breaking news
Ranga Reddy District News
-
పైపులైన్లకు తవ్వారు
సీసీ రోడ్లు వేసినా పైప్లైన్లు, నల్లాల కోసం తవ్వారు. తిరిగి సరిగా పూడ్చకపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. రోడ్లపై మురుగునీరు పారుతూ గుంతలు పడటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఓట్లు వేయమని తిరుగుతున్నారు. – గోపాల్, పెద్దమంగళారం, మొయినాబాద్ పట్టించుకోవడంలేదు మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారాయి. రోడ్లపై వాహనాలు వెళితే కుదుపులకు నడుము నొప్పులు వస్తున్నాయి. మున్సిపాలిటీ ఏర్పాటై ఏడాది అవుతున్నా రోడ్లపై దృష్టి పెట్టడంలేదు. మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. – రమేశ్, సురంగల్, మొయినాబాద్ ● -
బీఫాం.. తెలుసుకుందాం
షాద్నగర్: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఎక్కడ విన్నా ఒకే చర్చ.. బీఫాం ఎవరికి వస్తుందని.. పార్టీ ప్రాతిపదిక జరిగే ఎన్నికలు కావడంతో అభ్యర్థులు బీఫాం పొంది బరిలో దిగాల్సి ఉంటుంది. బీఫాం లేకుండా పోటీ చేస్తే ఎన్నికల అధికారులు వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. మరి ఈ బీఫాం అంటే ఏమిటో ఓసారి తెలుసుకుందాం.. ● బీఫాం అంటే గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ఎంపిక చేసిన వారికి ఇస్తారు. నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఇచ్చిన బీఫాంను దాఖలు చేస్తే ఆ అభ్యర్థికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తులను కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు లేదా పరిశీలకుడు సదరు అభ్యర్థిని ఎంపిక చేసి వారికి బీఫాం అందజేస్తారు. ● ఏఫాం కలిగిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫాం ఇచ్చే పూర్తి అధికారాలు ఉంటాయి. బీఫాం ఇచ్చే ముందు పార్టీ అధ్యక్షుడు ఆమోదిస్తూ ప్రతిపాదించిన వ్యక్తి తన పేరు అందజేసిన ఏ ఫాంను ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పోటాపోటీ పార్టీల తరఫున ఎన్నికల బరిలో ఉండాలనుకునే ఆశావహులు బీఫాం కోసం పోటీపడుతుంటారు. పార్టీ ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకొని బీఫాం పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. నామినేషన్ల చివరి ఘట్టం వరకు బీఫాం ఎవరికి ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంటుంది. పార్టీ నాయకులు గెలుపు గుర్రాల కోసం మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిస్థాయి కసరత్తు చేసి బీఫాం అందజేస్తున్నారు. -
గుంతలమయం
చేవెళ్ల: మండల కేంద్రంతోపాటు చుట్టున్న 11 గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. చేవెళ్ల మున్సిపాలిటీలోని కాలనీలు, వార్డుల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారటంతో వాటిని ఎవరూ పట్టించుకోవటం లేదు. నూతన మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా చూడాలి. ఇబ్బందులు పడుతున్నాం రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. పంచాయతీగా ఉన్న కాలంలోనే నిధులు లేని కారణంగా రోడ్లు బాగు చేయించలేకపోయారు. ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పాటైంది. నిధులు ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నాం. వార్డులకు వెళ్లే అంతర్గత రహదారులను బాగు చేయించాలి. – మల్లేశ్, ఇబ్రహీంపల్లి వార్డు స్పందించడం లేదు మున్సిపాలిటీ ఏర్పాటుతో సమస్యలు పెరుగుతున్నాయే కానీ పరిష్కారం రావటం లేదు. చేవెళ్ల నూతన మున్సిపాలిటీ కావటంతో పలు కాలనీల్లో సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచులకు చెబితే వెంటనే పనులు చేయించేవారు. ఇప్పుడు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. – రామస్వామి, హౌసింగ్ బోర్డు కాలనీ -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
తుక్కుగూడ: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలో ఆదివారం కార్మిక సంఘాల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో హాజరై సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కవిత, శివ, సుజాత, పానుగంటి పర్వతాలు, దత్తునాయక్, రుద్రకుమార్, చందు యాదవ్, సత్యానారాయణ, మల్లేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ ఒలింపియాడ్లో మొయినాబాద్లోని మెలోహా స్కూల్ విద్యార్థిని సహస్ర సత్తా చాటింది. ఇటీవల సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ ఒలింపియాడ్లో మెలోహా స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న సహస్ర ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ ఘనత సాధించిన సహస్రను, ఆమె తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీసాయిచంద్ ఆమనగల్లు: మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎన్నికల బీఆర్ఎస్ ఇన్చార్జి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీసాయిచంద్, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీకాంత్ కాలనీలో ఆదివారం 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఖలీల్కు మద్దతుగా వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు తీసుకు వచ్చారన్నారు. అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ నాయకులకు ము న్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు. దొంగ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్రావ్, మాజీ ఎంపీపీ నిర్మల, నాయకులు కుమార్, శ్రీనివాస్, నిరంజన్గౌడ్, బాలస్వామి, హాజీపాషా తదితరులు ఉన్నారు. ఎయిర్పోర్టులోకి లేజర్ కిరణాలు శంషాబాద్: విమానాశ్రయంలో లేజర్ కిరణాలు పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి ఎయిర్పోర్టులోని రన్వే–09ఆర్కు దక్షిణ ప్రాంతం నుంచి రంగురంగుల లేజర్ కిరణాలు ప్రసరించడంతో అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. లేజర్ కిరణాలు ఎక్కడి నుంచి పడ్డాయన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. -
వికసిత భారత్ దిశగా..
ఆర్థికవృద్ధి, ఉపాధి సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే మూడు కీలక అంశాలను కేంద్రంగా పెట్టి దేశ భవిష్యత్తును రూపకల్పన చేసింది. వికసిత భారత్ దిశగా దూరదృష్టి గల నాయకత్వంలో ఈ బడ్జెట్ రూపొందింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి, ముఖ్యంగా రైల్వేలు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ అభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వరా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడింది. కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. – బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు -
కేసీఆర్పై కక్షసాధింపు
మీర్పేట: ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసులో విచారణకు పిలిచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు మీర్పేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జిల్లెలగూడ, మీర్పేట, అల్మాస్గూడ, బడంగ్పేట మీదుగా బాలాపూర్ చౌరస్తా వరకు నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలాపూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై వేధింపులకు దిగుతోందని విమర్శించారు. చరిత్ర సృష్టికర్తల జోలికి వస్తే చివరికి చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మీర్పేట, బడంగ్పేట బీఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేశ్రెడ్డి, రామిడి రాంరెడ్డి, నాయకులు అర్కల భూపాల్రెడ్డి, అనిల్యాదవ్, పెండ్యాల నగేష్, దీప్లాల్ చౌహాన్, సిద్దాల అంజయ్య, సునీత, స్నేహలత తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
ఒకే వార్డులో ముగ్గురు రిపోర్టర్లు
మొయినాబాద్: మున్సిపాలిటీలోని 14వ వార్డులో మూడు ప్రధాన పార్టీల నుంచి విలేకరులు పోటీ పడుతున్నారు. సురంగల్ పరిధిలో ఉన్న వార్డులో అదే గ్రామానికి చెందిన బ్యాగరి శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా, కర్రోళ్ల శ్రీధర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా, బేగరి రాజు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ముగ్గురు వేరువేరు వార్త పత్రికల్లో రిపోర్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన విలేకరులు ఒకే వార్డు నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎవరు గెలిచినా రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి కౌన్సిలర్గా మున్సిపాలిటీలో అడుగుపెట్టనున్నారు. -
ప్చ్.. లాభం లేదు
కీలక ప్రాజెక్టులకు మొండిచేయి ● మెట్రోరైల్ విస్తరణ ఊసెత్తని వైనం ● నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ జిల్లావాసులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్సిటీ ప్రస్తావన లేదు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, అటు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా జిల్లాలో కీలకమైన ఈ ప్రాజెక్టుకు కూడా పైసా కేటాయించలేదు. మూసీ ప్రక్షాళనకు నిధుల కేటాయింపు లేదు. ఫ్యూచర్సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్, రావిర్యాల నుంచి ఆమనగల్లు వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ సహా రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులకు పైసా విదల్చలేదు. ఇదిలా ఉంటే దేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు 2047 వరకు టాక్స్ హాలీడే ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో జిల్లాకు మరికొన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక బాలికల హాస్టల్ను మంజూరు చేయడం, విద్యుత్ వాహనాలకు రాయితీలు ప్రకటించడం వాహన కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ మాత్రం జనరంజక బడ్జెట్గా అభివర్ణించింది. -
ఒంటరి పోరుకే సై
● బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ● రసవత్తరంగా త్రిముఖ పోటీ ● చైర్మన్ ఎన్నికలో సయోధ్యకు ఛాన్స్ పరిగి: మున్సిపల్ ఎన్నికల పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలిచేందుకు శాయశక్తులు ఒడ్డుతున్నాయి. ఈసారి పరిగి మున్సిపాలిటీలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్ని వార్డుల్లో పోటీ ఉండటంతో పాటు రెండు స్థానాల్లో సీపీఎం సైతం బరిలో నిలిచింది. ఏవైనా రెండు పార్టీలు కలిసి పుర పోరులో పోటీ చేస్తాయని భావించిన పట్టణ ప్రజలకు అందరూ బరిలో నిలవడంతో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఆయా పార్టీలో టికెట్లు ఆశించి భంగపడ్డ వారిని తమ పార్టీలో చేర్చుకొని మద్దతు కూడగట్టేందుకు రాజకీయ పక్షాలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. త్రిముఖ పోటీలో ఏదో ఒక పార్టీ చైర్మన్ ఎన్నికల సమయంలో కింగ్మేకర్ కానుందని చర్చించుకుంటున్నారు. మూడు పార్టీలు ఒంటరిగా పోటీకి సిద్ధం కావడంతో గెలుపు అవకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. చైర్మన్ పీఠంపై గురి! పరిగి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని కాంగ్రె స్, బీఆర్ఎస్ యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యధిక శాతం ఓట్లు ఉన్న వర్గాల మద్దతు కూడగట్టే పనిలో ముఖ్య నాయకులు పడ్డారు. రెండు పార్టీలు మైనార్టీ ఓట్లను తమ వైపునకు తిప్పుకోవా లని పథకాలు రచిస్తున్నాయి. బీజేపీ కొన్ని వార్డుల పై ఆశలు పెట్టుకుంది. గెలిచే స్థానాలపై ప్రత్యేక గు రి పెట్టి కచ్చితంగా మూడు నాలుగు వార్డులను కై వ సం చేసుకోవాలని భావిస్తోంది. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎంపిక సమయంలో బీజేపీ మద్దతు కచ్చితంగా ఏ పార్టీకై నా కావాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అన్ని వార్డుల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ ముఖ్య నా యకులను బరిలో దించడంతో వారి గెలుపు అని వార్యం కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓట్లు చీల్చనున్న బీజేపీ బీజేపీకి పట్టణ కేంద్రంలో దాదాపు పది శాతంపైగా ఓట్లు ఉన్నాయి. ఇటీవల ఆ పార్టీలో పలువురు ముఖ్య నాయకులు చేశారు. ముకుంద నాగేశ్ తన అనుచరులతో పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో బీజేపీకి కొత్త ఊపు వచ్చింది. అంతేకాక ఎక్స్ అఫీషియో ఓటు ఉండటంతో ఈ ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చని భావిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి బీజేపీ 16 వార్డుల్లో పోటీకి దిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీజేపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కాషాయ పార్టీలోకి జోరుగా చేరికలు జరుతున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఓట్లు చీల్చనుంది. ఇందులో ఏ పార్టీకి నష్టం, లాభం చేకూరుతుందో వేచి చూడాలి. పుర పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒంటరిగా తలపడుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించేందుకు నూతన ఎత్తుగడలతో ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వాస్తవ పరిస్థితులను అంచనా వేసి అసంతృప్తుల మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నాయి. -
జిల్లాకు అన్యాయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. పేదలకు చేకూరే మేలు ఏమాత్రం లేదు. ఇది పూర్తిగా పెద్దలకు దోచిపెట్టే బడ్జెట్లా మిగిలిపోయింది. కనీసం జిల్లా పేరు కానీ, కీలక ప్రాజెక్టుల ప్రస్తావన గానీ తీసుకురాకపోవడం అన్యాయం. ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ఏ ఒక్క చర్య లేదు. ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్. – చల్లా నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు -
ఉద్యోగులకు నిరాశే
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసింది. వారికి లబ్ధి చేకూర్చే ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు. విద్యా వ్యవస్థకు పెద్దగా కేటాయింపులు లేవు. రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం రూ.13,289 కోట్లు మాత్రమే(2.6 శాతం) కేటాయించింది. గత ఏడాది కేటాయించిన బడ్జెట్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రభుత్వ విధానాలు పేదలను విద్యకు దూరం చేసేలా ఉన్నాయి. ఉద్యోగుల నుంచి ఆదాయపన్ను ముక్కుపిండి వసూలు చేస్తుంది. – వై.కరుణాకర్రెడ్డి, ఎస్టీయూటీఎస్, కార్యదర్శి -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పహాడీషరీఫ్: ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుది. ఎస్సై దయాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద గోల్కొండ నుంచి తుక్కుగూడకు వచ్చే ఔటర్పై 125 కిలోమీటర్ బోర్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జుగా మారి ఛిద్రమైంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 35–40 ఏళ్ల నడుమ ఉంటుందని, మృతుడి నడుముకు మొలతాడు ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పొలం విషయంలో ఘర్షణ దాయాదుల చేతిలో గాయపడి వ్యక్తి మృతి కొందుర్గు: దాయాదుల మధ్య పొలం విషయంలో గొడవపడి ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయిన సంఘటన ఆదివారం మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాలపురం భీమయ్యకు లాలయ్య, పోచయ్య, రామయ్య ముగ్గురు కుమారులు, అయితే భీమయ్యకు సంబంధించి చింతలపల్లి గ్రామ శివారులో 5.07 ఎకరాల భూమి ఉంది. కాగా అతడి ముగ్గురు కుమారుల వారసుల్లో పోచయ్య, రామయ్య కుమారులు వారి భాగాల ప్రకారం పట్టా మార్పడి చేసుకున్నారు. లాలయ్యకు సంబంధించిన భూమి అతడి కుమారుడు నర్సింలు పేరున పట్టా మార్పిడి కాలేదు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య తరచుగా గొడవ జరిగేది. ఈ విషయమై నెలకొన్న గొడవలో రపోచయ్య, రామయ్య వారసులైన యాదయ్య, నర్సింలు, రమేష్, జంగమ్మ, మంజుల కలిసి ఆదివారం లాలయ్య కుమారుడు నర్సింలుపై దాడి చేయగా తలకు బలమైన గాయం అయింది. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో షాద్నగర్ తరలించగా నర్సింలు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయమై మృతుడి భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చెరువులో పడి ఇద్దరి విద్యార్థుల గల్లంతు ● ఆడుకుంటుండగా జారిపడి పడిన వైనం ● కొనసాగుతున్న గాలింపు చర్యలు మహేశ్వరం: చెరువు ఒడ్డున సరదాగా ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన మహేశ్వరం మండల పరిధిలోని కొత్వాల్ చెర్వు తండా(కేసీ తండా)లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్వాల్ చెర్వు తండాకు చెందిన జాటోత్ రిష్విత్(7), జాటోత్ శ్రీకాంత్(10), కరన్టోత్ శోభిత్ ముగ్గురు స్నేహితులు. ఆదివారం స్కూల్కు సెలవు కావడంతో సాయంత్రం ముగ్గురు కలిసి తండా సమీపంలో ఉన్న కొత్వాల్ చెరువు వద్దకు వెళ్లారు. ఒడ్డున బండపైన సరదాగా ఆడుకుంటుండగా ముందుగా ఉన్న రిష్విత్, శ్రీకాంత్లు ప్రమాదవశాత్తు జారిపడి చెరువు గుంతలో పడిపోయారు. వీరి వెనుక ఉన్న శోభిత్ ఏడుస్తూ భయంతో ఇంటికి పరుగులు తీశాడు. తల్లిదండ్రులు, స్థానికులు చెరువు దగ్గరకు చేరుకొని వెతకడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ, కానిస్టేబుళ్లతో చేరుకొని గల్లంతైన విద్యార్థుఽల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. రిష్విత్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి, శ్రీకాంత్ మూడో తరగతి చదువుతున్నారు. మరింత మంది గత ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని సీఐ తెలిపారు. గల్లంతైన విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువులు చెరువు వద్ద బోరున విలపిస్తున్నారు. -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: షాపునకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన పల్స సుదర్శన్ కుమార్తె పల్స నందిని(19) ఇంటి వద్దే ఉంటుంది. గత 31వ తేదీన తల్లిదండ్రులు బయటికి వెళ్లిన సమయంలో నాయనమ్మ దమయంతితో కలిసి ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు షాప్నకు వెళ్లివస్తానని చెప్పిన ఆమె తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా లాభం లేకపోవడంతో పాటు ఆమె ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ ఉంది. దీనిపై పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘనంగా మహమ్మాయిదేవి కల్యాణం ఇబ్రహీంపట్నం రూరల్: మంగళ్పల్లి మహమ్మాయిదేవి కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి ఆదిబట్ల మున్సిపాలిటీలో కనుల పండవగా జరిగింది. వేద పండింతుల మంత్రోచ్ఛరణ నడుమ, పట్టణ ప్రజల సమక్షంలో కల్యాణం నిర్వహించారు. అమ్మవారికి దేవాదాయ ధర్మదాయశాఖ నుంచి చైర్మన్ వట్నాల రాముగౌడ్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు అందజేశారు. శాసన మండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనచారి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
పోస్టర్లు అతికిస్తే ఓడిపోతారట
షాద్నగర్: ఫరూఖ్నగర్లో పాత జాతీయ రహదారికి ఆనుకొని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి 330 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థాన రాజు సవై పెద్ద వెంకట్రెడ్డి తన తల్లి పెద్ద జానమ్మ కోరిక మేరకు నిర్మించారు. అయితే ఇక్కడ పెద్ద రథశాల ఉంది. దేవాలయానికి ఎదురుగా ఖాళీ స్థలం ఉండటంతో దైవసన్నిధిలో ఉంటుందనే ఉద్దేశంతో గతంలో వివిధ పార్టీల నాయకులు ఇక్కడ సమావేశాలు నిర్వహించేవారు. అయితే పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ రథశాలపై రాతలు రాయాలన్నా, పోస్టర్టు అతికించాలన్నా భయపడుతారు. అలా చేస్తే ఎన్నికల్లో ఓడిపోతారనే సెంటిమెంటు ఉంది. అందుకే ఈ రథశాల గోడలపై ఎవరు రాతలు రాయరు, పోస్టర్లు కూడా అతికించరు. షాద్నగర్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఈ రథశాలను అందరు చర్చించుకుంటారు. -
ఏకగ్రీవం కాకుండా బీజేపీ చెక్
శంకర్పల్లి: మున్సిపాలిటీలో నామినేషన్ల సమయానికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. 12వ వార్డు స్థానానికి బీఆర్ఎస్ నుంచి దండు సంతోష్, కాంగ్రెస్ నుంచి యంసాని ప్రకాశ్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ తండ్రి రాజేశ్వర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని నామినేషన్ వేశారు. అప్పటికే హస్తం పార్టీ నుంచి బరిలో ఉన్న ప్రకాశ్గుప్తా సైతం రాజేశ్వర్తో కలిసి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు వార్డు స్థానాన్ని ఏకగ్రీవం కాకుండా సిరిగన్నగారి శ్రీకాంత్రెడ్డిని బరిలో నిలిపి, ఆయన్ని నగరంలోని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు అక్కడే ఉంచనున్నట్లు సమాచారం. మహిళ అదృశ్యం మొయినాబాద్ రూరల్: ఇంటి నుంచి పని కోసం వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుండే ప్రవళిక స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రికి పని కోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ కోవా పట్టివేత ఇద్దరి అరెస్టు తాండూరు టౌన్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ కోవా తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ అన్వర్పాషా తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలో కల్తీ కోవా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. కల్తీ కోవా ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన ప్రకాష్ విష్ణు అనే వ్యక్తి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్ వద్ద కల్తీ కోవా తెచ్చి పలు స్వీటు షాపులకు విక్రయిస్తుంటాడు. ప్రకాష్ విష్ణు ఇంటిపై దాడి చేయగా 120 కిలోల కల్తీ కోవా దొరికిందన్నారు. హైదరాబాద్లో మహ్మద్ సల్మాన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి పట్టణ పోలీసులకు అప్పగించామన్నారు. భవనంపై నుంచి జారిపడి వాచ్మెన్ మృతి గచ్చిబౌలి: భవనంపైనుంచి జారిపడిన ఓ వాచ్మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. కొండాపూర్ రాజరాజేశ్వరీనగర్లో నివాసముండే అడబాల శ్రీనివాస్(29) ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. శుక్రవారం డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు సత్యనారాయణ అపార్ట్మెంట్ ప్రాంతంలో గాలించగా సెల్లార్లో పడిపోయి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు గుర్తించాడు. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో పడి వృద్ధురాలి మృతి
ఆమనగల్లు: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సహదేవి సముద్రం చెరువులో వెల్లాలకు చెందిన వడ్డె బాలమ్మ(60) చేపల కోసం శుక్రవారం వెళ్లింది. చీకటి పడినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు సమీపంలో, గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా సహదేవి సముద్రంలో శనివారం మధ్యాహ్నం మృతదేహం స్థానికులకు కనిపించగా వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీయగా బాలమ్మగా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
15 ఏళ్లుగా పట్టణపాలన
● స్వాతంత్య్రం తొలినాళ్లలోనే మున్సిపల్గా షాద్నగర్ ● 1964లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు ● 47 వసంతాలు కొనసాగిన సర్పంచుల హవా ● 2011లో రెండోసారి పురపాలికగా రూపాంతరం షాద్నగర్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే షాద్నగర్ మున్సిపాలిటీగా ఉండేది. అభివృద్ధికి నిధులు లేకపోవడంతో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 47 ఏళ్ల పాటు గ్రామ పాలనే కొనసాగింది. ఈ వ్యవస్థకు నాటి ప్రభుత్వం స్వస్తి చెప్పి తిరిగి రెండోసారి మున్సిపాలిటీగా మార్చింది. ప్రస్తుతం జరిగే పుర పోరులో అధికార కాంగ్రెస్, విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమ ఉనికిని కొనసాగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారానికి వ్యూహాలు రచించి, ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. చరిత్ర ఇదే.. 1869 నుంచి 1911 మధ్యకాలంలో ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ షాద్నగర్ను స్థాపించారు. జానంపేటకు చెందిన మహారాజా కృష్ణప్రసాద్ ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ఈయన ‘షాద్’ అనే కలంతో ప్రసిద్ధి చెందారు. అందుకే షాద్నగర్గా పేరు వచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభానికి ముందు 1954 ప్రాంతంలో షాద్నగర్ మున్సిపాలిటీగా ఉండేది. ఈ పట్టణ కేంద్రంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాగ్గా ఏర్పడింది. షాద్నగర్లో నిర్వహించిన ఎన్నికల్లో తొలి మున్సిపల్ చైర్మన్గా మాదిరాజు సుదర్శన్రావు ఎన్నికయ్యారు. 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. 1964లో షాద్నగర్ మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. రెండోసారి మున్సిపాలిటీగా.. నాడు అభివృద్ధికి సరిగా నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీగా ఉన్న షాద్నగర్ను 1964లో ప్రభు త్వం రద్దు చేసింది. మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి పాలనను కొనసాగించారు. 1964 నుంచి 2011 వరకు 47 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీగా కొనసాగిన షాదనగర్ను తిరిగి 2011 ఆగస్టు 24న గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ మున్సిపాలిటీ పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 28 వార్డులున్నాయి. పట్టణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న సమయంలో షాద్నగర్ పురపాలక సంఘంగా కొనసాగింది. నాటి పరిస్థితులకు తగ్గట్టు నిధులు లేకపోవడంతో అనంతరం గ్రామ పాలనలోకి వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కొనసాగిన బూర్గుల రామకృష్ణారావు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ చరిత్రేంటో ఓసారి లుక్కేద్దాం. -
నాయకులు నారాజ్
● సర్వే అనుకూలంగా లేదని టికెట్ల నిరాకరణ● బీఫారం ఇవ్వకపోవడంతో గరం ● అధికార పార్టీలో పెరిగిన అసంతృప్తులు పరిగి: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి జెండా మోసి నిలబెట్టిన తమకే టికెట్(బీ ఫా రం) ఇవ్వడం లేదని అధికార పార్టీ చెందిన కొంతమంది నేతలు నారాజ్ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి రోజురోజుకూ అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో అలకలు పెరిగినట్లు సమాచారం. అధికారంలో లేనప్పటి నుంచి అసల్ సిసల్గా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను పక్కన పెట్టి కొందరికి టికెట్లను కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే అనుకూలంగా లేదని ఎన్నికల బరిలో ఉండరాదని ముక్కుసూటిగా చెప్పడంతో బీఫారం రాని నేతలు అయోమయస్థితిలో పడ్డారు. అధికార పార్టీ నుంచి ఎంతో మంది ఎన్నికల బరిలో నిలవాలని భావించినా కొందరికే ఆ అవకాశం దక్కనుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒకటి రెండు తప్పా ఎక్కడ రెబల్ బెడదా కనిపించడం లేదు. నాలుగు వార్డుల్లో ప్రభావం పరిగి మున్సిపల్లో 18 వార్డులున్నాయి. మొత్తం వార్డుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 46 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి 30 సెట్ల నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 31, స్వతంత్రులు 18 మొత్తంగా 158 నామినేషన్ సెట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. అధికార పార్టీలో అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రెండు నుంచి నాలుగు వార్డుల్లో సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. పార్టీ కోసం పనిచేస్తే ముఖంపైనే టికెట్ ఇచ్చేది లేదని చెప్పడంతో కొందరు నాయకులు నారాజ్ అవుతున్నారు. టికెట్లు ఆశించి రానివారు సొంత పార్టీలోనే ముసలం కానున్నారు. వారి నుంచి పార్టీకి పెద్ద దెబ్బపడనుందని చర్చించుకుంటున్నారు. అసంతృప్తులను గుర్తించి వారిని శాంతపరచకుంటే ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. టికెట్ల కోసం కొట్లాట ఓ పార్టీకి చెందిన నాయకులు నామినేషన్ల రెండో రోజు టికెట్ల కోసం కొట్లాడుకున్నట్లు పట్ణణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకే పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయాయి. మీరు పలానా నేతలకు చెందిన వారని అందుకే టికెట్లు ఇవ్వడం లేదని చెప్పడంతో కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. అధికార పార్టీలో టికెట్ల కోసం కోట్లాడటం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్లో మాత్రం టికెట్లు రాని వారు రెబల్గా బరిలో నిలుస్తామని చెబుతున్నారు. ఏది ఏమైన ఏ పార్టీకి రెబల్ బెడదా, అసంతృప్తులు ఎక్కువ ఉంటారో వారికే ఎన్నికల్లో ముప్పు రానుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న బీజేపీ దాదాపుగా 16 వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేయడంతో అక్కడ కూడా ఆశలు చిగురిస్తున్నాయి. రెండు మూడు సీట్లు గెలిచి కింగ్మేకర్ కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
పతంగులు ఎగరేస్తూ బావిలో పడిన చిన్నారులు
● తమ్ముడి దుర్మరణం● ప్రాణాలతో బయటపడిన అన్న ● కొంషెట్పల్లిలో విషాదం మర్పల్లి: సరదాగా గాలిపటాలు ఎగరేసేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొంషెట్పల్లిలో శనివారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా మరో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మహ్మద్ సైజొద్దీన్, ఉమ్రాబేగంకు ఓ కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు శనివారం ఓ పని నిమిత్తం మరో గ్రామానికి వెళ్లారు. అయితే, స్థానిక ఊర్దూ మీడియం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు సైఫాన్ (9), ఒకటో తరగతి చదువుతున్న సోహైల్(6) ఉదయం స్కూల్కు వెళ్లలేదు. తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద లేకపోవడంతో అన్నదమ్ములిద్దరూ గాలి పటాలు ఎగరేసేందుకు పొలాల బాట పట్టారు. పతంగి కోసం పరుగెత్తుతున్న క్రమంలో బావిని గమనించని సోహైల్ అందులో పడిపోయాడు. తమ్ముడిని కాపాడే క్రమంలో సైఫాన్ కూడా బావిలోకి జారాడు. సాగుడుగా ఉన్న పాత బావిలోని ఓ చెట్టు కొమ్మ వద్ద చిక్కుకున్న సైఫాన్ కాపాడమంటూ కేకలు వేశాడు. ఇది గమనించిన ఓ మహిళ, అక్కడే ఉన్న ఉపాధి కూలీలకు సమాచారం ఇవ్వడంతో పరుగున వచ్చి, సైఫాన్ను బయటకు లాగారు. సోహైల్ ఆచూకీ లభించకపోవడంతో నాలుగు మోటార్ల ద్వారా బావిలోని నీళ్లను బయటకు తోడేస్తున్నారు. ఫైరింజన్ను వచ్చి గాలింపు చర్యలు చేపట్టినా బావిలో నీటి మట్టం తగ్గకపోవడంతో చిన్నారి ఆచూకీ లభించలేదు. పాడుబడిన బావి అడుగులో భారీగా ఉన్న చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కున్నాడు. అతికష్టం మీద రాత్రి 10గంటల తర్వాత చిన్నారి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టానికి తరలించారు. -
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీజీ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ రెవెన్యూ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘు, కార్యవర్గ సభ్యులు శనివారం ఆయనను కలిశారు. 2025–2026 వార్షిక సంవత్సరానికి జీవో విడుదల చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ హక్కుల పరిరక్షణ, రెగ్యూలర్గా బడ్జెట్ విడుదల వంటి అంశాలను దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ ఉద్యోగులకు ఎల్లప్పుడు అందుబాబులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు సహాయ ఉపకరణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్తో కూడిన వీల్చైర్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించనున్నట్టు తెలిపారు. అర్హులైనవారు ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఓబీఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలు
ఇబ్రహీంపట్నం: ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కావాలనే కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావును సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యాక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కమిషన్లు వేసి కేసీఆర్పై బురద చల్లడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో రాజకీయాలు చేస్తోందని.. దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి -
కాంగ్రెస్ది ప్రతీకార పాలన
శంకర్పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా కొనసాగిస్తున్నది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలో శనివారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి రెండేళ్లుగా పాలన గాలికి వదిలేసి, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, నోటీసులు అంటూ రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మున్సిపల్ ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నిస్తే మాజీ మంత్రి హరీశ్రావుకు సిట్ నోటీసులు, ఇదేమిటని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్కి నోటీసులు, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కక్షతో, డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కేసీఆర్కి నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఇన్నేళ్లుగా కేసీఆర్ ఫాంహౌస్ ఎక్కడుందో తెలియదని చెబుతూ సిట్ అధికారులు గోడలకు నోటీసులు అంటించడం ఆయనను అవమానపరచడమేనన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, నిరంతరం సమస్యలు, కుంభకోణాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ టికెట్టు రాని వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్థన్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్రెడ్డి, మాజీ ఎంపీపీలు గోవర్దన్రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
ప్రజావాణి రద్దు
హయత్నగర్: వివాదాస్పదంగా మారిన తొర్రూర్ ఎర్రకుంట చెరువును శనివారం హైడ్రా అధికారులు సందర్శించారు. చెరువు నిండితే నీరు బయటికి వెళ్లే కాలువను పునరుద్ధరించే క్రమంలో నెలకొన్న వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. దీంతో పనులు నిలిచి పోయాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు హైడ్రా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు హస్సేన్, అర్చన చెరువును సందర్శించి కాలువ ఆనవాళ్లను గుర్తించేందుకు పలుచోట్ల జేసీబీతో తవ్వించి చూశారు. నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈ ఆంజనేయులు, ఏఈ శ్రీవాణి, సర్వేయర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్లకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పరిపాలన అంశంపై శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో ఐదు విడతల్లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో విడతలో ఐదు రోజులపాటు కొనసాగుతుందన్నారు. మొదటి విడత గతనెల 19 నుంచి 23వ తేదీ వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండో విడతలో అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని 14 పంచాయతీలు, ఇబ్రహీంపట్నం పరిధిలోని 14 పంచాయతీల సర్పంచ్లకు హాల్ –1లో, మంచాల పరిధిలోని 23, యాచారం 24, శంషాబాద్ పరిధిలోని 21 పంచాయతీల సర్పంచ్లకు హాల్–2లో 17 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. మూడో విడతలో భాగంగా ఫరూఖ్నగర్ 47, కొత్తూరు 12, కొందుర్గు 22, జిల్లెడు చౌదరిగూడ 24 పంచాయతీలకు 23 నుంచి 27వ తేదీ వరకు, నాలుగో విడత మాడ్గుల 34, ఆమనగల్లు 13, తలకొండపల్లి 32, కడ్తాల్ 24 పంచాయతీలకు మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు, ఐదో విడత కందుకూరు 35, నందిగామ 19, మహేశ్వరం 30, కేశంపేట 29 పంచాయతీల సర్పంచ్లకు మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రధాని మోదీ చొరవతో వైద్య విద్య పూర్తి చేసుకున్న షాద్నగర్ విద్యార్థి షాద్నగర్ రూరల్: ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగిన ఓ వైద్య విద్యార్థి డాక్టర్ పట్టా అందుకుని లక్ష్యాన్ని చేరుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. షాద్నగర్కు చెందిన జక్కుల సాయిశశాంక్ 2018లో వైద్య విద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్ వెళ్లాడు. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న సమయంలో మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. వీరిలాగే సాయిశశాంక్ సైతం ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం ప్రధాని మోదీ చొరవతో 2023లో తన ఎంబీబీఎస్ అడ్మిషన్ను జార్జియా దేశానికి మార్చుకున్నాడు. అక్కడికి వెళ్లి విజయవంతంగా మెడిసిన్ పూర్తి చేసి, గత ఏడాది ఆగస్టులో ఇండియా వచ్చాడు. అనంతరం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కోసం ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో ప్రిపేరయ్యాడు. జనవరి 17న వరంగల్లో పరీక్ష రాశాడు. ఎఫ్ఎంజీఈ కోసం 43,915 మంది పరీక్ష రాయగా 10,742 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో మంచి ర్యాంకు సాధించిన సాయిశశాంక్ డాక్టర్ పట్టా అందుకున్నాడు. -
నిర్లక్ష్యానికి తావీయొద్దు
బావిలో పడిన చిన్నారులు సరదాగా గాలిపటాలు ఎగరేసేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు.● ఎన్నికలు సజావుగా నిర్వహించాలి ● కలెక్టర్ నారాయణరెడ్డి షాద్నగర్: మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, స్ట్రాంగ్ రూంల ఎన్నికల పర్యవేక్షకుడు మయాంక్ మిట్టల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యానికి తావివ్వొద్దని, సజావుగా.. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. బ్యాలెట్ బాక్స్ల భద్రత, ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు విధిగా పాటించాలని, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రచారాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, మున్సిపల్ కమిషనర్ సునీత, తహసీల్దార్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
తమ్మీ తప్పుకో..
15 ఏళ్లుగా.. షాద్నగర్ మొదట్లో మున్సిపాల్టీగా కొనసాగింది. తర్వాత పంచాయతీగా .. తిరిగి మున్సిపాలిటీగా మారింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.. బుజ్జగింపుల పర్వానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి.. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన ఆశావహులు బీఫారాల కోసం ఆయా పార్టీల ముఖ్య నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. ఏళ్లుగా నమ్ముకున్నా పార్టీ నుంచి గుర్తింపు దక్కక పక్క చూపులు చూస్తున్న వాళ్లకు ప్రత్యర్థి పార్టీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.. కొంత మంది రాత్రికి రాత్రే కండువాలు మార్చేసి.. బీ ఫారాలు దక్కించుకుంటుండగా, మరికొంతమంది రెబల్ లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్నగర్: మున్సిపాటీల్లో కౌన్సిలర్ల పదవి కోసం పోటీ అధికంగా ఉంది. దీంతో వార్డుల్లో ఎవరిని అభ్యర్థులుగా ఖరారు చేయాలనే అంశంపై పార్టీల ముఖ్య నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్న వారిలో ఎవరైతే టికెట్కు అర్హులు.. ఎవరు అనర్హులని తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి. పోటీ చేసిన వారి జాబితాను ముందేసుకుని ఎవరిని ఒప్పించాలి.. ఏమని చెప్పి మెప్పించాలని కసరత్తు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ముఖ్య నేతలు ఆయా ఆశావహులను కూర్చొబెట్టి మాట్లాడుతున్నారు. అధిష్టానం మాట వినని వాళ్లపై వేటు వేస్తున్నారు. ఇదిలా ఉంటే శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఆదివారం అభ్యంతరాలను స్వీకరించి, సోమవారం పరిష్కరించనున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ, బీ ఫారం సమర్పణ, తుది జాబితా ప్రకటన ఉండనుంది. మెజార్టీ స్థిరాస్తి వ్యాపారులే.. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు.. 126 వార్డులు ఉనన్నాయి. మొత్తం 635 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల పరిశీలనలో ఏ ఒక్కటీ తిరస్కరణకు గురి కాకపోవడం విశేషం. చేవెళ్లలో 18 వార్డుల నుంచి 78 మంది 133 నామినేషన్లు దాఖలు చేయగా, షాద్నగర్లో 28 వార్డుల నుంచి 147 మంది 244 సమర్పించారు. శంకర్పల్లిలో 15 వార్డుల నుంచి 85 మంది 100 నామినేషన్లు దాఖలు చేయగా, ఆమనగల్లులో 15 వార్డుల నుంచి 92 మంది 109, మొయినా బాద్లో 26 వార్డుల నుంచి 108 మంది 184, ఇబ్రహీంపట్నంలో 24 వార్డుల నుంచి 125 మంది 192 నామినేషన్లు అందజేశారు. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేయడం ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారింది. బుజ్జగించేందుకు ఇన్చార్జిలు నానా తంటాలు పడుతు న్నారు. తప్పని పరిస్థితుల్లో వారు అడిగిన డిమాండ్లకు తలొంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పురపోరుకు సిద్ధమైన మెజార్టీ అభ్యర్థులు స్థిరాస్తి వ్యాపారులే కావడం, ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకపోవడం పోటీదారులకు కలిసి వస్తోంది. కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రధాన పోటీదారు నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తుండటం, ఇచ్చేందుకు వారు కూడా అంగీకరిస్తుండటం గమనార్హం. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ పక్షాల నుంచి బీఫాం ఉండాలి. వీటిని దక్కించుకునేందుకు ఆశావహులంతా పోటీపడుతున్నారు. తమకున్న ఆర్థిక, సామాజిక బలాలను ముఖ్య నేతల ఎదుట ప్రస్తావిస్తున్నారు. బీఫారం ఎలాగైనా తమకే దక్కేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలను అభ్యర్థిస్తున్నారు. మంత్రివర్గంలోని ముఖ్య నేతలతో జిల్లా నేతలకు ఫోన్లు చేయిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి బీ ఫారం అందజేయాలి. బీఫారం సమర్పించని వాళ్లను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించనున్నారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులను స్థానిక వార్డు/డివిజన్లోని ఒక ఓటరు, అదే స్వతంత్ర అభ్యర్థిని స్థానికంగా పదిమంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంది. నామినేషన్ ఫారంలో ఆస్తులు, అప్పులు, ఆదాయ మార్గాలు, అభ్యర్థి ఓటరు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను జత చేయాలి. వీటిలో ఏ ఒక్కటి లేక పోయినా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. నామినేషన్ ముందు రోజే బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల ఖర్చులను దాని ద్వారా నిర్వహించాలనే నిబంధన సైతం ఉంది. అఫిడవిట్లో ఏ ఒక్క కాలాన్ని పూర్తి చేయకున్నా చిక్కులు తప్పవు. బుజ్జగింపుల పర్వం షురూ ‘పుర’ బరిలో ఆశావహులు బీ–ఫారాల కోసం పోటాపోటీ యత్నం జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రధాన పార్టీలు నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి ఒప్పించి.. మెప్పించేలా కసరత్తు మాట వినకుంటే వేటుకు సిద్ధం -
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు
శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని 3, 9, 14 వార్డుల్లో శనివారం సమావేశాలు నిర్వహించి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర్పల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏకమై బీజేపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి అంజన్కుమార్, అభ్యర్థులు అనిశెట్టి స్వప్న, భోసే మురళీధర్, వాసుదేవ్ కన్నా, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి -
ముమ్మరంగా వాహనాల తనిఖీ
షాద్నగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో షాద్నగర్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అధికారులు శనివారం ముమ్మరంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని మిలీనియం టౌన్ షిప్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శ్రీనివాస్, కార్తీక్ పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలి చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల్లో భాగంగా చేవెళ్లలో ఎస్ఎస్టీ తనిఖీ బృందం చెక్పోస్ట్ ద్వారా తనిఖీలు చేస్తున్నా రు. శనివారం చేవెళ్లలోని షాబాద్ ఎక్స్రోడ్డు వద్ద అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు 50 వేలకు మించి నగదును తీసుకెళ్లొద్దని, అలా తీసుకెళ్తే దానికి సంబంధించిన లెక్కలు ఉండాల్సిందేనన్నారు. లేదంటే ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. ప్రజలు ఎన్నికల కోడ్ను గుర్తించి అధికారులకు సహకరించాలని కోరారు. తనిఖీలలో డిప్యూటీ తహసీల్దార్ రాకేశ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పవన్, ఏఎస్ఐ బుగయ్య, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నవ వధువు అనుమానాస్పద మృతి
దుద్యాల్: దుస్తులు ఉతికేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన దుద్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీశైలం, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పోలేపల్లికి చెందిన బాయిగడ్డ నరేందర్కు గత అక్టోబర్లో మాధురి(25)తో వివాహం జరిగింది. ఎప్పటిలాగే వారి పొలంలోని బావి వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లిన మాధురికి ఫిట్స్ రావడంతో బావిలో పడిపోయింది. ఈసమయంలో ఎవరూ లేకపోవడంతో గట్టున ఉన్న దుస్తులను చూసి బావిలో వెతకగా అప్పటికే మృతిచెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, మాధురి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లి జానకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. -
ఉపాధిహామీని నీరుగార్చే కుట్ర
మంచాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. మండల పరిధిలోని లోయపల్లిలో శనివారం ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసి కూలీల పొట్ట కొట్టే విధంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ప్రతి జాబ్కార్డుకు 200 రోజులు పనిదినాలు కల్పించాలని, దినసరి కూలి రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశా రు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్రెడ్డి, పి.అంజయ్య, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
కుక్కల భద్రత యజమానులదే
యాచారం: కుక్కల దాడులతో ప్రజల్లో భయాందోళన ఉందని, గొర్రెలు, మేకలు, పశువులపై దాడులు చేసి చంపేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం యాచారంలో వీధి కుక్కలను విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపేయడం సంచలనంగా మారడంతో స్పందించిన ఆయన శనివారం పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుక్కలను చంపడం సరైంది కాదన్నారు. భద్రత చేపడుతూనే మిగతా వారికి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు. కోతులతో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ పొలాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం నాబార్డు నుంచి రుణాలు అందజేసేలా రైతు కమిషన్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ మస్కు అనితశరణం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తహసీల్దార్ అయ్యప్ప, మండల ప్రత్యేధికారి మాధవరావు, డీఎల్పీఓ సాధన, ఎంపీఓ శ్రీలత, పశువైద్యాధికారులు రేఖ, కిరణ్కుమార్, మండల వ్యవసాయాధికారి రవినాథ్, ఎస్ఐ మధు, పంచాయతీ కార్యదర్శి కిషన్ తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలు ముఖ్యం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలకు హాజరైన ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రోత్సహించారు. గ్రామీణా ప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి -
చేవెళ్లలో త్రిముఖ పోటీ
చేవెళ్ల: నూతన మున్సిపాలిటీలో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడబోతున్నాయి. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. ఇప్పటికే మున్సిపల్ పరిధిలోని 18 వార్డుల్లో పోటీకి అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. ఏ పార్టీ వారు ఎక్కడ ఉంటున్నారు.. వారికి ప్రత్యర్థిగా ఎవరు ఉండాలనే ఆలోచనతోనే అన్ని పార్టీలు అభ్యర్థులను ఖారారు చేశాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ బలోపేతంగా కనిపిస్తోంది. అన్ని స్థానాల్లో తన కేండెట్లను బరిలోకి దించి పోటీకి సై అంటోంది. ఇప్పటీకే పలు వార్డుల్లో ప్రచారం సైతం ప్రారంభించారు. నామినేషన్ల పర్వం ముగియడంతో, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఫిరాయింపుల పర్వం అన్ని పార్టీల్లో ఫిరాయింపుల పర్వం సాగుతోంది. పలువురు నాయకులు, కార్యక్తలు నిత్యం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. సొంత పార్టీలో టికెట్లు అశించే వారు కొందరైతే.. తమకు టికెట్ వచ్చే పరిస్థితి లేదని ఊహించిన మరికొందరు ఇతర పార్టీల్లోకి మారుతున్నారు. నాయకుల మార్పుతో ఓటర్లు ఎవరి వైపు ఉంటారో ఎవరికీ అర్థం కావటం లేదు. ఈక్రమంలో పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులను చూసి ఓట్లు వేసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఏపార్టీ వారు వచ్చి ఓటు అడిగినా, మీకే వేస్తామని చెబుతున్నారు. 13వ వార్డులో పంచాయితీ చేవెళ్లలోని 13 వార్డులో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు రమేశ్, రాములు టికెట్లు ఆశిస్తున్నారు. వీరి మధ్య నెలకొన్న పంచాయితీ ఎటూ తేలడం లేదు. అధిష్టానం ఆశీస్సులు తమకే ఉంటాయని ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. మద్దతుదారులతో కలిసి వెళ్లి పార్టీ పేరుతో, స్వతంత్రులుగా రెండు, మూడు సెట్ల నామినేషన్లు వేశారు. భీఫాం ఎవరికి ఇచ్చినా, మరొకరు రెబల్గా మారే అవకాశం ఉంది. 16వ వార్డులో పోటీకి వెనకడు మున్సిపాలిటీలోని 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేవర సమతావెంకట్రెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల నాయకులెవరూ బరిలో ఉండేందుకు ముందుకు రావడం లేదు. ఈవార్డులోనే అధికార పార్టీ నుంచి మాలతికృష్ణారెడ్డి సైతం చైర్మన్ రేసులో ఉండటంతో పాటు ఇదే వార్డు కావాలని పట్టు బట్టడంతో వీరి పంచాయితీ పార్టీ పెద్దల వరకూ వెళ్లింది. అధిష్టానం ఒకరికే అవకాశం ఇవ్వడంతో మరొకరు వెనకడుగు వేశారు. అన్ని వార్డుల్లో తీవ్ర పోటీ ఉండగా, ఇక్కడ మాత్రం నామినేషన్ వేసేందుకు ఎవరూ పెద్దగా సాహసం చేయలేదు. సమతావెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా కూడా ప్రచారంలో ఉండగా అధికార, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థి కావడంతో చాలా మంది ఆశావహులు, పోటీదారులు సైలెంట్ అయిపోయారు. అయితే, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఒక్కో అభ్యర్థిని పోటీకి దించారు. వీరు ఎంతవరకు నిలుస్తారోననే ఆసక్తి నెలకొంది. కొన్ని వార్డుల్లో ఇప్పటికీ తేలని పంచాయితీ ఎన్నికల వేళ కండువాలు మార్చేస్తున్న నాయకులు, కార్యకర్తలు -
అసైన్డ్ భూముల సర్వే
యాచారం: ఫార్మాసిటీ భూసేకరణలో నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల్లో భూసేకరణ చేయకుండా వదిలేసిన సర్వే నంబర్లల్లోని భూమిని సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఆర్ఐ మురళి ఆధ్వర్యంలో శుక్రవారం నక్కర్తమేడిపల్లిలోని సర్వేనంబరు 430 లోని అసైన్డ్ భూమిని సర్వే నిర్వహించారు. ఈ సర్వేనంబర్లో 39 ఎకరాల భూమి ఉంటుంది. అసైన్డ్ సర్టిఫికెట్లు పొందిన రైతుల వివరాలతో కూడిన కబ్జాను సర్వే చేశారు. కుర్మిద్దలోని 309, 328 సర్వేనంబర్లల్లోని అసైన్డ్ భూమిని సర్వే చేయనున్నారు. ఈ రెండు సర్వే నంబర్లల్లో కేవలం 30 ఎకరాల వరకే భూమి ఉంటుంది. సర్వే చేసి కబ్జా రైతుల వివరాలను గుర్తిస్తారు. రెండు గ్రామాల్లో సర్వే చేసే అసైన్డ్ భూమికి ప్రస్తుతం ఏ మేరకు పరిహారం చెల్లిస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఫార్మాసిటీ భూసేకరణ సమయంలో అసైన్డ్ భూములు ఎకరాకు రూ.8లక్షలు, కబ్జాలో ఉన్న రైతులకు ఎకరాకు రూ.7.70 లక్షల పరిహారం చెల్లించారు. ప్రస్తుతం సర్వే చేసే భూములకు గతంలోని పరిహారాన్నే చెల్లిస్తారా.. లేదా పరిహారం పెంచి ఇస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పరిహారంపై స్పష్టత కరువు -
వేలానికి వేళాయె
సాక్షి, సిటీబ్యూరో: మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో స్వాధీనం వ్యయం తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధుల సేకరణకు కసరత్తు చేస్తోంది. గత నవంబర్లో కోకాపేట్ నియోపొలిస్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్కు భారీ స్పందన లభించింది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ స్వయంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అధికారులు మరోసారి భూముల వేలం కోసం చర్యలు చేపట్టారు. ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత ఉప్పల్ భగాయత్, మోకిలలో గతంలో విక్రయించగా మిగిలిన ప్లాట్లకు ఫిబ్రవరిలో ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ముల్నర్వ, లేమూర్, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లోని హెచ్ఎండీఏ లే అవుట్లలోని ప్లాట్లనూ దశలవారీగా విక్రయించనున్నారు. నిధులు ఉంటేనే పరుగులు ● హెచ్ఎండీఏ కొత్తగా ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులను అందించింది. దీంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అధికారులు వివిధ మార్గాల్లో నిధులను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. రుణాల సేకరణతో పాటు సొంత నిధుల అవసరాన్ని కూడా గుర్తించారు. ఈ మేరకు భూములు విక్రయించాలని నిర్ణయించారు. ● రేడియల్ రోడ్– 2 మార్గాన్ని ఔటర్రింగ్ రోడ్డు 143వ కిలోమీటర్ వద్ద కలిపేందుకు ప్రతిపాదించిన బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ను నిర్మించనున్నారు. దీనికోసం సుమారు రూ.488 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ● బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. దీనికోసం రూ.1,656 కోట్లతో అంచనాలను రూపొందించారు. ● శంకర్పల్లి రోడ్లోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కి.మీ పొడవున పైప్లైన్ రోడ్డు అభివృద్ధి పనులకు రూ.110 కోట్లతో అంచనాలను రూపొందించారు. ● నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్కు ఎడమవైపున రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 75 మీటర్ల రైట్ ఆఫ్ వేత్ (ఆర్ఓడబ్ల్యూ)తో రూ.26.50 కోట్లతో చేపట్టనున్నారు. ● కొత్తగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు, జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ఎల్అండ్టీకి చెల్లింపులు హైదరాబాద్ మెట్రో రైల్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్న నేపథ్యంలో ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీకి చెల్లించాల్సిన సుమారు రూ.2000 కోట్లు హెచ్ఎండీఏ నుంచి అందజేసే అవకాశం ఉంది. రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ నిధులను వెచ్చించనున్నారు. ఫిబ్రవరిలో హెచ్ఎండీఏ భూముల విక్రయాలు ఉప్పల్ భగాయత్, మోకిల తదితర ప్రాంతాల్లో.. ఎలివేటెడ్ కారిడార్లు, రహదారుల విస్తరణకు నిధుల సేకరణ మెట్రో స్వాధీనానికి హెచ్ఎండీఏ నుంచి నిధులు కేటాయించే అవకాశం -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: తండ్రి మందలించడంతో యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన పబ్బు నారాయణ కుమార్తె మనీష (21) శంషాబాద్ విమానాశ్రయంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. జాబ్ మానేయాలని ఈ నెల 26న తండ్రి మందలించాడు. దీంతో అదేరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన ఆమె, హాస్టల్లో ఉన్నానని తన సోదరికి రాత్రి మెసేజ్ పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. ఈ విషయమై ఆమె తండ్రి గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ ఠాణాలో గానీ, 87126 62367 నంబర్లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
● జీవితంపై ఆందోళనతో మనస్తాపం ● పురుగు మందు తాగి అస్వస్థత ● నిమ్స్ ఆస్పత్రికి తరలింపు ● కేసు నమోదు చేసిన పరిగి పోలీసులు పరిగి: భవిష్యత్తు, జీవితం ఎలా ఉంటుందోననే ఆందోళనతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి వసతి గృహంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం పరిగిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం పాషాపూర్తండాకు చెందిన సంతోష్రాథోడ్(20) పట్టణంలోని తుంకుల్గడ్డ గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ, ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం విద్యార్థులు టిఫిన్కు వెళ్లగా, సంతోష్ మాత్రం రాలేదు. తిరిగి వచ్చిన స్నేహితులకు సంతోష్ వాంతులు చేసుకుంటూ కనిపించడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగినట్లు ఆస్పత్రిలో చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం వికారాబాద్లోని పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. హాస్టల్ వార్డెన్ శంకర్ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తన భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయంతో, తెల్లవారుజామున ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు సంతోష్ వారికి చెప్పాడు. విద్యార్థి చికిత్స పొందుతుండగానే న్యాయమూర్తి అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు వార్డెన్ తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంతోష్ను నిమ్స్కు తరలించారు. ఇంత జరిగినా వార్డెన్ హాస్టల్లో అందుబాటులో లేరని, అంతా జరిగిన తర్వాత ఆస్పత్రికి వచ్చారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వేసవిలో మూగజీవాలు జాగ్రత్త
మొయినాబాద్ రూరల్: వేసవి కాలంలో పాడి పశువులతో పాటు మూగ జీవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని రంగారెడ్డి జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ వైద్యుడు డాక్టర్ శ్రీకర్రెడ్డి, పశువైద్య అధికారి దేవిరెడ్డి, మండల సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి రాజేందర్రెడ్డి సూచించారు. కాశీంబౌలి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన నదీమ్నగర్లో శుక్రవారం పాడిపశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్యాదవ్, పశువైద్యాధికారి దేవిరెడ్డి, మండల పశువైద్యాధికారి డాక్టర్ అహ్మద్, గోపాలమిత్ర సూపర్ వైజర్ వెంకటేశ్, శ్రీను, బాలకృష్ణ, యాదయ్య, పశువైద్య సిబ్బంది రవి, రైతులు పాల్గొన్నారు. -
మున్సిపల్ బరిలో మాజీ ఎమ్మెల్యే తనయుడు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొండిగారి రాములు తనయుడు త్రిలోక్ మున్సిపల్ బరిలో నిలవనున్నారు. మున్సిపాటీలోని 12వ వార్డు నుంచి శుక్రవారం ఆయన నామినేషన్ వేశారు. రాములు ప్రస్తుతం స్థానిక బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. త్రిలోక్కు బీఆర్ఎస్ నుంచి టికెట్ కేటాయించారు. ఈ సందర్భంగా కాలనీలో ఊరేగింపు తీశారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10న ముగుస్తున్న నేపథ్యంలో.. కౌన్సిల్ ప్రత్యేక సమావేశం శనివారం జరగనుంది. రాబోయే ఆర్థిక సంవ త్సరం (2026–27) బడ్జెట్ను ఆమోదించనున్నారు. విలీన స్థానిక సంస్థలతో జీహెచ్ఎంసీ పరిధి పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన రూ.11,460 కోట్ల బడ్జెట్ను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే ఆమోదించింది. స్టాండింగ్ కమిటీ అంగీకారం అనంతరం కౌన్సిల్లో ఆమోదం పొందాక.. పభ్రుత్వానికి సమాచారమివ్వడం ఆనవాయితీ. అందులో భాగంగా శనివారం బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. విలీన ప్రాంతాల స్థానికసంస్థల ఆదాయ, వ్యయాల్ని కూడా పరిగణన లోకి తీసుకొని స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోరైల్ నాంపల్లిలో నిర్మించిన ఆటోమేటెడ్ బహుళ అంతల పార్కింగ్ సముదాయాన్ని శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. సుమారు 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. మానవ ప్రమేయం లేకుండా పార్కింగ్ చేసే సదుపాయం ఉంది.రూ.102 కోట్లతో.. జర్మనీకి చెందిన అత్యాధునిక పాలిస్ పరిజ్ఞానంతో ఇది రూపుదిద్దుకుంది. దేశంలోనే ఈ తరహా పార్కింగ్ ప్రాజెక్ట్ మొదటిది. -
ముగిసిన ‘పీఎంశ్రీ’ సదస్సు
అబ్దుల్లాపూర్మెట్: ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో తెలంగాణ రీజియన్లోని పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాకులకు పిగ్లీపూర్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇన్నోవేషన్ సదస్సు శుక్రవారం ముగిసింది. పీఎంశ్రీ స్కూళ్లకు చెందిన వంద మంది విద్యార్థులు, వంద మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకత, అభ్యసనలో వినూత్న పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య విద్యాసంస్థల కార్యదర్శి సి.గంగిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఎల్వీ వేణుగోపాలరావు, నోడల్ కోఆర్డినేటర్ డాక్టర్ జీ.కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా ఏర్పాట్లు
చేవెళ్ల: మున్సిపాలిటీ ఎన్నికలను అందరి సమన్వయంతో శాంతియుతంగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మున్సిపాలిటిలోని నామినేషన్ కేంద్రం, చేవెళ్లలోని పోలింగ్ సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని శుక్రవారం ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మయాంక్ మిట్టల్తో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నామినేషన్ల పర్వం ముగియడంతో స్క్రూట్నీకి సంబంధించి ఏర్పాట్లు చేశామని, 11న జరిగే పోలింగ్లో పాల్గొనే సిబ్బందికి 3న శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లాలో 68 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ తగిన బందోబస్తు నిర్వహిస్తారని పేర్కొన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ (98499 06949) ఏర్పాటు చేశామని, ఏదైనా సమాచారం ఉన్నా, ఫిర్యాదులు ఉన్నా సంప్రదించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలన్నారు. వారి వెంట చేవెళ్ల ఇన్చార్జి ఆర్డీఓ వెంకట్రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, ఏసీపీ కిషన్, సీఐ భూపాల్శ్రీధర్ తదితరులు ఉన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి, ఎలక్షన్ అబ్జర్వర్, ఐఏఎస్ అధికారి మయాంక్ మిట్టల్ శుక్రవారం పరిశీలించారు. మున్సిపల్ కేంద్రంలోని మెథడిస్ట్ స్కూల్లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని వారు సందర్శించారు. హెల్ప్ డెస్క్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు.. నామినేషన్ల స్వీకరణ ఎలా జరుగుతోంది తదితర విషయాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వెంట చేవెళ్ల ఇన్చార్జి ఆర్డీఓ వెంకట్రెడ్డి, తహసీల్దార్ గౌతమ్కుమార్ తదితరులు ఉన్నారు. -
కౌలు రైతులకు పట్టాలివ్వాలి
యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ కౌలు రైతులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 60 ఏళ్లకు పైబడి ఆలయ భూములను సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నామని, ఆ భూములపై రికార్డుల్లోతమ పేర్లు నమోదు చేసి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్సిటీకి భూములు తీసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. రైతుల ఆందోళ నకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య మాట్లాడుతూ.. కౌలు రైతులకు న్యాయం చేయకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, కుర్మిద్ద, నస్దిక్సింగారం సర్పంచులు నీలం శ్రీవిద్య, బోడ కృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ హఫీజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి
షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, పార్టీ అభ్యర్థు లను గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్య క్షుడు పతంగి రాజ్భూపాల్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయ కులు అందెబాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి, మణికొండ రంగయ్య, చెంది మహేందర్రెడ్డి, అశోక్గౌడ్, కక్కు నూరి వెంకటేశ్గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీవైపే ప్రజలు
చేవెళ్ల: ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో శుక్రవారం సాయంత్రం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని, దీనికి అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని, అన్ని పథకాల్లో కేంద్రం నిధులు ఉన్నాయన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఓట్లు అడగాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మాజీ ఎంపీపీ ఎం.విజయలక్ష్మి, నాయకులు వెంకట్రెడ్డి, అత్తెల్లి అనంత్రెడ్డి, రమణారెడ్డి, డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, జి.వెంకట్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఆంజనేయులుగౌడ్, జయశంకర్, కృష్ణగౌడ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ.. నిరంతర నిఘా
రంగంలోకి దిగిన పోలీసులు ● ప్రత్యేక బృందాల ఏర్పాటు ● విస్తృతంగా తనిఖీలు షాద్నగర్: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. స్టాటిక్ సర్వే లెన్స్ బృందాన్ని (ఎస్ఎస్టీ) రంగంలోకి దింపారు. వీరితో పాటు ప్రచార పర్వంలో భాగంగా వార్డుల్లో నిరంతరం నిఘా పెట్టేలా ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని పాత జాతీయ రహదారిలో మిలీనియం టౌన్షిప్ వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి షాద్నగర్కు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆరు గురు అధికారులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగారు. ఈ బృందాలు పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పలు కాలనీల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి 61 కేసులు నమోదు చేశారు. లెక్క చూపాల్సిందే నగదు, నగలు, వస్త్రాలు తమ వెంట తీసుకొస్తే తప్పనిసరిగా రసీదులు చూపించాల్సి ఉంటుంది. రెవెన్యూ, పోలీసుల అధికారులతో పాటు వీడియో గ్రాఫర్తో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలు ఈ బృందం పని చేస్తుంది. అదేవిధంగా వాహనాలను తనిఖీ చేస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ నగదు, మద్యం పంపిణీ, కోడ్ ఉల్లంఘన, ప్రసంగాలు, ర్యాలీలపై నిఘా పెట్టడానికి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే బృందం సభ్యులు అక్కడ వాలిపోతారు. ఒక్కో టీంకు కాలనీల వారీగా బాధ్యత అప్పగించారు. ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే వెంటనే వీడియో చిత్రీకరించి, ఆధారాలు సేకరిస్తారు. అనంతరం పోలీసులు, ఇతర అధికారులకు సమాచారం అందజేసి కేసు నమోదు చేస్తారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. నగదు, నగలు తీసుకెళ్తే విధిగా రసీదులు చూపించాలి. – విజయ్కుమార్, సీఐ, షాద్నగర్టౌన్ -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఆమనగల్లు: పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల అధికారులు పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పా రు. ఓటింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవ సరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించా రు. కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు భూ పరిశీలన కందుకూరు: ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన మీర్ఖాన్పేట రెవెన్యూ సర్వే నంబర్ 112లోని 24 ఎకరాల భూమిని శుక్రవారం సీపీ జి.సుధీర్బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ చేపట్టే భవనాలకు చేరుకునేలా రోడ్ల నిర్మాణాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, గ్రీన్ ఫార్మా సీఐ సత్యనారాయణ ఉన్నారు. భక్తిశ్రద్ధలతో రేణుకా జమదగ్ని కల్యాణం తుర్కయంజాల్: అదిబట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్రచండీ మహాయాగంలో భాగంగా మూడో రోజు శుక్రవారం రేణుకా జమదగ్ని కల్యాణం, లక్ష్మీనారాయణ హోమం, పూర్ణాహుతి, లలితామతి శర్మచే అమ్మవారి విశేష ఆరాధన, భజన కార్యక్రమాలు నిర్వహించారు. సహస్ర దీపాలంకరణ సేవ, మహిళలతో సామూహిక కుంకుమార్చన, సుధామాల, మాధవీమాల శిష్య బృందంతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కా జిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొడుకు బీఆర్ఎస్.. తండ్రి కాంగ్రెస్! ● ఒకే వార్డులో నామినేషన్లు దాఖలు ● చివరి నిమిషంలో అనూహ్య పరిణామం శంకర్పల్లి: ఎన్నికల్లో భాగంగా శంకర్పల్లి మున్సిపాలిటీలో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 12వ వార్డులో బీఆర్ఎస్ తరఫున బుధవారం, శుక్రవారం దండు సంతోష్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేసిన సమయంలో అతని తండ్రి రాజేశ్వర్ కొడుకుతో పాటే వచ్చి బలపర్చాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ కండువా వేసుకుని వచ్చిన రాజేశ్వర్ ఆ పార్టీ తరఫున అదే వార్డుకు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నేత యంసాని ప్రకాశ్గుప్తా తో వచ్చి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. ఒకే వార్డు నుంచి వేర్వేరు పార్టీల తరఫున తండ్రీకొడుకులు నామినేషన్లు వేయ డం చర్చనీయాంశంగా మారింది. వీరు తుది బరిలో ఉంటారా.. లేదా..? ఎవరు తప్పుకొంటారనే విషయంపై ఉపసంహరణ వరకూ ఉత్కంఠ కొనసాగనుంది. -
మంత్రులకు ఘన స్వాగతం
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిఽధిలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్కు గ్రామ సమీపంలో గజమాల, బోనాలతో ఘనస్వాగతం పలికారు. మండల పరిధిలోని ఎలికట్ట ముఖ్యకూడలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుష్పగుచ్ఛాలు అందజేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కేజీబీవీ సందర్శన మొగిలిగిద్ద పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వెలుగులు నింపిన దేవాలయం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానపు వెలుగులు నింపిన దేవాలయం మొగిలిగిద్ద విద్యాలయం అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్వంటి ఎందరో మేధావులు ఈ పాఠశాలలోనే చదువుకున్నారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. లక్ష్మిదేవిపల్లిని నిర్మిస్తే ఈ ప్రాంతం పచ్చని పొలాలతో సస్యశ్యామలం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈఓ సుశీందర్రావు, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ సరిత, తహసీల్దారు నాగయ్య, సర్పంచ్ కృష్ణ, ఎంపీడీఓ బన్సీలాల్, ఎంఈఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీలో ఫొటో లేదంటూ.. మొగిలిగిద్ద పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో గ్రామ సర్పంచ్ కృష్ణ (బీఆర్ఎస్) ఫొటో లేకపోవడంతో సర్పంచ్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ ప్రథమ పౌరుడి ఫొటో పెట్టకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కొద్దిసేపటి తర్వాత అధికారులు ఫ్లెక్సీలో సర్పంచ్ ఫొటో ఏర్పాటు చేయడంతోశాంతించారు. -
ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాలను పాడి రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ అరుణశ్రీ అన్నారు. మండలంలోని రంగాపూర్, చీదేడ్ గ్రామాల్లో గురువారం పశుగణాభివృద్ధి శాఖ, పశు సంవర్ధక శాఖ సమన్వయంతో నిర్వహించిన శిబిరానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాడి పశువులకు రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో రంగాపూర్ సర్పంచ్ బాలకృష్ణ, ఉప సర్పంచ్ యాదగిరి, మంచాల మండల పశువైద్యాధికారి సుధారెడ్డి, ఆరుట్ల పశు వైద్యాధికారి వనజ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకర్రెడ్డి, గోపాలమిత్ర సూపర్వైజర్ లక్ష్మయ్య, గోపాలమిత్రలు శ్రీను, బాబయ్య పాల్గొన్నారు. -
వెనకబాటుకు కారణం వారే
ఆమనగల్లు: బీఆర్ఎస్తోనే ఆమనగల్లు అభివృద్ధి సాధ్యమని గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్చార్జ్ రజినిసాయిచంద్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రాము, శ్వేత, విఠాయిపల్లికి చెందిన బీజేపీ నాయకుడు జగదీశ్వర్, పద్మ దంపతులు గురువారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆమనగల్లు వెనకబాటుకు కారకులను గుర్తించి ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మున్సిపాలిటీకి రూ.100 కోట్లు తెచ్చి, అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ హయాంలో మంజూరైన పనులకు ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీ వెనుకబాటుకు బీజేపీ నేతలే కారణమని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించి, మార్పు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జీఎల్ఎన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నిర్మల శ్రీశైలంగౌడ్, అనురాధ, నిరంజన్గౌడ్, సయ్యద్ ఖలీల్, శ్రీశైలంగౌడ్, నాలాపురం శ్రీనివాస్రెడ్డి, అర్జున్రావ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హాయంలోనే ఆమనగల్లు అభివృద్ధి రజనీసాయిచంద్, జైపాల్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ పిలుపు గులాబీ గూటికి పలువురు నేతలు -
కాంగ్రెస్లో టికెట్ల టెన్షన్
● నాలుగు వార్డుల విషయంలో కుదరని ఏకాభిప్రాయం ● ఎటూ తేలని పంచాయితీ మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేయడంలో అధికార పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది. నామినేషన్ల ఘట్టం చివరి దశకు చేరినా బీఫాంలు ఎవరికిస్తారనేది ఇంతవరకూ కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారు చాలా మంది నామినేషన్లు వేస్తున్నారు. కానీ బీఫాం ఎవరికి దక్కుతుందోననే ఆందోళన కొనసాగుతోంది. టికెట్ల విషయమై మాజీ ఎంపీ రంజిత్రెడ్డి తన ఫాంహౌస్లో గురువారం రోజంతా చర్చలు జరిగినట్లు తెలిసింది. మొయినాబాద్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జ్ భీంభరత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి తదితరులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. నాలుగు వార్డుల విషయంలో ఎమ్మెల్యే వర్గం, భీంభరత్ వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదురకపోవడంతో ఎటూ తేలలేదని సమాచారం. ఆయా టికెట్ల విషయంలో ఇరువర్గాలు పట్టుబట్టడంతో ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మరో వైపు రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుంచి వార్డుల్లో ప్రచారం చేస్తున్న ఆశావహులు, తమకు టికెట్లు దక్కుతాయో.. లేదోనని ఆందోళనలో ఉన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి
ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మున్సిపల్ అభివృద్ధి సాధ్యమని ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ల నామినేషన్ల దాఖలు సందర్భంగా గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రం కేశవులు మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో మున్సిపాలిటీని పాలించిన బీజేపీ ఆమనగల్లు అభివృద్ధిని పట్టించుకోలేదని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జగన్, మానయ్య, ఖాదర్ఖాద్రి, పురుషోత్తం, బాబా, మహేశ్, ఖాదర్, రహీం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ● ఆమనగల్లులో పార్టీ అభ్యర్థులను ఆదరించండి ● మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు -
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
యాచారం: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం భూ రికార్డులు తమ పేరిట నమోదయ్యేలా చూడాలని ఫార్మాసిటీ భూ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం నగరంలోని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసంలో నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, నానక్నగర్ గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ భూ బాధితులు ఆయనను కలిశారు. ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, కోర్టులు ఆదేశాలిచ్చిన అధికారులు తమ పేర్లపై భూ రికార్డులు నమోదు చేయడం లేదని తెలిపారు. తమ పేర్లపై భూ రికార్డులు లేక రైతు భరోసా, బ్యాంకు రుణాలు, అత్యవసర సమయాల్లో అమ్ముకుందామన్నా అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫ్యూచర్సిటీ మీ బంగారు భవిష్యత్తు కోసమేనని, ఇందుకోసం సహకరించాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మల్రెడ్డికి భూ బాధితుల విజ్ఞప్తి -
సిటీకి ‘ఔటర్’ టచ్
అవే పాయింట్లు... అక్కడి సిబ్బందే.. పునర్ వ్యవస్థీకరణ తర్వాత నగరంలోకి కొన్ని ఠాణాలు సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్ పరిధిలోకీ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వచ్చింది. ఈ ఎక్స్ప్రెస్వే ఒకప్పుడు సైబరాబాద్, రాచకొండల్లో మాత్రమే విస్తరించి ఉండేది. తాజా మార్పుచేర్పులతో దాదాపు 50 కిలోమీటర్లు నగర కమిషనరేట్లోకి వచ్చింది. మరోపక్క కొత్తగా ఆదిబట్లలో ఓ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ఇప్పటికే రాజేంద్రనగర్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ను అధికారికంగా నోటిఫై చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. అలా విస్తరించి.. 2016 ఆగస్టు వరకు ఔటర్ రింగ్ రోడ్డంతా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిఽధిలోనే ఉండేది. దీని నుంచి వేరు చేస్తూ నగరానికి తూర్పు భాగంలో సైబరాబాద్ ఈస్ట్ ఏర్పడింది. తర్వాత ఇది అధికారికంగా పని చేయడం ప్రారంభమై.. రాచకొండగా పేరు మారింది. అప్పటి నుంచి ఓఆర్ఆర్ సైబరాబాద్తో పాటు రాచకొండలోనూ విస్తరించినట్లయింది. సిటీ పరిధిలోకి రావడంతో.. ‘గ్రేటర్’లోని పోలీసు కమిషనరేట్లు, ఇతర యూనిట్లను గత ఏడాది డిసెంబర్లో పునర్వ్యవస్థీకరణ చేశారు. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు సైబరాబాద్, రాచకొండల నుంచి కొన్ని ప్రాంతాలను తీసుకువచ్చి హైదరాబాద్లో కలిపారు. ఆదిబట్ల, రాజేంద్రనగర్, శంషాబాద్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్ వచ్చి నగరంలో కలిశాయి. దీంతో వీటి పరిధిలో ఉండే ఓఆర్ఆర్ నగర పరిధిలోకి వచ్చినట్లయింది. మరోపక్క ఓఆర్ఆర్ విస్తరించి ఉన్న కమిషనరేట్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు హైదరాబాద్లో కలిశాయి. ఇప్పటి వరకు ఆదిభట్ల ప్రాంతం ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఠాణా పరిధిలో ఉండేది. తాజా మార్పుచేర్పుల నేపథ్యంలో అక్కడ మరో ట్రాఫిక్ ఠాణా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. రాజేంద్రనగర్లో కొన్నేళ్లుగా ట్రాఫిక్ ఠాణా ఉన్నప్పటికీ అది అధికారికం కాదు. అవసరాలకు తగ్గట్టు ఉన్నతాధికారులు సర్దుబాటుతో ఏర్పాటు చేశారు. ఈ కారణంగా దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిబ్బంది కేటాయించలేదు. ఇది దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు దాన్ని నోటిఫై చేయించాలని నిర్ణయించారు. అలా అధికారికంగా మారితే దానికీ అవసరమైన పోస్టులు మంజూరై సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. ఈ రెండు అంశాలతో కూడిన ప్రతిపాదనల్ని నగర అధికారులు ప్రభుత్వానికి పంపారు. సైబరాబాద్, రాచకొండల నుంచి వచ్చి నగరంలో కలిసిన ప్రాంతాల్లోని గతంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు కొనసాగించనున్నారు. ఏ ప్రాంతం నుంచి ఈ ట్రాఫిక్ పాయింట్ వచ్చి కలిసిందో ఆ కమిషనరేట్ నుంచే అవసరమైన సంఖ్యలో సిబ్బందినీ నగరానికి కేటాయించనున్నారు. ఇప్పటివరకు అవి సైబరాబాద్. రాచకొండ పరిధుల్లోనే.. కొత్తగా ఆదిబట్లలో పోలీసుస్టేషన్, రాజేంద్రనగర్ నోటిఫై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు -
నిబంధనలు పాటించాలి
షాద్నగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలను మున్సిపల్ కమిషనర్ సునీతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారులు విధులు నిర్వర్తించాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి స్క్రూట్నీ, నామినేషన్ల ఉపసంహరణ వరకు ప్రతి విఽషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లకు తావివ్వొద్దు ఆమనగల్లు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లకు తావు ఇవ్వొద్దని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్ శంకర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలని, నామినేషన్ల స్వీకరణలో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నామినేషన్ల అనంతరం అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల ఫారాలు అందజేసి ప్రతిరోజూ వివరాలు పొందుపరిచేలా అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
బస్సు.. తుస్సు!
భద్రతలేని బడి బస్సులు ● ప్రహసనంగా మారిన ఫిట్నెస్ పరీక్షలు ● తరచూ వెలుగు చూస్తున్న ప్రమాదాలు ● పట్టించుకోని రవాణాశాఖ అధికారులు ● ఆందోళనలో తల్లిదండ్రులు ● ఫీల్డ్ ట్రిప్లో భాగంగా 60 మంది విద్యార్థులతో జలవిహార్ బయలు దేరిన ఓ స్కూల్ బస్సు డిసెంబర్ 25న శంషాబాద్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయపపడ్డారు. ● మైలార్దేవ్పల్లి లక్ష్మీగూడవాంబే కాలనీ సమీపంలో ఓ కార్పొరేట్ స్కూలుకు చెందిన బస్సులో నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిపడ్డాయి. అదృష్టవశాత్తు విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ● రెండు రోజుల క్రితం మొయినాబాద్ నుంచి బండ్లగూడ జాగీర్కు తిరుగుముఖం పట్టిన హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బస్సు మృగవని పార్కు సమీపంలో డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. 17 మంది చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ● ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, కొంగరలోనూ స్కూలు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో తరచూ ఏదో ఒక చోట స్కూలు, కాలేజీ బస్సులు అదుపుతప్పి పల్టీలు కొడుతూనే ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు గాయపడుతూనే ఉన్నారు. అయినా బస్సుల ఫిట్నెస్ను రవాణాశాఖ పట్టించుకోవడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో హడావుడి చేయడం తప్ప ఆ తర్వాత వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. సామర్థ్య పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఏటా ఇటు విద్యాసంస్థలు, అటు రవాణాశాఖ ఒక ప్రహసనంగా మార్చాయి. కాలం చెల్లినా.. యథేచ్ఛగా నడుపుతూ.. జిల్లాలో 1,300కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 1,700కు పైగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో లక్షన్నర మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో ఆరున్నర లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. ఇక 17 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కాలేజీలు ఉండగా, మరో రెండు వందలకుపైగా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్, బీఈడీ, పాలిటెక్నిక్, మెడికల్, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర వృత్తివిద్యాకాలేజీలు మరో 77 వరకు ఉన్నాయి. మెజార్టీ కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు ఓఆర్ఆర్కు అటు, ఇటుగా ఆనుకుని ఉన్నాయి. ఆయా కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు స్వయంగా వాహనాలను సమకూర్చి, విద్యార్థులను ఇంటి నుంచి కాలేజీ వరకు, అటు నుంచి ఇంటి వరకు తరలిస్తున్నాయి. ఇందుకోసం పది వేల స్కూలు, కాలేజీ బస్సులు ఉన్నట్లు అంచనా. నిబంధనల మేరకు 15 ఏళ్లు దాటిన వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. ఆ లెక్కన సుమారు వెయ్యికి పైగా కాలం చెల్లిన స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి. వాహనాల కండీషన్, కాలుష్యం, సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పదిహేనేళ్లు దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికుల రవాణా కోసం వినియోగించరాదు. పిల్లల కోసం నడిపే వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏళ్లుగా కాలం చెల్లిన బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలో తక్కువ ధరల్లో పాత బస్సులను కొనుగోలు చేసి వాటిని ఇక్కడ స్కూల్ బస్సులుగా మార్చేస్తున్నారు. వాహనాల జీవితకాలన్ని ప్రామా ణికంగా తీసుకొని ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించాల్సిన మోటారు వాహన తనిఖీ అధికారులు పట్టించుకోకవడం లేదు. ఇటీవల స్కూల్ బస్సులే కాకుండా రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లలో దూకుడు పెరిగింది. మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ పెద్ద బండ్లను నడుపుతున్నారు. స్కూల్ బస్సుల్లోనూ ఆ ప్రమాదకరమైన జాడ్యం కనిపిస్తోంది. బస్సుల కండీషన్తో పాటు అంత కంటే కీలకమైన డ్రైవర్లను కూడా జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ● డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించకుండా ఉండాలి. ● పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి. ● యాజమాన్యం సొంత ఖర్చుతో డ్రైవర్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తపోటు, షుగరు, కంటి చూపు వంటి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ● డ్రైవర్ను నియమించేందుకు ముందు అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్, తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. ● డ్రైవర్కు బస్సు డ్రైవింగ్లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలా కండిషన్ బాగున్న వాహనాలు, అనుభవం ఉన్న డ్రైవర్లను మాత్రమే పిల్లల తరలింపు కోసం వినియోగించాలని ఉన్నత న్యాయస్థానాలు పదేపదే ఆదేశించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. ఫిట్నెస్ నిర్ధారణ కోసం ప్రతి బస్సు నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా స్కూల్ బస్సుల నిర్వహణ లోపభూయిష్టంగా మారుతోంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్నామనే విషయాన్ని విస్మరించి కొందరు డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్తో రోడ్లపై బెంబేలెత్తిస్తున్నారు. చిన్నచిన్న కాలనీలు, గల్లీల్లో సైతం వేగంగా నడుపుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్తో తరచూ ఏదో ఒకచోట ప్రమాదాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి బస్సులో అటెండర్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన సైతం అమలు కావడం లేదు. మొయినాబాద్: మృగవని పార్కు వద్ద బుధవారం బోల్తా పడ్డ స్కూల్ బస్సు -
ఇటు నామినేషన్లు.. అటు పొత్తు చర్చలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపాలిటీల్లో రెండో రోజైన గురువారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆయా పార్టీల అభ్యర్థులు ఒకవైపు నామినేషన్లు వేస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలో కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. సీపీఐ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా, సీపీఎం మాత్రం ఎటూ తేల్చకోలేకపోతోంది. పొత్తుల అంశాన్ని పూర్తిగా ఆయా మున్సిపాలిటీల పార్టీ కేడర్కే అప్పగించింది. ఇదిలా ఉంటే జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు.. 126 వార్డులకు తొలిరోజైన బుధవారం 39 మంది 40 నామినేషన్లు దాఖలు చేయగా, రెండోరోజు ఏకంగా 342 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ తరఫున అభ్యర్థులను ప్రకటించలేదు. బీఫాంలు చేతికివ్వలేదు. ఆయా పార్టీల నుంచి ఆశావహులు నామినేషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఆఖరి రోజైన శుక్రవారం భారీగా దాఖలు చేసే అవకాశం ఉంది. బీజేపీ ఒంటరిగానే బరిలోకి.. కాంగ్రెస్తో సీపీఐ జత నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుండటంతో వామపక్షాలు సంస్థాగత పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా, సీపీఐ అధికార కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధమైంది. చేవెళ్లలో రెండు, ఇబ్రహీంపట్నంలో రెండు వార్డుల చొప్పున పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ముఖ్య నేతలు ఇప్పటికే ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబుతో చర్చలు జరిపినట్లు తెలిపింది. సీపీఎం మాత్రం పొత్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సంస్థాగత రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా అనువైన (కాంగ్రెస్/బీఆర్ఎస్) పార్టీతో కలిసి పని చేయాలని భావిస్తోంది. పార్టీకి అంతో ఇంతో పట్టున్న ఇబ్రహీంపట్నం సహా ఇతర మున్సిపాలిటీల్లో కనీసం 500 ఓట్లున్న వార్డుల్లో అనువైన పార్టీల మద్దతుతో తమ అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండో రోజు కొనసాగిన నామినేషన్ల పర్వం కాంగ్రెస్, బీఆర్ఎస్తో వామపక్ష పార్టీల చర్చలు హస్తం పార్టీ వైపు సీపీఐ మొగ్గు ఎటూ తేల్చుకోలేని స్థితిలో సీపీఎంరెండో రోజు నామినేషన్లు ఇలా.. మున్సిపాలిటీ నామినేషన్లు ఆమనగల్లు 41 షాద్నగర్ 58 చేవెళ్ల 52 మొయినాబాద్ 77 శంకర్పల్లి 40 ఇబ్రహీంపట్నం 74మున్సిపాలిటీ టోల్ ఫ్రీ నంబర్లు ఆమనగల్లు 90323 05567 చేవెళ్ల 94933 21468 ఇబ్రహీంపట్నం 90321 23653 మొయినాబాద్ 76610 97839 షాద్నగర్ 91824 03236 శంకర్పల్లి 73867 55646 ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం ఆయా మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కంట్రోల్ రూమ్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఫిర్యాదులు స్వీకరించి, రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
నైపుణ్యం పెంపొందించుకోవాలి
ఇబ్రహీంపట్నం: చాలామంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పుచ్చుకుంటున్నారే తప్ప, దానికి తగ్గట్టు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొ.ఇటికాల పురుషోత్తం అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్–2047 డిజిటల్ ఇండియా పరివర్తన, సాధికారత వైపు ఒక చొరవ అంశంపై ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న ప్రపంచీకరణకు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే వారు అపారమైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటారని తెలిపారు. విధానాలను తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని, దాన్ని అమలు చేయడం అధికారులు, సంస్థల బాధ్యతగా పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎర్త్ యూనివర్సిటీతోపాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేస్తోందన్నారు. వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ రాధిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాలల జాయింట్ డైరెక్టర్ బాలభాస్కర్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొ.ఇంద్రకాంత్, సదస్సు కన్వీనర్ డా. రమేష్, వైస్ ప్రిన్సిపాల్ సురేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డా. డీఎస్ఎస్ఆర్ కృష్ణ, కో కన్వీనర్ రవికుమార్, విధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం -
న్యాయం చేసి భూమి తీసుకోండి
● స్పష్టం చేసిన బాధిత రైతులు ● రావిర్యాలలో భూ సేకరణ గ్రామసభ తుక్కుగూడ: అన్ని విధాలా తమకు న్యాయం జరిగిన తర్వాతే భూములు తీసుకోవాలని బాధిత రైతులు స్పష్టం చేశారు. రావిర్యాల కొంగర ఖుర్దు–ఏ రెవెన్యూ, అసైన్డ్ భూమిలో ఐటీ పార్క్ కోసం 153 మంది రైతుల నుంచి ప్రభుత్వం 277 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గురువారం బాధిత రైతులతో రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ముందుగా అధికారులు భూములు కోల్పోతున్న రైతుల వివరాలను చదివి వినిపించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. నిరుపేదలమైన తమకు ప్రభుత్వం ఉపాధి కోసం అసైన్డ్ భూమిని పంపిణీ చేసిందని అన్నారు. వందళ్ల ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్టు తెలిపారు. ఇప్పుడు కంపెనీల పేరుతో భూములు తీసుకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.3 కోట్ల నష్టపరిహారంతో పాటు, 500 గజాల ఇంటి స్థలం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే న్యాయ స్థానాలను ఆశ్రయించి, హక్కులు సాధించుకుంటామన్నారు. రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, టీజీఐఐసీ అధికారులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ప్రపంచమంతా ఏఐ
● యువత, విద్యార్థులు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి ● రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఇబ్రహీంపట్నం: ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు పయనిస్తోందని అందుకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సూచించారు. వికసిత్ భారత్–2047, డిజిటల్ ఇండియా పరివర్తన, సాధికారిత వైపు ఒక చొరవ అనే అంశంపై బుధవారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ రాధిక అధ్యక్షతన జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక, వ్యవసాయ, సేవ తదితర రంగాలల్లో డిజిటలైజేషన్ మార్కు విస్తృతమైందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి తమలోని సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. ప్రపంచమంతా ఏఐ యుగంలో ఉందన్నారు. ఈ సదస్సులో పరిశోధన పత్రాలతో కూడిన అంతర్జాతీయ జర్నల్ను ఆవిష్కరించారు. సుమారు 60 మంది తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లయ్య, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్రావు, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎస్.రమేశ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సురేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ డీఎస్ఎస్ఆర్ కృష్ణ, కో కన్వీనర్లు రవికుమార్, పవన్కుమార్, నీలిమ, అధ్యాపకులు రాకేశ్భవాని, హృదయరాజు, సురేశ్, రచన, నరేందర్రెడ్డి, వివిధ వర్సిటీల ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు హాజరయ్యారు. -
‘మున్సిపల్’ సందడి
● ధ్రువీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపులకు పరుగులు పెడుతున్న పోటీదారులు ● నామినేషన్లకు ఎక్కువ గడువు లేకపోవడంతో హడావుడి ఇబ్రహీంపట్నం: ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పట్టణంలోని 24 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ, హెల్ప్ డెస్క్ కౌంటర్ల ఏర్పాటు కోసం అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మున్సిపల్ పన్నులు, విద్యుత్, నీటి బిల్లుల బకాయిల చెల్లింపులకు, కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాల కోసం పోటీదారులు పడరానిపాట్లు పడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు చేరుకుని బిల్లులు చెల్లించారు. నామినేషన్ల స్వీకరణకు తక్కువ గడువు ఉండటంతో త్వరగా పని పూర్తి చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఎటూ తెల్చుకోలేని కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆయా వార్డులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. గెలుపు గుర్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గురువారం పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ముందంజలో బీఆర్ఎస్.. అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. రెండుమూడు వార్డుల్లో మినహా కేండెట్ల ఎంపికను పూర్తి చేసింది. బుధవారం ఉదయం 12 మంది పోటీదారుల పేర్లను ప్రకటించింది. పోలీసు పహారా మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న దారులను పోలీసులు మూసేశారు. దీంతో ఆయా రూట్లలో వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. కార్యాలయం వద్ద సిబ్బంది పహారా కాస్తున్నారు. -
భూ పరిహారం పెంచండి
కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ముచ్చర్ల రెవెన్యూలో మరోసారి తీసుకోనున్న భూములకు పరిహారం పెంచాలని రైతులు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నారు. బుధవారం తహసీల్దార్ కె.గోపాల్ సమక్షంలో ముచ్చర్లలో నిర్వహించిన గ్రామసభలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని 123 సర్వే నంబర్లలో ఉన్న 47.6 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా రైతులకు పరిహారం ఇచ్చి తీసుకోనున్నట్లు ఆర్డీఓ రైతులకు వివరించారు. ఇక్కడ ప్రభుత్వ మార్కెట్ విలువ ఎకరాకు రూ.19 లక్షలు ఉందన్నారు. కేంద్రం చట్టం 30/2013 పారదర్శకత, నష్టపరిహారం పొందే హక్కు ప్రకారం ప్రభుత్వం ఎకరానికి రూ.60లక్షల పరిహారం మంజూరు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. కాగా 47 ఎకరాల్లో ఇప్పటికే 21 ఎకరాలు ప్లాట్లుగా ఉన్నట్లు రెవెన్యూ(సర్వే) అధికారులు గుర్తించారని చెప్పారు. ఇందుకు గజానికి రూ.6,300 చొప్పున పరిహారం మంజూరు అవుతుందన్నారు. అభ్యంతరాలుంటే తహసీల్దార్ కార్యాలయంతో పాటు తన దృష్టికి తీసుకొస్తే రైతుల విన్నపాలను కలెక్టర్ నారాయణరెడ్డికి వివరిస్తామన్నారు. దీంతో రైతులు మూకుమ్మడిగా పరిహారం పెంచాలని ఎంతో కావాలో తాము చర్చించుకుని అధికారుల దృష్టికి తీసుకోస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ రాజు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, సర్పంచ్ ఊటు పద్మ మహేందర్, ఉప సర్పంచ్ రవి, ఆర్ఐ శ్రీకాంత్, టీజీఐఐసీ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అధికారులకు ముచ్చర్ల రైతుల వినతి -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
అబ్దుల్లాపూర్మెట్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాదాద్రి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన నండూరి ఎల్లమ్మ(66), ఆమె భర్త తిరుపతయ్యతో పాటు పలువురు ఈ నెల 25వ తేదీన ఆటోలో అబ్దుల్లాపూర్మెట్ మండలం కొత్తగూడెం శివారులోని మైసమ్మ తల్లి దేవాలయానికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. కొత్తగూడెం నుంచి పోచంపల్లి మార్గంలో సాయిబాబా ఆలయ ముఖద్వారం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎల్లమ్మ తీవ్రంగా గాయపడగా తిరుపతయ్యతో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న ఎల్లమ్మ బుధవారం మృతిచెందింది. కేసు దర్యాప్తులో ఉంది. బైక్ ప్రమాదంలో వ్యక్తి.. యాచారం: బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. బిహార్ రాష్ట్రానికి చెందిన శ్రావణ్కుమార్(38) తన బైక్పై మాల్–కుర్మిద్ద మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లిపల్లి గ్రామం వద్ద మంగళవారం గోడకు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. సినీ దర్శకుడు శంకర్కు మాతృవియోగం మణికొండ: ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ మాతృమూర్తి సక్కుబాయమ్మ(81) బుధవారం మృతి చెందారు.మణికొండ చిత్రపురి కాలనీలోని ఆయన నివాసంలో ఆమె ఉదయం మరణించారు. సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, యూనియన్ నాయకులు, కార్మికులు నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను గురువారం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మట్టి టిప్పర్ సీజ్ పూడూరు: అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేసినట్లు చన్గోముల్ ఎస్ఐ భరత్త్రెడ్డి తెలిపారు. బుధవారం మన్నేగూడ సర్కిల్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓవర్ లోడ్తో అతివేగంగా వెళ్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
వారికే బీఫాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పురపోరులో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆయా మున్సిపల్ పీఠాలపై తమ తమ పార్టీ జెండాలు ఎగురవేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా పార్టీలు ముఖ్య నేతలను పరిశీలకులుగా నియమించాయి. వారు వార్డుల వారీగా సమావేశమై అంతర్గత సర్వే చేపట్టి ఒక్కో వార్డు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సేకరించి, పార్టీ అధిష్టానానికి చేరవేస్తున్నారు. జనరల్ స్థానాల్లో అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే ఉంది. ఇలాంటి చోట ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారితో పాటు సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండి, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న అభ్యర్థులకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రచారం సైతం ప్రారంభించారు. మంగళవారం ఎన్నికల నోటిషికేషన్ విడుదల కావడంతో బుధవారం ఆయా పార్టీల నేతలు మున్సిపాలిటీల వారీగా సమావేశాలు నిర్వహించి, కేడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చే పనిలోపడ్డారు. ఇతర పార్టీల్లో బలమైన నేతలను గుర్తించి, వారికి పార్టీ తరపున బీఫాం ఆఫర్ చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల్లో పార్టీ కండువాల మార్పు జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుండగా, బీజేపీ మాత్రం కొంత స్తబ్ధుగా కన్పిస్తోంది. తొలి రోజు 40 నామినేషన్లు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు.. 126 వార్డుల నుంచి 39 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో బీజేపీ నుంచి మూడు, సీపీఐఎం నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి 22, బీఆర్ఎస్ నుంచి 12 సహా ఇండిపెండెంట్ల నుంచి రెండు నామినేషన్లు వచ్చాయి. ఆమనగల్లు, శంకర్పల్లిలో మున్సిపాలిటీలో ఎనిమిది చొప్పున, చేవెళ్లలో తొమ్మిది, ఇబ్రహీంపట్నంలో మూడు, మొయినాబాద్, షాద్నగర్లో ఆరు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల పరిశీలకులు మయాంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని సందర్శించి, రిటర్నింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఇప్పటి కే ఆయా మున్సిపాలిటీలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాల అందజేత మొదలు.. స్వీకరణ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్లో పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, నోడల్ అధికారి శ్రీలక్ష్మి, హౌసింగ్ పీడీ చంప్లానాయక్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు కొంగరకళాన్లోని కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్, మీడియా సెల్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 98499 06949 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదులకు ఈ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. వచ్చిన ప్రతీ ఫిర్యాదును రికార్డు చేస్తామన్నారు. మద్యం, డబ్బు పంపిణీ సహా రెచ్చగొట్టే ప్రసంగాలు వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల పరిశీలకులు మయాంక్ మిట్టల్ నోడల్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అంతా సహకరించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ మొదలు.. పరిశీలన, తుది జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓటింగ్ ప్రక్రియ, లెక్కింపు ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ‡‡ఆర్థిక బలం, జనాదరణ ఉన్నవారికే టికెట్ అన్ని పార్టీలది అదే తీరు వార్డుల వారీగా సర్వేలు.. బలమైన అభ్యర్థుల ఎంపిక తొలి రోజు 40 నామినేషన్ల దాఖలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి -
ట్రాక్టర్ బోల్తా బాలిక మృతి
● మరో మహిళకు తీవ్ర గాయాలు ● కేసు నమోదు చేసిన నవాబుపేట పోలీసులు నవాబుపేట: ట్రాక్టర్ బోల్తాపడి ఓ బాలిక మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ముబారక్పూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం చైతన్యనగర్కు చెందిన మాదాస్ కిష్టయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు సంతానం. భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు నిమిత్తం నవాబుపేట మండలం ముబారక్పూర్కు చెందిన అంతమ్మోళ్ల దయాకర్రెడ్డి (బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు) వద్ద పనిచేస్తూ, స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. చైతన్యనగర్కే చెందిన గోపి, అతని భార్య మౌనిక సైతం ఇక్కడే పనిచేస్తున్నారు. ఉదయాన్నే గోపీ తన భార్యతో పాటు కిష్టయ్య పెద్ద కూతురు అనూష(14)ను తీసుకుని ట్రాక్టర్లో పొలానికి బయల్దేరాడు. ఈక్రమంలో గుబ్బడిపత్తేపూర్ వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో అనూష (14) అక్కడికక్కడే చనిపోగా మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యజమాని దయాకర్రెడ్డి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మౌనికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి, అనూష మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే తన కూతురు కూలీ పనులకు వెళ్లదని, ఇంటి వద్దే ఉండేదని, తమకు చెప్పకుండా ట్రాక్టర్పై వెళ్లిందని అనూష తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా, గోపీ ట్రాక్టర్ నడపలేదని, అంతమ్మోళ్ల వెంకట్రెడ్డి నడిపాడని పోలీసులకు చూపింనట్లు సమాచారం. ఈ విషయమై నవాబుపేట ఎస్ఐ పుండ్లిక్ను వివరణ కోరగా మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మైసిగండి మైసమ్మ హుండీ @11.03 లక్షలు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత శివరామాలయాలకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని బుధవారం జిల్లా దేవాదాయశాఖ తూర్పు విభాగ ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో లెక్కించారు. 59 రోజులకుగాను రూ.11,03,556 ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కెనరా బ్యాంక్ కడ్తాల్ బ్రాంచ్లో డిపాజిట్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ఈఓ స్నేహలత, ట్రస్టీ శిరోలీ, నిర్వాహకులు భాస్కర్, అరుణ్కుమార్, చంద్రయ్య, కృష్ణ,రాములు, శ్రీనివాసులు, పత్యానాయక్, హర్షవర్ధన్ వెంకటేశ్, బీబీచారి, శ్రీను, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, కెనరాబ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గిరిజనులకు అన్యాయం బంజారా భారత్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ కడ్తాల్: మున్సిపల్ ఎన్నికల్లో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం సముచిత ప్రాతినిథ్యం లభించడం లేదని.. ఈ విషయమై తక్షణమే జోక్యం చేసుకోవాలి బంజారా భారత్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన గిరిజన నాయకులతో కలిసి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్కు హైదరాబాద్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆర్టికల్ 243–టీ ప్రకారం మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, మేయర్ పదవులు, వార్డుల కేటాయింపుల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వివరించారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బోనానాయక్, హనుమంత్నాయక్, శంకర్నాయక్ ఉన్నారు. బీజేపీకి ‘జుంటుపల్లి’ గుడ్బై తాండూరు టౌన్: బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్కు లేఖ పంపారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి 18 ఏళ్లుగా ఎనలేని సేవలందించానని, ప్రస్తుతం ఆ పరిస్థితులు తాండూరు నియోజకవర్గంలో కరువయ్యారన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెంకట్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ఉన్న 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి బంట్వారం: దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హామీ ఇచ్చారు. బీవీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు బుధవారం నగరంలోని ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చూడాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖగా ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన వీరయ్య ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
పీఎంశ్రీ పాఠశాలల సదస్సుల్లో విద్యావేత్తల పిలుపు అబ్దుల్లాపూర్మెట్: ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో తెలంగాణ రీజియన్లోని పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు మెంటరింగ్ సదస్సులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని పిగ్లీపూర్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఇందుకు వేదికై ంది. రాష్ట్రంలోని మొత్తం 3 కళాశాలలో మాత్రమే ఈ సదస్సులు నిర్వహిస్తుండగా బుధవారం సదస్సును ప్రారంభించారు. పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థులు, వంద మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి సి.గంగిరెడ్డి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్వీ వేణుగోపాలరావు, ఏఐసీటీఈ నోడల్ హెడ్ అసీమ్కల్టా, వాడ్వాని ఫౌండేషన్ వక్త డాక్టర్ రాజేశం, శ్వేతలు పాల్గొని ఏఐసీటీఈ నుంచి పరిశోధన నిధుల కోసం వినూత్న ఆలోచనలు అంశంపై వివరించారు. పార్సిళ్లపై నిఘా ఉంచండి ● అనుమానం వస్తే సమాచారం ఇవ్వండి ● సర్వీస్ ప్రొవైడర్లతో సీపీ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: కేవలం లాభార్జనే ధ్యేయంగా కాకుండా సర్వీస్ ప్రొవైడర్లు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ హితవు పలికారు. ఈ–కామర్స్, కొరియర్ సేవల మాటున గంజాయి, మత్తు పదార్థాలు, నిషిద్ధ వస్తువుల రవాణా జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయా సంస్థలు పటిష్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. ఆయన బుధవారం అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్ల నోడల్ అధికారులతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేయాలని టెలికాం, ఇంటర్నెట్, ఫుడ్ డెలివరీ, కొరియర్, రవాణా తదితర సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులను కోరారు. కేసుల దర్యాప్తులో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, సమాచారం అడిగిన వెంటనే స్పందించేందుకు వీలుగా ప్రతి సంస్థలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత పార్శిల్స్ను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్లలో కొంత మంది క్యాబ్, బైక్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు తమ డ్రైవర్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ప్రయాణికులు బుక్ చేసుకున్నప్పుడు వెళ్లాల్సిన ప్రదేశం చెప్పిన తర్వాత, డబ్బు చెల్లించిన తర్వాత డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి డ్రైవర్లపై సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బషీర్బాగ్లోని పాత కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో అదనపు సీపీలు ఎం.శ్రీనివాసులు, తఫ్సీర్ ఇక్బాల్, సంయుక్త సీపీ శ్వేత, డీసీపీలు ఎస్.చైతన్య కుమార్, వి.అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
యాలాల: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన యాలాల మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ప్రతిభ పాఠశాల వెనుక కంది పంటలో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. సుమారు పది రోజలు క్రితం మృతి చెంది ఉండవచ్చునని, మృతుడు వయస్సు సుమారు 45–50 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహానికి సంబంధించిన ఓ కాలును జంతువులు పీక్కు తిని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి ఒంటిపై నలుపు రంగు నైట్ ప్యాంట్, గడ్డం ఉందన్నారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తిస్తే వెంటనే సెల్ నంబరు 8712670054లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. పాఠశాలను సందర్శించిన డీపీఓ కొడంగల్ రూరల్: మండలంలోని చిట్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ఆవరణలోని పాత భవనాన్ని పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేపట్టాలా..? తొలగించాలా..? అనే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తరగతి గదుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత గుర్తించి విద్యార్థులను అడిగారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ, గ్రామ సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్ చంద్రకళ, వార్డు సభ్యులు హబీబుల్లా, సాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
పట్టు సాగుతో అధిక లాభాలు
యాలాల: పట్టు పురుగుల పెంపకంతో రైతు లు అధిక ఆదాయం పొందవచ్చని హార్టీకల్చర్, సెరీకల్చర్ జిల్లా అధికారులు సత్తార్, నాగరత్న అన్నారు. బుధవారం మండలంలోని బషీర్మియా తండాలో పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు హార్టికల్చర్, సెరీకల్చర్ సాగు పట్ల అవగాహన లేకపోవడంతో రైతులు ముందుకు రా వడం లేదన్నారు. తక్కువ సమయంలో ప్రతి నెలా అధిక ఆదాయం పొందేందుకు పట్టు సా గు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి సబ్పిడీ అందజేస్తుందన్నా రు. బషీర్మియాతండా నుంచి ఆరుగురు రైతు లు పట్టు సాగుకు ముందుకు వచ్చినట్లు తెలి పారు.కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వినోద్కుమా ర్,రాఘవేంద్ర, తేజశ్విని, నిఖిత,విజయ్కుమా ర్,కమల,నర్సింగ్ నాయక్, యూసుఫ్జానీ, మాజీ సర్పంచ్ మిత్రునాయక్ పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
ఆమనగల్లు: మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. బుధవారం ఆయన పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏసీపీ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ శంకర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్లకు ఆయన పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఏసీపీ జానకిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు. రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి అన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు. మహేశ్వరం ఏసీపీ జానకీరెడ్డి -
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
● రన్నింగ్లో ఊడిపోయిన స్టీరింగ్ రాడ్డు ● డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు మహేశ్వరం: విద్యార్థులను దింపి, తిరిగి వెళ్తున్న స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్డు ఊడిపోయిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులే ఉండటం, ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరానికి చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్ విద్యార్థులను తీసుకుని బయల్దేరింది. విద్యార్థులను దింపి తిరిగి వస్తున్న క్రమంలో మహేశ్వరం సెంట్రల్లో బొడ్రాయి వద్ద స్టీరింగ్ రాడ్డు ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశాడు. ఊరి మధ్యలో ఈ ఘటన జరగడంతో వాహనం నెమ్మదిగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వారిని పక్కనే ఉన్న ఇళ్లకు పంపించారు. స్కూల్ బస్సులకు సరైన ఫిట్నెస్ పరీక్షలు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
పొరపాట్లకు తావివ్వొద్దు
ఇబ్రహీంపట్నం: నామినేషన్ల పరిఽశీలనలో పొరపాట్లకు తావివ్వొద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన ఎన్నికల పరిశీలకుడు మయాంక్ మిట్టల్తో కలిసి ఇబ్రహీంపట్నంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగేలా అధికారులు అభ్యర్థులకు సహకరించాలన్నారు. అభ్యర్థికి హెల్ప్ డెస్క్ సిబ్బంది ముందుగానే తగు సూచనలు ఇవ్వాలన్నారు. నామినేషన్ వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఆర్వోలు, ఏఆర్వోలు తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలన్నారు. ప్రవర్తనా నియమావళిలో సందేహలు ఉంటే ఉన్నతాధికారులను దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని, పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ప్రత్యేక టీమ్లు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిస సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అనంత్రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి, ఇబ్రహీంపట్నం మండల స్పెషలాఫీసర్ నవీన్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ తదితరులున్నారు. నామినేషన్ల పరిశీలనలో అప్రమత్తంగా ఉండాలి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలి కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అబ్జర్వర్ మయాంక్ మిట్టల్ -
రేపు ఏటీసీ నిర్మాణానికి శంకుస్థాపన
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్దలో ఈ నెల 30న అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు బుధవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. గ్రామంలోని 150 ఏళ్ల చరిత్ర ఉన్న జెడ్పీహెచ్ఎస్ను సందర్శించేందుకు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విచ్చేయనున్నట్లు చెప్పారు. రూ.45 కోట్లతో నిర్మించనున్న ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. సర్పంచ్ కృష్ణ, పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రొఫెసర్ హరగోపాల్తో పాటుగా అధికారులు, గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించామన్నారు. శంకుస్థాపన అనంతరం పాఠశాల ఆవరణలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. గత ఏడాది పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి గ్రామాభివృద్ధిదకి, పాఠశాలఅభివృద్ధికి నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, గవర్నర్ సత్యనారాయణరెడ్డి, హరగోపాల్ ఇక్కడ చదివిన వారేనని వివరించారు. మొగిలిగిద్ద పాఠశాల 100వ వార్షికోత్సవానికి ఎస్ఆర్.శంకరన్, 125వ వార్షికోత్సవానికి ప్రొఫెసర్ జయశంకర్, 150 వార్షికోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి హాజరై పాఠశాల, గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, తహసీల్దార్ నాగయ్య, డీఈఓ సుశీందర్రావు, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్కుమార్, ఎంఈఓ మనోహర్, పంచాయతీ కార్యదర్శి బాసిత్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీశైలం, నాయకులు శ్యాంసుందర్, గుట్టరాజు, వెంకటయ్య, పఠాన్పాష, జగన్, వెంకటేశ్, మల్లేశ్, రాము, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి చూపి ఓట్లు అడగండి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ ఎన్నికల అబ్జర్వర్ నందికంటి శ్రీధర్తో కలిసి పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి చూపి ఓట్లు అభ్యర్థించాలన్నారు. నగరంలో ఉన్న కలెక్టరేట్, ఆర్డీఓ, ఆర్టీఏ కార్యాలయాలను ఇక్కడి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కట్ట కింది నుంచి రోడ్డును వేయించడంతోపాటు, శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. ఫాక్స్కాన్ తదితర కంపెనీలను తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్, ప్రభుత్వాస్పత్రి నూతన భవన నిర్మాణాలకు, అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం, ఇబ్రహీంపట్నం నుంచి ఆక్టోపస్ వరకు రూ.60కోట్లతో రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు ఆనాడే శ్రీకారం చుట్టామని వివరించారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే వారే బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు. ప్రచారశైలిని ఎప్పటికప్పుడు పర్వవేక్షిస్తుంటామని.. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యాదగిరి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ టేకుల సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటి జాబితా బీఆర్ఎస్ తరుపున పోటీచేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి ఈ సమావేశంలో ప్రకటించారు. ఇబ్రహీంపట్నం 2వ వార్డు నుంచి సయ్యద్ హిదాయత్ అలీ, 3వ వార్డు తాళ్ల వెంకటేశ్గౌడ్, 7వ వార్డు టేకుల సుదర్శన్రెడ్డి, 13వ వార్డు ఆకుల సురేశ్, 15వ వార్డు క్యామ శంకర్, 17వ వార్డు మడుపు లక్ష్మీ, 19వ వార్డు ఆకుల యాదగిరి, 23వ వార్డు నీలం శ్వేత, 24వ వార్డు గూడూరి గిరిని అభ్యర్థులుగా ప్రకటించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి -
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం
మొయినాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలని ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జిలు ముఠా జయసింహా, అమృత్లాల్ చౌహాన్ అన్నారు. బుధవారం వారు మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో వార్డు అభ్యర్థుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థు లను గెలిపించుకోవడానికి కృషి చేయాలన్నా రు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని చెప్పారు. అభ్య ర్థుల ఎంపిక దాదాపు ఖరారైందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అంనతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యు డు కొత్త మాణిక్రెడ్డి, నాయకులు జయవంత్, మల్లారెడ్డి, శంకరయ్య, మాణిక్యం, రాజు, డేవిడ్, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జులు ముఠా జయసింహా, అమృత్లాల్ చౌహాన్ -
బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
షాద్నగర్రూరల్: బాల్యవివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బూర్గుల జెడ్పీహెచ్ఎస్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగతా వ్యాసరచన పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం సంఽధ్యారాణి మాట్లాడుతూ.. బాల్య వివాహాలను చేయడం చట్టరీత్యా నేరమన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలుడికి పెళ్లి చేసుకుంటే శిక్ష ఉంటుందన్నారు. బాల్య వివాహాలను జరిపించినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలుంటాయన్నారు. పిల్లలకు చిన్న వయసుల్లో వివాహాలు చేయకుండా వారికి ఉన్నత విద్యను అందించేందుకు తల్లితండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. పాఠశాల హెచ్ఎం రవికుమార్, అంగన్వాడీ టీచర్లు శ్రీలత, రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి -
పుర పోరు.. హడావుడి షురూ!
● పట్టణాల్లో వేడెక్కిన రాజకీయం ● పోటీకి సిద్ధమైన ఆశావహులు ● వార్డుల్లో ప్రచారం మొదలు ● టికెట్ల కోసం తీవ్ర కసరత్తు పట్టణాల్లో ఓట్ల పండగ షురూ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. పురపాలక సంఘాల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్, విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా తలపడుతున్నాయి. ఆశావహులు ఆయా పార్టీల టికెట్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయం వేడెక్కింది. ఆశావహులంతా పోటీకి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది. ఏయే వార్డుల్లో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంలో పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. బలమైన నాయకులకే టికెట్లు ఇవ్వాలని ఆయా ప్రధాన పార్టీలు భావిస్తుండడంతో.. పార్టీ టికెట్లు దక్కవనుకున్న ఆశావహులు ఇప్పటికే కండువాలు మార్చేశారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధ మైన నాయకులు ప్రచారాలు సైతం మొదలు పెట్టా రు. వార్డుల్లో తిరిగి ప్రజలను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మారుతున్న కండువాలు మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. ఈ నెల 17న రిజర్వేషన్లు ఖరారు కావడంతో రిజర్వేషన్లు కలిసి వచ్చిన ఆశావహులంతా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రిజర్వేషన్లు కలిసిరానివారు పక్క వార్డుల్లో పోటీ చేసే ప్రయత్నాలు చేస్తుండగా కొందరు తమ సతులను పోటీలో దింపేందుకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ టికెట్లు రావని భావించిన నాయకులు కొందరు ఇప్పటికే కండువాలు మార్చారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరితే.. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో, బీజేపీలో చేరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జంపింగ్లు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముగ్గురి గురి మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కావడంతో ఆ కేటగిరికి చెందిన ప్రధాన పార్టీల నాయకులు దానిపై గురిపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పదవిపై ఇద్దరు నాయకులు కన్నేశారు. ఓ నాయకుడు ఓ స్థానంలో తాను పోటీ చేస్తూ మరో స్థానంలో తన భార్యను బరిలోకి దింపేందుకు పావు లు కదుపుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలోనూ చైర్మ న్ పదవి కోసం తీవ్ర పోటీనే ఉంది. ముగ్గురు ఎస్సీ నాయకులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ముందుగా కౌన్సిలర్లుగా గెలిచిన తరువాత చైర్మన్ స్థానం ఎవరికనేది తేలుద్దాం అంటూ పార్టీ అధి ష్టానం ఆశావహులకు సూచించినట్లు తెలిసింది. మరో వైపు బీజేపీ సైతం చైర్మన్ స్థానంపై కన్నేసింది. పూర్తి మెజార్టీ రాకపోయినా చైర్మన్ ఎన్నికలో కీలకంగా మారుతామనే ఆశాభావంతో ముందుకెళ్తోంది. ఇంటింటికీ తిరుగుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకులంతా వార్డుల్లో ప్రచారాలు మొదలు పెట్టారు. ఇంటింటికి తిరిగి తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని.. తమను గెలిపించాలని ఓటర్లకు చెబుతూ అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్థాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీల టికెట్ల విషయంలో గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో ఏ వర్గానికి టికెట్లు దక్కుతాయోనని పార్టీ వర్గాలే అయోమయానికి గురవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్లోనూ టికెట్ల కోసం గట్టి పోటీ కొనసాగుతుంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని 26 వార్డులకు సంబంధించిన నామినేషన్లను మున్సిపల్ కేంద్రంలోని మెథడిస్ట్ స్కూల్లో స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియకు 9 మంది ఆర్ఓలను కేటాయించారు. ఒక్కో ఆర్ఓ అధికారి మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 30న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
సాక్షి, సిటీబ్యూరో: లైంగికదాడి కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. తన కుమార్తెతో పరిచయం ఏర్పరుచుకున్న యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత ఆమెతో గొడవపడి వివాహానికి నిరాకరించాడని బాధితురాలి తల్లి 2017 ఫిబ్రవరిలో బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి లోనైన తన కుమార్తె భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్వాప్తు చేపట్టిన పోలీసులు 2017 ఫిబ్రవరి 12 న నిందితుడిని అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసుపై విచారణ చేపట్టిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా 1వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి తిరుపతి నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. మల్లేపల్లిలో అగ్ని ప్రమాదం రూ.50 లక్షల ఆస్తినష్టం నాంపల్లి: మల్లేపల్లిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లేపల్లి ఐటీఐ సమీపంలో కార్ల రిపేరింగ్ షెడ్ కొనసాగుతోంది. సోమవారం రాత్రి గ్రిడ్లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద నిప్పురవ్వలు ఎగిసి పడటంతో పక్కన ఉన్న షెడ్కు మంటలు వ్యాపించాయి. దీంతో షెడ్లో ఉన్న కార్లు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు. నమ్మించి నట్టేట ముంచారు! ● నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా టోకరా ● నగరవాసి నుంచి రూ.45 లక్షలు స్వాహా ● కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియా ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో నగరవాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు వర్చువల్ యాప్ ఇన్స్టాల్ చేయించి నిండా ముంచారు. వాలెట్లో రూ.6.19 కోట్ల బ్యాలెన్స్ చూపిస్తూ... రూ.45.01 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నల్లకుంట ప్రాంతానికి చెందిన వ్యక్తి (52) ఫేస్బుక్లో ‘ఇన్వెస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో వచ్చిన ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. అందులో ఉన్న లింక్ క్లిక్ చేయడంతోనే బాధితుడిని సైబర్ నేరగాళ్లు ‘స్టడీ సర్కిల్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఆ గ్రూప్లో ఉన్న ఇతర సభ్యులు అంతా ట్రేడింగ్పై శిక్షణతో పాటు సూచనలు, సలహాలు ఇస్తామని, తాము లాభాలు పొందుతున్నామని పోస్టులు చేసి అతడిని నమ్మించారు. వారి సూచనల మేరకు బాధితుడు లింక్ ద్వారా వచ్చిన ఈ వర్చువల్ ట్రేడింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారు. తొలుత రూ.50 వేలు ఆ యాప్లోకి బదిలీ చేయడంతో ఆ బ్యాలెన్స్ వాలెట్లో కనిపించింది. ఆపై మరింత మొత్తం పెట్టుబడి పెట్టాలని గ్రూపు సభ్యులు ఒత్తిడి చేశారు. ఓ దశలో ప్రొఫెసర్ ముకుల్ కొచ్చర్, అతడి సహాయకుడిగా కొందరు పరిచయం చేసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్స్లో సలహాలు ఇస్తామంటూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, గ్లోబల్ ఓషన్ లాజిస్టిక్స్ ఐపీఓ షేర్లు ఉచితంగా అధిక సబ్స్క్రిప్షన్ కోటాలో బాధితుడికి కేటాయించినట్లు చెప్పారు. పెట్టుబడి, లాభాలు, ఈ షేర్లతో కలిపి బాధితుడి వర్చువల్ ఖాతాలో మొత్తం రూ.6,19,49,304 బ్యాలెన్స్ చూపించారు. ఆ మొత్తం విత్డ్రా చేసుకోవాలంటే మరికొంత చెల్లించాలంటూ డబ్బు బదిలీ చేయించుకున్నారు. మొత్తమ్మీద బాధితుడు రూ.45,01,017 చెల్లించినా మరికొంత డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన అతను 1930కు ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ఆటకట్టు
నాగోలు: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను మంగళవారం చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 11 తులాల బంగారు అభరణాలు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. మంగళవారం ఎల్బీనగర్ డీసీపీ డాక్టర్ అనురాధ వివరాలు వెల్లడించారు..న్యూఢిల్లీ, సాగర్పూర్కు చెందిన అక్షయ్ కుమార్ శర్మ, , గురుగావ్కు చెందిన రోహిత్ డెలివరీ బాయ్లుగా పని చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న వీరు ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్లో పలు చోరీలకు పాల్పడ్డారు. వీరిద్దరిపై 2017 నుండి 2019 వరకు ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లో 10 కేసులు నమోదయ్యాయి. నాగ్పూర్లోనూ రెండు కేసులు నమోదు కావడంతో గత జూలైలో నాగ్పూర్ వారిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. జైలు నుండి విడుదలైన తర్వాత వీరు ఈనెల 17న హైదరాబాద్కు మకాం మార్చారు. సికింద్రాబాద్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హాస్టల్ ముందు పార్కింగ్ చేసిన బైక్ను చోరీ చేశారు. అనంతరం ఇద్దరు కలిసి బైక్ తిరుగుతూ నాచారం, జవహర్నగర్, షామీర్పేట్, హయత్నగర్, నాగోలు, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల్ పరిధిలో ఏడు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. అనంతరం సికింద్రాబాద్లోని సంగీత థియేటర్ వద్ద చోరీ చేసిన బైక్ను వదిలేసి ఢిల్లీకి పారిపోయారు. వరుస చైన్ స్నాచింగ్లతో అప్రమత్తమైన పోలీసులు ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కృష్ణయ్య పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. చైతన్యపురి డీఐ గురుస్వామి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం నిందితులను అరెస్టు చేసి వారి నుండి 11 తులాల బంగారు అభరాలు, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతి తక్కువ సమయంలో కేసును చేధించిన చైనత్యపురి పోలీస్లను డీసీపీ అభినందించి రివార్టులను అందజేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి సీఐ సైదులు, డీఐ గురుస్వామి, ఎస్ఐలు రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలో వరుస చైన్ స్నాచింగ్లు ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు 11 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం నిందితులపై పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు -
ఒక్కో చెరువుకు రూ.3 కోట్లు
● సుందరీకరణ పనులకు నిధులు మంజూరు ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి మీర్పేట/పహాడీషరీఫ్: నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన చెరువుల సుందరీకరణ కోసం రూ.మూడు కోట్ల చొప్పున హెచ్ఎండీఏ నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీర్పేటలోని క్యాంపు కార్యాలయంలో చెరువుల సుందరీకరణ, ఎస్ఎన్డీపీ నాలాల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీర్పేటలోని చందన చెరువు, పెద్దచెరువు, జల్పల్లి చెరువు, రావిర్యాల చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ముఖ్యంగా చెరువుల్లో మురుగునీరు చేరుతున్న చోట నాలాలు నిర్మించి మళ్లించాలని, ఆ తరువాత సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జల్పల్లి పెద్ద చెరువు కట్టపై మైసమ్మ ఆలయం వద్ద వినాయక ప్రతిమల నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. బతుకమ్మ ఘాట్ను కూడా మహిళా భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. అలాగే రెండో దశలో ఎస్ఎన్డీపీ నాలాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలైన లెనిన్నగర్, మిథులానగర్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే అసంపూర్తిగా ఉన్న ఎస్ఎన్డీపీ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. వాదే ముస్తఫా ప్రజలు చెరువును ఆనుకొని ఉన్న శ్మశాన వాటికకు రాకపోకలు సాగించేలా మార్గం ఉంచాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్ అఫ్జల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఇరిగేషన్ ఏఈ వంశీ, వర్క్ ఇన్స్పెక్టర్ జనార్దన్, మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్, నాయకులు అర్జున్, పటేల్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డింగ్లో నితిన్గౌడ్కు పతకాలు
తాండూరు రూరల్: మండలంలోని కరన్కోట్ గ్రామానికి చెందిన నితిన్గౌడ్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారం, సిల్వర్ పతకాలు సాధించారు. ఈ నెల 23న నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. నితిన్గౌడ్ సీనియర్ విభాగంలో సిల్వర్, జూనియర్ క్యాటగిరిలో బంగారం పతకం సాధించారు. వికారాబాద్లోని అలీ ఫిట్నెస్ జోన్ ట్రైనర్ సద్దాం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్లు నితిన్గౌడ్ తెలిపారు. తనను ప్రోత్సహించిన శ్రీనివాస్గౌడ్, సచిన్, భరత్, పవన్, సాయిమణికి కృతజ్ఞతలు తెలిపారు. -
దోపిడీదారుల లబ్ధికే భూసేకరణ
● రైతులను బెదిరించి లాక్కుంటున్న సర్కారు ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ యాచారం: జిల్లాలో రూ.కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించి దోపిడీదారులకు కట్టబెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. మండలంలోని నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములను మంగళవారం ఆయన పరిశీలించి కౌలు రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా రంగారెడ్డి జిల్లా భూములపై గద్దల్లా వాలిపోతున్నారని విమర్శించారు. ఏళ్లుగా సాగులో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములకు నోటిఫికేషన్లు ప్రకటిస్తూ రైతులను బెదిరింపులకు గురి చేసి తక్కువ ధరలకే సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. మార్కెట్లో ఎకరా భూమి రూ.కోట్లలో పలుకుతుంటే కేవలం రూ.35 లక్షల్లోపే చెల్లించి బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే అన్నదాతలు అడ్డుకుంటారనే భయంతో రాత్రిపూట డ్రోన్లతో వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. కర్షకులు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. లేదంటే గజం భూమి కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు. 30న యాచారంలో ధర్నా నందివనపర్తి ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,400 ఎకరాల భూములను ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నందివనపర్తి, నస్దిక్సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల కౌలు రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ 37ఏ సర్టిఫికెట్లు పొందినప్పటికీ, 38ఈ సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వకుండా అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టాదారు, పాసుపుస్తకాల కోసం ఈ నెల 30న స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాకు కౌలు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, మండల కార్యదర్శి నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పి.అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్, నస్దిక్సింగారం గ్రామ సర్పంచ్ బోడ కృష్ణ, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు తీర్చేందుకు చోరీల బాట
ఏటీఎం లూటీకి యత్నించిన దొంగల అరెస్టు షాద్నగర్ రూరల్: అప్పులు తీర్చేందుకు ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బార్గా జిల్లాకు చెందిన మనపడి రామకృష్ణ, మహారాష్ట్ర సోలాపూర్ చెందిన రాహుల్ సౌరప్ప, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం మాధారం గ్రామానికి చెందిన ఎరుకలి బన్నప్ప, అదే మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి రాజు బంధువులు. వీరందరూ హైదరాబాద్కు వచ్చి ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక గ్రామంలో తల్లిదండ్రులు చేసిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించి అప్పులు కట్టాలనే ఆలోచనతో పథకం పన్నారు. ఏటీఎంలలో ఎక్కువ డబ్బులు ఉంటాయనే భావనతో ఈ నెల 18న హైదరాబాద్ నుంచి మొయినాబాద్కు ఆటోలో జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని లాల్పహాడ్కు చేరుకున్నారు. అక్కడ అర్ధరాత్రి ఏటీఎం సెంటర్లోకి వెళ్లి సుత్తెతో మెషిన్ పగులగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద శబ్దం కావడంతో ఎవరో వస్తున్నట్లు కదలికలు గమనించారు. దీంతో దొరికిపోతామనే భయంతో పరారయ్యారు. దీనిపై ఈ నెల 19న ఏటీఎం నిర్వాహకుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను గుర్తించి పట్టుకున్నారు. చోరీకి ఉపయోగించిన ఆటో, రెండు సెల్ఫోన్లు, రెండు సుత్తెలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. -
ప్రభుత్వ జాగాల్లోపాగా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను టార్గెట్గా స్థిరాస్తి మాఫియా రెచ్చిపోతోంది. వీటికి నకిలీ పత్రాలు సృష్టించి.. కొల్లగొట్టేందుకు యత్నిస్తోంది. అప్పటికే పొజిషన్లో ఉన్న రైతులపై తన ప్రైవేటు సైన్యంతో బలప్రదర్శనకు దిగుతోంది. బలవంతపు భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఎక్కడో మారుమూల ప్రాం తాల్లోని భూములే కాదు.. జిల్లా పరిపాలన కేంద్రానికి కూతవేటు దూరంలోని ఖరీదైన భూములు కరిగిపోతున్నా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కిమ్మనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని శంషాబాద్, కొత్వాల్గూడ, గొల్లపల్లి, ఘాన్సిమియాగూడ, బహుదూర్గూడ సహా మహేశ్వరం, కొంగరకుర్దు రెవెన్యూల పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ భూములకు నకిలీ ఓఆర్సీలు, పట్టాదారు పాసుపుస్తుకాలు సృష్టించి విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అటవీ భూముల్లోనూ అక్రమార్కుల తిష్ట ● కొత్వాల్గూడ సమీపంలోని శంషాబాద్ రెవెన్యూ సర్వే నంబర్ 626/2 అటవీ శాఖకు 176.05 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ 166 ఎకరాలకు ఫెన్సింగ్ వేశారు. మరో 9.5 ఎకరాలను పశువుల మేత కోసం వదిలారు. ఈ భూములపై కన్నేసిన కబ్జాదారులు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. వీరికి రెవెన్యూలోని కొంత మంది అధికారులు పరోక్ష సహకారం అందిస్తుండడంతో భూమిని చదును చేసి, విక్రయించే పనిలో పడ్డారు. తీరా ఈ విషయం ఫారెస్ట్ అధికారులకు తెలిసి అడ్డుకున్నారు. ● శంషాబాద్ విమానాశ్రయం రన్వేకు సమీపంలోని గొల్లపల్లి, బహదూర్గూడ పరిధిలో రియల్ వ్యాపారుల కళ్లుపడ్డాయి. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, నాలా కన్వర్షన్ చేయించకుండానే గుంటల్లో ప్లాట్లను చేస్తున్నారు. 1996లో అప్పటి ప్రభుత్వం హిమాయత్సాగర్ పరిరక్షణకు 111 జీఓను తీసుకొచ్చింది. ఇళ్ల నిర్మాణానికి ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. కానీ ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అసైన్డ్ భూములు వెంచర్లుగా మారాయి. ● శంషాబాద్ మండలం ఘాన్సిమియాగూడ సర్వే నంబర్ 3, 4లో 400 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూములున్నాయి. వీటిని అమ్మడం, కొనడం నిషేధం. కానీ ఈ విలువైన భూములపై కన్నేసిన ముఖ్య నేత ఇప్పటికే 20 ఎకరాలను చెరబట్టారు. ఈ నిషేధిత భూముల్లో భారీ గోదాములు, ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తుండటం విశేషం. ఖాళీగా కన్పిస్తే కబ్జా ● హయత్నగర్–ఇంజాపూర్ రోడ్డులోని సర్వే నంబర్ 191లోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. ఇప్పటికే టిప్పర్ల కొద్ది మట్టిని నింపి భూమిని చదును చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. ● అబ్దుల్లాపూర్మెట్ మండలం మన్నెగూడ సర్వే నంబర్ 49లో 28 గుంటల ప్రభుత్వ భూమిపై ఓ స్థిరాస్తి వ్యాపారి కళ్లు పడ్డాయి. రూ.10 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని తన పట్టా భూమిలో కలిపి, రోడ్డు, పార్కులను ఏర్పాటు చేశారు. ● మహేశ్వరం మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 461లోని 128 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 19 ఎకరాలను ఓ ఎక్స్ సర్వీస్మెన్కు కేటాయించారు. మిగిలిన భూములను పేదలకు అసైన్ చేశారు. ఇక్కడ ఎకరం రూ.పది కోట్లపైనే ఉంటుంది. ఖరీదైన ఈ భూములపై ఆక్రమణదారుల కళ్లుపడ్డాయి. వీటికి తప్పుడు పట్టాదారు పత్రాలు సృష్టించి కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. నకిలీ పత్రాలతో ఆక్రమణలు.. గుట్టుగా వెంచర్లు 111 జీఓ పరిధిలో అక్రమ నిర్మాణాలు రెచ్చిపోతున్న స్థిరాస్తి మాఫియా ఖరీదైన భూములు కరిగిపోతున్నా కిమ్మనని రెవెన్యూ యంత్రాంగం ఇబ్రహీంపట్నం పట్టణ శివారు మంచాల రోడ్డులో ఉన్న బొంతపల్లికుంటపై కబ్జాదారుల కన్నుపడింది. 20.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటకు ఎగువ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రధాన కాల్వను ఇప్పటికే పూడ్చేశారు. తాజాగా నాలాను ఆక్రమించి, రాత్రిపూట మట్టిని నింపుతున్నారు. కళ్లముందే ఖరీదైన కుంట భూములు మాయమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మెయినాబాద్ మండలం నజీబ్నగర్ సర్వే నంబర్ 3,4లలో సింగారం చెరువు కుంట ఉంది. ఎఫ్టీఎల్ పరిధిలో 80 ఎకరాలు ఉంది. ఇందులో శిఖంపట్టా భూములు సైతం ఉన్నాయి. అయితే దాదాపు 819 మీటర్ల పొడవుతో ఉన్న కట్టను రియల్టర్లు ధ్వంసం చేశారు. ఆమనగల్లు పట్టణం సురసముద్రం చెరువుకు సంబంధించిన వరదనీటి కాల్వ కబ్జాకు గురైంది. అయ్యప్పసాగర్ క్షేత్రంలోని చెరువు నుంచి కోనాపూర్ గేటు వద్ద ఉన్న మిషన్ భగీరథ పంపు, మిఠాయిపల్లి చెరువు మీదుగా వరద నీరు ఈ సురసముద్రంలోకి చేరుతుంది. ఓ రియల్టర్ కాల్వ పక్క భూములను కొనుగోలు చేసి, కాల్వలను సైతం తన పట్టా భూమిలో కలిపేశారు. -
పాలసేకరణ ధరలు పెంచండి
కడ్తాల్: పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని వివిధ గ్రామాల విజయ డెయిరీ సొసైటీ చైర్మన్లు, పాడి రైతులు కోరారు. మంగళవారం వారు హైదరాబాద్లోని తెలంగాణ పాడి పారిశ్రామాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్డీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, సంస్థ ఎండీ చంద్రశేఖర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ.. ఎస్ఎన్ఎఫ్ డిటెక్షన్ను తీసివేయాలని కోరారు. పాడిరైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పాలసేకరణ ధరలను పెంచాలని కోరారు. సకాలంలో పాలబిల్లులు అందించాలని, సబ్సిడీపై దాణ, మినరల్ మిక్చర్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్గుప్తా, పాడి రైతులు, సొసైటీ చైర్మన్లు కడారి రామకృష్ణ, రంగయ్య, శ్రీకాంత్రెడ్డి, నర్సింహారెడ్డి, జితేందర్రెడ్డి, కృష్ణయ్య, రంగనాయక్, హరి ప్రవీన్యాదవ్, నర్సింలు, దశరథ్, బాలాచారి, దుర్గేశ్, శంకర్నాయక్ తదితరులు ఉన్నారు. టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి పాడిరైతుల వినతి -
సదుపాయాలపై చొరవ చూపాలి
అబ్దుల్లాపూర్మెట్: గ్రేటర్లోని శివారు డివిజన్లలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చొరవ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డిరంగారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. నాగోల్ సర్కిల్–11 పరిధిలోని పెద్దఅంబర్పేట, కుంట్లూర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దఅంబర్పేట లక్ష్మారెడ్డిపాలెంలోని ఎస్ఎన్ఆర్ కళా కన్వెన్షన్ హాల్లో అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడంతో ఇక్కడి ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారని, వారిలో అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేయడానికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. నిధులు కేటాయింపులో శివారు డివిజన్లపై చిన్న చూపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దఅంబర్పేట, కుంట్లూరు డివిజన్ల అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించడంతో పాటు అన్ని విభాగాల అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీల వాసులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కృష్ణకుమారి, చీఫ్ ఇంజనీర్ అశోక్రెడ్డి, నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, బాటసింగారం సహకార సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
జినుగుర్తిలో క్రికెట్ అకాడమీ
● 25 మంది విద్యార్థులకు అవకాశం ● రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ తాండూరు టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ నైపుణ్యం సాధించాలని రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ అన్నారు. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు మండలం జినుగుర్తి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను క్రికెట్ శిక్షణ కేంద్రం కోసం ఎంపిక చేశారన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాల్లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తాండూరు పట్టణంలో క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. వీరు ఏ గురుకులంలో చదువుతూ క్రికెట్కు ఎంపికయ్యారో అదే గురుకులంలో వారి అడ్మిషన్ కొనసాగుతుందని, కానీ క్రికెట్లో శిక్షణ మాత్రం జినుగుర్తి మైనార్టీ గురుకులంలో ఉంటుందన్నారు. మైనార్టీ విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకే గురుకుల సొసైటీ సెక్రటరీ బి షఫీవుల్లా, స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేశ్వర్ గురుకులాల్లో క్రీడా అకాడమీలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్రీడకు ఒక్కో మైనార్టీ గురుకులాన్ని ఎంపిక చేశారన్నారు. దీనిలో భాగంగానే జినుగుర్తి ౖమైనార్టీ గురుకుల పాఠశాలలో క్రికెట్ అకాడమీ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి ఆర్ఎల్సీ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు గురుకుల ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా, కొడంగల్ కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేందర్, పీడీ గోపాల్, శ్రీశైలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు జాతీయ సదస్సు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధ, గురువారాల్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాధిక, సదస్సు కన్వీనర్ రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికసిత్ భారత్–2047 డిజిటల్ ఇండియా, పరివర్తన, సాధికారిత వైపు ఒక చొరవ అనే అంశంపై సదస్సు ఉంటుందున్నారు. దేశంలోని వివిధ వర్సిటీల నుంచి నిష్ణాతులైన అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు హాజరై పరిశోధన పత్రాలను సమర్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్గా ఎమ్మెల్యే వీర్లపల్లి షాద్నగర్: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీచేశారు. ప్రభుత్వ పదవికి రాజీనామా చేసిన గీతావనజాక్షి మొయినాబాద్: చేవెళ్ల కోర్డులో ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్గా పనిచేస్తున్న గీతా వనజాక్షి తన పదవికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఆమె కౌన్సిలర్గా పోటీ చేసేందుకు సిద్ధమై చేవెళ్ల కోర్టు న్యాయమూర్తికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ప్రభుత్వం అప్పగించిన అసిస్టెంట్ ప్లీడర్ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించానన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నానన్నారు. పెద్దమంగళారం సర్పంచ్గా పనిచేసిన అనుభవంతో కౌన్సిలర్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. గతంలో చేసిన అభివృద్ధి, మంచి పనులను గుర్తించిన గ్రాస్తులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి తుక్కుగూడ: పల్లె దవాఖానాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 158 పల్లె దవాఖానాలు ఉన్నాయన్నారు. పల్లెల్లో మాతాశిశు సంక్షేమం, కేన్సర్ కేర్, వయో వృద్ధుల సేవలు తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం వైద్య సిబ్బందికి సిమ్కార్డ్స్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ పాపారావు, సిబ్బంది వినోద్, రాకేశ్, శ్రీనివాసులు, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. కొందుర్గు: గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహిస్తే సహించేది లేదని కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్ హెచ్చరించారు. భగత్సింగ్, ఛత్రపతి శివాజీ యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను విప్పి, పారబోశారు. గ్రామంలో మరోసారి మద్యం విక్రయించినట్లు తెలిస్తే స్థానికులతో కలిసి పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు పట్టించడంతో పాటు కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. -
పథకాల ఆశచూపి అధికారంలోకి..
కొందుర్గు: తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఆశచూపుతూ అధికారం చేపడుతున్నారని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి విమర్శించారు. మంగళవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం చింతకుంట తండా, వేపకుచ్చ తండా, గోవులబండ తండాలను సందర్శించి గిరిజనుల ఆర్థిక స్థితిగతులు, జీవన నైపుణ్యాలపై ఆరాతీశారు. సాగునీరందక పంటలు ఎండిపోయి అప్పులపాలవుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తీర్చేందుకు ముంబాయి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోతున్నామన్నారు. అనంతరం రాఘవాచారి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఓట్లు వేయించుకుని మోసం చేసిందన్నారు. జూరాల నుంచి నీటిని తరలించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి ఆరంభంలోనే ప్రాజెక్టును ఆపివేశారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వం బీఆర్ఎస్ బాటలోనే పాలనసాగిస్తోందన్నా రు. సంక్షేమ పథకాలకే ప్రాధాన్యతనివ్వడం బాధాకరమన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని బీఆర్ఎస్ మోసం అదేబాటలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి -
6,573 మంది ఖైదీలకు న్యాయ సహాయం
తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా చంచల్గూడ: వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 6,573 మంది ఖైదీలు న్యాయ సహాయం పొందారని తెలంగాణ రాష్ట్ర జైళ్ల డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. సోమవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ శిక్షణ సంస్థ (సీకా) మైదానంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురు వేసిన అనంతరం డీజీ మాట్లాడుతూ... జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమంతో పాటు ఖైదీల సంక్షేమానికీ విశేషంగా కృషి చేస్తున్నదన్నారు. గత సంవత్సరం రాష్ట్ర జిల్లా న్యాయ సహకార సంస్థ ద్వారా ఎంతో మంది ఖైదీలు న్యాయ సహాయం పొందారన్నారు. 44 జైల్ అదాలత్లు నిర్వహించి 1,558 కేసులను విచారించగా 985 కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. దేశంలోనే తొలిసారిగా మొత్తం 616 ఖైదీలకు రూ. 1.92 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. అర్హులైన ఖైదీలకు పెరోల్ మంజూరు చేశారన్నారు. థంబ్ ఇన్–సైన్ ఔట్లో భాగంగా 23,220 ఖైదీలను అక్షరాస్యులుగా మార్చామన్నారు. ఐజీలు యెర్రంశెట్టి రాజేష్, ఎన్.మురళీబాబు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీనివాస్, చంచల్గూడ జైలు సూపరింటెండెంట్లు నవాబు శివకుమార్గౌడ్, వెంకటలక్ష్మీ, శ్రీమాన్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ ఏఈ కార్యాలయం ప్రారంభం
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి సంబంధించి ట్రాన్స్కో ఏఈ కార్యాలయాన్ని డీఈ శ్యామ్సుందర్ రెడ్డి ప్రారంభించారు. ఇదివరకు కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ రెండు మండలాలకు ఒకే ఏఈ విధులు నిర్వహించేవారు. అయితే ఇటీవల జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి నూతనంగా నర్సింలు అనే ఏఈని నియమించారు. కాగా సోమవారం తాత్కాలిక ఏఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ ఇక నుంచి మండలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఏఈ అందుబాటులో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో ఏడీ సత్యనారాయణ, కేశంపేట ఏఈ ఈశ్వర్, కొందుర్గు ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయం ధ్వంసంపై ఆందోళన
షాద్నగర్: మండల పరిధిలోని కిషన్నగర్లో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనంతో ఢీకొట్టి బంగారు మైసమ్మ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, వీహెచ్పీ రాష్ట్ర ప్రముఖ్ మఠం రాచయ్య, బజరంగ్దళ్ నాయకులు దేవాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవాలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొంత కాలంగా కొందరు దేవాలయాలను టార్గెట్చేశారని, ఆలయాల పరిరక్షణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కక్కునూరు వెంకటేశ్గుప్తా, వంశీకృష్ణ, చెట్ల వెంకటేశ్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్సిగ్, సురేష్, మహేందర్రెడ్డి, మల్చలం మురళి, వెంకటనోళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ జెండాకు అవమానం
చేవెళ్ల: మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఇక్కడ ఓ స్థానిక నాయకుడు జెండాను ఆవిష్కరించగా, అపసవ్య దిశలో ఎగుతున్న జెండాను గమనించిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ మాధవిరాంరెడ్డి జాతీయ జెండాను కిందికి దించి, సరిచేసిన అనంతరం మళ్లీ ఎగురవేశారు. ఈ విషయంపై సర్పంచ్, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేయగా, పొరపాటు జరిగిందని జెండా కట్టిన వారు చెప్పారు. అయితే, పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను సర్పంచ్ లేదా పంచాయతీ సెక్రటరీ ఎగరేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ సీనియర్ నాయకుడితో జెండావిష్కరణ చేయించారు. ఈ విషయమై ఎంపీడీఓ, ఎంపీఓను అడగగా, విషయం మా దృష్టికి రాలేదని, తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జెండావిష్కరణలో అపశ్రుతి మంచాల: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో మండలంలోని ఆంబోత్ తండాలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేస్తుండగా తాడుతో పాటు పతాకం కింద పడింది. మువ్వెన్నెల జెండా ఎగుర వేసే సమయంలో అపశ్రుతి జరగడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. జెండా ఎత్తని పాఠశాలలు పహాడీషరీఫ్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని విద్యా సంస్థల్లో సోమవారం సంబురాలు నిర్వహించగా, జీహెచ్ఎంసీ జల్పల్లి సర్కిల్లోని సెయింట్ ఫ్లవర్, సెయింట్ మర్యామ్ పాఠశాలలు వేడుకలకు దూరంగా ఉన్నాయి. కనీసం ఆయా స్కూళ్ల గేట్లు కూడా తెరవలేదు. ఇది గమనించిన గ్రామ యువజన సంఘాల నాయకులు గౌర మురళీకృష్ణ, శ్రీకాంత్గౌడ్, యంజాల శివకుమార్, యాదగిరి, దూడల శివకుమార్ తదితరులు స్కూళ్ల వద్దకు వెళ్లి నివ్వెరపోయారు. వెంటనే ఫోన్లో సదరు యాజమాన్యాలను సంప్రదించగా, తమకు ఆరోగ్యం బాగోలేదని, పరీక్షలు ఉన్నాయని పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆగ్రహానికి గురైన యువకులు ఆయా స్కూళ్ల ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయాన్ని పహాడీషరీఫ్ పోలీసులతో పాటు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
‘కండల ఇంజెక్షన్ల’ పట్టివేత!
సాక్షి, సిటీబ్యూరో: అత్యవసర వైద్య సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ సోమవారం వివరాలు వెల్లడించారు. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ ఖాన్ ఫర్మిచర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. జిమ్కు వెళ్లే అలవాటు ఉన్న ఫైజల్ అక్కడ కొందరు యువకులు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా వాడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇదే అదనుగా తేలిగ్గా డబ్బు సంపాదించడానికి వీటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇండియా మార్ట్ యాప్ ద్వారా సూరత్ నుంచి ఈ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.150కి ఖరీదు చేసి జిమ్కు వచ్చే యువతకు రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నాడు. యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ బరువులు ఎత్తడానికి, కండలు పెంచుకోవడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్గా ఈ ఇంజెక్షన్ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా అనేక దుష్పరిణామాలు.. ఫైజల్ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ యదేందర్, ఎస్సై మహ్మద్ జాహెద్ తమ బృందాలతో వలపన్ని అత్తాపూర్లోని ఏసియన్ థియేటర్ వద్ద పట్టుకున్నారు. అతడి వద్దనున్న 133 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఇంజెక్షన్లను కొన్నాళ్లు ఫైజల్ కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతోపాటు మానసిక ఇబ్బందులు వస్తాయని అదనపు డీసీపీ హెచ్చరించారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆయన కోరారు. -
పారదర్శకతకు పెద్దపీట
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల ను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం.. జిల్లా అభివృద్ధే ధ్యే యంగా శ్రమిస్తున్నాం.. జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలి’ అని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే .. త్వరలో మూసీ సుందరీకరణ పనులు ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనరేట్ ఏర్పాటు ద్వారా ప్రజలు, పెట్టుబడిదారులకు భద్రత మరింత మెరుగు పడుతుంది. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డును కలుపుతూ ఇటు రావిర్యాల నుంచి అటు ఆమనగల్లు వరకు 41.5 కిలోమీటర్లు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో 300 అడుగుల వెడల్పుతో చేపట్టిన రేడియల్ రోడ్డు పనులు హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. బుద్వేల్ నుంచి షాబాద్, కొందుర్గు, చౌదరిగూడ మీదుగా నాచారం వరకు మరో రేడియల్ రోడ్డు ఏర్పాటుకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశాం. మూసీనది ప్రక్షాళనలో భాగంగా మొదటి దశలో హిమా యత్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న ఈసీ నది, ఉస్మాన్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న మూసీ నది సుందరీకరణ పనులు త్వరలోనే చేపట్టబోతున్నాం. సంక్షేమ పథకాలతో లబ్ధి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 15,543 ఇళ్లను మంజూరు చేసి, ఇప్పటి వరకు 10,327 నిర్మాణాలను మొదలు పెట్టి, రూ.253.97 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏడాది కాలంలో 35,543 మంది లబ్ధిదారులకు వివిధ రకాల చికిత్సలు అందించి, రూ.121.39 కోట్లు చెల్లించాం. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 126.24 కోట్ల జీరో టికెట్లు జారీ చేశాం. గృహజ్యోతి పథకంలో భాగంగా 3.31 లక్షల మందికి జీరో బిల్లులు జారీ చేసి, రూ.12.30 కోట్ల సబ్సిడీని డిస్కంకు చెల్లించాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద 2,82,850 మంది రైతుల ఖాతాల్లో రూ.323 కోట్లు జమ చేశాం. 2025–26లో 289 మంది రైతులు మృతి చెందగా, రైతు బీమా పథకం కింద రూ.14.45 కోట్లు.. వానాకాలంలో 2,879 మంది రైతుల నుంచి 14,866 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ.35.52 కోట్లు చెల్లించాం. మొగిలిగిద్దలో ఏటీసీ సెంటర్ జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా, మూడింటిని యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పోగ్రాం కింద ఎంపిక చేసి, కందుకూరులో సీఎల్ఏటీ, ఇబ్రహీంపట్నంలో నీట్, శంషాబాద్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో కేజీబీవీకి రూ.3.66 లక్షలు మంజూరు చేశాం. 764 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.23.37 కోట్లు, 1,251 పాఠశాలల నిర్వహణ కోసం రూ.4.66 కోట్లు మంజూరు చేశాం. ఆరు యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్లకు పాలనా అనుమతులు పొంది, ఇప్పటికే షాద్నగర్, కల్వకుర్తి స్కూళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాం. వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే విద్యార్థుల్లో మరింత నైపుణ్యం కోసం కందుకూరు మండలం పంజాగూడ, ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్దలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లకు పాలనా అనుమతులు తెచ్చుకున్నాం. జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వివిధ శాఖలు శకటాలను ప్రదర్శించారు. ఉత్తమ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశాంసా పత్రాలు అందజేశారు. ‘చెక్ దే ఇండియా’ దేశభక్తి గీతానికి నాదర్గుల్ డీపీఎస్ స్కూలు విద్యార్థులు, గళ్లు..గళ్లు జోడెడ్ల బండి జానపద గీతానికి ఎంజేపీ పాలమూకుల పాఠశాల విద్యార్థులు, జై జవాన్..జై కిసాన్ గీతానికి మహేశ్వరం భాష్యం స్కూలు విద్యార్థులు, ఆమనగల్లు కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన బోనాల నృత్యం, ఆపరేషన్ సింధూర్పై జెడ్పీహెచ్ఎస్ సాహెబ్నగర్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం, తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన బంజారా నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, శంషాబాద్ డీసీపీ రాజేశ్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కూర్చొనేందుకు సరిపడా కుర్చీలు లేకపోగా, అధికారులు, సిబ్బంది సహా వివిధ వేషధారణలో వచ్చిన విద్యార్థులు గంటల తరబడి ఎండలోనే మగ్గాల్సి వచ్చింది. వైద్య సేవల్లో నంబర్ వన్ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కీలకంగా పని చేస్తున్నాయి. వైద్య సేవల్లో రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలవడం అభినందనీయం. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద 20 ఆస్పత్రుల్లో ప్రతి మంగళవారం 18 ఏళ్లు నిండిన మహిళలకు 8 రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. చేయూత పథకం కింద 1,91,716 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.47.75 కోట్లు అందజేస్తున్నాం. బ్యాంక్ లింకేజీ ద్వారా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని 9,243 స్వయం సహాయక సంఘాలకు రూ.785.94 కోట్లు, సీ్త్ర నిధి సంస్థ ద్వారా రూ.19.02 కోట్ల రుణాలు మంజూరు చేశాం. 383 పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు రూ.4.97 కోట్ల రుణాలు మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు, వసతి గృహాల్లో చదువుతున్న వారికి మెస్ చార్జీలు చెల్లిస్తూ పేద విద్యార్థుల చదువుకు పెద్దపీట వేస్తున్నాం. -
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి
కందుకూరు: వికసిత్ భారత్ 2047 లక్ష్యసాధనకు అనుగుణంగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముచ్చర్లలో వికసిత్ భారత్, గ్యారెంటీ రోజ్ గార్, అజీవికా మిషన్ గ్రామీణ బిల్లుపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో వంద రోజులుగా ఉన్న పని దినాలను 120 రోజులకు పెంచారని, నేరుగా కూలీలకు వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పథకం పేరుతో పేదలను మోసం చేసి దండుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, జిల్లా కార్యదర్శి తేరటి లక్ష్మణ్ముదిరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, సర్పంచ్ ఊటు పద్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్క మల్లేష్, జిల్లా నాయకులు ఊటు మహేందర్, జిట్టా రాజేందర్రెడ్డి, సాధ మల్లారెడ్డి, బొక్క సత్యనారాయణరెడ్డి, కళ్లెం రాజేందర్రెడ్డి, దేశం సత్తిరెడ్డి, కొంతం జంగారెడ్డి, సోమరాజు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి భద్రత
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయిలో భద్రత కల్పిస్తాం అని పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు పేర్కొన్నారు. పోలీస్ పరేడ్గ్రౌండ్లో సోమ వారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు కవాతుతో ఆయనకు వందనం సమర్పించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వారికి ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ప్రజలతో మమేకమై శాంతిభద్రతలను కాపాడాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. చట్టం నుంచి రక్షణ కోరే వారిని కాపాడుతూ.. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిని శిక్షించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. నేరాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కమిషనరేట్ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ చందనాదీప్తి, డీసీపీలు నారాయణరెడ్డి, యేగేష్, శిరీష, ఏసీపీలు జానకీరెడ్డి, రాజు, చంద్రశేఖర్, కిషన్, లక్ష్మీనారాయణ, సీఐలు పాల్గొన్నారు. -
ఆ పనులకే శంకుస్థాపనలు
ఇబ్రహీంపట్నం: గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులకే తిరిగి శంకుస్థాపనలు చేస్తూ.. రూ.220 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు గొప్పలు చెప్పుకొంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పట్లో తాను నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చిన నిధుల వివరాలను ప్రొసీడింగ్స్తో సహా మీడియా మందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తున్నాడే తప్ప కొత్తగా నిధులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.220 కోట్లు మంజూరు చేయించినట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ విసిరారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందా చేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధిచెబుతారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అన్నీ బీఆర్ఎస్ హయాంలో మంజూరైనవే.. -
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
మొయినాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సోమవారం మొయినాబాద్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, కమిషనర్ జాకీర్ అహ్మద్ తదితరులు నామినేషన్ సెంటర్లు, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్లు, మాక్ కళాశాలో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు. నామినేషన్ సెంటర్ మొయినాబాద్లో ఏర్పాటుకు కొన్ని భవనాలను చూశారు. వారి వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఏసీపీగా ప్రదీప్కుమార్ బాధ్యతల స్వీకరణ ఇబ్రహీంపట్నం: ఆదిబట్ల ఏసీపీగా డీకే ప్రదీప్కుమార్ సోమ వారం బాధ్యతలు చేపట్టారు.పోలీస్స్టేషన్ను ఇటీవల హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చి డివిజన్ ఏసీపీ స్థాయి హోదా ను కల్పించిన సంగతి తెలిసిందే. నూతన డివిజన్ కార్యాలయానికి ఏసీపీగా ప్రదీప్కుమార్ను నియమించడంతో అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో సమావేశమై ప్రజా భద్రత, నేరాలను అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు, స్నేహపూర్వక పోలీసింగ్ వ్యవస్థ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.ఐదు వేలు కడ్తాల్: మండల పరిధిలోని రేఖ్యతండా సర్పంచ్ పాత్లవత్ లక్ష్మీబాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఆడబిడ్డ పుడితే రూ.ఐదు వేలు ప్రోత్సా హంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల తండాకు చెందిన మూడవత్ శ్రీను–రజిత దంపతులకు జన్మించిన ఆడబిడ్డకు రూ.ఐదు వేలు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్, వార్డు సభ్యులు కృష్ణ, విజయ, రాజు, హన్మా, శ్రీను, నాయకులు శ్రీధర్నా యక్, కృష్ణనాయక్, శ్రీనివాస్ ఉన్నారు. 300 వార్డులు, 60 సర్కిళ్లకు మ్యాపింగ్ పూర్తి లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో 300 వార్డులు, 60 సర్కిళ్లకు మ్యాపింగ్ పూర్తి అయింది. 27 అర్బన్ లోకల్ బాడీల విలీనంతోపాటు వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి, సర్కిళ్లను 30 నుంచి 60కి, జోన్లను 6 నుంచి 12కి పెంచిన విషయం తెలిసిందే. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలతోపాటు 60 సర్కిళ్లు, 300 వార్డుల మ్యాపింగ్ను ఖచ్చితత్వంతో పూర్తి చేసింది. జనన, మరణ సాఫ్ట్వేర్ అప్లికేషన్ను విజయవంతంగా ప్రారంభించింది. మ్యా పింగ్ ఆధారంగా జనన, మరణాల నమోదు, ధ్రువపత్రాల జారీ మరింత పటిష్టంగా, పారదర్శకంగా, వేగంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌరులందరూ తమ సమీప మీసేవా కేంద్రాల ద్వారాసులభంగా జనన, మరణ ధ్రువపత్రాల సేవలను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. -
మహిళ దారుణ హత్య
● పెద్దేముల్ మండలం రేగొండిలో ఘటన ● డాగ్స్క్వాడ్, క్లూస్టీంతో ఆధారాలు సేకరించిన పోలీసులు ● మృతురాలిది యాలాల మండలం పగిడిపల్లి తాండూరు రూరల్: మహి ళ గొంతుకోసి హ త్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్దేముల్ ఎస్ఐ శంకర్ ప్రకారం.. రేగొండి శివారు అటవీ ప్రాంతాంలోని ఓ కాల్వ వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతు రాలి వద్ద ఉన్న ఆధార్ కార్డులోని వివరాల ద్వారా ఆమె, యాలాల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన లొంకల పద్మమ్మ(45)గా గుర్తించారు. వికారాబాద్ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నిత్యం తాండూరుకు వచ్చి అడ్డా కూలీగా పని చేసుకుంటుందని, గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పనికోసం తీసుకెళ్లి, హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించా రు. ఎస్ఐ శంకర్తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పద్మ మ్మ నాలుగు రోజుల క్రితం పనికోసం బయటకు వెళ్లి, ఇంటికి వెళ్లలేదని తెలిసింది. వరినాట్లు వేసేందుకు వెళ్లి, ఒక్కోసారి వారం రోజుల వరకూ పని ప్రాంతంలోనే ఉంటారని, అలాగే వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యు లు భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. మృతురాలి భర్త చనిపోగా, ఓ కూతురు ఉంది. -
ఉమ్మడి రంగారెడ్డిని పునర్నిర్మించాలి
● జిల్లా సాధన సమితి సభ్యుల డిమాండ్ ● తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి వినతిపత్రం తాండూరు టౌన్: రంగారెడ్డి జిల్లా పునర్నిర్మాణం జరగాలని ఉమ్మడి జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి తిరుపతి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలను విడదీసి, పూర్తిగా గ్రామీణ నేపథ్యం కలిగిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 317 జీఓతో రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి వికారాబాద్ జిల్లాకు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు శాశ్వతంగా బదిలీ అయ్యారని, దీంతో ఇక్కడి నిరుద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు. వీటితో పాటు అనేక అంశాల్లో జిల్లా నష్టపోతోందని, ప్రభుత్వం పునరాలోచించి పూర్వ రంగారెడ్డి జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిశ్రావణ్, శ్రీశైలం, రాజు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
బీసీలను దగా చేస్తున్న ప్రభుత్వం
అనంతగిరి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల జీవితాలు, ఆత్మగౌరవంతో ఆడుకుంటోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. వికారాబాద్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టు కేసు తేలకుండా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడం ఆవర్గాలను దగా చేయడమేనని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే కేసు హైకోర్టులో నడుస్తోందని తెలిపారు. గత నవంబర్లోనే విచారణ ఫుల్ బెంచ్పైకి రావాల్సి ఉన్నా.. కేసు వాదించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.300 కోట్ల గ్రాంట్ రాదనే కారణంతోనే ఎన్నికలు పూర్తిచేశారన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల అంశం బలంగా ఉందని వివరించారు. ఏ కోణంలో చూసినా కేసు గెలుస్తామని, ఇందుకోసం అన్నివిధాలా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు గెలిపించడానికి ప్రయత్నం చేయని ప్రభుత్వం, ఎన్నికలకు తొందరపడటంలో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగపరమై, న్యాయపరమైన అవరోధాలేమీ లేవన్నారు. ప్రజల్లో బీసీ ఉద్యమం బలంగా ఉందని, ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే రిజర్వేషన్ల పెంపును అడుగుతున్నామని స్పష్టంచేశారు. ఈవిషయంలో సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేయడం సరికాదన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఉన్న 200 మందికిపైగా ఎంపీలతో ఇండియా కూటమి తరఫున పార్లమెంట్లో అడగడమో, నిరసన తెలపడమో చేయాలని సూచించారు. లేదంటే అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి, సభలో ప్రైవేటు బిల్లు పెట్టి ఆమోదింపజేయాలన్నారు. బీసీలను అణగదొక్కాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుపడుతోంది కోర్టు కేసు తేలకుండా ఎన్నికలకు వెళ్లడం పెద్ద కుట్ర కేంద్రం నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు పెట్టారు బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యబీసీ సర్పంచ్లకు అండగా ఉంటాం నూతనంగా గెలుపొందిన బీసీ సర్పంచ్లకు అండగా ఉంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని గౌలికార్ నర్సింగ్రావు ఫంక్షన్ హాల్లో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సర్పంచ్లను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నా రు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు సరైన న్యాయం జరగలేదన్నారు. అనంతరం శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడారు. రాజ్యాధికారంలో మనవాటా మనకు దక్కాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం బీసీ సర్పంచులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ ర్యాగ అరుణ్కుమార్, బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ లక్ష్మణ్, కన్వీనర్ యాదగిరి యాదవ్, ప్రతినిధులు శ్రీనివాస్గౌడ్, నర్సింలు, వెంకట య్య, మారుతి, విజయ్కుమార్, అనంత య్య, శివరాజు, పాండుగౌడ్, లాల్కృష్ణ ప్రసా ద్, రాజ్కుమార్, షుక్రూ, శ్రీనివాస్, హన్మంతు, రామకృష్ణ, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్రూరల్: షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిద్దిదడమే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో వ్యత్యాసం ఏమిటో ప్రజలే గ్రహిస్తున్నారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచి చేసేవారికి ఓటువేసి న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించాలని కోరారు. మాకు ఎవరు నాయకులు లేరని, ప్రజలే మాకు బాసులని, వాళ్లు చెప్పిందే మాకు వేదమన్నారు. అవినీతికి దూరంగా, అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన అందిస్తున్నామన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకోసం పనిచేసే నాయకులకే టికెట్ ఇస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్యాంసుందర్రెడ్డి, తాండ్ర విశాలశ్రావణ్రెడ్డి, నాయకులు కాశీనాథ్రెడ్డి, అగ్గనూరు విశ్వం, వన్నాడ ప్రకాశ్గౌడ్, మహ్మద్ అలీఖాన్బాబర్, శివశంకర్గౌడ్, కృష్ణారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బాల్రాజ్గౌడ్, సర్వర్పాషా, దామోదర్రెడ్డి, బస్వం, అందె మోహన్, ఖాజాఇద్రీస్అహ్మద్, రఘునాయక్, పురుషోత్తంరెడ్డి, జితెందర్రెడ్డి, కొమ్ముకృష్ణ, మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాపోటీలతో స్నేహభావం పెంపు
ఆమనగల్లు: యువత క్రీడల్లోనూ రాణించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని అయ్యప్పకొండ సమీపంలో నిర్వహిస్తున్న మహేశ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా పోటీల నిర్వహణతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీలు ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు యాదవ్, టోర్నీ నిర్వాహకులు సతీశ్, ప్రసాద్, లక్ష్మణ్, స్థానిక నాయకులు చంద్రశేఖర్రెడ్డి, అంజినాయక్, ఒగ్గు మహేశ్, రాజు, రంజిత్, సుమన్, కిరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి -
భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగిరం
ఇబ్రహీంపట్నం రూరల్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్ ఎదుగుతోందని టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ అన్నారు. శనివారం ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని మంగళ్పల్లి సమీపంలోని రోహిణి ట్రేడర్స్ స్టీల్, సిమెంట్ డీలర్ షాపు వద్ద తాపీమేసీ్త్రలకు అల్ట్రాఫాస్ట్ట్ సెట్టింగ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జి, రహదారుల నిర్మాణాలకు సరైన ఎంపిక అని చెప్పారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని తెలిపారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ రూ.20 అధికంగా ఉంటుందన్నారు. అనంతరం 30 మంది బిల్డర్లకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. డీలర్లు నర్సింహారావు, విష్ణువర్ధన్రావు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ -
పట్టణాల అభివృద్ధి స్థిరంగా జరగాలి
మొయినాబాద్: తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ విజన్–2047 ఆశయాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి స్థిరంగా జరగాలని.. పట్టణాల అభివృద్ధిని కేవలం మౌలిక సదుపాయాలు, విస్తరణ, ఆర్థికవృద్ధితో మాత్రమే కాకుండా మానవ సంక్షేమం, పర్యావరణ సమతుల్యత, సామాజిక సమానత్వం, సాంస్కృతిక నిరంతరత, ధీర్ఘకాలిక స్థిరత్వం వంటి అశాలతో కొలవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) ఆధ్వర్యంలో పట్టణీకరణ, స్థిరత్వంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విధాన నిర్ణేతలు, పట్టణ నిపుణులు, ఆర్కిటెక్టులు, పట్టణ ప్రణాళికకారులు, పర్యావరణ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల నాయకులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పౌర ప్రతినిధులు పాల్గొని పట్టణీకరణ అభివృద్ధి, పట్టణాల సవాళ్లు–వాస్తవ పరిస్థితి, వాతావరణ మార్పు–తక్షణ అవసరం, భవిష్యత్ అంశాలపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధి కోసం స్థిరమైన, సమానత్వంతో కూడిన పట్టణాలను రూపుదిద్దే దిశగా పనిచేయాలని.. అందుకు సామూహిక అవగాహణ అవసరమని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సదస్సు పాలనకు మార్గనిర్దేశం చేసే, ప్రజాజీవితాన్ని బలోపేతం చేసే పరిష్కారోన్నత వేదికగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. సదస్సులో ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధిపతి సుజనారెడ్డి కుంభం, మహేంద్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిర్బన్ ఘోష్, పర్యావరణ నిపుణులు బీవీ సుబ్బారావు, ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీ ప్రతినిధి అరుణ్కుమార్, ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ ప్రతినిధి కవితారెడ్డి, రాంకీ గ్రూప్ ప్రతినిధి శ్రీనివాస్ కేశవరపు, గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ సందర్శన కొందుర్గు: హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తహసీల్దార్ అజాంఅలీ సూచించారు. శనివారం పులుసుమామిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన సందర్శించి, పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని కిచెన్ షెడ్, కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. తాజా కూరగాయలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి నిస్సీ శేకీనా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఓంకారేశ్వరాలయ భూములు సేకరించొద్దు
● ఫ్యూచర్సిటీ పేరిట కౌలు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం ● సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూ ములను ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు తీసుకోవద్దని, సాగులో ఉన్న కౌలు రైతులకు హక్కులు కల్పించి, పట్టాదారు, పాసుపుస్తకాలు జారీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నందివనపర్తి గ్రా మంలోని 1,400 ఎకరాల ఓంకారేశ్వరాలయ భూ మిని తాడిపర్తి, నందివనపర్తి, నస్దిక్సింగారం, కుర్మిద్ద రైతులు ఏళ్ల నుంచి సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. కౌలు రైతులకు 37 ఏ సర్టిఫికెట్లు సైతం ఇచ్చారని.. 38 ఈ టెనెంట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఆ భూముల్లో రైతుల సాగుకు రూ.లక్షలాదిగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసుకున్నారని అన్నారు. నేడు ఆ భూములను ఫ్యూచర్సిటీ కోసం తీసుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. 27న జాన్వెస్లీ రాక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఈ నెల 27న ఓంకారేశ్వరాలయ భూములను సందర్శిస్తారని పి.యాదయ్య తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆలయ భూములను సందర్శించి కౌలు రైతులతో మాట్లాడుతారని చెప్పారు. కౌలు రైతులకు న్యాయం చేయడం కోసం సీపీఎం మరో పోరాటానికి సిద్ధమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు పి.అంజయ్య, మండల నాయకులు జంగయ్య, తావునాయక్, వెంకటయ్య, జగన్, బాల్రాజ్, లాజర్, మౌనిక, విప్లవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిల నియామకం
షాద్నగర్: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలను నియమించింది. షాద్నగర్ ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, ఆమనగల్లుకు రజిని సాయిచంద్, ఇబ్రహీంపట్నంకు నందికంటి శ్రీధర్, చేవెళ్లకు సీనియర్ నేత కార్తీక్రెడ్డి, శంకర్పల్లికి కాసాని వీరేష్ ముదిరాజ్, మొయినాబాద్ ఇన్చార్జిగా ముఠా జైసింహ, అమృత్లాల్ చౌహాన్ను నియమించారు. ఇబ్రహీంపట్నం రూరల్: రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం, ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, తాగునీరు, లైటింగ్, భద్రత, మౌలిక సదుపాయలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నవీన్రెడ్డి, ఆర్డీఓ సరిత, అధికారులు, మత పెద్దలు పాల్గొన్నారు. కడ్తాల్: బీదర్– మహేశ్వరం పవర్గ్రిడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ పనులను మండల కేంద్రంలో తాత్కాలికంగా నిలిపివేసేలా చూడాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. బీదర్–మహేశ్వరం 765 కేవీ పవర్గ్రిడ్ సంస్థ పోలీస్ బందోబస్తు పెట్టి రేయింబవళ్లు తమ వ్యవసాయ పొలాల్లో హైటెన్షన్ లైన్ పనులు చేస్తూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నవంబర్లో కేంద్ర విద్యుత్శాఖ మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరామని, మరోసారి కలిసి సమస్యను పరిష్కరించుకుని వచ్చే వరకు నెల రోజుల పాటు పనులు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో బాధిత రైతులు, నాయకులు పాల్గొన్నారు. లారీ బ్రేక్లు ఫెయిల్ తప్పిన పెనుప్రమాదం అబ్దుల్లాపూర్మెట్: విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్మెట్ కూడలిలో శని వారం ఘోర ప్రమాదం తప్పింది. ఓ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు డివైడర్తో పాటు హైమాస్ట్ లైట్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఎలాంటి ప్రాణన ష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీ ల్చుకున్నారు. వివరాలు.. ఉదయం 11గంటల సమయంలో హైదరాబాద్–నల్గొండ మార్గంలో లోడుతో వెళ్తున్న ఓ లారీ అబ్దుల్లాపూర్మెట్ కూడలి వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ రోడ్డు డివైడర్తో పాటు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. లారీ ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
35,23,219
క్రీడాపోటీలతో.. యువత క్రీడల్లోనూ రాణించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆర్థిక, సామాజిక అంశాల్లో తెలంగాణకే తలమానికంగా నిలిచిన జిల్లా ఓటర్ల నమోదు విషయంలోనూ ముందుంది. నగరానికి ఆనుకుని ఉన్న జిల్లాలో జనాభాతో పాటే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 24,46,265 మంది మాత్రమే ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య రెట్టింపైంది. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్నగర్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 ఏళ్లు నిండిన వారు 35,23,219 మంది ఉన్నారు. వీరిలో 18,22,366 మంది పురుషులు ఉండగా, 16,99,600 మంది మహిళలు ఉన్నారు. మరో 454 మంది ఇతరులు ఉన్నారు. వీరితో పాటు ఎన్ఆర్ఐ ఓటర్లు 207 మంది ఉండగా, సర్వీసు ఓటర్లు 592 మంది వరకు ఉన్నట్లు అంచనా. 526 పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, ఇక చేవెళ్ల, మొయినాబాద్, కొత్తూరు, షాద్నగర్, శంకర్పల్లి, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. అత్యధిక ఓటర్లు ఇక్కడే.. ఇదిలా ఉంటే.. తెలంగాణలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి ముందు వరుసలో (6,98,133 ఓటర్లు) ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాకు చెందిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గం (6,69,361 మంది ఓటర్లు) ఉంది. మూడో స్థానంలో మేడ్చల్ (5,95,536 మంది ఓటర్లు) ఉండగా, నాలుగో స్థానంలో ఎల్బీనగర్ (5,66,866 మంది ఓటర్లు) ఉంది. ఇక ఐదో స్థానంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం (5,52,455) ఉండటం విశేషం. ఈ ఐదు నియోజకవర్గాల పరిధిలోనే 30 లక్షల మందికిపైగా ఓటర్లు ఉండటం గమనార్హం. రెచ్చిపోయిన వీధి కుక్కలు ● నలుగురికి గాయాలు ● రెండు మేకలు మృత్యువాత యాచారం: మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో శనివారం వీధి కుక్కల దాడిలో నలుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎ.మణికుమార్, మంగమ్మ, సునీల్, కృష్ణవేణి తమ వ్యక్తిగత పనుల నిమిత్తం బయట ఉండగా వీధి కుక్కలు వారిపై దాడి చేసి గాయపరిచాయి. మరో ఘటనలో యాచారం గ్రామానికి చెందిన మస్కు యాదయ్య, కొండాపురం యాదయ్యకు చెందిన రెండు మేకలపై దాడి చేసి చంపివేసాయి. రూ.10 వేల చొప్పున నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు జిల్లాలో..మంది ఓటర్లు 526 గ్రామ పంచాయతీలు..7,94,653 మంది ఓటర్లు ఏడు మున్సిపాలిటీలు.. 1,75,974 మంది.. నేడు జాతీయ ఓటరు దినోత్సవం ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాలు, మండల కార్యాలయాలు, పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ నిర్వహించడం, ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించడం, కొత్తగా ఓటరుగా నమోదైన యువతకు ఈ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డులను అందజేయడం, ప్రజాస్వా మ్య పండుగలో భాగస్వాములవుతున్న సీనియర్ సిటిజన్లను సన్మానించడం జరుగుతుందని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ వేడుకల్లో ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
లాభాల పండుగ
● పది రోజుల్లో సంక్రాంతి జోష్ ● ఆర్టీసీకి దండిగా ఆదాయం ● షాద్నగర్ డిపో రాబడి రూ.2.18 కోట్లుషాద్నగర్: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వలస జీవులు, ఉద్యోగులు, పట్టణాల్లో నివాసం ఉంటున్నవారు సొంతూళ్లకు వెళ్లారు. సంతోషంగా పండుగ ముగించుకుని తిరిగి తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. పది రోజుల పాటు బస్సులు, బస్టాండ్లు జనంతో కిటకిటలాడాయి. పది రోజుల్లో రూ.2.18 కోట్లు సంక్రాంతిని పురస్కరించుకుని షాద్నగర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించారు. ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు నడిపించిన బస్సులతో భారీగా ఆదాయం సమకూరింది. పది రోజుల్లో 3,27,000 కిలోమీటర్లు తిరిగిన బస్సులతో 3,94,505 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో రూ.2.18 కోట్ల రాబడి వచ్చింది. పండగ సెలవుల ప్రారంభం రోజు 10న రూ.24 లక్షలు, చివరి రోజు 19న రూ.34 లక్షలకు పైగా సమకూరింది. మహిళా ప్రయాణికులే అధికం మహిళలకు ఉచిత బస్సు పథకంతో సంక్రాంతి వేళ భారీ సంఖ్యలో మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. పది రోజుల్లో మొత్తం 3,94,505 మంది ప్రయాణించగా అందులో మహిళలు 2,39,972 మంది ఉండడం గమనార్హం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపించాం. పది రోజుల్లో డిపోకు రూ.2.18 కోట్ల ఆదాయం వచ్చింది. మహిళా ప్రయాణికులు అధికంగా బస్సుల్లో ప్రయాణించారు. – ఉష, డిపో మేనేజర్, షాద్నగర్ -
ఓంకారేశ్వరాలయ భూములను తీసుకోవద్దు
యాచారం: ఓంకారేశ్వరాలయ భూములను పరిశ్రమల పేరుతో తీసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. టీజీఐఐసీ ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,100 ఎకరాల భూమిని సేకరించడాన్ని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ భూములు సాగు చేసుకుంటున్నా నందివనపర్తి, తాడిపర్తి, కుర్మిద్ద, నస్దిక్సింగారం కౌలు రైతులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేవాలయ భూముల జోలికి వెళ్లిన వారు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవన్నారు. ఆలయ భూముల్లో వందలాది మంది కౌలు రైతులు ఏళ్లుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని, నేడు ఆభూములను సేకరిస్తే వారికి జీవనోపాధి కరువవుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాషా, నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్త్యవత్ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి -
పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా..
● అదుపుతప్పిన బైక్ ● ఒకరు దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు మహేశ్వరం: బైక్ అదుపు తప్పి ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధిలోని మహేశ్వరం గేటు శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. వనస్థలిపురం రైతు బజార్కు చెందిన కడారి నరేశ్, కడారి కిరణ్ తమ స్నేహితుడు హరీశ్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బైక్పై మైసిగండి ఆలయానికి వెళ్లి తిరిగివస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మహేశ్వరం గేటు సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కిరణ్ బలమైన గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా, గాయపడిన నరేశ్ను తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరకుని వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడి వద్దకే వెళ్లి ఫిర్యాదును స్వీకరించారు. ఎస్ఐ రాఘవేందర్ మాట్లాడుతూ పోలీస్ పౌర కేంద్రిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. -
విద్యుత్ వైర్లు సరిచేయండి
● లేదంటే చర్యలు తప్పవు ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం: విద్యుత్ అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే మల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శేరిగూడలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ఆయనకు విద్యుత్ తీగలు భూమికి తగిలే ఎత్తులో ఉన్నాయంటూ మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ ఏడీఏ సీతారాం, ఏఈ జ యన్నలను పిలిచి మందలించారు. అభివృద్ధి విషయంలో ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. మీ దగ్గర నిధులు లేకుంటే చెప్పండి.. సొంత నిధులు వెచ్చిస్తానంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్ల తొలగించకుంటే తనకే నేరుగా చెప్పాలని మహిళలకు ఎమ్మెల్యే ఫోన్ నంబర్ ఇచ్చారు. -
ప్రజల భద్రతకు ప్రాధాన్యత
యాచారం: ప్రజల భద్రతే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందని, ఫ్యూచర్సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి స్వయంగా బైక్ నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి భద్రతకు సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే రాష్ట్ర స్థాయిలో పోలీస్ వ్యవస్థను ప్రజలకు దగ్గరకు తీసుకువచ్చేలా కొత్త కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ప్రయాణించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ, ఇబ్రహీంపట్నం, మంచాల సీఐలు నందీశ్వర్రెడ్డి, సత్యనారాయణ, మహేందర్రెడ్డి, మధు, యాచారం ఎస్ఐ మధు, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు నాథ్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
సిమెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా ‘భారతి’
అబ్దుల్లాపూర్మెట్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ ఫైవ్స్టార్ గ్రేడ్ తీసుకువచ్చిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. పెద్దఅంబర్పేటలోని లక్ష్మారెడ్డిపాలెంలో మైత్రి స్టీల్ హౌస్ డీలర్ షాప్లో శుక్రవారం తాపీ మేస్త్రీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు మరియు రహదారులకు సరైన ఎంపిక అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందచేస్తామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారన్నారు. ఈ సందర్భంగా బిల్డర్లకి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను 50 మందికి అందజేశారు. డీలర్ మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్ సర్వీస్ వేగవంతంగా ఉంటుందన్నారు. -
వీధికుక్కల కేసు విచారణ వేగిరం
యాచారం: వీధి కుక్కలకు విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపేసిన బాధ్యులపై కఠిన చర్యలకు స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జాతీయ స్థాయిలో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ వ్యవస్థపకురాలు, మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ తీవ్ర ఒత్తిళ్ల వల్లే యాచారం పోలీసులు కళేబరాలను గుర్తించారు. అంతే వేగంగా విచారణ చేపట్టి పశువైద్యాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు సైతం విచారణ వేగవంతం చేశారు. గ్రామస్తుల పెంపుడు కుక్కలకు సైతం విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపేయడంతో బాధితులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఫోన్లలో ఫిర్యాదు చేసారు. వారు మూడు రోజుల పాటు మనోవేదనతో, అన్నపానీయాలు సైతం తీసుకోలేదని తెలుస్తోంది. గ్రామస్తులు సమాచారంతో, స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు పంచాయతీ సిబ్బంది సహకారంతో పూర్తి సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే.. ఖననం చేసిన వీధి కుక్కల కళేబరాలను గురువారం వెలికి తీశారు. పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. యాచారం పశువైద్యాధికారి డాక్టర్ రేఖ ఆధ్వర్యంలో ఒక్కో కుక్క నుంచి నాలుగు నుంచి ఐదు సాంపిల్స్ సేకరించి పోలీసులకు అప్పగించారు. వారు రెడ్హిల్స్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతే కేసును వేగవంతంగా విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. వీధి కుక్కలను చంపేయడం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారగా, యాచారం పంచాయతీ పాలకవర్గం, సిబ్బందికి మాత్రం కంటికి కునుకు లేకుండా చేసింది.బాధ్యులపై చర్యలకు జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తున్న స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు -
ఆలయాలు మరింత అభివృద్ధి చెందాలి
శంకర్పల్లి: చెందిప్పలో మరకత శివాలయం, కొత్తగూడెంలోని పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయాలు మరింతగా అభివృద్ధి చెందాలని సినీ నటుడు సుమన్ ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన ఈ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల ప్రతిమ, శాలువాలతో సన్మానించారు. నటుడు సుమన్ మాట్లాడుతూ.. కొత్తగూడెంలోని పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయం, చెందిప్పలోని మరకత శివాలయాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన వెంట డబ్బింగ్ ఆర్టిస్ట్ కృష్ణవేణి ఉన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆలయ ధర్మాధికారి మాధవరెడ్డి, చెందిప్ప ఆలయ ధర్మకర్త వీడియో రావు, ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్రాజు, ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు సదానందం గౌడ్, శేఖర్, దర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయాన్ని సందర్శించిన సినీ నటుడు సుమన్ -
సాగుపై అవగాహన అవసరం
● భూ పరిరక్షణనకు కృషి చేయాలి ● వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత ఇబ్రహీంపట్నం రూరల్: భూ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత విద్యార్థులకు సూచించారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి కొంగరకలాన్ జెడ్పీహెచ్ఎస్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోషల్ సాయిల్ హెల్త్ కార్యక్రమం నిర్వహించారు. 7వ, 8వ, 9వ తరగతి విద్యార్థులకు భూసారం ప్రాధాన్యత, భూమి, పంటల సంబంధం, భూసార పరిరక్షణ నిమిత్తం సాంపిల్ సేకరించే పద్ధతులను కిట్ ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్ పరిరక్షించే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితులుగా విచ్చేసిన వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత , కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా శాస్త్రవేత్త దిలీప్ మాట్లాడుతూ వ్యవసాయం, పంటలు పండించే విధానాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. భూసార పరీక్షలు, నేలల పరిరక్షణ అవసరమన్నారు. సేంద్రియ ఎరువులు వాడకంతో భూసారం పెరుగుతుందని చెప్పారు. పంటల మార్పిడి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి విద్యాధరి, ఏఓ శ్రవణ్కుమార్, హెచ్ఎం రాజేశ్వర్రెడ్డి, రైతులు రవీందర్, ఎం.శేఖర్గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆరుట్ల బడిని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
మంచాల: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి శుక్రవారం ఆయన పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, క్రీడా స్థలం, విద్యాబోధన తీరును ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడేలా విద్యా బోధన అందించాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ గౌడ్, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతిఒక్కరూ బాధ్యతగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అనంతరం అధికారుతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, గ్రామీణాబివృద్ధి అధికారి శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తల్లిని చంపిన తనయుడికి జీవిత ఖైదు
ఇబ్రహీంపట్నం రూరల్: తాగుడుకు బానిసై తల్లిని హత్యచేసిన కొడుకుకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. ఠాణా పరిధిలోని కొంగరకలాన్కు చెందిన కోహెడ పెంటయ్య(29) మద్యానికి బానిసయ్యాడు. 2024 ఫిబ్రవరి 9న తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తల్లి లలిత(55)తో గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో తల్లి ఛాతిపై కూర్చుని మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి అంతమొందించాడు. మృతురాలి బావ కొడుకు నర్సింహ ఫిర్యాదు మేరకు పోలీసులు పెంటయ్యను రిమాండ్కు తరలించారు. కోర్టులో సాక్షాధారాలను ప్రవేశపెట్టిన పిదప అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శోభరాణి, వేణుగోపాల్రెడ్డిలు ప్రాసిక్యూషన్ తరుపున వాదించగా 15వ అడిషనల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి రంగారెడ్డి వాదోపవాదనలు వినిపించిన తరువాత కోహెడ పెంటయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.వేయి జరిమాన విధిస్తూతీర్పు వెల్లడించారు. కేసుకు సహకరించిన అప్పటి సీఐ రాఘవేందర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస రాజులతో పాటు పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు . నాగారం హత్య కేసులో.. మహేశ్వరం: మండల పరిధిలోని నాగారంలో జరిగిన హత్య కేసులో గ్రామానికి చెందిన కావలి మచ్చేందర్కు శుక్రవారం ఎల్బీనగర్ 3వ అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో నాగారం గ్రామానికి చెందిన కావలి కావలి శంకరయ్య కుమారుడు కావలి కృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన తొట్ల రాజు హత్య చేశాడని మృతుడి సోదరుడు కావలి మచ్చేందర్, తండ్రి శంకరయ్య పగ పెంచుకున్నారు. గ్రామ చౌరస్తాలోని తొట్ల రాజు హోటల్ వద్ద నిలుచుండగా మచ్చేందర్, శంకరయ్య గొడ్డలితో నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి తండ్రి తొట్ల నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. పోలీసులు నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో ఇరువురు వాదనలు పూర్తయిన తరువాత ఎల్బీనగర్ 3వ అదనపు జిల్లా కోర్టు ప్రధాన నిందితుడైన కావలి మచ్చేందర్కు జీవిత ఖైదు విధిస్తూ, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆర్టీసీ బస్సునుఢీకొట్టిన లారీ బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు బాలుడికి గాయాలు తాండూరు టౌన్: అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు ఓ బాలుడు గాయపడ్డారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చేటుచేసుకుంది. సీఐ సంతోశ్కుమార్ తెలిపిన ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన బస్సు మెట్లకుంటకు వెళ్లేందుకు బస్టాండ్నుంచి బయటకు వస్తోంది. ఈ క్రమంలో కొడంగల్ రోడ్డు నుంచి ఇందిరాచౌక్వైపు ప్రయాణిస్తున్న లారీ వేగంగా బస్సును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో బస్సు, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన డ్రైవర్ నారాయ ణ, కండక్టర్ యాదమ్మ, బాలుడికి గాయాలవడంతో స్థానికులు వారిని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బ స్సులో 11మంది ప్రయాణికులున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో రైతులకు మేలు నవాబుపేట: సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో రైతులకు మేలు చేకూరుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. వ్యవసాయ పరికరాలను తీసుకున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్నాయక్, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులు లేకుండా మట్టి రవాణా
చేవెళ్ల: అర్ధరాత్రి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని కందవాడ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోనలి కందవాడ టైర్ల కంపెనీ సమీపంలోని ఓ భూమి నుంచి మట్టి తవ్వి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా రెండు టిప్పర్లలో మట్టి లోడ్ చేయగా మరో మూడు ఖాళీగా ఉన్నాయి. అక్కడే సూపర్వైజర్గా పనిచేస్తున్న వడ్డె యాదయ్యను ప్రశ్నించగా ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు. అనుమతి పత్రాలు చూపలేదు. దీంతో సూపర్ వైజర్తోపాటు డ్రైవర్లను అరెస్ట్ చేసి టిప్పర్లను స్టేషన్ను తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్ షాబాద్: ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ను చేవెళ్ల ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని పోతుగల్కు చెందిన కరుణాకర్రెడ్డి మరికొందరు సిండికేట్గా మారి పోతుగల్ తండా శివారులోని ప్రభుత్వ లావాని భూముల్లో జేసీబీతో మట్టిని తవ్వి మట్టి తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న ఈ తంతును గమనించిన ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఓ టిప్పర్ను పట్టుకున్నారు. లోడ్తో ఉన్న టిప్పర్తో పాటు డ్రైవర్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని షాబాద్ పోలీసులకు అప్పగించామన్నారు. టిప్పర్ యజ మాని కరుణాకర్రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐదు లారీలు సీజ్.. డ్రైవర్లు అరెస్ట్ -
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీవద్దు
కడ్తాల్: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, పుటేజీల నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెట్రోలింగ్ను పటిష్టం చేసి, నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్ఐ వరప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు -
చెట్టును ఢీకొట్టిన ఆటో
ఒకరి మృతి, పలువురికి గాయాలు శంకర్పల్లి: అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం దేవరంపల్లి, చక్రంపల్లి గ్రామాలకు చెందిన 8 మంది గచ్చిబౌలిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సాయంత్రం గచ్చిబౌలిలో విధులు ముగించుకున్న ఆటో మోమిన్పేట్కు బయలు దేరారు. శంకర్పల్లిలో పర్వేద గ్రామానికి చెందిన చంద్రయ్య(50) ఆటోలో ఎక్కాడు. మహాలింగాపురం వద్ద ఆటో చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా, దేవరంపల్లికి చెందిన అశోక్ కాలు విరిగింది. మిగిలిన వారికి పాక్షిక గాయాలు కాగా.. వారిని శంకర్పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ దివాకర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రెండు రోజుల్లో సర్వే పూర్తిమంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్ ఇబ్రహీంపట్నం రూరల్: అడవుల్లో జంతువుల సౌకర్యాలు, పెరుగుతున్న అటవీ సందపను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని మంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్ అన్నారు. ఆల్ ఇండియా పులుల గణన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి అడవుల్లోని శాఖాహార, మాంసాహార జంతువుల సర్వే చేపట్టారు. మండల పరిధిలోని ఎల్మినేడు బీట్లో సెక్షన్ అధికారి లావణ్య ఆధ్వర్యంలో ఈ గణన కొనసాగుతోంది. మూడో రోజు మంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ.. మన ప్రాంతంలో పులులు లేవన్నారు. మాంసాహార జంతువుల పాద ముద్రలు, మలం ఆధారంగా గుర్తిస్తున్నామని చెప్పారు. నక్క, అడవి పిల్లులు ఎక్కువగా సంచరిస్తున్నాయని వివరించారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తి అవుతుందన్నారు. -
పేదల లబ్ధికే ‘జీ రామ్జీ’
చేవెళ్ల: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మేలు చేసేందుకు, వారి ఉపాధికి ఆర్థిక భరోసా కల్పించేందుకే కేంద్రం జీ రామ్ జీ పథకాన్ని చట్టంగా చేసి మీ ముందుకు తీసుకు వస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు పంచాయతీ వద్ద సర్పంచ్ కౌలంపేట భాగ్యమ్మశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం మరింత పక్కాగా 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచి జీరామ్జీ పథకంగా తెచ్చిందని తెలిపారు. ఇది కూలీలకు ఉపాధి తోపాటు గ్రామాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ పథకం పక్కాగా అమలైతే గ్రామీణ స్థాయివరకు బీజేపీ మరింత బలోపేతం అవుతుందనే కాంగ్రెస్పార్టీ దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆలూరు కార్యక్రమానికి వస్తున్న ఎంపీ చేవెళ్ల బస్స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. గతంలో ఆలూరు గేట్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు ఆగేలా చూడాలని గ్రామస్తులు కోరడంతో ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఒప్పించారు. ఈ క్రమంలో స్వయంగా పరిశీలించేందుకు బస్సులో వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, ఆంజనేయులు, శర్వలింగం, ఇంద్రసేనారెడ్డి, సత్యనారాయణ, జయశంకర్ పాల్గొన్నారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
ఉదయం కాంగ్రెస్.. సాయంత్రం బీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొంతమంది నేతలు పార్టీల కండువాలను వేగంగా మార్చేస్తున్నారు. ఉదయం ఒక పార్టీలో, సాయంత్రం మరో పార్టీలో చేరుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి లోని 21వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి మల్లారెడ్డి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ, సాయంత్రం తిరిగి బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరు ఎన్ని పార్టీలు మారుస్తారోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. సాయంత్రం బీఆర్ఎస్ నేత ప్రశాంత్రెడ్డి సమక్షంలో తిరిగి గులాబీ కండువాతో .. ఉదయం ఎమ్మెల్యే మల్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాతో మల్లారెడ్డి -
ఆదుపుతప్పిన బైక్
ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు ఆమనగల్లు: బైక్ అదుపుతప్పడంతో ద్విచక్రవాహనదారుడు గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని చుక్కాపూర్ సమీపంలో ఆమనగల్లు–షాద్నగర్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. కడ్తాల మండలం ముద్వీన్ గ్రామానికి చెందిన వీరాచారి తలకొండపల్లి–ఆమనగల్లు మార్గంలో ప్రయాణిస్తుండగా చుక్కాపూర్ సమీపంలో అడవిపంది అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో వీరాచారికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్లో ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం నగరంలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేశంపేట: గుర్తుతెలియని వృద్ధురాలు శుక్రవారం మండల పరిధిలోని కాకునూర్కు వచ్చింది. ఆమె వివరాలను తెలుసుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా అమె మతిస్థిమితం సరిగా లేక పొంతన లేని సమాధానాలు ఇస్తోంది. వృద్ధురాలిని గుర్తించిన వారు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అబ్దుల్లాపూర్మెట్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కోహెడా రెవె న్యూ పరిధిలోని మణికంఠ రియల్ ఎస్టేట్ సమీపంలో ఓవ్యక్తి మృతిచెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి వయస్సు 55–60 ఏళ్ల మధ్య ఉంటుందని, యాచకుడిగా జీవనం సాగిస్తూ అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య
తుర్కయంజాల్: పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. తొర్రూర్ డివిజన్ పరిధి కమ్మగూడలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిబట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ వజ్రమ్మ, మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్రూరల్: గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్య రాకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మిషన్ భగీరథ జిల్లా అధికారి హారిక అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల లైన్మెన్లకు తాగునీటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారి వెంకటేశ్వర్రావు, మండల విద్యాధికారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: పశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా పశువైద్యాధికారి ఎం.మధుసూదన్ అన్నారు. మొయినాబాద్, అమ్డాపూర్ పశువైద్య కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పశువులకు ఇచ్చే నట్టల నివారణ మందులు, గాలికుంటు నివారణ టీకాలుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీటిపై గ్రామాల్లో ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. మండలంలో పశుపోషణ, జీవాల పెంపకానికి సంబంధించిన వివరాలను వైద్యాధికారులు అహ్మద్, దేవిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్ఓ సుధాకర్గౌడ్ ఉన్నారు. షాద్నగర్రూరల్: సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించినట్టు గురుకులాల రీజనల్ కో ఆర్డినేటర్ నాగార్జునరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి, ఆరె నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు మీ సేవ కేంద్రాలు, అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
సహనానికి పరీక్ష!
హుడాకాంప్లెక్స్: పరీక్షల వేళ ఇంటర్ విద్యార్థులకు పస్తులు తప్పడం లేదు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు కాలేజీలోనే ఉండాల్సి వస్తోంది. ఉదయం తొమ్మిది గంటలకు ఇంట్లో టిఫిన్ చేసి, కాలేజీకి చేరుకున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్నం లంచ్ కూడా వారే సమకూర్చుకోవాల్సి వస్తోంది. సాయంత్రం తినేందుకు స్నాక్స్ కూడా లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వస్తోంది. ఎవరికి వారే.. సాధారణంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. టెన్త్ విద్యార్థులకు స్థానిక దాతల సాయంతో సాయంత్రం స్నాక్స్ సైతం సరఫరా చేస్తున్నారు. జి ల్లా వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న సుమారు పదివేల మంది విద్యార్థులకు మాత్రం ఇవేవీ అందడం లేదు. ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం ఇలా అన్ని వేళల్లో నూ వారే ఆహారాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఖాళీ కడుపుతో గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంట్లో తల్లిదండ్రులు వేళకు వంట చేయకపోవడంతో పలువురు విద్యార్థులు ఏమీ తినకుండా కాలేజీలకు వస్తున్నారు. ఆకలేసినప్పడు మంచినీళ్లతో కడుపు నింపుకొంటున్నారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నీ సమకూర్చుతున్న ప్రభుత్వం డే స్కాలర్ విద్యార్థులను పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేళకు భోజనం చేయకపోవడం, గంటల తరబడి ఖాళీ కడుపుతో ఉండటంతో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తి.. తీరా పరీక్షల ముందు కడుపు నొప్పితో చదువుకు దూరం అవుతున్నారు. స్నాక్స్ ఇస్తే బెటర్ కాలేజీలో 651 మంది వర కు విద్యార్థులు ఉన్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. స్నాక్స్ లేకపోవడంతో సాయంత్రం 4.30 వరకే కాలేజీలో ఉంచుతున్నాం. స్నాక్స్ సమకూరిస్తే మరో గంటపాటు అదనంగా చదివించే అవకాశం ఉంది. – అనురాధ, ప్రిన్సిపాల్, సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆకలితో చదవలేక పోతున్నాం కాలేజీకి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతు న్నాం. ఇంటి నుంచి తీసుకొచ్చిన లంచ్బాక్స్ మధ్యాహ్నం వరకు పాడవుతుండడంతో తినలేక పోతున్నాం. సాయంత్రం 4.30 వరకు కాలేజీలోనే ఉండాల్సి వస్తోంది. ఆకలితో ఏకగ్రత కోల్పోయి చదవలేక పోతున్నాం. మధ్యాహ్నం, సాయంత్రం తినేందుకు ఏదైనా ఆహారం సమకూరిస్తే బాగుంటుంది. – నందిని, ఇంటర్మీడియట్ విద్యార్థి -
అన్ని వసతులతో డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూం ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం ఆదేశించారు. గురవారం కర్మన్ఘాట్ నందనవనం కాలనీ, మల్లాపూర్, కుర్మలగూడ, బాటసింగారం, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఇళ్ల పనులను పరిశీలించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాల, వైద్య సదుపాయాలు, పార్కుల వంటివి కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కాలనీల్లో జీవనప్రమాణాలతో నివసించేందుకు వీలుగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలన్నారు. వచ్చే రెండు నెలల్లో లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నందనవనంలో పునరావాసంలో భాగంగా నిర్మించిన 2 బీహెచ్కే 80 (2బ్లాక్లను) ఫ్లాట్లను ఆయన పరిశీలించారు. పూర్తయిన ఇళ్లను వారం రోజుల్లో లాటరీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులకు అందించాలని సూచించారు. తర్వాత మల్లాపూర్లో నిర్మాణంలో ఉన్న 17 బ్లాక్ల్లో పనులను సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్లోని భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలని, హైడ్రా అధికారుల సహాయం తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. సెప్టెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి కావాల్సిందే అని స్పష్టం చేస్తూ, అందుకు తగ్గట్లుగా పనులన్నిటినీ ప్రణాళిక బద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కుర్మల్గూడలో పూర్తి కావస్తు న్న 1,536 ఫ్లాట్స్ పనులను పరిశీలించి, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల పనులను మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. బాటసింగారంలోని 20 బ్లాక్ల నిర్మాణాలను చూసి పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఖాళీగా ఉన్న ఇళ్లను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఎం.చైతన్య కుమార్, పి.బలరాం, జి.విజయకుమార్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డి.చంప్లానాయక్ జీహెచ్ఎంసీ అధికారులు పి.వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో పీజీ వరకు ఉచిత విద్య
యాచారం: రాష్ట్రంలోని గురుకులాల్లో పేద విద్యార్థులకు ఐదో తరగతి నుంచి పీజీ వరకు వసతితో కూడిన ఉచిత విద్య అందిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్ పేర్కొన్నారు. టీజీ సెట్ అడ్మిషన్లపై గురువారం తాడిపర్తి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1,023 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు ఉన్నట్టు తెలిపారు. వీటిలో ఏటా 55 వేల వరకు ఐదో తరగతిలో అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. గురుకులాల్లో ఖాళీ సీట్ల కోసం ఈనెల 25 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాల్లో ఐదో నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టీజీ సెట్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారి నిర్మల, సర్పంచ్ నీలం ఝాన్సీ, ఉప సర్పంచ్ రమేష్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు లీలావతి, రామయ్య, నాగేశ్వర్రావు, శ్రీనివాస్, సీనియర్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు. -
వినియోగం విరివిగా..
గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ టీజీఎస్పీడీసీఎల్ వేసవి కార్యాచరణ సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో నమోదు కావాల్సిన విద్యుత్ డిమాండ్ జనవరి మూడో వారంలోనే వెలుగు చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఏప్రిల్ చివరి నాటికి గ్రేటర్ ఫీక్ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగా వాట్లకు చేరుకోనున్నట్లు డిస్కం అంచనా వేసింది. వేసవి కార్యాచరణలో భాగంగా ఇప్పటికే ఓవర్ లోడుతో ఉన్న సబ్స్టేషన్లు/ ఫీడర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ఆ మేరకు వాటి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రతి నెలా 35 వేల కొత్త కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 67.95 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 55.98 లక్షల గృహ, 9.15 లక్షల వాణిజ్య, 38 వేల పారిశ్రామిక, 1.53 లక్షల వ్యవసాయ, మరో 90 వేలకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల కనెక్షన్లు ఉంటున్నాయి. ఈసారి వేసవి ఎండలు భగ్గున మండే అవకాశం ఉండటంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. సబ్స్టేషన్లలోని పీటీఆర్లు, ఫీడర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంచే పనిలో నిమగ్నమైంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టం చేశారు. తేదీ మెగావాట్లు 18 2675 19 3196 20 3345 21 3385 22 3375 సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేపట్టే అదనపు పనులు జోన్ల వారీగా.. అంశం మెట్రో మేడ్చల్ రంగారెడ్డి కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 716 1483 1158 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు 36 58 69 కొత్తగా ఏర్పాటు చేయనున్న 11 కేవీ ఫీడర్లు 122 187 218 కొత్తగా ఏర్పాటు చేయనున్న 33 కేవీ ఫీడర్లు 37 28 53 -
బస్తా కోసం.. కుస్తీ
యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఉదయాన్నే క్యూ లైన్లలో నిలబడి.. టోకెన్లు తీసుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.. ఒక్క బస్తానైనా దొరక్క పోతుందా అని కుస్తీ పడుతున్నారు.. గురువారం మంచాల పీఏసీఎస్ కార్యాలయానికి లోడ్ రాగానే అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. గంటల పాటు ఎదురు చూసినా కొందరికి ఒకే బస్తా దొరకగా.. మరికొంద రికి రిక్త హస్తమే ఎదురైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు సర్దిచెప్పి పంపించారు. – మంచాల -
పడుతూ.. లేస్తూ.. బడికి!
● ఆర్టీసీ బస్సులు అంతంతే.. ● ప్రైవేటు వాహనాలే దిక్కు ● విద్యార్థులకు తప్పని తిప్పలు చేవెళ్ల: చదువుల కోసం విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. నిత్యం పాఠశాలలకు వెళ్లేందుకు అటు సరైన రవాణా సదుపాయం లేక.. ఇటు రోడ్లు బాగాలేక అవస్థలు పడుతున్నారు. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు వెళ్లే వారితో బస్సులు రద్దీగా ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో సమయానికి అనుకూలంగా లేకపోవడంతో ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. మరికొన్ని గ్రామాలకై తే కనీసం బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్నారు. మరికొంతమంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మండలంలో మొత్తం 25 పంచాయతీలు, 11 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. సగానికిపైగా పంచాయతీల్లో ఆటోలను నమ్ముకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఇక రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనాల్లో ప్రయాణం ఇబ్బందిగా మారింది. నిత్యం ఈ రోడ్లపై దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నారు. బస్సులు రాక.. బడికి వెళ్లలేక.. ధారూరు: పాఠశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు రాక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం చింతకుంట, హరిదాస్పల్లి, అల్లీపూర్, అవుసుపల్లి, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్ తండా, స్టేషన్ ధారూరు నుంచి మండల కేంద్రమైన ధారూరులోని ప్రాథమికోన్నత పాఠశాలకు దాదాపు 20 మంది విద్యార్థులు వస్తుంటారు. చిన్నారులు ఎదుర్కొంటున్న బస్సు సమస్యలపై గురువారం శ్రీసాక్షిశ్రీ పరిశీలించగా పలు విషయాలు వెలుగు చూశాయి. ఉదయం అష్టకష్టాలు పడి స్కూల్కి వెళ్లిన రాంపూర్తండా విద్యార్థులు.. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ధారూరు చౌరస్తాలో బస్సుల కోసం దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బస్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో గ్రామానికి వెళ్లారు. మరి కొందరు ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగి వెళ్లారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతి రోజూ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. ఒక్కోసారి చీకటి పడిన తర్వాత గ్రామానికి చేరుకోవాల్సి వస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు వచ్చినా పాయింట్ వద్ద ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధారూరు: చౌరస్తాలో బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు చేవెళ్ల: ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్న విద్యార్థులు -
బలవంతపు భూ సేకరణ సహించం
షాబాద్: దళిత రైతుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. రేగడిదోస్వాడలో గురువారం నిర్వహించిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా పేదల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. దళితుల భూములు ఎందుకోసం తీసుకుంటున్నారో.. ఏం కంపెనీలు పెడతారో.. ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా ఆక్రమించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాబాద్ మండలం రేగడిదోస్వాడ, తాళ్లపల్లి, మక్తగూడ, తిమ్మారెడ్డిగూడ, వెంకమ్మగూడ గ్రామాలకు చెందిన దళిత రైతుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకించారు. ఈశా ఫౌండేషన్ కోసం భూములు ఇవ్వడానికి పేదల భూములే దొరికాయా, ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించవచ్చు కదా అని నిలదీశారు. చేవెళ్ల సాక్షిగా మల్లికార్జునఖర్గే సమక్షంలో పేదల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమిని లాక్కోవాలని చూశారని గుర్తు చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు న్యాయం జరిగేదాక పోరాడతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు విజయ ఆర్య క్షత్రియ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, దేశమల్ల ఆంజనేయులు, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచ్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
ఎకరాకు రూ.30 లక్షల పరిహారం
కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న మండలంలోని ముద్వీన్ రెవెన్యూ పరిధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల భూ నిర్వాసితులు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ నారాయణరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ బాధితులు పరిహారానికి సంబంధించి తమ డిమాండ్లను కలెక్టర్కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి స్పందిస్తూ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం అందించే ప్యాకేజీని ప్రకటించారు. ఎకరాకు రూ.30 లక్షల నగదు పరిహారంతో పాటు, భూములు కోల్పోతున్న రైతులకు మైసిగండి గ్రామ సమీపంలో 120 గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మిస్తామని చెప్పారు. అదే విధంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక్కోక్కరికి రూ.ఐదు లక్షల చొప్పున అదనపు సాయం అందిస్తామని వివరించారు. రోడ్డు బాగు చేయించండి సారూ అనంతరం మర్రిపల్లి నుంచి ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారి, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మర్రిపల్లి సర్పంచ్ ఈర్లపల్లి రవి కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ రోడ్డును త్వరితగతిన మరమ్మతులు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. సమావేశంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, భూ నిర్వాసితులు వీరయ్య, పెద్దయ్య, రంగారెడ్డి, శంకర్, శివ, వెంకటయ్య, శ్రీనయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూ బాధితులకు కలెక్టర్ హామీ -
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు
అబ్దుల్లాపూర్మెట్: స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న ఓ యువకుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని కవాడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండారి సురేశ్(31) ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. గురువారం స్నేహితులతో కలిసి ఆయన కుంట్లూర్లోని ఓ క్రీడా మైదానంలో సరదాగా క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతని స్నేహితులు పక్కన కూర్చోపెట్టి విశ్రాంతి తీసుకోమన్నారు. అనంతరం కవాడిపల్లిలోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటివరకూ బాగానే ఉన్న సురేశ్ మరోసారి అస్వస్థతలకు గురికావడంతో స్థానికులు అబ్దుల్లాపూర్మెట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు ఏడాది క్రితమే వివాహం అయింది. యువ నాయకుడు గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తీవ్ర అస్వస్థతతో వార్డు సభ్యుడి మృతి -
మంచి నేలలతో ఆరోగ్యకర పంటలు
చేవెళ్ల: మంచి నేలలతోనే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ దిలీప్, డాక్టర్ హిమబిందు అన్నారు. పట్టణ కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నేల ఆరోగ్యం, సారవంతమైన భూమి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేల ఆరోగ్యం, పంట ఉత్పాదకతలో నేల పాత్ర గురించి వివరించారు. నేల పోషకాలు నేల సంతానోత్పత్తి నిర్వహణ, భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి.మహేశ్వర్రావు, వినోద్కుమార్, ఏఓ శంకర్లాల్, మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వేగంగా ఇంటిగ్రేటెడ్!
● కొందుర్గులో యంగ్ ఇండియారెసిడెన్షియల్ పాఠశాల ● కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు ● అన్ని వర్గాలకు ఒకేచోట విద్యాబోధన షాద్నగర్: పల్లె ప్రకృతి ఒడిలో.. చదువుల కోవెలను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో కూడిన గురుకులానికి సీఎం రేవంత్రెడ్డి షాద్నగర్ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.150 కోట్లతో నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కొందుర్గు తూర్పు శివారులోని సర్వే నంబర్ 109లో సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనికి 2024 అక్టోబర్ 11న సీఎం రేవంత్రెడ్డి భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టే స్థలాన్ని చదును చేసి 10 ఎకరాల విస్తీర్ణంలో పునాదులను బేస్మెంట్ లెవల్ వరకు పిల్లర్లు పూర్తి చేశారు. మిగితా సెంట్రింగ్ పనులు కొనసాగుతున్నాయి. పనులు చురుకుగా చేపట్టేందుకు నిర్మాణం చేస్తున్న ప్రదేశంలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణం పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రతి నియోజకవర్గంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాలమైన ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదులే కాకుండా అంతర్జాతీయ స్కూల్స్తో సమానంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. విద్యార్థులకు ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యనభ్యసించుతారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందనుంది. నాణ్యమైన విద్య ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలో అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందుతుంది. ఈ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి సూచనలు ఇస్తున్నా. – వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్నగర్ -
సురక్షిత ప్రయాణానికే ‘అరైవ్–అలైవ్’
చేవెళ్ల: సురక్షిత ప్రయాణానికే పోలీస్ శాఖ ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం చేపట్టిందని చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉపాధ్యాయ విజయ్కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. బుధవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో చేవెళ్ల కోర్టు, ప్రభుత్వ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం వద్ద అరైవ్–అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి పూలు, పెన్నులు ఇస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ శిరీష, పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మెరుగైన పరిహారం ● నాగిరెడ్డిపల్లి బాధితులకు ఎకరాకు రూ.1.20 కోట్లు ● కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి మహేశ్వరం: ఐటీ పార్కు ఏర్పాటులో భూములు కోల్పోతున్న నాగిరెడ్డిపల్లి రైతులకు ఎకరాకు రూ.1.20 కోట్లతో పాటు 121 గజాల ప్లాటును పరిహారంగా అందజేస్తామని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గ్రామంలో బాధిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహేశ్వరం మండల పరిధిలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 9, 10, 48, 49, 50, 51, 53, 54, 63, 66, 110, 144, 162, 163 సర్వే నంబర్లలో 195.5 ఎకరాల సీలింగ్ భూమిని సేకరిస్తున్నామని చెప్పారు. పరిహారం నేరుగా రైతుల ఖాతాలో జమచేస్తామన్నారు. ఇప్పటికే పలువురు రైతులు అంగీకారం తెలుపుతూ పత్రాలు అందజేశారని.. మిగిలిన రైతులు అందజేస్తే పరిహారం అందజేస్తామన్నారు. కాగా రైతులు పరిహారం పెంచాలని కోరగా.. ఇప్పటికే మూడింతల కంటే ఎక్కువ పరిహారం అంజేస్తున్నామని.. పెంచేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వర్ణకుమారి, జీపీఓ స్వప్న, సర్పంచ్ బామిని నాయక్, ఉప సర్పంచ్ జగన్, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు. జీపీఓఏటీజీ వర్కింగ్ ప్రెసిడెంట్గా భాస్కర్ మంచాల: గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ(జీపీఓఏటీజీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా యాట భాస్కర్ నియమితులైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాపాలకు చెందిన ఆయన యాచారం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
మా గ్రామంలో బెల్టుషాపులు వద్దు
కొందుర్గులో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్తులు కొందుర్గు: మండల కేంద్రమైన కొందుర్గులో బెల్టు దుకాణాల తొలగింపునకు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని కాలనీల్లో కిరాణ దుకాణాల్లో మద్యం విక్రయిస్తున్నారని, వాటిని తొలగించాలని గ్రామస్తులు కోరారు. బెల్టు షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బెల్టు దుకాణాలు తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం వైన్స్ షాపులకు వెళ్లి బెల్టు దుకాణాలకు మద్యం విక్రయించవద్దని సూచించారు. అనంతరం తహసీల్దార్ ఆజాం అలీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి
మాజీ మంత్రి సబితారెడ్డి శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఆమె నివాసంలో మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ దండు సంతోశ్, మహేశ్ సబితారెడ్డి, యువనేత కార్తీక్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీల అమలులో విఫలమైన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో శంకర్పల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, నాయకులు నర్సింలు, ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రైవేట్ బడులపై చర్యలు తీసుకోండి
తుర్కయంజాల్: వసంత పంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించిన కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి పి.శివకుమార్గౌడ్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పండుగల పేర్లను చెప్పి, ప్రజలను సెంటిమెంట్తో రెచ్చగొట్టి అడ్మిషన్లు ప్రారంభించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పూర్తిగా విస్మరిస్తూ, ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వేదికగా, భారీ ఫ్లెక్సీలతో పలు పాఠశాలలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయని గుర్తుచేశారు. వసంత పంచమి పేరుతో జరుగుతున్న అడ్మిషన్ల దందాపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరికృష్ణానాయక్, శివ, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి శివకుమార్గౌడ్ వసంత పంచమి పేరుతో అడ్మిషన్లు చేపడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి– ఏఐవైఎఫ్ -
పాత సిబ్బందినే కొనసాగించండి
మంచాల: మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో కొన్నేళ్లుగా వంట చేస్తున్న కార్మికులను మాత్రమే కొనసాగించాలని సీఐటీయూ(మధ్యాహ్న భోజన పథకం యూనియన్) జిల్లా అధ్యక్షురాలు వై.స్వప్న అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానోపాధ్యాయుడు గిరధర్గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అన్ని పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారిందన్నారు. అధికారులు కొత్తగా వంట సిబ్బందిని తీసుకోవాలనే నిర్ణయం విరమించుకోవాలన్నారు. పాత సిబ్బంది 20 ఏళ్లుగా అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించారని చెప్పారు. నేడు పాత వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజనం పథకం యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, సరిత తదితరులు పాల్గొన్నారు. -
మల్బరీ సాగుతో సుస్థిర ఆదాయం
ఆమనగల్లు: రైతులు సంప్రదాయ పంటలతో పాటు మల్బరీ సాగు చేసి ఏడాది పొడవునా సుస్థిర ఆధాయం పొందవచ్చని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. తలకొండపల్లి మండలం కోరింతకుంటతండాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమ రిసోర్స్ సెంటర్ను బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పండ్ల తోటలు, కూరగాయలు, పట్టు పరిశ్రమ, ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన, మల్బరీ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సబ్సిడీలు అందిస్తున్నాయని చెప్పారు. వీటిని వినియోగించుకుని రైతులు మల్బరీ సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆరుతడి పంటలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. పట్టుసాగుతో స్వల్ప కాలంలో దిగుబడి చేతికి వస్తుందని, మార్కెటింగ్కు ఇబ్బందులు ఉండవని ఆమె సూచించారు. పట్టుసాగుపై జిల్లాలో ఇటీవల రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత, జిల్లా అధికారి సురేశ్, ఏడీ నాగరత్నం, రిసోర్స్ సెంటర్ నిర్వాహకుడు సక్రునాయక్, అధికారులు హిమబిందు, సౌమ్య పాల్గొన్నారు.రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా -
ఉపాధి హామీ పేరు మార్పు అన్యాయం
షాబాద్: పూర్వపు ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చి కేంద్రం ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీంభరత్ ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం మండల పరిధిలోని కుర్వగూడ ఉపాధిహామీ కూలీలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఉన్న పథకాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగా గాంధీజీ పేరు తొలగించిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకురాళ్లు స్వరూప, అశ్విని, మహేశ్వరి, కవిత, అమృత తదితరులున్నారు. -
భారతి సిమెంట్తో నిర్మాణం వేగం
బడంగ్పేట్: సిమెంట్ రంగంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5 స్టార్ గ్రేడ్ను తెలంగాణలో విడుదల చేసిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. బుధవారం బడంగ్పేటలోని కనకదుర్గ స్టీల్ హౌస్లో తాపీమేసీ్త్రల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫస్ట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జీలు, రహదారులకు సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందచేస్తామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడతారని తెలిపారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్ రూ.20 రూపాయలు అధికంగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా బిల్డర్లకి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను 20 మందికి అందజేశారు. కార్యక్రమంలో డీలర్ కొండల్రెడ్డి, కాంట్రాక్టర్లు, తాపీమేసీ్త్రలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగిరం చేయండి మంచాల: తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి పనులను వేగిరం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం ఆయన పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల మైదానంలో అదనంగా రెండు అంతస్తుల భవనాలు, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు అథ్లెటిక్స్కు అనుగుణంగా మైదానం ఏర్పాటు చేయాలన్నారు. మైదానంలోని విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, పాల్గొన్నారు. -
అయ్యసాగరంలో హెర్బల్ పార్క్ ఏర్పాటు
ఎఫ్ఆర్ఓ వెంకటయ్యగౌడ్ ఆమనగల్లు: అయ్యసాగరం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల్లో హెర్బల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని ఆమనగల్లు అటవీశాఖ రేంజ్ అధికారి వెంకటయ్యగౌడ్ అన్నారు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. డీఎఫ్ఓ రోహిత్ ఆదేశాల మేరకు పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. శ్రీశైలం నుంచి వచ్చే పర్యాటకులు, ఈ ప్రాంత ప్రజలు సేద తీరేందుకు పార్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ పార్క్లో 15 కిలో మీటర్లు, 4 కి.మి., 2 కి.మి దూరంలో 3 వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. హోటల్స్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తల్లీకుమారుల అదృశ్యం మీర్పేట: భర్తతో గొడవపడిన మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్పేట లోకాయుక్తకాలనీలో నివాసముండే రమేష్, అనూష(36)లు భార్యాభర్తలు. వీరికి ఆర్యన్(6), సూయాన్(3) కుమారులు ఉన్నారు. ఈనెల 20వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అనూష ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త రమేష్ బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలు, బ్యాంకు సేవలపై అవగాహన కందుకూరు: ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధి మీర్ఖాన్పేటలో సైబర్ నేరాలు, బ్యాంకు సదుపాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ సైబర్ నేరాల గురించి వివరించారు. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు ఏవిధంగా జరుగుతున్నాయో అవగాహన కల్పించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఎస్బీఐ మేనేజర్ ఆర్ఎల్ఎన్ శాస్త్రి బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. 18 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ.20 చెల్లించి వ్యక్తిగత ప్రమాద బీమా చేసుకోవాలని సూచించారు. రూ.436 చెల్లించి జీవన జ్యోతి బీమా పథకంలో చేరవచ్చని తెలిపారు. బీమా పొందిన వారు మృతి చెందితే రూ.2 లక్షలు నామినీకి అందుతుందన్నారు. అనంతరం ప్రమాద బీమాలో సభ్యులుగా ఉండి మరణించిన వారికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ సైదులు, నాయకులు వై.వెంకటేశ్, మల్లేశ్ యాదవ్, ఎస్కే రఫియా, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కల్లుగీత సహకార సంఘం నియామకం కడ్తాల్: ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మర్రిపల్లిలో బుధవారం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్ఐ చంద్ర కిరణ్ పర్యవేక్షణలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం గ్రామ అధ్యక్షుడిగా యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా రాములుగౌడ్, కార్యదర్శిగా ఎన్.పెద్దయ్యగౌడ్, డైరెక్టర్లుగా నర్సింహగౌడ్, జంగయ్యగౌడ్ నియమితులయ్యారు. నూతన కమిటీకి సీఐ బద్యానాథ్ చౌహాన్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు నూతనకమిటీని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశ్గౌడ్, మల్లేశ్గౌడ్, నారాయణగౌడ్ జంగయ్యగౌడ్, హెడ్ కానిస్టేబుల్స్ శంకర్, చానాగౌడ్ పాల్గొన్నారు. -
మాంసాహార జంతువుల గణన
వివరాలు సేకరిస్తున్న అటవీశాఖ అధికారులు యాచారం: ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా బుధవారం గునుగల్ అటవీ ప్రాంతంలో సర్వే నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని గునుగల్, ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతాల్లో రెంజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి, యాచారం సెక్షన్ అధికారి నర్సింహల సమక్షంలో సర్వే చేపట్టారు. 21, 22 తేదీల్లో మాంసాహార జంతువుల సర్వే, 23, 24, 25 తేదీల్లో శాఖహార జంతువుల సర్వే చేపడుతామని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఏఏ జంతువులు సంచరిస్తున్నాయి. వాటి సంరక్షణ ఎలా ఉంది, ఇబ్బందులేమైన పడుతున్నాయా, రక్షణ చర్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్వే చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలో మొత్తం జంతువుల సర్వే గణన చేపడుతామని జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్రెడ్డి తెలిపారు. శ్రీశైలం, మన్నానూర్ అటవీ ప్రాంతాలు.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాలకు లింకు ఉండడంతో చిరుత పులులేమైనా వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28,627 హెక్టార్లు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో జంతువుల సర్వే గణన జరుపుతామని ఆయన వివరించారు. ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో.. చేవెళ్ల: జీవ వైవిధ్యాన్ని, అడవుల పరిరక్షణ లక్ష్యాలను అంచనా వేసేందుకు ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా సర్వే చేపడుతున్నట్లు చిలుకూరు–ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మణ్ అన్నారు. మండల పరిధిలోని ముడిమ్యాల ఫారెస్ట్లో బుధవారం మాంసాహార జంతువుల గణన చేపట్టారు. మూడు రోజులు చొప్పున లైన్ ట్రాంజెక్ట్, ట్రయల్ పాత్ సర్వే చేస్తూ డాటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాలు సేకరించి నివేదికను ఫారెస్ట్ ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్, ఫారెస్ట్ వాచర్ విజయ్ పాల్గొన్నారు. -
టాలెంట్ టెస్టులతో మేథోశక్తి పెంపు
మొయినాబాద్: విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి మనోవిజ్ఞానాన్ని పెంపొందించేందుకు టాలెంట్ టెస్టులు దోహదపడతాయని ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచయ్య అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల సాంఘిక శాస్త్రం ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు భవిష్యత్తులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి టెస్టులు నిర్వహించి విద్యార్థుల్లో మనో విజ్ఞానాన్ని నింపాలన్నారు. టాలెంట్ టెస్ట్ నిర్వహించిన ఎస్ఆర్పీలు లలితారెడ్డి, సక్కుబాయ్లను అభినందించారు. మొదటి బహుమతి శిరీష, ద్వితీయ బహుమతి హమన్, తృతీయ బహుమతి శ్రీధర్, కన్సల్టేషన్ బహుమతి శాలిని గెలుచుకున్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బందయ్య, అసోసియేట్ అధ్యక్షుడు రాములు, ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, వినోద్, పద్మ, తుకారాం, రవి, జ్యోతి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
వసంత పంచమికి ఏర్పాట్లు
● ముస్తాబైన జ్ఞాన సరస్వతి ఆలయం ● రేపు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామిజీ చేతులమీదుగా సామూహిక అక్షరాభ్యాసం యాచారం: నందివనపర్తిలోని జ్ఞాన సరస్వతి ఆలయం వసంత పంచమి వేడుకలకు ముస్తాబైంది. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ శ్రీ పంచమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను శ్రీ జ్ఞాన సరస్వతి సేవా సమితి ట్రస్ట్, జ్ఞాన సరస్వతి సంస్థాన్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త సదా వెంకట్రెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఆలయ పూజారి రాఘవేంద్రశర్మ నిర్వహించే ఈ పూజలకు యువత స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం హోమం.. రాత్రి పల్లకీసేవ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో రేపు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ చిన్నారులతో అక్షరాలు దిద్దించి దీవెనలు అందించనున్నారు. జిల్లా వాసులతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అక్షరాభ్యాసానికి కావాలల్సిన పలక, బలపం, అమ్మవారి ఫొటో, ప్రసాదం ఆలయ కమిటీ అందజేస్తుంది. చిన్నారుల తల్లితండ్రులు తమలపాకులు, పూలు, పండ్లు, కుడక, 1.25 కేజీల బియ్యం, పసుపు, కుంకుమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యార్థులచే శ్రీ సరస్వతి హోమంరాత్రి ఏడు గంటల నుంచి పదో తరగతి విద్యార్థులతో అమ్మవారి పల్లకీ సేవ ఉంటుంది. అక్షరాభ్యాసం ఉంటే ఉదయం ఎనిమిది గంటల లోపే ఆలయానికి చేరుకోవాలని ఆలయ ధర్మకర్త సదా వెంకట్రెడ్డి తెలిపారు. -
ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు రామారావు ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు నెలల పాటు నిర్వహించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ నిర్వహించే 2025–26కు గాను స్టేట్ సర్వీసెస్, కానిస్టేబుల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు, స్టడీ మెటీరియల్స్ అందజేస్తామన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్టడీ సర్కిల్ నుంచి కోచింగ్ తీసుకున్నవారు అనర్హులని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 8న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ఎల్.వెంకటయ్య హనరరీ డైరెక్టర్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నంబర్ 94405 21419లో సంప్రదించాలన్నారు. 27న హయత్నగర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం బోధించేందుకు గెస్ట్ లెక్చరర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు రసాయన శాస్త్రంలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పీహెచ్డీ, ఎన్ఈటీ, ఎస్ఈటీ, ఎస్ఎల్ఈటీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 24 తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. హయత్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్ మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఆయన బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఖాజా మొయిజుద్దీన్ బైంసాకు బదిలీ మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఖాజా మొయిజుద్దీన్ నిర్మల్ జిల్లా బైంసాకు బదిలీ అయ్యారు. నూతన మున్సిపాలిటీకి తొలి కమిషనర్కు వచ్చిన ఆయన ఏడాదిలోనే వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. ఆగస్టు 15న వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయకపోవడంతో చిలుకూరు వాసులు ఆయన్ను నిలదీశారు. స్థానికులపై ఆయన దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన ప్రజలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేయడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల పెద్దమంగళారం రెవెన్యూలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతలోనూ ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. డీసీ త్రిల్లేశ్వర్రావు డీసీఎంఏ కార్యాలయానికి.. బడంగ్పేట్: సర్కిల్–16కు డీసీగా వ్యవహరిస్తున్న త్రిల్లేశ్వర్రావును బుధవారం సీడీఎంఏ కార్యాలయానికి బదిలీ చేశారు. జీహెచ్ఎంసీలో బడంగ్పేట, మీర్పేట కార్పొరేషన్లను బడంగ్పేట సర్కిల్–16 పేరుతో ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇక్కడ మొదటి డిప్యూటీ కమిషనర్గా వచ్చిన త్రిల్లేశ్వర్రావు బడంగ్పేట కమిషనర్గా ఉన్న సమయంలో అవినీతి మరకలు ఉన్నాయి. ఆయన బదిలీపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్కు ధన్యవాదాలు తెలిపారు. పట్నంకు సుదర్శన్ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణరెడ్డి బుధవారం పదోన్నతిపై జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఇక్కడికి రానున్నారు. -
ఇళ్ల నిర్మాణం డల్
గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిర్మాణ ఖర్చులు ఇందిరమ్మ ఇళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన మేసీ్త్ర కూలీలు, స్టీలు, సిమెంట్, ఇసుక ధరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముందరి కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. ఫలితంగా నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారుల్లో ఇప్పటికీ పలువురు ముగ్గు కూడా పోయలేదు. మెజార్టీ నిర్మాణాలు బేస్మెట్ లెవల్ కూడా దాటలేదు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయానికి.. క్షేత్రస్థాయిలో ఖర్చులకు పొంతన ఉండడం లేదు. దీంతో మెజార్టీ లబ్ధిదారులు చేపట్టిన నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు మొత్తం 17,675 ఇళ్లు కేటాయించగా, వీటిలో 15,543 ఇళ్లు మంజూరు చేసింది. 13,193 ఇళ్లకు మార్కింగ్ చేసి, ఆన్లైన్ ట్యాగింగ్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. కాగా పెరిగిన ధరలకు భయపడి ఇప్పటి వరకు 2,350 మంది ముగ్గు కూడా పోయలేదు. 10,327 నిర్మాణాలు ఇప్పటికీ బేస్మెట్ లెవల్లోనే నిలిచిపోయాయి. కేవలం 355 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు పూర్తి చేశారు. నిర్మాణాలకు వెనుకడుగు ● చేవెళ్ల నియోజకవర్గానికి 2,800 ఇళ్లు కేటాయించగా, వీటిలో 2,491 ఇళ్లకు పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. నియోజకవర్గంలోని చేవెళ్ల, నార్సింగి, శంకర్పల్లి మున్సిపాలిటీలు సహా జన్వాడ, మిర్జాగూడలో 650 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 132 మంది లబ్ధిదారులు ఇప్పటికీ ముగ్గు పోయలేదు. 106 ఇళ్లు బేస్మెట్ లెవల్లోనే ఉన్నాయి. ఇదే నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2,150 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 225 మంది లబ్ధిదారులు ముగ్గు పోయలేదు. మరో 338 నిర్మాణాలు బేస్మెట్ లెవల్ కూడా దాటలేదు. ● ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, వీటిలో 3,397 మంజూరయ్యా యి. ఆదిభట్ల, పెద్ద అంబర్పేట్, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,748 ఇళ్లు కేటాయించగా, మిగిలిన 1,752 ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు కేటాయించారు. వీటిలో 533 మంది లబ్ధిదారులు ముగ్గు కూడా పోయలేదు. 688 ఇళ్లు ఇప్పటికీ బేస్మెట్ స్థాయి దాటలేదు. ● కల్వకుర్తి నియోజకవర్గానికి 2,385 ఇళ్లు కేటాయించగా, 2180 మంజూరయ్యాయి. ఆమనగల్లు మున్సిపాలిటీకి 360 ఇళ్లు కేటాయించగా, మిగిలినవి రూరల్ ఏరియాలకు కేటాయించారు. ఇప్పటి వరకు ఇక్కడ 209 మంది ఇంకా ముగ్గు పోయలేదు. 437 నిర్మాణాలు కనీసం బేస్మెట్ లెవల్ దాటలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ● మహేశ్వరం నియోజకవర్గానికి 3,390 ఇళ్లు కేటాయించగా, వీటిలో 3,205 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. బడంగ్పేట్, జల్పల్లి, మీర్పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీలకు 1,018 ఇళ్లు కేటాయించగా, 862 ఇళ్లు మంజూరయ్యాయి. ఇక్కడ ఇప్పటి వరకు 836 మంది ముగ్గు కూడా పోయలేదు. 390 నిర్మాణాలు బేస్మెట్ దాటలేదు. ● రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 2,100 కేటాయించగా, వీటిలో 1,001 ఇళ్లకు మాత్రమే అనుమతులు లభించాయి. ప్రొసీడింగ్స్ అందుకున్న వారిలో 42 మంది ఇప్పటికీ ముగ్గు పోయలేదు. మరో 251 నిర్మాణాలు బేస్మెట్ కూడా దాటలేదు. ఇప్పటి వరకు ఇక్కడ 31 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ● షాద్నగర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, 3,269 మాత్రమే మంజూరయ్యాయి. 285 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు ముగ్గు కూడా పోయలేదు. 712 నిర్మాణాలు బేస్మెట్ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 35 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. పెరిగిన ముడిసరుకు ధరలతో పురోగతి నిల్ ఇప్పటికీ ముగ్గుపోయని 2,350 మంది లబ్ధిదారులు 10,327 నిర్మాణాలు బేస్మెట్కే పరిమితం ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లకుపైగా జమ చేసింది. కుటుంబ సభ్యులు చనిపోయి కొంత మంది, స్థల వివాదాలతో మరికొంత మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదు. ఇలాంటి వారిని గుర్తించి ఒత్తిడి తీసుకొస్తున్నాం. అయినా నిరాకరిస్తే వారి ప్రొసీడింగ్స్ రద్దు చేసి, వెయిటింగ్ జాబితాలో ఉన్నవారికి కేటాయిస్తున్నాం. ఆర్థిక స్థోమత లేని పేదలకు మహిళా పొదుపు సంఘాల నుంచి లోన్లు ఇప్పిస్తున్నాం. ఇసుక, ఇటుక, స్టీలు, సిమెంట్ సమస్య లేదు. ప్రభుత్వమే ఇసుక యార్డులను నిర్వహిస్తోంది. లబ్ధిదారులు కోరిన వెంటనే సరఫరా చేస్తుంది. 600 చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి నిర్మించే ఇళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం నిలిపివేస్తున్నాం. – చంప్లానాయక్, పీడీ, హౌసింగ్


