెరాలను వడబోసి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–11లో నివసించే స్వాతి అగర్వాల్ (41) ఈ–కామర్స్లో వస్త్ర వ్యాపారం చేస్తోంది. ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటల వేళ ఆమె బ్యాంక్లో డబ్బులు జమ చేయడానికి బైక్పై వెళ్తూ తన హ్యాండ్బ్యాగ్ను కాళ్ల వద్ద ఉంచుకుంది. రోడ్డునెంబర్–12లో బ్యాగ్ కింద పడిపోగా, ఆమె గమనించలేదు. అదే సమయంలో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు కారులో వెళ్తుండగా బ్యాగ్ కనిపించింది. డ్రైవర్ కారు ఆపి ఆ బ్యాగ్ను తీసుకుని వైద్యురాలికి ఇచ్చాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు కొద్దిదూరం ఆమెను అనుసరించి బైక్ అడ్డంగా నిలిపి కారును ఆపారు. బాధితురాలు మినిస్టర్ క్వార్టర్స్ సమీపంలో ఏడుస్తూ కూర్చొన్నదని, ఆమెకు ఇస్తామని చెప్పి వైద్యురాలి దగ్గరున్న బ్యాగ్ను తీసుకుని ఉడాయించారు. అదే రోజు రాత్రి బాధితురాలు స్వాతి అగర్వాల్ తాను బ్యాగ్ పోగొట్టుకున్నానని, అందులో డైమండ్ పెండెంట్, బంగారు గాజులు, చెవి రింగులు, మూడు సెల్ఫోన్లు, 15 ఏటీఎం కార్డులు, ఇతర ధ్రువపత్రాలు ఉన్నాయని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి దారిలోని సీసీ కెమెరాలు వడబోస్తూ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లో ఆ యువకుల బైక్ నెంబర్ను గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ను సేకరించి బోరబండలో నిందితులు సయ్యద్ పర్హాన్ (27), మహ్మద్ మోసిన్ (26)ను పట్టుకుని బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సత్తాచాటారు సర్పంచ్లయ్యారు
శంకర్పల్లి: చిన్నచిన్న సంఘటనలు మినహా ఆదివారం నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన కొండకల్ అభ్యర్థి ఎరుకల శేఖర్ 730 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొందగా, ఎల్వర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మద్దతుదారాలు మారెపల్లి భాగ్యలక్ష్మి 721 ఓట్లతో భారీ విజయం సాధించారు. గోపులారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తంగెడపల్లి రవీందర్రెడ్డి హోరాహోరీ పోరులో 10 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచు ఎన్నికపై విచారణ జరపాలి కలెక్టర్కు అభ్యర్థి శ్రీనివాస్ ఫిర్యాదుతాండూరు రూరల్: మండల పరిధి అంతారం సర్పంచు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరపాలని సర్పంచ్ అభ్యర్థి బుడుగ జంగం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ ప్రతీక్జైన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయనమాట్లాడుతూ.. బీఆర్ఎస్ తరుఫున 7 వార్డులు గెలిచామని తెలిపారు. విజయం సాధించిన వారికి కౌంటింగ్ రోజు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఆర్ఓ నిరాకరించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ధ్రువపత్రాలతో పాటు.. ఉప సర్పంచు ఎన్నిక నిర్వహించారని వివరించారు. ఆర్ఓ ప్రవర్థన సరిగ్గా లేదని,ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిఆరోపించారు. అలాగే ఓట్ల లెక్కింపు తుది దశ వరకు తానే గెలుపు దిశగా ఉండగా.. కేవలం 6 ఓట్ల తేడాతో ఓడిపోయారని ఆర్ఓ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని వాపోయారు. సర్పంచు ఎన్నికతో పాటు.. ఆర్ఓ పాత్రపైపూర్తి విచారణ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీ కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. -
షూటింగ్ బాల్ విజేత వరంగల్
తాండూరు టౌన్: రాష్ట్ర స్థాయి అస్మిత(అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రో యాక్షన్) ఖేలో ఇండియా షూటింగ్ బాల్ విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. ఈనెల 13, 14వ తేదీల్లో తాండూరు సెయింట్ మార్క్స్ పాఠశాల మైదానంలో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో వరంగల్, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నల్గొండ, ఖమ్మం జట్లు నిలిచాయి. విజేతలకు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఐలయ్య ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహద పడతాయన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు విద్య, ఉద్యోగం, స్పోర్ట్స్ కోటాలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఆణిముత్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం టోర్నీ నిర్వహణ కార్యదర్శి ఎం.రాములు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులు జనవరి చివరి వారంలో ఉత్తరాఖండ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మార్క్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆరోగ్య రెడ్డి, పీడీ గౌరీశంకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం, జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, సీహెచ్ రాములు, ఆంజనేయులు, రాము, రవీందర్ రెడ్డి, శరణ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. రాములు తదితరులు పాల్గొన్నారు.ద్వితీయ, తృతీయ స్థానాల్లో నల్గొండ, ఖమ్మం -
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి, నర్సాయిపల్లి, మాడ్గుల, రామ్దుగ్యాల గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కొల్కులపల్లిలో అభ్యర్థి బట్టు అనురాధతో కలిసి భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి, సామాజిక న్యాయం, నిరుపేదల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్రెడ్డి, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, నాయకులు కొండల్రెడ్డి, రమేశ్రెడ్డి, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
రూ.10 కోట్ల మద్యం పంచేశారు!
శంకర్పల్లి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు యథేచ్ఛగా మద్యం సరఫరా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో లక్షలాది రూపాయల సరుకు తీసుకెళ్తున్నా.. ఎక్కడికి, ఎందుకు వెళ్తుందోనని కూడా చూడటం లేదు. ఎవరైనా ఈవిషయాన్ని అడిగినా అదేం లేదు.. అని చెబుతుండటం గమనార్హం. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే రూ.10 కోట్ల వరకు మద్యం సరఫరా చేసినట్లు తెలుస్తోంది. నిత్యం పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నిత్యం మందు పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నియ మావళి ప్రకారం అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయకూడదని, ప్రలోభ పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాలను అడ్డుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అర్ధరాత్రి అనుకున్న చోటికి.. శంకర్పల్లి మండల పరిధిలో మొత్తం పది మద్యం దుకాణాలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువుగా ఉన్న షాపుల యజమానులతో మాట్లాడుకుని ఇక్కడి నుంచే మద్యం సరఫరా చేసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థి తరఫు వారు కాకుండా, షాపులకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అర్ధరాత్రి వేళ అనుకున్న చోటికి తరలించారు. ఇవన్నీ గమనిస్తున్న పోలీసులు దుకాణదారులకు ఫ్రెండ్లీగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. తనిఖీలు, కేసులు అంతంతే.. మండలంలో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ అవి తూతూమంత్రంగానే పని చేశాయి. పలు గ్రామాల్లో మద్యం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పటికీ.. పోలీసులు మాకేంటి అన్న విధంగా వ్యవహరించారని అభ్యర్థుల మద్దతుదారులు వాపోయారు. మరికొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున మద్యం పట్టుబడితే, పరిచయం ఉన్న నాయకులు ఫోన్లు చేయడంతో కొంత మేర పట్టుకున్న కేసులు నమోదు చేసి మమ అనిపించారు. ‘ఫ్రెండ్లీ’గా వ్యవహరించిన పోలీసులు నేతల ఒత్తిళ్లకు లొంగి.. నామమాత్రపు తనిఖీలతో సరి -
కుర్వగూడ ‘సర్పంచ్ హ్యాట్రిక్’
షాబాద్: మండల పరిధిలో కుర్వగూడ సర్పంచ్ బుయ్యని సంధ్యారాణి హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఆమె గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా మండలంలో బీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 41 పంచాయతీలు ఉండగా, 22 జీపీలను గులాబీ సానుభూతిపరులే సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ 17, బీజేపీ, ఇండిపెండెంట్కు చెరో స్థానం దక్కింది. ఒక్క ఓటు తేడాతో విజయం కడ్తాల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నార్లకుంటతండా సర్పంచ్ స్థానానికి హోరాహోరీగా పోటీ సాగింది. ఒకేఒక్క ఓటు తేడాతో అంగోతు రాంచందర్నాయక్ విజయం సాధించారు. తండాలో మొత్తం 462 ఓట్లు ఉండగా, 423 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అంగోత్ రాంచందర్నాయక్కు 206 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన జాటవత్ రమేశ్కుమార్కు 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 ఓట్లు పడగా, 9 ఓట్లు చెల్లకుండాపోయాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో రాంచందర్నాయక్ విజయం సాధించారు. పంచాయతీ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ షాబాద్: గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. నల్లటి పొగ రావడంతో స్థానికులు గమనించి పంచాయతీ సిబ్బందికి ఫోన్ చేశారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని తెలిపారు. -
కన్హాలో ఏపీ సీఎం సందడి
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమ్లేష్ పటేల్తో కలిసి ఆశ్రమ పరిసరాలను పరిశీలించారు. శాంతివనంలోని పచ్చదనాన్ని, బాయోచార్, రెయిన్ ఫారెస్ట్, టిష్యూ కల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ రంగాలతో పాటు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు కన్హాకు వచ్చిన చంద్రబాబు సాయంత్రం 4గంటల వరకు ఉన్నారు. ఆశ్రమంలోని ప్రతీ అంశాన్ని ధ్యాన గురువు కమ్లేష్ పటేల్ను అడిగి తెలుసుకున్నారు. కన్హాలో పచ్చదనం బాగుందని, ఏపీలో సైతం కన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. కాగా చంద్రబాబు కన్హాను సందర్శించేందుకు వచ్చిన విషయం తెలిసిన మీడియా కన్హా ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. వ్యక్తిగత పర్యటన అని చెప్పారు. శాంతివనంలో పచ్చదనం బాగుందని కితాబు మీడియాకు అనుమతి ఇవ్వని నిర్వాహకులు వ్యక్తిగత కార్యక్రమమని వెల్లడి -
ఎలా ఓడామబ్బా..!
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొంతమంది అభ్యర్థుల అంచనాలు తలకిందులయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పలువురు ఓటమిపాలై నైరాశ్యంలో మునిగిపోయారు. ఆదివారం రాత్రి వచ్చిన ఫలితాల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలగా ఓటమి పాలైన వారు, వారి మద్దతుదారులు నిరాశతో కనిపించారు. గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు రిజర్వేషన్లు కలిసి రావడంతో పంచాయతీ బరిలోకి దిగారు. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. అయినా గెలుపు అంచులకు చేరుకోలేకపోయారు. దీంతో ఎలా ఓడిపోయామా అని అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఆలోచనలో పడ్డారు. ఎక్కడ పొరపాటు జరిగింది.. ఏం తక్కువ చేశాం.. ఓటర్లు ఎందుకు విశ్వసించలేదనే ఆలోచన ఒకవైపు.. ఖర్చుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని మరోవైపు అంతర్మథనంలో మునిగిపోయారు. ఎవరి అంచనాలకు అందని విధంగా ఆయా గ్రామాల్లో ఓటర్లు తీర్పిచ్చి షాకిచ్చారు. ఎక్కడా ఓటర్లు తమకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించలేదని, అయినా ఎలా ఓటమి పాలయ్యామా అని పలువురు అభ్యర్థులు విశ్లేషణ చేస్తున్నారు. కొందరైతే ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో స్థాయికి మించి ఖర్చు పెట్టారు. చేతిలో డబ్బులు లేని వారు ఆస్తులను తాకట్టుపెట్టి, వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సర్పంచ్గా పోటీ చేశారు. ఓటమి పాలు కావడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఆయా గ్రామాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు పలువురు కంటతడి పెట్టారు. ప్రలోభాలకు గురిచేసినా.. నాయకులంతా ఏకమై ప్రత్యర్థిని ఒంటరి చేసిన అనేక గ్రామాల్లో ప్రత్యర్థి వైపే ఓటర్లు నిలబడి గెలిపించారు. హంగు ఆర్భాటాలు, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీకి ఎక్కడా ఓటరు అనుకూలంగా తీర్పు వెల్లడించలేదని ఈ ఫలితాలతో రుజువయ్యింది. డబ్బులు, మద్యం పంచి ఎలాగైనా గెలవాలనుకుని ప్రలోభాలకు గురి చేసినా ఫలితం లేకపోవడం చెంపపెట్టుగా మారింది. కొన్నిచోట్ల ఇద్దరు అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు వేయాలనుకున్న వారికే వేసి.. తీర్పు ఇవ్వాలనుకున్న వారికే ఇచ్చారు. కొన్ని పంచాయతీల్లో అయితే వార్డు సభ్యులకు ఒకవైపు సర్పంచ్లకు మరో వైపు అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. అభ్యర్థుల అంతర్మథనం ఓటమిపాలైన వారిలో నైరాశ్యం డబ్బులు, మద్యం పంచినా ఓటర్లు అదరించలేదని ఆవేదన ఎన్నికల ఖర్చుతో అప్పులపాలైన అభ్యర్థుల నిట్టూర్పు -
ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
ఆమనగల్లు: ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ కోరారు. మాడ్గుల మండలం కొల్కులపల్లిలో సోమవారం సర్పంచ్ అభ్యర్థి బట్టు ధర్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్పార్టీ అమలు సాధ్యం కాని అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కేవలం మాయమాటలు చెబుతూ ప్రజలను వంచిస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ -
ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్ జాగ్రత్త
శంకర్పల్లి: ప్రైవేటు బ్యాంకులు ప్రజలకు వి రి విగా రుణాలిస్తున్నాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ ఇన్నోవేటివ్ హాబ్ సీఈఓ రాజేశ్ బన్సాల్ సూచించారు. దొంతాన్పల్లిలో ని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్యాంకింగ్ సదస్సుకు సోమవారం ఆయన, విశ్వవిద్యాలయ కులపతి, ఆర్బీఐ మాజీ గవర్నర్ డా. సి. రంగరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్బీఐలో పనిచేసి, పదవీ విరమణ పొందిన నిపుణులు రాసిన పుస్తకాన్ని రంగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మ్యూచువల్ ఫండ్ తదితర ఆర్థికపరమైన పెట్టుబడులు దేశ ఆర్థిక పురోభివృద్ధిని మారుస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. రానున్న కాలంలో బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు రానున్నాయన్నారు. సదస్సులో ఇక్ఫాయ్ సొసైటీ చైర్పర్సన్ శోభా రాణి యశస్వి, ఉప కులపతి డా. కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన నియామకం ఆమనగల్లు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి నియమితులయ్యారు. శంషాబాద్ పట్టణంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేర కు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పురుషోత్తంరెడ్డిని నియమించి ఘనంగా సత్కరించారు. డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు తుర్కయంజాల్: జీహెచ్ఎంసీ ఇటీవల ప్రకటించిన వార్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తుర్కయంజాల్ బీజేపీ నాయకులు సోమ వారం కమిషనర్ కర్ణన్ను కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత జనాభా లెక్కల ప్రకారం కాకుండా, కొత్త కాలనీలు, ఇళ్లలో నివసిస్తున్న జనాభా ఆధారంగా విభజన చేపట్టాలని కోరారు. తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్లను మొత్తం నాలుగు డివిజన్లుగా చేయాలని, కోహెడ పేరుతో ఓ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు బచ్చిగళ్ల రమేష్, నాయకులు కొత్త రాంరెడ్డి, సానెం అర్జున్ గౌడ్, కొండ్రు పురుషోత్తం, అనిల్ కుమార్, బిందు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన జూకి ‘వంతారా’ కంగారూలు చార్మినార్: నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శ నశాలకు త్వరలో కంగారూలు రానున్నాయి. జంతు మార్పిడిలో భాగంగా గుజరాత్లోని వంతారా జూ నుంచి ఇక్కడికి ఒక జతను రప్పించడానికి చర్చలు జరుగుతున్నాయి. జాంనగర్లోని రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన ప్రపంచ వన్య ప్రాణుల రక్షణ, పరిరక్షణ కేంద్రమైన వంతారా అధికారులతో జంతువుల మార్పిడి కింద కంగారూలను రప్పించడం కోసం జరుగుతున్న చర్చలు ఫలిస్తే.. మన సందర్శకులకు కంగారూలు కనువిందు చేయనున్నాయి. గత 2020లో జపాన్ జూ పార్కు నుంచి రెండు జతల కంగారూలను రప్పించడం కోసం ఇక్కడి జూ పార్కులో ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కారణంగా ఈ డీల్ కుదరకపోవడంతో..తిరిగి ఇప్పుడు వంతారా జూ పార్కు అధికారులతో సెంట్రల్ జూ అథారిటీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కంగారూల కోసం ఎన్క్లోజర్లు సిద్ధంగా ఉన్నాయి. కంగారూలను మనం తెచ్చుకుంటే.. జంతు మార్పి డిలో భాగంగా మనం ఒక ఏనుగును (మగ/ఆడ) వారికి ఇవ్వాల్సి ఉంటుందని సంబంధిత జూ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే జంతు మార్పిడిలో భాగంగా రెండు నెలల క్రితం 20 జతల మూసిక జింకలను ఇచ్చి ఒక జత జీబ్రాలను రప్పించుకోగా.. అవి వారం రోజులుగా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. -
నిన్న కళకళ.. నేడు వెలవెల
కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ పేరుతో ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రముఖులతో సీఎం ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రజలు, విద్యార్థుల సందర్శనార్థం 10 నుంచి 13వతేదీ వరకు అనుమతించారు. ఈ నెల 13తో సమ్మిట్ పూర్తవడంతో తాత్కాలిక నిర్మాణాలను కార్మికులు తొలగించే పనులు చేపట్టారు. కొన్ని రోజులుగా డిజిటల్ స్క్రీన్లు, రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలు, వీఐపీల రాకతో సందడిగా మారిన ప్రాంగణం ప్రస్తుతంచిన్నబోయింది. అబ్బురపరిచిన డిజిటల్ వాల్ ఇలా.. తొలగిస్తున్న తాత్కాలిక నిర్మాణాలు -
‘మూడు’లో మూగబోయిన మైకులు
ఇబ్రహీంపట్నంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. వారం రోజులుగా పల్లెల్లో హోరెత్తిన మైకులు మూగబోయి, నిశబ్ద వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం డివిజన్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం చివరి రోజు జోరుగా ప్రచారం చేశారు. అభ్యర్థుల మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ నెలకొంది. రేపే 73 గ్రామాల్లో ఎన్నికలు ఈనెల 17న (బుధవారం) డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 73 పంచాయతీల సర్పంచ్, 694 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో 14 సర్పంచ్, 140 వార్డులకు.. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 13 సర్పంచ్, 129 వార్డులకు.. యాచారం మండలంలో 24 సర్పంచ్, 220 వార్డులకు.. మంచాల మండలంలో 22 సర్పంచ్, 205 వార్డులకు పోలింగ్ జరుగనుంది. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పెగ్లిపూర్, మంచాల మండలంలోని కొర్రవాణి తండా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. డివిజన్ పరిధిలో 32 మంది వార్డు సభ్యులు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. పోలీసు బందోబస్తు.. ఎన్నికల నిర్వహణకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆర్వో, ఏఆర్వో, పోలింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీ సు బలగాలు మోహరించనున్నాయి. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఓటర్ జాబితా, బాక్స్లు సీల్ చేసే తదితర పోలింగ్ సామగ్రిని, సిబ్బందిని ఆయా గ్రామాలకు తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన జెడ్పీ సీఈఓ ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు, సామగ్రి పంపిణీకి ప్రత్యేకంగా టెంట్లు వేసి సిద్ధం చేశారు. అదనంగా బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయాన్ని సోమవారం జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సోమవారం కూడా కొనసాగింది. గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి మాడ్గుల: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమ వారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ రూపొందించిన హ్యాండ్బుక్ను ప్రతి పీఓ, ఏపీఓ తప్పకుండా చదివి నిబంధనలు పాటించాలని సూచించారు. పోలింగ్ రోజు వ్యవహరించాల్సిన విధి విధానాలు, పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టే అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
ఇబ్రహీంపట్నం: ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి సూచించారు. మండలంలోని తులేకాలన్ గ్రామాన్ని సోమవారం సందర్శించిన ఆయన ఓటర్లు, రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో స్నేహపూర్వక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ ఎం.మహేందర్రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు యాచారం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమ వారం యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మీరాఖాన్పేట, యాచారం, గునుగల్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహే శ్వరం డివిజన్ డీసీపీ పరిధిలో 471 మందిని బైండోవర్ చేసినట్లు, తనిఖీల్లో 1,800 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలింగ్ సందర్భంగా 1,200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ల సీఐలు నందీశ్వర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి -
ఖర్చులకు కటకట!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల నిర్వహణ ఖర్చులు ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు గుదిబండగా మారాయి. ఓటర్ల జాబితా, నామినేషన్ పత్రాలు జీరాక్సులు సహా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, టెంట్లు, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భోజనాలకు కటకట తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో అవుతున్న ఖర్చులకు.. ఎన్నికల కమిషన్ విదిల్చిన నిధులకు పొంతనే లేదు. ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో ఆయా ఖర్చులను ఎంపీడీ ఓలు, కార్యదర్శులే భరించాల్సి వస్తోంది. బీసీ రిజర్వేషన్ అంశంతో నోటిఫికేషన్ తరచూ వాయిదా పడటంతో ఆమేరకు ఓటర్ల జాబితా సహా నామినేషన్ పత్రాలను కూడా మార్చాల్సి వచ్చింది. ఒక్కో వార్డు, గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాను రెండు మూడు సార్లు మార్చారు. కేవలం జీరాక్స్ కాపీలకే ఒక్కో ఎంపీడీఓ పరిధిలో రూ.లక్ష వరకు వెచ్చించాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ ఒక్కో ఎంపీడీఓకు ఇప్పటి వరకు రూ.రెండున్నర లక్షలకు మించి ఇవ్వలేదు. మండల స్థాయిలోని ఖర్చులను పరిగణలోకి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని పంచాయతీలకు చెల్లించాల్సి ఉంది. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన మొత్తం మండల పరిధిలోనే ఖర్చుకావడంతో పంచాయతీలకు నిధులు చేరలేదు. ఆయా ఏర్పా ట్లకు అవసరమైన నిధులను కార్యదర్శులే సమకూర్చాల్సి వచ్చింది. ఏర్పాట్ల బాధ్యత వారిపైనే.. జిల్లాలో 526 పంచాయతీలు, 4,668 వార్డులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో 174 పంచాయతీలు, 1,530 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు నిర్వహించగా, రెండో విడతలో 178 పంచాయతీలు, 1,540 వార్డులకు 14న పోలింగ్ నిర్వహించారు. మూడో విడతలో 174 పంచాయతీలు, 1,598 వార్డులకు 17న ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి విడతలో పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ సహా ఆర్ఓలు, ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, ఎంసీసీలు, భద్రతా సిబ్బంది కలిపి మొత్తం 4,500 మందికిపైగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన సహా రిటర్నింగ్ అధికారుల కేంద్రాల ఏర్పాటు, అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, తుది జాబితా తయారీ, పోలింగ్ సామగ్రి తరలింపు, సిబ్బందికి భోజనాలు, పోలింగ్ కేంద్రాల్లో ధ్వంసమైన వాష్ రూమ్లకు రిపేర్లు చేయించడం, ఓటర్లు ఎండతాకిడికి గురికాకుండా ఆయా కేంద్రాల్లో టెంట్లు వేయించాల్సి వచ్చింది. తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున రూ.20 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటి వరకు రూ.5 వేలకు మించి ఇవ్వలేదు. దాతల సహకారంతో భోజనం జిల్లాలోని ఒక్కో ఎంపీడీఓ కేవలం జీరాక్స్ కాపీల కోసమే రూ.లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిధులకు, క్షేత్రస్థాయిలోని ఖర్చులకు పొంతన లేకపోవడంతో ఆయా గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. రెండేళ్లుగా పాలకమండళ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మెజార్టీ జీపీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. సిబ్బందికి వేతనాలు సైతం ఇవ్వలేని దుస్థితి. పాడైన వీధిలైట్లు స్థానంలో కొత్తవి కొనలేని పరిస్థితి. మోటార్ల రిపేర్లకే ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఖర్చు తలకు మించిన భారంగా మారింది. కొంత మంది బరిలో నిలిచిన అభ్యర్థులు అందించిన ఆర్థిక సహకారంతో సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేస్తే.. మరికొంత మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, ఇతర దాతల సహకారంతో ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మండల స్థాయి అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు కనీసం రూ.పది కోట్లు అవసరం కాగా, ఇప్పటి వరకు రూ.కోటి కూడా మంజూరు చేయలేదని తెలుస్తోంది. తలకు మించిన భారంగా ఎన్నికల నిర్వహణ -
భావితరాలకు ఆదర్శం ‘రాజా బహదూర్’
మీర్పేట: భావితరాలకు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఆదర్శమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మీర్పేట సర్కిల్ చందన చెరువు కట్టపై నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరామరెడ్డి విగ్రహాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వెంకటరామరెడ్డి నిజాం పాలనలో హైదరాబాద్ స్టేట్కు పోలీస్ కమిషనర్గా సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ఉత్తమ పరిపాలన, ప్రజలకు చేసిన సేవలకు గాను నిజాం ప్రభుత్వం ఆయనను ‘రాజా బహదూర్’ బిరుదుతో సత్కరించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, జిల్లెలగూడ రెడ్డి సంఘం అధ్యక్షుడు చల్లా ప్రభాకర్రెడ్డి, నాయకులు బొక్క రాజేందర్రెడ్డి, అర్కల కామేశ్రెడ్డి, మేకల రవిందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి చందన చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సబితారెడ్డి సర్కిల్ అధికారులను ఆదేశించారు. చెరువును సందర్శించిన ఆమె మాట్లాడుతూ 2021లో చెరువు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా ఇటీవల రూ.2.25 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వాకర్స్, పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా వెంటనే పనులు చేపట్టాలని, మురుగునీరు చెరువులో కలవకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. -
విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
మహేశ్వరం: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు సమీపంలో ఉన్న భాష్యం బ్లూమ్స్ స్కూల్లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రమే కాదన్నారు. మన చుట్టూ జరిగే విషయా లను గమనించడం కూడా సైన్సేనని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కస్నా నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రయోగం కొందుర్గు: మహేశ్వంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో కొందుర్గు ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాలలో చదివే మణితేజ తయారు చేసిన ప్రయోగం రాష్ట్రస్థాయికి ఎంపికై నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్ తెలిపారు. ప్రాజెక్టు తయారీలో సైన్స్ టీచర్ రామకృష్ణ సహ కరం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మణితేజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. జిల్లా విద్యాధికారి సుశీందర్రావు -
రెండో విడతలోనూ హస్తందే హవా
ఆమనగల్లు: కాంగ్రెస్ బలపర్చిన శంకర్ కొండ తండా సర్పంచ్ మండ్లీ రాములు విజయోత్సవం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపు పోరాడి ఓటమి పాలైన బీఆర్ఎస్ మద్దతుదారులు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసిన బీజేపీ మండలం మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఆమనగల్లు 13 03 03 01 06 తలకొండపల్లి 32 09 16 02 05 కడ్తాల్ 24 11 07 02 04 మొయినాబాద్ 19 07 07 04 01 చేవెళ్ల 25 16 03 03 03 శంకర్పల్లి 24 12 07 01 04 షాబాద్ 41 17 22 01 01 మొత్తం 178 75 65 14 24గెలుపొందిన అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల జాబితా ఇలా.. సాక్షి, రంగారెడ్డిజిల్లా: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వీరికి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ మెజార్టీ స్థానాల్లో ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీ లు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రముఖుల పల్లెల్లో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వికారాబాద్ జిల్లాలోని తన స్వగ్రామమైన మర్పిల్లిలో పార్టీ మద్దతుదారును గెలిపించుకున్నారు. తన ఆధిపత్యానికి అడ్డు లేదని నిరూపించుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డినారాయణరెడ్డి సొంతూరు ఖానాపూర్లో తన మద్దతుదారు దుగ్గాపురం అనితను గెలిపించుకుని తన పట్టు నిలుపుకొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట మండలం చించల్పేట పంచాయతీలో ఎమ్మెల్యే బలపర్చిన అభ్యర్థి విజయలక్ష్మి ఓటమిపాలయ్యారు. అదే పార్టీ నుంచి రెబల్గా పోటీ చేసిన డి.అనసూజ గెలపొందారు. మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితారెడ్డి తన స్వగ్రామమైన కౌకుంట్లలో బీఆర్ఎస్ మద్దతుదారును మల్లారెడ్డిని గెలిపించుకుని చేవెళ్లలోనూ తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. చేవెళ్ల లోక్ సభాస్థానం ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి స్వగ్రామమైన గొల్లపల్లిలో బీజేపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టుకోలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థి రాఘవేందర్కు మద్దతు పలికారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ గెలుపొందడం విశేషం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి స్వగ్రామమైన షాబాద్ మండలం గొల్లూరుగూడలో తన ఆధిపత్యాన్ని చాటుకోలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి బదులు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ పార్టీ మరో ముఖ్యనేత, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామమైన శంకర్పల్లి మండలం మాసానిగూడలో తన పట్టు నిలుపుకోలేక పోయారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్వగ్రామమైన కడ్తాల్ మండలం చల్లంపల్లి కాంగ్రెస్ మద్దతుదారు యశోదమ్మ గెలుపొందారు. -
ఊరు.. ఓటుకు..కదిలారు
రెండో విడత పంచాయతీ పోరు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మంచుతో పాటు చలుగాలులు వీస్తుండటంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 11 తర్వాత ఊపందుకుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగ నిమిత్తం నగరంతోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం పెద్ద ఎత్తున స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్, కౌంటింగ్ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగిన పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. – సాక్షి, రంగారెడ్డిజిల్లా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటెత్తారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చంటిపిల్లలతో తల్లులు పోలింగ్ కేంద్రా లకు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రంలోకి చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. మొదటగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించారు. తొలి ఫలితం మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే వెల్లడైంది. రాత్రి తొమ్మిది తర్వాత కూడా కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరిన వారిని పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. ఆమనగల్లు: చంటిపిల్లలతో వస్తున్న మహిళలుముగిసిన రెండో విడత పంచాయతీ పోరు జిల్లాలోని ఏడు మండలాల్లో ఎన్నికలు ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు 85.3 శాతం ఓటింగ్ నమోదు పల్లెల్లో పండుగ వాతావరణం -
ఉత్సాహంగా ‘తొలి’ ఓటు
మొదటిసారి వినియోగించుకున్న యువత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఎంతో కీలకం. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించింది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి నేతను ఎన్నుకునేందుకు అవకాశం రావడంతో ఉదయమే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు. ఆనందంగా ఉంది మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు వజ్రాయుధం లాంటిది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి ఎవరు పని చేస్తారో వారిని గుర్తించి ఓటు హక్కును వినియోగించుకున్నా. ఓటుహక్కుతో సర్పంచ్ను ఎన్నుకోవడం ఆనందంగా ఉంది. – అభిషేక్గౌడ్, తాళ్లపల్లి, షాబాద్ ఓటు విలువైనది ఓటుహక్కు వచ్చిన తరువాత తొలిసారి ఓటు వేశా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. అలాంటి విలువైన ఓటును మొదటిసారి వినియోగించుకున్నా. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాను. – సౌమ్య, శెట్టిపల్లి, ఆమనగల్లు -
నూతన సర్పంచ్లకు సన్మానం
కొత్తూరు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు, పాలకవర్గాల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మాజీ ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్లాపూర్ పంచాయతీ రెడ్డిపాలెంలో ఆదివారం నిర్వహించిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలువురు నాయకులు, గ్రామస్తులు నూతనంగా ఎన్నికై న మక్తగూడ సర్పంచ్ శ్రీరాములు, మల్లాపూర్తండా సర్పంచ్ మీనాక్షి దశరథ్నాయక్, మల్లాపూర్ సర్పంచ్ చిట్టెడి నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్లు రాములుగౌడ్, శంకర్నాయక్తో పాటు పలువురు వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు, నాయకులు, యువజన సంఘాల నాయకులు అభివృద్ధి పనులకు సహకరించాలన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయా లు చేయాలని, అన్ని పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధికి కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జయేందర్రెడ్డి, జార్జి రెడ్డి, రాజు, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ సరళి పరిశీలించిన కలెక్టర్
చేవెళ్ల/షాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. డివిజన్లోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమంలో సరి చూసుకొని ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఓటింగ్ శాతం నమోదు చేయాలని స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్లు కృష్ణయ్య, అన్వర్, ఏసీపీ కిషన్, ఎంపీడీఓలు హిమబిందు, అపర్ణ, మండల ప్రత్యేకాధికారులు వెంకటేశ్వర్రావు, మధుసూదన్ తదితరులు ఉన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ నిర్వహించారు. శంకర్పల్లిలో డీసీపీ శంకర్పల్లి: మహాలింగాపురం గ్రామంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చెక్కల రామయ్య(85) అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి గ్రామంలోని స్వగృహంలో మృతి చెందారు. ఆయన 1994 నుంచి 1999 వరకు ఎలికట్ట ఉపసర్పంచ్గా, 1999 నుంచి 2004 వరకు సర్పంచ్గా పనిచేశారు. సౌమ్యుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా చెక్కల రామయ్యకు ప్రజల్లో మంచి పేరు ఉంది. 2018లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రంగంపల్లిని ప్రత్యేక జీపీగా గుర్తించింది. దీంతో అప్పటివరకు ఎలికట్టలో కొనసాగిన రంగంపల్లి ప్రత్యేక జీపీగా ఏర్పడింది. ఎలికట్ట గ్రామాభివృద్ధికి చెక్కల రామయ్య అందించిన సేవలు మరువలేనివని పలువురు నాయకులు కొనియాడారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య, బీఆర్ఎస్ యువ నాయకుడు మురళీయాదవ్ ఉన్నారు. -
శ్రీరాముడి మార్గం అనుసరణీయం
షాద్నగర్రూరల్: మానవాళికి శ్రీరామచంద్రుడు చూపిన మార్గం అనుసరణీయమని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) క్షేత్రప్రముఖ్ బండారి రమేశ్ అన్నారు. పట్టణంలోని భగీరథ కాలనీ, డ్రీం విల్లాస్ కాలనీల్లోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం విశ్వహిందూ పరిషత్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు పానుగంటి రోజా ఆధ్వర్యంలో సత్సంగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. హైందవ సంస్కృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. హిందూ సమాజం ఐక్యతతోనే భారతదేశానికి శ్రీరామ రక్ష అన్నారు. కలియుగంలో మానవాళికి శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడని, పితృవాక్య పరిపాలకుడి బాటలో మనమందరం నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ విభాగ్ సహ కార్యదర్శి మఠం రాచయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు భాగ్యవతి, నాయకులు నరహరి, శశిధర్, రంగయ్య, బాలబ్రహ్మచారి, హన్మంత్రెడ్డి, కోటేష్, హరిత తదితరులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ క్షేత్ర ప్రముఖ్ రమేశ్ -
డివిజన్కు కొహెడ పేరు పెట్టాలి
తుర్కయంజాల్: జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని 53వ డివిజన్కు తొర్రూర్ పేరుకు బదులుగా కొహెడ పేరును పెట్టాలని డిమాండ్ చూస్తూ కొహెడ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న కొహెడను వదిలేసి, చిన్న గ్రామామైన తొర్రూర్ పేరుతో డివిజన్ను ఏర్పాటు చేయడం కక్షసాధింపు చర్యలాంటిదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేరును మార్చాలని అన్నారు. అదేవిధంగా చార్మినార్ జోన్ నుంచి ఎల్బీనగర్కు మారుస్తున్నట్లు ఉత్తర్వులను వెల్లడించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాంరెడ్డి, అమర్నాఽథ్ గుప్తా, కృష్ణాచారి, రంగారెడ్డి, బల్దేవ్రెడ్డి, విజయ్బాబు, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్
హుడాకాంప్లెక్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్–2025 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 4 నుంచి 20 ఏళ్లలోపు బాలురు, బాలికలు 60, 80, 100, 300, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్పుట్ విభాగాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. రూ.299 రుసుము చెల్లించి ఆన్లైన్లో లేదంటే గ్రౌండ్లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. నమోదు కోసం ఆధార్ లేదా బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ సమర్పించాలని చెప్పారు. వివరాలకు 99630 48320, 99590 91114 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
గ్రామాలపై ప్రత్యేక నిఘా
● ఘర్షణలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణ ● పంచాయతీ ఎన్నికల్లో కట్టుదిట్టమైన బందోబస్తుయాచారం: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మండలంలోని యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ల పరిధిలో మంతన్గౌరెల్లి, గునుగల్, చౌదర్పల్లి, ధర్మన్నగూడెం, చింతుల్ల, మొండిగౌరెల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తండా, మాల్, నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లోని రౌడీ షీటర్లను, బెల్టు దుకాణాదారులను ఇప్పటికే తహసీల్దార్ అయ్యప్ప ఎదుట బైండోవర్లు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతుండడంతో ఆదివారం యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ల సీఐలతో పాటు పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరికలు చేశారు. వారం రోజులుగా విందు భోజనాలకు ఆయా గ్రామాల్లో అభ్యర్థులు వేసిన టెంట్లను తొలగించేశారు. సమస్యాత్మాక గ్రా మాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేలా ఇబ్ర హీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలకు ఆదేశించారు. ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రకటన వరకు ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ అమ లులో ఉంటుందని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారా యణ, యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. -
ముమ్మరంగా మూడో విడత
ప్రచారానికి దగ్గర పడుతున్న గడువు ● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర పాట్లు ● గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు ఇబ్రహీంపట్నం రూరల్: గడువు దగ్గర పడుతున్నా కొద్దీ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. ఇక ప్రలోభాల ఎరవేతకు తీవ్ర ఎత్తుగడలు రచిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఎలాగైనా సర్పంచ్, వార్డు స్థానాల్లో పాగా వేసేందుకు ఓటర్లకు మద్యం, డబ్బు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు. అవసరమైతే ప్రమాణాలు, బుజ్జగింపులు చేస్తూ ఓట్లు రాబట్టే పనిలో ఆయా పార్టీల మద్దతుదారులు బిజీగా ఉన్నారు. రోజుకో తీరు ప్రచారం జోరు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు వారం రోజులుగా వినూత్నంగా ప్రచారాలు చేశారు. ప్రజలను వెంటేసుకొని ర్యాలీలు నిర్వహించడం, ఇంటింటికి తిరిగి అయ్యా, అమ్మా.. మీ ఓటు మాకే అని బతిమిలాడటం, ఆలింగనం చేసుకోవడం, కాళ్లు మొక్కడం చేస్తున్నారు. గుర్తులను చూపించుకుంటూ జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. జనం ర్యాలీలకు ఒక్కోక్కరికి రూ.200 నుంచి రూ.500ల వరకు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. ఓ వైపు ఓటర్లకు ఉపాధి కూడా దండిగా లభిస్తుంది. మరో వైపు ప్రచారానికి డబ్బులిస్తే ఓటు తమకే వేస్తారనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. అంతు చిక్కని ఓటరు నాడి అభ్యర్థులు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పైకి మనమే గెలుస్తున్నామని తమ అనుచరులతో తెలుపుతున్నా లోపల మాత్రం భయంగా ఉంటున్నారు. పలానా ఇంట్లో మనకు ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఓటరు మాత్రం అందరికీ ఒకే రకంగా సమాధానం ఇస్తున్నాడు. ఆయా గ్రామాల్లో కనీసం ఒక్కో ఓటరుకు రూ.ఐదు వేల వరకు ఎన్నికల తాయిలాలు చెందే అవకాశం ఉంది. చివరిరోజు ఇచ్చే నగదు బట్టి అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది. -
న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో టికెట్లు విక్రయిస్తూ న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించేవారు పోలీసుల నుంచి కచ్చితంగా అను మతి తీసుకోవాలని కొత్వాల్ సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం 15 రోజుల ముందు (ఈ నెల 16వ తేదీ లోపు) దరఖాస్తు చేసుకుని అను మతి పొందాలని పేర్కొన్నారు. ఈ నెల 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్ తదితరాలు అర్ధరాత్రి ఒంటి గంట (తెల్లవారితే జనవరి 1) వరకే పని చేయాలని తెలిపారు. సీసీ కెమెరాలు, అవసరమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్ స్థలం కచ్చి తమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదని ఆయన ప్రకటించారు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు ఎలాంటి శబ్ధం వినిపించకూడదని, అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లు/క్యాబ్లను నిర్వాహకులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ‘డిజిగ్నెటెడ్ డ్రైవర్’ విధానంపై విస్తృతంగా ప్రచారం చేయాలి. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహన యజమానులదే బాధ్యత అవుతుంది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు సైతం కనిష్టంగా మూడు నెలలు రద్దు అవుతాయి. ఈ విషయాలు ఈవెంట్ జరిగే చోట ప్రదర్శించడంతో పాటు ప్రచారం చేయాలని కొత్వాల్ పేర్కొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట భద్రత
శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఆమనగల్లు: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు, విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి శనివారం పలు సూచనలు చేశారు. ఆయా మండలాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించకుండా అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు కేటాయించిన ప్రాంతాలను వదలరాదని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేని వ్య క్తులను, ఓటరు కానివారిని రానివ్వొద్దని, ఓట ర్లు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా చూడాలని చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించేలా చూడాలన్నారు.ఆయా సమావేశాల్లో షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి, కడ్తాల్ సీఐ గంగాధర్, ఎస్ఐలు వెంకటేశ్, వరప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
తీర్పు.. ఇచ్చేనా ఓదార్పు!
చేవెళ్ల/షాబాద్: రెండో విడత పంచాయతీ ఎ న్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. గెలు పే లక్ష్యంగా ముమ్మర ప్రచారం సాగించిన అభ్యర్థులు శనివారం ఓటరు దేవుడి ప్రసన్నం కోసం చిట్టచివరి ప్రయత్నాలు వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు తాయి లాలు, నగదు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాల సభ్యులను వేర్వేరుగా కలిసి వారికి కావాల్సిన హామీలు గుప్పించడంతోపాటు ప్యాకేజీలు సైతం ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఓవైపు ధీమా.. మరోవైపు టెన్షన్ ఆదివారం పోలింగ్ జరుగుతుండడం..వెంటనే ఓట్ల లెక్కింపు కానుండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలింగ్కేంద్రాలకు వెళ్లే ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారోనని..ఓటరు తీర్పు ఎలా ఉంటుందో నన్న తీవ్ర ఉత్కంఠ వారిలో నెలకొంది. ఎవరిని ఆదరిస్తారు..ఎవరినితిరస్కరిస్తారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎవరి వద్దకు వెళ్లిన నీకే నా ఓటు అంటూ చెప్పడంతో ఓవైపు ధీమాగా ఉన్నా మరోవైపు ఓటు వేయకపోతే పరిస్థితి ఏమిటోనన్న భయం వెంటాడుతోంది. గెలవకుంటే ఎట్లా..? ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు స్థాయికి మించి ఖర్చు చేశారు. వారం రోజుల పాటు రోజు కూలీ రూ.500 నుంచి రూ.1000 వరకు ఇవ్వడంతోపాటు మందు, విందులు ఏర్పాటు చేశారు. ఓటుకు ఇంత అంటూ రేటు కట్టి మరీ ముట్టజెప్పారు. ఇంతా చేసినా ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనని జంకుతున్నారు. ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టాం.. అమ్ముకున్నాం.. అప్పులు తెచ్చి ఎన్నికల్లో నిలబడ్డాం.. గెలవకుంటే ఎలా అని కలవరానికి గురవుతున్నారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
ముగిసిన గ్లోబల్ సమ్మిట్
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా పూర్తయింది. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమ్మిట్ నిర్వహించింది. 10 నుంచి 13వ తేదీ వరకు ప్రాంగణాన్ని సందర్శించడానికి విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు అనుమతిచ్చింది. ప్రధాన వేదిక పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శనివారం ముగింపు సందర్భంగా ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, స్పీడీ సీఈఓ ఈవీ నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. భవిష్యత్ శ్రేయస్సుకు వర్తమాన పద్ధతులు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన వ్యూహ్యం అనే అంశంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సెంటర్ ఫర్ సస్టేయినబుల్పై అగ్రికల్చర్ డైరెక్టర్ జీవి రామాంజనేయులు, విశ్రాంత ఐఏఎస్ ఎంవీ రెడ్డి, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎస్డీ శిఖామణి, పార్మర్స్ కార్పొరేషన్ ఫౌండర్ సీఎస్ రెడ్డి, అగ్రి బిజినెస్, అగ్రిటెక్ నిపుణుడు విజయ్ నడిమింటి తదితరులు చర్చించారు. గ్రామీణ తెలంగాణను పట్టణ ప్రాంతానికి అనుసంధానించడం అనే అంశంపై వీసీ డి.రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.నర్సింహారెడ్డి తదితరులతో చర్చా గోష్టి నిర్వహించారు. రైతు సంఘం నాయకులు అన్వేష్రెడ్డి, నల్ల వెంకటేశ్వర్లు, ఆదర్శ మహిళా రైతు లావణ్య తదితరులు వ్యవసాయంపై నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. గాయని మంగ్లీ పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి -
2 విడతకు..రెఢీ
రెండో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. కందుకూరు డివిజన్లోని 3 మండలాలు, చేవెళ్ల డివిజన్లో 4 మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారం రోజులపాటు గ్రామాల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. విజయం కోసం చివరి క్షణాల వరకు సర్వశక్తులూ ఒడ్డారు. ఇక పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో పోటీలో ఉన్నవారిలో టెన్షన్ మొదలైంది. అధికార కాంగ్రెస్పార్టీ, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో.. ఎవరిని నిరాశకు గురి చేస్తుందోనేటితో తేలిపోనుంది. – ఆమనగల్లు/చేవెళ్ల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు. కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల పరిధిలోని 61 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమనగల్లు మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు గాను ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా మిగిలిన 12 చోట్ల 40 మంది అభ్యర్థులు, 112 వార్డులకు 20 ఏకగ్రీవం కాగా 92 స్థానాలకు 258 మంది పోటీలో ఉన్నారు. కడ్తాల్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు నాలుగు ఏకగ్రీవం కాగా 20 సర్పంచ్ స్థానాలకు 59 మంది, 210 వార్డులకు 52 వార్డులు ఏకగ్రీవం కాగా 158 స్థానాలకు 453 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. తలకొండపల్లి మండలంలో 32 పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా మిగిలిన 29 సర్పంచ్ స్థానాలకు 85 మంది, 272 వార్డులకు గాను 49 వార్డులు ఏకగ్రీవం కాగా 223 వార్డులకు 567 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చేవెళ్ల డివిజన్లో ఇలా.. డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాల్లో 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలంలో 25 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 23 పంచాయతీలకు 68 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 19 పంచాయతీ సర్పంచ్లకు 59 మంది, షాబాద్లో 41 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా 40 గ్రామాల్లో 111 మంది అభ్యర్థులు, శంకరపల్లి మండలంలో 24 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 22 చోట్ల సర్పంచ్ పదవికి 64 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చేవెళ్ల మండలంలో 183 వార్డులకు 469 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 157 వార్డులకు 434 మంది, షాబాద్ మండలంలో 305 వార్డులకు 794 మంది, శంకర్పల్లి మండలంలో 188 వార్డులకు 463 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద శనివారం సిబ్బందికి అధికారులు సామగ్రి అప్పగించారు. ఎన్నికల నిర్వహణపైసలహాలు, సూచనలు చేశారు. అనంతరం సిబ్బంది బ్యాలెట్బాక్స్లు, ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పంచాయతీలకు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి సందర్శించారు. చేవెళ్ల డివిజన్లోని కేంద్రాలను ఆర్డీఓ చంద్రకళ పరిశీలించారు. డీఈఓ సుశీందర్రావు, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావు తగిన సూచనలు అందించారు. ప్రలోభాల పర్వం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్తశస్త్రాలు వినియోగించారు. ఇంటింటికీ మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. హోరాహరీ పోరు తప్పదనుకున్న గ్రామాల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఓటరు కటాక్షం ఏ అభ్యర్థికి వరంగా మారుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.నేడు మలిదశపంచాయతీ పోరు ఎన్నికలు జరగనున్న మండలాలు: 7 మొత్తం సర్పంచ్ స్థానాలు: 165 మొత్తం వార్డు స్థానాలు: 1,306 బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 499 పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు: 3,508 పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట -
పవర్ఫుల్ పదవి..
పల్లెకు సుప్రీం ప్రథమ పౌరుడే అయినా.. ఉప సర్పంచ్ పదవికి ప్రాధాన్యత సంతరించుకుంది. నిధుల వినియోగంలో సర్పంచితో పాటు సమానంగా పంచాయతీ రాజ్ చట్టం హక్కు కల్పించడంతో.. ఆ పదవికి బలం పెరిగింది. కుర్చీ కోసం పోటీ పెరిగింది. పరిగి: గ్రామ పాలనలో ఉపసర్పంచ్ పదవి కీలక భూమిక పోషిస్తోంది. నామమాత్రపు పాత్రకే పరిమితమైన ఆ పదవి.. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పవర్ఫుల్గా మారింది. గ్రామంలో నిధుల వినియోగంపై సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు కూడా ఉమ్మడి చెక్పవర్ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఆ పదవికి బలం చేకూర్చింది. దీంతో ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. వారి దృష్టంతా దానిపైనే.. పరిగి నియోజకవర్గంలో మూడో విడత పంచాయితీ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. అందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. సెగ్మెట్లో 157 పంచాయతీలు ఉండగా, అందులో 18 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 139 గ్రామాలకు ఎన్నిక జరగనుంది. ఐదు మండలాల్లో 1,340 వార్డులు ఉండగా.. అందులో 306 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,033కి ఎన్నిక జరగనుంది. అయితే సర్పంచ్ని నేరుగా ఓటర్లే ఎన్నుకుంటుండగా.. ఉప సర్పంచ్ను మాత్రం వార్డు సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు. గతంలో ఈ పదవికి అంతగా డిమాండ్ ఉండేది కాదు. వార్డు సభ్యుడికి ఉన్న అధికారాలే ఉపసర్పంచ్కు ఉండటం వలన అది అలంకారప్రాయంగానే ఉండేంది. పంచాయితీ రాజ్ చట్టం అమలుతో ఈ పోస్టుకు యమ గిరాకీ పెరిగింది. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఉప సర్పంచికి పోటీ పెరిగింది. ఆ స్థానానికి రిజర్వేషన్ వర్తింపజేయకపోవడంతో సర్పంచ్ గిరి ఆశించి భంగపడిన వారు.. దీనిపై నజర్ పెట్టారు. ఈ పదవితో కూడా గ్రామ రాజకీయాలను శాసించవచ్చని భవిస్తూ బరిలో నిలుస్తున్నారు. మంతనాలు షురూ వార్డు మెంబర్గా విజయం సాధించి, ఉపసర్పంచ్ని చేజిక్కించుకోవాలన్న ఎత్తుగడలో చాలా మంది ఉన్నారు. ఈ పోస్టుకు అవసరమైన సంఖ్యా బలాన్ని సమీకరించుకునేందుకు ఇప్పటి నుంచే వార్డు బడిరలో నిలిచిన వారు.. మిగతా వారితో మంతనాలు సాగిస్తున్నారు. ఈ మేరకు వార్డు మెంబర్లుగా గెలవాలనే తమ క్యాంపుల్లో చేరేలా సంప్రదింపులు జరుపుతున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటికే గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. నువ్వా.. నేనా! సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. విధుల నిర్వహణ సర్పంచ్లకే ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అమలులో విఫలమైతే సర్పంచ్పై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టానికి ఉంది. ఉపసర్పంచ్ సహా పాలకవర్గాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయకపోవడం గమనార్హం. అంతే కాకుండా అక్రమ నిర్మాణాలు జరిగినా, నిర్ణీత వ్యవధిలో అనుమతులు మంజూరు చేయకున్నా సర్పంచ్పై వేటు పడుతుంది. ఉపసర్పంచ్కు మాత్రం మినాహాయింపు నిచ్చింది. పంచాయతీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్పవర్ కల్పించిన సర్కారు.. బాధ్యతలను మాత్రం పూర్తిస్థాయిలో సర్పంచ్లకే అప్పగించింది. దీంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పోస్టుకు నువ్వా నేనా అన్నట్టు పోటీ జరుగుతోంది. ఉప సర్పచ్ పదవి కోసంవార్డు సభ్యుల పోటాపోటీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్పవర్ బాధ్యతలు పూర్తిగా సర్పంచ్కే అయినా.. పవర్ కోసం ఆరాటం -
విధులకు ఆలస్యంపై ఎంపీడీఓ ఆగ్రహం
● స్పృహతప్పి పడిపోయిన జూనియర్ అసిస్టెంట్ ● ధారూరులో ఘటన ధారూరు: ఎన్నికల విధులకు ఆలస్యంగా వచ్చిన ఓ ఉద్యోగిని ఎంపీడీఓ మందలించడంతో ఆందోళనకు గురై, స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరులోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. యాలాల మండలంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆదిశేషాచారికి.. ఓ జీపీలో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్గా విధులు కేటాయించారు. ఆయన సకాలంలో హాజరుకాకపోవడంతో ఎంపీడీఓ నర్సింహులు మండిపడ్డారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిసినా.. ఎందుకిలా వ్యవహరించారని మండిపడ్డారు. మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని అందరిముందూ మైక్లో గద్దించడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన మిగిలిన సిబ్బంది ఎంపీడీఓ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఏపీఓను ధారూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. అనంతరం ఇంటికి పంపించేశారు. -
ఓటు.. ఎటు!
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల పర్వం తుది దశకు చేరింది. విజేతలెవరో.. ప్రజలు ఎవరికి పట్టం కడతారో..? నేటితో తేలిపోనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు ప్రచారం ముగిసే వరకూ అనుచరులు, మద్దతుదారులతో హోరాహోరీగా గ్రామాల్లో మద్దతు కూడగట్టిన అభ్యర్థులు.. ఇక బ్యాలెట్ బాక్సుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండా ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులు గెలుపు కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఏఅంశంలో వెనకబడినా ప్రత్యర్థికి అవకాశం చిక్కుతుందనే ధోరణిలో ఒకరికి మించి ఒకరు ముందుకు సాగుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయమే పరమావధిగా పోరాడుతున్రాను. తెలిసినవారు, బంధువులు, స్నేహితుల ద్వారా ఓటర్లను మచ్చిక చేసుకుని, తమకే ఓటు వేసేలా చూసుకుంటున్నారు. ఎంతైనా ఇద్దాం.. గ్రామాల్లో ఇప్పటీకే అభ్యర్థులు ఇచ్చిన హామీలతోపాటు ప్రచారంలో భాగంగా రోజు కూలీ, మందు, విందులు పూర్తయ్యాయి. ఇక ఒక్కో ఓటుకు రేటు కట్టి పంపకాలూ జరిగిపోయాయి. ఉన్నదల్లా ఓటర్లను తీసుకెళ్లి అనుకూలంగా ఓటు వేయించుకోవడం ఒక్కటే మిగిలింది. ఈక్రమంలో ఓటరు దేవళ్లు ఎవరివైపు మొగ్గు చూపుతారోననే టెన్షన్ అందరు అభ్యర్థుల్లోనూ కనిపిస్తోంది. కొంత మంది అభ్యర్థులు ముందుగానే తాయిలాలు ముట్టజెప్పి, ఇక ప్రత్యర్థులు ప్రలోభ పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్యాకేజీలతో పిలుపు గ్రామాలకు బయట ఉండే ఓటర్లను కలిసిన అభ్యర్థులు ఇప్పటీకే వారికి ప్రత్యేక ప్యాకేజీలను అందజేశారు. ఎలాగైనా ఊరికి వచ్చి ఓటేయాలని ప్రాధేయపడ్డారు. రవాణాఖర్చులు ఇవ్వడంతో పాటు అన్ని సదుపాయాలూ సమకూరుస్తామని చెప్పారు. ఓటేసేందుకు తప్పకుండా రావాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా గ్రామాలకు వలస వచ్చిన వారికి సైతం స్థానికంగా ఓట్లు రావడంతో వారిని మచ్చిక చేసుకుని అన్ని హామీలు ఇచ్చేశారు. చివరి దశకు చేరిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఎలాగైనా గెలవాల్సిందే.. సర్వశక్తులూ ఒడ్డిన అభ్యర్థులు పోలింగ్ చివరి క్షణం వరకూ కొనసాగనున్న ప్రలోభాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలూ ప్రయోగం మిగిలింది ఓటు వేయించుకోవడమే -
అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోండి
మొయినాబాద్రూరల్: గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని బాకారంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్యాదవ్ తరఫున వారు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలతో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే అభ్యర్థులను ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధితో పాటు ఎలాంటి సమస్యలు ఉండవని సూచించారు. బాకారంలో శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
● బరిలో బ్రదర్స్
మహేశ్వరం: బంధుత్వాలను పక్కనపెట్టి పలువురు పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగారు. నిన్నమొన్నటివరకు కలిసున్న వారు కాస్తా ప్రత్యర్థులుగా మారి ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. మహేశ్వరం మండలం పెండ్యాల సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వు అయింది. ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ పదవి కోసం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా అన్న జైత్వారం జగన్మోహన్రెడ్డి, బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా తమ్ముడు జైత్వారం శ్రీధర్రెడ్డి పోటీలో నిలిచారు. ఇద్దరి మధ్య తీ వ్ర పోటీ నెలకొంది. కు టుంబసభ్యులు సైతం విడివిడిగా వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికీ గతంలో ఉపసర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో తాము చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న సం‘గ్రామంలో’ రాజకీయం వెడెక్కింది. వీరి తండ్రి జైత్వారం శాయిరెడ్డి గతంలో సర్పంచ్గా చాలా కాలం పని చేశారు. ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో ఈ నెల 17తో తేలనుంది. -
ముగిసిన రెండో విడత ప్రచారం
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు పోటాపోటీగా గడపగడపనూ చుట్టేశారు. ఈనెల 14న పోలింగ్ జరగనున్న డివిజన్లోని అన్ని పంచాయతీల్లో వారం రోజులుగా హామీల వర్షం కురిపించారు. భారీ ర్యాలీలతో తమ బలం చాటుకున్నారు. బలాబలాల ప్రదర్శన ముగియడంతో ఇక అసలు రాజకీయం మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లెపారు. మందు, విందు, తాయిలాల పంపిణీ మొదలు పెట్టారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నగరానికి అతీ సమీపంలో ఉన్న జిల్లాలో రియల్ ప్రభావంతో భూముల రేట్లు పెరిగినట్లుగానే ఎన్నికల్లో ఓటర్లకు ఓటు రేటు కూడా పెరిగిపోయింది. చిన్నచిన్న పంచాయతీల్లో సైతం ఓటుకు రూ.3వేల నుంచి రూ.10వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో, ఎంతిస్తున్నాడో తెలుసుకొని అంతకు మించి పంపకాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు తీసిపోని విధంగా స్థాయికి మించి ఖర్చు చేస్తున్నారు. -
● వలస ఓటర్లకు గాలం
ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని సైతం వదులుకోకుండా గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఎలాగైనా పోలింగ్రోజు రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేసుందుకు ఊరికి రావాలని కోరుతున్నారు. కొంతమంది స్వయంగా కలిసి ఎన్నికల్లో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు భరిస్తామని, ఓటుకు కొంతమొత్తం ముట్టజెపుతామని బేరసారాలు సాగిస్తున్నారు. ఓటర్లంతా ఒకే దగ్గర ఉంటే వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. -
సందడిగా ‘సమ్మిట్’ ప్రాంగణం
కందుకూరు: ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం శుక్రవారం మూడో రోజు విద్యార్థులు, సందర్శకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లనుఆసక్తిగా తిలకించారు. రోబోలతో స్వాగతం, ఏఐ ఫొటో ఇమేజ్లు తీసుకోవడం, స్టాళ్లలో ఏర్పాటు చేసిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదికలో ఎమర్జింగ్ టెక్నాలజీ అనే థీమ్తో రియల్ లైఫ్లో రిజిలియెన్స్ అనే అంశంపై చర్చ నిర్వహించారు. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జి.సత్యనారాయణ, ఛీప్ డెలివరీ ఆఫీసర్ జితేంద్ర పుచ్చ, మాస్టెక్ డిజిటల్ శ్రీనివాస్ ఆత్రేయ, సీటీఓ అవికా, క్యూవైఎల్ఐఎస్ సీఈఓ కిషోర్ ఉప్పలపాటి చర్చా వేదికలో పాల్గొన్నారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ యొక్క ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సిద్ధత తదితర అంశాలపై విద్యార్థుల సమక్షంలో విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించారు. అనంతరం కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్శనకు శనివారం చివరి రోజని, ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
మంచాల: గ్రామాల్లో ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివా స్ అన్నారు. మండలంలోని ఆరుట్ల ఆదర్శ పా ఠశాలలో శుక్రవారం మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయనముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన నియమాలు, నిబంధనలు అమలు పర్చాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతోప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలశంకర్, తహసీల్దార్ వెంకటప్రసాద్,ఎంఈఓ రాందాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ మీర్పేట: మనం అమెరికా వెళ్లడం కాదు.. అమెరికాలో ఉన్న వారిని మన దేశ అభివృద్ధికి తీసుకురాగల స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆకాంక్షించారు. మీర్పేట సర్కిల్లోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమా ల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి శుక్రవా రం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యార్థులు అదృష్టవంతులని, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఉన్నత విద్యావకాశాలు కల్పించామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ఏటీఏ సభ్యుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఏటీఏ అధ్యక్షులు చల్లా జయంత్రెడ్డి, చల్లా బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలపై శిక్షణ కందుకూరు: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. కొత్తగూడ పరిధిలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిసైడింగ్, స్టేజ్–2 అధికారులకు పంచాయతీ ఎన్నికల పై శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..ఎన్నికల నియమావళి ప్రకా రం విధులు నిర్వర్తించాలన్నారు. మాస్టర్ ట్రైన ర్లు ఇమాన్యూల్, మల్లేశం విధి విధానాలపై శిక్ష ణ ఇచ్చారు.కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారి సుధారాణి, ఎంపీడీఓ సరిత పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక– సంగీత కార్యక్రమం మొయినాబాద్: ఆధ్యాత్మిక గంభీరత, భావరసం, రాగబంధం, సాహిత్య సౌందర్యంతో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయంలో శుక్రవారం తెలంగాణ భక్తి సంగీత సంపదలో విశిష్ట స్థానం సంపాదించిన రాకమచర్ల వెంకటదాసు కీర్తనలు, శేషులతా విశ్వనాథ్ స్వరరచనలో సంప్రదాయ భజన శైలిలో చేపట్టిన ఆధ్యాత్మిక–సంగీత కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఆలయ అర్చక ధర్మకర్తలు ఎంవీ సౌందరరాజన్, గోపాలకృష్ణస్వామి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కీర్తనల్లోని రాగభావం, ఆధ్యాత్మికత, వాగ్గేయకార శైలి వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. -
● తల్లి సర్పంచ్గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి తల్లి సర్పంచ్ అభ్యర్థిగా, తనయుడు వార్డు సభ్యుడి గా పోటీ చేస్తున్నారు.మండలంలోని గొల్లగూడ సర్పంచ్ స్థానం జనరల్ మహిళగా రిజర్వ్ అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా పసూలాది లక్ష్మి పోటీలో ఉండగా అదే పంచాయతీలో 7వ వార్డు సభ్యుడిగా ఆమె కు మారుడు పి.మన్మోహన్ పోటీ పడుతున్నారు. స్పరంచ్గా తల్లికి, వార్డు సభ్యుడి గా తనకు అవకాశం కల్పించాలని తన వార్డులో కొడు కు ప్రచారం చేస్తున్నాడు. సర్పంచ్గా గెలిస్తే తల్లికి మద్దతుగా ఉండాలన్న ఆలోచనతో పోటీకి దిగారు. సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి వార్డు అభ్యర్థి మన్మోహన్ -
అక్రమ మైనింగ్పై
నిమ్స్ పరిధిలోకి వెల్నెస్ కేంద్రాలుభద్రతా ఏర్పాట్ల పరిశీలన ఉక్కుపాదం!సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గుట్టుగా తవ్వకాలు జరిపి.. రాయల్టీ ఎగవేతకు పాల్పడిన అక్రమార్కుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణ యించింది. ఈ మేరకు ఆయా మైనింగ్/ సెల్లార్ యజమానులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్, సరూర్నగర్, హయ త్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, గండిపేట, శంషాబాద్ మండలాల్లో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఈ అంశంపై స్థానికుల నుంచి జిల్లా మైనింగ్ అధికారికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐలు క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్రమాలను గుర్తించడమే కాకుండా భారీ పెనా ల్టీలతో డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అక్రమ తవ్వకాలు, రాయల్టీ చెల్లించకుండా గుట్టుగా మట్టిని తరలించే లారీలపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఇటీవల ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, పహడీషరీఫ్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేయకపోగా, పరోక్షంగా వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ నోటీసులతోనే సరి.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ రెవెన్యూ సర్వే నంబర్ 167/2లో ఓ నిర్మాణ సంస్థ భారీగా తవ్వకాలు చేపట్టినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో రూ.9.5 కోట్లకుపైగా ఫైన్ వేశారు. తట్టి అన్నారం సర్వే నంబర్ 121/పీలోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. రూ.3.39 కోట్ల జరిమానా విధించారు. ఒక్క పైసా కూడా వసూలు చేయలేదు. సరూర్నగర్ మండలం మన్సూరాబాద్ సర్వే నంబర్ 38లో ఓ కన్స్ట్రక్షన్ సంస్థ ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారీ సెల్లార్ తవ్వుతోంది. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ.రెండు కోట్లతో డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఇప్పటి వరకు పైసా వసూలు చేయలేక పోయారు. గతంలో సెల్లార్ తవ్వుతుండగా, మట్టి కూలి నలుగురు కూలీలు మృతి చెందిన ప్రదేశంలోనూ యథావిధిగా తవ్వకాలు మొదలయ్యాయి. ఈ అక్రమ తవ్వకాల వెనుక కొంత మంది పెద్దల హస్తం ఉన్నట్లు తెలిసింది. శ్రీనగర్ రెవెన్యూ సర్వే నంబర్ 185,188, 189లోనూ ఓ మైనింగ్ ఏజెన్సీ అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపట్టి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. తవ్వకాలను ఆపాలంటూ రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులకు లేఖ రాసినా ఫలితం లేకపోయింది. తాజాగా మన్సూరాబాద్, హయత్నగర్ రెవెన్యూ పరిధిలోనూ అక్రమ సెల్లార్లను గుర్తించి, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంగం హోటల్ ఎదురుగా కృపా కాలనీలోనూ సెల్లార్ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బయటికి అమ్ముతున్నట్లు గుర్తించి, నోటీసులు జారీ చేశారు. అడ్డగోలు తవ్వకాలు, మైనింగ్ అమ్మకాలపై ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు తనిఖీలకు వెళ్లడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం మినహా పైసా కూడా వసూలు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. సీరియస్గా తీసుకున్న రెవెన్యూ యంత్రాంగం ముక్కుపిండి రాయల్టీవసూలు చేయాలని నిర్ణయం రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుకు సన్నాహాలు ఆర్ఆర్ యాక్ట్తో ఆదాయంనగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఓఆర్ఆర్కు అటు ఇటుగా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. గండిపేట్, మంచిరేవుల, కోకాపేట్, బుద్వేల్, నార్సింగి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, శంషాబాద్, వనస్థలిపురం, తుర్కయంజాల్ కేంద్రంగా భారీగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగు తున్నాయి. ఈ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బహిరంగ మార్కెట్లో టిప్పర్కు రూ.5 వేల నుంచి రూ.6 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో గ్రానేట్ను సైజును బట్టి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఇక నిర్మాణాల్లో ఉపయోగించే రోబోశాండ్ టన్నుకు రూ.600 నుంచి రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రషర్లు ఏర్పాటు చేసి, ఎత్తయిన గుట్టలు, సెల్లార్ తవ్వకాల్లో భాగంగా వచ్చిన రాళ్లను క్రషర్లలో వేసి డస్ట్గా మారుస్తున్నారు. కనీస చర్యలు చేపట్టక పోవడంతో దుమ్ము, ధూళి సమీప కాలనీలను ముంచేస్తోంది. ప్రతి నెలా అడిగినంత ఇచ్చే వాళ్లకు రాచమర్యాదలు చేస్తూ.. నిరాకరించిన వాళ్ల టిప్పర్లపై కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్ తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.ఆరు వేల కోట్ల ఆదాయం వస్తే.. ఆర్ఆర్ యాక్ట్తో ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే మొండి బకాయిలు వసూలు చేయడం సహా రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,800 కోట్లు సమకూరే అవకాశం లేకపోలేదు. కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు రెవెన్యూ వాళ్లపై.. రెవెన్యూ వాళ్లు పోలీసులపై నెట్టేసి తప్పించుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ సీరియస్గా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్ఆర్ యాక్ట్ను అమలుతో ఇప్పటి వరకు తిన్నదంత కక్కించొచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ఈ ఫెనాల్టీల వసూళ్ల కోసం దీన్ని పకడ్బందీగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లక్డీకాపూల్: ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో వెల్నెస్ కేంద్రాల పరిపాలన, నిర్వహణ బాధ్యతలు ‘నిమ్స్’ పరిధిలోకి వచ్చాయి. ఈ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంతో పాటు లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలో ఉన్న వెల్నెస్ కేంద్రాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత అధిగమించే క్రమంలో నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నిమ్స్కు అప్పగించింది. దీంతో ఖైరతాబాద్, కూకట్పల్లి వెల్నెస్ కేంద్రాల్లో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చే దిశగా నిమ్స్ చర్యలు చేపట్టింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వైద్యులు సేవలను అందిస్తున్నారు. అవసరమైన శస్త్రచికిత్సలు నిర్వహించడం గమనార్హం. శంకర్పల్లి: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్గౌతమ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండలంలోని మహాలింగాపురం, గాజులగూడెంలో ఈనెల 14న ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమణగౌడ్, ఎస్హెచ్ఓ శ్రీనివాస్గౌడ్, డీఐ సమరం, ఎస్ఐ సురేశ్తో కలిసి ఆయా గ్రామాల్లో పోలింగ్ జరిగే కేంద్రాలను, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. పోలింగ్ రోజు ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మద్యం, మత్తు పానీయాల పంపిణీని అరికట్టేందుకు పర్యవేక్షణ, పహారాలు, చెక్పోస్ట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా పరిస్థితులు కల్పించేందుకు సమగ్ర ప్రణాళికలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
పోస్టల్ బ్యాలెట్కూ స్వస్తిక్ మార్కు ఇవ్వాలి
శంకర్పల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా రహస్యంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నా అది బహిర్గతం అవుతోందని టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో పెన్నుతో రైట్ మార్కు ఇచ్చి తమ ఓటును వేస్తారని, దీంతో ఓట్ల లెక్కింపు సమయంలో ఓటు ఎవరు వేశారు అనే విషయం బహిర్గతమవుతోందని అన్నారు. సాధారణ పౌరులు స్వస్తిక్ మార్కు ద్వారా ఓటు వేసినట్లే, తమకూ అవకాశం ఇవ్వాలని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను విడిగా కాకుండా, అందరితో పాటే లెక్కించాలని కోరారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. -
బీఆర్ఎస్ నాయకులపై దాడి
బషీరాబాద్: మండల పరిధిలోని కుప్పన్కోట్తండాలో గురువారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన ప్రకారం.. గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాంశెట్టి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఓటమిని జీర్ణించుకోలేక విచక్షణరహితంగా దాడి చేశారని బాధితులు శారుబాయి, శంకర్, మన్యనాయక్, లక్ష్మణ్ నాయక్ శుక్రవారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండాకు చెందిన కుల నాయకులు ఇరువర్గాల వారితో మాట్లాడి రాజీ కుదిర్చారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● కాంగ్రెస్ను విశ్వసించని ప్రజలు ● స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం ● మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు: ‘మోసపూరిత వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. అందుకే ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్రహ్మరథం పట్టారు. ఈ ఫలితాలతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అధ్యాయం ముగిసింది. మరో మూడేళ్లలో తిర్మలాపూర్ వెళ్లేందుకు మూటముల్లె సర్దుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన నివాసంలో పార్టీ మండల అధ్యక్షులు, నాయకులతో కలసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఇరు పక్షాల నుంచి పోటీ ఉంటుందని, అయితే బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెధిరింపులకు గురిచేశారని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. నియోజవకర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ బలపర్పించిన 70 మంది సర్పంచ్గా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉందని అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ స్థానాలను గెలిచి, జెడ్పీపీఠాన్ని కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను గెలిచి, ఎంపీపీలను దక్కించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు నర్సిరెడ్డి, వీరెందర్రెడ్డి, పంజుగుల శ్రీశైల్రెడ్డి, రాంలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గులాబీలో జోష్
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలు గు లాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి మెజార్టీ జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పాగా వేయడంతో ఆ పార్టీ శ్రేణులు, నేతల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. మండలంలో 39 జీపీలు ఉండగా బాబునాయక్తండా, హంక్యానాయక్తండా, నంద్యానాయక్తండా, మంతన్గౌడ్, బాద్లాపూర్ ఏకగ్రీవమై, కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. మిగిలిన 34 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించగా, 17 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. ఇందులో మేజర్ జీపీలైన జీవన్గీ, నీళ్లపల్లి, పర్వత్పల్లి, దామర్చెడ్, నవల్గా, మంతట్టితో పాటు గొట్టిగకలాన్, కొర్విచెడ్, కొర్విచెడ్గని, గంగ్వార్, క్యాద్గీరా, ఇందర్చెడ్, అల్లాపూర్, కొత్లాపూర్, కుప్పన్కోట్, మల్కన్గిరి, కంసాన్పల్లి(ఎం)ఉన్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన బలమైన నాయకులు ఉన్న మేజర్ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డినా పరాజయం పాలవడంపై నేతల్లో నైరాశ్యం అలుముకుంది. జీవన్గీలో అధికార పార్టీ అభ్యర్థి కే.నర్సిములు, బీఆర్ఎస్ అభ్యర్థి రామని బసప్ప మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండు పార్టీల మద్దతుదారులు ఐదేసి చొప్పున వార్డులను గెలుచుకోగా, సర్పంచ్ స్థానం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి రామని బసప్ప కై వసం చేసుకున్నారు. అలాగే నీళ్లపల్లిలో దశాబ్దాలుగా అనేక పదవులు అలంకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల సుధాకర్రెడ్డిని బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వేణుగోపాల్రెడ్డి అనే యువకుడు ఓడించాడు. అలాగే పర్వత్పల్లిలోనూ అధికార పార్టీ అభ్యర్థి జనార్దన్రెడ్డిని గులాబీ పార్టీ మద్దతుదారుడైన పాండురంగారెడ్డి చిత్తు చేశాడు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచును మాజీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. వేరు కుంపట్లే పుట్టిముంచాయా..? అధికార పార్టీలో ఎమ్మెల్యే మహనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి వర్గాలుగా.. పార్టీ నాయకులు, శ్రేణులు రెండుగా విడిపోయాయి. ఎమ్మెల్యే వర్గంలోనూ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో రెండు బలమైన సామాజికవర్గాల నాయకులు వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. దీంతోనే బషీరాబాద్ మండల కేంద్రంలో ఇద్దరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ పడ్డారు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి తప్పుకోవడంతో వెంకటేశ్ మహరాజ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ ఖాతాలో 21 జీపీలు మండలంలోని 34 పంచాయతీల్లో 17 గ్రామాలు బీఆర్ఎస్ కై వసం చేసుకోగా, 16 జీపీల్లోనే అధికార కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవమైన 5 పంచాయతీలు కలిపి ఆ సంఖ్య 21కి చేరింది. వీరు శుక్రవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇదిలా ఉండగా కంసాన్పల్లి(బి)లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బీజేపీ నాయకురాలు సునీతా గ్రామాభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. బషీరాబాద్ మండలం మేజర్ జీపీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల పాగా ‘పైలెట్’ మద్దతుతో కారెక్కిన 17 మంది గ్రామ ప్రథమ పౌరులు వర్గపోరుతో దెబ్బతిన్న అధికార పార్టీ కాంగ్రెస్ గూటికి కంసాన్పల్లి(బి) సర్పంచ్? -
మామిడిలో సస్యరక్షణ
పూత నిలిస్తేనే లాభాల పంట ● ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు చలి అనుకూలమే.. మొగ్గ దశలో చలి ఎక్కువ గా ఉండడం మొక్కకు చాలా ఉపయోగమే. నాకు 20 ఎకరాల మామిడి తోట ఉంది. అధికారుల సూచన లు, యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా. సకాలంలో మందులు పిచికారీ చేస్తున్నా. రాత్రి వేళల్లో చలి తీవ్రత 15 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే పూత బాగా నిలుస్తుంది. – పిట్ల మల్లేశ్, మామిడి రైతు, హస్నాబాద్ సూచనలు పాటించాలి మామిడి రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి. క్రమం తప్పకుండా తోటల ను పరిశీలించాలి. వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏ సమస్య ఉన్నా వెంట నే అధికారులను సంప్రదించాలి. ప్రతీ క్లస్టర్కు ఒక ఉద్యాన శాఖ అధికారి అందుబాటులో ఉంటారు. – ఎంఏ సత్తార్, ఉద్యాన శాఖ అధికారి దుద్యాల్: మామిడిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో 13 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పండే ప్రధాన పంటల్లో మామిడి కూడా ఒకటి. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. వాతావరణం అనుకూలంగానే ఉందని ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తోటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నారు. పూమొగ్గ బయటకు వచ్చే వరకు నీటి తడి ఇవ్వరాదు. మొగ్గ పగిలే దశలో పొటాషియం నైట్రేట్ (13:0:45) 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో మొగ్గ పడిలి పూత వచ్చే అవకాశం ఉంటుంది. జూన్– జూలై మాసంలో ఎరువులు వేయని మామిడి రైతులు ప్రస్తుత దశలో అరకిలో యూరియా, అరకిలో పొటాష్ను వేసువేసుకోవాలి. నీటి వసతి లేనివారు పిందె దశలో ఒక శాతం యూరియా ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. పూత ఆలస్యమైతే తోటలో కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవాలి. మామిడిపై చీడపీడల యాజమాన్యం.. ఆకులపై బూడిద మచ్చలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా సాఫ్ 2 గ్రాములను ఒక లీటర్ నీటికి కలిపి చెట్టుపై పిచికారీ చేసుకోవాలి. ఆకుపై నల్ల మచ్చలు ఉంటే పైకొమ్మలకు సోకి పూత రాలిపోతుంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 3 గ్రాముల ఆక్సీక్లోరైడ్ మందును కలిపి స్ప్రే చేయాలి. పూత, పిందె దశలో ఆకుమచ్చ పురుగు వ్యాప్తి చెందితే నివారణకు ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి 15 రోజు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. మొగ్గ తొందరగా విచ్చుకోవడానికి, పూల కాడ పొడవుగా పెరగడానికి పొటాషియం నైట్రేట్(13:0:45) 10 గ్రాముల మందును ఒక లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు అధికంగా ఉన్నప్పుడు లీటరు నీటికి ఫిఫ్రోనిక్ 2 మి.లీ లేదాఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోపాడ్(ట్రెసర్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సిన్(అక్టరా) 0.3 గ్రాముల మందులను లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. పిండినల్లి పురుగు నేల నుంచి చెట్టు పైకి పాకకుండా చెట్టు ప్రధాన కాండంపై గ్రీసు పూసిన ప్లాస్టిక్ పేపర్లను భూమి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు కాండం చుట్టూ చుట్టాలి. -
రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
తాండూరు రూరల్: ప్రజలు బీజేపీని గ్రామాల నుంచి బలోపేతం చేసేందుకు నడుంకట్టారని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి అన్నారు. మండల పరిధిలోని వీర్శెట్టిపల్లి సర్పంచ్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి తూర్పు లక్ష్మి విజయం సాధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నూతన సర్పంచ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. మోదీ సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీజేపీని అధిక స్థానాల్లో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మిని సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫిరంగి జర్నప్ప నాయకులు నర్సింలు, హరి, శ్రవణ్, పాల పరుశురాం, వాకిటి పరుశురాం, శంకర్, ఆనంద్ పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి -
పంచాయతీ ప్రచారంలో సినీ నటుడు శివారెడ్డి
ఆమనగల్లు: ఆకుతోటపల్లి గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి నాలపట్ల నరేందర్రెడ్డికి మద్దతుగా శుక్రవారం సినీ నటుడు శివారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థికి బంధువైన ఆయన ప్రచారంలో భాగంగా తన హాస్యంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. నరేందర్రెడ్డిని గెలిపించి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన యాలాల: మతిస్థిమితం లేని మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం జెట్టూరుకు చెందిన రమేశ్ ఈనెల 10న ఇందిరమ్మ కాలనీలో మతిస్థిమితంలేని ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం యా లాల పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
యాలాల అభివృద్ధికి సహకారం
యాలాల: నూతన సర్పంచ్లను శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఘనంగా సన్మానించారు. యాలలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, జెడ్పీటీసీ మాసీ భ్యుడు సిద్రాల శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిపై పేరి రాజేందర్రెడ్డి బలపరిచిన సీహెచ్ శివయ్య 244 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శివయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. యాలాల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.యాలాల సర్పంచ్, నాయకులతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు
పరిగి: బీఆర్ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరయ్యామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమంతోనే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగామన్నారు. జైలుపాలు చేసిన ప్రజల కోసం నిలబడినందుకే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, జగన్, సోయాబ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు మాజీలు మళ్లీ సర్పంచ్లు
బషీరాబాద్: సొంతూరుకు స ర్పంచ్గా సేవలు అందించడానికి అందరికీ అవకాశాలు రావు. రిజర్వేషన్తో పాటు అదృష్టం కలిసి రావాలి. మండల పరిధిలోని ముగ్గురు సర్పంచ్లకు మాత్రం రెండో సారి ఈ అదృష్టం వరించింది. 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మైల్వార్, గొట్టిగ కలాన్, బోజ్యానాయక్తండాకు సర్పంచ్లుగా ఎన్నికై న సీమాసుల్తానా, సాబేర్, శాంతిభాయి రిజర్వేషన్లు కలిసి రావడంతో రెండోసారి పోటీచేసి గెలుపొందారు. గతంలో పంచాయతీల్లో వారు చేసిన పనులకు నేటికీ బిల్లులు రాకపోయినా వారు చేసిన అభివృద్ధిని చూసి వారికే మళ్లీ పట్టం కట్టారు. తమకు మరింత బాధ్యత పెరిగిందని.. మరింత అభివృద్ధి చేసే బాధ్యత రెండో సారి సొంత గ్రామానికి సర్పంచ్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. అలాగే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. కుప్పన్కోట్ సర్పంచ్గా రెండో సారి పోటీ చేసిన మాజీ సర్పంచ్ పద్మ పరాజయం చెందారు. సీమాసుల్తానా, సర్పంచ్, మైల్వార్ శాంతిభాయి, సర్పంచ్, బోజ్యానాయక్తండా ఎఫ్ సాబేర్, సర్పంచ్, గొట్టిగకలాన్ -
గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించండి
కొడంగల్: నూతన సర్పంచ్లు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్, మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ముఖ్యమంత్రి నివాసంలో మొదటి విడతలో కొత్త సర్పంచ్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. మండలంలో 25 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని అన్నారు. కొడంగల్కు రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందన్నారు. హుస్సేన్పూర్ సమీపంలో 300 ఎకరాల భూమి సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అప్పాయిపల్లిలో వ్యవసాయ వర్సిటీ, లగచర్ల పరిసరాల్లో 6 వేల ఎకరాల భూమిని సేకరించి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మెడికల్ కళాశాల, అనుబంధంగా 450 పడకల టీచింగ్ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతీ గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నయీమ్, సంజీవరెడ్డి, ఆసిఫ్ఖాన్, మహేశ్రెడ్డి, దీపక్రెడ్డి, బాల్రెడ్డి, అరిగె ఓం, సర్పంచ్లు దత్తాత్రేయరావు, చెన్ బస్కుమార్, అంజయ్య, నర్సప్ప, గడ్డం నర్సమ్మ, బెన్నూరు లక్ష్మమ్మ, సునీత, యాసర్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్ -
గ్లోబల్ కిటకిట
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం గురువారం విద్యార్థులు, సందర్శకులతో కిటకిటలాడింది. నగరంతో పాటు చుట్టు పక్క ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన స్టాళ్లను వీక్షించారు. వీరికి రోబోలు స్వాగతం పలికాయి. విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నెట్ జీరో స్టాల్, పోలీస్, డీఆర్డీఓ, హ్యాండ్లూమ్స్, స్కిల్స్ యూనివర్సిటీ, అగ్రికల్చర్, ఎయిరోస్పేస్, విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను, వాటి విశేషాలను తెలుసుకున్నారు. ప్రధాన వేదికపై నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజన్ సాధిద్దాం.. సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ ఆధ్వర్యంలో జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, యునిసెఫ్ సలహాదారు డేవిడ్రాజ్, ప్రజ్వల సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ సునీతకృష్ణన్, సైకాలజిస్టు డాక్టర్ గీత చల్లా తదితరులు మహిళా సాధికాతరపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. యువత క్రీడలను ఓ వృత్తిగా ఎంచుకోవాలని గుత్తా జ్వాల సూచించారు. పోరాట పటిమతో ముందుకు సాగాలని సునీతాకృష్ణన్ సూచించారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, రీల్ లైఫ్కు, రియల్ లైఫ్కు తేడాను గుర్తించాలని డేవిడ్రాజ్ వివరించారు. తెలంగాణ చరిత్రకారుడు, సాంస్కతిక శాఖ మాజీ డైరెక్టర్ డా.మామిడి హరికృష్ణ, పి.పద్మావతి, బిరాద్ రాజారాం యాజ్ఞిక్, గోపి బైలుప్పల తదితరులతో చర్చాగోష్టి నిర్వహించారు. -
ఎత్తుకు పైఎత్తు!
షాద్నగర్: ఎన్నికలు అంటేనే అంచనాలకు అందవు.. ఎన్ని వ్యూహాలు రచించినా చివరికి తలకిందులు కాక తప్పదు. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అచ్చంగా అదే జరిగింది. కాంగ్రెస్ అంచనాలను తారుమారు చేస్తూ కొన్ని చోట్ల బీఆర్ఎస్ సత్తా చాటగా.. బీఆర్ఎస్ కోటగా భావించే గ్రామాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఇలా ఒక్కో చోట ఒక్కో ఆట.. పల్లెల్లో సర్పంచ్ స్థానాల వేట.. అత్యంత రసవత్తరంగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో జరిగిన పోరును ఓ సారి పరిశీలిస్తే అవగతం అవుతోంది. బీఆర్ఎస్దే ఎక్లాస్ఖాన్పేట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామమైన ఎక్లాస్ఖాన్పేటలో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి హరిశేఖర్ విజయం సాధించారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డి మద్దతులో బరిలో దిగిన ప్రవీణ్యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్యాదవ్లు ఓటమి పాలయ్యారు. దూసకల్ హస్తగతం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి స్వగ్రామమైన ఫరూఖ్నగర్ మండలం దూసకల్ గ్రా మంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి జ్యో తి విజయం సాధించారు. ఆ గ్రామం మొ దటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. స్వగ్రామంలో ఎమ్మెల్సీ హవా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి స్వగ్రామమైన నందిగామ మండలం మొదళ్లగూడలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి అభ్యర్థి పెండ్యాల అరుణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామమైన వీర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థితో పాటుగా, కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ రెబల్గా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి బలపర్చిన అభ్యర్థి పాండు సర్పంచ్గా విజయం సాధించారు. మొదటి నుంచి ఎమ్మెల్యే శంకర్కు పట్టున్న స్వగ్రామంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అనుచరుడు విజయం సాధించడం విశేషం. ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్, టీడీపీ బలపర్చిన అభ్యర్థి ఎంసీ రాజు సమీప బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి భీష్వ రామకృష్ణపై విజయం సాధించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్యలు ఉన్న ఈ గ్రామంలో రెండు పార్టీలు బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఎమ్మెల్యే ఊరిలో ఎదురుదెబ్బ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థి విజయం -
తొలి విడత ప్రశాంతం!
తొలి విడత ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇలా..సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాద్నగర్: చెదురు ముదురు ఘటనలు మినహా తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం ఏడు గంటల కే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. తెల్లవారుజామున చలితీవ్రత దృష్ట్యా.. ఓటింగ్ ప్రక్రియ ఉద యం కొంత మందకొండిగా సాగినా.. 11 తర్వాత ఊపందుకుంది. పోలింగ్ కేంద్రాల ఎదుట ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరడం కన్పించింది. అభ్యర్థు లు, వారి మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల ముందు గుంపులుగా నిలబడి ఓటర్లను అభ్యర్థించడం, వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్లపై తీసుకొచ్చి ఓటేయించిన దృశ్యాలు కన్పించాయి. మధ్నాహం ఒంటి గంట లోపు వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటింగ్ అవకాశం కల్పించారు. భోజన విరామం తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. తొలుత వార్డుల ఓట్లను, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించారు. అనంతరం ఫలితాలు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడిన మద్దతుదారులు తమ అభ్యర్థుల విజయంతో పెద్దఎత్తున బాణసంచా కాల్చి, రంగులను చల్లుకుంటూ డీజే హోరులో సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత జులూస్ నిర్వహించారు. 168 స్థానాల్లో పోటీ జిల్లాలో 168 సర్పంచ్, 1340 వార్డులకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 2,11,544 మంది ఓటర్లకుగాను 1,87,573 మంది (88.67 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 225 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2,66,252 మంది ఓటర్లకు గాను.. 2,16,212 మంది (81.21శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురు ముదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చివరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయిన వాళ్లు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి మౌనంగా తప్పుకోగా, గెలుపొందిన అభ్యర్థులు సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు విజయోత్సవాల్లో ముగిని తేలారు. ఓటేసిన ప్రముఖులు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన స్వగ్రామమైన నందిగామ మండలం వీర్లపల్లిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట్లో ఓటేశారు. ఎమ్మెల్సీ నవీన్రెడ్డి నందిగామ మండలం మొదళ్లగూడలో ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి ఫరూఖ్ నగర్ మండలం దూస్కల్లో, మరో మాజీ ఎమ్మెల్యే బొక్కని నరసింహులు లింగారెడ్డిగూడలో ఓటేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామమైన వీర్లపల్లిలో తన మద్దతుదారు ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాత్రం తన గ్రామంలో మళ్లీ తన పట్టు నిలుపుకోవడం విశేషం. ప్రశాంతంగా పోలింగ్ మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమసంఖ్య సరి చూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఓటింగ్ శాతం నమోదును ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు. కేశంపేట: సిరా చుక్కను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఎలికట్టలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడికి సహాయం చేస్తున్న కానిస్టేబుల్ నందిగామ వీర్లపల్లిలో ఓటేయడానికి వచ్చిన శతాధిక వృద్ధురాలు పుల్లమ్మ రంగారెడ్డిలో 88.67 శాతం మండలం మొత్తం ఓటర్లు 9 గంటల వరకు 11వరకు ఒంటిగంట వరకు పోలింగ్శాతం ఫరూఖ్నగర్ 50,557 13,359 28,539 44,820 88.65 చౌదరిగూడ 25,869 7,077 15,602 22,632 87.49 కేశంపేట్ 36,250 6,933 17,666 32,588 89.09 కొందుర్గ్ 22,243 5,114 12,137 19,711 88.62 కొత్తూరు 16,813 4,102 10,448 15,346 91.27 నందిగామ 26,499 5,828 14,715 23,549 88.87 శంషాబాద్ 33,313 5,850 15,898 28,934 86.85 -
తొలిపోరులో హస్తం హవా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు.. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. మెజార్టీ స్థానాల్లో వారికి ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. షాద్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, కేశంపేట్, నందిగామ, కొత్తూరు మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండల పరిధిలోని మొత్తం 168 సర్పంచ్ స్థానాలు, 1,340 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. ఇక వికారాబాద్ జిల్లాలో 262 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, 35 పంచాయతీల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగినప్పటికీ మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రెండు సార్లు రీకౌంటింగ్ ఫరూఖ్నగర్ మండలం శేరిగూడ పంచాయతీ ఎన్నికల్లో రెండుసార్లు రీ కౌంటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ శారద, బీఆర్ఎస్ బలపరిచిన సమీప ప్రత్యర్థి విజయమ్మపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు -
ప్రచారం జోరు.. నేతలే లేరు
● పంచాయతీ ఎన్నికల్లో కనిపించని రాజకీయ నాయకులు ● చేవెళ్లలో సర్పంచ్ అభ్యర్థులకుదక్కని మద్దతు చేవెళ్ల: గ్రామ పంచాయతీ ఎన్ని కల ప్రచారాల జోరు మీదుంటే రాజకీయ నాయకులు మాత్రం మౌనముని పాత్రలో ఉండి పోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కడా ఏ పార్టీ నాయకులు తమ మద్దతుదారులను ఈ సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రకటించటం కానీ, ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కనిపించటం లేదు. అభ్యర్థులు మాత్రం జోరుగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో రెండో విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఆయా గ్రామాల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు పోటీలో ఉన్నప్పటికీ ఎక్కడా మాది పలాన పార్టీ అని స్పష్టంగా చెప్పుకోవటం లేదు. గ్రామంలో మాకు అన్నివర్గాల వారు మద్దతు ఇస్తున్నారని అభ్యర్థులు సైతం తమ పార్టీలను పక్కన పెట్టారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిశబ్దంలో ఉండిపోయాయి. కొన్ని గ్రామాల్లో మాత్రం తమ అభ్యర్థులుగా చెప్పుకొంటున్నా వారి వెంట ప్రచారం మాత్రం పార్టీ నాయకులు చేయడం లేదు. నిశ్శబ్దంలో రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి, జిల్లా, మండలాల నాయకులుగా ఎంతోమంది ఉన్నా గ్రామాల్లో ప్రచారం చేయక పోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం ఇదే పరిస్థితిలో మౌనం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను మాత్రం తమ పార్టీ వ్యక్తిగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలను మాత్రం ముందుగానే వెళ్లి తమ పార్టీ అభ్యర్థులే అని ప్రకటించుకొని శాలువాలు కప్పి సన్మానించారు. పోటీలో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని గుసగుసలాడుతున్నారు. ప్రజలకు తమ పార్టీల పేరు చెబితే ఓట్లు పడవనే భయంలో అభ్యర్థులు ఉండిపోయారని చర్చించుకుంటున్నారు. -
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు
చేవెళ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎలాగైనా సర్పంచ్ పీఠం ఎక్కాలనే కోరికతో బంధాలను లెక్క చేయకుండా ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులుగా మారుతున్నారు. చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్ గ్రామంలో 20 ఏళ్లుగా మాజీ సర్పంచ్ తిప్పని వెంకట్రెడ్డి కుటుంబానిదే రాజకీయంగా పైచేయి. వారు లేదా వారి తరఫు అభ్యర్థులే ఇన్నాళ్లు సర్పంచ్లుగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆ గ్రామం జనరల్ మహిళ రిజర్వేషన్ వచ్చింది. అయితే వెంకట్రెడ్డి కుటుంబం నుంచే ఇద్దరు పోటీలో ఉండడం గమనార్హం. ఒకరు వెంకట్రెడ్డి కొడుకు రాంరెడ్డి భార్య మాధవి ఉండగా, మరొకరు వెంకట్రెడ్డి అక్క కొడుకు రఘువీర్రెడ్డి(చింటు) భార్య చిరోషా బరిలో ఉన్నారు. రఘువీర్రెడ్డి చిన్నప్పటి నుంచి మేనమామ వెంకట్రెడ్డి ఇంట్లో ఉండే పెరిగారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీలో ఉండడంతో గ్రామస్తులు సైతం ఎవరికి మద్దతు తెలపాలో అని అయోమయంలో పడ్డారు. సర్పంచ్ పీఠం కోసం తీవ్ర కసరత్తు -
షాద్నగర్లో రాజకీయ గూడుపుఠాణి
కొత్తూరు: షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గూడుపుఠాణి రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి ఆరోపించారు. నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని, కేవలం మాజీ ఎమ్మెల్యే తనయులు రవియాదవ్, మురళీకృష్ణయాదవ్లు చేసిన అరాచకాల కారణంగానే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందన్నారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తనయులు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలకు అతీతంగా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే కుట్రతో సొంత పార్టీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. నందిగామ మండలంలో ఓ ట్రస్ట్కు సంబంధించిన పొలంలో మాజీ ఎమ్మెల్యే తీరుపై ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ అదే వ్యవహారంలో చేస్తున్న లీలలు అందరికి తెలుసన్నారు. మాజీ ఎమ్మెల్యే తనయులు చేస్తున్న అరాచకాలకు ఎమ్మెల్యే వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. సీఐ క్షమాపణ చెప్పాల్సిందే నందిగామ సీఐ ప్రసాద్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ అనుచరులు, వార్డు సభ్యులుగా బరిలో ఉన్న వారిపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. మొదళ్లగూడలో శాంతియుత వాతావరణంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను లాఠీచార్జి చేసి భయోత్పాతంగా సీఐ చేసినట్లు ఆరోపించారు. అకారణంగా దాడి చేసిన వారికి సీఐ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై సీఐను వివరణ కోరగా ఓటర్లను వాహనాల్లో తరలించొద్దని మాత్రమే సూచించానని చెప్పారు. గుంపులుగా ఉన్న జనాలను వెళ్లాలనే మాత్రమే చెప్పా, లాఠీచార్జి చేయలేదని వివరించారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి -
అపార్ట్మెంట్లోభారీ చోరీ
రూ. 70 లక్షల నగదు, నగలు మాయం మలక్పేట: ఓ కుటుంబం విహార యాత్రకు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళాలు పలుగొట్టి లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేశారు. అల్మారాలోని రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు, బంగారు అభరణాలు 15 తులాలు, 4 కిలోల వెండిని దోచుకెళ్లారు. ఈ సంఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..అక్బర్బాగ్ డివిజన్ ప్రొఫెసర్స్ కాలనీలోని మానస అపార్ట్మెంట్లో మంత్రవాది వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.గతనెల 13న కుటుంబం విహార యాత్రకు వెళ్లి ఈనెల 10న రాత్రి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తరువాత చోరీ జరిగినట్లు గమనించారు. వెనుకవైపు బాల్కనీ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బాధితుడు బీరువాలో చూడగా పగులగొట్టి ఉంది. అల్మారాలో ఉన్న రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు 10 తులాలు, బంగారు గాజులు 2 తులాలు, బంగారు నాణేలు 3 తులాలు, 4 కిలోల వెండి కన్పించలేదు. దీంతో మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. వాచ్మెన్పై అనుమానం.. నేపాల్కు చెందిన అర్జున్ ఐదు నెలలు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేశాడు. భార్య నిర్మల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోదరి ఇంటికి వెళ్తున్నామని చెప్పి భార్యభర్తలు కలిసి బయటికి వెళ్లారు. భార్య అక్కడే ఉండి పోయింది. ఆ తరువాత వచ్చిన అతను నవంబర్ 25 తేదిన వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. నేపాల్కు వెళ్లిపోతున్నాని చెప్పి మరో వ్యక్తిని వాచ్మెన్గా కూడా పెట్టాడని అపార్ట్మెంట్ వాసులు పేర్కొంటున్నారు. అతడే దొంగతనానికి పాల్పడి ఉంటాడని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులమంటూ సైబర్ మోసం రూ.20వేలు టోకరా కీసర: పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ను మోసం చేశారు. ఈ సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు.. బోగారంలోని ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ హన్మంతుకి సైబర్ మోసగాడు ఫోన్ చేసి తాను సబ్ ఇన్స్పెక్టర్నని కీసర ఇన్స్పెక్టర్కు ఆన్లైన్లో అర్జెంటుగా నగదు కావాలని, నగదును పెట్రోల్ బంక్ వద్దకు పంపిస్తానని చెప్పాడు. కాగా ఆ ఫోన్ నెంబర్ను ట్రూ కాలర్, వాట్సాప్లో చూడగా సీఐగా రావడంతో నమ్మి ఆ సైబర్ మోసగాడి స్కానర్కి రూ.20 వేలు పంపించాడు. అయితే బుధవారం సాయంత్రం వరకు చూసినా డబ్బు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి మేనేజర్ హన్మంతు కీసర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
అహంకారంతో మాట్లాడటం సరికాదు
షాద్నగర్: ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి అహంకారంతో మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు ఎన్నికై న ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి ఏమాత్రం గౌరవం లేకుండా ఎమ్మెల్యే పట్ల అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం సరికాదన్నారు. ఎక్లాస్ఖాన్పేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా ఎమ్మెల్సీ మాట్లాడటం సరికాదన్నారు. ఎవరు ఎలాంటి వారో, ఎవరు పేదలను భూములను కబ్జాచేసి గుండాగిరి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యేపై, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక సహించేది లేదన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిని బట్టలూడదీసి కొడతా అనడం సరికాదన్నారు. సమావేశంలో నాయకులు బాబర్ఖాన్, తిరుపతిరెడ్డి, బస్వం, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్ రఘునాయక్ -
రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు
షాద్నగర్రూరల్: రాజకీయంగా ఎదుర్కోలేకే మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అనుచరులు తమపై దాడిచేశారని బీఆర్ఎస్ నేత దినేశ్సాగర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన ప్రవీణ్యాదవ్పై మాజీ ఎమ్మె ల్యే అనుచరులు గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న విష యం తెలుసుకొని.. తాము అక్కడికి వెళ్లే క్రమంలో గ్రా మంలో తమపై మూకుమ్మడిగా దాడి చేశారని, కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. తాము గ్రామానికి డబ్బులు, మద్యం పంచేందుకు వెళ్లలేదన్నారు. ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి పంపిస్తేనే గ్రామానికి వచ్చినట్లు తాము చెప్పాలని వారు బలవంతం చేశారన్నారు. సొంత పార్టీ నాయకులపైనే మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాత్రి జరిగిన ఘ టనతో తాము వారి గ్రామం నుంచి బ్రతికి బయటికి వస్తామని అనుకోలేదన్నారు. గత ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ గెలుపు కోసం శ్రాయశక్తులా ప్రయత్నించామన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతిని తాము ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నారు. తమపై దాడులకు పాల్పడటం సరికాదని, ఎవరి సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా దినేశ్సాగర్ తనకు దాడిలో తగిలిన దెబ్బలను మీడియాకు చూపించారు. సమావేశంలో నాయకులు శివాచారి, గోపాల్, జీజో జాన్సన్, మహేశ్గౌడ్, అనిల్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత దినేశ్సాగర్ -
ప్రలోభ పెట్టి.. ప్రాధేయ పడి
● వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థులు ● నిత్యం గ్రామాల్లో మందు, విందులతో సందడి చేవెళ్ల: ‘నమస్తే అన్నా, అక్కా, తమ్మీ, చెల్లి నేను మన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న మీ ఓటు నాకే వేయాలి’ అని వలస ఓటర్లను ప్రసన్నం చేసుకొని పనిలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. రెండో విడతలో జరుగుతున్న చేవెళ్ల డివిజన్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఓటరు జాబితాలో తిరగేసి మరీ ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఉన్న ఓటర్లను ఉదయం సాయంత్రం వేళల్లో కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మండల కేంద్రం, హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉన్న వారి కోసం వాకబు చేస్తూ ఫోన్ నంబర్లు తీసుకొని, అడ్రస్లు కనుక్కొని వారి ఎదుట ప్రత్యేక్షమవుతున్నారు. మన గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. 14వ తేదీన గ్రామానికి వచ్చి ఓటు వేసేందుకు రావాలని తాయిలాలు, వాగ్దానాలు ఇవ్వటంతోపాటు రవాణా సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు తీస్తూ దండాలు పెడుతూ కాళ్లు పట్టుకొని మరీ గెలిపించాలని కోరుతున్నారు. ఊరి బయట ఉండే ఓటర్లకు వారికి తెలిసిన వారితో ఫోన్లు చేయించి ఓట్లు రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు ఓటర్లకు మందు, విందులతో దావత్లు ఇస్తున్నారు. -
పోరాటయోధుడు పండుగ సాయన్న
చేవెళ్ల: తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న అని ముదిరాజ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. పట్టణ కేంద్రంలో బుధవారం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటయోధుడు సాయన్న అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. ముదిరాజ్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేశ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి పామెన భీంభరత్, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బలమైన సంస్థల నిర్మాణం ముఖ్యం
చేవెళ్ల: శాంతి, న్యాయం, సమగ్రత, పర్యావరణ బాధ్యత తదితర అంశాలే బలమైన సంస్థల నిర్మాణానికి మూలమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, రాష్ట్రపతి కార్యాలయం మాజీ ఓఎస్డీ సత్యనారాయణసాహు అన్నారు. చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థికశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న భారతదేశం ఎస్డీజీ–16 రోడ్మ్యాప్ శాంతి, న్యాయం, బలమైన సంస్థలు అనే అంశంపై జాతీయ సెమినార్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు సుస్థిర అభివృద్ధి కోసం 17 లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఇందులో ఒకటి న్యాయం, శాంతి, బలమైన సంస్థల నిర్మాణాలు అన్నారు. దీని ప్రధాన ఉద్దేశం అన్ని స్థాయిల్లో స్వేచ్ఛ, సురక్షితంగా జీవించడానికి అవకాశం కల్పించడం, న్యాయ సమీకరణం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత సురక్షితమైన సమాజాలను నిర్మించటమే అన్నారు. దీనిపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు. అనంతరం 94 పరిశోధనా పత్రాలతో కూడిన ఐదు సంపాదిత గ్రంథాలను విడుదల చేశారు. ఈ సదస్సులో ప్రొఫెసర్లు ఎం.రాములు, కె.ముత్యంరెడ్డి, నరేందర్రెడ్డి, బి.నాగేశ్వరావు, శ్రీనివాస్, ఎం.గంగాధర్, అలీంఖాన్ ఫలాకీ, నర్సయ్య తదితరులు ఎస్డీజీ–16పై ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చీఫ్ మెంటర్ డాక్టర్ కాంచనలత, కన్వీనర్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్, అధ్యాపకులు కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన సెమినార్ -
పేదల గుండె చప్పుడు ఆర్టీసీ
● రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ● 65 నూతన ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం బన్సీలాల్పేట్: తెలంగాణలో ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో బుధవారం 65 నూతన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఎం.డి నాగిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా ఈవీ పాలసీతో పాటు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయో అనే విషయాన్ని ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలపాలని సూచించారు. ప్రజలకు అవసరమున్న ప్రాంతాల్లో బస్సులు నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజు ఆర్టీసీలో 60 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులేనన్నారు. ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారన్నారు. కొత్తగా 2400 బస్సులు వచ్చాయని.. 800కుపైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే రెండేళ్లలో మొత్తం 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఈవీ ట్రాన్స్ సీఈఓ సందీప్ రైజాడ, స్థానిక కార్పొరేటర్ సుచిత్రా శ్రీకాంత్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పీవీ మునిశేఖర్, సీహెచ్ వెంకన్న, ఎం. రాజశేఖర్, రాణిగంజ్ డిపో మేనేజర్ ఎ. శ్రీధర్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, నార్త్జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తదితరులు పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ కోసమే మూసీ సుందరీకరణ
హిమాయత్నగర్ : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును వెంటనే ఆపివేయాలని ‘సేవ్ మూసీ మూవ్మెంట్’ సంస్థ డిమాండ్ చేసింది. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ సుందరీకరణ చేపడుతున్నారని, ఇది అవసరం లేదని, మూసీని శుద్ధి చేయాలని డిమాండ్ చేసింది. మూసీ నిజమైన పునరుజ్జీవం కోసం నిపుణులు, పౌర సమాజంతో కలిసి ప్రజలకు, పర్యావరణానికి మేలు చేసే ప్రణాళిక రూపొందించాలని కోరింది. గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కై ్లమేట్ఫ్రంట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సొండే అన్సార్, సేవ్ మూసీ మూవ్మెంట్ ప్రతినిధులు జాన్ మైఖేల్, రుచిత్ ఆశా కమల్, డీబీఎఫ్ ప్రతినిధి పులి కల్పన, హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి సయ్యద్ బిలాల్, డీబీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్, తెలంగాణ క్రాంతిదళ్ ప్రతినిధి పృథ్వీరాజ్, తెలంగాణ విఠల్, పిట్టల శ్రీశైలం, ఫిల్మ్ డైరెక్టర్ సయ్యద్ రఫీ తదితరులు మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ పెట్టుబడిదారులకు మెరిసే రివర్ ఫ్రంట్ కలను చూపిస్తూ..ప్రభుత్వం ఎన్నో సామాజిక కోణాలను విస్మరించిందని ఆరోపించారు. ● డీపీఆర్ విడుదల చేయకుండా, ప్రజలతో సమావేశాలు నిర్వహించకుండా, పర్యావరణ–సామాజిక ప్రభావ అధ్యయనాలు పంచుకోకుండానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును దూకుడుగా ప్రచారం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జమ్మూ, అహ్మదాబాద్, పూణేలో విఫలమైన రివర్ ఫ్రంట్ మోడళ్లను గుర్తుచేస్తూ, అక్కడ నది సుందరీకరించే పనులు కాలుష్యాన్ని, వరద ముప్పును మరింత పెంచాయని వారు హెచ్చరించారు. ● అనంతరం గత ఏడాది నుంచి సేవ్ మూసీ మూవ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం చేపడుతున్న మూసీ నది శుభ్రత, అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన ‘మూసీ క్లీనప్ డ్రైవ్’ చిత్రాలను విలేకరులకు ప్రదర్శించారు. సేవ్ మూసీ మూవ్మెంట్ సంస్థ ఆరోపణ -
జోరుగా ‘పంచాయతీ’ ప్రచారం
● మహిళలకు నిత్యం రూ. 300, పురుషులకు రూ.500 కూలీ ● మద్యంతో పాటు మాంసం భోజనం యాచారం: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థులు ప్రజలను కలిసి తమకే ఓటు వెయ్యాలని వేడుకుంటున్నారు. నామినేషన్ల విత్డ్రాతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు మంగళవారం సాయంత్రం అధికారులు గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, పుట్బాల్ వంటివి కేటాయించగా, అదే వార్డు సభ్యులకు గౌను, గ్యాస్పొయ్యి, స్టూల్, సిలిండర్ లాంటివి ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ క్లస్టర్ కేంద్రాల్లో అధికారులు ఏ పోటీదారుడికి ఏ గుర్తు కేటాయించారో ముందస్తుగానే సమాచారం అందజేశారు. గుర్తుల కేటాయింపుతో అభ్యర్థుల ప్రచారం సామగ్రి కోసం నగరంలోని ప్రింటింగ్ ప్రెస్, ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఇక కేటాయించిన గుర్తులతో ప్రజల వద్దకు వెళ్లి మద్దతు కూడగట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రచార సామగ్రిని అధిక సంఖ్యలో తెచ్చేందుకు గాను పోటీ అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కూలీలకు భలే డిమాండ్.. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూలీలకు భలే డిమాండ్ ఏర్పడింది. నిత్యం ఉదయం, సాయంత్రం ప్రజలను కలిసి గుర్తులపై గుర్తుండేలా ప్రచా రం నిర్వర్తించడానికి పోటీ అభ్యర్థులు కూలీలను ఉపయోగించుకుంటున్నారు. ర్యాలీలు కూడా తీస్తున్నారు. మహిళలకై తే నిత్యం రూ.300, అదే పురుషులకై తే రూ. 500 అందజేస్తున్నారు. పంచా యతీ ఎన్నికల సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. కూలీ లు లేక పత్తి తీత పనులు నిలిచిపోయాయి. పత్తి తీయకపోవడంతో చెట్లపైనే రూ. లక్షలాది విలువ జేసే పత్తి వృథావుతోంది. పత్తి తీత పనులతో పాటు మిగితా వ్యవసాయ పనులకు కూడా కూలీ లు వెళ్లడం లేదు. రైతులు వ్యవసాయ పనులకు రావాలని ప్రాదేయపడిన స్పందన వెళ్లడంలేదు. మద్యం, మాంసం భోజనం.. ప్రచార హోరులో పాల్గొనేందుకు వెళ్లే కూలీలకు నిత్యం మద్యంతో పాటు మాసంతో కూడిన విందు భోజనం అందజేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న ప్రచారానికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మద్యం పంపిణీ చేస్తున్నారు. మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, మాల్, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, యాచారం తదితర గ్రామాల్లో కొద్ది రోజులుగా విందు భోజనం నిర్వహిస్తున్నారు. పోలింగ్కు ఒక రోజు ముందు పంపిణీ చేసే డబ్బు కంటే నామినేషన్ వేసినప్పటి నుంచి విందు భోజనాలకు రూ. లక్షల్లో ఖర్చవుతోంది. మొండిగౌరెల్లి, మల్కీజ్గూడ, గునుగల్, మాల్, మంతన్గౌరెల్లి, నందివనపర్తి తదితర గ్రామాల్లో పోటాపోటీగా అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
రూ.వెయ్యి కోట్లు..
భవిష్యత్కు బాటలులాలాపేట: అంతర్జాతీయ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర కూర్పు కోసం రూ.1000 కోట్ల నిధుల మంజూరు జీఓతో ఈ గడ్డపై అడుగు పెట్టినట్లు బుధవారం ఇక్కడి బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఓయూ అభివృద్ధికి కేటాయించిన నిధులు డబ్బుగా కాకుండా భవిష్యత్ పెట్టుబడిగా చూస్తున్నానన్నారు. అధునాతన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలన్నదే తన అభిమతమన్నారు. చేపట్టబోయే పనులివీ.. కొత్త అకడమిక్ బ్లాక్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక లైబ్రరీ భవనం, రెండు కొత్త మెగా హాస్టళ్లు. స్టూడెంట్ ఎమినిట్స్ సెంటర్, హెల్త్ సెంటర్, జీవ వైవిధ్య ఉద్యాన వనం, కన్వెన్షన్ సెంటర్, యూనివర్సిటీలో రోడ్ల నిర్మాణం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ల నిర్మాణం. మారనున్న ఓయూ సమగ్ర రూపం -
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
● ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ● చింతలపల్లి, సింగంపల్లిలో ఎన్నికల ప్రచారం ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చింతలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పు శ్రీశైలం, సింగంపల్లిలో రాంబాబుకు మద్దతుగా ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమలో పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ
డీసీఎం టైరు పేలడంతో చిలుకూరులో ఘటన శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని బుధవారం పీసీసీ జనరల్ సెక్రెటరీ గోవిందరావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మళ్లీ వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆలయ కమిటీ సభ్యులు గోవిందరావు దంపతులకు ఆలయ ప్రతిమ, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు దయాకర్రాజు, దర్శన్గౌడ్, అర్చకులు సాయిశివ తదితరులు పాల్గొన్నారు. -
మహా ప్రగతికి పరుగులు
● సమగ్ర రవాణా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ● తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో హెచ్ఎండీఏ కార్యాచరణ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు, భారీ టౌన్షిప్లుసాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రైజింగ్ సమ్మిట్ వేదికగా హైదరాబాద్ మహానగర భవిష్యత్ అభివృద్ధిపై హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రకటించింది. రీజినల్ రింగ్రోడ్డు వరకు మహానగరం పరిధిని విస్తరించిన దృష్ట్యా ఇందుకు తగిన విధంగా మహానగర విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను హెచ్ఎండీఏ ఆవిష్కరించింది. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న సమగ్రాభివృద్ధి ప్రణాళికలను కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేసింది. ఈ మేరకు రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు, భారీటౌన్షిప్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబించేలా హెచ్ఎండీఏ, మెట్రోరైల్ లోగోలను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఔటర్రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధిని పెంచిన దృష్ట్యా ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు చేపట్టనున్న కార్యకలాపాలను సమ్మిట్లో వివరించారు. ట్రిపుల్ ఆర్ వరకు టౌన్షిప్లు.. తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఔటర్ నుంచి ట్రిపుల్ఆర్ వరకు భారీ టౌన్షిప్లను నిర్మించనున్నారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణ, లే అవుట్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 2047 నాటికి రీజినల్ రింగ్రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ఈ వేదిక నుంచి స్పష్టం చేసింది. అలాగే లాజిస్టిక్ హబ్లు, ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ ఎకనామికల్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా సుమారు 30 ఆర్థిక మండలాల ఏర్పాటుపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. మరోవైపు గ్రీన్ బ్లూ డెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా మూసీ ప్రక్షాళన, పడమటి వైపు నుంచి తూర్పున మూసీ చివరి వరకు రహదారుల విస్తరణ. చెరువులు, ఇతర జలవనరుల సంరక్షణ, పచ్చదనం, పర్యావరణాభివృద్ధి కార్యక్రమాలను సైతం బ్లూగ్రీన్ డెవలప్మెంట్ ప్లాన్లో హెచ్ఎండీఏ ప్రస్తావించింది. సమగ్ర పట్టణ రవాణా ప్రజా రవాణా ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా రహదారులు, రవాణా సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. ప్రస్తుతం ఔటర్ నుంచి ట్రిఫుల్ ఆర్ వరకు కనెక్టివిటీని కల్పిస్తూ.. రావిర్యాల– ఆమన్గల్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు తరహాలో వివిధ ప్రాంతాల్లో మరో 18 రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో నగరానికి అన్ని వైపులా ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఇందులో భాగంగానే శంషాబాద్ కొత్వాల్గూడ నుంచి పరిగి సమీపంలోని చిట్యాల వరకు రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. హైదరాబాద్ మహా నగరాన్ని 7250 చ.కి.మీ నుంచి సుమారు 10,050 చ.కి.మీ వరకు పెంచిన దృష్ట్యా అందుకు అనుగుణంగా వచ్చే 2047 నాటికి మాస్టర్ప్లాన్ రూపకల్పనకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. -
నేడే తొలి సంగ్రామం
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్నగర్: వారం రోజుల పాటు నువ్వా నేనా అనే రీతిలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఊగిపోయారు. అభ్యర్థులు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లు ఆకట్టుకునేందుకు ముమ్మరం ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టి.. సాయంత్రం లోపు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. తొలి విడతలో షాద్నగర్ డివిజన్లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్ మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండల పరిధిలోని మొత్తం 174 సర్పంచ్ స్థానాలకు, 1,530 వార్డులకు నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో ఆరు సర్పంచ్ స్థానాలు సహా 190 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 168 సర్పంచ్ స్థానాలకు 536 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1,340 వార్డులకు 3,538 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 2,35,506 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తొలి విడత ఎన్నికల్లో భాగంగా 42 సమస్యాత్మాక కేంద్రాలను గుర్తించి, వాటిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. నిఘా కోసం 32 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం 1,989 పోలింగ్ ఆఫీసర్లు, 2,314 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను వినియోగిస్తున్నారు. వీరితో పాటు 55 మంది జోనల్ ఆఫీసర్లను, 21 మంది ఎఫ్ఎస్టీలు, 21 మంది ఎస్ఎస్టీలు, ఎంసీసీ, వ్యయ బృందాలను కూడా నియమించారు. 2,100 బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు. సిబ్బందిని 62 బస్సుల్లో ఆయా పోలింగ్ స్టేషన్లకు పంపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రానికి 120 మీటర్ల దూరం నుంచే ఆంక్షలు అమలు చేయనున్నారు. షాద్నగర్ డివిజన్ పరిధిలో ఐదుగురు ఏసీపీలు, 16 మంది సీఐలు, 54 మంది ఎస్ఐలు, 150 మంది హెడ్కానిస్టేబుళ్లు, 800 మంది కానిస్టేబుళ్లతో పాటు ఏఆర్ పోలీసులు ఎన్నికల బందోబస్తులో విధులు నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండలంలో అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, పది మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 500 మందికి పైగా పోలీసులతో గ్రామాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం ఏమర పాటుగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం శంషాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు సహా బాక్సులను పరిశీలించారు. ఏవైనా లోపాలు దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి సమస్య లేకుండా చూడాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత ఎన్నికల ఏర్పాట్లను మరోసారి పరీశీలించాలని కోరారు. తాగునీరు, లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ మున్సి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి రాజేంద్రనగర్లోని ఈవీఎం గోడౌన్ను సందర్శించారు. పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సాయంత్రంలోపే ఫలితాల విడుదల గ్రామాల్లో పోలీసుల పటిష్ట బందోబస్తు 168 సర్పంచ్, 1340 వార్డు స్థానాలకు పోటీ విధుల్లో నాలుగు వేల మంది సిబ్బంది ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి -
గూడు చెదిరె.. గోడు మిగిలె!
● సరూర్నగర్లో మూతపడిన నైట్ షెల్టర్ ● రోడ్డున పడిన ఒంటరి, వృద్ధ మహిళలు ● అధికారుల నిర్ణయంతో ఇబ్బందులు హుడాకాంప్లెక్స్: గూడు చెదిరిన పక్షుల్లా అనాథ, ఒంటరి మహిళలు చెల్లా చెదురయ్యారు. అప్పటివరకు ఒకే గొడుగు కింద ఉన్న ఆయా మహిళలంతా.. ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ రోడ్డున పడ్డారు. ఏళ్లుగా అనాథ మహిళలకు ఆశ్రయం కల్పించిన సరూర్నగర్ చౌడిలోని నైట్షెల్టర్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో నేడు మూతపడింది. అప్పటివరకు అక్కడ వసతి పొందిన 22 మంది మహిళలు చెట్టుకొక్కరు.. పుట్టకొక్కరు అన్నట్లుగా వెళ్లిపోయారు. 12 ఏళ్లుగా సేవలు అనాథ, ఒంటరి మహిళలకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో 2013లో అప్పటి ప్రభుత్వం చౌడిలోని ఓ భవనంలో నైట్ షెల్టర్ ఏర్పాటు చేసింది. చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ ఏ దిక్కు లేని వాళ్లకు ఆశ్రయం కల్పించి.. మూడు పూటలా భోజనం కూడా పెట్టేది. ముఖ్యంగా పిల్లలు వదిలేసిన వృద్ధ మహిళలు ఎక్కువగా ఉండేవారు. భర్త చనిపోయిన అతివలు కూడా ఇక్కడే ఉంటూ పగటి పూట పనులు చేసుకుని, రాత్రి వేళ ఆశ్రయం పొందేవారు. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఖాళీ చేయించారు. ప్రత్యామ్నాయంగా మరో భవనం కేటాయించకపోవడంతో అప్పటివరకు దీన్నే నమ్ముకున్న వాళ్లు మళ్లీ అనాథలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయం కల్పిస్తుండగా, మిగిలిన వారంతా పార్కులు, ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్నారు. పట్టెడు అన్నం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. -
తొలి విడతకు తెర
షాద్నగర్: వారం రోజులుగా గ్రామాల్లో హోరెత్తిని మైకులు మూగబోయాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్, వార్డు ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలతో పాటు సామగ్రిని బుధవారం ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి అందజేయనున్నారు. 7 మండలాలు.. 168 పంచాయతీలు ఈనెల 11న (గురువారం) షాద్నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల్లో 168 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరులో 12 పంచాయతీల్లో 110 వార్డులకు, నందిగామలో 18 పంచాయతీల్లో 170 వార్డులకు, కేశంపేటలో 28 పంచాయతీల్లో 260 వార్డులకు, కొందుర్గులో 19 పంచాయతీల్లో 186 వార్డులకు, జిల్లేడు చౌదరిగూడలో 24 పంచాయతీల్లో 204 వార్డులకు, ఫరూఖ్నగర్లో 46 పంచాయతీల్లో 405 వార్డులకు, శంషాబాద్లో 21 పంచాయతీల్లో 190 వార్డులకు, సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందించే సామగ్రి ఇవే.. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, ఓటర్ల జాబితా, సిరా బుడ్డి, బ్యాలెట్ బాక్సులు సీల్ చేసే సీళ్లు, అడ్రస్ బ్యాగులు, రబ్బరు స్టాంపులు, అగ్గిపెట్టె, అట్ట పెట్టెలు, పోలింగ్ ఏజెంట్ నియామకం, బ్యాలెట్ పేపర్ అకౌంట్, రసీదు పుస్తకం, వయస్సు నిర్ధారణ డిక్లరేషన్, ప్రిసైడింగ్ అధికారుల రోజు వారీ పుస్తకం, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు, సీల్డు కవర్లు, పెన్నులు, పెన్సిళ్లు, డ్రాయింగ్ పిన్నులు, లక్క, జిగురు, బ్లేడు, కొవ్వొత్తులు, ట్విన్ దారం, వైరు, కార్బన్ పేపర్, గోనె బస్తా, చెక్ లిస్టు వంటి సామగ్రి పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో అవసరం ఉంటుంది. వీటన్నింటినీ సిబ్బందికి అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అదనంగా బ్యాలెట్ పేపర్లు ప్రతి గ్రామానికి కావాల్సిన బ్యాలెట్ పత్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు కావాల్సిన పేపర్లను వేర్వేరుగా తీసి ఉంచారు. ఓటర్ల సంఖ్య కంటే బ్యాలెట్ పత్రాలు పదిశాతం అదనంగా ఉండనున్నాయి. ఎన్నికల్లో టెండర్ ఓట్లు వేసే అవకాశాలు ఉండటంతో బ్యాలెట్ పేపర్లను ప్రతి కేంద్రంలో అధికంగా ఉంచనున్నారు. మండల కేంద్రాల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, సామగ్రిని తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సిబ్బంది నియామకం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ను కేటాయించారు. ప్రతి మండలంలో పోలీసులు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ల జారీ కోసం ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పత్రాలను స్వీకరించి ఓటు వేసి సీల్డ్ కవర్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తున్నారు. ముగిసిన ప్రచార పర్వం ఎన్నికల సామగ్రి అందజేతకు ఏర్పాట్లు పూర్తి నేడు మండల కేంద్రాల్లో సిబ్బందికి పంపిణీ చేయనున్న అధికారులు -
300
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ముచ్చటగాజీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్సాక్షి, సిటీబ్యూరో: శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ముఖ్యంగా భౌగోళిక ప్రాంతాలు, నియోజకవర్గాల పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ జనాభా ఉన్నప్పటికీ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ చేసినట్లు చెప్పారు. విస్తరించిన పరిధితో 300 వార్డులుగా డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించారు. వివరాలు జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోనూ చూడవచ్చన్నారు. ప్రజలు, పార్టీల సభ్యులు 7 రోజుల్లోగా తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయంలోనూ వీటిని స్వీకరిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల సూచనలూ పరిగణనలోకి తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చాలా వార్డులకు సరిహద్దులు మారాయి. కొన్ని పాత వార్డులు రెండు వార్డులయ్యాయి. కొన్ని గల్లంతయ్యాయి. ఇదీ ప్రాథమిక నోటిఫికేషన్.. కాలానుగుణంగా సవరించి 6.11.1996న ప్రభుత్వం జారీ చేసిన జీఓ (నెంబర్ 570), తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996లోని నిబంధన 8 మేరకు, ఈ నెల 8న జారీ అయిన జీఓ (నెంబర్ 266) ననుసరించి జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 300 ఎన్నికల వార్డులుగా విభజించినట్లు హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ స్థానికులకు తెలియజేయడమైనదంటూ ప్రాథమిక నోటిఫికేషన్ పేరిట వెలువరించిన ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దు వివరణల వివరాలను జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయంలో నోటీసు బోర్డులపై ఉంచినట్లు తెలిపారు. వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్ (www.ghmc.gov.in)లో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ నివాసితులు ఏవైనా సూచనలు లేదా అభ్యంతరాలుంటే ఈ నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ (9.12.2025) నుంచి 7 రోజుల్లోపు దాఖలు చేయాల్సిందిగా కమిషనర్ కోరారు. ఇంతింతై.. మహా నగరమంతై.. హైదరాబాద్ నగర పరిపాలన నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఒక చరిత్ర. ఒక పరిణామ క్రమం. 1800 కాలంలో చిన్నపాటి మున్సిపల్ బోర్డులతో మొదలైన వ్యవస్థ.. ప్రస్తుతం 27 స్థానిక సంస్థల విలీనంతో మరింతగా విస్తరించింది. బల్దియా పరిణామ క్రమమిలా.. చారిత్రక దశలు 1869: నిజాం కాలంలో కొత్వాల్– ఎ–బల్దియా ఆధ్వర్యంలో నగర పరిపాలన. 1886: చాదర్ఘాట్ ప్రత్యేక మున్సిసిపాలిటీ. 1921–1933: హైదరాబాద్ బోర్డు + చాదర్ఘాట్ బోర్డు కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా మార్పు. 1934: తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు. 1942–1951: ిసకింద్రాబాద్ మున్సిపాలిటీ.. అనంతరం కార్పొరేషన్గా మార్పు. జీహెచ్ఎంసీ ఏర్పాటు.. 2007: శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ). పరిధి: 650 చ.కి.మీ. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు. ప్రస్తుతం: శివార్లలోని 12 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్ఎంసీలోని 150 నుంచి 300 వార్డులకు పెరుగుదల. ఈ పరిణామ క్రమంలో ఒకప్పటి నిజాం రాజధాని, ఇప్పుడు గ్లోబల్ మెట్రోపాలిటన్గా మారింది. నగర పరిపాలన మరింత విస్తరించింది. ఇది కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు. హైదరాబాద్ భవిష్యత్ దిశలో ఇది ఒక నూతనాధ్యాయం. ప్రజల ముందుకు ప్రాథమిక నోటిఫికేషన్ 7 రోజుల వరకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణ బల్దియా కార్యాలయాలు, వెబ్సైట్లో వివరాలు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి -
చీకటి కోణం.. ఓటుకు బాణం!
● పగలు ప్రచార పథం ● రాత్రిళ్లు ప్రలోభాల పర్వం ● గెలుపే అభ్యర్థుల లక్ష్యంషాద్నగర్: గెలుపువేటలో అభ్యర్థులు అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. పొద్దంతా ప్రచారం సాగించి.. పొద్దుగుంకితే చాలు మందు, విందులతో ముంచేస్తున్నారు. పోలీసులు ఎంతా నిఘా పెట్టినప్పటికీ.. అధికారులు నిబంధనల కొరడా ఝలిపిస్తున్నప్పటికీ డబ్బుల పంపిణీ.. మద్యం సీసాల గలగలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గెలవాలంటే ఇదే ప్రధానమని బాహాటంగానే చెబుతున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పర్వం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపారు. పోలింగ్కు ఒక్క రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో పూర్తిగా దీనిపైనే దృష్టి సారించారు. గ్రూపులుగా ఏర్పడి.. అడ్డాలు ఏర్పాటు చేసుకుని.. ఎన్నికల ఆరంభం నుంచే ప్రచారంలో జనాలను తమ చుట్టూ తిప్పుకొనేందుకు అభ్యర్థులు రోజువారీగా వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. బిర్యానీ ప్యాకెట్లు, మద్యం సీసాలు అదనం. ఇక తాజాగా రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లి నగదు సమర్పణలు షురూ చేశారు. పరిశ్రమలు ఉన్న గ్రామాలు, స్థిరాస్తి వ్యాపారులు ఉన్న గ్రామాల్లో ప్రలోభాల పర్వం రసవత్తరంగా సాగుతోంది. పగలంతా సాధారణంగా ప్రచారంలో కనిపించే నాయకులు రాత్రి అయ్యే సరికి అడ్డాలు ఏర్పాటు చేసుకొని గ్రూపులుగా ఏర్పడి డబ్బుల పంపిణీ చేస్తున్నారు. దొడ్డిదారుల్లో మద్యం తరలింపు సాధారణంగా మద్యం దుకాణాల వద్ద సివిల్ దుస్తుల్లో పోలీసులు నిఘా వేసి ఉంచారు.. పెద్ద ఎత్తున మద్యం తరిలితే అది ఎక్కడికి చేరుతుందో తెలుసుకొని పట్టుకోవడం వారి బాద్యత. గ్రామాల్లో కూడా ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దొడ్డిదారుల్లో పెద్ద ఎత్తున గ్రామాలకు మద్యం తరలిస్తున్నారు. మద్యం ప్రియులను ఖుషీ చేసి ఎన్నికల రోజు వరకు ఓటును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది ముందుగానే వైన్షాప్లతో మాట్లాడుకొని చిట్టీల రూపంలో నేరుగా ఓటర్లను దుకాణాలకు పంపిస్తున్నారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా ఇప్పటిదాకా ఎక్కడా పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్న దాఖలు, డబ్బులు దొరికిన దాఖలాలు గానీ లేవు. అభ్యర్థుల ఆట ముందు పోలీసుల మద్యం, డబ్బుల వేట చిన్నబోతోంది. తీపి ‘గుర్తు’గా కానుకలు మద్యం, డబ్బులు మాత్రమే కాదు. కొంత మంది అభ్యర్థులు తమ గుర్తులు అని కానుకలుగా ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెండి ఆభరణాలను పంపిణీ చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగు, ఫుట్ బాల్, బ్యాట్, కత్తెర, గౌను తదితర గుర్తులు వచ్చిన అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి గుర్తులను కానుకలుగా ఇస్తున్నారు. దీని ద్వారా ఓటు వేసేటప్పుడు తమ గుర్తు వారికి బాగా గుర్తుండిపోతుందని నమ్ముతున్నారు. మొదటి విడత ఎన్నికలకు ఒక్కరోజే మిగిలి ఉండడంతో చీకటి పంపకాల మీదే అభ్యర్థులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పోలీసులు దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి. -
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
● ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ● పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలెల్లో సంబురాలు అలుగుపారుతున్నాయి. ఓ వైపు పార్టీలు, నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఓట్ల వేటలో ఉండగా.. మెజార్టీ గ్రామాలు ఏకగ్రీవాలకే జై కొడుతున్నాయి. మహేశ్వరం: మండల పరిధిలోని 30 పంచాయతీలలో ఉప్పుగడ్డతండా, దిలావార్గూడ పంచాయతీల సర్పంచ్లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 28 పంచాయతీల్లో 101 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎంపీడీఓ శైలజ తెలిపారు. 258 వార్డు స్థానాలకు 12 వార్డులు ఎకగ్రీవమవగా ప్రస్తుతం 246 వార్డు స్థానాలకు 665 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు ఇప్పటికే గుర్తులను కేటాయించారు. ఉప్పుగడ్డ తండాలో నేనావత్ రాజునాయక్ ఒక్కరే నామినేషన్ వేయగా దిలావర్గూడలో ప్రత్యర్థి సభావత్ అనిత నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో సభావత్ మంజుల ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. ముగ్గురు సర్పంచులు, 33 వార్డులు కందుకూరు: మండల పరిధిలో ముగ్గురు సర్పంచ్లతో పాటు 33 వార్డులు ఏకగ్రీవమైయ్యాయి. మంగళవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే వచ్చాయి. దీంతో ఆ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. సార్లరావులపల్లి నుంచి విస్లావత్ శ్రీను, దావూద్గూడతండా నుంచి ముడావత్ హనుమంత్, దాసర్లపల్లితండా నుంచి వాంక్డావత్ బుజ్జి ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నికై య్యారు. కాగా దాసర్లపల్లి తండాలో ఆరు వార్డులు ఏకగ్రీవమైయ్యాయి. గత పర్యాయం ఆ తండాలో సర్పంచ్తో పాటు వార్డులు అన్ని ఏకగ్రీమైయ్యాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 33 వార్డులకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఆ వార్డులను ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. పిగ్లీపూర్ సర్పంచ్ ఏకగ్రీవం అబ్దుల్లాపూర్మెట్: మండల పరిఽధిలోని పిగ్లీపూర్ సర్పంచ్ పీఠం ఏకగ్రీవమైంది. మూడవ విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఉపసంహరణకు చివరి రోజున ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకోవడంతో కోటా ప్రభాకర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గ్రామంలోని ఎనిమిది వార్డు స్థానాలకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఏకగ్రీవంతో ఐక్యత మాడ్గుల: మండల పరిధిలోని కొర్రతండా, పల్లెతండా, సండ్రల గడ్డ తండా ఏకగ్రీవంతో ఐక్యతను చాటి అందరికి అదర్శంగా నిలిచాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తమ గ్రామపంచాతీ అభివృద్ధి కొరకు సర్పంచ్, ఉప సర్పంచ్లను, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేశారు. సభావత్ మంజుల, దిలావార్గూడ బుజ్జి, దాసర్లపల్లితండా శ్రీను, సార్లరావులపల్లి హనుమంత్, దావూద్గూడతండా జబ్బర్లాల్ నాయక్, కొర్రతండా సరిత దేవిలాల్, పల్లెతండా కోటా ప్రభాకర్రెడ్డి, పిగ్లిపూర్ జైపాల్నాయక్, సండ్రల గడ్డ తండా ఏకగ్రీవమైన వార్డులు గ్రామం వార్డుల సంఖ్య దావుద్గూడ తండా 5 పెద్దమ్మతండా 7 దాసర్లపల్లితండా 6 మురళీనగర్ 4 జైత్వారం 3 బేగంపేట 2 కొలన్గూడ 2 ధన్నారం 1 సార్లరావుపల్లి 1 బాచుపల్లి 1 మీర్ఖాన్పేట 1 -
వైద్య విద్యార్థుల ధర్నా విరమణ
సమస్యల పరిష్కారానికి డీఎంఈ హామీ ఇబ్రహీంపట్నం రూరల్: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులు డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) శివరామప్రసాద్ హామీతో శాంతించారు. రెండో రోజైన మంగళవారం వీరు నిర్వహించిన ధర్నాకు జూడాల సంఘం, ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఇక్కడి పరిసరాలు అడవులను తలపిస్తున్నాయని, కనీసం తాగునీరు, బస్సు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొడంగల్లో సకల ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, ఇక్కడి పరిస్థితిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డీఎంఈ శివరామప్రసాద్ కాలేజీకి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. క్యాంపస్లోనే హాస్టల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల రక్షణ కోసం సెక్యూరిటీ, పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ మొబైల్ తనిఖీలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా సౌకర్యం కోసం క్యాంపస్ నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. మరో ఆరు మాసాల్లో సొంత భవన నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పేరెంట్స్ కమిటీ, జూడాలతో కలిసి విద్యార్థులను శాంతింపజేసి, సమ్మెను విరమింపజేశారు. పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50వేల మంది పేరెంట్స్తో మహేశ్వరం మెడికల్ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పొడిశెట్టి రమేష్ కుమార్, కోశాధికారి రవికుమార్, సంయుక్త కార్యదర్శి రత్నప్రసాద్ ఉన్నారు. -
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (కలెక్టరేట్) ఆవరణలో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. మలి విడత తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మమేకమయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అధికారులు ప్రత్యేక రాష్ట్ర ఫలాలను అందేలా చూడాలన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతోపాటు సాంస్కృతిక కళాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, డీపీఓ సురేష్ మోహన్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి చేవెళ్ల: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని బీఎస్ఐటీ కళాశాలలో జరుగుతున్న పీఓ, ఏపీఓల శిక్షణ తరగతులను మంగళవారం మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి తనిఖీ చేశారు. శిక్షణ తరగుతులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సందేహాలు వచ్చినా ఇక్కడే నివృత్తి చేసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ రోజు పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమనిబంధనలను వివరించారు. పోలింగ్ రోజునే కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, ట్రైనర్స్ ఆశీర్వాదం, బాలాజీ, శ్రీధర్, ఎంఈఓ పురన్దాస్ పాల్గొన్నారు. ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ మొయినాబాద్రూరల్: పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్ రైతు వేదికలో మంగళవారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రొసీడింగ్ అధికారి, 19 గ్రామాలకు 19 ఆర్వోలను కేటాయించడం జరిగిందని తెలిపారు. 14న జరిగే పోలింగ్లో పాల్గొనే ప్రొసీడింగ్ అధికారులు, ఆర్వోలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ను ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సీల్ చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
అన్నం పెట్టిన ఇంటికే కన్నం
● యజమానిని నమ్మించి రూ.7.50లక్షల నగదు చోరీ ● నిందితుడికి రిమాండ్ షాద్నగర్రూరల్: అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసాడు ఓ దుండగుడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను ఏసీపీ లక్ష్మినారాయణ వెల్లడించారు. వివరాలు.. హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన రాజ్కుమార్ షాద్నగర్ పరిధి ఎలికట్ట శివారులో దుర్గాస్టీల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణంలో ఎలికట్టలో నివాసం ఉంటున్న రాజస్థాన్కు చెందిన కమల్కిషోర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న దుకాణంలో వచ్చిన కలెక్షన్ నగదు రూ.7.50లక్షలు ఆఫీస్ కేబిన్లోని టేబుల్ డెస్క్లో పెట్టి సెంట్రల్ లాక్ వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు దుకాణానికి వచ్చిన మేనేజర్ యజమానికి ఫోన్ చేసి నగదు కనిపించడం లేదని సమాచారం ఇచ్చాడు. దీంతో యజమాని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నగదుతో పాటు సీసీ కెమెరా డీవీఆర్ దొంగిలించినట్లు గుర్తించారు. అక్కడ వాచ్మెన్గా పనిచేసే బబ్లూను విచారించగా అదే రోజు రాత్రి మేనేజర్ వచ్చి తాళాలు తీసుకున్నట్లు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందుతుడు చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో మంగళవారం మేనేజర్ కమల్కిషోర్ను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ విజయ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మద్యం బాటిళ్లు సీజ్ మొయినాబాద్ రూరల్: నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్న ఆటోను మొయినాబాద్ పోలీసులు సీజ్ చేశారు. సీఐ పవన్కుమార్ రెడ్డి తెలిపిన మంగళవారం కనకమామిడి నుంచి వెంకటాపూర్ వైపు ప్రయాణిస్తున్న ఆటోలో మద్యం తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో కనకమామిడి సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టి మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఆటోను గుర్తించారు. కాటన్ బీర్లు, 16.44 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి చాకలిగూడకు చెందిన డ్రైవర్ మహ్మద్అలీని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. షాద్నగర్: రేషన్ డీలర్ వద్ద లంచం తీసుకుంటూ సివిల్ సప్లయ్ డీటీ మంగళవారం ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పౌరసరఫరాల శాఖ జిల్లా కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న హనుమరవీందర్నాయక్ గత నెల 30న షాద్నగర్ పరిధి అన్నారంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. రెండు క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించి, డీలర్ యాదగిరిపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కేసును తొలగించి, తిరిగి దుకాణాన్ని తెరిచేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. షాద్నగర్లోని రాఘవేంద్ర హోటల్లో డీలర్ నుంచి డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. డీటీని అదుపులోకి తీసుకుని, నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
తటస్థులే టార్గెట్
తొలివిడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియడంతో అభ్యర్థులు తటస్థ ఓటర్లపై దృష్టి సారించారు. వార్డుల వారీగా ఓట్లు లెక్కగడుతూ ఓట్లు రాబ్టేందుకు తాయిలాలుసమర్పించుంకుటున్నారు. షాద్నగర్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు గంటల సమయమే ఉంది. అభ్యర్థులు తమ ప్రచారాలను మమ్మరం చేశారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన ప్రచారాల్లో పలు వర్గాల మద్దతు కూడగట్టుకున్న నేతలు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. వేల సంఖ్యలో తటస్థ ఓటర్లు యువకులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పలు రకాల వ్యాపారవర్గాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పరిశ్రమల్లో పనులు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఓటు హక్కు పొందారు. వేల సంఖ్యలో ఉన్న ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు చెబితే వారి ఓట్లు రాబట్టుకోవచ్చో తెలుసుకుని వారిని ఆశ్రయిస్తున్నారు. తాయిలాలతో ఎర ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు పగలు, రాత్రి లేకుండా ప్రతీ గల్లీ తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడుగా రాజకీయాలకు అతీతంగా ఉండే వారిని, పెద్ద కుటుంబాల వారిని, ఉద్యోగులను అభ్యర్థులు కలుస్తూ పాట్లు పడుతున్నారు. సామాజిక వర్గాల వారి ఓట్లను గంపగుత్తగా దండుకునేందుకు అభ్యర్థులు శత విధాలా యత్నిస్తున్నారు. కుల సంఘాల ఓట్లు కోసం అభ్యర్థులు తాయిలాలు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. కుల పెద్దలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. వలస ఓటర్లపై ఫోకస్ షాద్నగర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, హరియాణా, ఛత్తీస్ఘడ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ప్రముఖ ఫార్మా కంపెనీల్లో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పెయింటింగ్, ఉడ్వర్క్, మార్బుల్, సీలింగ్, డిజైనింగ్ తదితర నైపుణ్య పనులు చేసే వారు సైతం ఈ ప్రాంతంలో ఓటు హక్కు పొందారు. వీరంతా పార్టీలకు అతీతంగా తమ పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నిక ఏదైనా వీరి ఓట్లు కీలకంగా మారుతున్నాయి. ఈ ఓట్లు రాబట్టేందుకు నేతలు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతల తటస్థ ఓటర్లపై వల విసురుతున్నారు.పల్లె ఓటర్లకు పట్నంలో దావత్ ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని శివారులో ఈ హడావుడి కనిపిస్తోంది. ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రీత్యా పలువురు నగరంలో నివసిస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఓట్లను రాబట్టుకునే పనిలో పడ్డారు. నేరుగా నగరంలో వారు నివసిస్తున్న అడ్రస్లకు వెళ్లి ట్రాన్స్పోర్టు ఖర్చులు భరిస్తామని ఓటుకు సైతం కొంతమొత్తం ముట్టజెప్పుతామని హామీ ఇస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు నేరుగా యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరిని ఒకచోట చేర్చి దావత్లు సైతం ఇస్తున్నట్లు సమాచారం. మండలంలోని చింతలపల్లికి చెందిన ఓ అభ్యర్థి ఇటీవల దావత్ ఇచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఆకుతోటపల్లికి చెందిన పలువురు అభ్యర్థులు ఓటర్లను కలుసుకుని వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. -
అభివృద్ధి ప్రదాతను ఎన్నుకోండి
కొత్తూరు: గ్రామాభివృద్ధికి పాటుపడే వారినే సర్పంచ్లుగా ఎన్నుకోవాలని ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డి సూచించారు. మండల పరిధిలోని తీగాపూర్లో సోమవారం ఆయన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జయప్రద జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చే నాయకులను గమనించాలన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులే అధికరంగా గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు. తీగాపూర్ ప్రజలు, ఓటర్లు జయప్రద జగన్మోహన్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, నర్సింహ, రమేశ్, శ్రీనివాస్రెడ్డి, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డి -
జీహెచ్ఎంసీ వార్డులు
300 ● పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ● ముందే చెప్పిన ‘సాక్షి’ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీక్యూర్) వరకు విస్తరించిన నేపథ్యంలో వార్డుల సంఖ్యను ప్రభుత్వం 300గా నిర్ణయించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా–అర్బన్ డెవలప్మెంట్ శాఖ గురువారం జీవో(నెంబర్266), నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యయనం మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన ‘వార్డ్ రీ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్’ నివేదికను పరిశీలించిన అనంతరం, ఇటీవల విలీనం చేసిన 27 అర్బన్ లోకల్ బాడీల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వార్డులను 300కు పెంచుతూ నిర్ణ యం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం– 1955లోని నిబంధనల ప్రకారం దఖలు పడ్డ అధికారంతో, జీహెచ్ఎంసీ వార్డుల మొత్తం సంఖ్యను 300గా నిర్ణయిస్తూ అసెంబ్లీకి, అలాగే ప్రజలకు తెలియజేస్తూ ప్రభు త్వం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ను తెలంగాణ ఎక్స్ట్రార్డినరీ గెజిట్లో ప్రచురించాలనీ, 500 ప్రతులను ముద్రించి ప్రభుత్వానికి అందజేయాలనీ ప్రింటింగ్ స్టేషనరీ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ వార్డులు 150 నుంచి 300 వరకు పెరగనున్నాయని గత నెల 29వ తేదీనే ‘సాక్షి’ ప్రచురించిన విషయం తెలిసిందే. -
ఓవర్ లోడింగ్పై చర్యలు తీసుకోండి
తుర్కయంజాల్: ఓవర్ లోడింగ్ పేరుతో భారీ స్థాయిలో అక్రమ రవాణ జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సుశీల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. ఆర్టీఓ పరిధిలో జరుగుతున్న అక్రమ రవాణాతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరుతోందని అన్నారు. రహదారులపై మట్టి, కంకర పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదం నుంచి కూడా అధికారులు గుణపాఠం నేర్చుకోలేదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.శివకుమార్ గౌడ్, మున్సిపాలిటీ కార్యదర్శి కాటం రాజు తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్..
దోపిడీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష శంకర్పల్లి: ఓ దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు సోమవారం చేవెళ్ల జిల్లా కోర్టు ఐదు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన జల్పేట్ శ్రీకాంత్(28), జల్పేట్ అలివేలు(26) బంధువులు. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచించారు. ఇద్దరూ కలిసి 2023 నవంబర్ 12న పటాన్చెరులో శంకర్పల్లికి వెళ్లేందుకు రూ.2 వేలకు ఆటో మాట్లాడుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్ మొయినొద్దీన్తో కలిసి మండలంలోని టంగటూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్పై దాడి చేసి, అతని వద్దనుంచి ఆటో, రూ.11వేల నగదు, సెల్ఫోన్ దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 14న నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి ఆటో, సెల్ఫోన్, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి, వాదనలు విన్న చేవెళ్ల ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి యు.విజయ్ కుమార్ నిందితులిద్దరికీ 5నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సోమవారం నిందితులకు శిక్ష పడడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను నార్సింగి ఏసీపీ రమణగౌడ్ అభినందించారు. మహిళతో అసభ్య ప్రవర్తన: వ్యక్తికి రిమాండ్ కడ్తాల్: మహిళతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన విస్లావత్ శంకర్ వ్యక్తి, ఈనెల 2న రాత్రి సమయంలో, అదే తండాకు చెందిన మహిళతో అసభ్యంగా వ్యవహరించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం గ్రామంలో శంకర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. మహిళలు, బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 19 లీటర్ల మద్యం సీజ్ యాచారం: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ మధు తెలిపిన ప్రకారం.. పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా సోమవారం మాల్–మంతన్గౌరెల్లి మధ్య యాచారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భాను తండాకు చెందిన జర్పుల హరికిషన్ మాల్లోని రేణుక ఎల్లమ్మ వైన్స్ నుంచి 19 లీటర్ల మద్యాన్ని ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మద్యం, ఆటో సీజ్ స్వాధీనం చేసుకుని హరికిషన్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నూతన విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలి
తుర్కయంజాల్: విత్తన బిల్లు 2025ను రైతులంతా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పిలుపునిచ్చారు. విత్తన బిల్లును వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చి న పిలుపు మేరకు సోమవారం తుర్కయంజాల్లో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం 1966 విత్తన చట్టాన్ని రద్దు చేసి తీసుకువస్తున్న కొత్త చట్టంతో విత్తన సరఫరాలో బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ శక్తుల నియంత్రణ పెరుగుతుందని అన్నారు. ఆహార భద్రత, విత్తన స్వావలంబన, రాష్ట్రాల హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. వ్యవసాయ సంక్షోభానికి దారితీసే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, ఎలీషా, రాము, ముత్తయ్య, యాదగిరి, అండాలు, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్లోబల్ సమ్మిట్ను సందర్శించేలా చూడండి
సాక్షి, సిటీ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సదస్సులో ప్రదర్శిస్తున్న అన్ని అంశాల పై యువత అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ జి.ముకుంద రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ను విద్యార్థులు, యువతకు తిలకించే విధంగా అవగాహన కల్పించేందుకు చేపట్టవలసిన చర్యలపై వివరించారు. ఈ నెల 10 నుండి 13 వరకు సందర్శించేందుకు ప్రభుత్వం అవ కాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులను సమకూర్చుతున్నామని తెలిపారు. నోడల్ అధికారులను, కాలేజీలవారీగా ఇన్చార్జీ అధికారులను నియమిస్తునట్లు ఆయన తెలిపారు. సంక్షేమ శాఖ అధికారులు కోటాజి, ఆశన్న ,డీఎం పరిశ్రమల శాఖ ప్రవీణ్, విద్యా శాఖ అధికారి రోహిణి, ఆర్టీసీ ఆర్ఎం సుచరిత తదితరులు పాల్గొన్నారు. -
గండిచెరువులో ఇద్దరి నామినేషన్లు తిరస్కరించండి
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని రైతు ఫిర్యాదు అబ్దుల్లాపూర్మెట్: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చి రిటర్నింగ్ అధికారులను తప్పుదోవ పట్టించిన గండిచెరువుకు చెందిన జక్క వెంకట్రెడ్డి, జక్క పాపిరెడ్డి నామినేషన్లను తిరస్కరించాలని గ్రామానికి చెందిన రైతు రొక్కం జనార్ధన్రెడ్డి సోమవారం కలెక్టర్, అబ్దుల్లాపూర్మెట్ ఎంపీడీఓ, ఎంపీఓలకు ఫిర్యాదు చేశాడు. గండిచెరువు సర్వే నంబర్ 185, 186, 188, 190, 192, 196, 197లలోని పట్టా భూమి తనకు చెందినదని, దాంట్లో ఎలాంటి లేఅవుట్లు, ప్లాట్లు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సర్పంచ్ పదవి కోసం జక్క వెంకట్రెడ్డి, జక్క పాపిరెడ్డి తన భూమిలో వారిద్దరికీ ప్లాట్లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చి, నామినేషన్లను దాఖలు చేశారన్నారు. తప్పుడు సమాచారాన్ని నమోదు చేసిన ఇద్దరి నామినేషన్లను తక్షణమే తిరస్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు జనార్ధన్రెడ్డి తెలిపారు. ఓటు బహిర్గతం చేయొద్దు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంల అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్కుమార్ అనంతగిరి: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయు లు వేసిన పోస్టల్ బ్యాలెట్ను సైతం సాధారణ ఓటు హక్కు వినియోగించుకునే బ్యాలెట్ బాక్స్లోనే కలిపిన తర్వాతే కౌంటింగ్ చేయాలని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంల అసోసియేషన్ అధ్యక్షుడు తుప్పలి ఆనంద్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. గతంలో అధికారులు సాధారణ బ్యాలెట్ను లెక్కించి అనంతరం చివరగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించడంతో తాము వేసిన ఓటు బహిర్గతమయ్యే అవకాశం ఉందన్నారు. ఓటు బహిర్గతం కావడంతో గ్రామాల్లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కల్పించుకుని తాము వేసిన పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల రోజు ఓటర్లు వేసిన బ్యాలెట్లోనే కలిపి కౌంటింగ్ చేయాలని కోరారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు ఎంపీడీఓ సృజనాసాహిత్య మోమిన్పేట: పంచాయతీ ఎన్నికలను పక్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ సృజనాసాహిత్య సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల(పీఓ)కు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఓలు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే ఇబ్బందులుంటాయని చెప్పారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్కు అనుమతులు ఇవ్వాలని ఆమె తెలిపారు. క్యూలో నిలబడితే ఎక్కువ సమయం కేటాయించాలని ప్రతీ విషయంపై ఉన్నాతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు, వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలను చేతులేత్తే సంస్కృతితో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదగిరి, మండల వ్యవసాయాధికారి రామకృష్ణారెడ్డి, ఎన్నికల పీఓలు పాల్గొన్నారు. -
ప్రచారంలో అభ్యర్థికి గుండెపోటు
శంకర్పల్లి: గ్రామంలో వార్డు మెంబర్ పదవికి నామినేషన్ దాఖలు చేసి ప్రచారం చేస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి శంకర్పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మాసానిగూడ అనుబంధ గ్రామం మంచర్లగూడెంకి చెందిన పల్లె నర్సింలు, లత(42) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డు పదవికి పల్లె లత నామినేషన్ దాఖలు చేశారు. నిత్యం గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రచారం చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే శంకర్పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శేరిగూడలో వివాహిత.. శంకర్పల్లి: గుండెపోటుతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన ప్రకారం.. శేరిగూడ గ్రామానికి చెందిన వడ్డె రాజు, లావణ్య(25) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. రాజు పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం లావణ్య ఇంట్లో పనులు చేసుకుంటూ ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో హుటాహుటినా శంకర్పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతి -
ఐదేళ్లకు.. అమ్మదయ
● ఒకే వ్యక్తికి రెండు గ్రామాల్లో ఓటు హక్కు ● ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు ● భూదాతను వరించిన సర్పంచ్ పదవి ● ఏకగ్రీవానికి తీర్మానించిన మక్తవెంకటాపూర్ గ్రామస్తులు కుల్కచర్ల: పంచాయతీ ఎన్నికల్లో ఓ వైపు విచిత్రమైన పొత్తులు పొడుస్తుండగా.. మరో వైపు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటూ పలు గ్రామాల పెద్దలు తీర్మానిస్తున్నారు. చౌడాపూర్ మండలం మక్తవెంకటాపూర్ పంచాయతీ పరిధిలో గతేడాది అమ్మవారు, సేవాలాల్ ఆలయాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయాల నిర్మాణానికి గ్రామానికి చెందిన జరుప్ల కవిత కుటుంబీకులు ఐదేళ్ల క్రితం 26 గుంటల భూమిని ఆలయానికి ఇచ్చారు. ఆసమయంలో గ్రామస్తులు మీ కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా ఉంటామని మాటిచ్చారు. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. గ్రామ నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కవిత తనను ఏకగ్రీవం చేయాలని కోరింది. దీంతో గ్రామ పెద్దలు ఆయా పార్టీల నాయకులతో మాట్లాడి సహకరించాలని కోరారు. ఈ క్రమంలో సోమవారం కవిత మినహాయిస్తే మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నేడు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఓ‘టు’ దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల ఓటరు జాబి తాలు తప్పుల తడకగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో జాబితాను అస్తవ్యస్తంగా తయారు చేశారు. దీంతో మూడేళ్ల క్రితం చెందిన వారి పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు వీటిని చూసి తలలు పట్టుకుంటున్నారు. దౌల్తాబాద్ మండలం బిచ్చాలకు చెందిన చెన్నకేశవులుగౌడ్కు బిచ్చాలతో పాటు దౌల్తాబాద్ ఇంటి నంబర్ 2–24లో ఓటు ఉంది. దేశాయిపల్లికి చెందిన లోకపల్లి సంగీతకు స్వగ్రామంతో పాటు దౌల్తాబాద్ 19–20లోనూ ఓటు హక్కు కల్పించారు. -
ప్రపంచానికి తెలంగాణ ఘనత
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ మహేశ్వరం నియోజకవర్గంలో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నట్లు కేఎల్ఆర్ ఇండస్ట్రీస్ అధినేత, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఘనతను ప్రపంచానికి చాటేలా సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచంలోని పెట్టుబడిదారులకు సందేశం ఇచ్చినట్లయిందన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతాల్లో ఇకపై తెలంగాణ ముందు నిలుస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ -
నాడు స్నేహ ‘హస్తం’.. నేడు గులాబీ నేస్తం
సర్పంచ్ బరిలో మాజీ వైస్ ఎంపీసీ ఆనంద్ కడ్తాల్: మండల కేంద్రానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019 కడ్తాల్–2 ఎంపీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందాడు. మండల వ్యాప్తంగా పది ఎంపీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి నలుగురు చొప్పున, బీజేపీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఆనంద్ గెలుపొందాడు. నాడు ఆనంద్ మద్దతుతో కాంగ్రెస్కు ఎంపీపీ పదవి వరించగా.. అదే పట్టుదలతో ఆయన వైస్ ఎంపీపీ పదవిని దక్కి ంచుకున్నాడు. తదనంతర రాజకీయ సమీకరణా ల్లో ఆయన బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కడ్తాల్ మేజర్ పంచా యతీకి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలోదిగి మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. -
తాళం వేసిన ఇంటికి కన్నం
● ఇద్దరు పాత నేరస్తులకు రిమాండ్ ● వివరాలు వెల్లడించినఏసీపీ లక్ష్మీనారాయణ షాద్నగర్రూరల్: జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు రిమాండ్కు తరలించారు. సోమవారం ఏసీపీ లక్ష్మీనారాయణ పట్టణంలోని పీఎస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా రామయ్యగూడకు చెందిన సురేందర్, తాండూరు మండలం నారాయణపూర్కు చెందిన నర్సింలు జైలులో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడిన వీరు మల్లీ చోరీల బాటపట్టారు. పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే కొండె కృష్ణయ్య ఈ నెల 3న తన స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం, చిన్నరేవళ్లికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం కృష్ణయ్య భార్య ఇంటికి తాళం వేసి టైలర్షాప్నకు వెళ్లింది. ఇది గమనించిన సురేందర్ తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బంగారం, నగదు దోచుకెళ్లాడు. చోరీ విషయంపై బాధితుడు కృష్ణయ్య అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నారు. సురేందర్ చోరీ చేసిన సొత్తును నర్సింలు కుదువపెట్టి ఇద్దరూ కలిసి జల్సాలు చేసేవారు. వీరు గతంలో ఎల్బీనగర్, మేడిపల్లి, సరూర్నగర్, చైతన్యపురి, బాలనగర్, చంద్రాయన్గుట్ట, భువనగిరి, గద్వాల, విజయనగర్, విరాకాబాద్, ఘట్కేసర్, సంగారెడ్డి, తిరుపతి, సైదాబాద్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. నిందితుల వద్ద ఒక బైక్, 3.2 తులాల బంగారం, రూ.62,600 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, డీఎస్ఐ శివారెడ్డి, సిబ్బంది రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదల సొంతింటి కల సాకారం
ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్లో సోమవారం సద్దుల ఈశ్వరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రా రంభించి, అనంతరం వార్డులో 10లక్షల నిధులతో వేస్తున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబసభ్యలను శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ము న్సిపాలిటీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
‘పది’ పై దృష్టి సారించండి
కందుకూరు: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ సుశీందర్రావు సూచించారు. మండల పరిధిలోని నేదునూరు జిల్లా పరిషత్ పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, ఐఎఫ్పీ ప్యానెల్, పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ, మొక్కల పెంపకం, నీటి వసతి తదితర అంశాలను పరిశీలించారు. చదవడం, రాయడం సరిగ్గా రాని వెనకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, టీఎల్ఎం ద్వారా విద్యాబోధన నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్శర్మ, ఉపాధ్యాయులు గ్లోరి, శాంతకుమారి, కరుణాకర్, శ్రీవాణి, గిరిజ, డాక్టర్ ఎండీ బషీర్, అబ్దుల్లా, హసనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ విద్యార్థుల ఆందోళన
ఇబ్రహీంపట్నం రూరల్: కళాశాలలో సరైన సౌకర్యాలు లేవని.. చదువులు సక్రమంగా సాగడం లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రస్తుతం ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతోంది. సరైన సౌకర్యాలు లేక సతమతమవుతున్నామని, బస్సు, హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ సోమవారం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. హాస్టల్ వసతి లేకపోవడంతో నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేలు వెచ్చించాల్సి వస్తోందన్నారు. పేద విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉండి చదవలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లు, కాలేజీలో విద్యార్థినులకు రక్షణ కరువైందన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నూతన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ నుంచి శాసనసభ్యులుగా
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వగ్రామంలో సర్పంచ్లుగా ఎన్నికై ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చేరారు. అదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలుగా రాణించారు. వీరు ఇద్దరూ 1980లో సర్పంచ్లుగా గెలుపొంది ఇద్దరూ మూడుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. నిర్మల్ పురస్కార్ అవార్డు ఘనత నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిది అబ్దుల్లాపూర్మెట్ మండలం, తొర్రూర్ స్వగ్రామం. విద్యార్థిదశ నుంచే చురుగ్గా ఉండడంతో ఆయనకు ఓటు హక్కు వచ్చిన ఏడాది 1980లోనే తొర్రూర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించారు. ఆయన సర్పంచ్గా పని చేసిన కాలంలో గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఘనత దక్కింది. తదనంతరం నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీలో చేరి 1994లో మలక్పేట్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2004లో కాంగ్రెస్ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచాడు. తదనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు సార్లు పొటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2023లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లుగా సేవలందిస్తున్నారు. బాబాయ్పై గెలుపు ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్రెడ్డి. నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతుండగా గ్రామానికి చెందిన పెద్దలు ఆయన్ను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. 1980లో సర్పంచ్ ఎన్నికల్లో సొంత బాబాయ్పై గెలుపొందాడు. సర్పంచ్గా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాడు. తదనంతరం టీడీపీలో చేరి వివిధ పదవులను అలంకరించాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 2014లో రెండో సారి టీడీపీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో టీఆర్ఎస్ నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి ఇబ్రహీంపట్నం ప్రజలకు సేవలందించాడు. 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు. మంచిరెడ్డి, మల్రెడ్డి తొలుత ప్రథమపౌరులే.. ఇద్దరూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేలు తొలి ఓటు తనకే వేసుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యం కష్టపడి పని చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. రాజకీయాల్లో స్థిరత్వం అవసరం. టీడీపీ రాజకీయ భవిష్యత్ ఇస్తే కాంగ్రెస్ జీవితం ఇచ్చింది. పార్టీని నమ్ముకుని ఉండటం వల్లే నేడు మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచాను. స్థిరత్వంగా, నిలకడగా ఉండాలి. ప్రజలను నమ్ముకుని ఉండాలి. స్వార్థం లేకుండా పని చేశాం. అప్పట్లో ఓట్ల కోసం ఖర్చులు సైతం తక్కువే. ఇప్పుడు రాజకీయాలు ఫిరం అయ్యాయి. – మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం నిస్వార్థంగా సేవలందించాం ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి సర్పంచ్గా 1980లో పని చేశాను. అప్పట్లో యువకుడిగా ఉన్న సమయంలో ప్రజలు అవకాశం కల్పించారు. నిస్వార్థంగా సేవలందించి ప్రజల మన్ననలు పొందాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నిరంతరం ప్రజలతోనే ఉండటం వల్ల మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. స్వార్థం లేని జీవితంతో ముందుకు పోతే అవకాశాలు వస్తాయి. – మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం -
‘గుర్తు’ంచుకోండి.. గెలిపించండి
షాద్నగర్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమకు కేటాయించిన గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తెల్లవారింది మొదలు రాత్రి వరకు గడగడపనూ చుట్టేస్తున్నారు. మొదటి విడత షాద్నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల్లో 168 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరులో 12 పంచాయతీల్లో 110 వార్డులకు, నందిగామలో 18 పంచాయతీల్లో 170 వార్డులకు, కేశంపేటలో 28 పంచాయతీల్లో 260 వార్డులకు, కొందుర్గులో 19 పంచాయతీల్లో 186 వార్డులు, జిల్లేడు చౌదరిగూడలో 24 పంచాయతీల్లో 204 వార్డులు, ఫరూఖ్నగర్లో 46 పంచాయతీల్లో 410 వార్డులు, శంషాబాద్లో 21 పంచాయతీల్లో 190 వార్డులకు, సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి మిగిలింది ఒక్కరోజే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే ప్రచార పర్వం ముగియనుంది. ఒక్కరోజే మిగిలుండడంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. సర్పంచ్, వార్డు సభ్యులు వారికి కేటాయించిన గుర్తులను పోస్టర్లు, కండువాలపై ముద్రించి వాటిని ఇంటింటికీ వెళ్లి చూపిస్తూ ఒకటికి రెండుసార్లు గుర్తు చేస్తున్నారు. ఆటోలకు మైకులు అమర్చి, పాటలు, మాటల రూపంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నమూనా బ్యాలెట్ పేపర్లను ఇంటింటికీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. సామాజిక మాద్యమాల్లో.. ఈసారి సామాజిక మాద్యమాల్లో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందుకు గాను వాట్సాప్లో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారు. ఫేస్బుక్, ఇస్ట్రాగామ్లను సైతం వినియోగించుకుంటున్నారు. అభ్యర్థుల గుర్తులతో కూడిన ఫొటోలు, వీడియోలు రూపొందించుకొని సామాజిక మాద్యమాల ద్వారా ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రచారం చేస్తున్నారు. హామీలు గుప్పిస్తూ.. ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాము విజయం సాధిస్తే గ్రామాన్ని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీలు గుప్పిస్తున్నారు. గతంలో పదవులు చేపట్టి తిరిగి ఎన్నికల్లో నిలిచిన వారు గ్రామానికి ఐదేళ్ల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. తమకు మద్దతు తెలుపుతున్న పార్టీ అధికారంలో ఉందని, గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అఽధికార పార్టీ మద్దతుదారులు హామీలు ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధికి సొంత ఎజెండాను రూపొందించారు. పల్లెల్లో ప్రచార జోరు గెలుపే లక్ష్యంగా పావులు ఓటర్లకు ఒకటికి రెండు సార్లు ‘గుర్తు’ చేస్తున్న అభ్యర్థులు మొదటి విడత ఎన్నికలకు నేటితో ముగియనున్న ప్రచార పర్వం -
ఆదరించండి.. అభివృద్ధి చూపిస్తా
కడ్తాల్: బాలాజీనగర్ తండా సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరించి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి నేనావత్ అమర్సింగ్ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. గ్రామానికి చెందిన అమర్సింగ్ 15 ఏళ్ల క్రితం వ్యవసాయ పొలంలో పంపుసెట్ వద్ద జరిగిన ప్రమాదంలో తన కుడిచేతిని కోల్పోయాడు. అధైర్య పడకుండా డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామ యువత విద్యావంతుడిని సర్పంచ్ చేయాలనే పట్టుదలతో అమర్సింగ్కు మద్దతు తెలుపుతోంది. తన గెలుపుతో తండాను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నాడు. బాలాజీనగర్ తండా సర్పంచ్ అభ్యర్థి అమర్సింగ్ -
గ్రామస్థాయిలో బలోపేతం
చేవెళ్ల: బీజేపీ గ్రామ స్థాయి వరకు బలోపేతం అవుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అనంత్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లి నుంచి పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలం పెంచుకుంటుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో బీజేపీ మద్దతుతో అభ్యర్థులు ఎక్కడ గెలిచినా ఆ గ్రామానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, బీఎస్ఎన్ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డి, శర్వలింగం, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, రా జు, శ్రీకాంత్రెడ్డి, వెంకటేశ్, అభిషేకర్రెడ్డి, మాణ య్య, చంద్రకాంత్, రవి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్‘గా ప్రచారం
షాబాద్: ఒకప్పుడు ఎన్నికలంటే వారం, పది రోజుల ముందు నుంచే మైక్ల ద్వారా ప్రచారం.. గోడలపై రాతలు ఉండేవి. అభ్యర్థుల తరఫున పోల్ చీటీలు ఇంటింటికీ పంచేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పటి ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పల్లె పోరులో సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా గ్రామాల వారీగా పదుల సంఖ్యలో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారానికి అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అవి నిమిషాల వ్యవధిలోనే ఓటర్లకు చేరువవుతున్నాయి. సెల్ఫోన్లే ప్రచార సాధనాలు.. ప్రస్తుతం సెల్ఫోన్లే ప్రచార సాధనాలుగా మారాయి. మండల పరిధిలోని ఒక గ్రామంలో ఒక పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా, సదరు పార్టీ నాయకుడు పోటీలో ఉన్న అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీంతో సదరు అభ్యర్థి తమ నాయకుడితో ఫోన్ మాట్లాడిన విషయాలను రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆయా పార్టీల సోషల్ మీడియా ఇన్చార్జిలు ఓటర్లకు సంబంధించి ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా వారితో సంప్రదింపులు చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ పేరిట పాటలు రూపొందించుకొని గ్రామాల వారీగా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ప్రగతి ధర్మారంలో సర్పంచ్ అభ్యర్థి ఒకరు తనను గెలిపిస్తే చేసే పనుల గురించి బాండ్ రాయించి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. పనిలో పనిగా అభ్యర్థులు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు సోషల్ మీడియా వేదికగా అస్త్రాలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థుల విశ్వప్రయత్నాలు -
చివరి దశకు పనులు
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సమ్మిట్కు గంటల వ్యవధే మిగిలి ఉండటంతో వేగంగా పనులు చేపడుతున్నారు. ప్రధాన వేదిక పనులు పూర్తవగా ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేసిన స్టాళ్ల ఏర్పాటు ఫైనల్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన వేదిక పక్కనే అతిథులు రాష్ట్ర ప్రగతి తిలకించేలా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన వివరాలు తెలియజేసేలా స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. మీడియా పాయింట్ పరిశీలన ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మీడియా సెంటర్ ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక పరిశీలించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆ శాఖ అధికారులు ఉన్నారు. -
అభ్యర్థులారా.. ఆలకించండి
‘నాపేరు.. పల్లెటూరు దేశానికి మరో పేరు..’ ఈ పాట ఎవరు రాశారో కానీ ప్రపంచానికి మేమంటే ఏమిటో చాటాం.. పచ్చదనం.. ప్రకృతి అందాలు.. గలగల పారే సెలయేళ్లు.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల సేవలు నా ప్రత్యేకతలు.. కానీ నేడు తీరు మారిపోయింది. నష్టాల ఏటిని కష్టంగా ఈదుతున్నా.. అభ్యర్థు లుగా కొత్త ఆశలు రేపి ముందుకు వస్తున్న మీలో ఎవరైనా రేపు గెలిచాక ప్రథమ పౌరులుగా.. ప్రజా సేవకులుగా మా సమ స్యలు పరిష్కరిస్తారని.. మాగోడు వెల్లబో సుకుంటున్నా. ఆలకించండి ఓసారి’.. – షాద్నగర్ పల్లె సీమ దేశానికి అన్నం పెట్టే భాండాగారం అన్నది మీ అందరికీ తెలుసు.. కానీ అదే పల్లెను ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నది ఎంత మందికి తెలుసు. షాద్నగర్ నియోజకవర్గాన్నే తీసుకుంటే.. ఇక్కడ 50 శాతం పల్లెలకు రహదారులు కూడా సక్రమంగా లేని పరిస్థితి.. ఏళ్లు గడుస్తున్నా గతుకుల రోడ్లే గతయ్యాయి. చాలా చోట్ల బస్సులు కూడా రావడం మానేశాయి. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.. ఇక సీజన్ వచ్చిందంటే పారిశుద్ధ్య లేమి.. దుర్గంధంతో రోగాలు ముందుకు మమ్మల్నే తాకుతున్నాయి. మరో వైపు రియల్ ఎస్టేల్ వ్యాపారులు ఉన్న భూములను వెంచర్లుగా మార్చేశారు.. వ్యవసాయ క్రమంగా తగ్గుతోంది. వ్యవసాయదారులు, కూలీలకు కూడా పని లేకుండా పోతోంది. విద్యా వ్యవస్థ సరిగాలేదు. అభివృద్ధి కాగితాల్లో తప్ప మా ముంగిటకు చేరలేదు. మా జీవన శైలిలో మార్పు రాలేదు. సంక్షేమ పథకాలు తెస్తున్నారు.. కానీ అవి అర్హులకు సరిగా అందడం లేదు. మమ్ములను ఎన్నుకున్న సర్పంచులు మాగోడు పట్టించుకోకుండా కేవలం సొంత పనుల మీదే దృష్టి పెడుతున్నారు. ఇలాగైతే ఎలా బాగు పడాలి.. ఎప్పటికి ఈ పరిస్థితులు మారాలి. కొత్త అభ్యర్థులైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా. కాలుష్య భూతం కాలుష్య భూతం ప్రజలను వెంటాడుతోంది. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.. స్థానికులకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. వేర్వేరు రాష్ట్రాల నుంచి పని చేసే వాళ్లను తెచ్చుకుంటున్నారు. ఇక్కడి వాళ్లకు మాత్రం కాలుష్యాన్ని కానుకగా ఇస్తున్నారు. సుమారు 30 శాతం గ్రామాలు ఇబ్బందులకు గురువుతున్నాయి. పంటలు కాలుష్యంతో పాడైపోతన్నాయి. వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. వ్యవసాయం, పరిశ్రమల్లో ఉపాధి లేక చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఎక్కడ చూసినా సగానికిపైగా తాళం వేసి ఉన్న ఇళ్లే కనిపిస్తున్నాయి. మరి ఈ పరిశ్రలతో ఎవరికి ఉపయోగం. ఈ ఎన్నికల్లో చాలా మంది వలస పోయిన ఓటర్లను ఫోన్ల ద్వారా పిలిపించుకొని ఓటు వేయించుకుంటున్నారు. బాగానే ఉంది.. మరి వాళ్లు ఎందుకు వలస వెళ్లారు. ఇన్ని పరిశ్రమలు ఉన్న వాళ్లకి ఇక్కడ ఎందుకు ఉపాధి దొరకడం లేదు. ఎప్పుడైనా ఆలోచించారా. కొత్త అభ్యర్థులైనా కనీసం దీనిపై ఆలోచించండి. స్థానికులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించే దిశగా పోరాటం చేయండి.. వలస పోకుండా ఇక్కడే ఉండి పల్లె సీమ నిండుదనాన్ని కాపాడండి.. పూర్వ వైభవం తెచ్చేలా .. ప్రగతివైపు అడుగులు వేసేలా మీరైనా చూడండి.. చూస్తారని.. చేస్తారని ఆశిస్తూ.... – ఇట్లు మీ షాద్నగర్ నియోజకవర్గంలోని పల్లెలు పాలకులు మారినా మా తలరాత మారలేదు దశాబ్దాలు దాటినా ప్రగతికి నోచుకోలేదు ఏళ్ల తరబడి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం కొత్తగా ఎన్నికయ్యే ప్రథమ పౌరులారా మీరైనా పట్టించుకోండి మా పల్లె వేదన -
భారత్ ఫ్యూచర్ సిటీ
భద్రతా వలయంలో.. సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025’ మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వెయ్యి సీసీ కెమెరాలతో 2,500 మంది పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక చుట్టూ వెయ్యి మంది పోలీసులతో మూడంచెల భద్రత, మరో 1,500 మందితో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టనున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం ఉదయం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు పరిశీలించారు. విద్యుత్, మంచి నీరు, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ సహా ఏసీలు, 3డీ ఎల్సీడీ ప్రొజెక్టర్లు, లైటింగ్, సౌండ్ సిస్టం సహా రిసెప్షన్ కౌంటర్, ప్రధాన వేదికకు వచ్చిపోయే మార్గాలను పరిశీలించారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన మూడు హెలీప్యాడ్లు సహా వచ్చి పోయే మార్గాలను మరోసారి చెక్ చేశారు. ఇదే వేదికగా తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కృతం కాబోతున్న నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. సచివాలయం, అసెంబ్లీ సహా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన మార్గాలు, మెట్రో పిల్లర్లతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల ముందు వీటిని ఏర్పాటు చేశారు. ఇటు శంషాబాద్ నుంచి తుక్కుగూడ, శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా మీర్ఖాన్పేట వరకు భారీ పోలీసు బందోబస్తును సిద్ధం చేశారు. సిటీ ముస్తాబు మహా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముస్తాబైంది. సమ్మిట్కు హాజరయ్యే దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, తెలంగాణ సాంస్కృతిక ఆకర్షణల, రంగురంగుల జెండాలు మేళవింపుతో నగరం స్వాగతం పలకనుంది. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు, చెరువులు, ప్రధాన రహదారులు. కూడళ్లు తదితర అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, కటౌట్లు, ఫ్లెక్సీలు, హైటెక్ ప్రొజెక్టర్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో నగరం తళతళా మెరిసిపోతోంది. ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం.. ఇలా నగరమంతటా ప్రత్యేక లైటింగ్తో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు.. ప్రత్యామ్నాయ మార్గాలు సాక్షి, సిటీబ్యూరో: మీర్ఖాన్పేటలో నిర్వహించ నున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఈమేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంత రాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో.. ప్రధానంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్హెచ్–765)లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ (ఎగ్జిట్ నంబరు–14), హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్ ఎగ్జిట్–15 మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కాబట్టి వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఔటర్ నుంచి ఎన్హెచ్–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ (ఎగ్జిట్ నంబరు–14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ (ఎగ్జిట్–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు. స్కాన్ చేసి.. పార్కింగ్ చేయ్.. భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. కోడ్ను స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు. విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తు శంషాబాద్: గ్లోబల్ సమ్మిట్కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్, లాంజ్ సిద్ధం చేశారు. ఆర్జీఐఏ ఔట్పోస్టు ఇన్స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో 24 గంటల పాటు అన్ని పాయింట్ల వద్ద బందో బస్తు కొనసాగుతోంది. అతిథుల కోసం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లలో భాగంగా భద్రతా బలగాల మోహ రింపు హాజరు కానున్న దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సమాలోచనలు, సదస్సులు -
ఓటమి.. గెలుపునకు నాంది
శంకర్పల్లి: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది కావాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్లో హెచ్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ టూ ఆల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించగా.. సంగారెడ్డికి చెందిన విశాల్, శివ విన్నర్గా, శంకర్పల్లికి చెందిన ప్రభాకర్, తిరుపతిరెడ్డిలు రన్నరప్గా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సురేశ్, రఘునందన్రెడ్డి, నర్సింహారెడ్డి, మాణిక్రెడ్డి, రాంరెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రమోహన్ -
ఊరి సిత్రాలు చూడయా!
యాచారం: రాజకీయాల్లో బద్ధ శత్రువులు.. శాశ్వత మిత్రులుండరని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరోసారి రుజువవుతోంది. పార్టీలో ఏళ్లుగా ఉంటూ పదవులు, గుర్తింపు పొందిన నేతలు స్వలాభం కోసం క్షణాల్లో మారిపోతున్నారు. డబ్బులు, అధికార ఆశతో పార్టీలో మర్యాద ఇవ్వడం లేదని, గుర్తింపు ఇవ్వడం లేదనే సాకుతో బద్ధ శత్రువులకు మద్దతు ప్రకటిస్తున్నారు. యాచారం మండలంలోని మాల్, మొండిగౌరెల్లి, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, చింతపట్ల తదితర గ్రామాల్లో విచిత్ర పొత్తులతో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తర ంగా మారుతున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రధాన ప్ర త్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని సర్పంచ్ బరిలో నిలుపగా, మరికొన్ని ఊర్లల్లో పదేళ్లు అధికారంలోకి ఉన్నప్పటికీ సర్పంచ్ అభ్యర్థులు లేక ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తున్న ఉదంతాలున్నాయి. కొన్నింటిలో బీజేపీ, సీపీఎంలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపడం గమనార్హం. ప్రత్యర్థులకు మద్దతు ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారన్న కారణంతో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, ఆమె భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాట్ టాఫిక్గా మారింది. మొండిగౌరెల్లి గ్రామంలో అధికార పార్టీకి వింత అనుభవం ఎదురైంది. సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఎవరూ పోటీ చేయకపోవడంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పటికీ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో లేకపోవడంపై ఆదివారం ఎమ్మెల్యే మండిపడ్డారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలి బీజేపీ సానుభూతిపరులకు మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం సర్పంచ్ ఎన్నికల్లో తటస్థంగా ఉంది. సర్పంచ్ బరిలో విద్యావంతులు కడ్తాల్: గ్రామ పంచాయతీ పోరులో విద్యావంతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కేతావత్ పద్మమోహన్ బరిలో ఉన్నారు. ఆమె పాలిటెక్నిక్ డిప్లామా పూర్తి చేశారు. గ్రామాభివృద్దే లక్ష్యంగా అందరి సహకారంతో బరిలో దిగినట్లు తెలిపారు. గ్రామంలో విద్యా, వైద్యానికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ పెద్దవేములోని బావితండాకు చెందిన రమావత్ గోపీనాయక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. చదువుకున్న యువకుడిగా తండా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే తండాలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. క్షణాల్లో కండువాలు మార్చేస్తున్న నాయకులు తమ పార్టీలకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్న వైనం విచిత్ర పొత్తులకు వేదికగాగ్రామ పంచాయతీ పోరు -
అభ్యర్థుల గెలుపే లక్ష్యం
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం షాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో కూతురు గోపాల్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రం ప్రజ లకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజే యాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త శ్రమిస్తే విజయాన్ని అందుకుంటామన్నా రు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మద్దూరు మాణయ్య, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి, నా యకులు కూతురు మహేందర్, సంజీవ, రవీందర్రెడ్డి, క్యామ నారాయణ, వైభవ్రెడ్డి ఉన్నారు. -
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
కొత్తూరు: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. ఆదివారం మండలంలోని గూడూరు, తీగాపూర్, మల్లాపూర్, నందిగామ మండలంలోని అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, వెంకమ్మగూడ, చేగూరు, నందిగామ గ్రామాల్లో పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి కోసం కృషి చేసే అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు అభ్యర్థులు, నాయకులు శివశంకర్గౌడ్, సుదర్శన్గౌడ్, సురేందర్, శ్రీనివాస్, బాబార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సస్పెండ్
యాచారం: స్థానిక జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, ఆమె భర్త యాదయ్యను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ ప్రకటించారు. మండలంలోని మంతన్గౌరెల్లి గ్రామంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా గులాం సుభానీ పేరును అధిష్టానం ప్రకటించినప్పటికీ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు జంగమ్మతో పాటు ఆమె భర్త యాదయ్య కాంగ్రెస్ పార్టీ బలపర్చిన శేఖర్గౌడ్కు మద్దతు ప్రకటించారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వివరించారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
మొయినాబాద్రూరల్: పంచాయతీ ఎన్నికల్లో స ర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఐ పవన్కుమార్రెడ్డి, మండల ఎన్నికల పరిశీలకుడు ఫిరోజ్ఖాన్ అన్నారు. ఆదివారం మండలంలో అభ్యర్థులతో ఎన్నికల ఖర్చులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎన్నికల పరిశీలకుడు మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. వాల్పోస్టర్, బ్యానర్లు, మైక్ స్పీచ్లు, ర్యాలీలు అన్నింటికి పర్మిషన్లు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
దైవ చింతన అలవర్చుకోవాలి
కేశంపేట: మానవుడు దైవ చింతనతో మాధవుడిగా మారాలని కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మెంతాల మహేశ్వర్ అన్నారు. మండల పరిధిలోని నిర్ధవెళ్లి గ్రామంలో కిషన్ప్రభు ధర్మప్రచార సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా మద్భగవద్గీతా జయంతి మహోత్సవాలను నిర్వహించారు. ఆదివారం మహేశ్వర్తో పాటుగా తొమ్మిదిరేకుల గ్రామ ఆశ్రమ స్వామి అమృతానందగిరి స్వామి, అష్టలక్ష్మి దేవాలయం జడ్చర్ల నుంచి కృష్ణానందస్వామి, భూమనందస్వామి, ముక్తేశ్వరనందగిరి స్వామిలు పాల్గొని భగవద్గీతపైన భక్తులకు ప్రవచలను అందించారు. వారం రోజులుగా గ్రామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామం, భగవద్గీత యజ్ఞంతో పాటుగా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణయ్య, అయ్యపురెడ్డి, శివరాములు, యుగందర్రెడ్డి, హరికిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి..
ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ఇబ్రహీంపట్నం రూరల్: కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సైదయ్య కథనం ప్రకారం.. నందిహిల్స్ అల్మాస్గూడలో నివాసం ఉండే నారాయణస్వామి(30), వంశీకృష్ణతో పాటు మరో ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నానికి వచ్చారు. అక్కడే క్రికెట్ మ్యాచ్ చూసి రాత్రి హైదరాబాద్కు కారులో బయలుదేరారు. తుర్కయంజాల్ మసాబ్ చెరువు కట్ట వద్దకు వెళ్లగానే ఎదురుగా కుక్క అడ్డు రావడంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారులో వెనకాల కూర్చున్న ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన నారాయణస్వామి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
శంకర్పల్లి: మండలంలో సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్క అభ్యర్థి సహకరించాలని ఎంపీడీఓ వెంకయ్య అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాయలంలో సర్పంచ్ అభ్యర్థులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులంతా స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. శంకర్పల్లి, మోకిల సీఐలు శ్రీనివాస్గౌడ్, వీరబాబు మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగిన కఠిన చర్యలుంటాయని, ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం చేయొద్దన్నారు. ప్రచార వాహనాల కోసం తహసీల్దార్ అనుమతి తీసుకోవాలని, సౌండ్ సిస్టం కోసం తమను సంప్రదిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా పోటీలో గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు తీసేవారు 48 గంటల ముందు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ వెంకయ్య -
రిజర్వేషన్ల సాధనకు సమష్టి పోరు
మీర్పేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు దాసరి బాబు పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారికి ఆదివారం మీర్పేట కూడలిలో సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. అనంతరం బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడాన్ని తట్టుకోలేకనే ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. అతని మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ఇకనైనా బీసీలంతా ఐకమత్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించుకుని రాజ్యాధికారి సాధించాలన్నారు. కార్యక్రమంలో బహుజన ఐక్య వేదిక కార్యదర్శి రాజలింగం, విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరిచారి, నాయకులు రఘు, శేఖర్రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకయ్య, మల్లికార్జున్, నవీన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


