breaking news
Ranga Reddy District News
-
పెద్దచెరువులో మట్టి తవ్వకాలు!
మీర్పేట: పెద్దచెరువు (ఐల్యాండ్)లో నిబంధనలకు విరుద్ధంగా బుధవారం ఉదయం మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులను వివరణ కోరగా.. మాకేం సంబంధం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చెరువు కట్టపై మొక్కలు నాటేందుకు.. కొద్దిగా మట్టి తీసుకెళ్తున్నామని అక్కడే ఉన్న కాంట్రాక్టర్ తెలిపారు. వాస్తవానికి బయటనుంచి మట్టి తీసుకురావాల్సి ఉన్నా.. చెరువు స్థలంలో తవ్వకాలు చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలా తవ్విన గుంతల్లో నీళ్లు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చెరువు స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను ధ్వంసం చేసి జేసీబీ, ట్రాక్టర్లతో లోనికి వెళ్లారని ఆరోపించారు. -
సెట్టింగ్తో సెటిల్మెంట్!
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం అవన్నీ అటకెక్కిపోయాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్ 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అప్పట్లో రాచకొండ లేకపోవడంతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ అధ్యక్షుడిగా, ఐజీ స్థాయి అధికారులైన అదనపు కమిషనర్ (సమన్వయం), అదనపు కమిషనర్ (నేరాలు) సభ్యులుగా, సైబరాబాద్ కమిషరేట్ విషయానికి వస్తే అధ్యక్షుడిగా పోలీసు కమిషనరే ఉన్నప్పటికీ సభ్యులుగా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, క్రైమ్ డీసీపీ వీటిని ఏర్పాటు చేశారు. ఆపై ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లకు (ఎస్ఓపీ) రూపమిచ్చి వెబ్సైట్లలో పొందుపరిచారు. కాలక్రమంలో ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్మెంట్లు కొనసాగుతున్నాయి. ● ‘పోలీసుస్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి. వీటిని సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా మార్చారు. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు’ ● రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసుస్టేషన్లో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. ● పీఎస్లే కేంద్రంగా పంచాయితీలు ● ఫలితాలివ్వని ఎస్ఓపీలు, మానిటరింగ్ కమిటీలు ● హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి తెరపైకి -
స్కూల్ పిల్లలకు తప్పిన ముప్పు
మొయినాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన నాగిరెడ్డిగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్లోని ఓ కార్పొరేట్ స్కూల్ బస్సు బాకారం నుంచి పిల్లలను ఎక్కించుకుని నాగిరెడ్డిగూడ వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఒకవైపు చక్రాలు పంటపొలంలోకి దూసుకెళ్లడంతో బస్సు ఆగిపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే రోడ్డు కిందికి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు మండిపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. స్కూల్ బస్సులు వరుస ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో వీటి ఫిట్నెస్పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా
యాచారం: గ్రామాల్లో సీసీ కెమెరాలుంటే 24 గంటల పాటు పోలీస్ బందోబస్తు ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని నస్దిక్సింగారంలో దాతల సహకారంతో వివిధ చోట్ల బిగించిన పది సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలుంటే ఎంతో రక్షణ ఉంటుందన్నారు. గ్రామాల్లోని యువత, రాజకీయ వేత్తలు, ఉద్యోగులు సమష్టిగా కలిసి సీసీ కెమెరాల బిగింపు కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు, గ్రామస్తులు పాండురంగారెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీశైలం, గాలయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న అభ్యుదయ్ డే సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) ఆధ్వర్యంలో జరిగిన మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అభ్యుదయ్ డే బుధవారం ముగిసింది. గత 18న ప్రారంభించిన ఈ కార్యక్రమం పలు ఉపయుక్తమైన వర్క్షాప్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రజెంటేషన్స్తో విద్యార్థులను ఆకట్టుకుంది. టీసీఎస్ సంస్థ హెడ్ చల్లా నాగ్, ఎలికో హెల్త్కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వనితా దట్ల, స్మార్ట్ ఫార్మా 360 సీఈఓ సహ వ్యవస్థాపకురాలు సాకేత, న్యాయవాది మోబాష్షీర్ సర్వర్, కెనడాలోని డల్హౌసీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్టీఫెన్ మెచౌలన్ తదితర దేశ విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలి జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ మహేశ్వరం: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మెహబ్బత్నగర్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, ప్రాథమిక పాఠశాల, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా డీపీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా తగు చొరవ చూపాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి మైథిలి ఉన్నారు. -
నిధుల దుర్వినియోగంపై ఆగ్రహం
షాద్నగర్రూరల్: పట్టణంలోని పద్మావతీకాలనీలో ఉన్న పోస్టాఫీస్లో నిధుల దుర్వినియోగంపై బుధవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోస్టల్ శాఖకు సంబంధించిన రూ.19 లక్షల నిధులు ఖాతాలో జమ చేయకుండా స్థానిక పోస్టల్ ఉద్యోగి దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై అధికారులు కదిలారు. వనపర్తి పోస్టల్ ఆఫీస్ సూపరింటెండెంట్ భూమన్న, అధికారులు సైదానాయక్, గోపీనాథ్, సుజన్ నాయక్, రవికుమార్లు షాద్నగర్కు విచ్చేసి కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఇందులో పోస్టల్శాఖకు సంబంధించిన రూ.19లక్షల డబ్బులు లేకపోవడంతో స్థానిక అధికారి ఉమామహేశ్వర్పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఎక్కడ ఉన్నాయని స్థానిక అధికారిని ప్రశ్నించడంతో డబ్బులు ఇంటి వద్ద ఉన్నాయని చెప్పారు. దీంతో రెండు రోజుల్లో డబ్బులు మొత్తం ఖాతాలో జమ చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోస్టాఫీస్లో తనిఖీ చేసిన అధికారులు -
కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలి
కొత్తూరు: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ విభాగం జిల్లా అధ్యక్షుడు రమావత్ సక్రునాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పలువురు కార్మికులతో కలిసి కొత్తూరు మున్సిపల్ కమిషనర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. అంతేకాకుండా కార్మికులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాకుండా, ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే పనులు చేయించాలన్నారు. కార్మికులకు సబ్బులు, నూనె, చీపుర్లు, గ్లౌస్లు, మాస్కులు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వారంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సంజీవకుమార్, జంగయ్య, రోజ, దేవమ్మ, అంజమ్మ, మంజుల, సుజాత, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు సక్రునాయక్ -
భారతి సిమెంట్కు తిరుగు లేదు
అనంతగిరి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ను తెలంగాణలో ప్రవేశపెట్టిందని, సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్లోని ఓంసాయి ట్రేడర్స్ డీలర్ షాప్లో తాపీ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి ఈ సిమెంట్ సరైన ఎంపిక అని తెలిపారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం అందజేస్తామని, స్లాబ్, కాంక్రీట్ వేసే సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడుతారని స్పష్టంచేశారు. మార్కెట్లో దొరికే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ ధర బ్యాగుకు 20 రూపాయలు అధికంగా ఉంటుందన్నారు. అనంతరం 60 మంది తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి, డీలర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా బాండ్ల అందజేత -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు
హయత్నగర్: కేంద్ర ప్రభుత్వ కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుకు నిరసనగా ఈ నెల 9న తలపెట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు అబ్దుల్లాపూర్మెట్ మండల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం కుంట్లూరులోని రావినారాయణరెడ్డి కాలనీలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్, అప్రెంటీస్, థర్డ్ పార్టీ ట్రైనీలుగా పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు హరిసింగ్నాయక్, నాయకులు లక్ష్మణ్, నర్సింహ, ప్రసాద్, నవనీత తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రవీంద్రాచారి -
పైప్లైన్లు, ఎయిర్వాల్వ్ లీకేజీలు
తుక్కుగూడ: మున్సిపల్ పరిధిలోని తాగునీటి సమస్య వేధిస్తుంది. ఔటర్ రింగు రోడ్డు లోపల భాగం తుక్కుగూడ, రావిర్యాల, సర్ధార్నగర్, దేవేందర్నగర్ కాలనీలకు హెచ్ఎండబ్ల్యూస్ ఆధ్వర్యంలో, ఔటర్ ఆవలి భాగంలో ఉన్న మంఖాల్, ఇమూమ్గూడ గ్రామాలకు మిషన్ భగీరథ ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరుగుతుంది. ఈ రెండు శాఖల నీటి సరఫరా అవసరం మేరకు పంపిణీకాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పైపులైన్లు, ఎయిర్వాల్వ్ లీకేజీల కారంగా నీరు వృథా అవుతుంది. దీంతో ప్రజలు వీధుల్లో ఉన్న బోర్లను ఆశ్రయిస్తున్నారు. -
తెల్లచందనం స్మగ్లర్ల అరెస్ట్
చేవెళ్ల: పుష్ప సినిమా తరహాలో.. అక్రమంగా తరలిస్తున్న టన్ను (1,000 కిలోల) తెల్లచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ వెల్లడించారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చేవెళ్ల పోలీసులతో కలిసి మంగళవారం మండలంలోని బస్తేపూర్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎంహెచ్ 25 ఏజే 3689 నంబరు కలిగిన డీసీఎం వ్యాన్ను తనిఖీ చేశారు. వ్యాన్ బాడీ మొత్తం ఖాళీగా ఉండగా.. డ్రైవర్తో పాటు అందులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు డ్రైవర్ వెనక భాగంలో ప్రత్యేకంగా ఓ చిన్నపాటి అరను తయారు చేయించినట్లు గమనించారు. దీన్ని తెరిపించి చూడగా ప్లాస్టిక్ బ్యాగులలో చిన్నచిన్న ముక్కలుగా ఉన్న తెల్లచందనం (శ్రీగంధం) చెక్కలను గుర్తించారు. ఫారెస్ట్ అధికారులను పిలిపించి నిర్ధారించుకున్న అనంతరం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి కిలోల బరువున్న గంధం చెక్కల విలువ రూ.35 లక్షలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా జాత్ తహసీల్ ఉంట్వాడీ గ్రామం నుంచి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం నాగరగూడలోని ఆంధ్ర పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి వీటిని తరలిస్తున్నారు. పట్టుబడిన ముగ్గురిలో తెల్లచందనం సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన విజయ్ హన్మంత్ మానే, డీసీఎం డ్రైవర్ అబ్దుల్ అజీజ్, ఫ్యాక్టరీ సూపర్వైజర్ సోహెబ్ ఉన్నారు. అనుమతులు లేకుండా తెల్లచందనం కొనుగోలు చేసి, తీసుకువస్తున్న ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్లా కున్హి, కంపెనీ మేనేజర్ సాదిక్పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. సదరు ఐదుగురు వ్యక్తులపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన ముగ్గురు గతంలో ఒకే పర్ఫ్యూమ్ కంపెనీలో పనిచేశారని పోలీసులు వెల్లడించారు. కొనుగోలు చేసిన తెల్లచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారని తెలిపారు. డీసీఎంతో పాటు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో చేవెళ్ల సీఐ భూపాల్శ్రీధర్, మాదాపూర్ ఎస్ఓటీ సీఐ సంజయ్కుమార్, ఫారెస్ట్ అధికారి రవికుమార్, ఎస్ఐలు వనం శిరీష, ఎస్ఓటీ ఎస్ఐలు సతీష్, బారాజ్ ఉన్నారు. అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కిలోల శ్రీగంధం చెక్కలు స్వాధీనం ఐదుగురిపై కేసు నమోదు, పరారీలో ఇద్దరు పట్టుబడిన సరుకు విలువ రూ.35 లక్షలు వివరాలు వెల్లడించిన చేవెళ్ల ఏసీపీ కిషన్ -
రైతులకు అండగా కాంగ్రెస్
శంకర్పల్లి: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు కంది విత్తన సంచులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు నాలుగు కిలోల కంది విత్తన సంచులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతును రాజు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని అన్నారు. రైతులు నిత్యం వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తూ.. ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల వ్యవసాయాధికారి చైతన్య మాట్లాడుతూ.. శంకర్పల్లి మండలానికి ప్రస్తుతం 16 క్వింటాళ్ల కందులు వచ్చాయని, నాలుగు క్లస్టర్స్కి నాలుగు క్వింటాళ్ల చొప్పు న అందిస్తామన్నారు రైతులు సంబంధిత పత్రా లు అందజేసి, అక్కడే కందులను తీసుకోవాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిరాజు, నాయకులు ప్రవీణ్, రాంరెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రమౌలి తదితరులు పాల్గొన్నారు. -
నేడు అధికారులకు ప్రత్యేక శిక్షణ
ఆమనగల్లు: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో గురువారం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కుసుమ మాధురి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరవాలని కోరారు. డాక్టర్ సరితకు ‘వైద్య శిరోమణి’ షాద్నగర్: షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సరితను వైద్య శిరోమణి అవార్డు వరించింది. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి బుధవారం నగరంలోని రవీంద్రభారతిలో నవకళా వేదిక ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు. కోవిడ్ సమయంలో జిల్లా ఆస్పత్రితో పాటు కిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు వైద్యం అందించిన డాక్టర్ సరితను వైద్య శిరోమణి అవార్డుకు ఎంపిక చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా ఆమెకు అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సుందరం, దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. షాద్నగర్కు మాజీ మంత్రి షాద్నగర్: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న మైనార్టీ నేత అంజద్ ఘోరి నివాసానికి బుధవారం మాజీ హోంమంత్రి మహమూద్ అలీ విచ్చేశారు. ఇటీవల అంజద్గోరి కుమారుడి వివాహం జరిగిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ముస్లిం మైనార్టీ నాయకులు మహమూద్ అలీని ఘనంగా సన్మానించారు. యూజీడీ నిర్మాణానికి వినతి షాద్నగర్: భగత్సింగ్ కాలనీలో డ్రైనేజీ నిర్మించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కోరారు. ఈ మేరకు బుధవారం వారు క్యాంపు కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. రామకృష్ణ థియేటర్, కటిక కేరి, పద్మావతీ కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు భగత్సింగ్ కాలనీ మీదుగా వెలుతోందని.. వర్షాలు కురిస్తే డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి మురుగు వస్తుందన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ కౌన్సిలర్ సరిత, యాదగిరి యాదవ్, కాలనీ వాసులు వెంకటేశ్ యాదవ్, రోమియో రమేశ్, మహేందర్, శ్రీనివాస్, నర్సింలు తదితరులు ఉన్నారు. జాతీయ సదస్సుకు కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ కొత్తూరు: హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ పట్టణంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సుకు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ డోలి రవీందర్కు ఆహ్వానం అందింది. బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ ప్రజాస్వామ్యం, దేశనిర్మాణంలో పట్టణ, స్థానిక సంస్థల పాత్ర’అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు, పట్టణాలు, స్థానిక సంస్థల చైర్మన్లు పాల్గొంటారని చెప్పారు. ఈ మేరకు తమకు మున్సిపల్ పరిపాలన విభాగం నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. -
తీరని దాహం
మున్సిపాలిటీల్లో తాగునీటి కటకట ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక ఇక్కట్లు ● శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్న మున్సిపల్ వాసులుట్యాంకర్లే ఆధారం చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీలో 12 గ్రామాలు విలీనమయ్యాయి. ఇక్కడ మిషన్ భగీరథ నీరే ప్రధాన వనరు. నీటి సరఫరాలో ఆటంకాలు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి పోవడంతో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. గతంలో ఉన్న బోరుబావులకు మోటార్లు బిగించి అవసరమైన సమయాల్లో నీరు వదలాలని మున్సిపల్ వాసులు కోరుతున్నారు. వేసవిలో ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు మోటార్ల ఏర్పాటుకు కృషి చేస్తామంటున్నారు. -
రాజ్యాంగ రక్షణకే కాంగ్రెస్ పోరాటం
చేవెళ్ల: రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్ పోరాడుతోందని.. ఈ నెల 4వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న జైబాపు, జై భీం, జై సంవిధాన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, చేవెళ్ల పార్టమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బొంతు రామ్మోహన్, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయుకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుక్రవారం నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విదివిధానాలపై వివరిస్తారని చెప్పారు. గ్రామ స్థాయి నాయకులతో సమ్మేళనం తుక్కుగూడ: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న నిర్వహించనున్న కాంగ్రెస్ గ్రామస్థాయి నాయకుల సమ్మేళనం విజవయంతం చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ ముఖ్యనాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. రేపు నిర్వహించనున్న సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గ్రామస్థాయి నాయుకులకు పార్టీబలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారని వివరించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్, టీపీసీసీ ఉపాధ్యాక్షుడు బొంతు రామ్మోహన్, నాయకులు దేప భాస్కర్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయాలి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బొంతు రామ్మోహన్,నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి -
నిధులున్నా.. పనులు సున్నా
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలో కొన్ని కాలనీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. మున్సిపల్ పరిధిలో దాదాపు 20 వేల జనాభా ఉండగా ప్రతిరోజు 25 లక్షల లీటర్ల నీరు అవసర పడుతుంది. మిషన్భగీరథ పథకం ద్వారా ప్రతిరోజూ 20 లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. మిగతా నీటిని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బోర్లద్వారా ప్రజలకు అందిస్తున్నారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీ వాసులు మిషన్ భగీరథ నీరు సరఫరాకు ఏళ్ల నుంచి విన్నవిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో నల్లా కనెక్షన్ లేక సొంత బోర్ల నీటినే వాడుకుంటున్నారు. పట్టణంలో నూతన పైప్లైన్ నిర్మాణం, తాగునీటి కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.32 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు స్పందించి అన్ని కాలనీలకు నీరు అందించాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ నీరు అందించాలి ఆమనగల్లు పట్టణంలోని విద్యానగర్ కాలనీకి మిషన్ భగీరథ నీరు అందించాలి. మిషన్భగీరథ నీరు అందించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఏళ్ల నుంచి కోరుతున్నాం. ఇంతవరకు అందించలేదు. కాలనీలో ఉన్న బోర్లద్వారానే నీటిని వాడుకుంటున్నాం. – పాషా, విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు -
‘ముసురు’తున్న వ్యాధుల ముప్పు!
నిధుల దుర్వినియోగం.. షాద్నగర్ పోస్టాఫీస్లో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 8లోuసాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుకుంటున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా పలువురు దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వనస్థలిపురం, కొండాపూర్ సహా జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సాధారణ ఓపీల్లో కన్పించే రోగుల్లో 40 శాతం మంది(పెద్దలు, చిన్నారులు)జ్వరపీడితులే. ఇవి సాధారణంగా కన్పించే లక్షణాలే అయినా.. అప్రమత్తత అవసరం’అని మహేశ్వరం మెడికల్ కళాశాల అనుబంధ(వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ స్పష్టం చేశారు. ఏమాత్రం అలసత్వం వహించినా.. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరక తప్పదని హెచ్చరించారు. బుధవారం ఆయన సీజనల్ వ్యాధులపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు అవసరమైన మందులను అందజేస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్వాలిఫైడ్ వైద్యుడితో చికిత్సలు చేయించుకోవడం ఉత్తమం’అని చెప్పారు. వైరస్ వ్యాప్తికి అనుకూలం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి, గాల్లో తేమశాతం పెరగడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. శరీరం ఈ మార్పులకు అలవాటు పడేందుకు కొంతసమయం పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్లూ కారక వైరస్లు సులభంగా వ్యాపిస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురవుతుంటారు. ఈ లక్షణాలతో కన్పించే పిల్లలను బడికి పంపకపోవడం ఉత్తమం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం వంటి స్వీయ జాగ్రత్తలతో సీజనల్ వ్యాధులు దరి చేరకుండా చూసుకోవచ్చు. పొంచి ఉన్న డెంగీ ముప్పు చిరుజల్లులకు ఇంట్లోని పూల కుండీలు, ఇంటిపై ఖాళీ డబ్బాలు, మూతల్లేని ట్యాంకుల్లో వర్షపు నీరు నిల్వ ఉంటుంది. దీంతో డెంగీ కారక దోమలు పగటిపూట పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తుంటాయి. విపరీతమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న బాధితుల్లో ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా పడిపోతోంది. ప్లేట్లెట్స్ సంఖ్య భారీగా పడిపోవడంచికిత్సలో జాప్యం కారణంగా ఒక్కోసారి ప్రాణాల మీదికొస్తుంది. మస్కిటో కాయిల్స్, మస్కిటో మ్యాట్, కిటికీలకు జాలీలను ఏర్పాటు చేసుకోవడం, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం, దోమ తెరలను వాడటం వంటి స్వీయ జాగ్రత్తలతో డెంగీని దరిచేరనీయకుండా చూసుకోవచ్చు. బయటి ఆహారం వద్దు ప్రస్తుతం చెరువుల్లోకి వచ్చే నీటివరదతో పాటే బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా శుద్ధి చేయని ఈ నీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కలుషిత నీటిని తాగడంతో వాంతులు, విరేచనాల బారిన పడుతుంటారు. వీధుల్లోని చిరుతిళ్లు, పానీపూరి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకొవద్దు. తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమం. కాచి చల్లార్చిన నీటిని సేవించడం, సి విటమిన్ లభించే పండ్లను తీసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని మహేశ్వరం మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిగా కేటాయించారు. ఇక్కడ 11 విభాగాల్లో 17 మంది ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రోగుల నిష్పత్తి మేరకు స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లను నియమించారు. గతంలో ఔట్ పేషెంట్ విభాగంలో రోజుకు సగటున 250–300 మంది వస్తే.. ప్రస్తుతం 800 మందికిపైగా వస్తున్నారు. 220 పడకలు, మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ విభాగాలున్నాయి. ఎంత మంది వచ్చినా మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు పొందొచ్చు. వైద్య సేవల్లో ఏ చిన్న సమస్య ఎదురైనా స్వయంగా వచ్చి సూపరింటెండెంట్ను కలువచ్చు. చాపకింది నీరులా విస్తరిస్తున్న డెంగీ, డయేరియా, వైరల్ జ్వరాలు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల క్యూ స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష : మహేశ్వరం మెడికల్ కళాశాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్నాలుగు నెలల ఓపీ వివరాలు మాసం ఓపీ మార్చి 16,130 ఏప్రిల్ 12,645 మే 22,716 జూన్ 22,668 -
● ‘భగీరథ’ కష్టాలు
మొయినాబాద్: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి తాగునీటి సరఫరా చేస్తున్నా నీటి కష్టాలు మాత్రం తప్పడంలేదు. అక్కడక్కడ మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలి లీకేజీ అయ్యి నీరు వృథాగా పారుతోంది. మున్సిపల్ కేంద్రంలోని లక్ష్మీగణపతినగర్ కాలనీ, భరద్వజ్ కాలనీ, ముస్తాఫాహిల్ కాలనీలకు నీటి సరఫరా సరిగా అందడంలేదు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాకపోవడంతో బోర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నా అవి కూడా సరిపోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ముర్తూజగూ డకు వెళ్లే భగీరథ పైప్లైన్ పగలడంతో గ్రామానికి నీళ్లు అందడం లేదు. బోర్లద్వారా నీటిసరఫరా చేస్తున్నారు. అజీజ్నగర్ హరిజనవాడలో మిషన్భగీరథ నీళ్లు ట్యాంకులోకి ఎక్కడంలేదు. హిమాయత్నగర్, మొయినాబాద్, అజీజ్నగర్లో తరచూ మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలి నీళ్లు లీకవుతున్నాయి. -
ఎల్లమ్మ కల్యాణం.. ఉప్పొంగిన భక్తిభావం
అమీర్పేట: డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు.. ఎల్లమ్మ నామస్మరణలు మార్మోగాయి. ఆలయ పుర వీధులు పసుపుమయంగా మారాయి. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉదయం 4 గంటలకు అభిషేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కల్యాణ వేదికపైకి తీసుకువచ్చారు. ఉత్తరా నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న సుముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య 11.51 గంటలకు కల్యాణం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నామని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కల్యాణాన్ని తిలకించిన ప్రముఖులు.. అమ్మవారి కల్యాణ మహోత్సవానికి పలువురు ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, మల్లారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ దాసరి హరిచందన, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీజీ సౌమ్య మిశ్రా, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, అమీర్పేట కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, ఈఓ మహేందర్ గౌడ్, చైర్మన్ సాయిబాబా గౌడ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, జోగిని శ్యామల, కోట నీలిమ, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు రాజేంద్రనగర్: అదృశ్యమై యువకుడు హిమాయత్సాగర్లో శవమై తేలిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హిమాయత్సాగర్కు చెందిన ముఖేశ్ (35) జూలాయిగా తిరుగుతున్నాడు. గతంలో వివాహం జరిగినా అతను మద్యానికి బానిస కావడం, చిల్లర దొంగతనం చేస్తుండటంతో భార్య అతడి నుంచి దూరంగా ఉంటోంది. గత నెలలో అతను కిస్మత్పూర్ ప్రాంతంలోని ఓ ఆన్లైన్ క్యాష్ సెంటర్ నుంచి నగదు తీసుకుని పరారయ్యాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ముఖేశ్ మంగళవారం హిమాయత్సాగర్లో శవమై తేలాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు ఆలయాల్లో చోరీ
ఇబ్రహీంపట్నం: డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో రెండు ఆలయాల్లో విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని పోల్కంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామంలోని రామాలయంలో సీతారామలక్ష్మణ స్వాముల వారి పంచలోహ విగ్రహాలు, గంగాదేవి ఆలయంలో పెద్దమ్మ తల్లి, గంగాదేవి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రామాలయంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశిలీంచగా ఓ దొంగ విగ్రహాన్ని సంచిలో పెట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనుమానితులు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం.పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు -
సిగ్గుపడాల్సింది పోయి దాడులు చేస్తారా
షాద్నగర్ రూరల్: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు సిగ్గు పడాల్సిందిపోయి దాడులు చేస్తామని మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన కన్హశాంతి వనంకు వెళ్తున్న ఆయనకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారు ఎవరైనా ప్రభుత్వం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనంతరం ఆయన జూనియర్ కళశాల భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కళశాల నిర్మాణం ఓ మహత్తర కార్యక్రమని ఎమ్మెల్యే గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్నారని శభాష్ శంకర్ అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీఖాన్బాబర్, నాయకులు తిరుపతిరెడ్డి, రఘునాయక్, ఎండీ.ఇబ్రహీం, కృష్ణారెడ్డి, బస్వం, మోహన్, ముబారక్అలీ, మురళీమోహన్, సీతారాం, అశోక్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు -
విద్యతోనే అంతరాలు లేని సమాజం
మంచాల: విద్య సమాజాభివృద్ధికి తోడ్పాటునిచ్చేలా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న పనులు, బోధన తీరు, ఉపాధ్యాయుల కృషిని తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ప్రజల మధ్య అంతరాలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, ఉపాధ్యక్షురాలు మంగ, సభ్యులు నాగమణి, ధనమూర్తి, జగన్నాథ్ ఆరుట్ల ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, సుప్రియ, మోహన్ గౌడ్, పేరెంట్స్ కమిటీ సభ్యులు భాస్కర్, రాజు, ఎం.డీ.జానీ పాష, జంగయ్య, జంగయ్య, మల్లేశ్, పార్వతి, జ్యోతి, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, కిషన్ చౌహాన్, శ్రీకాంత్, జహీర్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి -
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
హయత్నగర్: గాలి వానకు విద్యుత్ తీగలు తెగిపడి రెండు గేదెలు మృతి చెందిన సంఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూరులో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. టెలిఫోన్ కాలనీలో తొర్రూరుకు చెందిన మేకం నాగయ్య తన రెండు గేదెలను కట్టేసి ఉంచాడు. మంగళవారం సాయంత్రం వచ్చిన గాలి వానకు దగ్గరలోని విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఒక గేదె తీగలకు తాకి షాక్కు గురై కిందపడింది. అది చూసిన మరో గేదె దాని దగ్గరకు వచ్చింది. దీంతో రెండు షాక్తో మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షలు నష్ట పోయినట్లు రైతు లబోదిబోమంటున్నాడు. -
మహేశ్వరంలో ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్’
మహేశ్వరం: మండల పరిధిలోని కేసీ తండా ఎలక్ట్రానిక్ పార్కులో మరో భారీ పరిశ్రమ రూపుదిద్దుకుంది. సుమారు రూ.750 కోట్ల నిధులతో 3.7 ఎకరాల విస్తీర్ణంలో 2.3లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తయారీ పరిశ్రమ ఆవిష్కరణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు యాజమాన్యం యోచిస్తోంది. ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 700 మంది స్థానికులకు ఉపాధి ఇక్కడ పూర్తి స్థాయి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, డిజైనింగ్ స్టూడియో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యూనిట్లో ఆటోమేటెడ్ గిడ్డంగి సౌకర్యం ఉంది. కంపెనీలో 33 శాతం గ్రీనరీని ఏర్పాటు చేశారు. ఏడాదికి సుమారు పది టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలు తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్ సొంతం. ఇటలీ, అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన పరిశ్రమ నిపుణుల సహకారంతో సీఎన్సీ యంత్రాలు, తాజా సాంకేతికతో కూడిన గొలుసు తయారీ, లేజర్ కట్ యంత్రాలున్నాయి. సుమారు 700 మంది స్థానికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. 2022లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఈ కంపెనీకి శంకుస్థాపన చేఽశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 14 కంపెనీలున్నాయి. దేశంలో ఎనిమిది చోట్ల మలబార్ పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తదితరులు హాజరుకానున్నారు. రూ.750 కోట్ల పెట్టుబడితో అతి పెద్ద ఆభరణాల తయారీ పరిశ్రమ రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
ఖర్చుకు వెనుకాడొద్దు
నిధులు మంజూరు బాధ్యత నాది ● కలెక్టర్ నారాయణరెడ్డి ● వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోఆకస్మిక తనిఖీ ● సమస్యలు వివరించిన మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి వైద్య సిబ్బంది సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘కోవిడ్ సమయంలో ఆస్పత్రి భవనంపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డు పైకప్పు లీకేజీ అవుతోంది. సిటీ స్కాన్ మంజూరైనప్పటికీ.. స్థలాభావ సమస్యతో ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. టెక్నీషియన్లు అందుబాటులో లేరు. రక్తనిధి కేంద్రం లేకపోవడంతో రక్తస్త్రావంతో బాధపడుతున్న రోగులకు సత్వర సేవలు అందించలేకపోతున్నాం. వైద్యుల నిష్పత్తి మేరకు గదులు లేకపోవడంతో ఔట్ పేషంట్ విభాగానికి వచ్చే రోగులకు సేవలు అందించలేని పరిస్థితి తలెత్తుతోంది’అంటూ మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి (వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి) వైద్య సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వైద్యులు, సిబ్బంది చెప్పిన అంశాలను కలెక్టర్ సావధానంగా ఆలకించారు. ‘ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించే బాధ్యత నాదీ.. అయితే ఆస్పత్రికి ఆపదలో వచ్చిన నిరుపేద రోగులకు సత్వర, మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత మీదే’అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీ.. వైద్యసేవలపై ఆరా మంగళవారం వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్, ఇన్ పేషంట్ విభాగాలు సహా ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలు చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది రోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 100 నుంచి 200 పెంచారు కానీ..అనువైన స్థలం లేక అదనపు పడకలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు స్పష్టం చేయగా, ఆస్పత్రి భవనం పై అంతస్తులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డుకు తక్షణమే రిపేర్లు చేసి, రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు ఎంత ఖర్చైనా వెనుకాడొద్దన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీటీస్కాన్ పెట్టండి.. టెక్నీషియన్లను తీసుకోండి మెడికల్ కాలేజీ నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ిసీటీస్కాన్ ఏర్పాటు చేయాల్సి ఉందని, 2024లోనే సీటీస్కాన్ మంజూరైందని, ఆస్పత్రిలో అనువైన స్థలం లేక ఏర్పాటు చేయలేకపోయినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆస్పత్రి ఆవరణలోని ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ డిస్పెన్సరీలను పక్కనే ఉన్న వార్డు ఆఫీసుకు తరలించి, ఆ ఖాళీ ప్రదేశంలో సీటీస్కాన్ ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. రక్తనిధి కేంద్రం ఏర్పాటు సహా అవసరమైన టెక్నీషియన్లను ఔట్సోర్సింగ్ ప్రతిపాదికను నియమించుకోవాలని ఆదేశించారు. రోగులకు సేవలు అందించే విషయంలో రాజీపడొద్దన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యలోపం, తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, అదనపు డీఎండీ డాక్టర్ వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, వైస్ ప్రిన్సిపాల్ తఖీయుద్దీన్, ఆర్ఎంఓలు జయమాల, రాజ్కుమార్, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చీఫ్ ఇంజనీర్ దేవేందర్, ఈఈ అజీజ్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తదితరులు ఉన్నారు. -
● నిర్వహణ లోపం.. వెలగని వీధి దీపం
ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీలో 4,313 వీధి దీపాలు ఉండగా సెంట్రల్ లైటింగ్ 650, హైమాస్ట్ లైట్లు 20 ఉన్నాయి. నిర్వహణ లోపంతో తరచూ వీధిలైట్లకు అంతరాయం కలుగుతోంది. శ్రీ ఇందు కళాశాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రధాన రహదారిపై అమర్చిన సెంట్రల్ లైటింగ్ పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడు లైట్లు వస్తాయో, పోతాయో తెలియని పరిస్థితి. తరచూ లైట్లు, వైర్లు ఖాళీపోయి, చెడిపోతుండటంతో రాత్రివెళ ఆ రహదారిలో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ యార్డు వెనుక ఉన్న పలు కాలనీలతోపాటు కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో విద్యుత్ స్తంభాలు లేక వీధిలైట్లను అమర్చడం లేదు. ఆయా కాలనీల్లో రాత్రి వేళ అంధకారం అలముకుంటోంది. -
● ఏడేళ్లయినా రోడ్లే లేవు.. లైట్లే వెలగవు
శంకర్పల్లి: మున్సిపాలిటీ ఏర్పడి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా పట్టణంలోని కొన్ని కాలనీలకు సరైన రోడ్లు లేవు. వర్షాకాలంలో స్థానికులు పడే బాధ వర్ణణాతీతం. ఇప్పటికే పలువురు కమిషనర్లకు విన్నవించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రూ. 4కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో సింగాపురం, రిత్విక్ వెంచర్, చిన్న శంకర్పల్లి, సాయినగర్ కాలనీ, ఫత్తేపూర్లో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. బుల్కాపూర్, కొత్తగా ఏర్పాటైన బ్లూవుడ్స్ కాలనీ, రెడ్డి కాలనీ, మైనార్టీ కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, ఎస్ఎం గార్డెన్స్ ప్రాంతాల్లో మరిన్ని రోడ్లు వేయాల్సి ఉంది. మున్సిపల్ పరిధిలో చాలావరకు వీధి లైట్లు వెలగడం లేదు. శంకర్పల్లి చౌరస్తా నుంచి బుల్కాపూర్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, ఫత్తేపూర్ రైల్వే బ్రిడ్జిపై వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ యోగేశ్ని వివరణ కోరగా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
ఖర్చుకు వెనుకాడొద్దు ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించే బాధ్యత తనదని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 20258లోuఅంతర్గత రోడ్లు అధ్వానం మొయినాబాద్: మున్సిపల్ పరిధిలో అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. మున్సిపల్ కేంద్రంలోని స్టార్ కాలనీ, ముస్తఫా హిల్స్ కాలనీ, భరద్వజ్ కాలనీ, సహారా కాలనీ, విజయనగర్ కాలనీల్లో అంతర్గత రోడ్లు సరిగా లేవు. మురుగునీరు రోడ్లపై పారడంతో గుంతలమయంగా మారి నడవలేని పరిస్థితి నెలకొంది. చిన్నషాపూర్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్నగర్, హిమాయత్నగర్, సురంగల్ గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు అంతర్గత రోడ్లు సైతం దెబ్బతిన్నాయి. వర్షాలు పడినప్పుడు రోడ్డుపై గుంతల్లో వర్షం నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. స్థానిక ప్రజలతోపాటు ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వీధిదీపాల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. కొన్నిచోట్ల గతంలో ఏర్పాటు చేసిన వీధిదీపాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని చెడిపోయాయి. వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ కొన్నేళ్లుగా వెలగడంలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రి సమయంలో అంధకారం నెలకొంటోంది. న్యూస్రీల్ -
ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలు
● తలకొండపల్లి తహసీల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ దాడులు ● లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, అటెండర్ ఆమనగల్లు: ఏసీబీ అధికారులు నిత్యం దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అవినీతి అధికారులు మాత్రం లంచం తీసుకోవడం మానడం లేదు. మంగళవారం ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ తహసీల్దార్, అటెండర్ ఏసీబీకి పట్టుపడ్డారు. వివరాలు.. తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన ఓ రైతు తన తల్లిపేరిట ఉన్న 22 గుంటల భూమిని తనతోపాటు తన సోదరుల పేరిట మార్చాలని తహసీల్దార్ను ఆశ్రయించాడు. ఇందుకు అక్కడి అధికారులు రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రైతు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రూ.10 వేలు ఇస్తుండగా తహసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. టపాసులు కాల్చి రైతుల సంబురాలు తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఏ చిన్నపని కావాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే అని పలువురు ఆరోపించారు. తహసీల్దార్ నాగార్జున లంచటం తీసుకుంటూ అధికారులకు చిక్కడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. -
ఆర్టీసీని రక్షించుకుంటాం
● కార్మికులను గుండెల్లో పెట్టుకుంటాం ● మంత్రి పొన్నం ప్రభాకర్ హయత్నగర్: ఆర్టీసీని రక్షించుకుంటామని, సంస్థను లాభాల్లోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని మునుగనూరులో మంగళవారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదవాడికి రవాణా సౌకర్యం కల్పించేది ఆర్టీసీ బస్సు మాత్రమేనని అలాంటి బస్సులను నడిపి సేవలు అందిస్తున్న కార్మికులను గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బస్సులు కొంటున్నామని, పీఆర్సీ ఇచ్చామని, కారుణ్య నియమకాలు చేపట్టామని, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఆర్టీసీ పురోగమిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పును మిగిల్చిన గత ప్రభుత్వం ఆర్టీసీని దివాలా తీయించిందని విమర్శించారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారికి అండగా ఉంటామన్నారు. రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు విశ్రాంత కార్మికుల భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
● మట్టిరోడ్లే దిక్కు.. పట్టని వీధి దీపాలు
షాద్నగర్: పట్టణంలో నూతనంగా ఏర్పడిన పలు కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్నా సీసీ రోడ్లు లేకపోవడంతో యజమానులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న మట్టిరోడ్లు వర్షాలకు దెబ్బతిని గుంతలు తేలడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. శివారులో ఉన్న చాలా కాలనీల్లో వీధిదీపాలు సరిగా లేక రాత్రి సమయాల్లో అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. రాత్రిళ్లు మహిళలు ఒంటరిగా బయటికి రావడానికి జంకుతున్నారు. వీధిదీ పాల నిర్వహణ ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీ వారికి మున్సిపా లిటీ లక్షల్లో బాకీ ఉండటంతో పట్టించుకోవడం లేదు. -
ముగ్గురు బాలకార్మికులకు విముక్తి
ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ ప్రైవేటు పరిశ్రమల్లో పని చేస్తున్న ముగ్గురు బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. ఆపరేషన్ ముస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. తుర్కయంజాల్ సమీపంలోని పలు పరిశ్రమల్లో పని చేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని హోంకు తరలించారు. యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి తుర్కయంజాల్: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ పిలుపునిచ్చారు. తుర్కయంజాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు రమేష్, బాల నరసింహ, అనిత, శోభ, సునీత, హేమలత తదితరులు పాల్గొన్నారు. యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు ఎంపిక కడ్తాల్: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎంపికై ంది. ఈ మేరకు మంగళవారం సీజీఆర్ సంస్థ కోఆర్డినేటర్ రజనీకాంత్ పాఠశాలను సందర్శించి బేస్లైన్ సర్వే నిర్వహించారు. పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలను హెచ్ఎం జంగయ్యను అడిగి నమోదు చేసుకున్నారు. పాఠశాలలో హార్వెస్టింగ్ పిట్, కంపోస్ట్ పిట్, డిక్లేర్ నో ప్లాస్టిక్ జోన్, డిక్లరేషన్ ఆఫ్ మథర్ ట్రీ, కిచెన్ గార్డెన్, సాయిల్ అండ్ సీడ్ మ్యూజియం, మెడిసినల్ గార్డెన్, రెన్యూవల్ ఎనర్జీ సోలార్, ప్లాంటేషన్, ప్రిపరేషన్ ఆఫ్ విలేజ్ జియోగ్రఫీ, మ్యాపు అండ్ రిపోర్టు, ప్లాంటేషన్ వంటి కార్యక్రమాల నిర్వహణకు తోడ్పడుతున్నందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రం తీరుతోనే తెలంగాణకు అన్యాయం షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో అధిక శాతం తెలంగాణ నుంచి వెళ్తున్నాయని, బడ్జెట్లో మాత్రం మొండిచెయ్యి చూపిస్తోందని విమర్శించారు. మెట్రో, ఆర్ఆర్ఆర్, మూసీనదీ ప్రక్షాళన, తదితర అభివృద్ధి పనులకు సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈనెల 4న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ విచ్చేస్తున్నారని, ఇందులో భాగంగా గ్రామస్థాయి నేతలతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చల్లా శ్రీకాంత్రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్రెడ్డి, వీరేశం, రాజు, నర్సింలు, సుదర్శన్గౌడ్, బాల్రాజుగౌడ్, ఇబ్రహీం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మహేశ్వరంలో ‘మలబార్’ మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండా ఎలక్ట్రానిక్ పార్కులో మరో భారీ పరిశ్రమ రూపుదిద్దుకుంది.
8లోuఖర్గే సభను విజయవంతం చేయాలి జిల్లా నేతలతో పీసీసీ చీఫ్ భేటీ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎల్బీ స్టేడియం వేదికగా ఈ నెల 4న నిర్వహించ తలపెట్టిన కార్యక్రమంలో ‘గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీ’ సభ్యులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారని, ఆ మేరకు జిల్లా కేడర్ సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి మంగళవారం ఆయన జిల్లా ముఖ్య నేతలతో గాంధీభవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు పాల్గొనే ఈ బహిరంగ సభను జిల్లా కేడర్ సీరియస్గా తీసుకోవాలని, భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి కేడర్ను సభకు భారీగా తరలించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజ్య సభ సభ్యుడు అనిల్కుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, చైర్మన్ ఫహీం ఖురేషి, చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, చేవెళ్ల పార్టీ ఇన్చార్జి భీం భరత్, పీసీసీ ఉపాధ్యక్షుడు వేణు గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, తదితరులు పాల్గొన్నారు. కీలకమైన ఈ సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన సోదరుడు మల్రెడ్డి రాంరెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు కేశంపేట: తక్కువ నీటి సాంధ్రతతో అధిక దిగుబడులు వచ్చే ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ సూచించారు. మండల పరిధిలోని వేములనర్వ శివారులో సాగవుతున్న ఆయిల్పామ్ను మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, రైతులు పండించిన పంటను ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మండల పరిధిలోని అల్వాల రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో రైతులకు శాస్త్రవేతలు సలహాలు, సూచనలు చేశారు. రైతు గుర్తింపు కార్డుల నమోదుపై ఏఈఓలతో రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఓ శిరీష, హెచ్ఓ హిమబిందు, ఎఈఓలు వినయ్, రాజేశ్వరి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేష్రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూకు సంబంధించి 32, ఇతర శాఖలకు సంబంధించి 41, మొత్తం 73 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.జగన్ డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 2న నిధులు మంజూరు చేస్తామని ప్రకటించి వాయిదా వేయడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పెంచి అర్హులైన వారందరికీ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అలంపల్లి జంగయ్య, గజ్జెల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ● అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ -
చెత్త.. మురుగు
అస్తవ్యస్తంగా మున్సిపాలిటీలుపహాడీషరీఫ్: పెద్ద ఎత్తున మురికివాడలు కలిగిన జల్పల్లి మున్సిపాలిటీలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. చాలా బస్తీల్లో పైప్లైన్లు లేకపోవడంతో ప్రజలు రింగ్లు వేసుకు న్నారు. వ్యర్థజలాలు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో కొన్ని బస్తీల్లో ఇళ్ల మధ్య పారుతున్నాయి. స్థానికులను అనారోగ్యం పాల్జేస్తున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగి 28 వార్డులతో కూడిన ఈ మున్సిపాలిటీలో ప్రైవేట్ ఆటోల ద్వారా రోజు విడిచి రోజు చెత్తను సేకరిస్తున్నారు. జల్పల్లి చెరువు పరిసరాల్లో కాటేదాన్కు సంబంధించిన కంపెనీల నిర్వాహకులు వ్యర్థాలను తీసుకొచ్చి రాత్రి పూట పడేసి పోతున్నారు. ప్రధాన నిత్యం శుభ్రం చేస్తున్నా అంతర్గత బస్తీల్లో మాత్రం మూడు నాలుగు రోజులకోసారి ఊడుస్తున్నారు. లోపించిన పారిశుద్ధ్యం కంపుకొడుతున్న కాలనీలు రోగాల బారిన స్థానికులు మున్సిపాలిటీలను పారిశుద్ధ్య సమస్య పట్టి పీడిస్తోంది. రోడ్లపక్కన చెత్త కుప్పలుగాపేరుకుపోయి కాలనీలు కంపు కొడుతున్నాయి. నిత్యం వీధులను శుభ్రం చేయాల్సి ఉండగా సిబ్బంది కొరతతో వారం పది రోజులకోసారి ఊడుస్తున్నారు. ఇంటింటికీ జరగాల్సిన చెత్త సేకరణ సైతం సరిగా జరగడం లేదు. దీంతో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పడేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపైనే, ఇళ్ల మధ్య నుంచే మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షాకాలం కావడంతో ఈగలు, దోమలు వ్యాపించి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
4, 5 తేదీల్లో కేవీపీఎస్ శిక్షణ తరగతులు
తుర్కయంజాల్: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 4, 5 తేదీల్లో పురపాలక సంఘం పరిధి ఎన్ఎస్ఆర్ నగర్లో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోడ సామేల్, మస్కు ప్రకాష్ తెలిపారు. రాగన్నగూడలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించా రు.శిక్షణ తరగతులకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జె. ఆశీర్వాదం, యాదగిరి, జంగయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి షాద్నగర్రూరల్: అనుమతులు లేకుండా కొనసాగుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్చౌహాన్ డిమాండ్ చేశారు. పట్టణంలోని నారాయణ పాఠశాలవద్ద సోమవారం ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణ, శ్రీచైతన్యవంటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనీస వసతులను కల్పించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్, నోట్బుక్స్, యూనిఫాం విక్రయిస్తూ తల్లిదండ్రుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నాని ఆరోపించారు. విద్యను వ్యా పారంగా మారుస్తున్న విద్యా సంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయిచౌహాన్, విజయ్కుమార్, గణేశ్, వంశీ పాల్గొన్నారు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి మొయినాబాద్: ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమనేత దేశమొళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మున్సిపల్ కేంద్రంలో ఉద్యమకారులు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమకారులను మరవద్దనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకు లు కుమ్మరి రమేష్, భిక్షపతి, మధు, అవినాష్, ముకుందరెడ్డి, బన్సీలాల్, రత్నం, కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయం సందర్శన శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మాసూత్ర మరకత శివాలయా న్ని సోమవారం సినీ నటుడు బాలాజీ దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందని, సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఆల య చైర్మన్ గోపాల్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్రాజు పాల్గొన్నారు. -
సిబ్బంది లేక ఇబ్బంది
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. జనాభాకు అను గుణంగా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారిని నిత్యం శుభ్రం చేస్తున్నా కాలనీల్లో మాత్రం వారం పది రోజులకు ఒకసారి అంతర్గత రోడ్లను శుభ్రం చేస్తున్నారు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో సరైన కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిలుస్తోంది. ఏళ్లక్రితం నిర్మించిన మురుగు కాలువలు దెబ్బతినడంతో నీరు సాఫీ గా వెళ్లకుండా రోడ్లపైకి చేరుతోందని స్థానికులు తెలపారు. ఇంకా ఏడు కిలోమీటర్ల దూరం మురుగు కాలువలు నిర్మించాల్సిఉందని అధికారులు చెబుతున్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● త్వరలోనే సీఎం చేతులమీదుగా కొహెడ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్మెట్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో సోమవారం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు త్వరలో చేపట్టబోయే కొహెడ మార్కెట్ నిర్మాణ ప్రాజెక్టు పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో కోహెడలో నిర్మించబోయే ఆసియాలో అతిపెద్ద మార్కెట్ నిర్మాణానికి త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుందని పేర్కొన్నారు. కోహెడ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు లభించడంతో పాటు రైతులు, వ్యాపారులు, ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందన్నారు. మార్కెట్కి వచ్చే ప్రతి రైతుకు న్యాయం చేసేలా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. అధిక కమీషన్లు వసూలు చేసే మార్కెట్ వ్యాపారులను బ్లాక్ లిస్టులో పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు పాలకవర్గంతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి మహ్మద్ రియాజ్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, వైస్ చైర్మన్ భాస్కర్చారి, డైరెక్టర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కొందుర్గు: ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి సురేశ్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’దినపత్రికలో ‘కొరత చూపి..రైతులను దోచేసి..’అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించి కొందుర్గు రైతువేదికలో ఎరువులు, విత్తనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, రైతులకు విధిగా రసీదులు ఇవ్వాలని సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ సందర్బంగా పలువురు డీలర్లు మాట్లాడుతూ.. తమకు హోల్సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకన్నా అధికంగా ఎరువులను విక్రయిస్తున్నారని, దీనికితోడు రవాణా, హమాలి ఖర్చులు అధికమవుతున్నాయని వాపోయారు. ఎరువులు అమ్మడం వల్ల నష్టాలపాలవుతున్నామని వాపోయారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు మల్లారెడ్డి, శంకర్ రెడ్డి, యాదయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సేకరణ లేక.. రోడ్ల పక్కన చేరిక
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లపక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి కనిపిస్తోంది. ఇళ్ల ముందుకు చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రాకపోవడంతో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పడేస్తున్నారు. చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణ కేంద్రంలోని పలు కాలనీల నుంచి వెళ్లే అండర్గ్రౌండ్ డైనేజీ కాలువ ప్రధాన రోడ్డు పక్కనే ఓపెన్గా ఉంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో ఇంకా పాలకవర్గం కొలువుదీరలేదు. అధికారులే ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే అంగడిబజార్, హౌసింగ్ బోర్డు, మల్కాపూర్ తదితర చోట్ల డ్రైనేజీ సమస్యలు గుర్తించిపరిష్కరించామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
అబ్దుల్లాపూర్మెట్: రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హయత్నగర్లోని తొర్రూర్ క్రాస్ రోడ్డులో నివాసముండే దారమల్ల అశోక్ (27) ఆదివారం సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్లోని జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి వచ్చాడు. రాత్రి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రామోజీ ఫిల్మ్సిటీ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అశోక్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురికీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కార్మికుడి బలవన్మరణం పహాడీషరీఫ్: ఉరేసుకుని ఓ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ఎల్.వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. యూపీ రాష్ట్రానికి చెందిన రాంబోలి కుమారుడు పంకజ్(25) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి బోరబండలో నివాసం ఉంటున్నాడు. తుక్కుగూడ సర్దార్నగర్లో మార్బుల్స్ బండల పాలిష్ చేసేందుకు గుత్తేదారు వద్దకు వచ్చాడు. ఉదయం 11 గంటల సమయంలో సమీపంలో ఓపెన్గా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి వేప చెట్టుకు టవల్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. అయ్యప్ప స్వామి సన్నిధానంలో విగ్రహాల చోరీ ఇబ్రహీంపట్నం: అయ్యప్పస్వామి సన్నిధానంలో పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన ఘటన మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చందర్ సింగ్ తెలిపిన ప్రకారం.. దండుమైలారం శివారులో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధానం డోర్ గడియను పగులగొట్టి లోనికి దూరిన గుర్తు తెలియని దుండగులు ఒక వెండి, ఐదు పంచలోహ విగ్రహాలు, గ్యాస్ సిలిండర్, వంట సామగ్రిని ఎత్తుకెళ్లారన్నారు. వాటి విలువ సుమారు రూ.1.20 లక్షల మేర ఉంటుందన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మెడికల్ కౌన్సిల్ దాడులు
● అనుమతులు లేని ఆస్పత్రులపై కొరడా ● తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. విద్యార్హతలు అసలే లేవు. అయినా వైద్యులుగా చలామణి అవు తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కొరడా ఝులిపించారు. సోమవారం షాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్యుల బృందం ఏడు క్లినిక్లపై కేసులు నమోదు చేసింది. ఓం సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శ్రావణ్ ఫస్ట్ఎయిడ్ సెంటర్, మధు శ్రీ క్లినిక్, ముస్తాఫా క్లినిక్, మాస్టర్ క్లినిక్, శ్రీ సాయితిని, జంజం క్లినిక్లకు అనుమతులు లేవని గుర్తించింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.మహేశ్కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జంజం క్లినిక్లో వందల సంఖ్యలో డైకోఫెన్స్ సోడియం ఇంజక్షన్లు, కాల్షియం గ్లూకోనేట్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు గుర్తించినట్టు తెలిపారు. కనీస అర్హత లేకుండా అల్లోపతి దవాఖానా నిర్వహిస్తున్నారని అన్నారు. రోగంతో సంబంధం లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మాత్రలను అధిక మోతాదులో ఇస్తున్నారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేసినట్లైతే ఎన్ఎంసీ చట్టం 34, 35 ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తామని వెల్లడించారు. మెడికల్ స్టోర్స్లో క్వాలిఫైడ్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్లు లేకుండా యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్, ఇతర షెడ్యూల్ డ్రగ్స్ విక్రయిస్తునట్టు గుర్తించామని తెలిపారు. సంబంధిత రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లపై డ్రగ్ కంట్రోల్ అథారిటీతో పాటు ఫార్మసీ కౌన్సిల్కి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. -
‘డబుల్’.. లబ్ధిదారులకు ట్రబుల్!
మంచాల: అనధికారికంగా డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వచ్చిన లబ్ధిదారులపై కేసులు నమోదు చేశామని మంచాల సీఐ మధు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని లింగంపల్లి గేట్ వద్ద గత ప్రభుత్వం 96 డబుల్ ఇళ్లను నిర్మించింది. వాటిలో మంచాల, నోముల, లింగంపల్లి గ్రామాలకు 30 చొప్పున లాటరీ పద్దతిలో 90మంది లబ్ధిదారులను గుర్తించారు. మరో ఐదు ఇళ్లు గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చెన్నారెడ్డిగూడ గ్రామస్తులకు కేటాయించగా.. మరొకటి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతుకు కేటాయించారు. మరో 20 మందిపై కేసు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు ప్రకటించినప్పటికీ అధికారికంగా ప్రొసీండింగ్లు ఇవ్వలేదు. ఇంతలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. నాటి నుంచి మూడు, నాలుగు దఫాలు తమకు ఇళ్ల ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారులు అధికారులను కోరారు. తహసీల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నెల 28న ఎమ్మెల్యే పర్యటనలో తమకు ఇళ్లు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఇదేమీ పట్టించుకోనివారు ఈ నెల 29న ఇళ్లలోకి వచ్చారు. అనధికారికంగా ఇళ్లలోకి రావొద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. తాజాగా సోమవారం ఆర్ఆండ్బీ ఏఈ వినోద్ డబుల్ ఇళ్ల పనులు పూర్తవ్వకుండానే ఇళ్లలోకి వచ్చారని మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ మధు, ఏఎస్ఐ సతీశ్, పోలీసు సిబ్బంది డబుల్ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ సూచనలు పాటించకుంటే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో 60 మందిలో 40 మంది అక్కడ నుంచి వెనుదిరిగారు. మరో 20 మందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ వివరించారు. ఇళ్ల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు సీఐ సూచనమేరకు ఖాళీ చేసిన 40 మంది -
నేతాజీ పొదుపు సంఘానికి ఉత్తమ అవార్డు
మహేశ్వరం: సమాఖ్య పొదుపు సంఘంలో సభ్యులకు సక్రమంగా రుణాలు అందజేసి.. సకాలంలో వసూలు చేసినందుకు మన్సాన్పల్లి గ్రామానికి చెందిన నేతాజీ పొదుపు సంఘానికి ఉత్తమ అవార్డు వరించింది. సోమవారం శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకూలలో నిర్వహించిన అభ్యుదయ సమాఖ్య 13వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. తమ సంఘంలో 700 మంది సభ్యులకు గాను రూ.2.70 కోట్లు జమయ్యాయని చెప్పారు. వరుసగా నాల్గోసారి అవార్డు రావడం ఆనందంగా ఉందని సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యుదయ సమాఖ్యా అధ్యక్షుడు నర్సింహ నేతాజీ పొదుపు సంఘం సభ్యులకు జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సమఖ్యా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ చారి, అభ్యుదయ సహాయ సహకార సంఘాల సమాఖ్యా పర్యవేక్షణ అధికారి బాల్రాజ్ గౌడ్, మన్సాన్పల్లి నేతాజీ పొదుపు సంఘం అధ్యక్షుడు దయానంద్ గౌడ్, ఉపాధ్యాక్షుడు శ్రీధర్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్చారి, సహాయ కార్యదర్శి కుమార్ యాదవ్, కోశాధికారి మల్లేశ్ ముదిరాజ్, పాలకవర్గ సభ్యులు పాండయ్య, శ్రీధర్ చారి, ఎండి.హాజీ, వెంకటేశ్ గౌడ్, రాజేశ్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, శేఖర్ పలువురు సభ్యులు పాల్గొన్నారు. వరుసగా నాలుగోసారి కైవసం చేసుకున్న మన్సాన్పల్లి సమాఖ్య సంఘం -
18 లీటర్ల సారా పట్టివేత
ఆటో సీజ్, ఒకరి అరెస్టు ఆమనగల్లు: పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 18 లీటర్ల నాటుసార సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ తెలిపిన ప్రకారం.. వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండా నుంచి మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి నాటుసారా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సీఐ బద్యానాద్ చౌహాన్ ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. పోచమ్మగడ్డ తండా నుంచి కలకొండకు ప్రయాణిస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో తొమ్మిది ప్లాస్టిక్ బాటిల్స్లో 18 లీటర్ల సారా పట్టుబడింది. సారా, ఆటోను సీజ్ చేసి సారా తరలిస్తున్న పాండును అరెస్టు చేశారు. ఈ తనిఖీలో ఎకై ్సజ్ ఎస్ఐ అరుణ్కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, శ్రీను, బాబు, ఆమని, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. గంజాయి ముఠా గుట్టురట్టు ● ముగ్గురు నిందితులకు రిమాండ్ ● పది కిలోల గంజాయి స్వాధీనం శంకర్పల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను సోమవారం రిమాండ్కు తరలించారు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శంకర్గౌడ(27), శ్రీధర్ పరిడా(19), మిని నాహక్(34) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా వీరు తమ రాష్ట్రం నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తీసుకువచ్చి లేబర్ ఏరియాల్లో విక్రయిస్తున్నారు. మిని నాహక్ అనే మహిళ తీసుకువచ్చిన గంజాయిని సోమవారం ముగ్గురు కలిసి శంకర్పల్లి మండలం ఇంద్రారెడ్డినగర్ మీదుగా హైదరాబాద్ వైపు తరలిస్తుండగా రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు, మోకిల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. బీఆర్ఎస్ నాయకులకు బెయిల్ ● రూ.20 వేలతో రెండు పూచీకత్తులు అందజేయాలి ● నాంపల్లి 17వ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశంసిటీ కోర్టులు : మహా న్యూస్ ఛానెల్ కార్యాలయంపై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకులకు సోమవారం నాంపల్లిలోని 17వ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కక్కరూ రూ. 20వేలతో రెండు పూచీకత్తులు అందజేయాలని షరతులు విధించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సదరు న్యూస్ ఛానెల్లో తప్పుడు వార్తలు ప్రచురించారని, అసత్యపు ఆరోపణలతో కేటీఆర్ పరువుకు భంగం కలిగేలా మహా న్యూస్ యాజమాన్యం వ్యవహరించిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం మహా న్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు, కార్యాలయం ముందున్న కార్ల అద్దాలను ధ్వంసం చేశారని పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి తరుఫున బీఆర్ఎస్ లీగల్సెల్ న్యాయవాదులు సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో వారికి రూ.20 వేలతో రెండు పూచీకత్తులు, వ్యక్తిగత బాండ్లను కోర్టులో అందజేయాలని సూచించించిన నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
సాగునీరందించడంలో విఫలం
● పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్ షాద్నగర్రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు అందించడంలో, కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్ ఆరోపించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరుకు సాగునీరు– కాలుష్య పరిశ్రమలపై 5వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల సాధన పోరాటం తొలుత కల్వకుర్తి లిఫ్టు, షాద్నగర్ లిఫ్టులాగా మొదలైందని, 15 ఏళ్ల ఆందోళన తరువాత 2013లో జీవోలను సాధించుకోగలిగామని అన్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చి తప్పు చేసిందని, 2015లో పనులను ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని నమ్మించి ప్రతిపాదనలో లేని డిండిని తగిలించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకోసం సాధించుకున్న పీఆర్ఎల్ఐ నీటిని ఏదుల నుంచి అక్రమంగా నల్లగొండకు తరలించుపోతున్నారని ఆరోపించారు. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల ఆటగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ నిర్వహించే సదస్సుకు విద్యావంతులు, విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక జిల్లా కో కన్వీనర్ నర్సింలు, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, పౌరహక్కుల సంఘం నాయకుడు తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు బాధ్యతల స్వీకరణ
కందుకూరు: లయన్స్ క్లబ్ 320ఏ జిల్లా గవర్నర్గా మండల కేంద్రంలోని భూలక్ష్మీ ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ జి.మహేంద్రకుమార్రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. సామాజిక స్పృహ, సేవాతత్పరత కలిగిన ఆయన గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ, స్వచ్ఛంద సంస్థ అయిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో చేరారు. 2007–08 కందుకూరు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం జిల్లా గవర్నర్ స్థాయికి చేరుకున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించి సంస్థ అభివృద్ధికి పెద్దన్న పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన సంస్థ జిల్లా గవర్నర్గా ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 90 క్లబ్లతో పాటు వికారాబాద్, పాత మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలతో పాటు నైజాం ప్రాంతంలోని కల్యాణ కర్ణాటక, రాయచూరు, సేడం, గుల్బర్గా, యాదగిరి తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని 40 క్లబ్ల వరకు జిల్లా గవర్నర్ పరిధిలో కార్యక్రమాలు కొనసాగించాలి. ఆయా క్లబ్లలో దాదాపుగా 3,500 మందికి పైగా సభ్యులు ఆయన ఆధ్వర్యంలో పని చేయనున్నారు. ఇది గురుతర బాధ్యత ఈ సందర్భంగా డాక్టర్ మహేంద్రకుమార్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా గవర్నర్గా పని చేయడం ఒక గురుతరమైన బాధ్యత అన్నారు. ఈ స్థాయికి రావడానికి నా సమయం చాలా వెచ్చించాల్సి వచ్చిందన్నారు. తన ముందున్న మార్గదర్శకుల అంచనాలను అందుకోవాలని, సేవలలో గ్లోబల్ లీడర్గా తన జిల్లాను నిలబెట్టాలనేదే ఆశయమన్నారు. తనకు సహకరించిన కందుకూరు, ఆమనగల్లు క్లబ్ సభ్యులతో పాటు జిల్లా పరిధిలోని సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. హెలెన్ కెల్లర్ సేవా వారోత్సవాలు తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా జూలై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హెలెన్ కెల్లర్ సేవా వారోత్సవాలు ప్రతి ఒక్క క్లబ్ నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇందులో ప్రతి రోజు కంటి వైద్య శిబిరాలు, అవసరమైనవారికి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, డయాబెటిక్ నిర్ధారణ శిబిరాలు, ఉచితంగా స్టేషనరీ అందించడం, వైద్య శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. లయన్స్ క్లబ్ 320ఏ జిల్లా గవర్నర్గా మహేంద్రకుమార్రెడ్డి -
యువకుడి అదృశ్యం
ఏడాది గడిచినా దొరకని ఆచూకీ పహాడీషరీఫ్: తాగిన మైకంలో ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. న్యూ బాబానగర్కు చెందిన షేక్ షా వలీ పెద్ద కుమారుడు మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(28) స్క్రాప్ సేకరిస్తుంటాడు. గతేడాది నవంబర్ 24వ తేదీన తాగిన మైకంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. తిరిగి ఎంతకి రాకపోవడంతో డిసెంబర్ 1వ తేదీన ఇమ్రాన్ తల్లి జాహెదా నాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి ఆచూకీ లభించడలేదు. ఇతని ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్ పోలీస్స్టేషన్లో గాని 87126 62366 నంబర్లో సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. -
రోడ్లపై మురుగు.. రోడ్ల పక్కనే చెత్త
మొయినాబాద్: మున్సిపల్ కేంద్రంతోపాటు పలు కాలనీలు,గ్రామాల్లో రో డ్ల పక్కనే చెత్తాచెదారం పేరుకుపోయింది. కాలువలు సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే పారుతోంది.ఉన్న వాటిని సైతం సరిగా శుభ్రం చేయకపోవడంతో ఈగలు, దోమలు చేరుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని సహారా కాలనీ, స్టార్ కాలనీ, భరద్వజ్ కాలనీ, ముస్తఫా కాలనీ, విజయన గర్ కాలనీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగు కాలు వలు చెత్తాచెదారంతో నిండిపోయాయి.చిలుకూరు, పెద్దమంగళారం,అజీజ్నగర్, హిమాయత్నగర్,ఎనికేపల్లి,ముర్తూజగూడ,సురంగల్ గ్రామాల్లోనూ మురుగుకాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది.స్పెషల్ డ్రైవ్ పేరుతో చెత్తాచెదారం తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. -
పరిశ్రమల్లో భద్రతా చర్యలు తప్పనిసరి
● డీఆర్ఓ సంగీతసాక్షి, రంగారెడ్డిజిల్లా: పరిశ్రమల్లో నిబంధనల మేర కు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవె న్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం పరిశ్రమలు, అగ్నిమాపక, పోలీసు శాఖలతో పాటు జిల్లాలోని పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో మౌలిక సదుపాయాలు, ఫైర్ సేఫ్టీ, మెడికల్ అండ్ హెల్త్ ఎంతో ముఖ్యమని అన్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ ఉందో లేదో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేయ డంతో పాటు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించారు. ఇందులో స్థానికంగా ఉండే ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఇన్చార్జి అధికారి యాదయ్య, జిల్లా అగ్నిమాప శాఖ అధికారి మురళీ మనోహర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
హస్తం.. నిర్వేదం!
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఎమ్మెల్యేలు మొదలు చోటా మోటా లీడర్ల వరకు అంతా నారాజ్లో ఉన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశించారు. పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో వారంతా నైరాశ్యంలోకి వెళ్లారు. అధినాయకుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారు కూడా ఏమీ చేయలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశించారు. ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన ఇటీవల అలకపాన్పు ఎక్కడం, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించడంతో పీసీసీ చీఫ్ సహా ఇతర నేతలు బుజ్జగించారు. తాత్కాలికంగా శాంతించినప్పటికీ పదవి దక్కలేదనే అసంతృప్తి మాత్రం వెంటాడుతోంది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. డీసీసీ పీఠంపై సీనియర్ల కన్ను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన డీసీసీని గాలికొదిలేశారు. నియోజకవర్గాల్లో ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే వెళ్లి రావడం మినహా పార్టీ పటిష్టత కోసం తీసుకుంటున్న చర్యలు కూడా ఏమీ లేవు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత దేపభాస్కర్రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గానికి చెం దిన గౌరీసతీష్, భీంభరత్ మరికొంత మంది నేతలు ఈ పీఠాన్ని ఆశించారు. ఆ మేరకు వారు ముఖ్యనేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇప్పటికీ వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. పుట్టిముంచనున్న సమన్వయ లేమి ఉమ్మడి ఏపీలోనూ జిల్లా నేతలకు సముచిత స్థానం లభించేది. ఇటు మంత్రి వర్గంలోనే కాదు అటు పార్టీలోనూ జిల్లా నేతలు కీలకంగా వ్యవహరించేవారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జిల్లా నేతలను పూర్తిగా విస్మరించింది. ఒకరిద్దరు తమ అనుచరులకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం మినహా ముఖ్య పదవులేవీ కేటాయించలేదు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ లీడర్లకు బీఆర్ఎస్ నుంచి కొత్తగా చేరిన నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ వర్గం ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్కు ఫిర్యాదు చేసింది. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రస్తుత డీసీసీ చీఫ్ కూడా వారిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆయా మండలాలు, గ్రామాల్లో పార్టీ రెండుగా చీలిపోయి కన్పిస్తోంది. అంతర్గత విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పుట్టిముంచే ప్రమాదం లేకపోలేదు. ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల దాకా.. పదవులు ఆశించి భంగపడిన నేతలు డీసీసీ పీఠంపై పలువురి గురి ఆశావహుల ఎదురుచూపులు సంస్థాగత కమిటీల్లోనైనా సముచిత స్థానం దక్కేనా?సామాజిక న్యాయం దక్కేనా..? ఇప్పటి వరకు పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. నామినేటెడ్ పదవుల్లోనూ వారే కీలకంగా ఉన్నారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంస్థాగత పదవుల్లోనూ 42 శాతం రిజర్వేషన్ పాటించి తీరాలని ఆదేశిస్తున్నా జిల్లాలో ఇప్పటి వరకు ఈ సూత్రం అమలు కాలేదు. కనీసం గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీల్లోనైనా ఇతర నేతలకు సముచిత స్థానం దక్కుతుందో లేదో తేలిపోనుంది. జూలై 4లోగా సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూలై మొదటి వారంలో రాష్ట్రానికి రానున్నారు. గ్రామ, మండల, బ్లాకు, జిల్లా, రాష్ట్ర కమిటీల ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న సామాన్య ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్యకర్తలు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులకు గుర్తింపు లభిస్తుందా అనేది వేచిచూడాలి. -
నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
షాద్నగర్ః ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు రూ.700కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూ.180 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి రెండేళ్లు గడిచిపోయిందన్నారు. కమిటీ నివేదికను అమలు చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో జేఏసీతో చర్చలు జరిపి దశల వారీగా పోరాటాలు చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, నాయకులు రాములయ్య, జగన్నాథ్ శర్మ, బుగ్గ రాములు, శంకర్ నాయక్, రాములయ్య, యాదగిరి పాల్గొన్నారు. -
తెలంగాణ సాహిత్యాన్ని కాపాడుకోవాలి
చేవెళ్ల: మన కవుల సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకుడు దోరవేటి చెన్నయ్య, అధ్యక్షుడు తూర్పు మల్లారెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ మహాకవుల జయంతిని ఘనంగా నిర్వహించుకుని, భావితరాలకు అందించాలన్నారు. అనంతరం సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వారు ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల క్యాలెండర్ను రూపొందించుకున్నట్లు తెలిపారు. జూలై 27న వికారాబాద్లో దాశరథి, సి.నారాయణరెడ్డిల జయంతి, చేవెళ్లలో కాళోజీ జయంతి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా శాఖల వారీగా ఉగాది కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం నుంచి అనంత ప్రతినిధులుగా ఘనపురం పరమేశ్వర్, పాపిరెడ్డిలను ఎన్నుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కడియాల మధుసూదన్, అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కమలేశ్, కార్యదర్శి శ్రీనివాస్, హనుమంత్, సభ్యులు ఆశీర్వాదం, నర్సయ్య, ప్రసాద్, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక సభ్యులు -
కొరత చూపి.. రైతులను దోచేసి
కొందుర్గు: ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటల సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం మొదటి దఫా అధికంగా రైతులు డీఏపీ వాడుతారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉంటే డీలర్లు రూ.1,500 వరకు అన్నదాతలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా యూరియా బస్తా ధర రూ.266 ఉండగా రూ.300 పైనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోనే కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఇక్కడ పత్తి, మొక్కజొన్న పంటలను అధికంగా సాగు చేస్తారు. కానీ ప్రస్తుతం డీఏపీ, యూరియా కొరత సృష్టించడంతో తాము అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారులను వివరణ కోరగా డీఏపీ కొరత ఉన్నది వాస్తవమేనని, వాటి స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వాడా లని సూచిస్తున్నారు. కాగా కాంప్లెక్స్ ఎరువులు మొదటి దఫాలో వాడడంతో పంటలు బాగా పెరిగి చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. అధిక ధరలకు ఎరువుల విక్రయాలు వానాకాలం సాగులో ఇక్కట్లు -
వర్సిటీ ఫుట్బాల్ చాంపియన్ ఎక్సలెన్సియా
మొయినాబాద్: వర్సిటీ ఫుట్బాల్ ట్రోఫీ చాంపియన్షిప్ను ఎక్సలెన్సియా జట్టు కై వసం చేసుకుంది. అజీజ్నగర్లోని డెక్కన్ అరేనా గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గార్డియం జట్టుపై ఎక్సలెన్సియా జట్టు విజయం సాధించింది. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి 60 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ నాలుగు నెలలపాటు కొనసాగింది. ఫైనల్స్లో ఎక్సలెన్సియా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి ఆఫ్లో ఇరు జట్లు 0–0 స్కోర్తో ఉన్నా సెకండ్ ఆఫ్ 58వ నిమిషంలో నిమిష్ 30 యార్డ్ దూరం నుంచి అద్భుతమైన షాట్ కొట్టి ఎక్సలెన్సియా జట్టుకు గోల్ అందించాడు. చివరి వరకు గార్డియా జట్టు గోల్ చేయకపోవడంతో ఎక్సలెన్సియా జట్టు 1–0తో విజయం సాధించింది. విజేత జట్టుకు నిర్వాహకులు బహుమతి అందించారు. గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన మినిష్కు బ్యాలన్ డి ఓర్, గోల్డెన్ బూట్ అవార్డులు లభించాయి. ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయండి కేశంపేట: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 1న నిర్వహించనున్న లంబాడా హక్కుల పోరా ట సమితి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందర్నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నంగారా భేరి కరపత్రాలను మండల పరిధిలోని ఎక్లాస్ఖాన్పేటలో ఆదివారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా చందర్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడా హక్కుల పోరాట సమితి ఏర్పడి ఏళ్లు పూర్తవుతున్నందున తండాల్లో ఆవిర్భవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో మోహన్నాయక్, గోపాల్నాయక్, బాబురాజ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, సంతోష్ నాయక్, పరశురాంనాయక్, రవి నాయక్, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఐస్ స్కేటింగ్లో చిన్నారి సత్తా పహాడీషరీఫ్: బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చానస్య గౌడ్ 20వ జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో సత్తా చాటింది. ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో శనివారం జరిగిన పోటీలో చానస్య ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించింది. 9–10 ఏళ్ల విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో చానస్య మంచుపై దృఢ సంక్పంతో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. చిన్నారి ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సహించడంతో ఆమె ఈ ఘనత సాధించింది. విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం పరిగి: విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని తపస్ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల నుంచి వస్తున్న మల్టీ జోన్–2లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. -
ఘనం.. రెండో బోనం
గోల్కొండ కోటకు వెల్లువలా భక్తులు గోల్కొండ: గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆదివారం 2వ బోనం పూజ ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కోటలోని నగినాబాగ్, రాణీమహల్ తదితర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. మహిళలు నాగదేవత పుట్టకు పూజలు నిర్వహించారు. అనంతరం తలలపై అందంగా అలంకరించిన బోనం కుండలతో కోటపైకి అమ్మవారి దర్శనానికి బయల్దేరి వెళ్లారు. గోల్కొండ ఫతే దర్వాజా నుంచి భక్తులు తొట్టెలతో ఊరేగింపుగా వచ్చారు. కోట చౌరస్తా శివసత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వసంత, బోనాల ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
తేలేదెప్పుడో..?
మొయినాబాద్: ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎటూ తేలడంలేదు. పరిహారం విషయంలో అటు అధికారులు, ఇటు రైతులు పట్టు వీడడంలేదు. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులు రైతులతో చర్చలు జరిపారు. పరిహారం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో నెల రోజులుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమి ఎనికేపల్లి సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాలు 1954 నుంచి రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమిగానే నమోదవుతూ వస్తోంది. 1954లో ఈ భూమిని దళితులు సాగుచేసుకోవడానికి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కొన్నేళ్ల పాటు రైతుల పేరు కబ్జా కాలంలో వచ్చాయి తప్ప అసైనీలుగా పేర్కొనలేదు. రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా సర్కారు భూమిగా కొనసాగుతూ వచ్చింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు డైబ్బె ఏళ్లుగా ఇక్కడ సాగుచేసుకుంటున్నారు. ఈ భూములను ప్రభుత్వం ఇటీవల గోశాల ఏర్పాటుకు కేటాయించింది. విషయం తెలిసిన గ్రామస్తులు నెల రోజుల నుంచి ఆందోళన మొదలు పెట్టారు. ఈ భూములనే నమ్ముకుని జీవిస్తున్నామని, తమకే అసైన్డ్ చేయాలని డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు సైతం భూములను పరిశీలించి రైతులకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. చర్చలు విఫలం భూములు సాగుచేసుకుంటున్న రైతులతో రెవెన్యూ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ పరిహారం విషయంపై వారితో చర్చించారు. ఎకరాకు వెయ్యి గజాల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 200 గజాల చొప్పున ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. మూడుసార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఎమ్మెల్యేపై భారం వేసిన రైతులు పరిహారం విషయంలో రైతులు ఎమ్మెల్యే కాలె యాదయ్యపై భారం వేశారు. పలుమార్లు ఆయనను కలిసి ప్రభుత్వంతో చర్చించి మంచి పరిహారం ఇప్పించాలని కోరారు. రైతులను తీసు కుని కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పరిహారం విషయంపై చర్చించారు. ఎకరాకు 800 గజాలు పరిహారంగా ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా 250 గజాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీసం ఎకరాకు 400 గజాలైనా ఇవ్వాలని ఎమ్మె ల్యే కోరారు. ఈ విషయమై శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి చర్చించారు. ఎకరాకు 350 గజాల స్థలం ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిహారంపై కొందరు రైతులు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. రెండు సార్లు సర్వే చేయకుండానే.. గోశాలకు కేటాయించిన భూములను సర్వే చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెండుసార్లు వచ్చారు. పరిహారం విషయం తేలకపోవడంతో సర్వే చేయకుండానే వెనుదిరిగారు. మరోవైపు ఎనికేపల్లి భూముల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. కొత్త వ్యక్తులు, రైతులను అటువైపు రాకుండా కాపలా కాస్తున్నారు. కొలిక్కిరాని ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎన్నిసార్లు చర్చలు జరిగినా తేలని పరిహారం రెండుసార్లు సర్వే చేయకుండానే వెనుదిరిగిన అధికారులు కొనసాగుతున్న పోలీస్ పహారా ప్రభుత్వమే ఆదుకోవాలి సాగుచేసుకుంటున్న భూములు తీసుకుంటే మా బతుకులు ఆగమైతయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఎంత పరిహారం ఇస్తామన్న విషయం అధికారులు సరిగా చెప్పడంలేదు. ఎమ్మెల్యేపైనే భారం పెట్టాం. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. – అనుసూయ, మహిళా రైతు, ఎనికేపల్లి మా బతుకులు ఏం కావాలి తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు గోశాలకు ఇస్తే మా బతుకులు ఏం కావాలి. 1954 నుంచి 1998 వరకు పహణీల్లో మా పేర్లు వచ్చాయి. తరువాత సర్కారు భూమి అని వచ్చింది. మోకిలలో ఇచ్చినట్లు ఎకరాకు 750 గజాల చొప్పున పరిహారం ఇస్తే మంచిది. – న్యాలట మహిపాల్, రైతు, ఎనికేపల్లి -
పనికి వెళ్లడం లేదని..
తల్లి మందలించడంతో కొడుకు అదృశ్యం పహాడీషరీఫ్: పనికి వెళ్లడం లేదని తల్లి మందలించడంతో కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి వాదే ముస్తఫా బస్తీకి చెందిన షేక్ సమియుద్దీన్ షరీఫ్ కుమారుడు అకేఫుద్దీన్ షరీఫ్(21) ప్రైవేట్గా పని చేస్తుంటాడు. కొన్ని రోజులుగా పనికి పోకపోవడంతో తల్లి ఫర్హానా బేగం ఈ నెల 19వ తేదీన ఉదయం మందలించింది. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 21న తిరిగి తల్లి ఫోన్కు కాల్ చేసిన షరీఫ్ ‘నేను పనికి వెళ్లడం లేదని నన్ను తిడుతున్నారు.. నేను ఎక్కడికై నా వెళ్లిపోతాను’ అంటూ కట్ చేశాడు. ఎంతకి అందుబాటులోకి రాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై యువకుడి తల్లి ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇతడి ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. శిథిలావస్థకు చెరువు తూము దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఉన్న తూము లీకేజీ కావడంతో చెరువులో ఉన్న నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం నిండుకుంది. చెరువు తూము లీకేజీ కావడంతో నీరు వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు. తూము నుంచి నీరు బయటకు పోకుండా ఉపయోగించే ఇనుప రాడ్డు పూర్తిగా లోపలికి పడిపోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. చెరువు తూము లీకేజీ అవుతున్నా ఇప్పటివరకు ఏ అధికారి కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తూముకు మరమ్మతులు చేయాలని వ్యవసాయదారులు కోరుతున్నారు. -
చైతన్యంతోనే సమస్యలకు పరిష్కారం
ఇబ్రహీంపట్నం: రాజకీయంగా చైతన్యవంతులై ఎదిగితేనే సమస్యలను పరిష్కరం అవుతాయని.. ఆ లక్ష్యం దిశగా ముందుకుసాగాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పురి శేఖర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. సగరులు నివసిస్తున్న గ్రామాల్లో కుల గురువైన శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాయకత్వ పటిమతో సగరులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మార్క సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శ్రీకాంత్, నాయకులు నాగేశ్వర్, నవీన్ పాల్గొన్నారు. -
యువత వ్యసనాల బారిన పడొద్దు
యాచారం: యువత చెడు అలవాట్లకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సూచించారు. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో ఆదివారం సాయంత్రం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు నిబంధనలు, ఘర్షణల వల్ల జీవితాల నాశనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతనేనని, అలాంటి వారు వ్యసనాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గొప్ప లక్ష్యంతో యువత ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. సమావేశంలో రాచకొండ సీఐ జోసఫ్, ఎస్ఐ తేజంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు -
అర్ధరాత్రి విహరిస్తే కఠిన చర్యలు
మీర్పేట: వేడుకలు, ఇతర కారణాలతో అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్పేట పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు యువతను హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి తరువాత స్టేషన్ పరిధి నందనవనం, ఆర్ఎన్రెడ్డినగర్, భూపేష్గుప్తానగర్లలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న 122 మంది యువకులను గుర్తించారు. జన్మదిన వేడుకల పేరుతో కాలనీ కూడళ్లు, ప్రధాన రహదారులపైకి రావడం, అదే విధంగా రాత్రంతా బాక్స్ టైపు క్రికెట్ ఆడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఇన్స్పెక్టర్ సూచించారు. ఏ కారణం లేకున్నా యువత రోడ్లపై ద్విచక్ర వాహనాలను విచ్చలవిడిగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు గొడవలకు కారణమవుతాయని అవగాహన కల్పించారు. ఆపరేషన్ చబుత్రలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గౌరునాయుడు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దు మీర్పేట సీఐ నాగరాజు -
క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
షాబాద్: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం ఏఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చైర్మన్ ఎలుగంటి అభిరామ్రెడ్డి నిర్వహిస్తున్న ఎస్పీఎస్–3 క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రాంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడాపాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక స్పోర్ట్స్ టీచర్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అన్ని మండలాల్లో ఉన్న స్టేడియాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. క్రీడాపోటీలతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ముడిమ్యాల, పెద్ద మంగళారం సహకార సంఘాల చైర్మన్లు ప్రతాప్రెడ్డి, చంద్రారెడ్డి, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
ఫుట్పాత్ల ఆక్రమణలపై
శంషాబాద్: 15 రోజుల కిందట సాతంరాయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న చిరువ్యాపారాలకు సంబంధించిన డబ్బాలు తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి అందిన ఆదేశాలను అధికారులు క్షణాల్లో పూర్తి చేశారు. పక్కాగా పోలీసుల సహకారంతో జేసీబీలను ఏర్పాటు చేసి అక్కడున్న గరీబోళ్ల డబ్బాలను వెంటనే తొలగించి పెద్దసార్ల ఆదేశాలను ఆదేశాలను తూచాతప్పకుండా పూర్తి చేశారు. నాలాను ఆనుకుని ఆక్రమణలున్న కారణంగానే ఫిర్యాదులు అందగానే వాటిని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పుకొచ్చారు. మరి ఇక్కడ..? శంషాబాద్ పట్టణ ప్రధాన కేద్రంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కరంగా మారుతున్న ఫుట్పాత్ల ఆక్రమణపై మున్సిపల్ అధికారులు ఏడేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అనేక మార్లు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కౌన్సిల్లో తీర్మానాలు చేసి అవి కార్యాచరణకు నోచుకున్న దాఖలు కూడా లేవు. రోడ్డులను ఆక్రమించి హోటళ్లు, వ్యాపారాలు చేసుకుంటున్నా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. అద్దెకిచ్చేస్తున్నారు... ఫుట్పాత్లను ఆక్రమించి కొందరు సొంత వ్యాపారాలను విస్తరిస్తుండగా మరికొందరు తమ దుకాణాల ముందు చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నారు. రోడ్డును అద్దెకిచ్చి ఏళ్లుగా లక్షల రూపాయలు సంపాదిస్తున్న తీరు కూడా ఇక్కడ షరామాములే అన్నట్లుగా మారింది. పట్టణంలోని రాళ్లగూడ రహదారిలో ఫిరంగి నాలాను ఆనుకుని పదుల సంఖ్యలో డబ్బాలను ఏర్పాటు చేసి అద్దెకిచ్చేస్తున్నారు. దీనిపై ఇంతవరకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫుట్పాత్ల ఆక్రమణ కారణంగా సాధారణ ప్రజలతో పాటు ప్రయాణికులు సైతం నిత్యం నరకం చూస్తున్నారు. జనాభా రద్దీలేని సాతంరాయిలో పెద్దసార్ల ఆదేశాలతో ఆగమేఘాల మీద ఆక్రమణ తొలగింపులు చేసిన అధికారులు అదే రీతిన పట్టణంలో ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైవే ఫుట్పాత్పై కంటైనర్ వేసి ఏర్పాటు చేసిన హోటల్ శంషాబాద్లో విచ్చలవిడిగా ఫుట్పాత్ల ఆక్రమణ కంటైనర్ల ఏర్పాటు చేసిదందా చేస్తున్నా చర్యలు శూన్యం సాతంరాయిలో యుద్ధప్రాతిపదికన డబ్బాలు తొలగించిన మున్సిపల్ అధికారులు పట్టణ ప్రధాన కేంద్రంలో పట్టించుకోని యంత్రాంగంఆక్రమణలను తొలగిస్తాం.. పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించుకుని ఉ న్న కట్టడాలు, డబ్బాలను తప్పకుండా తొలగిస్తాం. రహదారులను ఆక్రమించి ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలు ఎవరివైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – సుమన్రావు, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ -
కనకదుర్గమ్మకు జోడు బోనాలు
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో పాతబస్తీలోని వివిధ దేవాలయాలకు చెందిన ప్రతినిధుల బృందంతో పాటు అక్కన్న మాదన్న దేవాలయం కమిటీ సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. జోగిని శ్యామల వెండి బోనం ఎత్తారు. ఈసారి బంగారు బోనాన్ని కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ సతీమణి సంగీత ఎత్తుకున్నారు. ఈసారి విజయవాడ కనక దుర్గమ్మకు బంగారు, వెండి పాత్రల్లో జోడు బోనాలు సమర్పించారు. -
రక్తదానానికి ముందుకు రావాలి
పహాడీషరీఫ్: తలసేమియా బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సరూర్నగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఉమర్ బామ్ అన్నారు. మజ్లిస్–ఏ–ఉలమాయే హుఫాజ్ వా దానిశ్వరనే మిల్లత్ ఆధ్వర్యంలో షాహిన్నగర్లో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెల నెల రక్తమార్పిడి అవసరమయ్యే వారికి రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా మనదేశంలో 10–12 వేల మంది తలసేమియా పిల్లలు జన్మిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు కూడా తలసేమియాను ప్రజారోగ్య సమస్యగా ప్రకటించాలన్నారు. ఎర్ర రక్తకణాలలో హీమోగ్లోబిన్ లోపం వల్ల ఒక మాదిరి నుంచి తీవ్రమైన రక్తహీనత లక్షణాలు కలిగి, రక్త సంబంధమైన అనువంశిక రుగ్మతే తలసేమియా మేజర్గా పేర్కొంటారన్నారు. దాదాపు 390 మంది దాతలు రక్తదానం చేసి తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి అందజేశారు. కార్యక్రమంలో హాఫీజ్ అబ్దుల్ హాది, డాక్టర్ ముస్తఫా అలీ సుఫియానీ, సయ్యద్ యూసుఫ్ పటేల్, అబ్దుల్ రవూఫ్, ఎం.ఎ.బారీ, అలీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
స్కూటీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి చేరిన మృతులు మొయినాబాద్: కారు, స్కూటీని ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మండల పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలోని ఈ నెల 25న స్కూటీపై వెళ్తున్న మహిళను ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో హిమాయత్నగర్లో అద్దెకుండే ఖైరతాబాద్కు చెందిన అశ్విని(37), మేడిపల్లికి చెందిన సుశీల(60) మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన అశ్విని మరుదలు లక్ష్మి(35) నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జయరాం కుటుంబం తుక్కుగూడలోని నార్త్ స్టార్ ఏర్పోర్ట్ బాలియార్డ్ విల్లాలో నివాసం ఉంటోంది. ఈయన కుమార్తె సురేఖ వెంకట దుర్గ(24) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి వెంకట దుర్గ కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. శివ అనే యువకుడిపై అనుమానం ఉందని తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు శంషాబాద్ రూరల్: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఊట్పల్లిలో ఉన్న డైమండ్ ఎస్టేట్ కాలనీలో తారకేశ్వర్ తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతనికి ఖైనీ, గుట్కా నమలడం అలవాటు ఉంది. ఈ క్రమంలో కొన్ని నెలల నుంచి వీటిని అతను ఓఆర్ఆర్ వంతెన వద్ద కొంత మంది ద్వారా కొనుగోలు చేస్తున్నాడు. వాటితో పాటు వారు ఇతనికి గంజాయిని కూడా విక్రయించారు. గంజాయిలో విత్తనాలు కనిపించగా..వాటిని తన ఇంటి ఆవరణలో కూరగాయాలతో పాటు పెంచుతున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని ఇంటికి వెళ్లి విచారణ చేయడంతో గంజాయి మొక్కలు కనిపించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుతో ఉడాయించిన వ్యక్తిపై ఫిర్యాదు రాజేంద్రనగర్: ఆన్లైన్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడాయించిన నేరస్తుడి కోసం రాజేంద్రనగర్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..కిస్మత్పూర్లో ఓ వ్యక్తి తన చిల్లర దుకాణంలోనే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ను చేస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి (30) ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.75 వేల నగదు కావాలని కోరాడు. డబ్బులు అర్జెంట్ ఉందని..రూ.5 వేలు అదనంగా ఇస్తానని తెలిపాడు. దీంతో దుకాణ నిర్వాహకుడు డబ్బును గుర్తు తెలియని వ్యక్తికి ఇచ్చాడు. ఆన్లైన్ పేమెంట్ చేస్తానంటూ అతన్ని మాటల్లో దింపి అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో బాధితుడు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు హిమాయత్సాగర్కు చెందిన పాత నేరస్తుడిగా గుర్తించారు. నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేడు శ్రీరాంనగర్ ఎన్నికలు మణికొండ: శ్రీరాంనగర్ (సెక్రటేరియట్) కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ఆదివారం కమ్యూనిటీహాల్లో నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ఉంటుందన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత కౌటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి పదవులకు పోటీ అధికం కావడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, మిగతా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిపోయిందన్నారు. -
అగ్నివీర్ శిక్షణ కేంద్రం నుంచి యువకుడి అదృశ్యం
కందుకూరు: బెంగళూరులో అగ్నివీర్ శిక్షణ పొందుతున్న మండల పరిధిలోని బేగంపేటకు చెందిన యువకుడు దయ్యాల సతీష్ అదృశ్యమయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. దయ్యాల కొమురయ్య రెండో కొడుకు సతీష్ (20) ఈఏడాది మార్చి నెలలలో అగ్నివీర్కు ఎంపికయ్యాడు. శిక్షణ కోసం బెంగళూరు వెళ్లాడు. రెండు నెలలుగా ట్రైనింగ్ పొందుతున్న సతీష్ ఈనెల 24న అదృశ్యమయ్యాడు. శిక్షణలో ఓ సార్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులకు మెస్సేజ్ చేశాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే బెంగళూరుకు చేరుకుని ఈనెల 27న హోల్సూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. శనివారం విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వి.బాల్రాజ్ తదితరులతో కలిసి బేగంపేటలోని సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెంగళూరులోని హోల్సూర్ పీఎస్లో బాధితుల ఫిర్యాదు -
దేశ రక్షణలో యువత కీలకం
మొయినాబాద్ రూరల్: దేశ రక్షణలో యువత కీలకమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిమాయత్నగర్ చౌరస్తాలోని స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ఇన్వెస్టించర్ కార్యక్రమ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే దేశభక్తితో పాటు రాజకీయాలపై మక్కు వ పెంచుకోవాలన్నారు. దేశ భద్రతలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధా న స్వామీజీ సుక్వల్లభ్, ప్రిన్సిపల్ ప్రవీణ్కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ -
రేషన్ డీలర్పై సస్పెన్షన్ వేటు
ఆమనగల్లు: పట్టణానికి చెందిన రేషన్ డీలర్ గాజుల భార్గవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు ఆమెకు ఉత్వర్వులు ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులోకి రాలేదు. దీంతో షాప్కు ఉత్తర్వుల కాపీని అంటించి దుకాణానికి సీజ్ చేశారు. భూధార్ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు చేవెళ్ల: భూధార్ కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీఏఓ నర్సింహారావు వ్యవసాయాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన శంకర్పల్లి మండలం టంగుటూర్లో భూదార్ కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన చేవెళ్ల వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో ఏడీఏ సురేశ్బాబు, ఏఓ శంకర్లాల్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక గుంట మొదలుకుని ఎన్ని ఎకరాలున్నా భూధార్ కార్డు కోసం వ్యవసాయాధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే అన్ని పథకాలు ఇక భూదార్ కార్డు ఆధారంగానే కొనసాగుతాయని చెప్పారు. రైతులంతా వ్యవసాధికారులకు సహకరించి ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కోరారు. రైతు క్లస్టర్ సందర్శన మొయినాబాద్ రూరల్: రైతులు భూధార్ తప్పక చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని రైతు క్లస్టర్ను సందర్శించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట చేవెళ్ల ఏడీఏ సురేశ్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. నేటి పొదుపు భవిష్యత్కు భరోసా సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి షాద్నగర్రూరల్: మనం చేసే పొదుపు భవిష్యత్కు ఆర్థిక భరోసా ఇస్తుందని సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఏబీ కన్వెన్షన్ హాలులో శ్రీరామలింగేశ్వ సహకార సంఘం సమితి 13వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎంత సంపాదించామనేది ప్రధానం కాదని, ఎంత పొదుపు చేస్తున్నామనేది ముఖ్యమని అన్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకుని కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. పొదుపు సహకార సంఘాలద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక చేయూతనందిస్తున్నామని చెప్పారు. అనంతరం దుర్గావాహిణి సంస్థ రాష్ట్ర కన్వీనర్ వాణిసక్కుబాయి మాట్లాడుతూ.. పొదుపు సంఘాలు ప్రజల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 50 గ్రామాల్లో పొదుపు సంఘాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పొదుపు సంఘాలతో స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామలింగేశ్వర సహకార సంఘం వ్యవస్థాపకుడు కుమారస్వామి, అధ్యక్షుడు మల్లేశ్ పూజారి, ఉపాధ్యక్షుడు మహేందర్, సీఈఓ సుమంత్కుమార్, మేనేజర్ రాఘవేందర్, గ్రామ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హారికకు ‘ప్రావీణ్య పురస్కార్’ కొడంగల్: పట్టణంలోని నవీన ఆదర్శ పాఠశాల విద్యార్థిని హారికకు రాష్ట్ర స్థాయిలో ప్రావీ ణ్య పురస్కార్ అవార్డు వరించింది. జాతీయ సెమ్స్ ఒలంపియాడ్ ఆధ్వర్యంలో మార్చిలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించిన హారికను శనివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సెమ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ రాంచందర్రెడ్డి, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి అవార్డు, మెమొంటో, మెడల్తో సత్కరించారు. శాలువా కప్పి అభినందించారు. నవీన ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ రాజ్ను విశేష పురస్కార్ అవార్డుతో సన్మానించారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
మొయినాబాద్: నగర శివారుల్లో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేశారు. మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూలో రూ.15 కోట్ల విలువచేసే మూడెకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జాచేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకుని కబ్జారాయుడిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. కనకమామిడి రెవెన్యూ సర్వేనెంబర్ 510లో 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇదే సర్వే నెంబర్లో కేతిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. జేసీబీతో భూమిని చదును చేసి ఫ్రీకాస్ట్ వాల్తో రూంలు నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్, పోలీసులు, సిబ్బందితో అక్కడికి వెళ్లి కబ్జాను అడ్డుకున్నారు. కబ్జాదారుడు భూమి తనదని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అధికారులు భూమికి సంబంధించిన పత్రాలు చూపాలని కోరడంతో అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ వీరంగం చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తూ వేసిన ఫెన్సింగ్, ఫ్రీకాస్ట్వాల్ను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కబ్జాదారుడిపై కేసు నమోదు చేశారు. వరుస ఘటనలు మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ భూముల కబ్జా ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. గురువారం మండల పరిధిలోని తోలుకట్టలో సర్వే నంబర్ 155లో రూ.5 కోట్లు విలువ చేసే 1.14 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ నిర్మించిన ఫ్రీకాస్ట్వాల్ను తొలగించి కబ్జా చెరనుంచి విడిపించారు. శుక్రవారం అజీజ్నగర్లో సర్వేనెంబర్ 177లో రూ.30 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు పెట్టారు. శనివారం కనకమామిడిలో 510 సర్వే నెంబర్లో రూ.15 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చెరనుంచి కాపాడి బోర్డులు పెట్టారు. అడ్డుకున్న రెవెన్యూ అధికారులు కబ్జాదారుడిపై కేసు భూముల జోలికొస్తే జైలుకే ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే కొంత మంది అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాచేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపడుతున్నాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
చేవెళ్ల: ఉద్యాన పంటలు, డెయిరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో శనివారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి పొలంలో 21 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్పామ్ ప్లాంటేషన్ను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్బాషాలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ డిమాండ్కు తగిన విధంగా రైతులు ముందుకురావాలన్నారు. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలపై దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా కూరగాయలు పండకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు తెలుగు రాష్ట్రాల భూములు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశానికి సరిపడా కావాలంటే 70లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో జిల్లాకో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటే లక్ష్యమని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేశామని వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ డ్రిప్ పరికరాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో శనివారం ఒక్కరోజే 557 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 5వేల ఎకరాల్లో పంట సాగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముప్పై ఏళ్ల పాటు ఆదాయం హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుకు ఎకరానికి 52 వేల సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. ఒక్కసారి సాగు చేస్తే ముప్పై ఏళ్ల పాటు ఆదాయం వస్తుందన్నారు. ఇది రైతులకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వంటి కార్యక్రమమని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి జిల్లాతోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని రైతుతులు ఎక్కువగా ఆయిల్పామ్సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అందరికీ అందుబాటులో ఉండేలా గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో లేదా అజీజ్నగర్లో ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. డ్రోన్ ఇప్పించండి.. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి స్ఫూర్తితోనే ఆయిల్పామ్సాగుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. తమ గ్రామంలోని రైతు సంఘానికి ఓ డ్రోన్ ఇప్పించాలని, చేవెళ్లలో డివిజన్ వ్యవసాయ, ఉద్యాన కార్యాలయలకు భవనాలు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గిండ్డంగుల సంస్థల చైర్మన్ ఆర్.నాగేశ్వర్రావు, ఆర్డీఓ చంద్రకళ, జేడీఏ నర్సింహ్మరావు, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, సురేందర్రెడ్డి, గోనే ప్రతాప్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, గోపాల్రెడ్డి, నాయకులు జనార్దన్రెడ్డి, కృష్ణారెడ్డి, మానిక్యరెడ్డి, మధుసూదన్గుప్తా, ఆగిరెడ్డి, వసంతం, దర్శన్, కాలె శ్రీకాంత్, ప్రభాకర్, గోపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, వ్యవసాయశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు ఉన్నారు. వాణిజ్య రైతులు దృష్టిసారించాలి Ð]lÅÐ]l-ÝëĶæ$ Ô>Q Ð]l$…{† ˘™èl$Ð]l$ÃÌS ¯éVóS-ÔèæÓ-ÆŠ‡-Æ>Ð]l# దేవునిఎర్రవల్లిలో ఆయిల్పామ్ సాగు ప్లాంటేషన్ -
మహేశ్వరం జీఎంసీ ఆకస్మిక తనిఖీ
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం ఆమె ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనతరం నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణిని అడిగి పనులుపై ఆరా తీశారు. ల్యాబ్లను పరిశీలించిన ఆమె విద్యార్థులకు కావాల్సిన సామగ్రి తెప్పించాలని సూచించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారని వారికి ఎలాంటి లోటు లేకుండా చూడాలన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో నిర్వహించనున్న మొదటి సంవత్సరం పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. మరో మారు హైలెవల్ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసతులు కల్పించి విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి, వైస్ప్రిన్స్పాల్ నాగమణి, డాక్టర్ మహ్మద్ టాకుద్దీన్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం మొదటి ఏడాది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ -
కోర్టు కాంప్లెక్స్ సందర్శన
ఇబ్రహీంపట్నం: జిల్లా ప్రధాన న్యాయయూర్తి కర్ణ కుమార్ శనివారం ఇబ్రహీంపట్నం కోర్టు కాంప్లెక్స్ను సందర్శించారు. ఇక్కడ కొనసాగుతున్న 15వ అదనపు జిల్లా న్యాయస్థానం, సీనియర్, జూనియర్ కోర్టులను పరిశీలించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. అదనంగా కోర్టు బిల్డింగ్, క్యాంటిన్, ఫ్యామిలీ కోర్టు తదితర అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపిస్తే.. తాను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతమయ్యేలా చూస్తా నని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్సింగ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్కుమార్, ఉపాధ్యక్షులు భాస్కర్, సహాయ కార్యదర్శి కృష్ణ, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్రెడ్డి, అంజన్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తి కర్ణకుమార్ను ఘనంగా సన్మానించారు. ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ బార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం -
ఎఫ్టీఎల్లో ఇళ్లు!
తుర్కయంజాల్: చెరువులు, కుంటల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపడుతున్నా కొందరు అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను పరిశీలించకుండానే అనుమతులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్, తుర్కయంజాల్, మన్నెగూడ, తొర్రూర్, మునగనూర్, కొహెడ రెవెన్యూలోని అనేక చెరువులు, కుంటల పరిధిలో పలు నిర్మాణాలకు అధికారులు అనుమతులు జారీ చేయడం, అవి ఆలస్యంగా బయటకు పొక్కుతుండడం చర్చకు దారితీస్తున్నాయి. ఎఫ్టీఎల్లోనే వెంచర్ ఇంజాపూర్లోని సర్వే నెంబర్లు 96, 97, 98, 99, 100, 104, 105లో 15.9 ఎకరాల ఎఫ్టీఎల్, 2.10 ఎకరాల బఫర్ జోన్తో గుడెం కుంట చెరువు విస్తరించి ఉంది. 2017లో హెచ్ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసి, 2024 సెప్టెంబర్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు తనకున్న అధికార బలంతో ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్ చేశాడు. ఆ తరువాత యథేచ్ఛగా ప్లాట్లను విక్రయించాడు. యథేచ్ఛగా ఇంటి నిర్మాణ అనుమతులు 2023 డిసెంబర్, 2024 జనవరిలో 12 ప్లాట్లకు ఎన్ఓసీలు లేకుండానే అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారి, కమిషనర్ ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇది తెలుసుకున్న పలువురు స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలు పూర్తి అవుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీటిని రద్దు చేసే విషయంలో వెనకడుగు వేస్తుడటం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు విఫలయత్నం ఇటీవల ప్రభుత్వం ఎల్ఆర్ఎస్–2020లో దరఖాస్తు చేసుకున్న వారు రాయితీపై ఫీజు చెల్లించే అవకాశం కల్పించడంతో ఈ లే అవుట్లోని ప్లాట్ల యజమానులు చెల్లించేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గతంలో మాదిరిగా అధికారులనే ప్రసన్నం చేసుకుని అనుమతులు పొందాలని భావించి పలు ప్లాట్లకు డబ్బులు సైతం చెల్లించారనే ప్రచారం సాగుతోంది. అధికారులు వినకపోవడంతో ఓ ప్రజా ప్రతినిధితో చెప్పించేందుకు యత్నించారని గుసగుసలు వినిపించాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎఫ్టీఎల్ పరిధిలో జారీ చేసిన నిర్మాణ అనుమతులను రద్దు చేయడంతో పాటు, చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. గుడెం కుంట చెరువుపరిశీలించిన తర్వాతే అనుమతులు చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేయవద్దు. గతంలో జారీ చేసిన వాటిని రద్దు చేసే అధికారం వారికే ఉంది. ఇప్పటికే అన్ని చెరువులకు సంబంధించిన మ్యాప్లను అధికారులకు అందజేశాం. వీటిని పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలి. – వంశీ, ఇరిగేషన్ ఏఈఈ, అబ్దుల్లాపూర్మెట్ చర్యలు తీసుకుంటాం గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు గుడెం కుంటలో ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. దీనిపై విచారణ చేపడుతున్నాం. ప్లాట్లను పరిశీలించాక తగిన చర్యలు తీసుకుంటాం. ఇంటి నిర్మాణ అనుమతులను రద్దు చేస్తాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దు. – కె.అమరేందర్ రెడ్డి, కమిషనర్, తుర్కయంజాల్ అధికార బలంతో వెంచర్ 2023–24లో అనుమతులు ఇచ్చిన టీపీఓ, కమిషనర్ రద్దు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం గుడెం కుంటను కాపాడలని స్థానికుల వినతి -
ఆలయాలకు దారి మూసేయడం తగదు
పహాడీషరీఫ్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగర శివారులోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె గ్రామస్తులతో కలిసి హౌజింగ్ బోర్డు అధికారులు ప్రీ కాస్ట్ గోడలను నిర్మిస్తున్న మామిడిపల్లిలోని దొంతరాల గుట్టపై ఉన్న మల్లన్న స్వామి, ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయానికి వెళ్లకుండా అధికారులు ప్రహారీ నిర్మిస్తున్నారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో గుర్తించి, వాటిని అమ్మడమే ఎజెండాగా పెట్టుకుందన్నారు. హెచ్సీయూ భూముల విక్రయం వెలుగులోకి వచ్చి ఆగిపోవడంతో, చివరకు ఆ భూములను తాకట్టు పెట్టి బ్యాంక్లలో రూ.10 వేల కోట్లు రుణం తీసుకొచ్చిందన్నారు. ఇతర ప్రాంతాలలోని భూములను కూడా విక్రయించడంలో భాగంగానే రావిరాలలోని భూముల వద్దకు రావడంతో అడ్డుకున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణ సమయంలో మామిడిపల్లి రైతులు పెద్ద ఎత్తున పొలాలు ఇచ్చారన్నారు. ఇందులోని 50 ఎకరాలను ప్రభుత్వం హౌజింగ్ బోర్డుకు కేటాయించిందన్నా రు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వనందున, హౌజింగ్ బోర్డు అధికారులు స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునే సమయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అప్పట్లోనే కోరామని గుర్తు చేశారు. విమానాశ్రయం నిర్మాణానికి ముందే ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నారని, ప్రస్తుతం ఆలయానికి కూడా వెళ్లకుండా అధికారులు ప్రీ కాస్ట్ వాల్ నిర్మించడం సరికాదన్నారు. దేవాలయం జోలికి రావద్దని అధికారులకు సూచించారు. రావిరాల జొన్నాయిగూడలో లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి గతంలో 30 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం అవసరం లేనప్పటికీ, పాత రోడ్డును వదిలేసి ఆలయు భూ ముల్లో నుంచి కొత్త రోడ్డు వేస్తున్నారన్నారు. అనంతరం ఆమె హౌజింగ్ బోర్డు అధికారులను ఫోన్లో సంపద్రించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పవన్ కుమార్ యాదవ్, శివకుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు నరేష్ యాదవ్, గోపాల్ యాదవ్, బాలరాజు యాదవ్, గ్రామస్తులు నందీశ్వర్, దశరథ, శ్రీనివాస్ రెడ్డి, రంగనాథ్, మహేందర్ యాదవ్, శంకర్ యాదవ్, చంద్రయ్య యాదవ్, ఎల్.శ్రీనివాస్, ఎన్.యాదగిరి, కె.బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి -
వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పహాడీషరీఫ్కు చెందిన హబీబుల్లాఖాన్ కుమారుడు రహ్మతుల్లాఖాన్(40) తాగుడకు బానిసయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు 2024 జనవరిలో బాలాపూర్ మెట్రో సిటీలోని మా హెల్ప్ డిటెక్షన్ సెంటర్లో చేర్పించారు. ఆరు నెలల పాటు చికిత్స పొందిన అనంతరం రహ్మతుల్లా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం వెతికినా లాభం లేకపోవడంతో సోదరుడు అంజదుల్లాఖాన్ శుక్రవారం రాత్రి పీఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్ పీఎస్లో లేదా 87126 62366 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
పరిహారం మెరుగు!
యాచారం: ఫార్మా రైతులకు త్వరలో తీపి కబురు అందనుందా అంటే ఔననే సమాధానం వస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వడం లేదని మొండికేసిన రైతుల భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసిన రైతులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన భూ రికార్డులను తమ పేరిట మార్చాలని రైతులు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు సానుకూల ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు నిత్యం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. భూరికార్డుల మార్పుతో నాలుగేళ్లుగా బాధిత రైతులు రైతు బంధు, రైతు భరోసా, బ్యాంకు రుణాల మాఫీ కోల్పోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో విక్రయించుకుందామంటే అవకాశమే లేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు అధికారంలోకి వచ్చాక స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నాలుగేళ్లుగా బాధిత రైతుల చక్కర్లు యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి 9,851 ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సేకరించడానికి నిర్ణయించారు. అందులో భాగంగా 7,640 ఎకరాలు సేకరించారు. నిర్ణయించిన మేరకు పరిహారం అందజేశారు. ఆయా గ్రామాల్లో దాదాపు 1,500 మందికి పైగా రైతులకు చెందిన 2,211 ఎకరాల పట్టా భూమిని ఫార్మాకు ఇవ్వాలని అప్పట్లో అధికారులు తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. రైతులు ససేమిరా అనడంతో రాత్రికిరాత్రే అవార్డులు పాస్ చేసి, పరిహారం డబ్బులను అథారిటీలో జమ చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేశారు. నాలుగేళ్లుగా ఆయా గ్రామాల రైతులు తమ పేర్ల మీద మార్చాలని అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. గతంలోకంటే మెరుగ్గా.. పట్టా రైతుల భూ రికార్డుల విషయం కోర్టు పరిధిలో ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. విషయాన్ని కొద్దిరోజుల క్రితం రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతులు భూమికి భూమి ఇచ్చినా పరవాలేదు అంటుండగా సర్కార్లోని పెద్దలు మాత్రం భూమికిభూమి ఇస్తే రాష్ట్రమంతా అదే సమస్య వస్తుందనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు గతంలో ఇచ్చిన దానికంటే మెరుగైన పరిహారం ఇప్పించి, మెప్పించేలా దృష్టి సారించినట్టు తెలిసింది. పట్టా భూములకు మొదట్లో ఎకరాకు రూ.12.50 లక్షలు, ఆ తర్వాత రూ.16 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెంచి ఇచ్చారు. పరిహారంతో పాటు ఎకరా భూమికి 121 గజాల ప్లాటు ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు రూ.50 లక్షలలోపు పరిహారం, ఎకరాకు 121 గజాల ప్లాటు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. త్వరలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు సీఎం రేవంత్రెడ్డిని కలిసి రైతులకు తీపి కబురు అందించనున్నట్టు తెలుస్తోంది. ఫార్మా రైతులకు తీపి కబురు న్యాయం జరిగేలా సర్కార్ దృష్టి ఎకరాకు రూ.50 లక్షలలోపు పరిహారం, 121 గజాల ప్లాటు ఇచ్చేలా యోచన నాలుగేళ్ల నిరీక్షణకు తెర -
ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి
హయత్నగర్: తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ముందుండి పోరాటం చేశారని, వారికి తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, జిల్లా ఇన్చార్జి ముత్యాల యాదిరెడ్డి అన్నారు. కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజానాట్యమండలి జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, పిల్లల చదువులకు ఫీజులో రాయితీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ నెల 30న జరిగే సదస్సులో కళాకారుల సమస్యలపై చర్చిస్తామని, తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల కార్యదర్శి హరిసింగ్నాయక్, జిల్లా కార్యదర్శి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలి
షాబాద్: ప్రజలకు తాగునీటి ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ను శుక్రవారం పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు. నీటిని సక్రమంగా శుద్ధి చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మిషన్ భగీరథ ఈఎస్సీ కృష్ణాకర్రెడ్డి, ఎస్ఈ ఆంజనేయులు, వాటర్ గ్రిడ్ ఈఈ చల్మారెడ్డి, ఇంట్రా ఈఈ రాజేశ్వర్రావు, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు ప్రపుల్లాకుమార్, గంగ, ప్రియదర్శిని తదితరులు ఉన్నారు. త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి మొయినాబాద్రూరల్: మొయినాబాద్–శంకర్పల్లి మండలాలను కలుపుతూ చిన్నమంగళారం సమీపంలో ఈసీ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వ రగా పూర్తి చేసి, ప్రజలకు ఉపయోగపడేలా చూడా లని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అన్నారు. చిన్నమంగళారం సమీపంలో మూసీవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కనకరత్నం, ఎస్సీ శ్రీనివాస్రెడ్డి, ఈఈ శ్రీరాములు, ఏఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ -
ప్రభుత్వ భూములను పరిరక్షించండి
మహేశ్వరం: అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్ భూములను పరిరక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎస్వీజే కన్వెన్షన్ హాలులో శుక్రవారం పార్టీ 12వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూములు కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రూ.కోట్ల విలువ చేసే భూములు కొంత మంది కబ్జాదారుల చేతిలో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కునే ప్రయ త్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలోని రావిరాల కొంగరఖుర్దు, నాగిరెడ్డిపల్లి, కందుకూరు మండలం అన్నోజిగూడలో ఐటీ, ఎలక్ట్రానిక్ పార్కుల కోసం కార్పొరేట్ కంపె నీలకు కట్టబెట్టేందుకు రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటోందని మండిపడ్డారు. అంతకు ముందు ఆయన కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కమిటీ సభ్యుడు పానుగంటి పర్వతాలు, నియోజకవర్గ కన్వీనర్ దత్తు నాయక్, మండల కార్యదర్శి పల్నాటి యాదయ్య, కందుకూరు మండల కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యూచర్సిటీలోకి మరో ప్రభుత్వరంగ సంస్థ
కందుకూరు: ఫ్యూచర్సిటీలోకి మరో ప్రభుత్వరంగ సంస్థ రాబోతోంది. ఈ మేరకు అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూ సర్వే నంబ ర్ 119, 120లో టీజీఐఐసీ సేకరించి ఫ్యూచర్సిటీకి కేటాయించిన భూముల్లోని 20 ఎకరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కార్యాల యం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి శ్రీదేవి, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక సదరు సర్వే నంబర్లలోని భూములను పరిశీలించారు. రెండు ప్రదే శాల్లో ఏదో ఒకదాన్ని త్వరలో ఆ సంస్థ ఏర్పాటుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వారి వెంట తహసీల్దార్ గోపాల్, ఇతర అధికారులు ఉన్నారు. భూములను పరిశీలించిన అధికారులు -
ఆ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
కేశంపేట: మండల పరిధిలోని పాటిగడ్డ కేజీబీవీలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి సుశీందర్రావు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ‘సాక్షి’లో ఈ నెల 21 ‘టీచర్లు ఫంక్షన్కి.. పాఠాలు గాలికి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీనికి స్పందించిన డీఈఓ సదరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు శుక్రవారం జిల్లా కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారు. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి తుర్కయంజాల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ అన్నారు. పురపాలక సంఘం పరిధి తుర్కయంజాల్లో శుక్రవారం సీఐ గురునాయుడుతో కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడ్డప్పుడు తలకు బలమైన గాయాలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. అనంతరం హెల్మెట్ లేకుండా సాగర్ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి చలాన్లకు బదులు కొత్త వాటిని కొనుగోలు చేయించారు. ఆయన వెంట ఎస్ఐ సాయినాథ్ ఉన్నారు. సహకార సంఘాన్ని సందర్శించిన విద్యార్థులుతుర్కయంజాల్: ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో ఆపరేషన్–2025ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్లో ఇంటర్న్షిప్లో ఉన్న నిజాం కళాశాల, బేగంపేట్ డిగ్రీ కళాశాల విద్యార్థుల బృందం శుక్రవారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘాన్ని సందర్శించింది. సంఘం రైతుల కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పని విధానాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యను కలిసి పలు విషయాలపై చర్చించారు. కొహెడలోని గోదాములను పరిశీలించిన అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీఓ సుధాకర్, సహకార యూనియన్ ఫ్యాకల్టీ ఆర్.సురేఖా రాణి, వై.పరిమళా దేవి, బి.నాగేశ్వర రావు, సీఈఓ వై.రాందాసు పాల్గొన్నారు. జిల్లా పశువైద్యాధికారిగా డాక్టర్ మధుసూదన్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా పశు సంవర్థకశాఖ అధికారిగా డాక్టర్ మధుసూదన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన ఆర్జేడీ బాబుబేరిపై పలు ఆరోపణలు రావడం, ఉన్నతాధికారులు ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించి, ఆ స్థానంలో మధుసూదన్ను నియమించడం తెలిసింది. దీంతో ఆయన జిల్లా పశు వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిపరిశ్రమ అభివృద్ధికి కోసం పాటు పడుతానని తెలిపారు. పశు వైద్య సిబ్బంది అంతా బాధ్యతగా పని చేయాలన్నారు. బాబుబేరిపై చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు ఇక్కడ ఆర్జేడీగా పని చేసిన బాబుబేరిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, గొర్రెల పంపిణీ పథకంలో ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే జిల్లా వైద్య సిబ్బందిపై పలు రకాల వేధింపులకు పాల్పడాడ్డని హైదర్గూడ పీవీసీ డాక్టర్ ఎంకే శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు బేరి తనపై కక్షగట్టాడని, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఫిర్యాదులు చేసు న్నాడని పేర్కొన్నారు. సరిపడా స్టాఫ్ లేకపోవడంతోనే టీకాలు సకాలంలో వేయలేకపోయినట్లు తెలిపారు. రిఫ్రిజిరేటర్లో భద్రపరిచిన వ్యాక్సిన్లను ఉద్దేశపూర్వకంగా సీజ్ చేసి, వాటిని పాడు చేయడమే కాకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చోరీ కేసుల్లో రికవరీ పెరగాలి
● ఎప్పుడొస్తారో.. ఎప్పుడిస్తారో ప్రతి నెల 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన పింఛన్లు పోస్టల్ సిబ్బంది నెలాఖరులో ఇస్తున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో సుమారు 500 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఈ నెలలో ఇవ్వాల్సిన పింఛన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. లబ్ధిదారులు నిత్యం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. శుక్రవారం సైతం ఇలా రోజంతా పడిగాపులు కాశారు. సాయంత్రం వరకు కూడా పోస్టల్ సిబ్బంది రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. – మొయినాబాద్ఇబ్రహీంపట్నం రూరల్: చోరీ కేసుల్లో సొత్తు రికవరీ శాతం పెరగాలని, ఆ దిశగా పనిలో వేగం పెంచాలని రాచకొండ పోలీస్కమిషనర్ సుధీర్బాబు ఆదేశించారు. ఆదిబట్ల పోలీస్స్టేషన్ను శుక్రవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణకు సంబంధించి సీఐ రాఘవేందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసులో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని సూచించారు. ఎన్బీడబ్ల్యూ కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కేసుల ఛేదన, రిసెప్షన్ నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. మహిళా కేసుల విచారణ వేగవంతం చేయాలని చెప్పారు. రౌడీీషీట్ చెకింగ్, లాంగ్ పెండింగ్ కేసులు తేల్చాలని పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఆదిబట్ల పోలీస్స్టేషన్ నిర్వహణ బాగుందని, చోరీ కేసుల్లో జోన్ పరిధిలో మంచి ఫలితాలు సాధించారని కితాబిచ్చారు. లోక్ అదాలత్లో కేసులు రాజీ చేయడంలో చొరవ బాగుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింతగా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు రాజు, వెంకటేశ్, బాల్రాజ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాచకొండ సీపీ సుధీర్బాబు బోడకొండ గుట్టల సందర్శన మంచాల: మండలంలోని బోడకొండ గుట్టలను శుక్రవారం రాచకొండ సీపీ సుధీర్బాబు సందర్శించారు. వాటర్ఫాల్స్ను పరిశీలించి స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ఫాల్స్ పూర్తిగా బండరాళ్లతో కూడి ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకు ప్రమాదమని అన్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైతే పికెటింగ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మంచాల సీఐ మధు, ఎస్ఐ లాలయ్య తదితరులు ఉన్నారు. -
బందోబస్తు మధ్య గుడిసె తొలగింపు
నందిగామ: మోత్కులగూడలోని ఓ వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన గుడిసెను గ్రామ కార్యదర్శి చెన్నయ్య శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం మాకే కేటాయించిందని ఒకరు, కాదు మాకే కేటాయించిందని మరొకరు గొడవ పడుతున్నారు. ఇరువురి మధ్య నెలకొన్న ఈవివాదం చినికిచినికి గాలివానలా మారడంతో రాజకీయ రంగు పులుముకుంది. ఈ స్థలంలో ఓ వ్యక్తి ఇటీవల ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయగా, ఆ స్థలం తమదేనని, తనకు పట్టాతో పాటు, ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్నామని మరో వ్యక్తి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. ఇరవై రోజులుగా ఈ పంచాయితీ కొనసాగుతోంది. ఇరువురూ ఒకరిపై ఒకరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు పట్టా ఉందని చెబుతున్న వ్యక్తి సదరు స్థలంలో ఇటీవల గుడిసె వేశారు. దీన్ని తొలగించాలని కోరుతూ మరో వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం గ్రామ కార్యదర్శి చెన్నయ్య స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య గుడిసెను తొలగించారు. ఈసమయంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ సుమతిని వివరణ కోరగా.. ఇరువురు వ్యక్తులు ప్లాట్లు తమవేనంటున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు, లే అవుట్ మ్యాప్ను పరిశీలించి ప్లాటు ఎవరిదో నిర్ధారిస్తామని, అప్పటివరకు ఎవరూ అందులోకి వెళ్లకూడదని చెప్పామన్నారు. మోత్కులగూడలో ఉద్రిక్త పరిస్థితులు సదరు స్థలంలోకి ఎవరూ వెళ్లొద్దన్న అధికారులు -
అప్పులు తీర్చేందుకు చోరీల బాట
● సీసీ కెమెరాలకు చిక్కిన నిందితులు ● అన్నదమ్ములకు రిమాండ్ యాచారం: ప్రైవేట్ ఉద్యోగస్తులైన ఇద్దరు అన్నదమ్ము లు అప్పులు తీర్చేందుకు చోరీల బాటపట్టారు. చివరకు సీసీ కెమె రాల ఆధారంగా పోలీసులకు చిక్కారు. ఈ మేరకు శుక్రవారం వారిని రిమాండ్కు తరలించారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన నరేశ్, ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లికి చెందిన వెంకటేశ్ వరుసకు అన్నదమ్ములు. ఈ నెల 23న మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన బండ పార్వ తమ్మ నక్కర్తమేడిపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తక్కళ్లపల్లి గేట్ వద్ద బస్సు ఎక్కేందుకు రోడ్డుపై వేచియుంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన అనదమ్ము లు హెల్మెట్లు ధరించి బైక్వచ్చి పార్వతమ్మ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెల్లారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసు లు శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి అపహరించిన పుస్తెలతాడును స్వాధీ నం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. -
గోదాం పైనుంచి పడి కూలీ మృతి
హయత్నగర్: రేకుల షెడ్డు పైకప్పు నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిఽధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కొహెడకు చెందిన పొట్లచెరువు మల్లేశ్(55) తోటి కార్మికులతో కలిసి శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ విత్తనాల కంపెనీ గోదాం పైకప్పు రేకులను మార్చే పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనస్తాపంతో ఆత్మహత్య ఇబ్రహీంపట్నం: బిహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన వివేక్(23) ఇదే రాష్ట్రానికి చెందిన కాంచన అనే అమ్మాయిని ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇబ్రహీంపట్నానికి వచ్చి ప్రగతినగర్లో నివాసముంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వివేక్ భార్య బయటకు వెళ్లిన సమయంలో, వెంటిలెటర్కు చీర కట్టి ఉరేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వచ్చి తలుపులు తీసి చూడగా చలనం లేకుండా కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హుండీ చోరీకి విఫలయత్నం ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు దర్గాలో హుండీ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ్పరకారం.. చర్లపటేల్గూడకు వెళ్లే మార్గంలోని జహంగీర్పీర్ దర్గా వద్ద హుండీని భూమిలోకి ఉంచి చుట్టూ సిమెంట్తో ఏర్పాటు చేశారు. ఈ హుండీని పెకిలిచేందుకు గుర్తు తెలియని దుండుగుల చుట్టూ ఉన్న సిమెంట్ తవ్వారు. ప్రయత్నం విఫలమవడంతో మధ్యలోనే వదిలి వెళ్లారు. దుండగుల ఆచూకీకి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రభుత్వ పాఠశాల స్థలంలో ఇళ్ల నిర్మాణం
కూల్చివేయించిన రెవెన్యూ అధికారులు చేవెళ్ల: ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య హెచ్చరించారు. నాంచేరి రెవెన్యూ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్లో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడు ఇళ్లను శుక్రవారం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇంద్రారెడ్డి నగర్లో ప్రభుత్వ పాఠశాలకు సర్కార్ 2.20 ఎకరాల స్థలం కేటాయించింది. ఇక్కడ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. చుట్టూ ఖాళీ స్థలం ఉండడంతో ఏడుగురు స్థానికులు ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐలు చంద్రమోహన్, పవన్, సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ సంతోష్కుమార్ వెళ్లి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో రెవన్యూ సిబ్బంది నర్సింలు, ప్రకాశ్, ఆంజనేయులు, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నిర్మాణాల్లో అధికార పార్టీకి చెందిన నాయకుడి కుమారుడి ఇళ్లు ఉండడం విశేషం. వీధి కుక్క స్వైర విహారం కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం వాచ్చతండా గ్రామపంచాయతీ దేవులనాయక్తండాలో శుక్రవారం వీధికుక్క స్థైర్య విహారం చేసింది. తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి, గాయపరిచింది. మేకలు, కోళ్ల వెంటపడుతున్న కుక్కను నేనావత్ చందర్, సబావత్ సక్రీబాయ్ అదిలించే ప్రయత్నం చేయగా వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు తెలిపారు. పక్కనే ఉన్న ముడావత్ హర్షవర్ధన్(5)పై దాడిచేసి గాయపరిచిందని పేర్కొన్నారు. కుక్కల దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ కుల్కచర్ల: దుకాణదారులు ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవానలి కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద కెమెరాలతో సమానమన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీలు జరిగిన సమయంలో నిందుతులను సులువుగా పట్టుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
కొండంత బోనం.. కోటంత సంబురం
గోల్కొండ కోట ఆధ్యాత్మిక పరిమళాలతో అలరారింది. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలతో పరవశించింది. ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం తొలి బోనం పూజ ఘనంగా జరిగింది. ఆషాఢ మాసంలో గురు, ఆదివారాల్లో జరిగే మొత్తం తొమ్మిది బోనాల ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి వారం బోనాల జాతరకు వీఐపీలతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గోల్కొండ ఫతేదర్వాజా నుంచి ఘటాల ఊరేగింపు ముందుకు సాగింది. – సాక్షి, సిటీబ్యూరో -
పోలీస్ పహారాలో ఎనికేపల్లి
మొయినాబాద్: గోశాల ఏర్పాటుకు కేటాయించిన ఎనికేపల్లి భూముల్లో పోలీస్ పహారా కొనసాగుతోంది. సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు కేటాయించిన విషయం తెలిసిందే. ఏడు దశాబ్దాలుగా భూములు సాగుచేసుకుంటున్న రైతులకు పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు పూర్తి స్థాయిలో పరిష్కరించలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం హెచ్ఎండీఏ అధికారులు భూములు సర్వే చేసేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న కొంతమంది రైతులు అక్కడికి చేరుకున్నారు. మహిళా రైతులు అక్కడే కూర్చొని రోదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భూముల్లోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు. హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేయకుండానే వెనుతిరిగారు. పోలీసుల పహారా సాయంత్రం వరకు కొనసాగింది. ఎమ్మెల్యే యాదయ్యను కలిసిన రైతులు భూములు కోల్పోతున్న రైతులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో కలిశారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం పెంచాలని.. ఎకరాకు సుమారు వెయ్యి గజాల స్థలాన్ని ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం రైతులను తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్లారు. ఎకరాకు 800 గజాల స్థలాన్ని ఇవ్వాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంత ఇవ్వలేమని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 గజాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీసం 400 గజాలైనా ఇవ్వాలని కోరగా అంత ఇవ్వలేమని కలెక్టర్ తేల్చి చెప్పారు. దీంతో మీపని మీరు చేసుకోండి.. వారిపని వారు చేసుకుంటారని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. పరిహారం విషయం ఎటూ తేలలేదు. సర్వే చేసేందుకు వచ్చిన హెచ్ఎండీఏ అధికారులు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న రైతులు అడ్డుకుని వెనక్కి పంపించిన పోలీసులు ఎమ్మెల్యే, కలెక్టర్ను కలిసిన బాధితులు ఎటూ తేలని పరిహారం విషయం -
ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు
తుర్కయంజాల్: ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంద్రాణి తెలిపారు. ఇంజాపూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్ 199లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కూల్చివేశా రు. ఈ సందర్భంగా ఇంద్రాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సంజీవ్ పాల్గొన్నారు. అధిక ఫీజులను నియంత్రించాలి షాద్నగర్ః అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం సంఘం జిల్లా సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషనరీ, పుస్తకాలు, డొనేషన్లు, ఫీజుల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్కుమార్, నాయకులు మణికంఠ, అరుణ్, వినోద్, వంశీవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం యాచారం: మండలంలోని తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ భూ బాధిత రైతులు గురువారం సమావేశమయ్యారు. టీజీఐఐసీ పేరు తీసేసి రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేయాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చినా అధికారుల్లో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులను ఎలా సాధించుకుందా మని చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులు, రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేసి రైతు భరోసా కల్పించడం, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. రైతుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కవులు సరస్వతి, నారాయణ, నిరంజన్, వినోద్రెడ్డి, గణేశ్, మహేందర్రెడ్డి పాల్గొన్నారు. న్యాయం చేయండి తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇంజాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 383లో హెచ్ఎండీఏ వెంచర్ ఏర్పాటు కోసం భూమి ఇచ్చిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. వెంచర్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న భూమిని కోల్పోయినందుకుగాను 100 మంది రైతులకు 300 గజాల చొప్పున ప్లాట్ కేటాయిస్తున్నట్లు అప్ప టి ఆర్డీఓ, తహసీల్దార్ పత్రాలు అందజేశా రని తెలిపారు. అప్పట్లో ముగ్గురికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారని, మిగతా వారిని అలానే వదిలేశారన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలాయపన చేస్తున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్డీఓ, తహసీల్దార్ను కలవగా ఫైల్ తమ వద్ద లేదని, తాము ఏమీ చేయలేమని చెబుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి
షాద్నగర్రూరల్: ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసేందుకు పన్నుతున్న కుట్రలను ఆపాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కువద్ద శుక్రవారం చేపట్టనున్న ధర్నా కరపత్రాన్ని గురువారం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ.. సర్కారు బడులను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఆడిట్ కన్వీనర్ రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు అర్జునప్ప తదితరులు పాల్గొన్నారు. -
క్షయవ్యాధి నిర్మూలనే ధ్యేయం
షాద్నగర్రూరల్: క్షయవ్యాధిని నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చించోడ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు స్రవంతి ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ, హెచ్ఐవీ, ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు ఉన్నవారు వెంటనే గల్ల పరీక్ష, ఎక్స్రే తీయించుకోవాలని తెలిపారు. ఈ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తారన్నారు. టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం మందులను ఉచితంగా ఇస్తుందని, క్రమం తప్పకుండా ఆరు నెలలు వాడితే వ్యాధి నయమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ, డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్లు, టీబీ సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. -
మూగ వేదన!
సుస్తీ చేసిన పశువులకు చికిత్స కరువు● మృత్యువాత పడుతున్న మూగజీవాలు ● అందుబాటులో ఉండని పశువైద్యులు ● వ్యాక్సిన్లు వేయకున్నా వేసినట్లు రికార్డులు ● ప్రభుత్వ ఆస్పత్రిలో జీతం.. ప్రైవేటులో విధులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: పశువులకు సుస్తీ చేస్తే సరైన చికిత్స అందక మూగ వేదన అనుభవిస్తున్నాయి. వివిధ రకాల వ్యాధులతో మృత్యువాతపడుతున్నాయి. వాటినే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న రైతులకు తీరని శోకం మిగుల్చుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్య కేంద్రాల్లో పశువైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి, సీజన్ల వారీగా పశువులకు వచ్చే గాలికుంటు, ముద్ద చర్మ వ్యాధులు, పీపీఆర్(పారుడు), నట్టలతో వచ్చే జబ్బులపై అవగాహన కల్పించాలి. కొంత మంది వైద్యులు రోజుల తరబడి పశువైద్య కేంద్రాల ముఖం కూడా చూడడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అభాసుపాలు చేస్తున్నారు. వ్యాక్సిన్లు వేయకుండానే వేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి ఇటీవల చేపట్టిన వరుస తనిఖీల్లో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. ఆస్పత్రుల ముఖం చూడని వైద్యులు జిల్లాలో 10,31,460 పశువులు, 2,40,69,700 కోళ్లు, 1.67 లక్షల గేదెలు, 7,67,125 మేకలు, 2,56,632 గొర్రెలు, 6,076 పందులు, 1,535 గుర్రాలు, 16 గాడి దలు, 27,200 కుక్క లు, 2,947 కుందేళ్లు ఉన్నట్లు అంచనా. సీజన్ మారిన సమ యాల్లో పశువులు పలు వ్యాధుల బారినపడుతుంటాయి. వాటికి సత్వర చికిత్స కోసం ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నాలుగు ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, 46 ప్రాథమిక కేంద్రాలు, ఐదు మొబైల్ క్లినిక్స్, 87 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆరుగురు సహాయ సంచాలకులతో పాటు 48 మంది పశు వైద్య సహాయ శస్త్రచికిత్సకులు, 16 మంది వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్లు, 31 మంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు, 53 మంది లైవ్ స్టాక్ అసిస్టెంట్లు, 37 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, 117 మంది ఆఫీసు సబార్డినేటర్లను నియమించింది. వీరంతా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా పశువైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి. మెజార్టీ పశువైద్యులు ఆస్పత్రులకు రావడం లేదు. మచ్చుకు కొన్ని.. ● కొందుర్గు ప్రాథమిక వెటర్నరీ క్లినిక్ వైద్యుడు ప్రభుత్వ పశువైద్యశాలలో కంటే.. తన ప్రైవేటు క్లినిక్లోనే ఎక్కువ ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తరచూ విధులకు గైర్హాజరవుతుండడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఇదే అంశం స్పష్టమైంది. ● కనకమామిడి ప్రాథమిక వెటర్నరీ క్లినిక్ వైద్యుడిది సైతం ఇదే ధోరణి. ● ఆమనగల్లు వెటర్నరీ క్లినిక్లో పశువులకు చేసిన వైద్య పరీక్షలు, అందించిన చికిత్సల వివరాలు వైద్యుడు రాకపోవడంతో కిందిస్థాయి సిబ్బందే రికార్డు చేస్తుండటం విశేషం. బక్రీద్ విధుల్లో భాగంగా ఇక్కడి వైద్యుడికి శంకర్పల్లిలో డ్యూటీ వేయగా అంతదూరం వెళ్లనని చెప్పి, తర్వాత అదనపు డైరెక్టర్ ఆర్డర్ను సైతం ట్యాంపరింగ్ చేసి తనకు అనుకూలమైన ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. వ్యాక్సిన్ సీలు కూడా తీయకుండా.. గాలికుంటు వ్యాధి రహిత దేశంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక (ఎఫ్ అండ్ ఎండీ) టీకాల కార్యక్రమాన్ని ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఇందుకు ఏటా రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. హైదర్గూడ ప్రభుత్వ ప్రాథమిక పశువైద్య కేంద్రం(పీవీసీ)లోని వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు రికార్డు చేశారు. ఈ సెంటర్కు 110 ఎఫ్ఎండీసీ వ్యాక్సిన్ బాటిళ్లను సరఫరా చేయగా, ఒక్కో బాటిల్ 50 పశువుల చొప్పున 5,249 పశువులకు వ్యాక్సిన్ వేసినట్లు రాశారు. ఏ ఒక్క దానికీ వ్యాక్సిన్ వేయలేదు. సీల్ కూడా తీయని 25 బాటిళ్లను ఇటీవల తనిఖీ కోసం వచ్చిన జిల్లా అధికారి గుర్తించి స్వాధీనం చేసుకోవడం విశేషం. ఇక ఒక బాటిల్ 30 పశువులకు మాత్రమే వచ్చే బ్లాక్ వాటర్ వ్యాక్సిన్ను ఏకంగా 134 పశువులకు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేశా రు. ఇచ్చిన మూడు బాటిళ్లలో సీల్కూడా తీయని రెండు బాటిళ్లు అక్కడే ఉన్నాయి. ఆయా బాటిళ్లను జిల్లా అధికారి ఇటీవల సీజ్ చేశారు. తనిఖీ సమ యంలో ఆస్పత్రికి తాళం వేసినట్లు గుర్తించి, సదరు వైద్యురాలిని హెచ్చరించారు. వరుస తనిఖీలతో హడలెత్తించిన సదరు జిల్లా వైద్యాధికారిపై కొంత మంది ఉద్దేశపూర్వకగా ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి బదిలీ చేయించారు. ఈ అంశాన్ని కలెక్టర్ సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. -
జేసీబీతో పని పేరిట మోసం
సిరిసిల్ల క్రైం: జిల్లాలో పలు ప్రాంతాల్లో జేసీబీతో భూమి చదును చేసే పనులు ఉన్నాయంటూ నమ్మబలికి డబ్బులు గుంజుతున్న ఇద్దరిని తంగళ్లపల్లి పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన గోల్కొండ చందుకుమార్, చింతపట్టి అనే ఇద్దరు యువకులు జిల్లాలోని పలువురు జేసీబీ యజమానులకు ఫోన్ చేశారు. వేములవాడ సమీపంలోని అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని.. అందులో చెట్లను చదును చేయడానికి జేసీబీ కావాలని కోరారు. ఎంట్రీ ఫీజు కోసం రూ.9వేలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలికారు. అంతేకాకుండా వారి ఫోన్లకు డబ్బులు స్కానర్ ద్వారా పంపించుకున్నారు. డబ్బులు పంపిన వారు పని కోసం ఫోన్చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించి తంగళ్లపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. వీరి బాధితులు ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఇద్దరు, ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ఒకరు ఉన్నట్లు తెలిపారు. తంగళ్లపల్లి స్టేషన్లో ఫిర్యాదు ఇద్దరి రిమాండ్ -
మట్టి లారీల సీజ్
ఇబ్రహీంపట్నం: అధిక మట్టి లోడుతో వెళ్తున్న ఐదు లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారి(ఆర్టీఓ) సుభాష్ చంద్రరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో సమీపంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు సుశీల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డిలు తనిఖీలు చేపట్టారు. అధిక లోడ్తో మట్టిని తరలించడమేగాక, మట్టిపై ఎలాంటి కవర్ వేయకుండా తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఐదు టిప్పర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. వాహనాలను తాత్కాలికంగా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఉంచారు. లోడ్పై కవర్ కప్పాలి వాహనాల్లో తరలించే మట్టి లోడ్పై తప్పని సరిగా కవర్లను కప్పాలని ఆర్టీవో సూచించారు. కవర్స్ కప్పక పోవడంతో ఆ వాహనాల నుంచి మట్టి ఎగిరిపడుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తుందన్నారు. అధిక లోడ్తో వెళ్లే వాహనాలపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
ఇంటి నుంచి బయటకు వెళ్లి
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ దయాకర్రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ గ్రామానికి చెందిన జర్పుల దేశ్య కుమార్తె రజిత(26) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ కోసం సాధ్యమైన ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె తల్లి సీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. షాబాద్లో వివాహిత.. షాబాద్: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన సొన్నాయిల స్వాతి ఈ నెల 22వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఆమె భర్త నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే వెంటనే 99897 92750 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల అదృశ్యం -
కారు ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతి
షాద్నగర్ రూరల్: కారు ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన సంఘటన పట్టణ సమీపంలోని కేశంపేట బైపాస్ చౌరస్తాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్లోని కిషన్బాగ్కు చెందిన డ్రైవర్ జావిద్అలీ (55) డీసీఎం తీసుకుని మహబూనగర్ నుంచి హైదబాద్వైపు వెళుతున్నాడు. డీసీఎంలోని సామాను దింపేందుకు షాద్నగర్ బైపాస్ వద్ద వాహనాన్ని ఆపి, కిందికి దిగి డీసీఎం వెనక వైపునకు వచ్చాడు. ఈ సమయంలో మహ్మద్ ఫసియొద్దీన్ కారులో మహబూబ్నుంచి హైదరాబాద్వైపు అతివేంగంగా వెళ్తూ.. అదుపు తప్పడంతో ఆటోను ఢీ కొట్టాడు. అనంతరం డీసీఎం వెనక నిలబడి ఉన్న జావిద్అలీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జావిద్అలీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిడక్కడే మృతి చెందాడు. ఆటో నడుపుతున్న నర్సింలు కాలు విరిగింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలను తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియచేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆటో డ్రైవర్ను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ కుమారుడు గౌతమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజేశ్వర్ తెలిపారు. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు కేశంపేటబైపాస్ చౌరస్తాలో ప్రమాదం -
మొక్కుబడిగా సామాజిక తనిఖీ
మంచాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల నిర్వహణపై మంచాలలో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం గురువారం మొక్కుబడిగా సాగింది. ప్రజలు ఎవరూ హాజరు కాకపోవడంతో అధికారులు, సోషల్ ఆడిట్ సిబ్బందితోనే కార్యక్రమం ముగిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.3.51 కోట్లు, అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ. 2.32 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.71 కోట్లు పని జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల నిర్వహణపై ప్రజా వేదికను డీఆర్డీఓ శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించారు. పనుల కొలతల్లో తేడాలు, బినామీల పేర్లతో పనులు చేసినట్లు తెలిసింది. పనుల వివరాలను రికార్డు నమోదు కూడా సక్రమంగా చేయలేదని తేలింది. ప్రధానంగా పని చేయని వారి పేర్ల మీద పని చేసినట్లు హాజరు నమోదైంది. ఈసీ ఫీల్డ్ విజిట్ చేయకుండా మంచాలలో నెల రాక ముందే రికార్డులు నమోదు చేశారు. ఏపీఓ సంతకాలు లేకుండా మస్టర్లు తయారు చేశారని ఆరోపించారు. రంగాపూర్ నర్సరీలో 40 వేల మొక్కలు ఎక్కడ నాటారనే విషయంలో స్పష్టత లేదు. అనంతరం డీఆర్డీఓ కల్పించుకొని.. కచ్చితంగా నర్సరీలలో పెంచిన మొక్కలు గ్రామంలో ఎక్కడెకక్కడ నాటారో రికార్డు చేయాలన్నారు. కొన్ని గ్రామాల్లో మస్టర్ పూర్తి చేసిన అనంతరం తిరిగి రాశారని సామాజిక తనిఖీ బృందం ఆరోపించింది. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి, ఎంపీడీఓ బాలశంకర్, అంబుడ్స్మెన్ సునీత, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్ గౌతమ్, సామాజిక తనిఖీ అధికారి అంజయ్యగౌడ్, ఎంపీఓ ఉమారాణి, ఏపీఓ వీరాంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణలో అవకతవకలు సమావేశంలో డీఆర్డీఓ శ్రీలత -
మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
శంకర్పల్లి: మండల పరిధిలోని చందిప్ప మరకత శివాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కోడలు సుహాసిని సందర్శించారు. బుధవారం ఆమె ఆలయంలోని మరకత శివలింగానికి సమీప బంధువుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు(నీలి రంగు చీర ధరించిన) ఆలయ గౌరవ అధ్యక్షుడు సదానందంగౌడ్, చైర్మన్ గోపాల్రెడ్డి, ప్రధాన అర్చకుడు సాయిశివలు శాలువాతో సత్కరించారు. మరకత శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దర్శన్గౌడ్, అనంత్రెడ్డి పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థలో మార్పే లక్ష్యం
● అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యమే ప్రధానం ● విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి మంచాల: అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్స్కూ ల్లో కొనసాగుతున్న పనులు, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన వంగూరు, పోల్కంపల్లి గ్రామాలకు చెందిన పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు 150 మంది విచ్చేశారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చామన్నారు. పేరెంట్స్ కమిటీ సహకారంతో 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 2 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని చెప్పారు. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరిధర్గౌడ్, సుప్రియ, ఉపాధ్యాయులు కిషన్ చౌహాన్, మోహన్, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఎం.డీ.జానీపాష, నూకం రాజు, భాస్కర్, జంగయ్య, శ్రీశైలం, స్వాతి, జ్యోతి, పారిజాత, సంధ్య, పార్వతి, మల్లేశ్ తదితరులుపాల్గొన్నారు. -
భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
మొయినాబాద్: ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ హెచ్చరించారు. మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలోని సర్వేనెంబర్ 155లో 1.14 ఎకరా ల ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల ను బుధవారం రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి జేసీబీతో కూల్చివేశారు. కబ్జాకు గురైన ప్రభు త్వ భూమిని కాపాడి బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాదారులు ప్రభుత్వ భూముల జోలికొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షించడంకోసం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ ఆదేశాలతో త్వరలో ఫెన్సింగ్ వేయడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూచిక బోర్డులు సైతం ఏర్పా టు చేసి ప్రభుత్వ భూములపై నిఘా పెడతామన్నా రు. ఎవరైనా ప్రభుత్వ భూము ల్లో అక్రమ నిర్మా ణాలు చేపట్టినా, కబ్జా చేసిన స్థానిక ప్రజలు రెవె న్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కూల్చివేతల్లో ఆర్ఐ రాజేశ్, సిబ్బంది భాస్కర్, భరత్, అంజయ్య తదితరులు ఉన్నారు. మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ -
సర్వే నంబర్లు మాయం
రికార్డుల్లో ఒకరు.. పొజిషన్లో మరొకరు● పక్కాగా నిర్ధారిస్తే తప్పా తేలని పంచాయితీ ● వేధిస్తున్న సర్వేయర్ల కొరత ● రెవెన్యూ సదస్సుల్లో సర్వేనంబర్ల మిస్సింగ్కు 8,996 ఫిర్యాదులు ● జూలై 10లోగా సమస్యల పరిష్కారం సాధ్యమేనా..? సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని పలు భూముల సర్వే నంబర్లు మాయమయ్యాయి. క్షేత్రస్థాయిలోని భూములకు, రెవెన్యూ కార్యాలయాల్లోని రికార్డులకు అసలు పొంతన కుదరడం లేదు. జూన్ మూడు నుంచి 23 వరకు నిర్వహించిన భూ భారతి సదస్సుల్లో భాగంగా ప్రజల నుంచి సర్వే నంబర్ల మిస్సింగ్కు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా అందాయి. ప్రజల నుంచి వచ్చిన ఈ అర్జీలను జూలై 10లోగా పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వం సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించింది. భూ కొలతలు పక్కగా నిర్వహించకుండా, ఉన్న భూములకు హద్దులు నిర్ధారించకుండా, ఏ సర్వే నంబర్లో..? ఏ ఏ పట్టా దారులున్నారో? తేల్చకుండా భూ సమస్యలు పరిష్కారం అవు తా యా అంటే అధికారుల వద్ద సమాధానం లేదు. అందిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా, ఆమోదించడమో..తిరస్కరించడమో? చేయాల్సి ఉంది. అకా రణంగా తిరస్కరిస్తే.. ఆయా అర్జీదారులు అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండటంతో ఏం చేయాలో? తోచక అధికారులు తలపట్టుకుంటున్నారు. హద్దులు దాటిన గద్దలు జిల్లాలో 12,43,035 లక్షల ఎకరాల భూములుండగా వీటిలో 2,18,53.02 ఎకరాల ప్రభుత్వ, 64,803 ఎకరాలు అటవీ భూములున్నాయి. జిల్లా వ్యాప్తంగా 90,911 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా ఇందులో 52,315 మంది నిరుపేద రైతులకు 75,450.29 ఎకరాలను అసైన్ చేసింది. మరో 25, 597.35 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.అసైన్డ్ చేసిన భూమిలో ఆ తర్వాత 9,8 85.13 ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించి, 42, 278 అసైన్డ్ ఉల్లంఘన కేసులను నమోదు చేసింది. ● భూదాన్ బోర్డు పేరున 21,931.03 ఎకరాలుండగా, దీనిలో 9,678 మంది నిరుపేదలకు పంచారు. మిగలిన భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. – దేవాదాయశాఖకు 9,360.01 ఎకరాల భూములు ఉండాల్సి ఉండగా, వీటిలో ఇప్పటికే 1,148.15ఎకరాలు అన్యాక్రాంతమైంది. ● భూపరిమితి చట్టం(యూఎల్సీ) పరిధిలో 9 వేల ఎకరాలకుపైగా భూములుండగా.. వీటిలో 840 ఎకరాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. ● వక్ఫ్బోర్డు పరిధిలో 14,785.17 ఎకరాలు ఉండగా, వీటిలో ఇప్పటికే 13,480.25 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది. పొజీషన్కు భిన్నంగా సర్వే నంబర్లు ప్రభుత్వ, పట్టా భూములతో పాటు అటవీ,సీలింగ్, లావణి, శిఖం పట్టా భూములు కూడా ఉన్నాయి. అనేక సర్వే నంబర్లలోని భూములు రెవెన్యూ నక్షకు, విస్తీర్ణానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభు త్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్లోనూ ఈ లోపాలు భారీగా బయటపడ్డాయి. భూ విస్తీర్ణానికి మించి రికార్డుల్లో పేర్లు నమోదయ్యాయి. పొజిషన్కు భిన్నంగా సర్వే నంబర్లు, రికార్డులు,పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. నిజమైన లబ్ధిదారులతో పాటు అడ్డదారుల్లో భూములు కొల్లగొట్టిన వారు సైతం దరఖాస్తులు సమర్పించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఆయా బాధితులు మాన్యువల్గా అందజేసిన దరఖాస్తులను, ప్రస్తుతం సిటిజన్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఆయా ఆర్జీలన్నీ భూ భారతి పోర్టల్కు చేరుకోనున్నాయి. కొత్త నియామకాలు చేపట్టకుండా.. భూములన్నీ నగరానికి ఆనుకుని ఉండడం, ఐటీ, రియల్ ఎస్టేట్ కారణంగా జిల్లాలోని భూ ముల ధరలు అమాంతం పెరిగిపోవడం, అదే స్థాయిలో భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సరిహ ద్దు వివాదాలు వెలుగు చూడటం తెలిసిందే. ఈ వివాదాల పరిష్కారంలో సర్వేయర్లు ఇచ్చే రెవె న్యూ నివేదికలే కీలకంగా మారుతుంటాయి. జిల్లాలో 27 మండలాలుండగా, 526 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో కేవలం 14 మంది మాత్రమే సర్వేయర్లు పని చేస్తున్నారు. రెండు మండలాలకు ఒకరే సర్వేయర్ పని చేస్తున్నారు. భూ కొలతల నిర్ధారణకు సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని బాధితుల నుంచి వస్తున్న అభ్యర్థనలకు.. హద్దులు నిర్ధారించి ఇస్తున్న నివేదికలకు అసలు పొంతనే ఉండడం లేదు. ఒక్కో విస్తీర్ణాన్ని రెండు నుంచి మూడు సార్లు సర్వే చేయాల్సి వస్తుండడం, ప్రభుత్వ ప్రాజెక్టులకు భూమిని సేకరించడం, ప్రైవేటు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాల్సి వస్తుండడం ఇబ్బందిగా మారింది. పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల అర్హులైన ప్రైవేటు వ్యక్తులను (లైసెన్స్డ్ సర్వేయర్లు) ఎంపిక చేసి నెల రోజులుగా శిక్షణ ఇస్తోంది. ఏళ్ల తరబడి కొత్త వాళ్లను నియమించకుండా పాతవాళ్లకు పని భారాన్ని తగ్గించకుండా మాయమైన ఈ సర్వే నంబర్ల గుర్తింపు ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం ఆశిస్తున్నట్లు జూలై పదిలోగా ఈ సమస్యలన్నీంటికీ పరిష్కార మార్గం లభిస్తుందా? అంటే అనుమానమే. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులు ఇలా..అంశం అర్జీలు పంపిణీ చేసిన దరఖాస్తులు 34,453 ప్రజల నుంచి అందిన ఆర్జీలు 21,050 మిస్సింగ్ సర్వేనంబర్లు 8,966 మ్యూటేషన్ పెండింగ్ 1,165 డీఎస్ పెండింగ్ 1,158 ఎక్స్టెంట్ కరెక్షన్ 1,932 లాండ్ నేచర్/క్లాసిఫికేషన్ 967 నేమ్ కరెక్షన్ 742 నిషేధిత జాబితా నుంచి తొలగించుటకు 1,557 నిషేధిత జాబితాలో చేర్చేందుకు 08 అసైన్డ్ భూముల సమస్యలు 656 ఓఆర్సీ నాట్ ఇష్యూడ్ 142 38ఇ సర్టిఫికెట్ నాట్ ఇష్యూడ్ 24 సక్సేషన్ పెండింగ్ 1,652 భూ సేకరణ 64 ఇతర సమస్యలు 2,217 -
‘స్థానిక’ సందడి!
● హైకోర్టు తీర్పుతో పల్లెల్లో మళ్లీ కదలిక ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు ● రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలకు లై న్ క్లియరైంది.మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి కే గ్రామ పంచాయతీలు, వార్డులు, ఓటర్ల జాబితా ను సిద్ధంగా ఉంచిన అధికార యంత్రాంగం మరో సారి వాటిని సరి చూసుకునే పనిలో నిమగ్నమైంది. 2024 జనవరి 30తో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పాలక మండళ్లు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు అందక అధికారులు ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, వీధి లైట్లు, డ్రైనేజీల క్లీనింగ్, బోరుబావుల, మోటార్ల రిపేర్లకు అప్పులు చేయాల్సిన దుస్థితి. దీంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వారు సైతం ఓటర్లను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎన్నికల నిర్వహణ పై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ సందడి మొదలైంది. అయితే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై ఇప్పటికీ ఓ స్పష్టత రాకపోవడం ఆశావహులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలా? సర్పంచ్లా? జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు.. ఔటర్ లోపల ఉన్న పాత మున్సిపాలిటీల్లో సమీప గ్రామా ల విలీనంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాలతో పాటు సర్పంచ్ స్థానాలు తగ్గాయి. గతంలో 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉండగా, కొత్తగా మెయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ స్థానాల సంఖ్య 257 నుంచి 232 కి తగ్గింది. జిల్లా వ్యాప్తంగా గతంలో 558 గ్రామ పంచాయతీలుండగా, ప్రస్తుతం 32 గ్రామాలు ఆ యా మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో వీటి సంఖ్య 526కు చేరింది. ఇటీవల కొత్తగా మరికొన్ని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. అయితే స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు చేయాలని కోరుతూ కొంత మంది కోర్టును ఆశ్రయించడం, ఇదే అంశంపై ప్రభుత్వం కొంత వరకు కసరత్తు చేయడం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికల్లోనూ పాత రిజర్వేషన్ పద్ధతినే కొనసాగిస్తారా? కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొస్తారా? అనే అంశంపై స్పష్టత కొరవడింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహిస్తారా? అనేది కూ డా తేలాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఓటర్ల జాబితా, వార్డులు, పంచాయతీలు తదితర వివరాలను సరిచూసుకునే పనిలో పడ్డారు.జీహెచ్ఎంసీ డివిజన్లు మహేశ్వరం 02 ఎల్బీనగర్ 11 గచ్చిబౌలి 07 రాజేంద్రనగర్ 05 -
రేపు మార్కెట్ దుకాణ సముదాయం ప్రారంభం
ఆమనగల్లు: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్యార్డులో నిర్మించిన దుకాణ సముదాయాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడురు భాస్కర్రెడ్డి తెలిపారు. బుధవారం వారు పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్యార్డులో దుకాణ సముదాయం ప్రారంభ ఏర్పాట్లను మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం నర్సింహ, భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. మార్కె ట్ యార్డులో రూ.65లక్షలు వెచ్చించి ఎనిమిది దుకాణాలు నిర్మించామని.. ఈ దుకాణాలను శుక్రవారం నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభింస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు శ్రీశైలం, పాండురంగయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేయండి డాక్టర్ చంటి ముదిరాజ్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, అధ్యక్షురాలు సూర స్రవంతి, ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈఓ సుశీందర్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఫీజులను నియంత్రించి, విద్యాహక్కు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించాలని కోరారు. ఆ మేరకు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రాఘవేందర్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.దిలీప్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి ఆమనగల్లు: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జి ల్లా అధ్యక్షుడు సక్రునాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మున్సిపల్ కార్యాలయం కమిషనర్ శంకర్నాయక్కు వినతిపత్రం అందజేశారు. సక్రునాయక్ మాట్లాడుతూ.. ప్రభు త్వం మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ రూ.25 వేల కనీస వేతనం, కార్మికులకు ఇచ్చే కిట్లు, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్మికులు విజయ, వెంకటమ్మ, లక్ష్మమ్మ, పెంటయ్య,రాములు, మహేందర్, శ్రీను, మహేశ్, ప్రశాంత్, విజయ్, మేగ్య పాల్గొన్నారు. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బోనాల నిర్వహణకు 2,783 దేవాలయాలకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. బోనాల సందర్భంగా దేవాలయాల్లో ఊరేగింపు దశ గతంలో స్వాగతం, శోభాయాత్ర, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల వీరంగాలు , ఎదుర్కోలు, అమ్మవార్లకు బోనాల సమర్పణ, పట్టు వస్త్రాల సమర్పణ, కళా ప్రదర్శనలు కార్యక్రమాల నిర్వహణకు నిధులు వెచ్చించనున్నట్లు మంత్రిపేర్కొన్నారు. -
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
● జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మావతియాచారం: విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో రైతులను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మావతి హెచ్చరించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ధరకు విత్తనా లు, ఎరువులు అమ్ముతున్నారు, ధరలు ఎలా ఉన్నా యి, రైతులకు రసీదులు ఇస్తున్నారా.? కాలం చెల్లిన విత్తనాలను, ఎరువులను రైతులకు విక్రయిస్తున్నా రా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపారులు అధిక లాభార్జన ఆశతో రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లపై రైతులకు వెంటనే రసీదులు ఇవ్వాలని సూచించారు. స్టాక్బోర్డులు, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్పోర్స్ సీఐ ముద్రాస్ అలీ, సీడ్స్ సర్టిఫికేషన్ అధికారి లావణ్య, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్ పాల్గొన్నారు. ఫెర్టిలైజర్ షాపుల తనిఖీ మాడ్గుల: మండల స్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మజ అన్నారు. బుధవారం ఆమె మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. పంటల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ అధికారి లావణ్య, ఎస్ఓటీ అధికారులు ముదస్సిర్ అలీ, వ్యవసాయ అధికారి అరుణకుమారి తదితరులు ఉన్నారు. -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్టు
షాద్నగర్రూరల్: మహిళల మెడలో బంగారు పుస్తెల తాళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు తెగబడుతున్న ఓ దుండగుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. బుధవారం పట్టణంలోని పోలీస్స్టేషన్లో సీఐ విజయ్కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన నల్లపురం బల్వంత్రెడ్డి, అనసూయ దంపతులు ఈ నెల 11న ద్విచక్ర వాహనంపై రామేశ్వరం దైవ దర్శనానికి వెళుతున్నారు. హజిపల్లి శివారు దాటుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వెనక నుంచి వచ్చి అనసూయ మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకొని పారిపోయారు. ఈ ఘటనపై దంపతులు అదే రోజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉత్తర్ప్రదేశ్కు చెందిన వారీగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. పోలీసులు లక్నోలో ప్రధాన నిందితుడు మహేంద్రరాస్తోగిని అరెస్టు చేయగా, మరో నిందితుడు చాంద్బాబు పరారీలో ఉన్నాడు. తమదైన శైలిలో విచారించగా ప్రధాన నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం, సెల్ఫోన్ స్వాఽధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. అతడిపై కర్నూల్, విజయనగరం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, షాద్నగర్, అల్వాల్, బాచుపల్లితో పాటుగా ఉత్తర్ప్రదేశ్లో బైక్, చైన్స్నాచింగ్, మర్డర్, గంజాయికి సంబంధించి 20పైగా కేసులు ఉన్నాయి. చాకచాక్యంగా కేసును ఛేదించిన క్రైమ్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. బంగారం చోరీ చేసి యూపీకి పరారీ -
బీసీల హక్కులపై చర్చించండి
షాద్నగర్రూరల్: హైదరాబాద్లోని విద్యానగర్లో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధన కోసం, బీసీసేన గ్రామ కమిటీలు, కార్యాచరణపై చర్చించారు. బీసీలకు రావాల్సిన 42 శాతం రిజర్వేషన్పై ప్రభుత్వంతో చర్చించాలని ఆర్.కృష్ణయ్యను నాయకులు కోరారు. గ్రామీణ స్థాయి నుంచి బీసీసేన కమిటీలను పటిష్టంగా వేసుకోవాలని, కులాలకతీతంగా భాగస్వాములను చేయాలని కృష్ణయ్య సూచించారు. బీసీలను అన్ని రంగాల్లో చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయనను నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసేన నాయకులు సుధాకర్, దయాకర్చారి, బాల్రాజ్, మహేందర్గౌడ్, వెంకటయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ఒకరి మృతి
ఇబ్రహీంపట్నం: వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి స్కూటర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని మంగల్పల్లి చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామానికి చెందిన బుట్టి ప్రేమ్రాజ్(65) వాటర్ ప్లాంట్ వర్కర్గా పనిచేస్తూ బొంగుళూర్లో నివాసముంటున్నాడు. ఉప్పరిగూడ నుంచి ఇంటికెళుతుండగా ప్రేమ్రాజ్ స్కూటర్ను ఇబ్రహీంపట్నం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని, మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పట్టుబడిన నల్లబెల్లం ధ్వంసం ఆమనగల్లు: వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, ఇతర ముడి పదార్థాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్చౌహాన్ ఆధ్వర్యంలో బుధవారం ధ్వంసం చేశారు. పట్టణ సమీపంలో పెద్ద గోతిని తీసి మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో వివిధ కేసులలో పట్టుబడిన 780 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక, 40 కిలోల విప్ప పువ్వును నాశనం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు కృష్ణప్రసాద్, అరుణ్కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, బాబు, లోక్య, శ్రీను, ఉపేందర్, శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
మొయినాబాద్: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఇద్దరు మహిళలను బలిగొంది. మరో మహిళ మృత్యువుతో పోరాడుతోంది. స్థానికులు, ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖైరతాబాద్కు చెందిన నందకిషోర్, అశ్విని(37) దంపతుల పిల్లలు మొయినాబాద్లోని సుజాత స్కూల్లో చదువుతున్నారు. దీంతో వీరి కుటుంబం కొంతకాలంగా హిమాయత్నగర్లో అద్దెకు ఉంటున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అశ్విని తన మరదలు లక్ష్మి స్కూటీపై రెడ్డిపల్లిలోని మీసేవ కేంద్రానికి బయలుదేరారు. చిలుకూరుకు వెళ్లగానే మేడిపల్లికి చెందిన కుమ్మరి సుశీల(60) యూకో బ్యాంకుకు వచ్చి తిరిగి వెళ్లేందుకు వీరిని లిఫ్ట్ అడిగింది. ముగ్గురూ స్కూటీపై వెళ్తుండగా రెడ్డిపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన కారు అతివేగంతో ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వీరిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అశ్విని, సుశీల మృతిచెందారు. లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. అర కిలోమీటర్ దూరంలోనే... స్కూటీపై వెళ్తున్న మహిళలు మరో రెండు నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకునేవారు. అరకిలోమీటర్ దూరంలో దూరంలో ప్రమాదానికి గురికావడంతో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన చోట ఓ షాపులో ఉన్న సీసీ కెమరాల్లో ప్రమాదం జరిగిన తీరు నిక్షిప్తమైంది. కారు అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టినట్లు సీసీ టీవీలో రికార్డయ్యింది. ప్రాణాపాయ స్థితిలో మరో మహిళ స్కూటీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి సమీపంలో ఘటన -
భూదాన భూములను కాపాడాలి
షాబాద్: అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ, భూదాన భూములను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో సీపీఐ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు అసైన్డ్ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆనాటి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో విప్లవ ఉద్యమాలు జరిగాయన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ కార్యకర్తలు ప్రజలు ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు సత్తిరెడ్డి, మక్బూల్, మంజుల, అంజయ్య, రఘురాం, మధు, నారాయణ, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక అనంతరం సీపీఐ షాబాద్ మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జంగయ్య ప్రకటించారు. మండల కార్యదర్శిగా నాగర్కుంట గ్రామానికి చెందిన పాలమాలకు శ్రీశైలంను ఎనుకున్నారు. సహాయ కార్యదర్శులుగా గడ్డం వెంకటేష్, రాములు, వీరితో పాటు 15 మంది కౌన్సిల్ సభ్యులను కమిటీలోకి తీసుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య -
సమస్యల పరిష్కారానికి కృషి
చేవెళ్ల: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని అట్లాస్ మినీ ఫంక్షన్ హాల్లో బుధవారం టీఎన్జీఓ చేవెళ్ల తాలూకా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్ద మనసుతో ఒక డీఏ ఇచ్చిందని, త్వరలో మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తుందన్నారు. అర్థ గణాంక, ఐసీడీఎస్ శాఖల్లో పోస్టుల ఏర్పాటులో టీఎన్జీఓ కీలకంగా పనిచేసిందన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘాన్ని బలోపేతం చేయటంతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉద్యోగులు మెడికల్ బిల్లులు ఇప్పటికే క్లియర్ చేశారని జీపీఎఫ్ బిల్లులు కూడా త్వరలో క్లియర్ అవుతాయని చెప్పారు. టీఎన్జీఓలంతా సమష్టిగా ఉండి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు మాధవ్గౌడ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్కుమార్, అజ్మత్పాషా, చేవెళ్ల తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, జ్యోతి, డివిజన్ కోఆర్డినేటర్ శేఖర్, శ్రీకాంత్గౌడ్, నాయకులు వాణి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాకపోవడం, చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని లేమామిడి శివారు తుర్కలపల్లికి చెందిన దిద్దెల ప్రశాంత్ (30) కూలీ పనులు చేస్తూ భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు నెలకొడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కృష్ణవేణి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 23న ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లగా తిరస్కరించడంతో మరుసటి రోజు తిరిగి వచ్చేశాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి తన ఇంట్లోని రేకుల పైపునకు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని, తలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశాంత్ తండ్రి దిద్దెల పెద్దయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. -
అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
● కలెక్టర్ నారాయణరెడ్డిఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చొర వచూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో శాఖల వారీగా స్వీకరించిన అర్జీలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలన్నారు. పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ వారం 76 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వనమహోత్సవానికి ఏర్పాట్లు చేయండి వన మహోత్సవంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని, గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైన మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచాలని, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని తెలిపారు. వర్షకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్క డా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయాధికారులకు చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దారులు, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.ఎరువుల కొరత రానివ్వొద్దు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమ వారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పండే పంటలు, అవసరమైన ఎరువులపై ముందే ఒక అంచనాకు రావాల్సి ఉందన్నారు. రైతుల అవసరాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచాలని, గోదాముల్లో నిల్వ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు, నిర్దేశిత ధరలకు మించి ఎరువులను విక్రయించే వారిపై చర్యలు తప్పవన్నారు. ఉద్దేశ పూర్వకంగా రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, డీసీఎస్ఓ, మండలాల వ్యవసాయ అధికారులు, డీలర్లు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి
● బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరగనీయం ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ షాద్నగర్: సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కమ్మదనం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ గత పాలకులు స్వార్థరాజకీయాలకు పాల్పడి, ప్రజా జీవితాలకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని విమర్శించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా వినడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన సూత్రధారులు, పాత్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్రంతో మాట్లాడారని, తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతుందో స్పష్టంగా వివరించారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి స్పష్టత ఉందన్నారు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, నాయకులు మహేందర్రెడ్డి, అశోక్గౌడ్, మోహన్సింగ్, విజయ్ భాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రీల్స్ కోసం బైక్పై ప్రమాదకర స్టంట్
రాజేంద్రనగర్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్ కోసం స్టంట్ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్ కొనసాగుతుండటంతో ఈ దారి గుండా వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ఇలాంటి స్టంట్ అర్ధరాత్రి వేళ జరుగుతుండటంతో పలువురు తమ ఎక్స్ వేదికల ద్వారా దీనిని సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకొని ఆర్జీఐ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు ద్విచక్ర వాహనంపై శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్ చేశారు. ప్రమాదభరితంగా ఈ జాతీయ రహదారిపై స్టంట్ నిర్వహించారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్గా ఉంటుంది. ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. ద్విచక్ర వాహనంతో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్ పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిది మంది యువకుల అరెస్టు -
బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీమంచాల: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు పని చేసేది సీపీఎం అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మండలంలోని ఆస్మత్పూర్లో సోమవారం నిర్వహించిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ నర్ల భిక్షపతి వర్ధంతి సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. నర్ల భిక్షపతి స్థూపం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. కార్మికులు, కర్షకులను చైతన్యపర్చి, వారి హక్కుల కోసం ఉద్యమించే పార్టీ సీపీఎం అని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసి ఎంతోమంది అమరులయ్యారని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక భూ పోరాటాలు, రైతు, కూలీ సమస్యలపై ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉందన్నారు. అట్టడుగు వర్గాల కోసం కమ్యూనిస్టులు చేసిన తాగ్యాలు మర్చిపోలేనివన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్య, మండల నాయకులు కె.శ్రీనివాస్రెడ్డి, శ్యాంసుందర్, గోరెంకల నర్సింహ, మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి
మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని తోల్కట్టలో ప్రభుత్వ భూములను కాపాడాలని సోమవారం గ్రామస్తులు కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 143, 108, 155, 124, 135, 134, 107లలో పూర్తిగా ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. ధరణి వచ్చిన తరువాత సర్వే నంబర్లు 107, 124, 135 అక్రమంగా పట్టాలుగా మార్చుకున్నారని, మిగతావి సైతం కబ్జాకు గురవుతున్నాయని అన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ను కలిసిన వారిలో శివశంకర్గౌడ్, మల్లేష్, అంజయ్య తదితరులు ఉన్నారు.అదుపు తప్పిన ఆర్టీసీ బస్సుకందుకూరు: ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రో డ్డు పక్కకు దూసుకెళ్లింది. వివరాలివీ.. ఇబ్ర హీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం గుమ్మడవెల్లి మీదు గా ఆకులమైలారం వెళ్లే క్రమంలో అదుపు తప్పింది. గుమ్మడవెల్లి రైతు వేదిక సమీపంలో పొలాలకు వేసిన కడియ రాళ్లను ఢీకొట్టి ఆగిపోయింది. కొంత సేపటి తర్వాత బస్సును అక్కడి నుంచి డ్రైవర్ తీసుకెళ్లాడు. ప్రమాద సమయంలో బస్సులో 25మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.గొలుసుకట్టు కాలువల పునరుద్ధరణకు కృషిఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డితుర్కయంజాల్: గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరించి ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు సులువుగా ప్రవహించేలా చర్యలు చేపట్టనున్నట్టు ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు అలుగు పారే అవకాశాలు ఉండడంతో తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు, ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు, ఈదుల చెరువుల కాలువలను ఏఈ వంశీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. కాలువులు పూడిక తీయకంపోవడంతో పలు చోట్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వరద వచ్చినా సులువుగా ప్రవహించి, కాలనీలు ముంపునకు గురవకుండా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు పులిమామిడి జెడ్పీహెచ్ఎస్కందుకూరు: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ (సీజీఆర్) సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు మండల పరిధిలోని పులిమామిడి జిల్లా పరిషత్ పాఠశాల ఎంపికై ంది. ఇందులో భాగంగా పాఠశాల పరిధిలో వాటర్ హార్వెస్టింగ్ పిట్, కంపోస్టు పిట్, డిక్లేర్ నో ప్లాస్టిక్ జోన్, డిక్లరేషన్ ఆఫ్ మదర్ ట్రీ, కిచెన్ గార్డెన్, సాయిల్ అండ్ సీడ్ మ్యూజియం, మెడిసినల్ గార్డెన్, రెన్యూవల్ ఎనర్జీ (సోలార్), ప్రిపరేషన్ ఆఫ్ విలేజ్ జియోగ్రఫీ మ్యాప్ అండ్ రిపోర్టు, ప్లాంటేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సీజీఆర్ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రజనీకాంత్ హెచ్ఎం రవీందర్రెడ్డికి ధ్రువపత్రం అందించారు. -
మోదీ పాలనలో దేశం పురోగతి
చేవెళ్ల: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం అన్నారు. స్థానిక కేవీఆర్ గ్రౌండ్లో సోమవారం చేవెళ్ల మున్సిపాలిటీ బూత్స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. మోదీ సారథ్యంలో దేశం ఎంతో పురోగతి సాధించిందన్నారు. తల్లికి వందనంతో దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతీ బూత్లో కనీసం 50 మొక్కలు నాటాలని, నియోజకవర్గంలో 25వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వానం పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, రాష్ట్ర నాయకులు విఠల్రెడ్డి, జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కుంచం శ్రీనివాస్, నాయకులు మధుసుధన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, మధుసుధన్రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం -
విపక్షాలది దుష్ప్రచారం
● నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి ఆమనగల్లు: రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి అన్నారు. పట్టణంలో సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క ఇల్లూ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఎంపీ మల్లురవి మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీబీ మాజీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ కార్యదర్శి మధుసూదన్రెడ్డి, మార్కెట్ మాజీ వైస్చైర్మన్ గుర్రం కేశవులు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణయ్య, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు కోట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళ మెడలోంచిపుస్తెలతాడు చోరీ
యాచారం: బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు పుస్తెల తాడును అపహరించారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన బండ పార్వతమ్మ(58) సోమవారం మధ్యాహ్నం స్వగ్రామా నికి వెళ్లేందుకు నక్కర్తమేడిపల్లిలోని బంధువు ల ఇంటి నుంచి తక్కళ్లపల్లి గేట్ వద్దకు వచ్చింది. ఇది గమనించిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హెల్మెట్ ధరించి, బైక్పై వచ్చారు. బస్సు కోసం వేచి చూస్తున్న పార్వతమ్మ మెడలోని మూడు తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. ఈ సమయంలో పార్వతమ్మ కిందపడిపోయినా దుండగులు మాత్రం తాడు వదల్లేదు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మేస్త్రీ అదృశ్యం మొయినాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మేస్త్రీ అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పో లీసులు తెలిపిన ప్రకారం మహబూబ్నగర్ జిల్లా దౌల్తాబాద్కు చెందిన దాగునపురం రాములు(40) భార్య లక్ష్మితో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో నివాసం ఉంటూ మేస్త్రీ పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువు లు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం మొయినాబాద్ ఠా ణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. సీసీ కెమెరాలు, ఎన్వీఆర్ డివైస్ తస్కరణ కడ్తాల్: మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు, ఎన్వీఆర్ డివైస్ చోరీకి గురైంది. ఈ ఘటన సోమ వారం వెలుగులోకి వచ్చింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. పాలశీతలీకరణ కేంద్రంలోని ల్యాబ్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన రెండు సీసీ కెమెరాలు, ఎన్వీఆర్ డివైస్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 21న గుర్తు తెలియని దుండగులు వీటిని ఎత్తుకెళ్లారు. సోమవారం గమనించిన పాలశీతలీకరణ కేంద్రం ఇన్చార్జి మేనేజర్ ఉదయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
ఓఆర్ఆర్ పరిధిలోనూ భరోసా ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న మండలాలకు రైతు భరోసా విడుదల చేయాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు బీఆర్ఎస్ ఎల్మినేడు గ్రామ అధ్యక్షుడు దొమకొండ నర్సింహ అధ్యక్షతన మహాధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృపేష్, బుగ్గరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు దఫాలుగా రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గు చేటు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం మండలాల రైతులు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో వివక్ష చూపకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందన్నారు. రైతులపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా విడుదల చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, బుట్టి మహేశ్, నిట్టు జగదీశ్వర్, బాష, యాదయ్య, రాజు, విష్ణువర్ధన్రెడ్డి, రాంరెడ్డి, పలువరు రైతులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్మినేడులో ధర్నా -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
● షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ కేశంపేట: సమాజంలో అందరూ యూనిఫాం లేని పోలీసులేనని షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమ వారం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయా లని పిలుపునిచ్చారు. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ కలిగి ఉన్నా చట్టరీత్యా నేరామని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ నమ్మొద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐ నరహరి, ఎస్ రాజ్కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
త్వరలో స్వచ్ఛ ‘సర్వే’క్షణ్
● పంచాయతీలకు ర్యాంకులు ● సర్వే ఆధారంగా ఎంపిక ప్రక్రియ ● ఉత్తమ గ్రామాలకు పురస్కారం ● పారిశుద్ధ్యం మెరుగుపర్చడమే లక్ష్యం ఉన్నతాధికారుల సూచన మేరకు.. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై త్వరలో సమావేశం జరుగుతుంది. ఉన్నతాధికారుల సూచ నల మేరకు గ్రామాల్లో అన్ని రకాల పనులు చేపడతాం. ఇప్పటికే అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్తను సేకరించడం జరుగుతోంది. – విజయలక్ష్మి, ఎంపీఓ, కొత్తూరు కొత్తూరు: పంచాయతీల మధ్య పోటీతత్వాన్ని పెంచడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సర్వే చేసిన వివరాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ఆయా విభాగాల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన పంచాయతీలను గుర్తించి ర్యాంకులు ప్రకటించి పురస్కారాలు అందజేస్తారు. ఈ ఏడాది (2025) సైతం త్వరలో కేంద్ర బృందాలు గ్రామాల్లో పర్యటించి సర్వే చేపట్టనున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, అభివృద్ధి పనులపై అధికారులు పంపిన నివేదికల ఆధారంగా సభ్యులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు. పరిశీలించే అంశాలు ● ప్రతిఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందా.. ఇంకా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన జరుగుతోందా.. అందరూ మరుగుదొడ్లు వినియోగిస్తున్నారా.. అనే విషయాలు తెలుసుకుంటారు. ● పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం చెత్తను సేకరించే విధానం.. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవగాహన కల్పించారా.. ప్రజలు స్వతహాగా నిర్మించుకున్నారా.. అనేది గ్రహిస్తారు. ● డంప్యార్డుల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను గుర్తిస్తారు. ● అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, తాగునీటి సరఫరా, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించనున్నారు. ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారా.. అనే విషయాలు తెలుసుకుంటారు. ● పలు అంశాల్లో సభ్యులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి వెయ్యి మార్కులకు గాను అధిక స్కోర్ సాధించిన గ్రామాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ముందస్తు సమాచారం ఉండదు స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లే అధికారుల ముందస్తు సమాచారం సంబంధిత పంచాయతీలకు ఉండదు. అధికారులు నిర్ణయించుకున్న మేరకు వెళ్లి పలు నివాస గృహాలు, వ్యాపార సముదాయాలతో పాటు పలుచోట్ల సర్వే చేపట్టనున్నారు. -
రూ.7 కోట్ల విలువైన భూమికి ఎసరు!
షాద్నగర్ రూరల్: ధరణి లొసుగులు.. మీసేవ నిర్వాహకుల సహకారంతో తండ్రీకొడుకులు రూ.7 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమికి ఎసరుపెట్టారు. ప్రభుత్వం ఇటీవల చిల్కమర్రిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో తహసీల్దార్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీసేవ నిర్వాహకులతో కుమ్మకై ్క.. గ్రామానికి చెందిన కొత్తపల్లి వినోద, శ్రీనివాస్రెడ్డి దంపతులు. కొంత కాలం క్రితం శ్రీనివాస్రెడ్డి చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 2.8 ఎకరాల భూమి 2022లో వినోద పేరిట విరాసత్ జరిగింది. ఈ భూమిపై కన్నేసిన వినోద మామ సుభాన్రెడ్డి, బావ మధుసూదన్ రెడ్డి పట్టణంలోని ఓ మీసేవ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారు. వినోదకు తెలియకుండా ఆమె ఫోన్కు వచ్చిన ఓటీపీని సంపాదించి దొంగ జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయింగా జీపీఏ ద్వారా ఇతరులకు మారిందని చెప్పారు. సదస్సులు ముగిసిన తర్వాత వినోద తహసీల్దార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇదే గ్రామంలో మరొకరి భూమిని ఇదే గ్రామానికి చెందిన కొత్తపల్లినర్సింహారెడ్డి, నవనీత దంపతులకు మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. నర్సింహారెడ్డి పేరిట 1.29 ఎకరాల భూమిని కాజేసేందుకు సుభాన్రెడ్డి, మధుసూదన్రెడ్డి ఆమె భార్య నవనీతను రంగంలోకి దింపారు. భర్త ఫోన్ నవనీత దగ్గరే ఉండడంతో ఓటీపీ తీసుకుని జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. సదరు భూమిని దేవిరెడ్డి శ్రీకాంత్రెడ్డికి సేల్డీడ్ చేశారు. తహసీల్దార్ విచారణలో ఈ తతంగమంతా బయటపడింది. ఇద్దరు పట్టాదారులకు సంబంధించి రూ.7కోట్ల విలువైన దాదాపు నాలుగు ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది. పోలీస్స్టేషన్లో తహసీల్దార్ ఫిర్యాదు పట్టాదారులకు తెలియకుండా భూములు చేతులు మారడంతో తహసీల్దారు పార్థసారధి సదరు భూముల రిజిస్ట్రేషన్పై విచారించారు. స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ తయారీ ఎక్కడ జరిగిందనే విషయాలను పరిశీలించారు. మీసేవ సెంటర్లో ఓటీపీలతో డాక్యుమెంట్ తయారు చేసినట్లు గుర్తించారు. సదరు మీసేవ నిర్వాహకులతో పాటుగా దొంగ జీపీఏ, రిజిస్ట్రేషన్ చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిల్కమర్రి రెవెన్యూ సదస్సులో వెలుగులోకి.. అధికారులను ఆశ్రయించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ -
తక్కువ ధరకు బంగారమంటూ టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: చౌటుప్పల్కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆయనకు కాల్ చేసిన కర్ణాటక ముఠా తక్కువ ధరకు బంగారం పేరుతో రూ.65 లక్షలు స్వాహా చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్గంజ్ పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. ఫలితంగా ప్రధాన సూత్రధారిని పట్టుకోవడంతో పాటు రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు తూర్పు మండల డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి సోమవారం తెలిపారు. అదనపు డీసీపీ జె.నర్సయ్య, సుల్తాన్బజార్ ఏసీపీ ఎం.మట్టయ్యలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ మోసాలు కర్ణాటకలోని రాయచూర్కు చెందిన కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాలనే టార్గెట్గా చేసుకుని మోసాలు చేస్తున్నాయి. పొలం దున్నుతుంటేనో, పాత ఇంటిని కూలుస్తుంటేనో నిధి లభించిందని చెప్తారు. అందులో ఉన్న బంగారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా దాచామని, సగం ధరకే ఇస్తామంటూ ఎర వేస్తారు. వీళ్లు టార్గెట్లను ఎంచుకోవడానికి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ వ్యాపార ప్రకటనలు, దుకాణాలపై ఉన్న పేర్లు, ఫోన్ నెంబర్లు ఎంచుకుంటారు. వీరి వల్లోపడుతున్న వారిలో అత్యధికులు రియల్టర్లు, చిన్న స్థాయి బంగారం వ్యాపారులే ఉంటున్నారు. ఇలాంటి ముఠాల్లో తాళ్ల వ్యాపారి జయ కుమార్ది ఒకటి. తన బావమరిది ఉదయ్, స్నేహితుడు సందీప్తో కలిసి రంగంలోకి దిగాడు. బోర్డుపై ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా చౌటుప్పల్కు చెందిన మునుకుంట్ల నిరంజన్ అక్కడి భరత్నగర్ కాలనీలో శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు. జయ కుమార్ నేతృత్వంలోని ముఠా ఈ ఏడాది మార్చిలో ద్విచక్ర వాహనాలపై సిటీకి వచ్చింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ టార్గెట్ల కోసం అన్వేషించింది. చౌటుప్పల్లో సంచరిస్తున్నప్పుడు వారి కంట్లో నిరంజన్ కార్యాలయం బోర్డు పడింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా రెడ్డి పేరుతో ఉదయ్ సంప్రదించాడు. సగం ధరకు బంగారమంటూ ఎర వేశాడు. అదే నెల్లో రూ.25 వేలు తీసుకుని అరతులం బంగారం ఇచ్చాడు. దీన్ని పరీక్షించిన నిరంజన్ మేలిమి బంగారంగా తెలుసుకున్నారు. ఆపై తన స్నేహితుడు దేవేందర్తో కలిసి రూ.65 లక్షలకే కేజీ ఖరీదు చేయడానికి సిద్ధయ్యారు. ఈ సందర్భంలో వీరితో రఘు పేరుతో సందీప్ కూడా సంప్రదింపులు జరిపాడు. ‘అంబర్పేట’ నుంచి అఫ్జల్గంజ్ వరకు గత నెల 12న కేజీ బంగారం సిద్ధంగా ఉందని ఫోన్ చేసిన రఘు నగదు తీసుకుని పెద్ద అంబర్పేట రమ్మని చెప్పాడు. దీంతో నిరంజన్ (రూ.45 లక్షలు), ఇతడి స్నేహితుడైన ధర్మేంద్ర (రూ.20 లక్షలు) ఇద్దరూ కలిసి రూ.65 లక్షలు తీసుకుని తమ కారులో పెద్ద అంబర్పేటకు వచ్చారు. నిరంజన్తో ఫోనులో సంప్రదింపులు జరుపుతున్న రెడ్డి... అక్కడ నుంచి వారిని ఎల్బీనగర్కు, ఆపై దిల్సుఖ్నగర్ రప్పించి చివరకు ఎంజీబీఎస్ సమీపంలోకి రమ్మన్నారు. అక్కడ వీరిని కలిసిన రఘు వారి వాహనంలోనే ఎక్కాడు. కొద్దిసేపటికి ద్విచక్ర వాహనంపై వచ్చిన జయ కుమార్, రెడ్డి బంగారం ఉందంటూ ఓ బ్యాగ్ ఇచ్చి, నగదుతో కూడిన బ్యాగ్ పట్టుకుపోయారు. అప్పటి వరకు వారితోనే ఉన్న రఘు సైతం దృష్టి మళ్లించి మరో వాహనంపై ఉడాయించాడు. నిరంజన్ ఆ బ్యాగ్ తెరిచి చూడగా... పైన చీరలు, కింద నాపరాళ్లు కనిపించడంతో మోసపోయినట్లు గుర్తించాడు. చౌటుప్పల్ వ్యాపారి నుంచి రూ.65 లక్షలు స్వాహా చాదర్ఘాట్లోని ఎంజీబీఎస్ సమీపంలో ఘటన కర్ణాటకకు చెందిన ప్రధాన సూత్రధారి అరెస్ట్ రూ.40 లక్షలు రికవరీ,పరారీలో మరో ఇరువురు ముమ్మరంగా గాలించినప్రత్యేక బృందం బాధితుల ఫిర్యాదుతో అఫ్జల్గంజ్ ఠాణాలో కేసు నమోదు కాగా... ఇన్స్పెక్టర్ ఎన్.రవి, డీఐ రవికిరణ్ నేతృత్వంలో ప్ర త్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక అంశాలతో పాటు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టారు. నిందితుల కోస ం కర్ణాటకతో పాటు నగరంలోనూ ముమ్మరంగా గాలించారు. సోమవారం ఎంజీబీఎస్ వద్దకు కారులో చేరుకున్న జయ కుమార్ను పట్టుకున్నారు. ఇతడి నుంచి కారుతో పాటు రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.25 లక్షలు ఉదయ్, సందీప్ వద్ద ఉన్నట్లు జయ కుమార్ బయటపెట్టాడు. దీంతో పరారీలో ఉన్న వారి ద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. -
సేవలు అంతంతే..
సర్కారు ఆస్పత్రులు సమస్యలు బోలెడు● సమయపాలన పాటించని వైద్యులు ● అత్యవసర పరిస్థితుల్లో స్టాఫ్నర్సులు, ఫార్మాసిస్టులు, ఆయాలే దిక్కు ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● బాధితులకు తప్పని తిప్పలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యపు జబ్బు పట్టి పీడిస్తోంది. మందుల కొరత.. మౌలిక సదుపాయాల లేమి.. వెరసి అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రులకు చేరుకున్న నిరుపేద రోగులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. ఉదయం 9 గంటలకే ఓపీలో కూర్చోవాల్సిన వైద్యులు 11 దాటినా కన్పించడం లేదు. కొన్ని చోట్ల ఎక్సరే మిషన్లు పని చేయడం లేదు. రేడియాలజిస్టులు లేకపోవడంతో అల్ట్రాసౌండ్ మిషన్లు పనికిరాకుండా పోతున్నాయి. టెక్నీషియన్ల కొరతతో డయాలసిస్ సేవలు అందడం లేదు. వ్యాధి నిర్దారణ కోసం బాధితుల నుంచి రక్త, మూత్ర పరీక్షల నమూనాలు సేకరించినప్పటికీ రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అప్పటికే జబ్బు మరింత ముదురుతుండడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సోమవారం ‘సాక్షి’ బృందం జిల్లా వ్యాప్తంగా పట్ట ణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల పని తీరుపై విజిట్ నిర్వహించింది. జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉదయం ఎనిమిది గంటలకే అనేక మంది ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మరికొంత మందికి ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులే దిక్కయ్యారు. పది దాటినా పత్తాలేని వైద్యులు ఆమనగల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు వైద్యు లకు ఉదయం 10.30 గంటల వరకు ఒక్కరూ రాలేదు. వైద్యులు లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా కన్పించాయి. ఆలస్యంగా ఆస్పత్రికి రావడమే కాకుండా నిర్దేశిత సమయానికి ముందే తిరిగి వెళ్లిపోయారు. యాచారం సీహెచ్సీలోనూ ఇదే పరిస్థితి. పది గంటలలోపు వచ్చిన రోగులకు స్టాఫ్ నర్సులే మందులు, ఇంజక్షన్లు ఇచ్చి పంపారు. కందుకూరు పీహెచ్సీ వైద్యురాలు ఉదయం 10.58 గంటలు దాటినా ఆస్పత్రికి చేరుకోలేదు. ఫార్మాసిస్ట్ కూడా ఆలస్యంగా వచ్చారు. వచ్చిన రోగులకు ఏఎన్ఎం పెద్ద దిక్కుగా నిలిచింది. డయాలసిస్కు తప్పని నీటికొరత ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో మూడు విడతల్లో 32 మందికి డయాలసిస్ చేస్తున్నారు. మరో 18 మంది వెయింటింగ్ లిస్ట్లో ఉంటున్నారు. డయాలసిస్ కోసం సరిపడా నీరులేకపోవడంతో వచ్చిన రోగులందరికీ సేవలు అందించలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఎనిమిది మంది వైద్యులున్నప్పటికీ సాయంత్రం నాలుగు తర్వాత అందుబాటులో ఉండటం లేదు. పది మందికి వచ్చింది ఆరుగురే.. చేవెళ్ల ఏరియా ఆస్పత్రిలో పది మంది వైద్యులు ఉండగా, ఆరుగురే విధులకు హాజరయ్యారు. ఫార్మాసిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ల కొరతతో వైద్యసేవల్లో జాప్యం జరుగుతోంది. విపరీతమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకుంటున్న బాధితులకు సగం మందులతో సరిపెడుతున్నారు.లేనివాటిని ప్రైవేటులో కొనుక్కోవాల్సిందిగా సూచిస్తున్నారు. కొందుర్గు పీహెచ్సీలో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇద్దరు వైద్యులకు ఒక్కరే, అదీ పగటి పూటే అందుబాటులో ఉంటున్నారు. ఏఎన్ఎంలే స్టాఫ్ నర్సుల అవతారం ఎత్తుతున్నారు. కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ పరీక్షల సేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను బయటికి సిఫార్సు చేస్తున్నారు. కేశంపేట ఆస్పత్రిలో పని చేసే ల్యాబ్టెక్నీషియన్ డిప్యూటేషన్పై కొండాపూర్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో నందిగామ, కొందుర్గు పీహెచ్సీ టెక్నీషియన్ వారానికి ఒకరోజు వచ్చి వెళ్తున్నారు. మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి. 16 మంది వైద్యులకు 9మంది మాత్రమే హాజరవుతున్నారు. నర్సే చికిత్స చేశారు చికిత్స కోసం ఉదయం 9 గంటలకే కందుకూరు పీహెచ్సీకి వచ్చాను. 10.30 గంటల వరకు చూసినా డాక్టరు రాలేదు. నర్సుతో చికిత్స చేయించుకుని, మందులు తీసుకుని వెళ్తున్నాను. ఇప్పటికి ఇక్కడికి మూడుసార్లు వచ్చాను. ఇంత వరకు వైద్యులతో చికిత్స చేయించుకోలేకపోయాను. – శ్రీనివాస్రెడ్డి, కొత్తూరు, కందుకూరు మండలం -
ముగిసిన మాన్సూన్ పోలో చాంపియన్షిప్
శంకర్పల్లి: మండల పరిధిలోని జన్వాడ నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్లో మూడు రోజులుగా మాన్సూన్ పోలో చాంపియన్ షిప్–2025 పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో రాజస్థాన్ రంబుల్, హర్యానా హరికేన్, తెలంగాణ థండర్ తదితర జట్లు పాల్గొన్నాయి. ఆదివారం నిర్వహించిన ఫైనల్లో తెలంగాణ థండర్స్ తొమ్మిది గోల్స్ చేయగా.. హర్యానా హరికేన్ 11గోల్స్ చేసింది. దీంతో రెండు గోల్స్ తేడాతో హర్యానా హరికేన్ జట్టు చాంపియన్ షిప్–2025 కప్ని సొంతం చేసుకుంది. విజేత జట్టుకు తెలంగాణ–ఆంధ్ర సబ్ ఏరియా ఆఫీసర్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నవాబు రౌనక్ యార్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ సీఈఓ మీర్ హఫీజుద్ధీన్ మాట్లాడుతూ.. హార్స్ రైడింగ్ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
నిధులు లేక కటకట
● పంచాయతీ నిర్వహణకుఅప్పులభారం ● ట్రాక్టర్ డీజిల్కు సైతం ఇబ్బంది ● సొంత నిధులు వెచ్చించలేమని కార్యదర్శుల ఆవేదన ● గ్రామాల్లో అటకెక్కిన పరిపాలన పరిగి: గ్రామాల్లో ప్రత్యేక పాలన వెక్కిరిస్తోంది. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు. దీంతో పాలన కార్యదర్శులకు రోజురోజుకూ భారంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నెలల తరబడి విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల పరిగి, దోమ మండలాల్లోని అన్ని గ్రామాల కార్యదర్శులు సమస్యల పరిష్కారానికి డబ్బులు లేవని ఎంపీఓ, ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేసి పంచాయతీ ట్రాక్టర్ల తాళాలను అందజేశారు. అదే బాటలో మిగతా కార్యదర్శులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న జీపీలు కుదేలు జిల్లాలో 20 మండలాలు ఉండగా 566 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పోవడంతో విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వీధి దీపాల బిల్లులు, ట్రాక్టర్ నిర్వహణ, బోరు మోటార్ల మరమ్మతులు తదితర వాటికి కాసులు లేక అరిగోసలు పడుతున్నారు. పెద్ద పంచాయతీలకు వస్తున్న కొద్దిపాటి ఆదాయంతో అభివృద్ధి పనులు ఓ మోస్తరుగా సాగుతున్నాయి. కానీ చిన్న పంచాయతీల్లో మాత్రం ఎలాంటి పనులు జరగడం లేదు. రోజు రోజుకూ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దీనంగా మారుతుందని, అప్పుల కుప్పలుగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. తాము గ్రామాల్లో సొంత ఖర్చులతో పనులు చేయలేమని కార్యదర్శులు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. కొరవడిన ప్రభుత్వ సహకారం కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదల కావడం లేదు. గత 20 నెలలుగా గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ఇక రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులైతే 2022 నుంచి నిలుపుదల చేశారు. స్థానిక సంస్థల్లో పాలకవర్గం లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. కొంత కాలంగా పల్లెల్లో సమస్యలను పంచాయతీ కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. ఇలా చాలా మంది కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేశాం గ్రామంలో నిత్యం ఎక్కడో ఒక చోట సమస్యలుంటాయి. తొలుత ప్రత్యేక పాలనలో ఇబ్బందులు రాకున్నా దినదినం భారంగా మారుతుంది. వచ్చే జీతం డబ్బులు కూడా గ్రామ సమస్యల కోసం ఖర్చు చేస్తున్నాం. అవి సరిపోకపోవడంతో అప్పులు చేశాం. ఊరిలో సమస్యలు పరిష్కరించాలంటే ఇక సొంత డబ్బులు ఖర్చు చేయలేము. – వేమారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, రాఘవపూర్ -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య అన్నారు. ఆదివారం హిమాయత్నగర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో స్కూల్ టీచర్ సమైక్య(ఎస్టీఎఫ్) తెలంగాణ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచయ్యకు ఓడీ సౌకర్యం లభించడంతో ఆయనను ఆ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దాంతో పాటే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.గోపాల్, ప్రతినిధులు విఠల్, రమేష్, రాంచంద్రయ్య, రాంచందర్, నర్సింహులు, లక్ష్మినారాయణ, దిలీప్, భగవత్గీత, రాజారావు, మొయినాబాద్ మండల అధ్యక్షుడు పి.సుధాకర్, వెంకటస్వామి, రజిత, సంతోష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య -
ఆదివారం ఆగని దందా
షాద్నగర్రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో సెలవురోజున పుస్తకాల దందా కొనసాగుతోందని, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం బుక్స్ విక్రయిస్తుండగా.. ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇదేమిటని ప్రశ్నించిన తమపై అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్చేసి రాత పుస్తకాలు తీసుకుంటేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామని మెలిక పెడుతూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరలకు నోట్స్ను అంటకడుతూ డబ్బులు దండుకుంటున్నారని తెలి పారు. పాఠశాలల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే విషయమై గతంలో మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి.. బుక్స్, యూనిఫాంలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిల్, రఘు, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సెలవు రోజుల్లోనూ పుస్తకాల విక్రయం నిబంధనలు పాటించని పాఠశాలలు చర్యలు తీసుకోవాలంటూఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ -
42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
షాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం షాబాద్ మండల పరిధి చందనవెళ్లి గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా చాకలి శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా గడీల మహిపాల్, ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్, యువజన కమిటీ అధ్యక్షుడిగా చిప్పలపల్లి శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా శివలను నియమించారు. అనంతరం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తాయి నుంచే ఐక్యమత్యం కావాలన్నారు. అందుకే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీసేన మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్చారి, జిల్లా నాయకులు వెంకటేశ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి చంద్రశేఖర్, నందిగామ మండల ఉపాధ్యక్షుడు నర్సింహులు, షాబాద్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, గ్రామ పెద్దలు చేవెళ్ల స్వామి, మాజీ సర్పంచ్లు లింగం, శ్రీనివాస్గౌడ్, నాయకులు రాఘవచారి, మల్లేశ్, వెంకటేశ్, వడ్ల మల్లేశ్, తదితరులు ఉన్నారు. బీసీసేన జాతీయ అధ్యక్షుడు కృష్ణ -
లారీ ఢీకొని యువకుడి మృతి
ఆమనగల్లు: లారీ ఢీకొ న్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ సీతారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి గ్రామానికి చెందిన మహేందర్నాథ్ అలియాస్ టిల్లు(23) బైక్పై వెళ్తున్న క్రమంలో కల్వకుర్తి నుంచి మధ్యప్రదేశ్కు పత్తిలోడ్తో వెళ్తున్న లారీ కాటన్మిల్లు సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇదే సమయంలో కల్వకుర్తి నుంచి నగరానికి వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్టును ఢీకొన్న బైక్, ఒకరి మృతి యాచారం: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు.. నగర శివారులోని జిల్లెలగూడకు చెందిన శ్రీనాథ్(18), స్నేహితులు మణిదీప్, చరణ్లతో కలిసి శనివారం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాక్ కాలనీకి వెళ్లారు. ఆలస్యం కావడంతో రాత్రి చింతపల్లి మండలం వింజమూర్లోని బంధువుల ఇంట్లో నిద్రించారు. ఆదివారం తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు శ్రీనాథ్.. మిత్రులతో కలిసి బైక్పై నగరానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో సాగర్రోడ్డుపై చౌదర్పల్లి గేట్ వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్ దుర్మరణం చెందగా.. మణిదీప్, చరణ్లు గాయపడ్డారు. కేసు దర్యాప్తులో ఉంది. అగ్ని ప్రమాదం మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని శాసీ్త్రపురం కాలనీలోని ప్లాస్టిక్ చైర్ పరిశ్రమంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన స్థానికులు అగ్నిపమాక, పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్, చందులాల్ బారాదారి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమా దం జరిగినప్పుడు పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. -
‘టెక్స్టైల్’ భూముల విక్రయానికి యత్నం!
నందిగామ: టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి, స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొనుగోలు చేసిన భూమిని విక్రయించేందుకు కొందరు డైరెక్టర్లు యత్నిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. కొందరు రైతులతో కలిసి ఆదివారం హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ వద్ద ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2002, 2003 సంవత్సరంలో టెక్స్టైల్ పార్క్ కోసం చేగూరు రెవెన్యూ పరిధి నర్సప్పగూడ గ్రామ శివారులో 142 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. ఆ సమయంలో 108 మంది సభ్యులు, 8 మంది డైరెక్టర్లతో ఒక సొసైటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ భూమిలో ప్రభుత్వ రాయితీతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికులకు, భూములుఇచ్చిన రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని వివరించారు. కానీ అనుకున్న ఆశయం నెరవేరకుండా కొందరు డైరెక్టర్లు ఎవరికీ తెలియకుండా ఆ భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. తామంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో భూములు కొనుగోలు చేశామని, మా భూములు మాకు కేటాయిస్తే పరిశ్రమలు స్థాపించి, పలువురికి ఉపాధి చూపుతామని చెప్పారు. సంబంధిత అధికారులుస్పందించి, జాగల విక్రయానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ భూములను తమకు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పురుషోత్తం, గడ్డం దేవదాస్, వెంకటరమణ, శ్రీరాములు, సురేంద్ర, రవి, రమేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.నిరసన వ్యక్తంచేసిన సొసైటీ సభ్యులు -
ఉద్యోగి అనుమానాస్పద మృతి
మీర్పేట: అనుమానాస్పద స్థితిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాలనీవాసులు, ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. ఏపీ కృష్ణా జిల్లా పెద్దమద్దాలి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరావు(59) పదేళ్లుగా బడంగ్పేట సాయిప్రభు హోమ్స్ కాలనీలో భార్య జయంతి, కుమారుడు రాజ్భరత్, కోడలు గౌతమితో కలిసి ఉంటున్నాడు. ఆయన ఆబిడ్స్లోని పేఅండ్ అకౌంట్స్ కార్యాలయంలో ఆడిటర్గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వెంకటేశ్వరరావు నీటి సంపులో శవమై తేలాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకు తరలించారు. మృతిపై సందేహాలు కొంత కాలంగా తనను భార్య, కుమారుడు, కోడలు వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మృతుడు వెంకటేశ్వరరావు తరచూ తమతో చెప్పేవాడని కాలనీవాసులు పేర్కొన్నారు. తండ్రి చనిపోతే కుమారుడికి ఉద్యోగం వస్తుందని, అందుకే మానసికంగా వేధిస్తున్నారని తెలిపినట్లు చెప్పారు. ఇక్కడే ఉంటే తనను చంపేలా ఉన్నారని, వారం రోజుల్లో మలక్పేటలోని ప్రభుత్వ క్వార్టర్కు మారుతానని శనివారం రాత్రి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఆయన మృతిపై అనుమానం ఉందని, మృతుడి కుమార్తె ధరణిదేవి మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
చెరువులో మునిగి ఇద్దరు మృతి
అబ్దుల్లాపూర్ మెట్: చెరువు పక్కన ఉన్న బండరాయిపై ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మరో యువకుడు కూడా చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన చిన్నపురెడ్డి ప్రతాప్ రెడ్డి, భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అబ్దుల్లాపూర్ మెట్లోని లక్ష్మీ ప్రియానగర్కాలనీలో నివాసం ఉంటున్నారు. అనాజ్పూర్ సమీపంలోని ఇందిరమ్మ చెరువు దగ్గర వెంచర్లో ప్రతాప్రెడ్డి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కూతురు ప్రణీత(10)తో పాటు బంధువులతో కలిసి వెంచర్ దగ్గరికి వెళ్లాడు. వెంచర్ సమీపంలో ఉన్న చెరువు వద్దబండరాయిపై ఆడుకుంటున్న ప్రణీత.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయింది. గమనించిన ప్రతాప్రెడ్డి బంధువు చింతంరెడ్డి ఇంద్రసేనారెడ్డి(20) ఆమెను కాపాడే ప్రయత్నంలో అతను కూడా మునిగి ఇద్దరూ చనిపోయారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నిమ్స్కు తరలించారు. వేడుకగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం రాజేంద్రనగర్: బుద్వేల్లోని వీరభద్రస్వామి భద్రకాళి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఉదయం అభిషేకం, అలంకరణ అనంతరం భక్తులకు వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. -
డ్రైనేజీ నిర్మాణం.. అస్తవ్యస్తం..!
శంషాబాద్: శంషాబాద్ పట్టణ ప్రధాన రహదారిలో చేపట్టిన డ్రైనేజీ పనులు.. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ వెళ్లే రహదారిలో రైల్వే కమాన్ వద్ద ప్రధాన మార్గంలో డ్రైనేజీ లైను కలిపేందుకు రెండు రోజుల క్రితం పనులు చేపట్టారు. పైపులు వేసిన తర్వాత దానిని రహదారికి సమాంతరంగా కాకుండా చాలా ఎత్తులో సిమెంట్ పనులు చేశారు. దీంతో పైపులపై వేసిన సిమెంట్ వల్ల అది కాస్తా ఎత్తైన స్పీడు బ్రేకర్లా తయారైంది. ● ఇది ఒక ఎత్తైతే నాణ్యత లేకుండా నిర్మించినందున గడచిన దానిపై రంద్రాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా రెండు రోజుల్లోనే అదికాస్తా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను కల్గిస్తోంది. కింద ఉన్న డ్రైనేజీ బయటపడేలా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వేగంగా వచ్చే వాహనాలు ఎత్తుగా ఉండటంతో ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వస్తుండటంతో తరచూ ప్రమాదాలూ చోటుచేసుకుంటున్నాయి. ● ఇకనైనా మున్సిపల్ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి నాణ్యత లేమితో చేపట్టిన పనులను వెంటనే సరిద్దాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ● ఈ ప్రాంతంలోనే ఆరు నెలల క్రితం బస్టాప్ ఏ ర్పాటు చేశారు. అప్పట్లో మిగిలిన మట్టి, రా తిపౌడర్ ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేశారు. అ వి పూ ర్తిగా గట్టిపడిపోయాయి. కొంతకాలంగా రహ దా రికి అడ్డుగా ఉన్నందున రాకపోకలు సా గించే వా హనదారులు ఇబ్బందులు పడుతున్నా రు. అ యి నా మున్సిపల్ అధికారులు మాత్రం దా నిని తొలగించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పనుల్లో నాణ్యతాలోపం రెండు రోజులకేగుంతలుగా మారిన వైనం ప్రమాదాల బారిన వాహనదారులు అధికారుల తీరుపై ప్రజాగ్రహం సరిదిద్దుతాం ఔట్ లెట్కు సమాంతరంగా ఉన్న కారణంగా రోడ్డుకన్నా ఎక్కువ ఎత్తులో డ్రైనేజీని నిర్మించా ల్సి వచ్చింది. వ్యర్థాలను వెంటనే తొలగించి.. మిగిలిన పనులను పూర్తిచేసి రోడ్డును సరిదిద్దు తాం. వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – నరేష్, ఏఈ శంషాబాద్ మున్సిపాలిటీ -
రేషన్ బియ్యం ప్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: సన్నబియ్యం కోసం రేషన్ దుకాణాల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. డీలర్ల నుంచి స్టాక్ లేదనే సమాధానమే వస్తోంది. తుది గడువు సమీపిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రకృతీ వైపరీత్యాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ సర్కారు మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల 1 నుంచి ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభించారు. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటికీ సన్నబియ్యం పొందని లబ్ధిదారులు 20 శాతం ఉన్నారు. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో.. పోర్టబిలిటీని దృష్టిలో పెట్టుకుని జీవనోపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల కార్డుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం సేకరణ చేపట్టాల్సిన అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో రేషన్ దుకాణాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి నెలకొంది. మరో 11 వేల మెట్రిక్ టన్నులు వస్తేనే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 5,37,805 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మూడు నెలల బియ్యం కోటాకు సంబంధించి 34,535 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ లెక్కలేసింది. జిల్లాలో జీవనోపాధి కోసం వచ్చిన వలస కుటుంబాలకు సంబంధించి లక్షకు పైగా ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీరంతా ఇక్కడే రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. పోర్టబిలిటీతో కలిపి జిల్లాకు 45,535 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా, 34,535 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుమతయ్యాయి. లబ్ధిదారులు రేషన్ దుకాణం వద్దకు వస్తే డీలర్ల నుంచి స్టాక్ లేదన్న సమాధానం వస్తుండటంతో నిత్యం తిరగాల్సి వస్తోంది. మరో 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తేనే లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందనున్నాయి. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో జీవనోపాధి కోసం వచ్చిన వలస కుటుంబాలు అత్యధికంగా ఉండటంతో పాటు.. సన్నబియ్యం కూడా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి తరలించాల్సి రావటంతో జాప్యం ఏర్పడింది. దీంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కార్డుల సంఖ్యకు అనుగుణంగా రేషన్ దుకాణాలు లేకపోవటం కూడా మరో కారణం. 30తో ముగియనున్న పంపిణీ గడువు స్టాక్ లేదని తిప్పి పంపుతున్న రేషన్ డీలర్లు లబ్ధిదారుల్లో కొనసాగుతున్న ఆందోళన వలస కుటుంబాల పరిస్థితి దయనీయంలబ్ధిదారులందరికీ అందజేస్తాం ఆహార భద్రత కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తాం. పోర్టబిలిటీతో పాటు మూడు నెలలకు సన్నబియ్యం ఒకేసారి ఇస్తుండటంతో జాప్యం ఏర్పడుతోంది. దుకాణాలకు పంపిణీ చేయడంతో పాటు ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందేలా చూస్తాం. – శ్రీనివాస్రెడ్డి, డీఎస్ఓ, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా -
అసెంబ్లీ ఎదుట భారీ వాహనంలో మంటలు
నాంపల్లి: అసెంబ్లీ సమీపంలో ఓ భారీ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊహించని విధంగా వాహనంలో ఎగిసిపడటంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు అంటుకున్న సమయంలో వాహనంలోని డ్రైవరుతో పాటు మరొకరు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం మధ్యా హ్నం అసెంబ్లీ ఉస్మానియా గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం రోడ్డుపైనే పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫలితంగా కొంతసేపు నాంపల్లి నుంచి లక్డీకాపూల్ వెళ్లే దారిలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. -
వారి రూటే సెపరేటు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అనధికార లే అవుట్లలో ఖాళీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు.. వివాదాస్పద స్థలాలు.. నిషేధిత యూఎల్సీ.. అసైన్డ్ భూముల్లోని ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు.. నాలా కన్వర్షన్ చేయని భూముల రిజిస్ట్రేషన్లు కొంత మంది సబ్ రిజిస్ట్రార్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేని ఖాళీ స్థలాలకు/ లే అవుట్లలో ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన పార్కులకు పాతస్టాంప్ పేపర్లపై గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లను ఏజెంట్లుగా నియమించుకుని ఒక్కో డాక్యుమెంట్పై భూమి విలువ, విస్తీర్ణాన్ని బట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తుండటం, ఎప్పటికప్పుడు బదిలీలు చేయకపోవడం వీరికి కలిసి వస్తోంది. జిల్లాలో రోజుకు సగటున 650 నుంచి 700 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. వీటిలో అత్యధికంగా శేరిలింగంపల్లి, గండిపేట, ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం, హయత్నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంకర్పల్లి, అబ్దుల్లాపూర్మెట్ ఎస్ఆర్ఓ (సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్) సెంటర్లలో రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. ఆయా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏళ్లుగా అక్రమార్కులు తిష్టవేశారు. ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు.ప్రైవేటు వ్యక్తులదే హవాఎస్ఆర్ఓల్లో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేటు వ్యక్తుల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. డాక్యుమెంటేషన్ మొదలు.. స్కానింగ్ వరకు ప్రతి పనిలో వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) అమల్లోకి వచ్చిన 1998 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రర్డ్ డాక్యుమెంట్లు స్కానింగ్ చేస్తున్నారు. స్కానింగ్ కోసం యంత్రాలు కొనుగోలు చేసిన అధికారులు సిబ్బందిని నియమించలేదు. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు బయటి (జిరాక్స్ సెంటర్లు) వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన రెండు మూడు రోజుల్లోనే పత్రాలు సంబంధిత యజమానికి అందజేయాల్సి ఉంది. కానీ స్కానింగ్లో జాప్యంతో వారం పది రోజులు పడుతోంది. అంతేకాదు విలువైన ఆస్తి పత్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంతో ఒకే ప్లాటుకు రెండు మూడు డాక్యుమెంట్లు అవుతున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లలో దొర్లిన తప్పులను సరి చేసే (ఎడిట్ ఇండెక్స్) అధికారం స్థానిక ఎస్ఆర్ఓలకు ఉండేది. ఇటీవల ఈ బాధ్యతను జిల్లా ఎస్ఆర్ఓకు అప్పగించారు. చేయి తడపనిదే ఎడిట్ ఇండెక్స్ ఫైళ్లు కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.మచ్చుకు కొన్ని కేసులు● జెడ్పీ రోడ్డు సర్వే నంబర్ 58, సర్వే నంబర్ 60లో వెలసిన లే అవుట్లలో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలకు ఎల్బీనగర్ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదంగా మారింది. నిజానికి ఏదైనా ప్లాటు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించాలి. లింక్ డాక్యుమెంట్లు సరి చూడాలి. ఇక్కడి ఎస్ఆర్ఓ ఇవేవీ పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ప్రజా వసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాన్ని పక్కప్లాటు వ్యక్తి ఆక్రమించుకుని గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశంపై ఇటీవల ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం, సంబంధిత అధికారులపై న్యాయమూర్తి సీరియస్ కావడం చర్చనీయాంశంగా మారింది.● వ్యవసాయ భూమిని వ్యవసాయేతర (నాలా కన్వర్షన్) భూమిగా మార్చేందుకు మార్కెట్ విలువ ప్రకారం 3 శాతం, ఏదైనా నిర్మాణాలు ఉంటే 4.5 శాతం చొప్పున రుసుం చెల్లించాలి. శేరిలింగంపల్లి మండలం నానక్రాంగూడ సర్వే నంబర్ 48లోని ఏడున్నర ఎకరాల భూమి రిజి స్ట్రేషన్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ భూమి విలువ రూ.166.40 కోట్లు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ఏడున్నర ఎకరాలకు రూ.4.99 కోట్ల వరకు నాలా రుసుం చెల్లించాల్సి ఉంది. నాలా కన్వర్షన్ కాని ఈ భూమిని 37,061 గజాల చొప్పున మార్చి గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేశారు. జిల్లా రిజిస్ట్రార్ దీన్ని గుర్తించి అబెయన్స్లో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు లింకు డాక్యుమెంట్లతో పాటు నాలా, ప్రభుత్వ, ప్రైవేటు, వివాదాస్పద భూములు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్లు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది ఇవేవీ పట్టించుకోలేదు.● ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఒక లే అవుట్లో కనీసం పది ప్లాట్లు రిజిస్ట్రర్ అయితే అందులోని మిగిలిన ప్లాట్లను సైతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడాన్ని అవకాశంగా తీసుకుని అక్రమాలకు తెరలేపారు. రోజుకు 12 ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ కాని, వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కేవలం ఆరు రోజుల్లోనే 220 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ (2020 ఆగస్టు 26) తర్వాత వెలసిన లే అవుట్లలోని ప్లాట్లు కూడా అంతకు ముందు తేదీలు వేసి, 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో గండి కొట్టారు. డాక్యుమెంట్లు స్కానింగ్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటికి పొక్కింది.● బాలాపూర్ మండలం అల్మాస్గూడ రెవెన్యూ సర్వే నంబర్ 129,130,131,132లో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ ప్లాట్లకు చంపాపేట ఎస్ఆర్ఓ గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేశారు. మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేని, కోర్టు వివాదంలో ఉన్న ఈ లే అవుట్లోని ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎస్ఆర్ఓ, టౌన్ప్లానింగ్ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ్ల: స్థానిక కస్తూర్బాగాంఽధీ బాలికల పాఠశాలలో బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఇన్చార్జి శ్వేతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల ఈఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి అప్గ్రేడ్ అయిందని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు బోధన చేసేందుకు బోటనీ, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీ అవసరం ఉందన్నారు. అభ్యర్థులు పీజీ, బీఎడ్ అర్హతలు కలిగి ఉండాలని చెప్పారు. ఎంఎల్టీ కోర్సు (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) బోధించేందుకు సైతం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వసతిగృహానికి డే వాచ్ఉమెన్ పోస్ట్ ఖాళీగా ఉందని, పదో తరగతి చదివిన మహిళలు అర్హులని తెలిపారు. ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 91004 39368 నంబర్లో సంప్రదించాలని సూచించారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడు షాద్నగర్ః పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం టీటీడీ బోర్డు సభ్యుడు సదాశివరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి విచ్చేసిన ఆయనను అర్చకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో న్యాయవాది మోముల బసప్ప, నాయకులు బస్వం, దండు వాసు, ఒగ్గుకిశోర్, జాంగారి రవి, మార్గం రాజేష్, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయాన్ని దర్శించుకున్న వెన్నెల శంకర్పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్, గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెల దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వెన్నెల మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని సందర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మళ్లీ సమయం తీసుకొని వస్తానని, ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు మోహన్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. చీకటి వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన కందుకూరు: మండలంలోని పులిమామిడి పరిధిలోని చీకటి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంతోష్కుమార్ పాండ్యే సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో అధికారులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు ఆలయ చరిత్రను ఆయనకు వివరించారు. తెలంగాణలో వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన నిత్యం నాలుగు పురాతన దేవాలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నట్లు తెలిసింది. -
ఉత్సాహంగా ‘ఎథ్నిక్ రన్’
శంకర్పల్లి: మండలంలోని పిల్లిగుండ్ల గ్రామంలో ఆదివారం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఎథ్నిక్ రన్ –2025’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద నేరెళ్ల, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వందలాది మంది మహిళలు సంప్ర దాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారద నేరెళ్ల మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం, ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. గుమ్మడి వెన్నెల మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ యువతలో ఆసక్తి పెంపొందించడంలో గండిపేట వెల్ఫేర్ సొసైటీ విజయవంతమైందని అభినందించారు. సొసైటీ జాయింట్ సెక్రెటరీ వాణి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం తమ సొసైటీ ఏర్పడిందని, అప్పటి నుంచి మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఏడు ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు నడుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు స్ఫూర్తి
సమస్యల పరిష్కారానికి కృషి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య అన్నారు. 8లోuకేశంపేట: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మే రకు ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో ఇన్స్పైర్ మనక్ పురస్కారాలను అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి నామినేషన్లు స్వీకరిస్తోంది. ఎవరు అర్హులంటే.. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్లైన్స్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానం ● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ● www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని, సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది. ● వీరు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. ● అప్పుడు విద్యార్థులు యూజర్ ఐడీకి పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ● విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేయాలి. ● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి బ్యాంక్ ఖాతాకు రూ.పదివేలు జమ చేస్తారు. ● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు. ● ఆన్లైన్లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఎప్పటిలోగా అంటే.. విద్యార్థులు తమ పేర్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. గత విద్యా సంవత్సరం.. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయికి 1,881 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటి నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 198 నామినేషన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. వీటి నుంచి నాలుగు జాతీయ స్థాయికి వెళ్లాయి. ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో అతిథ్యం.. స్వయానా రాష్ట్రపతితో అభినందనలు.. కేంద్ర మంత్రులతో ప్రశంసలు.. దిగ్గజ శాస్త్రవేత్తలతో సమాలోచనలు.. ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు.. కానీ అందుకోసం విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. తమ తెలివికి పదును పెట్టాలి. జాతీయ స్థాయిలో ‘ఇన్స్పైర్ మనక్’ స్టూడెంట్స్ ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతిభ చూపినవారికి నగదు పురస్కారాలు ఆన్లైన్ ద్వారా సెస్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్స్పైర్ ఎంతగానో దోహదపడుతుంది. ఉపాధ్యా యుల సహకారంతో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలి. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి -
సామాన్యులను విస్మరిస్తున్న కేంద్రం
కందుకూరు: నరేంద్రమోదీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడుతోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కోట రమేష్, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. మండల పరిధిలోని నేదునూరు గేట్ వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్లో ఆదివారం పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు డి.రాంచందర్, మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్ ఆధ్వర్యంలో కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కోట రమేష్, పగడాల యాదయ్య మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను విస్మరిస్తోందనిపేర్కొన్నారు. రైల్వే, విమానయానం, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం బాధాకరమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యురాలు కవిత, ఆమనగల్లు, మహేశ్వరం పార్టీ కార్యదర్శులు శివశంకర్, ఏర్పుల శేఖర్, సీఐటీయూ నాయకులు గుమ్మడి కుర్మయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కోట రమేష్ -
పంచాయతీలకు కొత్త భవనాలు
యాచారం: ఈజీఎస్ పథకం నుంచి రూ.20 లక్షల చొప్పున నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన శిథిల భవనాల్లోనే ఇబ్బందుల నడుమ ప్రజాప్రతినిధులు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. వర్షాలకు నీరంతా గదుల్లోకి చేరి విలువైన రికార్డులు తడిసిపోయేవి. తాజాగా పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరవడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంతన్గౌరెల్లిలో భవన నిర్మాణ పనులు జోరందుకున్నాయి. నందివనపర్తిలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు తాడిపర్తి, చౌదర్పల్లి, తమ్మలోనిగూడ, ధర్మన్నగూడ, కేసీతండా, తక్కళ్లపల్లి తండా, అయ్యవారిగూడెం గ్రామాల్లోనూ నూతన పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాడిపర్తి, చౌదర్పల్లి, తమ్మలోనిగూడ గ్రామాల్లో ఏళ్ల కింద నిర్మించిన భవనాలుండగా కేసీతండా, ధర్మన్నగూడెం, అయ్యవారిగూడెం, తక్కళ్లపల్లి తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ నాలుగు గ్రామాల్లో ప్రభుత్వ భవనాల్లోనే పాలన కొనసాగుతుండగా, శాశ్వత భవన నిర్మాణాల కోసం నిధుల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే కొత్త పంచాయతీలకు సైతం శాశ్వత భవనాలు ఉంటాయని మండల పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాలకు ఈజీఎస్ నుంచి రూ.20 లక్షల చొప్పున నిధులు మరో ఏడు గ్రామాలకు ప్రతిపాదనలు త్వరలో ప్రారంభిస్తాం నందివనపర్తిలో ఏళ్ల కింద నిర్మించిన ఇరుకై న గదిలోనే పాలన కొనసాగిస్తున్నాం. సమావేశాల సమయంలో ఇబ్బంది అవుతుంది. పంచాయతీ, రెవెన్యూ, వైద్య, ఇతర సిబ్బంది వచ్చినప్పుడు కష్టంగా విధులు నిర్వర్తిస్తున్నాం. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. – ఈర్లపల్లి శ్రీనువాస్, పంచాయతీ కార్యదర్శి, నందివనపర్తి -
డెకరేషన్ గోడౌన్లో అగ్నిప్రమాదం
పహాడీషరీఫ్: డెకరేషన్ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీలో వివాహాదిశుభకార్యాలకు వినియోగించే డెకరేషన్ సామగ్రి గోడౌన్ ఉంది. శనివారం సాయంత్రం పక్కనే ఉన్న చెత్తకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో గోడౌన్కు మంటలు వ్యాపించాయి. డెకరేషన్ సామగ్రిలో ప్లాస్టిక్, ఫైబర్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జనావాసాల నడుమ ఉన్న ఈ గోడౌన్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
విద్యార్థి అదృశ్యం
చేవెళ్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన మెకానిక్గా రాము కుమారుడు జశ్వంత్(18) ఆదర్శ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జశ్వంత్ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ రావడంతో స్నేహితులు, బంధువుల వద్దవెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
షాద్నగర్: ఉపాధ్యాయులు విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించడం తగదని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్ల శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు వారికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలన్నారు. వారితో పనులు చేయించడం సరికాదన్నారు. ఇటీవల నేరేళ్లపల్లి పాఠశాలలో విద్యార్థులతో మూత్రశాలలు కడిగించడం, పాటిగడ్డలో ఉపాధ్యాయులు విధులకు సెలవు పెట్టి సొంత పనులకు వెళ్లడం వెళ్ళడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతారన్నారు. అటువంటి ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు శివశంకర్, ఆదిల్, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ -
కులంపేరిట దూషించిన వారిపై చర్యలకు డిమాండ్
నందిగామ: తనను కులం పేరుతో దూషించిన వ్యక్తులపై నందిగామ ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మోత్కులగూడ గ్రామానికి చెందిన వానరాసి నర్సింలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను స్థానిక విలేకరులకు అందజేశాడు. ఈ నెల 4న గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్లాటు విషయమై అధికారులతో మాట్లాడుతున్న సమయంలో గ్రామానికి చెందిన జెట్ట శంకరయ్య, జెట్ట రవి, జెట్ట హరీశ్ తనను గ్రామస్తుల సమక్షంలోనే కులం పేరుతో దూషించి, అవమానపరిచి, బెదిరించారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొన్ని రోజులుగా తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్న శంకరయ్య, రవి, హరీశ్లపై విచారణ జరిపి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు -
ఘనంగా ప్లేస్మెంట్ అచీవర్స్ డే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం శేరిగూడలోని శ్రీదత్త విద్యా సంస్థల్లో శనివారం ప్లేస్మెంట్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2024– 25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. విద్యా సంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు అత్యాధునిక టెక్నాలజీలో శిక్షణ ఇస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు వందశాతం ప్లేస్మెంట్ కల్పిస్తున్నామని తెలిపారు. 46 మల్టీ నేషనల్ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తూ పాటు వందశాతం ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అకాడమిక్స్ డీన్ వెంకట అచ్యుతరావు, ప్రిన్సిపాల్ సెంథిల్కుమార్, డాక్టర్ మదుసూధన్రెడ్డి, టీపీఓ డాక్టర్ మయూరి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
వీఎంహోంలో అంతర్జాతీయ యోగా వేడుకలు
హుడాకాంప్లెక్స్: శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే విధానమే యోగా అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోం మైదానంలో స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకలకు ఎంపీతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. యోగా గురువులు ఆసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రశాంతంగా జీవించాలంటే యోగా అవసరమన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రాచీన ఆధ్యాత్మిక పతంజలి యోగాను నిత్యం అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుజీత, ఇన్స్పెక్టర్లు సైదిరెడ్డి, వినోద్కుమార్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
భూ రికార్డులు మార్చేలా చూడండి
ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్కు రైతుల వినతి యాచారం: ఫార్మాసిటీకి భూములు ఇవ్వని రైతుల భూ రికార్డులను తిరిగి రైతుల పేర్లపై నమోదు చేసేలా కృషి చేయాలని తాడిపర్తి గ్రామ రైతులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్కు విన్నవించారు. నగరంలో శనివారం ఆయనను కలిసిన వారు ఫార్మాసిటీ భూసేకరణ చట్ట వ్యతిరేకంగా జరిగిందని, అవార్డులు అన్నీ రద్దు చేయాలని, టీజీఐఐసీ పేరు మీదున్న భూ రికార్డులను రైతుల పేర్లపై నమోదు చేయాలని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. చట్ట విరుద్ధంగా ఫార్మాసిటీకి సేకరించిన భూములకు బలవంతంగా ఫెన్సింగ్ వేసి తమను వెళ్లకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన 2,211 ఎకరాల పట్టా భూమికి మరోచోట భూమి చూపించేలా సర్కార్పై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తాడిపర్తి మాజీ సర్పంచ్ దూస రమేశ్, టీజీఎస్ రాష్ట్ర నాయకులు దార సత్యం, సామ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.