Ranga Reddy District News
-
నేరాల నియంత్రణకే కొత్త ఠాణాలు: సీవీ ఆనంద్
గోల్కొండ: నగరంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం కొత్త ఠాణాలను ఏర్పాటు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన టోలిచౌకీ పోలీస్స్టేషన్ను బుధవారం ఆయన సందర్శించారు. ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ తొలి ప్రతిని ఫిర్యాదుదారుకు అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. నగరంలో నేరగాళ్ల పాలిట పోలీసులు సింహస్వప్నంలా మారారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూనే.. నేర నియంత్రణలోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. చోరీకి గురైన సెల్ఫోన్లను నగర పోలీసులు దేశంలోనే రికార్డు స్థాయిలో రికవరీ చేశారన్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్, టోలిచౌకీ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్నాయక్ తదితరులున్నారు. -
ఏపీఎంపై డీఆర్డీఓకు ఫిర్యాదు
నందిగామ: నందిగామ మండల మహిళా సమాఖ్యలో ఏపీఎంగా పనిచేస్తున్న యాదగిరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీసీ యాదయ్య జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వీర్లపల్లి సంఘంలో ఎలాంటి తీర్మానాలు లేకుండా రూ.3 లక్షలు చెక్కురూపంలో నిధులను మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్లస్టర్లో సీసీగా పనిచేస్తున్న తనకు ఈ విషయం తెలియడంతో ఏపీఓను ప్రశ్నించగా తననే దూషించారన్నారు. ఈ విషయమై డీఆర్డీఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఏపీఎం యాదగిరిని వివరణ కోరగా.. అందులో తన ప్రమేయం లేదని, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజానిజాలు విచారణలో తేలుతాయని స్పష్టంచేశారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐపై వేటు ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్పై వేటు పడింది. ఆయనను మల్టీజోన్ రేంజ్ ఆఫీస్కు సరెండర్ చేస్తూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో మంచాల ఎస్ఐగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ ఓ యాక్సిడెంట్ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితమే ఆయన ఇబ్రహీంపట్నం పీఎస్ నుంచి రిలీవ్ అయినట్లు సమాచారం. కడ్తాల్ ఎస్ఐకి ఉత్తమ పోలీసు అధికారి అవార్డు కడ్తాల్: నేర పరిశోధన విభాగం 2024 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కడ్తాల్ ఎస్ఐ వరప్రసాద్ ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డు అందుకున్నారు. పీఎస్ పరిధిలో నమోదైన పలు కేసులను వేగంగా దర్యాప్తు చేయడంతోపాటు ఉత్తమ సేవలకు గానూ బుధవారం డీజీపీ జితేందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఎస్ఐ వరప్రసాద్తో పాటు బెస్ట్ హోంగార్డుగా అవార్డు తీసుకున్న పాండును సీఐ గంగాధర్, పోలీసులు అభినందించారు. ప్రేమ పేరుతో మోసం సాఫ్ట్వేర్ ఉద్యోగికి రిమాండ్ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరుకు చెందిన దుబ్బాక సాగరిక ఆదిబట్ల టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2022లో కోల్కటా టీసీఎస్లో పని చేసిన సమయంలో సహోద్యోగి పత్లావత్ సంజీవతో ఆమెకు పరియచం ఏర్పడింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆదిబట్ల టీసీఎస్లో ఉద్యోగం చేస్తూ సహజీవనంలో ఉన్నారు. ఈక్రమంలో సాగరిక గర్భం దాల్చింది. దీంతో సంజీవ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం అతన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. సాగరికకు అబార్షన్ చేసిన తుర్కయంజాల్లోని మహోనియా ఆస్పత్రి యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. జనావాసాల్లోకి వచ్చి.. గేటులో తల ఇరుక్కుని కుల్కచర్ల: జనావాసాల్లోకి వచ్చిన ఓ జింక ప్రహరీకి ఏర్పాటు చేసిన గేటులో తల ఇరుక్కపోయి ప్రజలకు చిక్కింది. ఈ ఘటన చౌడాపూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మన్కాల్వ అటవీ ప్రాంతం నుంచి సాయంత్రం ఓ జింక మరికల్ సమీపంలోని రామాలయం వద్దకు వచ్చింది. అక్కడ ఓ వ్యక్తి తన స్థలానికి ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేశాడు. అందులో జింక తల పెట్టి చిక్కుకుపోయింది. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని గేటుకు ఉన్న ఇనుప చువ్వలను తొలగించి జింకను మహబూబ్నగర్లోని పిల్లలమర్రి పార్కుకు తరలించామని బీట్ ఆఫీసర్ ఆంజనేయులు తెలిపారు. -
కుంట్లూర్ కంటతడి
సైకిళ్ల అందజేత లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులకు ఈ–సైకిళ్లు అందజేశారు.8లోuహయత్నగర్: పెద్దఅంబర్పేట్ మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారని తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కుంట్లూరు– పసుమాముల రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సీఐలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పోస్టుమార్టం అనంతరం ఒకేసారి మూడు మృతదేహాలు కుంట్లూర్కు రావడంతో బంధువులు, స్థానికులు, మృతుల స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకేసారి ముగ్గురికి అంత్యక్రియలు జరపడంతో వందల సంఖ్యలో ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నేతల పరామర్శ.. యువకుల మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గ్రామానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేశ్ తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు రోడ్డు ప్రమాద స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ బాధితులను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి -
ఎవరికీ లంచాలివ్వొద్దు
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని.. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా తనకు ఫోన్ చేయాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని పథకం లబ్ధిదారులకు బుధవారం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాభవన్లో ఆయన మాట్లాడుతూ.. పేదోల్లంతా మనోల్లే.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తారతమ్యాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. ఇళ్లు మంజూరైన వారు మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. బేస్మెట్ పూర్తవగానే రూ.లక్ష, గోడలు కట్టిన తర్వాత మరో రూ.లక్ష, స్లాబ్ వేశాక రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తవగానే మరో రూ.లక్ష ఇలా నాలుగు విడతల్లో బిల్లులు వస్తాయని వివరించారు. కొలతలు, ఇంటి నిర్మాణం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలన్నారు. హామీలను నెరవేరుస్తున్నాం.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. అయినప్పటికీ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేరుస్తున్నారని తెలిపారు. ఐదేళ్ల కాలంలో నియోజకవర్గం వ్యాప్తంగా 20 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చాంప్లానాయక్, ఎంపీడీఓ యెల్లంకి జంగయ్యగౌడ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డి, వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్, పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇబ్బంది పెడితే నేరుగా ఫోన్ చేయండి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత -
సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం
కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంఽధీ ఆస్పత్రిలో సర్వం సిద్ధం చేశాం. ఓపీ భవనం రెండో అంతస్తులో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశాం. నిష్ణాతులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. యాంటివైరల్ డ్రగ్స్, వైరాలజీ ల్యాబ్, రీఏజెంట్స్ (ద్రావకాలు) ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. తెలంగాణ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించారు. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి రుగ్మతలకు గురైనవారు స్వీయ సంరక్షణ పాటిస్తూ, వైద్యుల సలహా మేరకు మందులు వేసుకోవాలి. జన సమూహ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. – ప్రొఫెసర్ సునీల్కుమార్, గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ -
గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు
గాంధీ ఆస్పత్రి : మరోసారి వేగంగా వ్యాపిస్తున్న కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు సూచించారు. రాష్ట్ర నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశామని, కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. థర్డ్వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్– 1 ప్రస్తుతం వ్యాప్తిలో ఉందని, కానీ.. ఇది ప్రమాదకారి కాదన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్ మూడు స్టేజ్లు ఉంటాయని, కరోనా వైరస్ వీటిలో చివరిదైన ఎండమిక్ స్టేజ్లో ఉందన్నారు. రెస్పరేటరీ వైరస్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు 60శాతం ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కోవిడ్ వైరస్ను ప్రాణాంతకమైన మహమ్మారిలా చూసే పరిస్థితి లేదని, జలుబు, దగ్గు వంటి సాధారణ రుగ్మతగానే వచ్చిపోతుందని, గతంలో వేసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోయినప్పటికీ, ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందన్నారు. చిన్నారుల్లో నమోదు కావడం లేదు ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్తో పాటు మన దేశంలోని మహారాష్ట్రలో వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్–1 వైరస్ చిన్నారుల్లో నమోదు కావడంలేదు. ఒమిక్రాన్ బీఏ.2.86 నుంచి రూపాంతరం చెందిన జేఎన్–1లో మూడు సబ్ వేరియంట్లు ఎన్బీ.1.8.1, పీసీ.2.1, ఎక్స్ఈసీ.25.1లు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. మహారాష్ట్రలో జేఎన్–1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కానీ ఇది ప్రమాదకారి కాదు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మాస్క్లు ధరించి అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్ -
పచ్చిరొట్ట పైర్లతో భూసారం పెంపు
మొయినాబాద్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రాస్త్రవేత్త ఎస్జీ మహదేవప్ప అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. నేల ఆరోగ్యం, నీటి వినియోగం, పర్యావరణ రక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట పైర్లు సాగుచేసి భూమిలో కలియదున్నడంతో భూసారం పెరుగుతుందన్నారు. ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఖర్చులు తగ్గించాలని.. నీటి వృథాను అరికట్టేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానాలను అవలంబించాలన్నారు. పర్యావరణ రక్షణకు చెట్లను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈఓ సునీల్కుమార్, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త ఎస్జీ మహదేవప్ప -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
తుక్కుగూడ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక ఉచిత హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలల గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో హామీలు నెరవేర్చలేదన్నారు. ఆడపిల్లలకు కల్యాణలక్ష్మితో పాటు, తులం బంగారం అందజేస్తామన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ బంగారం అందలేదని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల సందర్భంగా అడ్డగోలుగా వాగ్దానాలు ప్రకటించారని మండిపడ్డారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ వాణి, ఏఎంసీ చైర్మన్ కృష్ణానాయక్, మాజీ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు, లబ్ధిదారులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ -
ఆధునిక పద్ధతుల్లో బోధన చేపట్టాలి
కొత్తూరు: మారుతున్న విద్యావ్యవస్థ, పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్దతుల్లో మార్పులు చేసుకోవాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏఎస్పీడీ) రమేశ్ సూచించారు. బుధవారం ఆయన పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో సీఆర్పీ, ఎస్జీటీ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి, శ్రద్ధ పెంచేందుకు ఉపాధ్యాయులు బోధనలో సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. బడిబాటలో భాగంగా బడిఈడు పిల్లను బడుల్లో చేర్పించేలా ఉపాధ్యాయులకు స్థానికులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ అంగూర్నాయక్, ఉపాధ్యాయులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సమగ్రశిక్ష ఏఎస్పీడీ రమేశ్ -
త్వరలో మాన్సూన్ టీమ్స్!
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాల సమస్యలను ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా జీహెచ్ఎంసీ దాదాపు 400 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను ఏర్పాటు చేయనుంది. వచ్చే జూన్ ఆరంభం నుంచి వర్షాకాలం ముగిసేంత వరకు (అక్టోబర్ నెలాఖరు వరకు) ఈ టీమ్స్ పని చేస్తాయి. ఇందుకుగాను దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేయనున్నారు. వర్షాకాలంలో వానొస్తే రోడ్లు, కాలనీలు నీటి నిల్వలతో చెరువులుగా మారడం, మ్యాన్హోళ్లు, క్యాచ్పిట్లు పొంగిపొర్లడం తెలిసిందే. ఈ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ టీమ్స్ పనిచేస్తాయి. నగరంలో ప్రతియేటా నీరునిల్వ ఉండే ప్రాంతాలు జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారులకు తెలుసు. అలాంటి ప్రాంతాల్లో స్టాటిక్ టీమ్స్ నియమిస్తారు. నిల్చిపోయే నీటిని ఎప్పటికప్పుడు టీమ్స్లోని కార్మికులు తోడి పోస్తారు. వీటితో పాటు వాహనాలతో కూడిన మొబైల్ టీమ్స్ కూడా ఉంటాయి. ఇవి కాలనీలు, బస్తీలతో పాటు ఎక్కడ నీరు నిలిచినా వెళ్లి తొలగిస్తాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు అందే ఫిర్యాదులను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్లి నిల్వ నీటిని తొలగిస్తాయి. షిఫ్టులవారీగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పని చేస్తాయి. ఈ టీమ్స్లోని కార్మికులు నీరు తోడిపోసేందుకు, అవసరమైన ప్రాంతాల్లో స్వల్ప మరమ్మతులు చేసేందుకు యంత్ర సామగ్రిని కలిగి ఉంటారు. వీటి ఏర్పాటు కోసం జోన్లలో సర్కిళ్ల వారీగా సంబంధిత ఈఈలు టెండర్లు పిలుస్తున్నారు. మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇలా.. ఒక్కో టీమ్కు వాహనం, నలుగురు కార్మికులు, నీటిని తోడి పోసేందుకు పరికరాలు ఉంటాయి. షిఫ్టుల వారీగా ఈ టీమ్స్ పనిచేస్తాయి. ఇలాంటి టీమ్స్ దాదాపు 150 వరకు ఉంటాయి. స్టాటిక్ టీమ్స్ నీరు అధికంగా నిలిచిపోయి రోడ్లు చెరువులుగా మారే ప్రాంతాల్లో, క్యాచ్పిట్ల వద్ద ఒకరు లేదా ఇద్దరు కార్మికులతో ఈ టీమ్స్ ఉంటాయి. వీటిల్లోని కార్మికులు నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తోడిపోస్తారు.ఇలాంటి టీమ్స్ దాదాపు 250 ఉంటాయి. జీహెచ్ఎంసీ అని తెలిసేలా.. మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ వాహనాలకు జీహెచ్ఎంసీ లోగోతో బోర్డు పెట్టాలని, టీమ్కు నేతృత్వం వహించే వారి ఫోన్ నంబర్లను అన్ని పోలీస్స్టేషన్లకు అందజేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇటీవల జరిగిన వర్షాకాల సన్నద్ధత సమావేశంలో ఆదేశించారు. వర్షాల సమయంలో ఇంజినీర్లు సైతం 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. అంతేకాకుండా వాటర్ లాగింగ్ సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించిన కమిషనర్ బేగంపేటలో నీటి నిల్వకు కారణాన్ని గుర్తించి పై నుంచి వచ్చే నీటిని నియంత్రించేందుకు స్లూయిస్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించడం తెలిసిందే. వర్షాకాల ఇబ్బందుల పరిష్కారానికి.. టెండర్లు ఆహ్వానిస్తున్న జీహెచ్ఎంసీ -
అదుపుతప్పి కారు బోల్తా
మొయినాబాద్: అతివేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం జేబీఐటీ కళాశాల వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న క్వాలీస్ కారు అతివేగంతో వెళ్తూ అమ్డాపూర్ గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వృక్తి అదృశ్యం యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ(50) ఈ నెల 7న పని కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా జాడలేదు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో సైకిళ్ల అందజేత కందుకూరు: లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులు సురక్షిత, ప్రవీణకు బుధవారం ఈ–సైకిళ్లు అందజేశారు. లయన్స్ క్లబ్ జి ల్లా వైస్ గవర్నర్ జి.మహేంద్రకుమార్రెడ్డి చేతుల మీదుగా బాలికలకు అందించి ఒక్కో సైకిల్ ధర రూ.10 వేలు ఉంటుందని కోశాధికారి కె.వెంకటేశ్వర్లుగుప్తా తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాళ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి కడ్తాల్: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని పుల్లేర్బోడ్తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తండాకు చెందిన నేనావత్ గోపాల్నాయక్కు ఉన్న పాడి ఆవు మేత మేసుకుంటూ పక్క పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. దీంతో విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు బాధిత రైతు తెలిపారు. ఆవు విలువ రూ.లక్ష ఉంటుందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. -
కర్షకుల కష్టం వర్షార్పణం!
యాచారం: నిబంధనల సాకు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. వెరసి కర్షకుల కష్టం వర్షార్పణం అవుతోంది. పండించిన ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజులు గడుస్తున్నా.. కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రైతులు వడ్ల కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు వడ్లను కాపాడుకునేందుకు భగీరథ యత్నం చేస్తున్నారు. యాచారం మండలం మల్కీజ్గూడ, యాచారం, చౌదర్పల్లి గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని యాచారం కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. అధికారులు సేకరించకపోవడంతో బుధవారం కురిసిన వర్షానికి తడిసిపోయింది. ధాన్యంపై కవర్లు కప్పినప్పటికీ.. భూమి పదునుతో ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి వానలు కురిస్తే ధాన్యంపై ఆశలు వదులుకోవాల్సిందేనని వాపోతున్నారు. -
ఇరిగేషన్ శాఖ డీఈఈ ఆత్మహత్య
శంషాబాద్: పురుగుల మందు తాగి నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం ఆర్జీఐఏ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం.. కొత్వాల్గూడ చౌడమ్మ దేవాలయ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. పర్సులో లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా అతడు నాగోల్లో నివాసముంటున్న నేరెళ్ల వెంకటరామరాజు(63)గా గుర్తించారు. నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పని చేస్తున్నట్లు ఉంది. అతడి వద్ద లభ్యమైన ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తాము తిరుపతిలో ఉన్నట్లు తెలిపారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి
తుర్కయంజాల్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. పురపాలక సంఘం పరిధిలోని తొర్రూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో దళారులకు క్వింటా రూ.1,700 రైతులు అమ్ముకుని రూ.600 నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నోముల దయానంద్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బచ్చిగళ్ల రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, నాయకులు కందాల బల్దేవ్ రెడ్డి, పోరెడ్డి అర్జున్ రెడ్డి, కొత్త రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం ● ఐదు కార్లు దగ్ధం ● రూ.20 లక్షల నష్టం షాద్నగర్: మరమ్మతుల కోసం తీసుకువచ్చి న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఫరూఖ్నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన గణేష్ యాదవ్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో జాతీయ రహదారి పక్కన మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నాడు. మరమ్మతుల కోసం వచ్చిన కార్లను షెడ్లోఉంచి తాళం వేసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4గంటల ప్రాంతంలో షెడ్లో ఉన్న ఓ కారు బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి ఐదు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలార్పారు. సుమారు రూ.20లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫాంహౌస్లో హుక్కా పార్టీ పోలీసుల అదుపులో పది మంది యువకులు, ఇద్దరు మైనర్లు శంషాబాద్ రూరల్: ఫాంహౌస్లో హుక్కా పార్టీ జరుపుకుంటున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన కొందరు యువకులు గండిగూడ శివారులోని ఎంఆర్జీ ఫాంహౌస్లో హుక్కా పార్టీ చేసుకుంటున్నారు. మంగళవారం ఉదయం స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ చేసుకుంటున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం. హుక్కా పరికరాలను స్వాఽధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఏసీపీ రంగస్వామి షాద్నగర్: పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ రంగస్వామి సూచించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర, బక్రీద్ పండుగ, సందర్భంగా పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో మంగళవారం శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ.. ప్రత ఒక్కరు పరమత సహనం పాటించాలన్నారు. బక్రీద్, హనుమాన్ జయంతి వేడుకలు హిందూ, ముస్లింలు సోదరభావంతో ఐకమత్యంగా జరుపుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్కుమార్, ఎస్ఐ విజయ్కుమార్, నాయకులు బాబర్ఖాన్, ఇబ్రహీం, వెంకటేశ్, జమృద్ఖాన్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
యాచారం: ఉపాధి పనుల్లో అవకతవకలు పరిపాటయ్యాయి. మంగళవారం మండల కేంద్రంలో 16వ ఈజీఎస్ సామాజిక తనిఖీ మండల ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీఓ శ్రీలత, అంబుడ్స్మెన్ సునీత, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్, ఇన్చార్జి ఎంపీడీఓ శైలజ, ఎంపీఓ శ్రీలత, ఏపీఎం లింగయ్య ఆధ్వర్యంలో ఈ ప్రజావేదిక కొనసాగింది. మండల పరిధిలోని 24 పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వరకు రూ.5.5 కోట్లకు పైగా నిధులు వెచ్చించి కూలీలకు ఉపాధి కల్పించినట్లు గుర్తించారు. పలు గ్రామాల్లో సక్రమంగా రికార్డులు నమోదు చేయకపోవడం, కూలీలు చేసిన పనులకు సకాలంలో డబ్బులు జమ కాకపోవడం, ఒకరి పేరు మీద రికార్డులు మరొకరి పేరిట నమోదు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా డీఆర్డీఓ శ్రీలత మాట్లాడుతూ.. ఉపాధి పనులు కల్పించే విషయంలో గాని, కూలీలకు డబ్బులు ఇచ్చే విషయంలో గాని, స్లిప్పులు అందజేసే విషయంలోగాని తప్పులు చేసిన వారిని వదలమని హెచ్చరించారు. కూలీలకు చేతినిండా పని కల్పించి సకాలంలో డబ్బులు అందించాలన్నదే సర్కార్ లక్ష్యమని చెప్పారు. ఏ గ్రామంలో ఏ తప్పు జరిగిందో.. ఆడిట్ సిబ్బంది గుర్తిస్తున్నారని వివరించారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు గాను సాయంత్రం వరకు కేవలం పది గ్రామాల వివరాలనే ఆడిట్ సిబ్బంది వెల్లడించారు. గోప్యంగా ప్రజావేదిక సభ ఈజీఎస్ సామాజిక తనిఖీ మండల ప్రజా వేదిక సభ మండల పరిషత్ సమావేశ మందిరంలో పెట్టడంపై కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అంజయ్య మాట్లాడుతూ.. ప్రజావేదిక సభ తేదీని ఈజీఎస్ అధికారులు గోప్యంగా ఉంచారన్నారు. గతంలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై ఎంత మంది మీద చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదని.. కూలీలు పనులు చేసి పస్తులుంటున్నారని.. పలుమార్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనలు, ధర్నాలు చేపట్టినా ఫలితం లేదన్నారు. అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆందోళన డీఆర్డీఓ శ్రీలత హామీతో శాంతించిన కూలీలు, ఆందోళన కారులు -
ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆమనగల్లు: కాంగ్రెస్పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 27న హైదరాబాద్లోని ఇందిరాపార్క్లో ఆటో ఆకలి కేకల మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని కోరుతూ 25 రోజులుగా నిర్వహిస్తున్న ఆటో రథయాత్ర మంగళవారం ఆమనగల్లుకు చేరుకుంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆటో రథయాత్రకు స్థానిక ఆటో జేఏసీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మహాసభ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంద రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోడ్రైవర్లకు ఉపాధి కరువైందని అన్నారు. 83 మంది ఆటోడ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని, ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు రూ.12 వేలు అందించాలని, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 27న జరిగే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. -
ఏఎంసీ చైర్మన్ వర్సెస్ డైరెక్టర్లు
చేవెళ్ల: చేవెళ్ల మార్కెట్ కమిటీలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య సయోధ్య కుదరక రచ్చకెక్కుతున్నారు. తాను మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తుంటే తనపై కుట్రతో ఆరోపణలు చేస్తున్నారని.. డైరెక్టర్లు మార్కెట్ కార్యదర్శి మహేందర్కు ఫోన్ చేసి ప్రతీ నెలా డబ్బులివ్వాలని బెదిరిస్తున్నారంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్ ఆరోపిస్తుంటే.. చైర్మన్ తమను పట్టించుకోవడం లేదని.. మార్కెట్ కార్యదర్శితో కలిసి అవినీతికి పాల్పడుతున్నారంటూ మార్కెట్కమిటీ డైరెక్టర్లు ఆరోపణలతో వివాదం మొదలైంది. అభివృద్ధికి సహకరించాలి చేవెళ్ల మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ రాములు, కార్యదర్శి మహేందర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కె ట్ కమిటీ డైరెక్టర్లు అసత్య ఆరోపణలతో మార్కెట్ను బదనాం చేస్తున్నారని.. వారి సొంత నిర్ణయాలను ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తున్నా రని మండిపడ్డారు. మార్కెట్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో రూ.2 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కొందరు డైరెక్టర్లు చిన్న విషయాలను రాద్దాంతం చేస్తున్నారన్నారు. సెక్రటరీకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం, డబ్బులు డిమాండ్ చేయడం, కమీషన్ ఏజెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామంటూ అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. అవి నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పాలకవర్గ సమావేశంలో తీర్మానాలు చేసిన డైరెక్టర్లే తాము చేయ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికై నా డైరెక్టర్లు మార్కెట్ అభివృద్ధికి కలిసిరావాలన్నారు. పదవులకు రాజీనామా చేస్తాం: డైరెక్టర్లు మార్కెట్ అభివృద్ధి కోసం చైర్మన్ను ప్రశ్నిస్తే తమపై కార్యదర్శితో ఆరోపణలు చేయించడం సరికాదని డైరెక్టర్లు జనార్ధన్, మల్లేశ్, నరేందర్, సత్యనారాయణ, హనీఫ్ అన్నారు. మార్కెట్ అభివృద్ధికి సంబంధించిన వివరాల లెక్కలు అడిగితే తమై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య జన్మదిన వేడుకలకు పాలకవర్గాన్ని పట్టించుకోకుండా చైర్మన్ ఒక్కరే తన ఫొటోతో ఫ్లెక్సీలు వేయించుకుని పాలకవర్గాన్ని దూరం పెట్టాడన్నారు. డైరెక్టర్లు లేకుండానే మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించి తాము హాజరైనట్లు రికార్డు చేశారని ఆరోపించారు. కమీషన్ ఏజెంట్లు తక్పట్టీలు ఇవ్వడం లేదని చెబితే పట్టించుకోవడం లేదన్నారు. తక్ పట్టీలు ఇవ్వకుండా చైర్మన్, కార్యదర్శి కలిసి అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే డైరెక్టర్లు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపిస్తున్నారని అన్నారు. అవసరమైతే తమ డైరెక్టర్ల పదవులకే రాజీనామాలు చేస్తామన్నారు. చేవెళ్ల మార్కెట్ కమిటీ పాలకవర్గంలో మనస్పర్థలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు -
హై లెవల్ చేతికి పరిహారం!
యాచారం: ప్రజాప్రయోజనాల నిమిత్తం, వివిధ సంస్థలకు అప్పగించే భూసేకరణకు సంబంధించి సర్కార్ హై లెవల్ కమిటీని నియమించడానికి నిర్ణయించింది. ఇక నుంచి ఈ కమిటీ నిర్ణయం మేరకే భూములిచ్చే రైతులకు పరిహారం అందజేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని పది గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించడానికి నిర్ణయించి 14 వేల ఎకరాలు సేకరించింది. పట్టా భూములకు అందజేసిన పరిహారం విషయంలో ఇబ్బందులు రానప్పటికీ అసైన్డ్పట్టాలు, ప్రభుత్వ భూముల్లో కబ్జాలున్న రైతులకు అందజేసిన పరిహారం చెల్లింపులో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మొదట్లో అసైన్డ్ భూములకు సాగు యోగ్యమైన భూమికి మాత్రమే పరిహారం అందజేశారు. తర్వాత కొందరు అధికారులతో కుమ్మకై ్క పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న భూమికి మొత్తం నకిలీ పేర్ల మీద పరిహారం కాజేశారు. దీంతో నిజమైన అసైన్డ్దారులకు అన్యాయం జరిగింది. అన్యాయానికి గురైన అసైన్డ్దారులు నేటికీ తమను ఆదుకోవాలని కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్నీ నిర్ధారించాకే.. పరిహారం అందజేతలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. ఇక నుంచి జిల్లాలోని ఏ మండలం, ఏ గ్రామంలోనైనా ప్రజాప్రయోజనాలు, ప్రముఖ సంస్థలకు భూములు అప్పగించే విషయంలో హై లెవల్ కమిటీ నిర్ణయం మేరకే ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ, పరిహారం అందజేత, రైతులతో మాట్లాడి నచ్చజెప్పడం వంటి చర్యలు తీసుకోనుంది. కలెక్టర్ సారథ్యంలో ఏర్పాటయ్యే కమిటీలో అడిషనల్ కలెక్టర్, సర్వేశాఖ జిల్లా అధికారి, ఆర్డీఓ, తహసీల్దార్ ఉండనున్నారు. నిజమైన రైతులకు పరిహారం అందజేత విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, రెవెన్యూ రికార్డుల పరిశీలన, భూమికి సంబంధించి సర్వే మ్యాప్, హద్దుల నిర్ధారణ ద్వారా పరిహారం అందజేస్తారు. 250 ఎకరాలకు పైగా .. యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని 250 ఎకరాలకుపైగా పరిహారం అందజేసేలా అధికారులు నిర్ణయించారు. ఫార్మాసిటీకి సేకరించిన భూములకు సంబంధించి తాజాగా అధికార యంత్రాంగం సర్వే, ఫెన్సింగ్ పనులు నిర్వహిస్తోంది. ఆయా గ్రామాల్లోని అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న రైతులు తమకు పరిహారం అందలేదని పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆయా గ్రామాల్లోని అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా కబ్జాలో ఉన్న భూముల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 80 మందికి పైగా రైతులు 250 ఎకరాలకుపైగా అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సర్కార్కు నివేదిక అందజేశారు. పరిహారం విషయంలో మరోసారి పొరపాట్లు జరగకుండా కలెక్టర్ సారథ్యంలో హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసి తర్వాతే బాధిత రైతులకు అందజేసేలా సర్కార్ దృష్టి సారించింది. అవకతవకలు, అక్రమాలకు చెక్ పెట్టేలా సర్కార్ చర్యలు కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీ బృందంలో మరో నలుగురు.. ఇక నుంచి వారి నిర్ణయం మేరకే పరిహారం చెల్లింపు అన్యాయం జరగకుండా చూస్తాం ఫార్మాసిటీకి భూములు సేకరించిన గ్రామాల్లో కొందరికి పరిహారం అందలేదని గుర్తించాం. త్వరలో కలెక్టర్ సారథ్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటవుతుంది. కమిటీ నిర్ణయం ప్రకారం బాధిత రైతులకు పరిహారం అందజేస్తాం. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూస్తాం. – అనంత్రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
పంటల సాగులో అవగాహన తప్పనిసరి
యాచారం: ప్రభుత్వ గుర్తింపు కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ అల్థాస్ జానయ్య అన్నారు. మండల పరిధిలోని మాల్ రైతు వేదికలో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. పంటల సాగులో రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని, తక్కువ శ్రమతో అధిక దిగుబడి వచ్చే పంటలపై దృష్టి పెట్టాలని తెలిపారు. నీటి ప్రాముఖ్యత, వినియోగం సమర్థత, వరిలో వైవిధ్యీకరణ అవసరంపై తెలియజేశారు. వానాకాలం ప్రారంభం కాగానే ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు మేలైన వివిధ రకాల విత్తనాలను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించారు. రైతులు అవగాహన పొంపొందించుకోవడానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రామకృష్ణబాబు, సునీత, ఇబ్రహీంపట్నం ఏడీఏ సుజాత, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్, పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి షాబాద్: ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గందె సురేష్గుప్తా పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘంలో సభ్యత్వం లేని వారు నూతనంగా నమోదు చేయించుకోవాలని తెలిపారు. వృద్ధాప్య భృతి కోసం 60 ఏళ్ల పైబడిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్యవైశ్యులకు సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్గుప్తా, ట్రెజరర్ నీల రవీందర్గుప్తా, జిల్లా కార్యదర్శి చొక్కంపేట రాకేష్ గుప్తా, షాబాద్, ఫరూఖ్నగర్ మండలాల అధ్యక్షులు పాపిశెట్టి సాయిరాంగుప్తా, నారాయణ, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ మలిపెద్ది శ్రీనివాసులు, ఫరూఖ్నగర్ మండల మాజీ అధ్యక్షుడు మురళి, సంఘం సభ్యులు గడ్డం రమేష్గుప్తా, ఉప్పు శ్రీనివాస్గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను వేగిరం చేయండి ఆమనగల్లు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల అధికారులంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. ఈనెల 25లోపు ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు బిల్లులు గ్రౌండింగ్ చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ కుసుమమాధురి, మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్, హౌసింగ్ డీఈ సురేశ్, ఎంపీఓ వినోద, ఏఈ అభిషేక్ పాల్గొన్నారు. నేడు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన మున్సిపల్ పరిధిలోని సంకటోనిపల్లి, మండల పరిధిలోని సీతారాంనగర్తండాలో బుధ వారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్, ఎంపీడీఓ కుసుమమాధురి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేస్తారని, అనంతరం లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వు పత్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు. -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
మహేశ్వరం: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని రాచకొండ సీపీ సుధీర్బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు మ్యాక్ ప్రాజెక్టులో బీటీఆర్ విల్లాస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 320 ఐపీ సీసీ కెమెరాలను మంగళవారం ఆయన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సీపీ మాట్లాడుతూ.. విల్లాస్, అపార్ట్మెంట్లు, కాలనీలు, గ్రామాల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతోగానో దోహదపడతాయని తెలిపారు. వీటితో కేసుల పరిష్కారం సులభతరం అవుతుందని, నేర శోధన, నేర నివారణకు ఎంతగానో తోడ్పడతాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బీవీ సత్యనారాయణ, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, గురువారెడ్డి, మ్యాక్ బీటీఆర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.ప్రతాప్రెడ్డి, కోశాధికారి నాదేళ్ల రాఘవేందర్, జాయింట్ సేక్రటరీ డా.కె.అనిల్కుమార్, సభ్యులు తదిత రులు పాల్గొన్నారు. రాచకొండ సీపీ సుధీర్బాబు -
మృత్యుఘోష
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025పెళ్లింట..పరిగి/షాబాద్: హైదరాబాద్– బీజాపూర్ రహదారి రక్తసిక్తమైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లింట నిర్వహించిన చిన్నవిందుకు హాజరై వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో షాబాద్ మండలం సీతారాంపూర్కు చెందిన మల్లేశ్(35), ఇదే మండలం సోలిపేట్కు చెందిన బాలమ్మ (60), చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత(32), ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్కు చెందిన సందీప్(28) ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సంతోష్కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరిగి ఆస్పత్రికి అక్కడి నుంచి తాండూరు, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిగి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎలా జరిగిందంటే.. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ, స్వప్న దంపతుల కూతురు మల్లేశ్వరిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లికి చెందిన సతీష్కు ఇచ్చి ఈనెల 16న పరిగిలో వివాహం జరిపించారు. 19న చిన్న విందు ఏర్పాటు చేయడంతో పెళ్లి కొడుకు బంధువులు సుమారు 50 మంది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రాత్రి 8.30 గంటలకు చందనవెల్లి నుంచి పరిగికి చేరుకు న్నారు. బస్సును పార్కింగ్ చేసి వస్తానని వెళ్లిన డ్రైవర్.. ఇదే ట్రావెల్స్కు చెందిన మరో బస్సు పాడవడంతో అందులో ఉన్నవారిని పరిగి నుంచి వారి గమ్యస్థానంలో వదిలేసి, తిరిగి అర్ధరాత్రి 1.20 గంటలకు పరిగికి చేరుకున్నాడు. పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో పాటు బంధువులతో కలిసి చందనవెల్లి బయలుదేరారు. పది నిమిషాలు కూడా గడవకముందే రంగాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కన ఎడమ వైపు నిలిపి ఉన్న సిమెంట్ లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది. తల్లి మృతి, ప్రాణాపాయంలో కూతురు ప్రమాద స్థలంలో మృతిచెందిన హేమలత కూతురు మోక్షిత(5)కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగిలిన వారిని వికారాబద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సుజాత, నీరజ, నిహారి, మహేశ్, అరుణ, సాహితికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రియాంక, కార్తీక్, రమేశ్, లక్ష్మి, రాములు, మంజుల, సుజాత, నవనీతకు స్వల్ప గాయాలయ్యాయి. ఏఎంసీ చైర్మన్ వర్సెస్..చేవెళ్ల మార్కెట్ కమిటీలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య సయోధ్య కుదరక రచ్చకెక్కుతున్నారు. పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు.8లోuన్యూస్రీల్ చిన్నవిందుకు హాజరై వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే నలుగురు మృతి, 20 మందికి గాయాలు పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘటన మృతుల్లో పెళ్లికొడుకు బావ, మేనబావపెళ్లి కొడుకు బావ మృతి పెళ్లికొడుకు సతీష్ బావ (అక్క భర్త) మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతని భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఇదే బస్సులో ఉన్నారు. మృతుల్లో కిషన్నగర్కు చెందిన సందీప్కు ఆరు నెలల క్రితమే వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం నాగుపల్లికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. పెళ్లికుమారుడికి మేనబావ కావడంతో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇతని తండ్రి గతంలోనే మృతిచెందగా ఒకేఒక్క కుమారుడైన సందీప్ అకాల మృతితో అతని కుటుంబం విలవిల్లాడుతోంది. -
పీఏసీఎస్ల సేవలు భేష్
నందిగామ: మండల పరిధిలోని చేగూరు పీఏసీఎస్ను మంగళవారం ఇండోనేషియా వ్యవసాయ అధికారుల బృందం సందర్శించింది. ఇండోనేషియా జాతీయ అభివృద్ధి ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఉప మంత్రి బాపక్ లీనార్డో, టాగ్ సంబాడో ఆధ్వర్యంలో 15 మంది సీనియర్ అధికారుల బృందం రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పీఏసీఎస్ల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరా, ఆధార్ ఆధారిత పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణ, పారదర్శకత తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఏసీఎస్ల నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు ప్రేరణాత్మకంగా ఉన్నాయని కితాబిచ్చారు. వ్యవసాయ రంగంలో ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, ఇన్చార్జి ఏడీఏ నిశాంత్ కుమార్, ఏడీఏ మాధవి, ఏఈఓ రవి, డీసీసీబీ షాద్నగర్ మేనేజర్ మంకాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇండోనేషియా అధికారుల బృందం కితాబు -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
బంట్వారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోట్పల్లి మండల కేంద్రంలో సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం బలగం అన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మెజార్టీ స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ నందు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్రెడ్డి, కోట్పల్లి మండల అధ్యక్షుడు శివకుమార్, బంట్వారం అధ్యక్షుడు మహేష్యాదవ్ పాల్గొన్నారు. ఐటీఐని సందర్శించిన ఎంపీ అనంతగిరి: వికారాబాద్లోని ఐటీఐ కళాశాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో ఉన్న ట్రేడ్లు, కోర్సులు తదితర విషయాలపై ప్రిన్సిపాల్ నరేంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేయడం గొప్ప విషయమన్నారు. ● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరాపై సంబంధిత అంశాలపై చర్చించారు. ఈనెల 25వ తేదీ వరకు గ్రౌండింగ్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. రాజీవ్ యువ వికాసంపై సమీక్షిస్తూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిందన్నారు. మండలాలవారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యలు రాకుండా బాగా పని చేయడం జరిగిందని, రాబోయే 20 రోజుల వరకు ఇదే విధంగా పని చేయాలని సూచించారు. డీఆర్ఓ సంగీత, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు వెంకట్రెడ్డి, అనంత్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీలత, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి కేశురామ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి, ఈఈ మిషన్ భగీరథ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫైర్ సేఫ్టీలేని భవనాలను గుర్తించండి పాతబస్తీ గుల్జార్హౌస్ అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఫైర్ సేఫ్టీలేని, ప్రమాదకరమైన లైన్లు, భవనాలను గుర్తించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూ చించారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు గుర్తించి వా టిని వెంటనే తొలగించాలన్నారు. ఈ ప్రమా దాల నివారణ కోసం విద్యుత్, మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఫైర్సేఫ్టీ, విద్యుత్శాఖల అధికారులు పాల్గొన్నారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఫిర్యాదుదారులు అందించే దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 24, ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు అందినట్టు తెలిపారు. -
హైసిటీ పనులకు నిధుల లేమి
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పనుల కింద టెండర్లు పూర్తయినప్పటికీ, పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కేబీఆర్పార్కు చుట్టూ, ఖాజాగూడ, ట్రిపుల్ఐటీ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు తదితర పనులకు సంబంధించి రూ. 1800 కోట్ల మేర పనులకు టెండర్లు పూర్తయ్యాయి. కేబీఆర్ చుట్టూ పనులకు కోర్టు వివాదాలతో ముందుకు సాగలేని పరిస్థితి నెలకొనగా, మిగతా ప్రాంతాల్లో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. అందుకు అవసరమైన నిధులు జీహెచ్ఎంసీ ఖజానాలో లేవు. అవసరమైన నిధులను ప్రభుత్వం ఇస్తే తప్ప ముందుకు పోలేని పరిస్థితి. సదరు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో భాగంగా ఆస్తులు కోల్పోయే నిర్వాసితులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 760 కోట్లకు సంబంధించిన పరిహారం ఖరారు, తదితరాలతో అవార్డులు పాసైనప్పటికీ, భూమిని స్వాధీనం చేసుకునేందుకు చెల్లించేందుకు నిధుల్లేవు.జీహెచ్ఎంసీకి చెందిన పబ్లిక్ డిపాజిట్ ఖాతా లోని రూ.2వేల కోట్లు సైతం ప్రభుత్వం వినియోగించుకోవడంతో జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారనుంది. ప్రస్తుతానికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా వచ్చిన నిధులతో ఇబ్బంది లేకపోయినప్పటికీ, మున్ముందు జీతాలకూ కటకటలాడాల్సిన పరిస్థితి తప్పదేమోనని జీహెచ్ఎంసీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పనులు అడుగు ముందుకు పడని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాలకు సైతం అప్పటి ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదు. కానీ, జీహెచ్ఎంసీ ఆర్థికపరిస్థితి, పరపతి దృష్ట్యా అప్పులు తెచ్చారు. సర్కారు కరుణిస్తేనే ముందుకు లేకుంటే అంతే సంగతులు -
చర్యలు తీసుకుంటున్నాం..
విజయవాడ జాతీయ రహదారిపై వేగనియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు పేర్కొన్నారు. పాదచారుల సౌకర్యార్థం విజయవాడ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ఎఫ్ఓబీలు ఏర్పాటు చేయాలని జీహెచ్సీఎంసీ, జాతీయ రహదారుల సంస్థకు లేఖలు రాశామని హయత్నగర్ వర్డ్అండ్డీడ్ దగ్గర ఫుట్ ఓవర్బ్రిడ్జి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. హయత్నగర్లోని భాగ్యలతకాలనీ దగ్గర కూడా ఫుట్ ఓవర్బ్రిడ్జిని నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని పలు కారణాలతో పనులు జరగడం లేదన్నారు. పాదచారులు రోడ్డు దాటేలా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తామన్నారు. -
ఆమనగల్లులో ఇనుపయుగపు ఆనవాళ్లు
ఆమనగల్లు: పట్టణంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి ఇనుపయుగపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లిచ్ ఇండియా సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న సమాధులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్లనాటి సమాధులు ఉన్నాయని, గతంలో వంద వరకు ఉండగా ప్రస్తుతం నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం నాలుగు సమాధుల్లో మూడు ఆనవాళ్లు సరిగా లేనప్పటికీ ఒకటి మిగిలిఉందన్నారు. ఆయన వెంట స్థపతి భీమిరెడ్డి వెంకటరెడ్డి, శిల్పులు సాయికిరణ్రెడ్డి, తెలుగు ఎల్లయ్య ఉన్నారు. గొప్ప పోరాటయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య షాద్నగర్: పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప పోరాటయోధుడని సీఐటీయూ జిల్లా అధ్యక్షు డు ఎన్.రాజు అన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ డివిజన్ కార్యదర్శి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ సుందరయ్య వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. సుందరయ్య నిరాడంబర జీవి అని, దేశానికి గొప్ప ఆదర్శ నాయకుడని అన్నారు. దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అని కొనియాడారు. పేదలకు భూమి కావాలని, వెట్టిచాకిరి నుంచి విముక్తి కలగాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి పదిలక్షల ఎకరాల భూ మిని పంపిణీ చేయించారని గుర్తు చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో పోరాటం చేశారని, దళిత వాడల ఏర్పాటుకు కృషి చేశా రని అన్నారు. సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, ఆంజనేయులుగౌడ్, కావలి రాజు, కుర్మయ్య, మహ్మద్ బాబుపాల్గొన్నారు. బాటసింగారం భూములపై విచారణ జరపండి ● ఎక్స్ వేదికగా రెవెన్యూ అధికారులకు భువనగిరి ఎంపీ సూచన అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని బాట సింగారంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ప్రచారాలపై రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తన ఎక్స్ వేదిక ద్వారా కోరారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు నిర్ధారణ జరిగితే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమించుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమనగల్లువాసికి కీర్తిరత్న పురస్కారం ఆమనగల్లు: పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రముఖ కవి దాస ఈశ్వరమ్మను కీర్తిరత్న పురస్కారం వరించింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శ్రీగౌత మేశ్వర సాహితి కళాసేవా సంస్థ ఏటా సాహిత్యరంగంలో విశేష సేవలు అందించే వారికి పురస్కారాలు అందిస్తోంది. ఈ ఏడాది ఈశ్వరమ్మ అందించిన సాహిత్య సేవలకుగాను ఆమెను ఎంపిక చేశారు. మంథనిలో జరిగిన కార్యక్రమంలో ఈశ్వరమ్మకు శ్రీ గౌతమేశ్వరసాహితి కళాసేవా సంస్థ అధ్యక్షుడు దూడపాక శ్రీధర్ కీర్తిరత్న పురస్కారం అందించారు. ఈశ్వరమ్మ రాసిన కవితలకు గాను సాహితీ సౌమిత్రి అనే బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
గోడు వినండి.. గూడు కల్పించండి
దివ్యాంగ దంపతుల వేడుకోలుఇబ్రహీంపట్నం రూరల్: నడవలేని స్థితిలో కలెక్టరేట్కు వచ్చిన వీరు చంపాపేట్లో నివసించే రొండి నాగమ్మ, నాగేష్. దంపతులు ఇద్దరూ దివ్యాంగులే. పీజీ వరకు చదువుకున్నారు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. ప్రస్తుతం పనులు చేయలేక ఇంట్లోనే ఉంటున్నారు. అద్దె ఇంట్లో కిరాయి సైతం చెల్లించకలేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేదలమైన, దివ్యాంగులమైన తమకు ప్రభుత్వ పథకం కింద ఇల్లు కేటాయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు అనేకమార్లు విన్నవించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆపసోపాలు పడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా రు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చారు. కలెక్టర్ కలవకపోవడంతో అధికారులకు అర్జీ సమర్పించారు. ఈ నెల 6న కూడా ప్రజావాణిలో మొరపెట్టుకున్నామని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. నగరం నుంచి ఇంత దూరం రావాలంటే ఇబ్బందిగా ఉందని.. జీవనోపాధికరువై, బతుకుభారమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ గోడు పట్టించుకుని ఉండటానికి ఎక్కడైనా కాస్త గూడు కల్పించి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. -
ఆక్రమణలకు హైడ్రా చెక్
రెండు ప్రాంతాల్లో ఆపరేషన్స్ పుప్పాలగూడ, హైదర్నగర్లో ఆక్రమణల తొలగింపు డాలర్ హిల్స్లోనూ ఇదే తరహా కథ పుప్పాలగూడలోని డాలర్ హిల్స్లోనూ ఆక్రమణల్ని హైడ్రా తొలగించింది. సర్వే నం. 104/1, 106, 113ల్లో సంతోష్రెడ్డి, ఆయన మిత్రులకు 60 ఎకరాల భూమి ఉంది. ఇందులోని 30 ఎకరాల్లో 1998లో డాలర్ హిల్స్ లే ఔట్ వేశారు. హెచ్ఎండీఏ ప్రిలిమినరీ లేఔట్తో మొత్తం 80 శాతం ప్లాట్లు అమ్మేశారు. ఆపై లేఔట్ రద్దయ్యేలా ప్రయత్నించి 2005లో చేయించారు. ఆపై స్థల యజమానులు కుమక్కై వ్యవసాయ భూమిగా మార్చుకున్నారు. ఈ విషయం అప్పటికే ప్లాట్లు కొన్న వారికి తెలీదు. ఎల్ఆర్ఎస్తో అనుమతులు తీసుకుని కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. సంతోష్రెడ్డి తదితరులు ఈ లేఔట్లోని రెండు ఎకరాల పార్కు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను కలిపి పక్కనే ఉన్న 30 ఎకరాల భూమికి జోడించారు. దీన్ని ఎన్సీసీ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్మేశారు. 2016 నుంచి ఈ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ అనుమతులు తీసుకోకుండా ఎన్సీసీ నిర్మాణాలు చేపడుతోందని నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కమిషనర్ రంగనాథ్ ఈ నెల 14న క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా హైడ్రా సోమవారం అక్కడి నిర్మాణాలు తొలగించింది. అనుమతి లేకుండా సెల్లార్లు తవ్వడం, పేలుడు పదార్థాలను వినియోగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. పార్కులు, రహదారులు ఆక్రమించిన కేసుల్లో ఇంప్లీడ్ అవ్వాలని హైడ్రా నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమ ణలు తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయి విచారణ చేసిన అధికారులు ఆక్రమణలుగా తేల్చి కూకట్పల్లిలోని హైదర్నగర్లో ఉన్న డైమండ్ హిల్స్, మణికొండలోని పుప్పాలగూడలో ఉన్న డాలర్ హిల్స్ల్లో కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా ఈ రెండు చోట్లా బోర్డులు ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. హైదర్నగర్ సర్వే నం.145లోని 9 ఎకరాల్లో డైమండ్ హిల్స్ పేరుతో లేఔట్ వేశారు. 79 ప్లాట్లతో కూడిన 2000 సంవత్సరం నాటి దీనికి హెచ్ఎండీఏ అనుమతి ఉంది. 2007లో అన్ రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్తో డాక్టర్ ఎన్ఎస్డీ ప్రసాద్ అనే వ్యక్తి ఆక్రమణలు మొదలెట్టారు. ప్లాట్ యజమానులు పార్టీ కాని కేసుల్లో ఎక్స్ పార్టీ డిక్రీ తీసుకుని బైలీఫ్ ద్వారా వ్యవసాయ భూమి అని చూపుతూ ఏడెకరాలు ఆక్రమించారు. ఆ కేసులో ప్లాట్ యజమానులను పార్టీ చేయకుండా కోర్టును తప్పుదోవ పట్టించి పొందిన బైలీఫ్ అర్డర్తో ఈ లే ఔట్లోని స్విమ్మింగ్పూల్, రహదారులు, పార్కులు, ప్లాట్లు హద్దులు,పునాదులను చెరిపేసి ఆక్రమించారని ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 9న హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రసాద్ ఖాళీ చేయడం లేదని వాపోయారు. ఆ భూమిని వివిధ సంస్థలకు పార్కింగ్ కోసం అద్దెకు ఇస్తూ నెలకు రూ.50 లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేఔట్లోని మిగతా రెండు ఎకరాల్లో ఉన్న ప్లాట్లకు వెళ్లడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ కూడా వేశారని తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ గత బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలు నిర్ధారించి సోమవారం వాటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. ఓ ప్రాంతంలో రోడ్డు, పార్కుల్లో ఉన్నవి కూల్చివేత మరోచోట 9 ఎకరాల హెచ్ఎండీఏ భూమి సంరక్షణ న్యాయస్థానం ఆదేశాల మేరకే చర్యలు: కమిషనర్ -
కడ్తాల్లో సినిమా షూటింగ్
కడ్తాల్: సినిమా బృందం సభ్యులు కడ్తాల్లో సందడి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా, పి.మహేశ్బాబు దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను సోమవారం మండల కేంద్రంలో చిత్రీకరించారు. స్థానిక శ్రీనివాస థియేటర్ ఆవరణలో దర్శకుడు మహేశ్బాబు పర్యవేక్షణలో నటీనటులపై చిత్రీకరణ చేశారు. కడ్తాల్లో సినిమా షూటింగ్ జరుగుతుండటంతో సినీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. కూలీ డబ్బుల కోసం ఫోన్ చేసినందుకు.. ప్లంబర్ను చితకబాదిన కాంట్రాక్టర్ బంజారాహిల్స్: తనకు రావాల్సిన కూలీ డబ్బుల కోసం ఓ ప్లంబర్ తాను పని చేస్తున్న కాంట్రాక్టర్కు తరచూ ఫోన్ చేయడంతో ఆగ్రహం పట్టలేని కాంట్రాక్టర్ సదరు ప్లంబర్ను దారికాసి చితకబాదిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని శ్రీరామ్నగర్ బస్తీకి ఆశిష్కుమార్ దాల్ ప్లంబర్గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా అతను జూబ్లీహిల్స్కు చెందిన అరుణ్కుమార్నాయక్ అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. ఈ నెల 17న తనకు రెండు రోజుల భత్యం రావాలంటూ పలుమార్లు అరుణ్కుమార్కు ఫోన్ చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అరుణ్కుమార్ బైక్పై వెళుతున్న ఆశిష్కుమార్ను అడ్డగించి తనకు అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నావంటూ అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి ఎడమ చేయి వేలు విరిగిపోయింది. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు అరుణ్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ నోట్ల మార్పిడీకి యత్నం నిందితుడి రిమాండ్ కుత్బుల్లాపూర్: నకిలీ నోట్లు అంటగట్టి ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిరిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన మనీషా సావంత్ తనకు పరిచయస్తుడైన చత్తీస్ఘడ్ ప్రాంతానికి చెందిన కుంజురామ్ పటేల్కు రూ.18.5 లక్షలు ఆన్లైన్లో బదిలీ చేసింది. మనీషాకు ఇవ్వాల్సిన డబ్బులు నగదు రూపంలో ఇస్తానని, పేట్బషీరాబాద్లోని పాంటలూన్స్ షోరూమ్ వద్దకు రమ్మని చెప్పాడు. కుంజురామ్ ఆమెకు నకిలీ నోట్లు అంటగట్టేందుకు యత్నిస్తుండగా గుర్తించిన మనీషా అతడిని నిలదీసింది. దీంతో కుంజురామ్ అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుంజురామ్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని సోమవారం మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. -
కారులోకి దూసుకెళ్లిన క్రాష్ బారియర్
● ఔటర్పై ఘోర రోడ్డు ప్రమాదం ● అక్కడికక్కడే బెంగాల్వాసి మృతి ● గంటల తరబడి శ్రమించి మృతదేహం వెలికితీత ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్రోడ్డుపైఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లిన ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్పవర్ సప్లయ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం అజాగ్రత్తగా వాహనం నడుపుతూ క్రాష్ బారియర్ను ఢీకొట్టాడు. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లింది. క్రాష్ బారియర్లోనే కారు ఉండిపోయింది. ప్రమాదంలో కితాబ్అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలిసులకు కష్టతరం అయ్యింది. ఔటర్రింగ్రోడ్డు సిబ్బందిని పిలిపించి కారు పైభాగం కట్ చేయించారు. గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. సీఐ రాఘవేందర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచ్చిన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్కు నచ్చజెప్పేందుకు యత్నించాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. సమీప బంధువు దారుణ హత్య నడి రోడ్డుపై ఘాతుకం -
హిందూ ధర్మ పరిరక్షణకు కృషి
షాద్నగర్: హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో రామాలయం, శివాలయం ప్రారంభోత్సవాలను వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా బొడ్రాయి, విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. అదేవిధంగా గ్రామ దేవతలను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, అందెబాబయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్, నాయకులు సుధాకర్రావు, వంశీకృష్ణ, మురళీ, వెంకటేష్, మోహన్సింగ్, శ్యాంసుందర్, బాల్రాజ్, శ్రీనివాస్, లష్కర్ నాయక్, రంగయ్యగౌడ్, రాజు, అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
రూ.3.60 లక్షల విలువైన విదేశీ మద్యం పట్టివేత
52 మద్యం బాటిళ్లు స్వాధీనం..●ముగ్గురి పై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్ సాక్షి, సిటీబ్యూరో: అక్రమంగా తరలిస్తున్న 52 విదేశీమద్యం బాటిళ్లను ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదర్శనగర్లో ఓ కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురిపైన కేసులు నమోదు చేసిన పోలీసులు కుమార్ అగ్రవాల్, రోహిత్కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్చేశారు. ఇన్నోవా కారును సీజ్ చేశారు. డీసీఎంను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు దుండిగల్: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డుపై నిలిచి ఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి గాయపడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల కళావతినగర్కు చెందిన రమేష్ శనివారం సాయంత్రం తన డీసీఎంను బహదూర్పల్లిలోని మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్ ఎదుట పార్కు చేశాడు. గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం వెనుక భాగం దెబ్బతినగా, కారు ముందు భాగం ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వారిని పటాన్చెరువు సాయిరామ్ కాలనీకి చెందిన అక్షిత్రెడ్డి, సిద్దిపేట జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన అభినవ్ లుగా గుర్తించారు. కాగా వారు ఇద్దరూ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. వారి కారులో లభించిన మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గాయపడిన అభినవ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డీసీఎం యజమాని రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదాచేస్తేనే జీరో బిల్!
నవాబుపేట: వేసవిలో ఎండతాపానికి భరించలేక జనాలు ఉపశమనం కోసమని ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అధికంగా వాడుతుంటారు. ఫలితంగా విద్యుత్ మీటర్ గిర్రున తిరుగుతుంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గృహజ్యోతి పథకం వర్తించకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తారు. 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించాల్సిందే. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ పొదుపు అయి గృహజ్యోతి పథకాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో 7,000 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. అందులో 1,000 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ఇవి పాటించాలి ● మార్కెట్లో 5స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే వినియోగించాలి. ● ఇంట్లో టీవీ అవసరం లేకపోతే రిమోట్తో కాకుండా పూర్తిగా ఆఫ్ చేయాలి. ● చార్జింగ్ పూర్తయ్యాక ఫోన్ను ఫ్లగ్ నుంచి తొలగించాలి. ● అవసరమైతేనే ఫ్యాన్లు, కూలర్లు వేయాలి. ● రిఫ్రిజిరేటర్లో కాలానుగుణంగా ఫ్రీజర్ లెవల్స్ను మార్చుకోవాలి. ● ఏసీల ఫిల్టర్లను తరచూ శుభ్రం చేస్తూ, టైమర్ను సెట్ చేసుకోవాలి. ● వాషింగ్మెషీన్లో లోడ్కు తగిన దుస్తులు మాత్రమే వేయాలి. ● నాణ్యమైన ఎస్ఈడీ బల్బులు వాడాలి. ● అవసరం ఉన్న గదుల్లో, అవసరమైనంత సేపే లైట్లు వేసుకోవాలి. 200 యూనిట్లు దాటితేబిల్లుల మోత ‘గృహజ్యోతి’పై వినియోగదారుల సంశయం -
పెట్రోల్ ట్యాంకర్కు మంటలు
కుషాయిగూడ: ప్రమాదవశాత్తు పెట్రోల్ ట్యాంకర్ కు మంటలంటుకున్న సంఘటన ఆదివారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పాటు ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కొన్నాళ్లుగా నిలిచిపోయిన ట్యాంకర్ లారీని రిపేరు చేస్తూ ట్రయల్రన్ చేస్తున్న క్రమంలో చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఐఓసీఎల్ వద్ద ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన మెకానిక్, ఇతర డ్రైవర్లు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ట్యాంకర్కు మంటలు వ్యాపించడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు. పక్కనే పార్కు చేసి ఉన్న సిలిండర్ల ట్రక్కుకు మంటల వ్యాపిస్తే పెనుప్రమాదం జరిగి ఉండేదన్నారు. ఈ విషయమై చర్లపల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ను వివరణ కోరగా చాలా రోజులుగా నిలిచిపోయిన ట్యాంకర్ ట్రయల్రన్ వేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందన్నారు. విచారణ చేపడతామని పేర్కొన్నారు. ట్రయల్ రన్ చేస్తుండగా ప్రమాదం మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది -
ఫాస్ట్ట్యాగ్ల చోరీ
● క్యాబ్లకు విక్రయం ● ట్రైనీ కానిస్టేబుల్ అరెస్ట్ శంషాబాద్: పోలీసు వాహనాల ఫాస్ట్ట్యాగ్లను చోరీ చేసి విక్రయిస్తున్న ట్రైనీ కానిస్టేబుల్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గతంలో హోంగార్డుగా పనిచేసి ప్రస్తుతం శిక్షణ పొందుతున్న నిసార్ అహ్మద్ (28) అనే వ్యక్తి పోలీసు వాహనాలకు ఉన్న ఫాస్ట్ట్యాగ్లను చోరీ చేసి వాటిని క్యాబ్ డ్రైవర్లకు విక్రయించాడు. దీంతో సంబంధిత వాహనాలకు సంబంఽధించిన టోల్చార్జీలు పోలీసుల వాహనాలకు వెళుతున్నాయి. వీటిని విక్రయించిన నిసార్ అహ్మద్ వారి నుంచి నెలవారిగా ఒక్కో వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. టోల్ సిబ్బంది సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఆర్జీఐఏ పోలీసులు నిసార్ అహ్మద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడు విక్రయించిన ఫాస్ట్ట్యాగ్లను వినియోగిస్తున్న మూడు క్యాబ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ పేరుతో వేధింపులు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య శంషాబాద్ రూరల్: ప్రే మ పేరిట వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని పెద్దతూప్రలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వి.జంగయ్య, అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు దివ్య(16)ను అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ రెండో అంతస్తులో నిద్రకు ఉపక్రమించారు. అదే రోజు రాత్రి దివ్య సెల్ఫోన్ తీసుకుని కింద అంతస్తులోకి వెళ్లింది. ఎంతసేపటికి పైకి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా గది లోపలి నుంచి గడియపెట్టి ఉన్నది. దీంతో కిటికీ నుంచి లోపలికి చూడగా.. దివ్య చున్నీతో పైకప్పు ఉక్కుకు ఉరేసుకుని కనిపించింది. తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. రవి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకున్నారు. -
భవనాల్లేక ఇబ్బందులు
దౌల్తాబాద్: మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేక కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల నిర్వహణ కొనసాగుతుంది. స్వశక్తి సంఘాల ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సొంత భవనాలు లేవు. ప్రతి నెలా గ్రామాల్లోని చెట్లు, సంఘం సభ్యుల నివాసాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో అతివలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేదికలు కరువు మండలంలో 33 గ్రామపంచాయతీల్లో 46 గ్రామ సమాఖ్య సంఘాలున్నాయి. ఇందులో సుమారు 806 స్వయం సహాయక సంఘాలు ఉండగా 8,300 మంది సభ్యులు ఉన్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళలు జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకుంటూనే పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రామ స్థాయిలో కార్యాలయాలు లేక మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల మంజూరు, వసూళ్లు, సభ్యుల్లో చైతన్యం పెంపొందించడంలో కీలకపాత్ర పోషించే గ్రామ సంఘాలకు సరైన వేదికలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. వెంటాడుతున్న సమస్యలు సొంత భవనాలు లేక సంఘాల కార్యకలాపాల నిర్వహణతో పాటు మహిళా సమాఖ్యలు, మహిళా పొదుపు సంఘాల సమావేశాల నిర్వహణ, శిక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రామైక్య సంఘాల వద్దకు వివిధ పనుల కోసం వచ్చిపోయే మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులకు పల్లెల్లో మౌలిక వసతులు లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల నిర్వహణ కోసం మండల కేంద్రంలో ఇందిరాక్రాంతి పథం పేరిట సొంత భవనం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సంఘ భవనాలు నిర్మిస్తే సంఘాల నిర్వహణలో తలెత్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఇప్పుడైన మహిళలకు సొంత భవనాలు నిర్మిస్తారని మహిళలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కార్యకలాపాల నిర్వహణకు ఎదురవుతున్న ఇక్కట్లు తీవ్ర అవస్థల్లో మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారులకు నివేదించాం స్వయం సహాయక సంఘాల నిర్వహణ కోసం సొంత భవనాల నిర్మాణాల విషయమై ఉన్నతాధికారులకు వివరించాం. మండలంలో భవనాలు కావాలని ప్రతిపాదనలు కూడా పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే నూతన నిర్మాణాలు చేపడుతారు. – హరినారాయణ, ఇన్చార్జి ఏపీఎం, దౌల్తాబాద్ -
డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు
షాద్నగర్: ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ఆర్టీసీ బస్సు డివైడర్ ఎక్కిన ఘటన షాద్నగర్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై రాయికల్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం సాయంత్రం సుమారు 40 మంది ప్రయాణికులతో మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. బస్సు షాద్నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్పైకి ఎక్కి కొంత దూరం వెళ్లి ఆగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. -
సీపీఆర్తో ప్రాణాలు కాపాడుకోవచ్చు
మహేశ్వరం: గుండె పోటు మరణాలు పెరుగుతున్నాయని, సీపీఆర్తో ప్రాణాలు కాపాడుకోవచ్చునని జనత హృదయాలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మల్రెడ్డి హన్మంత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి తుమ్మలూరు మ్యాక్ ప్రాజెక్టు బీటీఆర్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీపీఆర్ ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. ఎవరైనా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర చికిత్స సీపీఆర్ అని తెలిపారు. ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చినప్పుడు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. ఫౌండేషన్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత శిబిరాలు నిర్వహించి, పేదలకు మేలు చేస్తున్నామని డాక్టర్ పేర్కొన్నారు. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంతోకొంత సేవ చేయాలనే లక్ష్యంతో ఉచితంగా వైద్య శిబిరాలు, పరీక్షలు, సీపీఆర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అంతకు ముందు నిర్వహించిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి ప్రాక్టికల్ శిక్షణ, థియరీ తరగతులను వివరించారు. కార్యక్రమంలో డెర్మటాలజీ వైద్యురాలు మేథినిరెడ్డి, బీటీఆర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కేర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ మల్రెడ్డి హన్మంత్రెడ్డి -
క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: దేశానికి కావాల్సిన ఉత్తమ క్రీడాకారులను అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంతర్జాతీయ మాజీ కబడ్డీ క్రీడకారుడు, ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి జగదీష్ యాదవ్ పేర్కొన్నారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ పల్లె ఆణిముత్యాల సాధన శిబిరంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగదీష్ యాదవ్ మాట్లాడుతూ.. క్రీడకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి దేశానికి ప్రతిభావంతులను అందించాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తోడ్పాటునందించాలన్నారు. ఫౌండేషన్ చైర్మన్ సదా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి సమాజానికి, దేశానికి అందించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి, నల్లగొండ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భూలోక రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవికుమార్, సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్రెడ్డి, శాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ ప్రపంచ అందాల పోటీల సందర్భంగా ట్యాంక్ బండ్పై ఆదివారం సాయంత్రం సండే ఫండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ సుందరీమణుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను తిలకించేందుకు భారీ ఎల్
కనీస వేతనాలు అమలు చేయాలి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మోమిన్పేట: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని పెన్నార్, కార్తికేయ, ఓల్టాగ్రీన్ కంపెనీలలో పని చేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంపెనీలలో 12 గంటలు పని చేయించుకొంటున్నా కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. దీనిపై అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోజుకు 12 గంటలు పని చేయించుకొంటున్న యాజమాన్యం రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే అందిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలను రూ.26 వేల నుంచి రూ.32 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఈ నెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంబంధించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. -
రండి.. సర్కారు బడిలో చేరండి
షాబాద్: ‘సర్కారు బడి పిలుస్తోంది.. రా.. కదిలిరా..’ అంటూ ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి సర్కారు స్కూళ్లలో మంచి ఫలితాలు రావడంతో ప్రతి ఏడాది జూన్లో నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని ఈసారి ఏప్రిల్ 23 నుంచే మొదలు పెట్టారు. విద్యాశాఖ సూచనల మేరకు ఉపాధ్యాయులు ప్రచారంలో వేగం పెంచారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ప్రైవేటుకు దీటుగా.. సర్కారు స్కూళ్లలో చదవడం ద్వారా ప్రయోజనాలు, అనుభవజ్ఞులైన టీచర్లు, ఉచిత యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం.. ఇలా అన్ని ఉపయోగాలను ప్రజలకు వివరిస్తూ ప్రైవేటుకు దీటుగా టీచర్లు ప్రచారం సాగిస్తున్నారు. తమ పాఠశాలలో విద్యార్థులు సాధించిన విజయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ విద్యార్థులను చేర్పించేలా ప్రోత్సహిస్తున్నారు. గ్రామ పంచాయతీ, జన సమీకరణ ఉన్న ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడీల సహకారంతో కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావడంతో తల్లిదండ్రులు కూడా సర్కార్ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచేలా ‘బడిబాట’ విస్తృత ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులుతల్లిదండ్రులు ఆలోచించాలి బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి. పేద, మధ్యతరగతి వారు ప్రైవేట్ మోజులో పడి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు ఉన్నారు. తల్లిదండ్రులు విజ్ఞతతో ఆలోచించి సర్కారు బడుల్లో తమ పిల్లలను చేర్పించాలి. టీచర్లు మరింత అంకిత భావంతో పని చేసేలా చర్యలు చేపడతాం. – లక్ష్మణ్నాయక్, ఎంఈఓ, షాబాద్ -
ఉపాధి కల్పనే!
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 20258లోuసాక్షి, రంగారెడ్డిజిల్లా: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల అవసరాల మేరకు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించడంతో పాటు ఎప్పటికప్పుడు జాబ్మేళాలు నిర్వహించాల్సిన అధికారులు అటువైపు దృష్టి సారించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నోటిఫికేషన్లు భారీగా తగ్గడం, నిరుద్యోగుల నిష్పత్తి కంటే చాలా తక్కువ పోస్టులను భర్తీ చేస్తుండటం, ఒక్కో పోస్టుకు వేల సంఖ్యలో పోటీ పడుతుండటం వెరసి.. టెన్త్, ఆపై తరగతులు పూర్తి చేసుకున్న వారు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫీసులో పేరు నమోదుకు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది 751 మందికి మించి పేర్లు నమోదు చేసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పెద్దగా పని లేకుండా పోయింది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇక్కడి ఉద్యోగులకు నిరుద్యోగ యువతకు స్కిల్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇప్పించడం, జాబ్మేళాలు నిర్వహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి పనులు అప్పగించింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయు–జీకేవై) పథకాల కిం ద నిరుద్యోగ యువతకు వివిధ అంశాలపై శిక్షణ ఇప్పించాల్సి ఉన్నా.. ఐదేళ్లుగా ఏ ఒక్కరికీ శిక్షణ ఇచ్చింది లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల సేవలో.. జిల్లాలో అనేక చిన్నతరహా, మధ్య తరహా, భారీ పరిశ్రమలతో పాటు ఐటీ అనుబంధ కంపెనీలు, ఆస్పత్రులు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి. వీటికి సెక్యూరిటీ సహా పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది అవసరం. మెజార్టీ సంస్థలు నేరుగా కాకుండా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నాయి. జిల్లా ఉపాధి కల్పనశాఖ నుంచి లైసెన్స్ పొందిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తుంటారు. ఇందుకోసం 2021లో జిల్లా ఉపాధి కల్పన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 86 ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు పేర్లు నమోదు చేసుకున్నాయి. ఈ సమయంలో ఒక్కో ఏజెన్సీ రూ.లక్ష చొప్పున ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేసింది. వీరిలో కేవలం 36 ఏజెన్సీలకు ఉపాధి కల్పించింది. అడిగినంత ముట్ట జెప్పిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తూ..మిగిలిన వారికి నిరాకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉపాధి కల్పనశాఖ ద్వారా పనులు దక్కని ఏజెన్సీలు తాము కట్టిన డీడీ మొత్తాన్ని తమకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరినా పట్టించుకోవడం లేదు. దీంతో సెట్విన్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనకు రూ.లక్ష చెక్కు రాసిచ్చారు. తీరా బ్యాంకులో డిపాజిట్ చేయగా అకౌంట్లో నగదు లేక చెక్కు బౌన్స్ కావడంతో సదరు ఏజెన్సీ నిర్వాహకుడు ఆందోళన చెందాడు. ఇదే అంశాన్ని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టి ంచుకోవడం లేదు. న్యూస్రీల్జిల్లా ఉపాధి కల్పనశాఖ నిర్లక్ష్యం యువతకు శిక్షణ ఇప్పించడంలో విఫలం జాబ్మేళాల నిర్వహణ శూన్యం 2021లో 86 ఏజెన్సీలు దరఖాస్తు 36 ఏజెన్సీలకే పని కల్పించిన వైనం నిరుత్సాహంలో నిరుద్యోగ యువతపర్యవేక్షణ లోపం ఇదిలా ఉంటే ప్రభుత్వ విభాగాలాన్నీ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొంగరలో రూ.50 కోట్లకుపైగా వెచ్చించి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించింది. అప్పటి వరకు లక్డీకాపూల్లో ఉన్న కలెక్టరేట్ సహా కీలక విభాగాలన్నింటినీ రెండేళ్ల క్రితమే కొంగరకు తరలించింది. జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం మాత్రం ఇప్పటికీ మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్లోనే కొనసాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పని దినాల్లోనూ వీరు ఆఫీసులో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు లేకపోలేదు. -
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మొయినాబాద్: గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేష్గౌడ్ కోరారు. ఈ మేరకు ఆదివారం నగరంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ను కలిసి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గౌడ కుల పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. పిడుగుపాటుకు పాడి గేదెలు మృతి కందుకూరు: పిడుగుపాటుతో మూడు పాడి పశువులు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధి రాచులూరులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నల్ల కలమ్మ పాడి పశువులతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. రోజులాగే పొలం వద్ద చెట్టు కింద నాలుగు గేదెలను కట్టేసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు, పశువుల సమీపాన పిడుగు పడటంతో మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతోంది. శంకర్పల్లివాసులకు దళితరత్న అవార్డులు శంకర్పల్లి: పట్టణానికి చెందిన కడమంచి మల్లేశ్, తూర్పాటి నరసింహ దళితరత్న అవార్డులు దక్కించుకున్నారు. ఈ మేరకు వారు ఆదివారం హైదరాబాద్లో బెడ బుడగ జంగం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రాజలింగం, అంబేడ్కర్ ఉత్సవాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న సమక్షంలో అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, తిరుమల హరి, లక్ష్మయ్య, శ్రీను, శివ, చంద్రయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. నిశ్చితార్థ వేడుకకు సీఎం, మంత్రులు, ప్రముఖులుశంకర్పల్లి: జన్వాడ శివారులోని నియో కన్వెన్షన్లో ఆదివారం సాయంత్రం నార్సింగి ఏసీపీ రమణగౌడ్ కుమారుడు పవన్రాజ్, సాయిశృతి నిశ్చితార్థ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంటను ఆశీర్వదించారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ బావబావమరుదులు అవుతారు. నిశ్చితార్థ వేడుకలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయువు తీసిన ఆట వస్తువు
మీర్పేట: ఓపెన్జిమ్ పరికరం తలపై పడటంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మీర్పేటలో చోటు చేసు కుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లెలగూడలోని దాసరి నారాయణ కాలనీకి చెందిన ప్రసాద్ కుమారుడు నిఖిల్ (5) గురువారం సాయంత్రం స్థానికంగా ఉండే పిల్లలతో కలిసి రోజూ మాదిరిగానే ఆడుకునేందుకు పక్కనే ఉన్న చిల్డ్రన్స్ పార్కుకు వెళ్లాడు. ఓపెన్ జిమ్లోకి వెళ్లి ఎయిర్ స్వింగ్ పరికరంపైకి ఎక్కాడు. దీనికి సంబంధించిన ఇనుపకడ్డీ తలపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే.. ఓపెన్ జిమ్లోని ఎయిర్ స్వింగ్ పరికరం పాడైపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయించలేదు. పాడైన పరికరం పక్కన పడేసి ఉండగా, గుర్తు తెలి యని వ్యక్తులు దీన్ని యథా స్థితిలో పెట్టారు. ఇది తెలియని చిన్నారి ఎయిర్ స్వింగ్పైకి ఎక్కడంతో ఇనుప బొంగు నిఖిల్ తలపై పడింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని వాకర్స్, స్థానిక కాలనీలవాసులు మండిపడ్డారు. ఓపెన్ జిమ్లోని ఎయిర్స్వింగ్ పరికరం పడి చిన్నారి మృతి మీర్పేట్లోని చిల్డ్రన్స్ పార్కులో ఘటన -
పెన్షన్దారుల సమస్యలు పరిష్కరిస్తాం
కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: పెన్షన్దారుల సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం పెన్షన్ ఆదాలత్, జీపీఎఫ్ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 27 ప్రభుత్వ శాఖల్లో పని చేసిన 93 పెన్షన్ పెండింగ్ దరఖాస్తులు 39 మంది పెన్షనర్లు, జీపీఎఫ్ చందాదారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు. దరఖాస్తులను అకౌంటెంట్ జనరల్ హైదరాబాద్ తెలంగాణ వారికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఎంఎస్ చందా పండిట్, అభయ్, సోనార్కర్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పద్మావతి, జిల్లా రెవెన్యూఅఽధికారి సంగీత, డిప్యూటీ డైరెక్టర్ రాజు, సంబంధిత శాఖల అధికారులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ నెల 21 వరకు ‘దోస్త్’ షాద్నగర్రూరల్: ఇంటర్మీడియెట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్ ద్వారా డిగ్రీలో చేరేందుకు ఈ నెల 21 వరకు గడువు ఉందని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్లకు దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేరుకోవాలని తెలిపారు. ఈ నెల 29న తొలి అడ్మిషన్ల కేటాయింపు జాబితా కళాశాలకు విడుదల అవుతుందని చెప్పారు. ఈ నెల 30 నుంచి జూన్ 6 వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యా ర్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 63050 51490, 98850 03390, 97034 41345 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి ఆమనగల్లు: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని టీఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బకాయి ఉన్న దాదాపు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రీయింబర్స్మెంట్ బకాయిలు ఓటీఎస్ కింద సెటిల్చేసి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లిస్తామని గతంలో సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. సమావేశంలో టీఎస్ఎస్ఓ నాయకులు వంశీ, సుదర్శన్, చిక్కి, సందీప్ తదితరులు ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో రూ.15.2 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.15.2 లక్షలు స్వాహా చేశారు. వివరాలివీ.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి గత నెల 9న వాట్సాప్ కాల్ వచ్చింది. తమ సూచనలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. తమ కంపెనీ పేరు ‘ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్’ అని, తమకు సెబీ అనుమతి కూడా ఉందని నమ్మించారు. ఐసీఐసీఐ సెక్యూరిటీ ట్రేడింగ్ పేరుతో ఉన్న యాప్ను లింక్ ద్వారా షేర్ చేసిన సైబర్ నేరగాళ్లు దాన్ని ఇన్ స్టల్ చేసుకుని, యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు. అలా చేసిన బాధి తుడు దాని ద్వారానే నేరగాళ్ల ఖాతాల్లోకి రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.8.2 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లు, లాభాలతో కలిపి బ్యాలెన్స్ రూ.91.21 లక్షలకు చేరినట్లు యాప్లో బాధి తుడికి కనిపించింది. ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. నగదు వెనక్కు తీసుకోవాలంటే మరో రూ.4.3 లక్షలు డిపాజిట్ చేయాలంటూ నేరగాళ్లు చెప్పారు. అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా.. విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదంటూ నేరగాళ్లు స్పష్టం చేశారు. త్వరలోనే తమ యాప్లోని ఖాతా కూడా బ్లాక్ అయిపోతుందని బెదిరించారు. దీంతో తాను రూ.15.2 లక్షల మేర మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోర్డింగ్లపై హైడ్రా నజర్
మీర్పేట: శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులు పొందకుండా ఏర్పాటు చేస్తున్న వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్లపై హైడ్రా దృష్టి సారించింది. మీర్పేటతో పాటు చాలా వరకు మున్సిపాలిటీల్లో ఎలాంటి అనుమతులు పొందకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అడిగేవారు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినా స్థానిక టౌన్ప్లానింగ్ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో హోర్డింగ్లు ఏర్పాటు చేసే సంస్థలు, భవనాల యజమానులకు కొంత కాలంగా లబ్ధి చేకూరుతోంది. ఈ క్రమంలో స్థానిక మున్సిపల్ టౌన్ప్లానింగ్ విభాగంతో కలిసి హైడ్రా అక్రమ హోర్డింగ్లను గుర్తించి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. యుద్ధ ప్రాతిపదికన తొలగింపు మీర్పేట కార్పొరేషన్ పరిధి బాలాపూర్ చౌరస్తాలో రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఏ ఒక్క హోర్డింగ్కు అనుమతి లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఈ ప్రాంతంలో ప్రముఖ సంస్థల వ్యాపార ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్లు ఉన్నాయి. కార్పొరేషన్లో సగం కంటే ఎక్కువ హోర్డింగ్లకు అనుమతులు లేవని హైడ్రా అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించనున్నట్టు తెలిపారు. మీర్పేట ప్రాంతంలో హోర్డింగ్లతో పాటు బస్ షెల్టర్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు విద్యాసంస్థలు, ఇతర సంస్థల ఫ్లెక్సీలను సైతం తొలగిస్తున్నట్టు చెప్పారు. మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి గుర్తించే పనిలో అధికారులు తొలగింపు ప్రక్రియ షురూమరోవైపు కొత్తవి ఏర్పాటు ఓవైపు హైడ్రా అధికారులు అనుమతులు లేని హోర్డింగ్లపై కొరడా ఝులిపిస్తుండగా, మరోవైపు అవేమీ పట్టించుకోకుండా కొత్తవి ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్ కార్యాలయం వద్ద మీర్పేట కూడలిలో ఎలాంటి అనుమతులు పొందకుండా తాజాగా భారీ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. అక్రమ హోర్డింగ్లపై హైడ్రా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కూడలిలో హోర్డింగ్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
ఎల్ఆర్ఎస్ అంతంతే..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ లే అవుట్లను 25 శాతం రాయితీతో క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మే చివరి వరకు గడువు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు చెల్లించేందుకు ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ వస్తున్నా.. ప్లాట్ల యజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మూడు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,55,923 దరఖాస్తులు అందగా, వీటిలో 1,78,591 క్రమబద్ధీకరణకు అర్హత పొంది, అర్హులైన వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు 65,186 మంది మాత్రమే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.255.56 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. 77,332 దరఖాస్తులకు సంబంధించిన ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఉన్నట్లు గుర్తించి, వాటిని రిజెక్ట్ చేశారు. మూడుసార్లు గడువు పెంచినా.. ఖాళీ ప్లాట్లు/ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ జారీ చేసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు రూ.పది వేలు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.వెయ్యి ఫీజుగా నిర్ణయించింది. ఆ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని నాలుగు జోన్లలో 3,58,464 దరఖాస్తులు రాగా, రంగారెడ్డిలోని మూడు కార్పొరేషన్లు, పదిహేను మున్సిపాలిటీల నుంచి రెండున్నర లక్షలకుపైగా, ఫరూఖ్నగర్, కేశంపేట, యాచారం, తలకొండపల్లి, కడ్తాల్, కొందుర్గు, మాడ్గుల, మంచాల, జిల్లెడు చౌదరిగూడెం మండల కేంద్రాల నుంచి 45 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. నిజానికి మూడేళ్ల క్రితమే ఈ దరఖాస్తులను స్వీకరించినప్పటికీ వివిధ కారణాలతో క్రమబద్ధీకరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో వన్టైన్ సెటిల్మెంట్ పథకాన్ని (ఓఎస్ఎస్) తీసుకొచ్చి 25 శాతం రాయితీ ప్రకటించింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం వాటి పరిశీలన కోసం రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు ఇప్పటికే ఆయా దరఖాస్తులను పరిశీలించాయి. తొలి గడువు మార్చి 31తో ముగిసింది. తర్వాత క్రమబద్ధీకరణ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచింది. ఈ గడువు కూడా ముగిసిపోవడంతో మరో మూడు రోజులు అవకాశం కల్పించింది. అయినా ఆశించిన స్థాయిలో ఫీజు చెల్లింపులు కాకపోవడంతో తిరిగి నాలుగోసారి గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు చెల్లించక పోవడానికి కారణాలివే.. ఖాళీ ప్లాట్లకు రూ.లక్షల్లో ఫీజులు ఎందుకు చెల్లించాలనే భావన యజమానుల్లో ఉంది. గృహాలు నిర్మించే సమయంలో చెల్లిస్తే వడ్డీ కలిసి వస్తుందని భావిస్తున్నారు. గతంలో భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎల్ఆర్ఎస్కు అనుమతిస్తే.. సదరు స్థలం మార్కెట్ విలువను బట్టి దరఖాస్తుదారు ఫీజు చెల్లించేవారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనకు ముందే ఫీజు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించడంతో ఇందుకు వారు వెనుకాడుతున్నారు. 25 శాతం రాయితీ వర్తించాలంటే మొత్తం సొమ్ము ఒకే సమయంలో చెల్లించాల్సి వస్తోంది. వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న వారి ప్లాట్లు 111 జీఓ పరిధిలో ఉండటం, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయశాఖ, ప్రభుత్వ భూముల జాబితాలో నమోదై ఉండటంతో ఆ దరఖాస్తులు క్రమబద్ధీకరణకు నోచుకోలేకపోతున్నాయి. గడువు పొడిగిస్తున్నా స్పందన నామమాత్రమే 25 శాతం రాయితీ ఇచ్చినా ప్రభావం కొంతే.. క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపని యజమానులు ఆశించిన ఆదాయం రూ.600 కోట్లకుపైగా ఇప్పటి వరకు సమకూరింది రూ.255 కోట్లే ఈ నెలాఖరు వరకు మరోసారి అవకాశం -
‘అందాల’ డ్రెస్ డిజైనర్ మన స్వాతి..
అనంతగిరి: ప్రపంచ అందాల పోటీల్లో భాగంగా గురువారం భూదాన్ పోచంపల్లిలో తళుక్కుమన్న ముద్దుగుమ్మలకు డ్రెస్లు డిజైన్ చేసింది ఎవరో కాదు వికారాబాద్ జిల్లాకు చెందిన మఠం వైద్యనాథ్ కూతురు ఎం.స్వాతి. ఈమె ఆరేళ్లుగా హైదరాబాద్లో మైరీతి, తరం పేరిట డ్రెస్ డిజైనింగ్ చేస్తోంది. విదేశీ వనితలు, నటీమణులు, ఉన్నత స్థాయిలో ఉన్న వారికి వివిధ ఆకృతుల్లో అందమైన డ్రెస్లు డిజైన్ చేసి ఇస్తోంది. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 40 మంది అందెగత్తెలకు వారు కోరిన విధంగా డ్రెస్లను రూపొందించింది. పోచంపల్లి, నారాయణపేట చేనేత వస్త్రాన్ని వాడి దుస్తులు తయారు చేయడం వీరి ప్రత్యేకత. గురువారం జరిగిన కార్యక్రమంలో అందాల భామలు స్వాతి డిజైన్ చేసిన డ్రెస్లు ధరించి అలరించారు. దుస్తుల తయారీకి నెల రోజులు కష్టపడినట్లు తెలిసింది. స్వాతితోపాటు మైరీతి, తరం మరో వ్యవస్థాపకులు, మితుల్ నిర్వాహకులు ఎం.మహేంద్ర, ఎం.మానస, వారి డిజైనర్స్ మౌనిక, రమ్య ఇతర సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. -
ట్రాఫిక్ చలాన్ల సమస్య నివారించాలి
లక్డీకాపూల్ : గ్రేటర్ పరిధిలోని చర్చిల వద్ద ట్రాఫిక్ చలాన్ల సమస్యను నివారించాలంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీఎం ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జీ. చిన్నారెడ్డి పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చర్చిల వద్ద ప్రతి ఆదివారం ప్రార్థనలకు వచ్చే క్రిష్టియన్లు రోడ్డు పక్కన వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బిషప్స్, పాస్టర్స్, క్రిస్టియన్ సంఘం ప్రతినిధులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన చిన్నారెడ్డి చర్చిల వద్ద చలాన్ల సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. క్రిస్టియన్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనే సాల్మన్ రాజ్ నేతృత్వంలో ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరరయ్యారు. సీఎం ప్రజావాణిలో బిషప్లు, పాస్టర్ల వినతి డీజీపీకి లేఖ రాసిన ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి -
సేంద్రియ సాగుతో అధిక లాభాలు
మొయినాబాద్: సేంద్రియ వ్యవసాయంతో రైతులకు అధిక లాభాలు కలుగుతాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఏ.మాధవి, పి.లీలారాణి అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్లో పంటల సాగు, భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులతోపాటు నేల ఆరోగ్యాన్ని, భూసారాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. భూసార పరీక్షలు చేయించి నేల స్వభావాన్ని బట్టి తగిన మోతాదులో జీవన ఎరువులు వాడాలని సూచించారు. పంటల సాగులో రైతులు శాసీ్త్రయ పద్ధతులను అవలంబించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ అనురాధ, పీహెచ్డీ విద్యార్థులు రాజ్కుమార్, నవ్య, అశోక్, ఏఈఓ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.వర్సిటీ శాస్త్రవేత్తలు మాధవి, లీలారాణి -
రోడ్డును ఆక్రమించి..షెడ్డు నిర్మించి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్, షేక్పేట మండలం, జూబ్లీహిల్స్ రోడ్ నెం.78 నవ నిర్మాణ్నగర్ కాలనీ వెనక ఉన్న ప్రభుత్వ స్థలంలో..ఉమ్మడి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. సర్వే నెం.403లో ఒక్కొక్కరికి 50 గజాల చొప్పున ఈ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారు. 1999 ప్రాంతంలో చంద్రబాబు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ స్థలంలోనే ఈ క్వార్టర్లు నిర్మించి ఇందులో ఆరుగురికి పట్టాలు కూడా ఇచ్చారు. మరో ఆరు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చంద్రబాబు ఇంట్లో దోభీ, తోటమాలి తదితరులు ఖాళీగా ఉన్న ప్లాట్లలో ఉంటున్నారు. ప్లాట్ నెంబర్.1లో ఎలాంటి పట్టా లేకుండా సీహెచ్.మూర్తి అనే దోభీ కొంత కాలంగా అక్రమంగా నివసిస్తుండటమే కాకుండా..క్వార్టర్స్ ముందు రోడ్డును ఆక్రమించి షెడ్డు నిర్మించాడు. దీంతో స్థానికులు రాకపోకలు స్తంభించాయి. ఈ విషయమై కొంత కాలంగా పట్టాలు ఉండి అధికారికంగా ఉంటున్న వారికి, పట్టాలు లేకుండా ఖాళీ ప్లాట్లలో ఉంటున్న వారికి మధ్య రోడ్డు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ సీవరేజి పైప్లైన్, మంచినీటి పైప్లైన్ మంజూరు కావడంతో పాటు జీహెచ్ఎంసీ రోడ్డు పనులు కూడా ప్రారంభించాల్సి ఉంది. అయితే దోభీ మూర్తి ఆక్రమించిన స్థలంలో షెడ్డు నిర్మాణం వీటికి అడ్డుగా ఉంది. సదరు షెడ్డును తొలగిస్తే పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణంపై స్థానికులు షేక్పేట తహసీల్దార్కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ అనితారెడ్డి క్వార్టర్లను పరిశీలించారు. వారి వద్ద ఉన్న పట్టాలు, ఖాళీగా ఉన్న ప్లాట్లపై ఆరా తీశారు. రోడ్డు ఆక్రమించి షెడ్డు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు రెండు రోజుల గడువు ఇస్తున్నామని ఆమె హెచ్చరించారు. మరో వైపు పట్టాలు లేకుండానే కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వం నిర్మించిన ఈ క్వార్టర్లలో తిష్టవేసి వీటిని శాశ్వతంగా కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఈ విషయంపై స్పందించి అక్రమార్కులను ఖాళీ చేయించి క్వార్టర్స్ అన్యాక్రాంతం కాకుండా చూడటంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో సిబ్బందికి క్వార్టర్లు వాటిలో తిష్టవేసిన అక్రమార్కులు రెవెన్యూ అధికారుల పరిశీలన అక్రమ నిర్మాణాలుతొలగించాలని ఆదేశం -
నిమ్స్లో స్లిట్ ల్యాంప్ ఏర్పాటు
లక్డీకాపూల్: నిమ్స్లో రుమటాలజీ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక స్లిట్ ల్యాంప్ను ఏర్పాటు చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో సమకూర్చిన ఈ స్లిట్ ల్యాంప్ను శుక్రవారం డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుమటాలజీ క్లినిక్లో ప్రతి మంగళవారం పిల్లలకు స్లిట్ ల్యాంప్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రుమటాలజీ రోగుల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ రూ. 4 లక్షల విలువైన ఆధునిక స్లిట్ ల్యాంప్ను సమకూర్చిందన్నారు. క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగంలో ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో రుమటాలజీ విభాగం హెచ్ఓడీ డా.లీజా రాజశేఖర్, ఎల్వీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.ప్రసాంత్ గర్గ్, యూవైటిస్ నిపుణులు డా. బసు, పీడియాట్రిక్ రుమటాలజీ నిపుణుల డా.కీర్తి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక ఆలోచన పెరగాలి
మొయినాబాద్: భారత దేశ యువతలో ఔత్సాహిక ఆలోచన ధోరణిని పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న అరిస్టాటిల్ పీజీ కళాశాలలో ‘సుస్థిర ప్రపంచం కోసం ఔత్సాహిక, ఆవిష్కరణలు’ అనే అంశంపై రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత సుస్థిర అభివృద్ధిపై ఆసక్తి పెంచుకుని.. ఆ దిశగా ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచడం కోసం మేనేజ్మెంట్ విద్యలో ఆ అంశాన్ని చేర్చాలని సూచించారు. యూఎస్ఏ స్కైలైన్ యునివర్సిటీ ప్రతినిధి శ్రీమహేష్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పరిశ్రమల ఏర్పాటు వైపు యువత అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శాసీ్త్రయ రచనల సావనీర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ డీన్ రాములు, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్రెడ్డి, కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నర్సయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి -
భక్తిభావాన్ని అలవర్చుకోవాలి
షాబాద్: ప్రతి ఒక్కరూ భక్తిభవాన్ని అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో శ్రీ సీతారాముల, లక్ష్మణ, భరత, శత్రజ్ఞ, హనుమంతుని విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యావకాశాలు
మంచాల: భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కార్యదర్శి అజిత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దనున్న ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో అజిత్రెడ్డి మాట్లాడుతూ.. ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, చారకోన వెంకటేశ్, జోష్నా రెడ్డి, డీఈఓ సుశీందర్రావు, మండల విద్యాధికారి రాందాస్, ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల బీమా పునరుద్ధరణ!
షాబాద్: రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఆశించిన మేర పంట చేతికొచ్చి మంచి ధర పలికితే రైతులకు ఎంతో మేలు. కానీ కొన్నిసార్లు పండించిన పంట అకాల వర్షాలకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉండటంతో పంటలకు బీమా తప్పనిసరి అని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తిరిగి అమలు చేసే యోచనలో ఉంది. 2018 నుంచి నిలిపివేత పంటల బీమా పథకం రాష్ట్రంలో 2018 నుంచి అమ లు కావడం లేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎలాంటి పరిహారం అందడం లేదు. బీమాను అమలు చేస్తే ప్రీమియం చల్లించిన అన్నదాతలకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుంది. మండలంలో ఏటా వానాకాలం, యాసంగి లో సుమారు వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా అమ లు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పంటను బట్టి కొంత ప్రీమి యం చెల్లిస్తే మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధానం ఉండేది. ప్రస్తుతం ఎలాంటి విధివిధానాలు అమలు చేస్తారో వేచి చూడాలి. గతంలో భారీ నష్టం గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు మండలంలో నాగర్గూడ, తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లి, రుద్రారం, హైతాబాద్, సోలీపేట్ ప్రాంతాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. నీరందక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలు, తెగుళ్లు సోకి పంటలు దెబ్బతిన్నా బీమా రక్షణ కవచంలా పని చేస్తుంది. దీంతో రైతులు ఈ పథకాన్ని అమలు చేయాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వానాకాలం నుంచి అమలుయోచనలో ప్రభుత్వం రైతుల్లో చిగురిస్తున్న ఆశలు -
ఫ్లెక్సీ రాజేసిన చిచ్చు
మహేశ్వరం: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి కట్టిన ఫ్లెక్సీ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చిచ్చు రాజేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు గులాబీ రంగు బ్యానర్ను ఎలా వాడతారని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గేటు వద్ద ఎమ్మెల్యే సబితారెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఆహ్వానం పలుకుతూ గులాబీ రంగుతో కూడిన బ్యానర్ కట్టారు. అధికారిక కార్యక్రమం వద్ద పార్టీ ఫ్లెక్సీ ఎందుకు కట్టారని బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నాయకులు మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కారు దిగగానే కాంగ్రెస్ నేతలు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఇరువర్గాలను చెదరగొట్టి నచ్చజెప్పారు. పరస్పరం ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం 180 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫ్లెక్సీ విషయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. తులం బంగారం ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని చురకలంటించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్ సైదులు, ఎంపీఓ రవీందర్రెడ్డి, ఆర్ఐలు స్వర్ణకుమారి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వాగ్వాదం -
‘సన్నాల’ సాగును ప్రోత్సహించండి
అనంతగిరి: జిల్లాలో సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్, కలెక్టర్ ప్రతీక్జైన్తో కలసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న రకం వడ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ గురించి రైతులకు వివరించి సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాజీవ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని.. విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని 54 నంబర్ రేషన్ దుకాణాన్ని గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, కార్డుదారులు బియ్యం తీసుకెళ్తున్నారా తదితర విషయాలను డీలర్ను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి కొడంగల్: పట్టణంలో కొత్తగా చేపట్టిన ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గురు వారం నిర్మణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసవాల సంఖ్యను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పట్టణంలోని హరే కృష్ణ సంస్థ ద్వారా పాఠశాలలకు అల్పా హారాన్ని సరఫరా చేసే కిచెన్ షెడ్ను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, కడా ప్రతేకాధికారి వెంకట్రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీమేరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ, తహసీల్దార్ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు పరిగి: రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. గురువారం పరిగి మండలం సుల్తాన్పూర్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూర్ సబ్కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎస్ఓ మోహన్బాబు, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, అధికారులు సారంగపాణి, తహసీల్దార్ ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు -
ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
హయత్నగర్: రోడ్డు ప క్కన చెట్టుకు టవాల్తో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. కుంట్లూరు నుంచి గౌరెల్లికి వెళ్లే రహదారిలో నర్సరీ పక్కన వేప చెట్టుకు ఓ వ్యక్తి టవాల్తో ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటనా స్థలానికి వారు చేరుకొని మృతుడి వివరాలపై ఆరా తీశారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయ సు సుమారు 45 ఏళ్లు ఉంటాడని, ఎరుపు రంగు టీషర్టు ధరించాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయంలో చోరీ అబ్దుల్లాపూర్మెట్: ఆలయంలోకి చొరబడి రెండు కిలోల వెండి, 22 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిఽధిలోని బలిజగూడలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో రోజు మాదిరిగానే ఆలయ అర్చకుడు భూషణ్ బుధవారం సాయంత్రం 6.30 గంటలకు పూజలు నిర్వహించారు. అనంతరంఆలయ తలుపులకు తాళాలు వేసి ఇంటికి వెళ్లా డు. గురువారం తెల్లవారు జామున 4గంటలకు గ్రామానికి చెందిన మెరుగు నర్సింహ అనే వ్యక్తి భూషన్కు ఫోన్ చేసి గుడి తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తలుపులు విరగ్గొట్టి ఉంది. స్థానికుల సహకారంతో పరిశీలించగా ఉత్సవమూర్తులకు అలంకరించిన వెండి, బంగారు ఆభరణాలు కనిపించలేదు. అపహరణకు గురైన వెండి 2 కిలోలు, బంగారం 22 గ్రా ముల వరకు ఉంటుందని ఆలయ అర్చకుడు భూషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు
మొయినాబాద్: పచ్చిరొట్ట పైర్ల సాగుతో భూమిలో భూసారాన్ని పెంచుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త ఎస్.జి మహాదేవప్ప అన్నారు. మొ యినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో గురువారం వరిలో యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట పైర్లతోపాటు సేంద్రియ ఎరువులను వాడి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పంటమార్పిడి విధానం, చిరుధాన్యాల సాగుతో భూమి ఆరోగ్యాన్ని పెండంతోపాటు పర్యావరణ సంరక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్, సహాయ వ్యవసాయ సంచాలకులు బీజే సురేష్, ఏఓ అనురాధ, ఏఈఓ సునీల్, రైతులు పాల్గొన్నారు. -
చికెన్ బిర్యానీలో బల్లి
ఇబ్రహీంపట్నంలో కలకలం రేపిన ఘటన ఇబ్రహీంపట్నం: చికెన్ బిర్యానీలో బల్లి కనిపించిన సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఓ హోటల్లో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శేరిగూడ గ్రామానికి చెందిన జి.కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై గల ఏఆర్ మైఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్లి చికెన్ బిర్యానీ భుజిస్తున్నాడు. అందులో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఖంగుతిన్నాడు. 100 డయల్ చేసి అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు రెస్టారెంట్ను సందర్శించి విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్కు దృష్టికి తీసుకొచ్చారు. పుడ్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం హోటల్ను సందర్శించి తనిఖీ చేస్తానని తెలిపినట్లు మున్సిపల్ పర్యావరణ అధికారి ప్రణవ్ తెలిపారు. కాగా బిర్యానీలో బల్లి వచ్చిన సంఘటనపై ఫిర్యాదు అందిందని.. ఈ అంశాన్ని మున్సిపల్, ఫుడ్సేఫ్టి అధికారులే నిర్ధారించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపారు. విద్యుదాఘాతంతో గేదె మృతిఇబ్రహీంపట్నం: కరెంట్ తీగలు తగలడంతో ఓ గేదె మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. అదే ఊరికి చెందిన నాంపల్లి లాలయ్యకు రెండు గేదెలున్నాయి. అతని వ్యవసాయ క్షేత్రంలో వాటిని మేత కోసం ఉదయం వదిలిపెట్టాడు. సమీపంలోని విద్యుత్ స్తంభానికి సపోర్టుగా ఉన్న తీగలు ఓ గేదె కాళ్లకు చుట్టుకున్నాయి. వాటిని విడిపించుకునే క్రమంలో విద్యుత్ తీగలకు తగిలి షాక్తో మృతి చెందింది. జీవనాధారం కోల్పోయానని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఫేక్ ఆధార్తో స్థలం కాజేసే కుట్ర
అబ్దుల్లాపూర్మెట్: చనిపోయిన వ్యక్తి స్థానంలో వేరొకరిని చూపించి.. నకిలీ ఆధార్ కార్డును సృష్టించిన కేటుగాళ్లు ఓ ప్లాటును తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కుట్ర పన్నారు. ఆధార్ కార్డుపై మార్ఫింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన ముఠా సభ్యుల తీరుపై అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గోషామహల్కు చెందిన చంద్రకాంత్కు మండల పరిధిలోని మజీద్పూర్లో ఉన్న 267 గజాల స్థలాన్ని మనకర్ ఆనంద్ జీపీఏ(866/2013) చేయించుకున్నాడు. కొన్ని నెలలకే ఆనంద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించి ఆ స్థలాన్ని కాజేయాలని చంపాపేటలో నివాసముండే కొసిరెడ్డి భాస్కర్రెడ్డి(సస్పెండ్కు గురైన ఆర్టీసీ ఉద్యోగి) పన్నాగం వేశాడు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా గోనకోల్కు చెందిన బోదాసు ఆంజనేయులును ప్లాట్ యజమాని ఆనంద్గా చూపించేందుకు నకిలీ ఆధార్ కార్డు సృష్టించాడు. అదే సమయంలో వరంగల్లోని బలపాలకు చెందిన జిల్లాపల్లి సంజీవరావును చంద్రకాంత్గా చూపించేలా మరో ఆధార్ కార్డును తయారు చేశాడు. సాక్షులుగా గోనకోల్క చెందిన దండుగల ఆంజనేయులు, చంపాపేట్లో ఉంటున్న కురువ శ్రీనివాసులును తీసుకెళ్లాడు. వీరందరి నుంచి భాస్కర్రెడ్డి కొనుగోలు చేస్తున్నట్టు డాక్యుమెంట్ రైటర్ ఉదయ్కుమార్తో పత్రాలు సిద్ధం చేసుకున్నాడు. బుధవారం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయానికి ఆధార్ కార్డుల నంబర్లు నమోదు చేసే సమయంలో బయోమెట్రిక్లో అసలు, నకిలీ వ్యక్తులకు సరి తూగలేదు. బయోమెట్రిక్ సమయంలో ఆనంద్ పేరుతో ఉన్న ఆధార్ కార్డు నంబరు నమోదు చేయగా ఆంజనేయులు పేరు. చంద్రకాంత్ పేరిట ఉన్న ఆధార్ కార్డును నమోదు చేయగా సంజీవ పేర్లు రావడంతో సబ్రిజిస్ట్రార్ సునీతా రాణి అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. నిందితులు భాస్కర్రెడ్డి, శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు. సబ్రిజిస్ట్రార్ ఫిర్యాదుతో భగ్నం పోలీసుల అదుపులో నిందితులు -
కౌన్సెలింగ్కు వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి
రాజేంద్రనగర్: భార్యభర్తల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం పోలీస్స్టేషన్కు వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... కిస్మత్పూర్ దర్గా ఖలీజ్ ఖాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ (35) ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడి ఇద్దరూ భార్యలు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా అతను మరో మహిళతో ఉంటున్నాడు. ఈ విషయమై రెండో భార్య ఇషాద్ బేగం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భార్యభర్తలను మంగళవారం రాత్రి పోలీస్స్టేషన్కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ఇంటికి వెళ్లాలని సూచించారు. పోలీస్స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇర్ఫాన్ రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడిని అత్తాపూర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్యను కడతేర్చిన భర్త
పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతు రు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్న జాకీర్ తన మకాంను ఈనెల 1న బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్సిటీ కాలనీకి మార్చాడు. మంగళవారం అర్ధరాత్రి భార్య తో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానంతో హత్య -
రోడ్డు దాటుతుండగా కారు ఢీ
అక్కడికక్కడే వృద్ధుడి మృతి ఇబ్రహీంపట్నం: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపేట్కు చెందిన మద్దెల ఎట్టయ్య (70) స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ప్రజ్ఞా కళాశాల సమీపంలో రోడ్డు దాటుతుండగా ఆరుట్ల వైపు వేగంగా వెళ్తున్న కారు, అదుపు తప్పి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రమాదస్థలంలోనే మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, బాడీని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. ఎఫ్టీఎల్లో మట్టి డంపింగ్ తుర్కయంజాల్: గంగరాయన్ చెరువులో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఎన్ఓసీ పేరుతో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వందలాది టిప్పర్ల మట్టి నింపుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుదాఘాతంతో ఆవు మృతి కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం బైరంపల్లిలో బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరిపేట మల్లయ్య తన ఆవును పొలం వద్ద మేపుతుండగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఆవు విలువ రూ.70 వేలు ఉంటుందని, బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అక్కడ ట్రైనింగ్... ఇక్కడ యాక్షన్!
1993 నుంచి లింకులు... ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థ 1987లో ప్రారంభమైంది. దీని ఛాయలు నగరంలో 1993 నుంచీ ఉన్నాయి. ముంబైకి చెందిన జలీస్ అన్సారీ, ఉత్తరప్రదేశ్కు చెందిన అబ్దుల్ కరీం టుండా, కోల్కతాకు చెందిన అబ్దుల్ మసూద్, వరంగల్కు చెందిన ఆజం ఘోరీ తన్జీమ్ ఇస్లాహుల్ ముస్లిమీన్ (టీఐఎం) పేరుతో ఓ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు. 1993లో నగరంలోని అబిడ్స్, నాంపల్లి, సికింద్రాబాద్, హుమాయున్నగర్, మౌలాలీల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆజం ఘోరీతో (2000లో జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు) పాటు మిగిలిన ముగ్గురూ మర్కజ్ తోయిబాలో శిక్షణ పొందిన వారే. 1998లో పాకిస్తాన్ నుంచి పాతబస్తీకి వచ్చి, ఇక్కడి యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ సలీం జునైద్ పట్టుబడ్డాడు. ఇతడూ అదే టెర్రర్ క్యాంప్లో శిక్షణ పొందిన వాడే. మరో సంస్థ ఏర్పాటు చేసిన ఆజం ఘోరీ... టీఐఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆజం ఘోరీ 1999లో ఇండియన్ ముస్లిం మహ్మదీయ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) ఏర్పాటు చేశాడు. నగరంలోని ఆరు ప్రాంతాలతో పాటు విజయవాడ, బోధన్, నిజామాబాద్ల్లోనూ విధ్వంసాలు సృష్టించిన ఈ మాడ్యుల్లోని అనేక మంది మురిద్కే వరకు వెళ్లి శిక్షణ పొంది వచ్చిన వాళ్లే. 2001లో గణేష్ నిమజ్జనంలో పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్, 2002లో దిల్సుఖ్నగర్లోని సాయిబాబ దేవాలయం వద్ద పేలుడుకు పాల్పడిన ఆజం, అజీజ్ తదితరులు, 2004లో సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర పన్నిన నసీరుద్దీన్ మాడ్యుల్, 2005లో నగర వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నిన నవీద్ మాడ్యుల్... వీటన్నింటి వెనుక ఎల్ఈటీనే ఉంది. ఈ విధ్వంసాలు, కుట్రలకు పథక రచన చేసి, పాల్గొన్న వారిలో అత్యధికులు మురిద్కే వరకు వెళ్లి మర్కజ్ తోయిబాను ‘చూసి’ వచ్చిన వాళ్లే. సౌదీలో ఉద్యోగాల పేరుతో ఎర వేసి... నగర యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ఎల్ఈటీ, దాని అనుబంధ సంస్థల నిర్వాహకులు వారిని నేరుగా మర్కజ్ తోయిబాకు చేర్చలేదు. ఎల్ఈటీ స్లోగన్స్లో ‘హైదరాబాద్ లిబరేషన్’ కూడా కీలకం కావడంతో నగరం, కాన్పూర్లకు చెందిన యువతనే ఎక్కువగా ఆకర్షించే వాళ్లు. వీరిని ఉద్యోగాల పేరుతో సౌదీకి తీసుకువెళ్లి అక్కడి నుంచి మురిద్కే పంపేవాళ్లు. ఉగ్రవాద శిక్షణ పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా హైదరాబాద్ చేర్చేవాళ్లు. మర్కజ్ తోయిబాలో ఉన్న ట్రైనర్లకూ నగరంపై మంచి పట్టు ఉండేది. శిక్షణ కోసం వెళ్లిన యువతతో ఉర్దూలో మాట్లాడటం, సిటీలో ఉన్న కీలక ప్రాంతాల వివరాలు అడగటం చేసే వాళ్లు. చిక్కిన ముష్కరులు, వారి సానుభూతిపరుల విచారణలో ఈ విషయం గుర్తించిన నిఘా వర్గాలు ఆ ట్రైనర్లు ఇక్కడ సంచరించి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత బలగాలు ధ్వంసం చేసిన తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల్లో మురిద్కేలో ఉన్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టెర్రర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. లాహోర్ సమీపంలో నియంత్రణ రేఖకు 30 కిమీ దూరంలో ఉన్న ఈ కీలక క్యాంప్ను మర్కజ్ తోయిబా అని పిలుస్తారు. దీనితో హైదరాబాద్కు అనేక లింకులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్లిన, ఇక్కడ పట్టుబడిన అనేక మంది ఉగ్రవాదులు, సానుభూతిపరులు మర్కజ్ తోయిబాలో శిక్షణ పొందడమో, అక్కడ జరిగే వార్షిక సమావేశాల్లో పాల్గొనడమో చేసిన వాళ్లే. 1993 నాటి జలీస్ అన్సారీ, 1998లో చిక్కిన పాకిస్థానీ సలీం జునైద్ నుంచి ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్గా ఉన్న కుర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ వరకు ఈ కోవకు చెందిన వాళ్లే. – సాక్షి, సిటీబ్యూరో●ఫర్హాతుల్లా పాత్ర అత్యంత కీలకం... ఎల్ఈటీతో పాటు మర్కజ్ తోయిబాలోనూ కూర్మగూడ వాసి ఫర్హాతుల్లా ఘోరీ పాత్ర అత్యంత కీలకమని నిఘా వర్గాలు చెప్తున్నాయి. 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లిన ఇతగాడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ దేవాలయంపై జరిగిన దాడి కేసుతో ఇతని వ్యవహారాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. 2004లో నగరం కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది. ఘోరీ అప్పట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్కు (జేఈఎం) సానుభూతిపరుడిగా ఉండి ఈ కేసులోనూ నిందితుడిగా మారాడు. ఆ తర్వాత 2005లో టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ కేసులోనూ వాంటెడ్గా ఉన్నాడు. 2022లో దసరా నేపథ్యంలో విధ్వంసాలకు కుట్రపన్ని ఽహ్యాండ్ గ్రెనేడ్స్తో సహా చిక్కిన ‘ఉగ్ర త్రయం’లో కీలకమైన జాహెద్తోనూ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇతను గత ఏడాది వరకూ మర్కజ్ తోయిబాలో జరిగే వార్షిక సమావేశాలకు హాజరయ్యాడు. మురిద్కేలో ధ్వంసమైనఎల్ఈటీ ‘టెర్రర్ ఫ్యాక్టరీ’ ‘సిటీ ఉగ్రవాదుల్లో’ పలువురికి అది సుపరిచితం జలీస్ అన్సారీ నుంచిఫర్హాతుల్లా ఘోరీ వరకు... నగరంలో జరిగిన విధ్వంసాలకు అక్కడే కుట్రలు -
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి
అబ్దుల్లాపూర్మెట్: తాటిపై నుంచి కింద పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతపల్లి గ్రామానికి చెందిన అంతటి సంతోష్(45) వృత్తి రీత్యా గీత కార్మికుడు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో తన పొలంలోని తాటి చెట్ల నుంచి తాటాకులు కోయడానికి వెళ్లి, రాత్రి 9 గంటల వరకు కూడా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతని భార్య ఉష తన కుమారుడితో కలిసి ఆచూకీ కోసం వెతకగా ఓ తాటిచెట్టు కింద సంతోష్ చెప్పులు కనిపించాయి. పరిసరాల్లో పరిశీలించగా తాటిచెట్టు కింద ఉన్న బావిలో పడి విగత జీవిగా కనిపించాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు గ్రామస్తుల సహకారంతో బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మ్యాన్హోల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం రాంగోపాల్పేట్: ఓ హోటల్ సమీపంలోని మ్యాన్ హోల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ ఎస్డీరోడ్లోని గ్రాండ్ మినర్వా హోటల్ వెనుక వైపు హోటల్కు సంబంధించిన డ్రైనేజీ మ్యాన్హోల్ ఉంది. బుధవారం హోటల్కు సంబంధించిన మురుగు నీరు వెళ్లకపోవడంతో తనికీ చేసిన ప్లంబర్ మ్యాన్హోల్లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా పరిశీలించిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి ఒంటిపై ప్యాంటు, చొక్కా మాత్రమే ఉన్నాయి. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ సైదయ్య, ఇన్స్పెక్టర్ పరశురాం, డీఐ ప్రసాద్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి బలవన్మరణం హిమాయత్నగర్ : ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బాల్యతండాకు చెందిన ధరావత్ రాందాస్ కుమారుడు ధరావత్ ప్రవీణ్ కుమార్(20) నారాయణగూడలోని అభ్యశ్రీ బాయ్స్ హాస్టల్లో ఉంటూ జేఈఈ మెయిన్స్కు కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండుసార్లు ప్రయత్నించినా ర్యాంక్ రాకపోవడంతో మనస్తాపానికి లోనైన అతను ఈనెల 12న తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధపడగా వారు అతడికి సర్దిచెప్పారు. మంగళవారం తల్లిదండ్రులు ప్రవీణ్కు ఫోన్ చేయగా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు బుధవారం ఉదయం హాస్టల్కు వెళ్లి చూడగా ప్రవీణ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. బాలుడి అనుమానాస్పద మృతి కీసర: అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చీర్యాలకు చెందిన మహేష్, మంజుల దంపతుల కుమారుడు బర్లపాటి వర్ధన్ (17) 10 వ తరగతి చదువుకున్నాడు. ప్రస్తుతం కరెంట్ బిల్లుల రీడింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గది నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా వర్ధన్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. నాలుగు రోజుల క్రితమే అతను మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. వర్ధన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజన, చెంచులకు కొత్త పథకం
ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన, చెంచుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని.. ఇందులో భాగంగా ఇందిర గిరి సౌర జల వికాసం పథకం ప్రారంభించాలని నిర్ణయించిందని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందించేందుకు నిరంతరం శ్రమిస్తుంందన్నారు. గత ప్రభుత్వం గిరిజన, చెంచుల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. చెంచులు సాగు చేసుకునే పోడు భూములకు పట్టాలిచ్చినా సాగునీటి వసతి లేక ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ భూములను వినియోగంలోకి తెచ్చేందుకు రూ.12,600 కోట్లతో ఇందిర గిరి సౌర జల వికాసం పథకాన్ని పరిచయం చేస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో పోడు పట్టాలున్న రైతులకు సాగునీటి వసతి కల్పించడంతో పాటు సౌర విద్యుత్ అందిస్తుందని వివరించారు. చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ పథకాన్ని ఈ నెల 18న నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని మన్ననూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వర్గం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేశవులు, చెంచు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండ్లి రాములు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మానయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల సాగుకు ‘ఇందిర గిరి సౌర జల వికాసం’ ఈ నెల 18న ప్రారంభించనున్నసీఎం రేవంత్రెడ్డి నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని కమ్మెట చౌరస్తాలో ఆదిగురువు శ్రీదక్షిణామూర్తి ఆలయాన్ని గ్రామానికి చెందిన పాండురంగం నిర్మించారు. బుధవారం ఈ మందిరాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదచల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాఖ్య సభ్యుల సమక్షంలో ఏర్పాటు చేసిన గురు మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగులు వెంకటేశం, హన్మంత్రెడ్డి, సురేందర్, రాంచంద్రయ్య, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన పూజలకు ఆహ్వానం కందుకూరు: పులిమామిడిలో పునఃనిర్మించిన శివరామాంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠాపన పూజలకు హాజరవ్వాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సబితారెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం వారు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు పూజాకార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దామోదర్గౌడ్, శ్రీనివాస్, పాండుగౌడ్, మల్లయ్య, వెంకట్రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకే తరలించాలి 108 సిబ్బందికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచన షాద్నగర్: పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 108 సిబ్బంది, వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారనే విమర్శలున్నాయని.. పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పీఎస్కు వచ్చేవారితో మర్యాదగా మెలగాలి కడ్తాల్: పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించడంతోపాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ సూచించారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్లోని రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. అఽధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను పాటిస్తూ విధులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ సమాజంలో పోలీసుల గౌరవాన్ని పెంచాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ గస్తీ పెంచాలని ఆదేశించారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్ఐ శివశంకర వరప్రసాద్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.ఎమ్మెల్యే కాలె యాదయ్యను సన్మానిస్తున్న పాండురంగం దంపతులు -
ఫార్మా భూముల్లో పంటలొద్దు
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో వానాకాలం సాగు చేపట్టకుండా కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే భూ సర్వే, ఫెన్సింగ్ పనులు పూర్తి చేస్తున్న అధికారులు, ఆ భూముల్లో రైతులు సాగు చేస్తే కబ్జాల నుంచి కదిలించడం కష్టమనే భావనలో ఉన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు 2025 వానాకాలం పంటల సాగు చేయొద్దని రైతులకు వివరిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు యాచారం మండలంలోని ఫార్మాసిటీకి భూములు సేకరించిన నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నేరుగా భూములిచ్చిన రైతులను కలిసి చెప్పడంతో పాటు ఆయా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పంపుతున్నారు. ఇన్నాళ్లు ఫార్మాసిటీ భూముల పర్యవేక్షణను కేవలం రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులే చూసేవారు. కొత్తగా వ్యవసాయ శాఖను భాగస్వామ్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. పరిహారం పెంచుతాం యాచారం మండల పరిధిలోని నానక్నగర్, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను సేకరించేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. నాలుగు గ్రామాల్లో 7,640 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరించి పరిహారం అందజేసింది. ఇంకా 2,200 ఎకరాల పట్టా భూమిని రైతులు ఫార్మాసిటీకి ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆ భూమిపై అవార్డులు పాస్ చేసి పరిహారాన్ని రైతుల పేరిట అథారిటీలో జమ చేసింది. రైతుల పేరిట ఉన్న భూరికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసింది. నాలుగేళ్లుగా టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన భూరికార్డులను తమపై మార్చాలని రైతులు చెప్పులరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పోతోంది. రైతులు హైకోర్టును ఆశ్రయించడం.. న్యాయ స్థానాలు వారికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినా అధికారులు మాత్రం మొండి వైఖరిగానే వ్యవహరిస్తున్నారు. రికార్డులు మార్చేది లేదు.. అవసరమైతే పరిహారం పెంచుతాం.. భూములు ఇవ్వమంటున్నారు. ఈ 2,200 ఎకరాలు సైతం ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో వ్యవసాయ అధికారుల ప్రచారం వానాకాలంలో సాగు చేపట్టొద్దని వాట్సాప్లో మెసేజ్లునిబంధనలు ఉల్లంఘించొద్దు నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులు వానాకాలం పంటలు సాగు చేయొద్దని ప్రచారం చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు గ్రామాల్లో విస్తరణ అధికారుల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం అవుతుంది. – రవినాథ్, మండల వ్యవసాయాధికారి, యాచారం -
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట: కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మ ండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటు ంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన నాగిళ్ల అంజయ్య(50) వ్యవసాయం చేసుకుంటూ భార్యతో కలిసి ఉండేవాడు. ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమ్తితం షాద్నగర్ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. అటునుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య అంజమ్మ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు. కాగా అంజయ్య మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలను వెలిబుచ్చారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జాతరకు వెళ్లొస్తూ.. అనంత లోకాలకు
కందుకూరు: పక్కన ఊరిలో జరుగుతున్న జాతరకు వెళ్లొస్తూ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కందుకూరు సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గూడూరుకు చెందిన పోలదాస్ రాజు(40) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సోమవారం సాయంత్రం ఊట్లపల్లిలో జరుగుతున్న జాతరకు బైక్పై వెళ్లి తిరిగి రాత్రి వేళలో స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో కందుకూరు సమీపంలో ఏఎస్ దాబా ఎదుట శ్రీశైలం హైవేపై వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతని బైక్తో పాటు ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఫౌల్ట్రీఫారమ్లో పని చేసే ఒడిశాకు చెందిన మను, జగన్లను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో బైక్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మనుకు గాయాలు కాగా 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమారై ఉన్నారు. ఈ మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వాహనంఢీకొని వ్యక్తి దుర్మరణం -
కూలీల సమస్యలు పరిష్కరించండి
చేవెళ్ల: ఉపాధి హామీ పథకంలో పనిచేసే పేద కూలీలకు వెంటనే బిల్లులు విడుదల చేయాలని, పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవిలో ఉపాధి పనులు చేసే కూలీలకు పని చేసే చోట కనీస వసతులు కల్పించాలన్న నిబంధనలు ఉన్నాయని, వాటిని తప్పనిసరి పాటించాలన్నారు. కనీస వేతనం రావడం లేదని, ఐదు వారాల నుంచి ఉపాధి కూలీ డబ్బులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలని, కొలతలతో సంబంధం లేకుండా రోజు కూలీ రూ.700 ఇవ్వాలని, 200 రోజులు పనులు కల్పించాలని, కూలీలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. కూలీలు, కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, అండగా నిలబడి పోరాడతామని పేర్కొన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రామస్వామి, సత్యనారాయణ, ప్రభులింగం, అంజయ్య, జంగయ్య, మంజుల, మక్బుల్, నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు. బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య -
ఫ్యూచర్ ఫండ్
దప్పిక తీరుస్తున్న దాతృత్వం ఏటా వేసవిలో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీరుస్తున్నారు పలువురు. బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 20258లోuఏడు గ్రామాలకు ప్రత్యేక నిధులు ● రూ.19.80 కోట్లు మంజూరు చేసిన టీజీఐఐసీ ● సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు ● ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆయా శాఖల అధికారులున్యూస్రీల్ -
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహి ణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అస్లాం అన్సారీ తన భార్య నజ్మా కాతూన్(23), పిల్లలతో కలిసి ఎనిమిది నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం జల్పల్లి గ్రామానికి వలస వచ్చారు. ఈ నెల 11వ తేదీన ఉదయం పిల్లలతో కలిసి అస్లాం నిద్రిస్తుండగా, ఇంట్లో ఎవరికి చెప్పకుండా నజ్మా బయటికి వెళ్లిపోయింది. ఎంతకి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బిహార్కే చెందిన సిరాజ్ అన్సారీ అనే వ్యక్తిపై అనుమానం ఉందంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. యువతి అదృశ్యం మొయినాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపల్లికి చెందిన వడ్డె కవిత(23) మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మొయినాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమనాయకులు దేశమొళ్ల ఆంజనేయులు, జి.వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమకారుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఉద్యమకారులు సర్వం కోల్పోయి కష్టనష్టాలకోర్చి జీవనం సాగిస్తున్నారని.. అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఉద్యమకారులు మహిపాల్, సునీల్కుమార్, నవీన్కుమార్, చంద్రయ్య, మహేందర్, నర్సింలు, భిక్షపతి తదితరులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమనాయకులు -
హక్కుల సాధనకు సమష్టి పోరు
బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ షాద్నగర్: హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అన్నారు. మండల పరిధిలోని అయ్యవారిపల్లిలో మంగళవారం బీసీ సేన మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా బీసీలు అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నారన్నారు. ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు రాణించాలని ఆకాంక్షించారు. తమ హక్కులు సాధించుకునేందుకు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో బీసీ సేన కమిటీలను ఎన్నుకుంటుంన్నామన్నారు. గ్రామ నూతన కమిటీని ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, నర్సింలు, జయ, శ్రీకాంత్, వసంత పాల్గొన్నారు. మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ చాంద్రాయణగుట్ట: మహిళ హత్య కేసులో నిందితుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ గోపి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..కేశవగిరి హిల్స్ ప్రాంతానికి చెందిన కెతావత్ బుజ్జి(40)కి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జుల్ఫికర్ అలీ(43)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి తీరితీసింది. మొదట్లో జల్పల్లిలో నివా సం ఉండే జుల్ఫికర్ ఆ తర్వాత కేశవగిరికి మకాం మార్చాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ బుజి అతడిపై ఒత్తిడి చేసింది. అయితే తనకు అప్పటికే పైళ్లె పిల్లలున్న నేపథ్యంలో అలీ పెళ్లి అంశాన్ని దాట వేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న బుజ్జి అలీకి ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. అ ందుకు అతను నిరాకరించడంతో ఫోన్లోనే దూషించింది. దీనిని అవమానంగా భావించిన అలీ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 8న రాత్రి ఆమె ఇంటికి వెళ్లిన అలీ బుజ్జి గొంతు కోసి హత్య చేయడమేగాక, ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి నిందితుడి అరెస్ట్ రాజేంద్రనగర్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సాలోని గజపతి జిల్లాకు చెందిన సుదీప్ కుమార్ జెన మంగళవారం రాజేంద్రనగర్ వీపీ నర్సి ్డంహా రావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 240 నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడు. విశ్వసనీయమైన సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు దాడులు చేసి సుదీప్ కుమార్ను అరెస్ట్ చేసి 11.825 కేజీల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. సుదీప్ కుమార్ గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి ఆరాంఘర్, చింతల్మేట్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. -
మైసిగండిలో మహాద్భుతం
చెరువెండుతోంది! యాచారం మండల పరిధిలోని మెజార్టీ చెరువులు, కుంటలు ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. 8లోuకడ్తాల్: దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ ఆలయంలో మంగళవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆపద మొక్కులు తీర్చే దేవతగా, భక్తులు ఇలవేల్పుగా, నిత్యం దేదీప్యమానంగా వెలుగొందుతున్న మైసమ్మ తల్లి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకిన అపురూప ఘట్టం భక్తులను మైమరిపించింది. ఉదయం 11.58 నుంచి మధ్యాహ్నం 12.06 గంటల వరకు సూర్యభగవానుడి కిరణాలు అమ్మవారి విగ్రహంపై మెరుపులా ప్రసరించాయి. ఆలయ విమాన గోపురం మీదుగా గర్భగుడిలోని మైసమ్మ తల్లి నుదుటిపై పడిన కిరణాలు ప్రత్యేక వెలుగులు ప్రసరింపజేశాయి. గతేడాది మే14న సైతం ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. అమ్మవారి నుదుటిపై సూర్యకిరణాలు అమ్మవారిపై సూర్యభగవానుడి కిరణాలు -
రోడ్డు ప్రమాదంలో కొడుకు.. కరెంట్ షాక్తో తండ్రి
● నెల రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల దుర్మరణం ● పుట్టెడు దుఃఖంలో బాధిత కుటుంబం కందుకూరు: కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురవుతున్న ఓ తల్లికి భర్త మృతి మరింత శోకాన్ని మిగిల్చింది. నెల రోజుల వ్యవధిలో కుమారుడు, భర్తను కోల్పోయి గుండెలు బాదుకుంటోంది. ఇందుకు సంబంధించి స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా మాదాపూర్కు చెందిన మంద రాములు(49), సుజాత దంపతులు వ్యవసాయంతో పాటు పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. పెద్దకొడుకు, కూతురు వివాహం చేశారు. లారీ డ్రైవర్గా పనిచేసే చిన్న కొడుకు భానుప్రకాశ్ నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబమంతా ఇదే బాధలో ఉంది. అయితే సోమవారం ఉద యం రాములు పశువులకు మేత కోసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. తన పక్క పొలంలోని గట్లపై గడ్డి కోస్తుండగా.. కొడవలి సర్వీస్ వైర్ను తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం భోజనం తీసు కుని వెళ్లిన సుజాత భర్తను చూసి గుండెలు బాదుకుంది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ జంగయ్య తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు మొయినాబాద్రూరల్: ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో తోల్కట్ట గ్రామానికి చెందిన గ్రామస్తులు ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అధికారులు స్పందించి తోల్కట్ట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 107లో రెండు ఎకరాల్లో వేస్తున్న అక్రమ ఫెన్సింగ్ను అడ్డుకున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు అదనపు ఆర్ఐ రాజేష్, రెవెన్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఫెన్సింగ్ను తొలగించారు. అదే స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
● గ్రాండ్ వెల్కమ్
చార్మినార్: మిస్ వరల్డ్–2025 పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు మంగళవారం పాతబస్తీలో సందడి చేశారు. వీరికి స్థానికులు గ్రాండ్గా వెల్కం చెప్పారు. సరిగ్గా సాయంత్రం 5.10 గంటలకు తెలంగాణ టూరిజం ఏసీ బస్సుల్లో ప్రపంచ సుందరీమణులు మదీనా మీదుగా చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన రోడ వెంట ప్రజలు నిలబడి ఘన స్వాగతం పలకగా.. బస్సుల్లోంచి అభివాదం చేస్తూ వారంతా ముందుకు సాగారు. అనంతరం చార్మినార్ నుంచి లాడ్బజార్ వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్ లో ప్రపంచ సుందరీమణులు పాల్గొన్నారు. చార్మినార్ ప్రాంగణంలో అప్పటికే ఏర్పాటు చేసిన స్టేజి పైనుంచి గ్రూప్ ఫోటో దిగిన అనంతరం చారిత్రాత్మక చార్మినార్ కట్టడం చరిత్ర, ఇతర విశేషాలను అధికారులు వారికి వివరించారు. తర్వాత కాలినడకన లాడ్ బజార్కు వెళ్లి అప్పటికే ఎంపిక చేసిన గాజుల షోరూంలో షాపింగ్ చేశారు. అనంతరం బస్సుల్లో చౌమహల్లా ప్యాలెస్కు డిన్నర్ కోసం వెళ్లారు. ● మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చార్మినార్ వద్ద తిష్ట వేశారు. భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులను స్వయంగా పర్యవేక్షించారు. ● చార్మినార్ నలువైపులా చిరు వ్యాపారులను అప్పటికే కట్టడి చేసిన నగర పోలీసులు పాసులున్న వారినే అనుమతించారు. ● మిస్ వరల్డ్ పోటీదారులు పాతబస్తీకి వస్తున్నారని సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున మదీనా, గుల్జార్ హౌస్ ప్రాంతాలకు చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. ● మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా మదీనా సర్కిల్, లాడ్ బజార్ వద్ద ముత్యపు చిప్ప.. అందులో ముత్యాలతో ఏర్పాటు చేసిన డిజైన్ ఆకట్టుకుంది. పెరల్స్ సిటీగా పేరొందిన నగరం ప్రత్యేకతను చాటేలా ఏర్పాటు చేసిన ముత్యపు చిప్ప డిజైన్ ఇటు మిస్ వరల్డ్ పోటీదారులతో పాటు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.● పాతబస్తీలో ప్రపంచ సుందరీమణుల సందడి ● చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ● లాడ్బజార్లో షాపింగ్ ● చౌమహల్లా ప్యాలెస్లో డిన్నర్ -
దప్పిక తీరుస్తున్న దాతృత్వం
షాద్నగర్: సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకుసాగుతున్నారు పట్టణానికి చెందిన పలువురు వ్యక్తులు. ఏటా వేసవిలో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీరుస్తున్నారు. షాద్నగర్కు చెందిన వాసవి చిట్ ఫండ్ అధినేత, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర కోశాధికారి బండారి రమేశ్ తన తల్లిదండ్రులైన దివంగత లక్ష్మమ్మ, రాజయ్యల జ్ఞాపకార్థం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట 20 ఏళ్లుగా చలివేంద్రం ఏర్పాటు చేసి, బాటసారులు, స్థానికులు, ప్రయాణికులకు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. పదేళ్లుగా అంబలి సైతం అందజేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం షాద్నగర్ వచ్చే ప్రజలు ఇక్కడ మంచినీళ్లు, అంబలి తాగి ఉపశమనం పొందుతున్నారు. అలాగే న్యూసిటీ కాలనీకి చెందిన శ్రీనివాస్చారి పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న పోచమ్మ దేవాలయం ఎదురుగా చలివేంద్రం, మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత మూడేళ్లుగా నిత్యం వందలాది మందికి మంచినీళ్లు, మజ్జిగ అందజేస్తున్నారు. షాద్నగర్లో చలివేంద్రాలు, అంబలి కేంద్రాల నిర్వహణ వేసవిలో ఉపశమనం పొందుతున్న బాటసారులు, స్థానికులు -
కొత్త పుస్తకాలొచ్చాయ్
ఇబ్రహీంపట్నం రూరల్: బడిబాట కార్యక్రమంలో భాగంగా రాబోయే నూతన విద్యా సంవత్సరానికి కొత్త పుస్తకాలు వచ్చాయి. ఇప్పటికే విద్యా వనరుల కేంద్రానికి ప్రభుత్వం పుస్తకాలను చేరవేసింది. ఇబ్రహీంపట్నం మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలల్లో 5,600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 41,867 పుస్తకాలు కావాల్సి ఉంది. ఇప్పటికి 21,900 విద్యా వనరుల కార్యాలయంలో నిల్వ ఉన్నాయి. ప్రస్తుతానికి 50 శాతం మాత్రమే పుస్తకాలు వచ్చాయని మరో 50 శాతం బడులు తెరుచుకునేలోపు వస్తాయని అధికారులు తెలిపారు. తరగతుల వారీగా ఆయా పాఠశాలలకు చేరవేస్తామని చెప్పారు. మాల్ను సందర్శించిన డిప్యూటీ కమిషనర్లు యాచారం: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్లు వెస్లీ, రవీందర్ మంగళవారం ఆత్మనిర్భర్ నేషనల్ పంచా యతీ అవార్డు దక్కించుకున్న మాల్ గ్రామాన్ని సందర్శించారు. అవార్డు రావడానికి కలిసొచ్చి న ఆర్థిక అంశాలపై అధ్యయనం చేశారు. ఐదేళ్లుగా పశువుల సంత ద్వారా గ్రామ పంచాయతీకి వస్తున్న ఆదాయం, గ్రామం అభివృద్ధి చెందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్, ఇబ్రహీంపట్నం డివిజన్ పంచాయతీ అధికారి సాధన, ఇన్చార్జి ఎంపీడీఓ శైలజ, మండల పంచాయతీ అధికారి శ్రీలత, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఉన్నారు. రైతులు అధిక దిగుబడితో ఆదర్శంగా నిలవాలి యాచారం: కూరగాయలు, ఆకుకూరల దిగుబడి సాధించి ఆదర్శంగా నిలవాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండల పరిధిలోని చౌదర్పల్లిలో మంగళవారం రైతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలెట్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు రాయితీపై అందజేసే వ్యవసాయ యంత్ర పరి కరాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు నమోదు ప్రక్రియను తెలియజేశారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్కుమార్ వ్యవసాయ, పండ్లతోటల పెంపకం గురించి వివరించారు. డ్రిప్ పద్ధతి ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడి పొందొచ్చని తెలిపారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం డివిజన్ ఏడీఏ సుజాత, మండల వ్యవసాయాధికారి రవినాథ్, ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి నవీన తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంఅనంతగిరి: హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ సంస్థ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులు కోల్పోయిన బాలికల నుంచి, అక్రమ రవాణాకు గురైన, దివ్యాంగ బాలికల నుంచి మూడేళ్ల టెక్నికల్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి జయసుధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు. అమ్మాయిలు పాలిటె క్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. ఈ నెల 20వ తేదీలోపు వికారాబాద్లోని బాలరక్ష భవన్లో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 96408 63896, 98496 72296 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ద్విచక్ర వాహనాల ఢీ
తీవ్ర గాయాలతో వ్యక్తి మృతి కడ్తాల్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని అన్మాస్పల్లి–కడ్తాల్ రహదారిపై చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గానుగుమార్లతండాకు చెందిన మునావత్ సోమ్లా నాయక్(38) సోమవారం రాత్రి తండా నుంచి ద్విచక్రవాహనంపై కడ్తాల్కు వస్తున్నాడు. అదే సమయంలో రామస్వామి అనే వ్యక్తి బైక్పై కడ్తాల్ నుంచి గానుగుమార్లతండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో మల్లప్ప ఫౌల్ట్రీఫాం సమీపంలో సోమ్లానాయక్ బైక్ను రామస్వామి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. సోమ్లానాయక్కు తీవ్ర గాయాలవ్వడంతో 108 వాహనంలో మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతుడి సోదరుడు పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రామస్వామికి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. -
పిడుగుపాటు.. ముందే తెలిెసేట్టు
● దామిని యాప్తో గుర్తించే వెసులుబాటు ● జాగ్రత్తలు పాటిస్తే బయటపడే అవకాశం షాబాద్: అకాల వర్షాలకు పిడుగులు పడి ప్రజలు, మూగజీవాలు మృత్యువాత పడుతున్నారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి వైఫరీత్యాలైన ఉరుములతో కూడిన వర్షాలతో పాటు పిడుగు పాటుతో ప్రాణ, ఆస్తినష్టం జరుగుతూనే ఉంది. ఏటా పిడుగుపాటుకు గురై అధిక సంఖ్యలో మూగజీవాలు, చాలా మంది ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే పిడుగు పాటుపై పరిశోధనలు చేసిన భారత వాతావరణ శాఖ ముందే పసిగట్టేందుకు ఓ యాప్ను ఆవిష్కరించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ (ఐఐటీఎం) ‘దామిని’ యాప్ను రూపొందించింది. యాప్ డౌన్లోడ్ ఇలా ప్రతి పౌరుడు తన స్మార్ట్ ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి దామిని యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ను తెరిచి పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్కోడ్ నమోదు చేయాలి. అనంతరం జీపీఎస్ లొకేషన్ కోసం యాప్ను వినియోగించే సమయంలో మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో లేదో మూడు రంగుల్లో చూపిస్తుంది. ఎరుపు రంగు: మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల వ్యవధిలో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి వస్తుంది. పసుపు రంగు: మీరు ఉన్న ప్రాంతంలో 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడేలా ఉంటే ఆ సర్కిల్ పసుపు రంగుగా మారుతుంది. నీలం రంగు: 18 నుంచి 25 నిమిషాలలోపు పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ నీలం రంగులో కనిపిస్తుంది. ఇవి పాటించాలి ● నల్లటి మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాల్లోకి లేక తాము ఉన్న స్థానంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను చేతులతో మూసుకోవాలి. ● బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొబైల్ సిగ్నల్స్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువగా కల్పిస్తుంది. పంట పొలాల్లో వాడకూడదు. ● విద్యుత్ స్తంభాలు, సెల్ఫోన్ టవర్లు, బోర్పంప్ సెట్లకు దూరంగా ఉండాలి. బోరు మోటార్ల నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో వినియోగించవద్దు. ● పశువులను మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకలోనే ఉంచాలి. ● పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షం కురిసినప్పుడు చెట్ల కింద ఉండొద్దు. యాప్ ఉపయోగకరం వాతావరణంలోని మార్పులను పసిగట్టి పిడుగుపడే అవకాశాన్ని తెలిపే దామిని యాప్ ప్రజలతో పాటు ముఖ్యంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. యాప్ని వినియోగించి పిడుగుపడే విషయాన్ని గుర్తించి ప్రాణాలు కాపాడుకోవచ్చు. – అన్వర్, తహసీల్దార్, షాబాద్ -
100
ప్రయాణికులుశాతంగ్రేటర్లో సుమారు 40 శాతం బస్సుల కొరత సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచ నాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది. కొత్త బస్సులేవి..? నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల విని యోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయా ణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు. 2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు, సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సుల వైపు మళ్లారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. నగ రంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్సీటర్ ఆటోలుు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో పెరిగిన ప్రయాణికులు తగ్గుముఖం పట్టిన సిటీ బస్సులు డొక్కు బస్సుల స్థానంలో రీప్లేస్మెంట్తో సరి మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబా టులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్లో 2,800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. -
అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
● అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ● ప్రజావాణికి 46 దరఖాస్తులు ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఆయా శాఖల వారీగా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులు అందజేసిన 46 దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడండి మొయినాబాద్ రూరల్: తోల్కట్టలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను రక్షించాలని పలువురు గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 107లో 12.16 ఎకరాల లావణీ భూమి ఉందని తెలిపారు. ఇందులో కొంత భూమిని ఇతరులు క్రయవిక్రయాలు చేశారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి, సర్కారు భూమిని స్వాధీనం చేసుకోవాలని శివశంకర్గౌడ్, సురేందర్రెడ్డి, నర్సింహ్మ, మల్లేష్, యాదయ్య తదితరులు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్కు దరఖాస్తు అందజేశారు. -
డిగ్రీలో అడ్మిషన్లకు ‘దోస్త్’లో రిజిస్ట్రేషన్ చేసుకోండి
షాద్నగర్ రూరల్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ కోసం వెంటనే దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేరుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీతాపోలె సూచించారు. ఈనెల 21 వరకు అవకాశం ఉందని తెలిపారు. 29న అడ్మిషన్ల కేటాయింపుపై తొలి జాబితా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి జూన్ 6 వరకు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వివరాలకు 63050 51490, 9885003390, 9703441345 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.ఇబ్రహీంపట్నం కళాశాలలో..ఇబ్రహీంపట్నం: 2025–26 విద్యాసంవత్సరానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.రాధిక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 89199 96725, 94417 05076, 93810 6920 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.నేడు డయల్ యువర్ డీఎంషాద్నగర్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ నిర్వహించనున్నట్లు షాద్నగర్ డిపో మేనేజర్ ఉష తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రయాణికులు 9959226287 నంబర్కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయడంతో పాటు సలహాలు, సూచనలు అందించాలని కోరారు.ర్యాంకుల ‘కమ్మదనం’షాద్నగర్ రూరల్: ప్రభుత్వం ప్రకటించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గురుకుల విద్యార్థినులు సత్తాచాటారు. బైపీసీ విభాగంలో సిరి 2,234 ర్యాంకు, శ్రీహర్షిత 4,643, శిరీష 4,907, సౌమ్య 7,586, కీర్తన 8,741 ర్యాంకు, ఎంపీసీ విభాగంలో శైలజ 22,990 ర్యాంకు, సాయికీర్తన 25,903, మానస 27,493, సాయిప్రియ 28,577 ర్యాంకులు సాధించారు. 77 మంది ఇంటర్ పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపల్ విద్యుల్లత తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు సిబ్బందిని అభినందించారు.నేడు స్పీకర్ పర్యటనమోమిన్పేట: మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ విచ్చేయనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుద్దోడ్కతండా బీటీ రోడ్డు, ఏన్కతల పెద్ద చెరువు మరమ్మతులు, మల్రెడ్డిగూడెం చెరువు మరమ్మతులు, మొరంగపల్లి, ఎన్కేపల్లి, కేసారం, సయ్యద్అల్లిపూర్, ఇజ్రాచిట్టంపల్లి, వెల్చాల్, దుర్గంచెర్వు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. పార్టీ శ్రేణులు సకాలంలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.క్రికెట్ పోటీలు ప్రారంభందుద్యాల్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం మండలస్థాయి క్రికెట్ పోటీలు(దుద్యాల్ క్రికెట్ ప్రిమియర్ లీగ్) ప్రారంభమయ్యాయి. కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, ఎస్ఐ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువకులు, ఉద్యోగుల కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. -
ఆగని ఆక్రమణలు
● కబ్జాకు గురవుతున్నగంగరాయన్ చెరువు ● ఎఫ్టీఎల్లో యథేచ్ఛగా మట్టి డంపింగ్ ● గొలుసుకట్టు కాలువలు ధ్వంసం తుర్కయంజాల్: చెరువులు, కుంటలు, కాల్వల పరిరక్షణకు ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నా ఆక్రమణలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా వీటిని అన్యాక్రాంతం చేసేందుకు అక్రమార్కులు సిద్ధంగా ఉన్నారు. తుర్కయంజాల్ పురపాలక సంఘం పరిధి రాగన్నగూడ గంగరాయన్ చెరువులో స్థానికంగా నివాసం ఉండే కొంతమంది వ్యక్తులు టిప్పర్ల ద్వారా మట్టిని తెచ్చి డంప్ చేస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు దినాలను ఎంచుకుని ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఎప్టీఎల్, బఫర్ జోన్లను దాటి మట్టి డంప్ చేయడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఓసీల పేరుతో.. తుర్కయంజాల్ రెవెన్యూ సర్వే నంబర్ 314, మన్నెగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 7, 8, 9, 10, 11, 56లో గంగరాయన్ చెరువు విస్తరించి ఉంది. సర్వే నంబర్ 7, 8, 9, 10లోని 3.5 ఎకరాల పొలానికి ఎన్ఓసీ తెచ్చుకున్నామని చెబుతూ కొంతమంది మట్టి డంప్ చేస్తున్నారు. 2023లో దరఖాస్తు చేసుకోగా ఇటీవల దీనికి ఎన్ఓసీని జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 2020 అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షానికి ఈ చెరువు మొత్తం నిండి, చుట్టు పక్కల ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. అప్పట్లో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు చెరువును పరిశీలించారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్ఓసీ జారీ చేయడం స్థానికంగా విమర్శలకు దారితీసింది. నీరు పారేదెలా..? ఎర్రకుంట చెరువు నిండితే గొలుసుకట్టులో భాగంగా కింద ఉన్న గంగరాయన్ చెరువులోకి నీళ్లు వస్తాయి. కానీ సంబంధించిన కాల్వలను అక్రమార్కులు పూడ్చేశారు. ఇప్పటికే ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అనేక నిర్మాణాలు వెలిశాయి. వీటి చుట్టూ ప్రహరీలు కట్టడంతో చిన్నపాటి వర్షానికే నీళ్లు ముంచెత్తుతున్నాయి. ఈ చెరువును అన్యాక్రాంతం చేయడానికి 2016లో నకిలీ ఎన్ఓసీని తెచ్చిన కొంతమంది మట్టిని నింపే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ఇరిగేషన్, రెవె న్యూ, మున్సిపల్ శాఖల అధికారులు ఇష్టానుసారంగా అనుమతులను మంజూరు చేయడంతో భారీ భవంతులు వెలిశాయి. భవిష్యత్తులో గంగరాయన్ చెరువు పరిస్థితి కూడా ఇలాగే మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిర్మాణ వ్యర్థ్యాల పారబోత.. గంగరాయన్ చెరువులో ఒక వైపు మట్టిని డంప్ చేస్తుండగా ఎఫ్టీఎల్ పరిధిలో పెద్దఎత్తున నిర్మాణ వ్యర్థాలను తెచ్చి పారబోస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్రమార్కులు చెరువు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో వెంచర్లు ఏర్పాటు చేయగా, అనేక మంది అమాయకులు ఇందులో ప్లాట్లు కొనుగోలు చేశారు. కొంత మంది ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, చెరువు భూమిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. మట్టిని తొలగిస్తాం.. చెరువులో మట్టి డంప్ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వెళ్లి పరిశీలించామని ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ తెలిపారు. చెరువు స్థలాన్ని కబ్జా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్టీఎల్ పరిధిలో డంప్ చేసిన మట్టిని తొలగిస్తామన్నారు. -
అందాల భామలకు బందోబస్తు
హైదరాబాద్లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాలతారలు సోమవారం నాగర్జునసాగర్ వెళ్లారు. నగరం నుంచి మూడు టూరిస్టు బస్సుల్లో బయలుదేరిన వీరికి రహదారి పొడవునా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సీపీఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. రాచకొండ సీపీ సుధీర్బాబు, మహేశ్వరం డీసీపీసునీతారెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. అడుగడుగునా పోలీసు పహారా నడుమ అందాల తారలు సాగర్కు తరలివెళ్లారు. – ఇబ్రహీంపట్నం -
డేటా
వారంలోగా ఆస్తి పన్నుజోన్లలో.. జోన్లలో జరిగిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 111 ఫిర్యాదులు రాగా, వాటిల్లో కూకట్పల్లి జోన్లో 37, శేరిలింగంపల్లి జోన్లో 18, ఎల్బీనగర్ జోన్ లో 7, సికింద్రాబాద్ జోన్ లో 34, చార్మినార్ జోన్ లో 14, ఖైరతాబాద్ జోన్లో 1 ఉన్నాయి. జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించిన కమిషనర్ కర్ణన్ ● ప్రజావాణి ఫిర్యాదులనుబాధ్యతగా పరిష్కరించాలని సూచన -
ప్రమాదవశాత్తు పౌల్ట్రీ యజమాని మృతి
కేశంపేట: కోళ్లకు దాణా పంపిణీ చేసే యంత్రం పైన పడటంతో పౌల్ట్రీ ఫాం యజమాని మృతిచెందిన ఘటన కాకునూర్ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లీల్యానాయక్ (48) ఊరి శివారులో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో ఫాంలోని దాణా యంత్రం పక్కకు జరిగింది. బీహర్ చెందిన కూలీలు కమల్సాదా, చింటూసాదాతో కలిసి సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా మిషన్ ఒక్కసారిగా ముగ్గురిపైనా పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా లీల్యానాయక్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. గాయాలపాలైన చింటూ, కమల్సాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. ఉద్యమకారుడిని కోల్పోయాం. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న లీల్యానాయక్ మృతి బీఆర్ఎస్కు తీరని లోటని మాజీ ఎంపీపీ ఎల్గనమోని రవీందర్ యాదవ్ అన్నారు. పీఏసీఎస్ చైర్మెన్ గండ్ర జగదీఽశ్వర్గౌడ్ తదితరులు లీల్యా మృతిపై సంతాపం వ్యక్తంచేశారు. శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే టీఆర్ఆర్ పరిగి: కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని సోమవారం పరిగి ఎమ్మె ల్యే టీ రామ్మోహన్రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
మొయినాబాద్ రూరల్: హిమాయత్నగర్లోని పల్లవి ఇంటర్నేషనల్ పాఠశాలలో పని చేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు రుద్రకుమార్, అల్లి దేవేందర్గౌడ్ డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి సోమవారం పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైవర్లు, క్లీనర్లు, ఆయాలుగా పనిచేస్తున్న కార్మికుల వేతనాలు చెల్లించకుండా యాజమాన్యాం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. వీరందరికీ వెంటనే గుర్తింపు కార్డులు, నెలాంతర, సాధారణ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు ముంజగళ్ల ప్రభుదాస్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట సీఐటీయూ నాయకుల ధర్నా -
ఫిర్యాదులు అందితే చర్యలు
● వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి ● కలెక్టరేట్లో వైద్యాధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షసమావేశం అనంతగిరి: వైద్యాధికారులు బాధ్యతాయుతంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, ఉన్నతాధికారులు, అధికారులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల, వైద్య కళాశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్బ్యాంక్, వైద్యుల విధుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వికారాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి 45 రోజుల్లో మెడికల్ ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందజేస్తామన్నారు. వికారాబాద్ జీజీహెచ్కు ఎంఆర్ఐ స్కాన్ను మంజూరు చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన, ప్రజలకు దూరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పునఃపరిశీలించి రోడ్డు భద్రత సమావేశాలను నిర్వహించి బ్లాక్ స్పాట్లను గుర్తించాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో సత్వర వైద్య సేవలు అందించేందుకు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.5.5కోట్ల నిధులను వెచ్చిస్తామని వివరించారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో అధికారులు అందుబాటులో లేరని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ, డిప్యూటీ డీయంహెచ్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పీహెచ్సీ, సబ్ సెంటర్లలో వైద్య సేవలను మెరుగుపర్చాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వేతర ఆస్పత్రులను ఎప్పటికపుడు తనిఖీ చేయాలన్నారు. నూతనంగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగిరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రాధాన్యత క్రమంలో వసతిగృహాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ అజయ్కుమార్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరవణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంచంద్రయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు. -
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
● త్వరలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ సదుపాయం ● వచ్చే విద్యాసంవత్సరంలో వైద్య విద్యార్థులకు హాస్టల్స్ నిర్మాణం ● రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ● వికారాబాద్లో 300 పడకల జనరల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతగిరి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ పట్టణంలో రూ.30 కోట్లతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని స్పీకర్ ప్రసాద్కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణ, అన్ని విభాగాలను, తరగతిగదులను పరిశీలించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి సీనియర్ నర్సులు శంకరమ్మ, శాంతమ్మలను సత్కరించారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగిలో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, వికారాబాద్లో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించుకున్నామన్నారు. వికారాబాద్లో అందుబాటులోకి వచ్చిన 300 పడకలు ప్రారంభించుకున్నామని, 50 పడకల క్రిటికల్ కేర్, పాత ఆస్పత్రిలో 70 పడకలు మొత్తం 420 పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాల విద్యార్థులకు బాలుర, బాలికలకు వేర్వేరుగా పక్కా వసతి గృహ భవన నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ సదుపాయాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, డీఎంహెచ్ఓ వెంకటరవణ, డీసీసీబీ మెంబర్ కిషన్నాయక్, ఆర్టీఏ సభ్యుడు జాఫర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, మాజీ లైబ్రరీ చైర్మన్ ఎండీ హఫీజ్, ఏయంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, జిల్లా అధికారులు, వైద్యులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
పరిగిలో రెండేళ్లలో వంద పడకల ఆస్పత్రి
పరిగి: పేదలకు ఆత్మస్థైర్యం నింపేలా ప్రభుత్వ వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన పరిగి పట్టణ కేంద్రంలో రూ.27 కోట్లతో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో పరిగిలో వంద పడకల ఆస్పత్రి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను విస్తరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి ఎప్పుడు కలిసిన నియోజకవర్గ అభివృద్దిపైనే మాట్లాడుతారన్నారు. డయాలసిస్ సెంటర్లో బెడ్లు, మిషన్ల సంఖ్యను పెంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకుంటామని హమీ ఇచ్చారు. జాతీయ ప్రధాన రహాదారులపై ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 213 కొత్త అంబులెన్స్లను ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో 400 మంది విద్యార్థులకు అదనంగా సీట్లు వస్తున్నాయన్నారు. పరిగిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరారని పరిశీలించి ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. బీపీ, షుగర్, క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని వీరికి వైద్యం అందించేందుకు అన్ని జిల్లాలో ఎన్సీడీ క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో నాలుగు దిక్కుల నాలుగు రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఫెడరేషన్ చైర్మన్ కల్వ సుజాత, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు పరశురాంరెడ్డి, ఆంజనేయులుముదిరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా గొడుగోనిపల్లి రోడ్డు
దోమ: మండలంలోని గొడుగోనిపల్లి వద్ద బీటీ రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. గతంలో కురిసిన వర్షాలకు రోడ్డు ఇరువైపులా కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాల బారిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. రోడ్డు కోతకు గురై నెలలు కావస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మట్టి కూడా పోయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
కారు అదుపు తప్పి యువకుడి మృతి
ఆమనగల్లు: విఠాయిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన అజయ్కుమార్(30) మృతిచెందాడు. ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన స్నేహితులు మనోజ్, అజయ్కుమార్, గణేశ్, త్రిముర్తులు స్విఫ్ట్ కారులో శ్రీశైలం వెళ్తున్నారు. విఠాయిపల్లి సమీపంలో పంది అడ్డు రావడంతో అజయ్కుమార్ కారును ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. వాహనం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకంమహేశ్వరం: వైద్య సేవల్లో నర్సుల పాత్ర ఎంతో కీలకమని అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్జీ అన్నారు. మండల పరిధిలోని భగవతిపురంలో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి, నర్సులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవేర్ సంస్థ డీజీ రాజవర్ధన్రెడ్డి, అవేర్ ఆస్పత్రి ఎండీ, ప్రొఫెసర్ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ
కడ్తాల్: ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గానుగుమార్లతండాకు చెందిన మూడవత్ సోమ్లా ద్విచక్రవాహనంపై సోమవారం రాత్రి తండా నుంచి కడ్తాల్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో రామస్వామి అనే వ్యక్తి కడ్తాల్ నుంచి అన్మాస్పల్లి బయలుదేరాడు. మార్గమధ్యలో కడ్తాల్– అన్మాస్పల్లి రహదారిపై ఇద్దరి బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు -
7 సార్లు..5,402 ఫోన్లు
గచ్చిబౌలి: చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీలో (సీఈఐఆర్ పోర్టల్ ఆధారంగా) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నామని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ఎల్సీనాయక్ అన్నారు. చోరీకి గురైన ఫోన్లలోని సమాచారాన్ని కాపాడుకోవడంలో వినియోగదారులకు సరైన అవగాహన ఉండటం లేదన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను 7వ సారి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ఆధారంగా చోరీకి గైరెన మొబైల్ ఫోన్ను సులభంగా రికవరీ చేసేందుకు వీలుంటుందన్నారు. ఫోన్ పోగొట్టుకున్న తరువాత దానిలోని డేటాను రక్షించుకోవడంపై బాధితులు అవగాహన పెంచుకోవాలన్నారు. సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఈఎంఐ బ్లాక్ చేయడం ద్వారా డేటా సురక్షితంగా ఉండే అవకాశం ఉందన్నారు. సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి యూపీఐలను లాక్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా రూ.95 లక్షల విలువైన 310 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మాదాపూర్ సీసీఎస్ పరిదిలో 80, బాలానగర్ సీసీఎస్లో 65, మేడ్చల్లో 55, రాజేంద్రనగర్ 55, శంషాబాద్ పరిధిలో 55 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 5402 ఫోన్లను బాధితులకు అందజేసినట్లు డీసీపీ వివరించారు. సైబర్ బాధితుల్లో విద్యావంతులే అధికం ఇటీవలి కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, బాధితుల్లో విద్యావంతులే అత్యధికంగా ఉన్నారని డీసీపీ పేర్కొన్నారు. సెల్ ఫోన్కు వచ్చే లింక్లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని సూచించారు. బంగారం ధర పెరగడంతో చైన్ స్నాచింగ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. వేసవిలో తలుపులు వేసుకోకుండా నిద్ర పోవద్దన్నారు. ఊరికి వెళితే పక్కవారితో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను తగ్గించవచ్చారు. సెల్ఫోన్ల రికవరీలో మొదటి స్థానం సాధిస్తాం డేటా పరిరక్షణపై అవగాహన అవసరం సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ఎల్సీనాయక్ -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కడ్తాల్: గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని 12,13 వార్డుల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం గూడూరు మాట్లాడుతూ.. డ్రైనేజీ పనులను పూర్తి చేసి, వినియోగంలోకి తెస్తామని పేర్కొన్నారు. మండలంలో సీడీఎఫ్, ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ.1.30 కోట్లతో సీసీరోడ్డు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజేశ్, మాజీ సర్పంచ్ చెన్నయ్య, నాయకులు శ్రీను, రమేశ్, భానుకిరణ్, మహేశ్, శ్రీకాంత్, రామకృష్ణ, నరేశ్, చింటు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
కడ్తాల్: ప్రజారోగ్య పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధి న్యామతాపూర్ గ్రామానికి చెందిన సంతోజు పరిపూర్ణచారి ఆరోగ్య సమస్యలతో నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనంతరం వైద్య ఖర్చుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్యే కసిరెడ్డి సహకారంతో బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.82 వేలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆదివారం బాధితుడికి.. ఎమ్మెల్యే కసిరెడ్డి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బోదాస్ మహేశ్ తదితరులు ఉన్నారు. మంచాలలో.. మంచాల: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని కాంగ్రెస్ జిల్లా నాయకుడు, మాజీఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నాయక్ అన్నారు. అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన లోయపల్లిగ్రామ వాసి తోడుసునూటి లచ్చలుకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయం కింద ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో రూ.60 వేలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ఆదివారం లోయపల్లిలో బాధిత కుటుంబీకులకు చెక్కు అందజేశారు. ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాం దాస్, నాయకులు రమేష్ గౌడ్ పాల్గొన్నారు. -
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని గంగాభవాని కాలనీలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేదపండితుల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు సుప్రభాతం, ధ్వజారోహనం, అభిషేకం, అలంకర ణ, ప్రత్యేక పూజలు, హనుమాన్హోమం, పూర్ణా హుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణయ్య, కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సత్తయ్య, కోశాధికారి సాయికుమార్, సభ్యులు పరమేశ్, అప్పి, సుధాకర్, లింగం, ఈశ్వరయ్య, యాదగిరి, లింగప్ప, అశోక్ ఉన్నారు. -
పూర్వ విద్యార్థుల సందడి
అబ్దుల్లాపూర్మెట్: ఆత్మీయ పలకరింపులు, భావోద్వేగాల నడుమ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కుత్బుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2009– 10 విద్యాసంవత్సరం పదో తరగతి విద్యార్థులు.. సుదీర్ఘ కాలం అనంతరం పాఠశాల వేదికగా సందడి చేశారు. బాల్యం జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ కేరింతలు కొట్టారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గురువులు రంగారెడ్డి, శ్రీనివాస్, యాదయ్య గౌడ్, జంగాచారి, గోదాదేవి, గీతా శ్యామల, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పోల్కంపల్లిలో.. ఇబ్రహీంపట్నం రూరల్: పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. మండల పరిధి పోల్కంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (2007– 08 విద్యాసంవత్సరం) టెన్త్ విద్యార్థులు 17 ఏళ్ల అనంతరం ఒకే వేదికగా సందడి చేశారు. చిననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాటి ప్రధానోపాధ్యాయురాలు వసంతరెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
వీర జవాన్లకు ఘన నివాళి
ఇబ్రహీంపట్నం: పాకిస్తాన్తో పోరాడి వీరమరణం పొందిన జవాన్లకు ఇబ్రహీంపట్నంలోని ఏబీసీడీ డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తులతో అంజలి ఘటించారు. జవాన్లు మురళీనాయక్, సచిన్యాదవ్, రావ్ వనాంజేల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రజల భద్రతకు ప్రాణాలను పణంగా పెట్టిన జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోలేదని అకాడమి మాస్టర్ ముత్యం అన్నారు. కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్స్ సురేశ్, బన్నీ, తారలు పాల్గొన్నారు. పరామర్శ ఆమనగల్లు: భారత్, పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులు మురళీనాయక్ కుటుంబ సభ్యులను ఆమనగల్లు మండలం మేడిగడ్డతండాకు చెందిన పలువురు గిరిజన సంఘం, సేవాలాల్ సంఘం నాయకులు పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ సత్యసాయిజిల్లా పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి గోరంట్ల మండలం కల్లితండాల్లో ఆదివారం జవాన్ కుటుంబీకులను గిరిజన నాయకులు నేనావత్ రవీందర్నాయక్, శంకర్నాయక్, దశరథ్నాయక్, దేవీలాల్, ప్రకాశ్లు పరామర్శించారు. మురళీ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. పూజలు సైనికుల క్షేమం కోసం ఆమనగల్లు పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో ఆదివారం ఆలయ పూజారి రామకృష్ణశర్మ నేతృత్వంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు విక్రంరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో బీజేపీ మాజీ కౌన్సిలర్ సుండూరి శేఖర్, నాయకులు లక్ష్మణ్, రవిరాథోడ్, ప్రశాంత్, ఎర్రవోలు మహేశ్, జగన్రెడ్డి, పవన్కల్యాణ్, సాయిబాబా, శ్రీనివాసాచారి, రామస్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి జవాన్ కుటుంబీకులకు పరామర్శ -
బీజేపీలో పలువురి చేరిక
యాచారం: బీఆర్ఎస్ నాయకురాలు, నల్లవెల్లి మాజీ సర్పంచ్ శోభ, ఆమె భర్త బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రాములు, పలువురు కార్యకర్తలు ఆదివారం నగరంలోని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్రెడ్డి సమక్షంలో కాషాయం కండువా కప్పుకొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపాల్గౌడ్, యాచారం మండల అధ్యక్షుడు విజయ్నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ మధుకర్రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ విద్యార్థులకు సన్మానం ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని శ్రీ అభయాంజనేయస్వామి సన్నిధిలో ఆదివారం ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో పది, ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాధవి, అశోక్, చందన, కిశోర్, వైష్ణవి, దృవాంశలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్యనారాయణ, సత్తయ్య, సాయికుమార్, మురళీధర్, పరమేశ్, సుధాకర్, లింగం, ఈశ్వరయ్య,లింగప్ప, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ విస్తరణకు చర్యలు కందుకూరు: మండలంలోని లేమూరు పరిధిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రముఖ స్తపతి శివనాగిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విస్తరణకు చేయాల్సిన పనుల గురించి మాట్లాడారు. ప్రస్తుతం దేవాలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం తీర్చిదిద్దేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆలయ నిర్వాహకులు ఆయన్ని కోరారు. అందులో భాగంగా మహా మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, రాజగోపురం, కోనేరులను తిరిగి నిర్మించాల్సి ఉంటుందని ఆలయ నిర్వాహకులకు శివనాగిరెడ్డి తెలిపారు. ఆయన వెంట ఆలయ నిర్వాహకులు గూడూరు కొండారెడ్డి, ఢిల్లీ బాలకృష్ణ, రావిచెట్టు ఐలయ్య, ఢిల్లీ గణేష్, కేశిడి భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మా ఠాణా తరలింపు..
ఫార్మాసిటీ భద్రత కోసం నక్కర్తమేడిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్టేషన్ను కుర్మిద్దకు తరలించనున్నారు. అందరికీ అనుకూలంగా గ్రామాలకు మధ్య ఠాణా ఉండే విధంగా అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలోతాత్కాలిక భవనంలోకి మార్చనున్నారు. యాచారం: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ.. రైతులు ఆందోళనలు చేశారు. నిరసన కార్యక్రమాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా భద్రతకు స్థానికంగా పోలిస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా.. ఫార్మా భూములు సేకరించిన యాచారం, కందుకూరు మండలాల పరిధి 20 గ్రామాలు, వాటి అనుబంధ గ్రామాలను కలుపుతూ రాచకొండ కమిషనరేట్ పరిధి నక్కర్తమేడిపల్లిలో అద్దె భవనంలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణా’ను ఏర్పాటు చేసింది. ఒక సీఐ, ఎస్ఐలు, 30 మంది పోలీస్ సిబ్బందిని నియమించింది. ప్రస్తుతం పోలీసు పహారాలో నెల రోజులుగా ఫార్మా భూముల సర్వే, ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. పదిరోజుల్లో.. ఫార్మాసిటీ పీఎస్ను యాచారం మండలం కుర్మిద్దకు తరలించనున్నారు. గతంలో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేసిన భవనంలోకి మార్చనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతుండగా.. సీఐ లిక్కి కృష్ణంరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజులు ఈ భవనాన్ని పరిశీలించారు. మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి కానుండగా.. పది రోజుల వ్యవధిలో పీఎస్ను మార్చేందుకు పోలీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘నెట్ జీరో సిటీ’గా.. గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్.. అవే భూముల్లో ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. అయితే ఫార్మాను రద్దు చేసి, ఠాణా పేరు అదే ఉంటే ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని భావించిన పోలీసు యంత్రాంగం.. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ను పేరును ‘నెట్ జీరో సిటీ పీఎస్’గా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. దీంతో కుర్మిద్దలోనూ పూర్వ పేరుతో ప్రజలకు సేవలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నక్కర్తమేడిపల్లి నుంచి పోలీస్ స్టేషన్ తరలించవద్దని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కుర్మిద్ద తాత్కాలిక భవనంలోకి మార్పు ప్రస్తుతం నక్కర్తమేడిపల్లిలోకొనసాగుతున్న పీఎస్ మార్చొద్దని గ్రామస్తుల ఆందోళన అందరికీ అందుబాటులో.. ఫార్మాసిటీ పీఎస్ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా యాచారం మండలం మధ్యలో ఉన్నకుర్మిద్ద గ్రామానికి మార్చబోతున్నాం. అక్కడి తాత్కాలిక భవనంలో పీఎస్కు తగిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. పది రోజుల్లో ఠాణాను తరలిస్తాం. ఫార్మా పీఎస్ను నెట్ జీరో సిటీగా పేరు మార్చేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించాం. – లిక్కి కృష్ణంరాజు, సీఐ, ఫార్మాసిటీ పీఎస్ -
ముగిసిన సమ్మర్ క్యాంపు
అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు పది రోజులుగా నిర్వహించిన సమ్మర్ క్యాంపు ఆదివారంతో ముగిసింది. శిక్షణలో భాగంగా విద్యార్థులకు గేమ్స్, స్పోర్ట్స్తో పాటు ఖురాన్ పఠనం, నైతిక విలువలు తదితర అంశాలలో తర్ఫీదునిచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు అంజద్ హుస్సేన్, యూనిట్ అధ్యక్షుడు రఫీయొద్దీన్, ఆర్గనైజేషన్ వికారాబాద్ ఇంచార్జి అబ్దుల్ వాసే తదితరులు పాల్గొన్నారు. -
పాత కరెన్సీ మార్పిడీకి యత్నం
● రూ.99 లక్షల నగదు స్వాధీనం ● నలుగురి అరెస్టు..మరో నలుగురి పరారీ సనత్నగర్: రద్దయిన కరెన్సీ నోట్లను మార్చేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యక్తులను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.99 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఎస్ఐ జయచందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.టీవోలీ ఎక్స్ట్రీమ్ థియేటర్ వద్ద రద్దయిన పాత నోట్ల మార్పిడీకి యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం మధ్యాహ్నం ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా వేపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్వర్, బుర్రా శివకుమార్, పుట్టపల్లి రవీందర్రెడ్డి, గొల్లమందల రవిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన రద్దయిన రూ.1000, రూ.500ల కరెన్సీ నోట్లతో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 20 శాతం కమీషన్ ప్రాతిపదికన వీరు మరికొందరితో కలిసి పాత నోట్లమార్పిడికి యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేయ గా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గా లిస్తున్నారు. ఈ మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి బలవన్మరణం సికింద్రాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ అల్వాల్ మంగాపురం కాలనీకి చెందిన పీచర ప్రశాంత్కుమార్(48) వృత్తి రీత్యా వ్యాపారి. కొంత కాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికి తోడు అతడి తల్లి కేన్సర్తో ఇబ్బంది పడుతోంది. దీంతో మనస్తాపానికి లోనైన అతను ఈ నెల 8న గుండ్ల పోచంపల్లి, బొల్లారం రైల్వేస్టేషన్ల మధ్య సిద్ధిపేట, మల్కాజిగిరి ప్యాసింజర్ రైలుకు ఎదురుగా వెళ్లి అత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య వాసంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో మంటలు కాలిపోయిన కారు: తప్పించుకున్న డ్రైవర్ శంషాబాద్ రూరల్: రహదారిపై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని కారు దగ్ధమైంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి సమాచారం మేరకు... నగరం నుంచి టాటా జెస్ట్ కారు ఆదివారం మధ్యాహ్నం షాద్నగర్ వైపు వెళ్తుంది. బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి శివారులో ఉన్న రైల్వే వంతెనపైకి రాగానే కారులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ హుస్సేన్ వెంటనే కారును నిలిపివేసి కిందకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో పాటు ఫైర్ ఇంజన్ను రప్పించి మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలకు కారు ఆహుతైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వివరించారు. -
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని...
దుండిగల్: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచ్చిన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు?
కేశంపేట: గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన మండల పరిఽధిలోని వేములనర్వ గ్రామ శివారులోని పాత బీరప్ప దేవాయలం సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములనర్వ గ్రామం నుంచి అల్వాల వైపు వెళ్లే దారిలో పాత బీరప్ప దేదాలయం సమీపంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం జేసీబీ సాయంతో గుంతను తీసి పూడ్చివేశారు. ఆదివారం సమీపంలోని రైతులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గుంత సమీపంలో పూజా సామగ్రితో పాటు నిమ్మకాయలు, గుమ్మడికాయలు కన్పించాయి. ఓ కుండను పగులగొట్టిన ఆనవాళ్లు కన్పించాయి. గతంలో పాత బీరప్ప గుడి సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ నరహరి సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంత తీసి మళ్లీ పూడ్చిన ఆనవాళ్లు ఉన్నట్టు తెలిపారు. -
అనుమతి లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగం
మొయినాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగిస్తున్న ఫాంహౌస్పై ఎకై ్సజ్ పోలీసులు దాడి చేశారు. ఢిల్లీ, గోవా రాష్ట్రాలకు చెందిన రూ.4 లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తోలుకట్టలో నగరానికి చెందిన తేజా రెడ్డి ఫాంహౌస్ ఉంది. శనివారం రాత్రి ఇక్కడ ఓ ఫంక్షన్ నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ ఎకై ్సజ్ పోలీసులు అర్థరాత్రి ఫాంహౌస్పై దాడి చేశారు. ఫంక్షన్లో వినియోగిస్తున్న ఢిల్లీకి చెందిన 50 బ్లాక్ లేబులు బాటిళ్లు, గోవాకు చెందిన నాలుగు యివాస్రీగల్ బాటిళ్లు, తెలంగాణకు చెందిన 3 లిక్కర్ బాటిళ్లు, 12 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసి పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు -
రెండు కాడెద్దులు తస్కరణ
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు రెండు కాడెద్దులను ఎత్తుకెళ్లిన సంఘటన మండల పరిధిలోని సోలీపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు కావలి బుచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తన వ్యవసాయ పొలంలో శనివారం రాత్రి రోజు మాదిరిగానే పశువులకు మేత వేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆదివారం ఉదయం వెళ్లి పశువుల పాకలో చూడగా రెండు కాడెద్దులు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని వాపోయాడు. వ్యక్తి అదృశ్యం అబ్దుల్లాపూర్మెట్ : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట కు చెందిన ఎండీ నజీర్ (65) సునీల్ అనే వ్య క్తి దగ్గర పెయింటింగ్ పని చేయడానికి వస్తుంటాడు. ఈక్రమంలో శనివారం అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్పూర్లో నిర్వహిస్తున్న పెయింటింగ్ పనికి కూలీగా వచ్చాడు. మధ్యాహ్నం 2గంటల సమయంలో దుకాణానికి వెళ్తున్నా అని చెప్పి పని దగ్గర నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకూ తిరిగి రాలేదు. సునీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు తప్పిన పెను ప్రమాదందుద్యాల్: అదుపుతప్పిన కారు విద్యుత్ సం్తభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని ఈర్లపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. బొంరాస్పేట్ మండలం చౌదర్పల్లికి చెందిన కావలి రాజు, సిద్ధు పని నిమిత్తం నారాయణపేట్ జిల్లా కోస్గి పట్టణానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈర్లపల్లి సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం మూడు ముక్కలయింది. కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. -
హాస్టల్ గదిలో ఉరేసుకుని..
ఇబ్రహీంపట్నం: ఓ బీటెక్ విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గురునానక్ కాలేజీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెళ్లికి చెందిన అలూరి భావన(22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ ఇదే హాస్టల్లో ఉంటోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యార్థినులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన ఒక్కతే ఉంది. ఏమైందో తెలియదు కానీ శనివారం తన గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుంది. కొద్ది సేపటికి ఇది గమనించిన మిగిలిన విద్యార్థులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భావన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలానికి తరలించే అవకాశం ఉందని తెలిసింది. కాలేజీ వద్ద ఉద్రిక్తత విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు గేట్లు దూకి లోనికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏసీపీ రాజు, సీఐ జగదీశ్లు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యలకు అడ్డాగా.. గురునానక్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఇబ్రహీంపట్నంలోని గురునానక్ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన విద్యార్థి సంఘాల ఆందోళన మృతురాలిది ఖమ్మం జిల్లా -
కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం
అబ్దుల్లాపూర్మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నిలిపి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిఽధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని తాడ్బన్ బహదూర్పూర ప్రాంతం హెచ్బీ కాలనీలో నివాసముండే రితేష్కుమార్ కుమారుడు దీపేష్కుమార్ (23) శుక్రవారం రాత్రి 11గంటలకు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి తన కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన హైదరాబాద్ వీటీసీ కాలనీకి చెందిన సంచయ్ మల్పనీ (22), మూసాపేట్కు చెందిన ప్రియాన్ష్ మిఠల్ (23) కలిసి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. పెద్దఅంబర్పేట శివారు గండిచెరువు వంతెన సమీపంలోకి రాగానే (రాత్రి 2 గంటలకు) ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాట చేయకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన బొలేరోను ఢీకొట్టారు. వీరి కారు బొలేరో ముందు భాగంలో ఇరుక్కుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యువకులుతేరుకునే లోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దీపేష్ కుమార్, సంచయ్ మల్పనీ కారులోనే సజీవ దహనం కాగా, కొన ఊపిరితో ఉన్న ప్రియాన్స్మిఠల్ను అతికష్టంగా బయటకు తీసిన స్థానికులు ఎల్బీనగర్లోని కామినేమి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి ఓఆర్ఆర్పై ఆగిఉన్న బొలేరోనుఢీకొట్టడంతో ప్రమాదం -
గ్రామాలకు కార్యదర్శులే పట్టుకొమ్మలు
అబ్దుల్లాపూర్మెట్: పంచాయతీ కార్యదర్శుఽలే గ్రామాలకు పట్టు కొమ్మలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేటలోని వీఆర్సీ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులు ఆత్మీయ సమ్మేళనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెరెడ్డి, ఎమ్మెల్సీలు మహేఽశ్గౌడ్, కోదండరాంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో కార్యదర్శులు లేని వ్యవస్థను ఊహించలేమన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేర్చడంలో వీరి పాత్ర కీలకమన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. పంచాయతీ అధికారులు, సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈక్రమంలో మానసిక ఒత్తిడికి గురై సుమారు 50 మంది పంచాయతీ కార్యదర్శులు ప్రాణాలు కోల్పోయారని స్పష్టంచేశారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి పాలనలో ఇలాంటి సమస్యలన్నీ దూరమై పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆనందంగా ఉన్నారన్నారు. ఇంకా కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని కూడా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన అమరవీరుల ఆత్మకుశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించి, అంజలి ఘటించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన పీర్ల వెంకన్న భార్యకు రూ.3 లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్గౌడ్, సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎం.సందీప్, కోశాధికారి ఎం.శశింద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్,సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పంచాయతీ సిబ్బంది సమస్యలపరిష్కారానికి హామీ -
స్వప్రయోజనాల కోసమే కులమతాలు
బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య చేవెళ్ల: రాజకీయ ప్రయోజనాలకోసమే కులమతాలను పెంచి పోషిస్తున్నారని బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య ఆరోపించారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లాస్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. పార్టీ జిల్లా కార్యదర్శి జంగయ్య మాట్లాడారు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మూడు వేల కులాలు, 25వేల ఉపకులాలు, 8 మతాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో నూటికి ఎనభైశాతం మంది హిందూ మతాన్ని విశ్వసిస్తున్నారని చెప్పారు. కులమతాలు రాజకీయ ప్రయోజనాలకోసమే పుట్టాయని, కులమతాలను రెచ్చగొట్టి సంబురాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వృత్తుల ఆధారంగా కులాలను అంటగట్టారని, ఇప్పుడు ఆ వృత్తులన్ని పోయి, అన్యవృత్తులు చేస్తున్నా.. కులాలు మాత్రం పోలేదని వివరించారు. మత విద్వేశాలను రెచ్చగొట్టే రాజకీయ నాయకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాంతయ్య డిమాండ్ చేశారు. ఏఐటీయుసీ రాష్ట్ర నాకుయకుడు కె.రామస్వామి, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభులింగం, మహిళా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు. టపాసులపై నిషేధాజ్ఞలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలు: సీపీ సాక్షి, సిటీబ్యూరో: ప్రసుత్తం నెలకొన్న పరిస్థితులతో పాటు భద్రతా కారణాల నేపథ్యంలో నగర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సున్నిత సంస్థలు, మిలిటరీ సంబంధిత ప్రాంతాల్లో ఈ నిషేధం మరింత కచ్చితంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇండో–పాక్ సరిహద్దులతో పాటు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో టపాసులు కాల్చినా అది తీవ్ర భయాందోళనలకు ఆస్కారం ఇవ్వవచ్చని ఆనంద్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ దాడి చేసిందనో, బాంబు దాడులు జరిగాయనో, ఉగ్రవాదుల దుశ్చర్య గానో భావించి ప్రజలు గందరగోళానికి, ఆందోళనకు గురవుతారని ఆయన పేర్కొన్నారు. -
అదిగో.. అందాల లోకం!
అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం దివిలో తారకలు భువిపైకి దిగివచ్చాయా? సౌందర్య లోకం నేలపైకి నడిచి వచ్చిందా? అనే తీరుగా ప్రపంచ సుందరీమణులు తళుక్కున మెరిశారు. తమ అందచందాలతో, చందన మందగమనంతో మురిశారు. భాగ్య నగరం ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు వివిధ దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో అట్టహాసంగా ఆవిష్కృతమయ్యాయి. ఈ సందర్భంగా సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా ప్రపంచ సుందరి– 2025 ప్రారంభ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇందులో భాగంగా జానపద, గిరిజన, శాసీ్త్రయ కళలు, హైదరాబాదీ దక్కన్ కళారూపాలను ఈ ఉత్సవాలలో సమ్మిళితం చేసి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పారు. ముఖ్యంగా కాకతీయుల కాలం నుంచి తెలంగాణ శాసీ్త్రయ నృత్య రీతిగా ఖ్యాతి గడించిన పేరిణి నాట్య ప్రదర్శన అత్యంత వైభవంగా ప్రదర్శించారు. ప్రారంభ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే, మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 111 దేశాలకు పైగా సుందరీమణులు వేదికపై అలరించారు. అధునాతన ఫ్యాషన్ వస్త్రాలంకరణతో పాటు కొందరు తమ దేశ సంస్కృతులను ప్రతిబింబించేలా మిస్ వరల్డ్ వేదికకు వన్నె తెచ్చారు. – సాక్షి, సిటీబ్యూరో -
అమ్మ కష్టం వృథా కాలే..
పరిగి: భర్త మృతితో కుంగిపోకుండా పిల్లల ఎదుగుదలే ధ్యేయంగా కష్టపడింది. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివించింది. అమ్మ కష్టాన్ని గుర్తించిన ఆ బిడ్డలు బుద్ధిగా చదువుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊటుపల్లి గ్రామానికి చెందిన కావలి పోచమ్మ, అనంతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే అనారోగ్యం బారిన పడి అనంతయ్య మృతిచెందాడు. సెంటు భూమి కూడా లేని నిరుపేద కుటుంబం వీరిది. ఇంటి పెద్ద దిక్కు కూలిపోవడంతో ఆతల్లి రెక్కలు విరిగినట్లయింది. తిండికి కూడా లేని పరిస్థితిలో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వీటన్నింటినీ ఎదుర్కొని, పిల్లల కోసమే పరితపించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారి చదువును ముందుకు నడిపింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, చిన్న కొడుకు రాఘవేందర్ కానిస్టేబుల్గా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా పోచమ్మను పలకరించగా.. నేను పడ్డ కష్టానికి తగ్గట్లుగా పిల్లలు వృద్ధిలోకి రావడం సంతోషాన్నిస్తోందని భావోద్వేగం వ్యక్తంచేసింది. -
అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది
ఆతల్లి పిల్లలు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే బొంరాస్పేట: మండల పరిధిలోని గౌరారానికి చెందిన ఎర్రోళ్ల రాములు, అంజిలమ్మకు ఆనందం, సురేఖ, రాజేందర్, విజయ్, వసంత ఐదుగురు సంతానం. వ్యవసాయ కూలీలుగా పనిచేసే భార్యాభర్తలు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. పిల్లలు ప్రాథమిక విద్యలో ఉండగానే తండ్రి అకాలమరణం చెందాడు. దీంతో అన్ని బాధ్యతలు అంజిలమ్మపై పడ్డాయి. భర్తను కోల్పోయిన బాధ వేధిస్తున్నా.. తన పిల్లలను బతికించుకోవడమే ధ్యేయంగా సాగింది. కూలీ పనులు చేస్తూనే వారిని బడికి పంపింది. పిల్లలను బాగా చదివించింది. కట్ చేస్తే.. పెద్ద కొడుకు ఆనందం పంచాయతీ కార్యదర్శిగా, సురేఖ ప్రభుత్వ ఉపాధ్యాయినిగా(ఎస్ఏ ఇంగ్లిష్), రెండో కొడుకు రాజేందర్ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా, చిన్న కొడుకు విజయ్ ఎస్ఐగా, చిన్నకూతురు వసంత ఎస్ఐగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కలలు నిజమయ్యాయి నాభర్త 2010లో చనిపోయాడు. 15 ఏళ్ల నుంచి నా కొడుకులు, కూతుళ్లకు తండ్రిలేడనే లోటు లేకుండా పెంచా. ఆయన ఆలోచన ప్రకారం అందరు బాగా చదవాలని కోరుకున్నా. అలాగే చదివించాను. అందరికీ సర్కారు కొలువులు రావడం చాలా ఆనందంగా ఉంది. – ఎర్రోళ్ల అంజిలమ్మ, గౌరారం అమ్మే.. నాన్నలా.. ఇబ్రహీంపట్నం: భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఊహించని పిడుగుపడింది. విధి వక్రీకరించి భర్త మరణించడంతో దిక్కులేని స్థితిలో బతుకు భారంగా మారింది. అయినా పిల్లలను పోషించుకునేందుకు లాండ్రీ షాపు నిర్వహిస్తూ అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తోంది. పట్టణంలోని గోల్కొండ శ్రీలతకు బీఎన్రెడ్డిలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో వ్యాన్ డ్రైవర్గా పనిచేసే రాజుతో 2007లో వివాహం జరిగింది. వీరికి వైష్ణవి, సాయికార్తీక్ సంతానం. పెళ్లయిన నాలుగేళ్లకే రాజు మరణించాడు. అత్తవారి ఇంటి వదవ్ద ఆస్తిపాస్తులు కూడా లేకపోవడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తన పిల్లలను అనాథలుగా మార్చేందుకు ఇష్టం లేక.. కన్నీటిని దిగమింగుకుని తన కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంది. స్థానికంగా లాండ్రీషాపు ప్రారంభించి ఇద్దరు పిల్లను చదివిస్తోంది. ఆరుగురు కూతుళ్ల ‘ఆరోగ్య’ లక్ష్మి కొడంగల్: ఆరుగురు ఆడ పిల్లలు ఉన్నారని ఆ తల్లి ఏనాడూ చిన్నబుచ్చుకోలేదు. కొడుకులైనా, బిడ్డలైనా ప్రయోజకులైతే చాలని భావించింది. అందరినీ బాగా చదివించింది. ప్రస్తుతం వీరందరూ వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. రావులపల్లికి చెందిన లక్ష్మి, అంజయ్యగౌడ్ గీత కార్మికులు. కులవృత్తే వీరి జీవనాధారం. ఆడ పిల్లలకు చదువెందుకు అనుకోకుండా రెక్కల కష్టంతో బిడ్డలను చదివించారు. మొదటి కూతురు జయమాల, రెండో కూతురు అనురాధ అంగడిరాయ్చూర్ పీహెచ్సీలో ఏఎన్ఎంలుగా, మూడో కూతురు అరుణజ్యోతి జీఎన్ఎమ్గా, నాలుగో కూతురు ఉమలత ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్గా, ఐదో కూతురు రాధిక తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బీఎస్సీ నర్సింగ్, ఆరో కూతురు శిరీష జీఎన్ఎమ్ స్టాప్ నర్స్గా పనిచేస్తున్నారు. నలుగురు పెద్ద కూతుళ్లకు వివాహం చేశారు. ఆయన ఆకాంక్ష నెరవేరింది పిల్లలను బాగా చదివించి, టీచర్లుగా చేయాలనేది నా భర్త ఆకాంక్ష. ఆయన అప్పటికే కవి, రచయిత. ఆయన ఆశయం మేరకు పిల్లలను చదివించా. నా ముగ్గురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక తల్లిగా ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. – నూర్జహాన్బేగం, రిటైర్డ్, అటెండర్ ముగ్గురు ఉపాధ్యాయుల తల్లి అనంతగిరి: బషీరాబాద్ మండలం పర్వత్పల్లికి చెందిన మహబూబ్, నూర్జహాన్కు దంపతులకు నస్రీన్బేగం, యాసిన్, మోసిన్ ముగ్గురు సంతానం. ప్రభుత్వ పాఠశాలలో నైట్ వాచ్మన్గా పనిచేసే మహబూబ్ 1987లో జరిగిన రైలు ప్రమాదంలో అకాల మరణం చెందారు. అప్పటికీ పిల్లల వయసు ఏడేళ్లలోపే. భర్త మృతితో కారుణ్య నియామకం కింద నూర్జహాన్కు మైల్వార్ ప్రభుత్వ పాఠశాలలో (1988) అటెండర్గా ఉద్యోగం ఇచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన పిల్లలను ప్రయోజకులను చేయాలనే ఏకై క లక్ష్యంతో ముందుకు సాగింది. అనేక కష్టాల మధ్య తల్లిని అనుసరిస్తూ పెరిగిన పిల్లలు కష్టపడి చదివారు. ముగ్గురూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. పెద్దమ్మాయి నస్రీన్బేగం ప్రస్తుతం బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో, ఉపాధ్యాయుడైన యాసిన్ ఎస్సీఆర్టీలో ఫ్యాకల్టీగా, మోసిన్ మర్పల్లి మండలం పిల్లగుండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శివారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ 2020లో నూర్జహాన్ విరమణ పొందారు. ప్రస్తుతం వికారాబాద్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ‘మాతృ’భూమికి ఇద్దరు సైనికులు దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్కు చెందిన గొల్ల ఎల్లమ్మ, అనంతయ్య దంపతులకు రాములు, మల్లేశ్, సంతోష్ ముగ్గురు సంతానం. అనంతయ్య అకాల మృతితో పిల్లల భారం ఎల్లమ్మపై పడింది. తన బాధను గుండెల్లోనే దాచుకుని ముగ్గురు కొడుకులను చదివించింది. పెద్ద కుమారుడు రాములు సైన్యంలో సేవలందించి, పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం బ్యాంకులో గార్డుగా ఉద్యోగం చేస్తున్నారు. 2016లో ఇండియన్ ఆర్మీలో చేరిన రెండో కొడుకు మల్లేశం సైనికుడిగా దేశరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నకొడుకు మల్లేశం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దేశానికి ఇద్దరు సైనికులను అందించిన ఎల్లమ్మకు మదర్స్ డే సెల్యూట్. హ్యాపీ మదర్స్ డే అందరి జీవితంలోనూ అమూల్యమైన వ్యక్తి అమ్మ. బిడ్డల కోసం ఆమె పడే ఆరాటం అంతాఇంతా కాదు. మా అమ్మానాన్నలకు మేం నలుగురం ఆడపిల్లలమే. అమ్మ ప్రోత్సాహమే నన్ను నిలబెట్టింది. ప్రస్తుతం నాకు కూడా ఓ కూతురు (మైరా) ఉంది. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – సుశీల ఎస్ఐ, షాద్నగర్. షాద్నగర్ రూరల్: మహేశ్వరం మండలం పెద్దమ్మతండాకు చెందిన మంగ్యానాయక్, మోతీ దంపతులకు జ్యోతి, సుశీల, రుక్మిణి, అరుణ నలుగురు ఆడపిల్లలు. నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వీరికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. తండాలో పుట్టిన తన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మోతీ నిర్ణయించుకుంది. తామెన్ని ఇబ్బందుల్లో ఉన్నా బిడ్డల చదువుల విషయంలో ఏనాడూ వెనకడుగు వేయలేదు. ఈక్రమంలో జ్యోతి ఎకై ్సజ్ కానిస్టేబుల్గా, సుశీల ఎస్ఐగా, రుక్మిణి టీచర్గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2020 బ్యాచ్కు చెందిన సుశీల ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కరాన్కోట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
దేవుడు పంపిన ‘అమ్మ’
మీర్పేట: వివాహమైన కొన్నేళ్లకు కూడా పిల్లలు కాకపోవడంతో అనాథ పాపను దత్తత తీసుకుంది. చిన్నారికి అనారోగ్య సమస్య ఉందని తెలిసినా, భర్త సహకారంతో పాపను పెంచి పెద్దచేసింది. అమ్మా అనే పిలుపు కోసం ఆతల్లి పడిన వేదన మాతృత్వంలోని మమకారాన్ని చాటిచెప్పింది. తన బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పించి, సొంతకాళ్లపై నిలబడేందుకు ఎంతో కృషి చేసింది. అనంతరం ఆమెకు వివాహం చేయడంతో పాటు పుట్టిన ఇద్దరు మనవరాళ్ల ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆమే నందిహిల్స్కు చెందిన విజయలక్ష్మి. వివాహమైన కొన్నేళ్లు గడిచినా పిల్లలను పుట్టకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. తనకు ఆడపిల్లనే కావాలని కోరింది. స్టేట్ హోమ్ నుంచి ఓ పాపను దత్తత తీసుకుంది. ఇంటికి తెచ్చుకున్న తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఆస్పత్రుల చుట్టూ తిప్పింది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడింది. భర్త యాదయ్య సహకారంతో తన కూతురుకు విద్యాబుద్ధులు నేర్పించి, నచ్చిన రంగంలో ఆమెను ప్రోత్సహించింది. అనంతరం తగిన వరున్ని చూసి వివాహం చేసింది. అల్లుడు, కూతురిని తనవద్దే పెట్టుకుంది. ప్రస్తుతం విజయలక్ష్మి బిడ్డకు ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. వీరిని కూడా ఆమే చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. -
అమ్మా వందనం
బిడ్డల ఉన్నతే లక్ష్యంగా నిలిచి, గెలిచిన మాతృమూర్తులు ● ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు.. ● పిల్లల విజయాలతో పట్టలేని సంతోషం ● నేడు మదర్స్ డే సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’.. సృష్టికి మూలం కూడా అమ్మే.. అమ్మా అనే రెండక్షరాల్లోని ప్రేమను కొలిచేందుకు సరితూగే సాధనాలే లేవు. కరుణ, త్యాగానికి ప్రతిరూపమైన అమ్మ గొప్పతనం.. ఆ పిలుపులోని మాధుర్యం వెలకట్టలేనిది. ఆమె జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. తన బిడ్డలను ఉన్నత స్థితిలో నిలిపేందుకు అమ్మ పడే వేదన మాటలకందనిది. అందుకే అమ్మా.. అందుకో మా వందనం. హహహ -
ఫ్యూచర్సిటీ రైతులతో సమావేశమైన అధికారులు
కందుకూరు: ఫ్యూచర్సిటీ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూ రైతులతో పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం అధికారులు సమావేశమయ్యారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న సర్వే నంబర్ 120, 121లోని రైతులతో మాట్లాడారు. రహదారి నిర్మాణంలో పూర్తిగా భూమి కోల్పోయి, ఎలాంటి ఆధారం లేని రైతు కుటుంబానికి పరిహారంతో పాటు మేజరైన ప్రతి ఒక్కరికీ అదనంగా రూ.5.50 లక్షల చొప్పున పునరావాసం కింద అందుతుందని ప్రతిమాసింగ్ వివరించారు. మిగతా రైతులకు భూసేకరణ ప్రక్రియ ప్రకారం నిర్ణయించిన పరిహారం అందుతుందన్నారు. కేవలం భూమి మొత్తం కోల్పోతూ, ఎలాంటి ఇతర ఆధారం లేని వారికి మాత్రమే అదనపు పరిహారం వర్తిస్తుందని తెలిపారు. అలాంటి వారు ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీశారు. వివరాలు అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఆరుతడి పంటలే లాభదాయకంఇబ్రహీంపట్నం రూరల్: ఆరుతడి పంటలే అన్నదాతలకు లాభదాయకమని తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మండలంలోని పోల్కంపల్లిలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయం లాభాసాటిగానే ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలబడిన ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. అడ్డగోలుగా కృత్రిమ ఎరువులు వినియోగించొద్దని సూచించారు. అవసరం మేరకు రసాయనాలు వినియోగించి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పంట మార్పిడి విధానాన్ని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు సునీత, శ్రీనివాస్రెడ్డి రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి విద్యాధరి, ఏఈఓ శ్రవణ్కుమార్, సృజన తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య డీఈఓ సుశీందర్రావు తుక్కుగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని డీఈఓ సుశీందర్రావు పేర్కొన్నారు. పురపాలిక సంఘం పరిధిలోని తుక్కుగూడ, సర్ధార్నగర్, మంఖాల్ గ్రామాల్లో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలే నిదర్శనమన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి, మంచి భవిష్యత్ను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ కస్నానాయక్, హెచ్ఎం భాస్కర్రెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ఫేక్ అడ్రస్’
ఆర్టీఏలో నకిలీ చిరునామాలతో రవాణా శాఖ పౌర సేవలు ● గ్రేటర్లోని పలు కేంద్రాల్లో ఆమ్యామ్యాల వ్యవహారం ● అక్రమార్జనే లక్ష్యంగా వాహనాల నమోదు, బదిలీలు, లైసెన్సులు ● గతంలో ఓ ఆర్టీఓపై క్రమశిక్షణ చర్యలు ● అయినా.. యథేచ్ఛగా కొనసాగుతున్న అవినీతి తతంగం సాక్షి, సిటీబ్యూరో: వాహన పర్మిట్ బదిలీ కోసం దాని యజమాని నుంచి రూ.40 వేలు వసూలు చేసినట్లు నగరంలోని బండ్లగూడ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారిపై కొద్దిరోజుల క్రితం ఫిర్యాదులు రావడంతో.. అతడిని అక్కడి నుంచి రవాణా కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇలా పర్మిట్ బదిలీయే కాదు.. అడిగినంత సమర్పించుకుంటే ఎలాంటి సర్వీసులైనా ఇక్కడ తేలిగ్గా లభిస్తాయనే ఆరోపణలున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల బదిలీలు, కొత్త బండ్ల నమోదు సహా వివిధ రకాల పౌరసేవలు ఇక్కడ అంగడి సరుకుల్లా అమ్ముడవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండ్లగూడ కార్యాలయంలో తప్పుడు చిరునామాలతో వాహన అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడటంలేదు. గతంలో ఇదే వ్యవహారంలో ఇక్కడి ఆర్టీఓపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. కాగా.. ఈ అక్రమాల తంతు ఒక్క బండ్లగూడ కార్యాలయంలోనే కాదు.. నగరంలోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో యథేచ్ఛ గా కొనసాగుతున్నట్లు.. ‘ఫేక్ అడ్రస్’లకు చిరునామాలుగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరునామా ఎంతో కీలకం డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, చిరునామా బదిలీలు, పర్మిట్ బదిలీలు వంటి వివిధ రకాల సేవల్లో వాహనదారుడి అడ్రస్ను ఎంతో కీలకంగా పరిగణిస్తారు. తప్పుడు వ్యక్తులు, అసాంఘిక శక్తుల చేతుల్లోకి వాహనాలు వెళ్లకుండా, అలాంటి వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్సులను పొందకుండా నియంత్రించేందుకు కచ్చితమైన అడ్రస్ను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్ గుర్తింపు, బ్యాంకు ఖాతా పుస్తకం, వంటగ్యాస్ డాక్యుమెంట్లు, కరెంట్ బిల్లు చెల్లింపు రసీదు తదితర 13 రకాల పత్రాలను చిరునామా ధ్రువీకరణకు ప్రామాణికంగా భావిస్తారు. కాగా.. సదరు వాహనదారు సమర్పించింది నిజమైనవో కాదో నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే పౌర సేవలను అందజేయాలి. కానీ కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఎలాంటి నిర్ధారణ లేకుండానే పౌరసేవలను అంగడి సరుకుల్లా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయానికి ప్రతిరోజూ సుమారు 120 లెర్నింగ్ లైసెన్సులను అందజేస్తే వాటిలో కనీసం 40 వరకు తప్పుడు అడ్రస్లపై జారీ చేసినవే ఉంటాయని ఆర్టీఏ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవారివే ఎక్కువగా ఉంటాయన్నారు. అడ్డుకుంటున్నా ఆగడంలేదు ‘వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వారి అడ్రస్లను పరిశీలించినప్పుడు మా కార్యాలయం పరిధిలోకి రానివి, తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించినవి గుర్తించి అడ్డుకుంటున్నాం. కానీ అలాంటి వ్యక్తులు నగరంలో ఇతర ఆర్టీఏ కార్యాలయాల నుంచి యథేచ్ఛగా తమకు కావాల్సిన సర్వీసులను పొందుతున్నారు’ అని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పని చేసే ఒక అధికారి తెలిపారు. ‘ప్రతిరోజూ 100 నుంచి 120 లెర్నింగ్లు ఇస్తేనే గిట్టుబాటవుతుందని భావించే సిబ్బంది ఉన్నచోట స్క్రూ ట్నీ చేస్తే కనీసం 30 శాతం తప్పుడు అడ్రస్లే నమోదైనట్లు తేలుతుంది’ అని మరో అధికారి చెప్పడం గమనార్హం. వాహనదారులు సమర్పించే అడ్రస్ పత్రాలు అసలివో, నకిలీవో నిర్ధారించే వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణ మని జూబ్లీహిల్స్కు చెందిన డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఒకరు అభిప్రాయపడ్డారు. -
పవర్
మరింతగా..ఏటా పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా శరవేగంగా విస్తరిస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో భారీ బహుళ అంతస్తుల భవనాలు, పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రమిక విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,756 మెగావాట్లు నమోదు కాగా, 2025లో 4,352 మెగావాట్లకు చేరుకుంది. అదే 2030 నాటికి అనూహ్యంగా 9,089 మెగావాట్లకు పెరుగుతుందని డిస్కం అంచనా వేసింది. ఆ మేరకు విద్యుత్ లైన్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు 62 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. మరో ఐదేళ్లలో ఇది 80 లక్షలు దాటే అవకాశం ఉంది. రాబోయే విద్యుత్ డిమాండ్ను ఇప్పుడే గుర్తించి, ఆ మేరకు ఏర్పాట్లు చేయడం ద్వారా ఇళ్లలో 24 గంటలు విద్యుత్ వెలుగులు విరజిమ్మొచ్చొని డిస్కం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 33/11 కేవీ ఫీడర్లు, డీటీఆర్లు సామర్థ్యం పెంచుతున్న డిస్కం.. తాజాగా మరికొన్ని అదనపు సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే రెండేళ్లలో రూ.420 కోట్ల అంచనాతో రంగారెడ్డిజోన్లో 34, మెట్రో జోన్లో 36, మేడ్చల్ జోన్లో 18 చొప్పున మొత్తం 88 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయిచింది. పనుల్లో నాణ్యత, వేగవంతం కోసం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సర్కిళ్ల వారీగా పనులను విభజించి, వాటికి టెండర్లు పిలిచి, ముందుకు వచ్చే ఔత్సాహిక కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని భావిస్తోంది. 61 సబ్స్టేషన్లలో రికార్డు స్థాయి వృద్ధిరేటు గ్రేటర్ జిల్లాల్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 62 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షలకుపైగా గృహ, 8 లక్షలకుపైగా వాణిజ్య, 50 వేలకుపైగా పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా అదనంగా 2,500 కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. కొత్త కనెక్షన్లకు తోడు ప్రతి ఇంట్లోనూ ఏసీ, కూలర్, ఓవెన్, మిక్సీ, వాషింగ్ మిషన్, గ్రీజర్, టీవీ, కంప్యూటర్, ఐరెస్ బాక్స్ సర్వసాధారణమయ్యాయి. ఫలితంగా విద్యుత్ డిమాండ్ వార్షిక పెరుగుదల రేటు ఏటా సగటున 15 నుంచి 25 శాతం పెరుగుతోంది. 61 సబ్స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ వృద్ధిరేటు నమోదైంది. 30 నుంచి 87 శాతం వరకు వృద్ధి రేటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వేగంగా పెరుగుతున్న ఈ వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని డిస్కం ఇంజనీర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సమ్మర్ యాక్షన్ప్లాన్లో భాగంగా బంజారాహిల్స్, సైబర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సికింద్రాబాద్, హబ్సిగూడ, మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్నగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో ఇరవై 33/11 కేవీ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. వీటిలో 184 పీటీఆర్ల సామర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచారు. 33 కేవీఫీడర్లు 69, అదే విధంగా 11 కేవీ ఫీడర్లు 592 ఏర్పాటు చేశారు. కొత్తగా మరో 6,675 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య లేకుండా చూశారు. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో డిమాండ్ రానున్నట్లు డిస్కం ఇంజనీర్లు అంచనా వేశారు. 2030 నాటికి గ్రేటర్ డిమాండ్ 9,089 మెగావాట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అంచనా సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంపు అదనపు సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణకు ప్రతిపాదనలుగ్రేటర్లో 2030 నాటికి విద్యుత్ వృద్ధి రేటుసంవత్సరం మెగావాట్లు 2022 3,158 2023 3,435 2024 3,756 2025 4,352 2026 5,043 2027 5,843 2028 6,770 2029 7,644 2030 9,089 -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
దుద్యాల్: ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకే ఉన్నత చదువు, అనుభవం ఉంటుందని, నాణ్యమైన విద్య బోధించడంలో వారు ముందుంటారని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి పేర్కొన్నారు. శుక్రవారం దుద్యాల్ మండల పరిధిలోని చిలుముల మైల్వార్ పాఠశాలలో విద్యార్థులకు కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈవో విజయరామా రావుతో కలిసి పరిశీలించారు. శిక్షణ శిబిరం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు ఆసక్తి, విద్య, శారీరక సామర్థ్యాలు పెంచే విధంగా తగిన శిక్షణ అందించాలన్నారు. ముఖ్యంగా చదువుతో పాటు నృత్యం, డ్రాయింగ్, క్రీడలు, గణితం సంబంధిత అంశాల్లో మెలకువలు బోధించడంతో పాటు భాషా పరిజ్ఞానం పెంపొందించుకునేలా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సాంకేతికత పెంచేందుకే కృత్రిమ మేదస్సు శిక్షణ 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ముందస్తుగానే అధునాతన సాంకేతిక పెంచేందుకు కృత్రిమ మేదస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) శిక్షణ అందిస్తున్నామని డీఈవో రేణుక దేవి తెలిపారు. కృత్రిమ మేదస్సు ద్వారా విద్యార్థులు చదవడం, నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం వంటి విధానాలు చాలా వేగంగా నేర్చుకుంటారన్నారు. కంప్యూటర్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, అందుకు సంబంధించి విద్యార్థులకు లాగిన్ ఐడీ ద్వారా ఈ విషయాలు అందుతాయని అన్నారు. చదువుతో పాటు కథలు, తెలుగు, ఇంగ్లీష్, గణిత సంబంధిత అంశాలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని 265 పాఠశాలలో కృత్రిమ మేదస్సు శిక్షణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వార్షిక ప్రణాళిక ముందస్తుగానే తయారు చేసుకోవాలి ప్రతీ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు వచ్చే అకాడమిక్ సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికను ముందస్తుగానే తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏ నెలలో ఏ పాఠ్యాంశం పూర్తి చేయాలి, అందుకు సంబంధించిన పరీక్షను ఎలా నిర్వహించుకోవాలి, అర్థం కాకుంటే విద్యార్థులకు ఎలాంటి వివరణ ఇస్తే బాగుంటాయో వంటి అంశాలను ఉపాధ్యాయుడు రాసుకుని తిరిగి విద్యార్థులకు బోధించాలి. పాఠ్యాంశ బోధనలో నిర్లక్ష్యం తగదని, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా అకాడమిక్ సంవత్సరం మొదటి నుంచే ప్రణాళికలు తప్పనిసరిగా సిద్ధం చేసుకుంటే ఉత్తమం. అందుకు తగ్గట్టుగా విద్యా బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదయ్య, ఉపాధ్యాయు లు ఆంజనేయులు, సంగమేశ్వర్, గోవర్ధన్, అనిల్ కుమార్, హన్మంతు, దివ్య శ్రీ, కవిత, గ్రామస్థులు శివ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పట్టుదలతో బోధన చేపట్టాలి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు తీసుకురావాలి వేసవి శిక్షణ శిబిరంలో చదువుతో పాటు నృత్యం, డ్రాయింగ్, క్రీడలు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ముందస్తు ప్రణాళిక తప్పనిసరి ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి రేణకాదేవి సూచన -
ప్రారంభమైన ఎఫ్ఐఆర్ నమోదు
దుద్యాల్: ఎట్టకేలకు దుద్యాల్ పోలీస్ స్టేషన్లో సేవలు ప్రారంభమయ్యాయి. కొంత కాలంగా సాక్షి దినపత్రికలో పేరుకే పోలీస్ స్టేషన్, అందుబాటులో లేని సేవలు అని వరుస కథనాలు ప్రచూరించింది. దీంతో స్పందించిన అధికారులు సేవలను ఇటివలే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్ఐ యాదగిరి మాట్లాడుతూ కొన్ని నెలలుగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు సేవలు అందుబాటులో లేకపోవడంతో మండల వాసులను పాత మండల పోలీస్ స్టేషన్కే రెఫర్ చేశామన్నారు. ఈ నెల 1వ తేదీన పోలీస్ స్టేషన్కు సాంకేతిక సామాగ్రి వచ్చాయని, వాటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్కు సమయం పట్టిందని ఎస్ఐ తెలిపారు. రెండు రోజుల నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సేవలు, కేసుల నమోదు ఇక నుంచి దుద్యాల్ మండల కేంద్రంలోనే ఉంటాయని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. మండల కేంద్రంలో 16 సీసీ కెమెరాలు ఉండగా, 9 పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మిగితావి కొంత రిపేర్లో ఉన్నాయని త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మండల పరిధిలోని చిలుముల మైల్వార్ గ్రామంలో మరో రెండు సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచామని వివరించారు. దుద్యాల్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన నాలుగు నెలలకు సేవలు ప్రారంభం సాక్షి వరుస కథనాలకు స్పందనసిబ్బంది కొరత.. దుద్యాల్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉంది. స్టేషన్ ప్రారంభించిన నాడు ఎస్ఐతో కలిపి 27 మంది సిబ్బందిని కేటాయించింది. గతంలో కొంత మంది సిబ్బందిని ఇక్కడి నుంచి వేరే స్టేషన్కు బదిలే చేశారు. ప్రస్తుతం ఈ స్టేషన్లో ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, 17 మంది కానిస్టేబుల్ (ఒక మహిళతో కలిపి) అందుబాటులో ఉన్నారు. ఇంకా ఒకరు మహిళ సిబ్బందితో పాటు కొంత మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఈ విషయమై ఎస్ఐ యాదగిరిని వివరణ కోరగా త్వరలో బదిలీలు చేపట్టే అవకాశం ఉంటుందని, అప్పుడు సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
షాద్నగర్రూరల్: నిరుపేదల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్దలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరుపేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని నాణ్యతతో నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు శ్యాంసుదర్, బాల్రాజ్గౌడ్, వెంకటేశ్గుప్తా, రాజు, శివలింగం, అందె మోహన్, శ్రీనివాస్, ఖదీర్, శ్రీశైలం, రాజేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
వేసవిలో దున్ను.. దిగుబడులకు దన్ను
షాబాద్: పంటల సాగులో శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాని ఏఓ వెంకటేశం తెలిపారు. పలు సందర్భాల్లో రైతులు తీసుకునే సొంత నిర్ణయాలు దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వేసవి దుక్కులతో కలిగే లాభాలను వివరించారు. ● పంట కొయ్యలను కాల్చకుండా, కలియదున్నాలి. ● వేసవిలో లోతు దుక్కులతో చాలా ప్రయోజనాలున్నాయి.. పురుగులు, తెగుళ్లు, కలుపును నివారించడంతో పాటు భూమి పొరల్లో వర్షపునీరు ఇంకి పంటకు ఉపయోగపడుతుంది. ● ఏప్రిల్, మే నెలలు వేసవి దుక్కులకు అనుకూలం. ● అడ్డం, పొడవు సాళ్లలా కాకుండా ఏటవాలుగా దున్నడం శ్రేయస్కరం. ● ఏటవాలు దుక్కులతో భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. ● లోతుగా దున్నినప్పుడు పంటలకు హాని చేసే క్రిమికీటకాలతో పాటు లార్వా దశలో ఉండే గుడ్లు సూర్యకిరణాలు పడి నాశనమవుతాయి. ● తొలకరి వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసుకునే అవకాశం కలుగుతుంది. ● అంతకుముందే రెండుసార్లు దున్నితే గట్టిగా ఉన్న భూమి గుల్లబారుతుంది. ● ఇది కలుపును నియంత్రించడంతో పాటు నేలలో ఎక్కువ కాలం తేమ నిల్వ ఉండేలా దోహదపడుతుంది. ● భూమి పొరల్లోకి గాలి చేరుతుంది. ● సూక్ష్మజీవుల సాంద్రత, సేంద్రియ కర్బన వినియోగం పెరుగుతుంది. ● మొక్క వీటిని నేరుగా గ్రహించే అవకాశం ఉంటుంది. ● కలుపు, పురుగు మందుల అవశేషాలతో మొక్కలకు కీడు కలగకుండా ప్రభావం చూపుతుంది. ● గాలిలో ఉన్న నత్రజని వర్షపు నీటితో కలిసి భూ మిలోకి చేరడం వల్ల భూసారం పెరుగుతుంది. ● పురుగుమందులు, తెగుళ్ల మందుకయ్యే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. లోతైన దుక్కులతో పంటలకు పుష్టి తొలకరి వర్షాలకేవిత్తనాలు వేసుకునే అవకాశం ఏటవాలు సాళ్లతో భూమి కోతకు అడ్డుకట్ట వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం -
నియంతృత్వంపై ఉద్యమిద్దాం
ఇబ్రహీంపట్నం: ప్రపంచాన్నే గడగడలాడించిన హిట్లర్నే తరిమికొట్టిన పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ విధానాలపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. హిట్లర్ ఫాసిజంపై నాటి సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం విజయం సాధించి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచదేశాలను అక్రమించుకోవాలన్న కుట్ర, కుతంత్రాలతో నియంత హిట్లర్ సాగించిన దూకుడుకు ఎర్రజెండా అడ్డుకట్టవేసిందన్నారు. ఒక్కో దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తూ రష్యాను సైతం ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నానికి 1945లో కమ్యూనిస్టు సైన్యం అడ్డుకట్టవేసి సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టు నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఉగ్రవాద చర్యలను సీపీఎం ఖండిస్తుందన్నారు. పాకిస్తాన్, భారత్ యుద్ధం కొనసాగుతుండగా హైదరాబాద్లో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని జాన్వెస్లీ అన్నారు. వెంటనే ఈ పోటీలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఈనెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈనెల 30న వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టే ధర్నాలకు సైతం మద్దతు ఉంటుందని తెలిపారు. రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో సీపీఎం శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామేల్, జగదీశ్, ఈ.నర్సింహ, జగన్, చంద్రమోహన్ తదితరు పాల్గొన్నారు. యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా ? సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
డిజిటల్ అరెస్టు పేరుతో రూ.84 లక్షలు స్వాహా
బాధితురాలిగా మారిన ప్రభుత్వ ఉద్యోగిని నరేష్ గోయల్ కేసుతో సంబంధం ఉందని ఫోన్ తాత్కాలిక బెయిల్, రిఫండ్ అంటూ టోకరాసాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ అరెస్టు పేరు చెబుతూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కాల్ చేసిన కేటుగాళ్లు రూ.84 లక్షలు కాజేశారు. ఆద్యంతం ఆమెను భయంలో ఉంచిన ఈ–కేడీలు తాత్కాలిక బెయిల్ కూడా ఇచ్చారు. ఎట్టకేలకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్ పూర్వాపరాలిలా ఉన్నాయి... ఓ ప్రభుత్వ ఉద్యోగినికి (57) ఈ ఏడాది మార్చి 4న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ట్రాయ్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి... ఆమెను పూర్తిగా నమ్మించేందుకు తన ఐడీ నెంబర్ అంటూ ఓడీ62813 అనే సంఖ్యను చెప్పాడు. బాధితురాలి పేరుతో నమోదై ఉన్న సెల్ నెంబర్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఫిర్యాదు ఉందంటూ కంప్లైంట్ నెంబర్ కూడా చెప్పాడు. వీలున్నంత త్వరగా వ్యక్తిగతంగా వెళ్లి ట్రాయ్ కార్యాలయంలో అధికారులకు కలవాలని చెప్పాడు. ఆ కొద్దిసేపటికి ముంబై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రతినిధిని అంటూ మరో వ్యక్తి ఫోన్ చేశాడు. వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసిన అతను తతను దర్యాప్తు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన వ్యాపారి నరేష్ గోయల్ వ్యవహారాల్లో బాధితురాలి పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ వాడారని చెప్పాడు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమైనందున న్యాయపరమైన అంశాలు అనేకం ఉంటాయని, అప్పటి వరకు విషయం కుటుంబీకులతో సహా ఎవరికీ చెప్పద్దని స్పష్టం చేశాడు. గత నెల 8న వాట్సాప్ ద్వారానే బాధితురాలికి మరో వీడియో కాల్ వచ్చింది. కేసుకు సంబంధించిన చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా చెప్పుకున్న ఆ వ్యక్తి కీలక కేసులో ఆరోపణలు ఉండటంతో మీ ఆర్థిక లావాదేవీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలించి, క్లీన్ చిట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. నరేష్ గోయల్తో సంబంధాలు ఉన్న స్లీపర్ సెల్స్ కొందరు బెదిరింపులకు దిగే అవకాశం ఉందని, ఈ కారణంగానే మీ ఫోన్పై పూర్తి నిఘా ఉంచుతామని చెప్పాడు. గత నెల 11న వీడియో కాల్ చేసిన మరో నేరగాడు తాను సర్వైలెన్స్ ఆఫీసర్నిని పరిచయం చేసుకున్నాడు. డిఫెన్స్ లాయర్ అంటూ మరో నేరగాడినీ పరిచయం చేసిన అతను డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు బాధితురాలికి చెప్పాడు. డిఫెన్స్ లాయర్గా చెప్పుకున్న వ్యక్తి వర్చువల్గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారని చెప్పాడు. ఇదంతా నిజమని నమ్మిన బాధితురాలు తన భర్త ఆరోగ్యం బాలేదని, వర్చువల్ అప్పీరెన్స్కు కొంత సమయం కావాలని కోరారు. దీంతో ఆమెకు వాట్సాప్ ద్వారా టెంపరరీ బెయిల్ అని రాసి, సుప్రీం కోర్టు పేరుతో ఉన్న పత్రాలు, రూ.30 లక్షల విలువైనదిగా తయారు చేసిన నకిలీ ష్యూరిటీ బాండ్ పంపించాడు. దీని నిమిత్తం ఆ మొత్తం తన ఖాతాల్లో వేయించుకున్నాడు. తాము కోరిన మొత్తం సూచించిన బ్యాంకు ఖాతాల్లో వేయాలని, ఆ లావాదేవీలను ఆర్బీఐ, న్యాయస్థానం పరిశీలించి క్లీన్ చిట్ ఇస్తాయని నమ్మించాడు. ఆపై కేసు వీగిపోవడంతో పాటు డిపాజిట్ చేసిన నగదు అంతా రిఫండ్ వస్తుందని నమ్మించాడు. దీంతో బాధితురాలు తన ఎఫ్డీలు విత్డ్రా చేసి, బంగారంపై రుణం తీసుకుని, అప్పులు చేసి మొత్తం రూ.84 లక్షలు నేరగాళ్లు సూచించిన ఖాతాల్లో వేశారు. మంగళవారం ఆఖరుసారిగా కాల్ చేసిన నేరగాళ్లు కేసు క్లోజ్ అయిందని, డిపాజిట్ చేసిన మొత్తం త్వరలోనే రిఫండ్ అవుతుందని చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి వారి ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్ అయిపోయాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
రేపు రౌండ్ టేబుల్ సమావేశం
తుక్కుగూడ: కుల గణన, ఓబీసీల భవిష్యత్ నిర్మాణం, సామాజిక నాయ్యం అనే ఆంశాలపై ఈనెల 10న నగరంలోని సోమాజిగూడ క్షత్రియ హోటల్లో ఉదయం 10:30 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సహాయ మంత్రి నరేంద్ర కశ్యప్తో పాటు పలువురు వక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు అంబర్పేట: దృష్టి చోరీలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల ముఠాను అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు. డీఐ హఫీజుద్దీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మోఘల్పురా సుల్తాన్షాహికి చెందిన సయ్యద్ ఆఫ్రీదిన్, షేక్ హమీదుద్దీన్, నసీమ్ బేగం, ఖయ్యూం సుల్తానా ముఠాగా ఏర్పడి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నెల 5న వారు అంబర్పేట తిరుమల నగర్లోని భవానీలాల్ జ్యూవెల్లరీ దుకాణానికి వచ్చారు. వృద్ధురాలైన ఖయ్యూం సూల్తానా తన ఒంటిపై ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చి వాటిపై డబ్బులు కావాలని కోరింది. వాటికి రూ.2 లక్షలు వస్తాయని చెప్పిన దుకాణ యజమాని డబ్బులు ఇచ్చేందుకు సిద్దపడి కౌంటర్లో నుంచి తీసి బయటపెట్టారు. బంగారాన్ని పరీక్షించేందుకు అతను లోపలి వెళ్లగానే వారు కౌంటర్ పై ఉన్న రూ.2 లక్షల నగదును తీసుకుని ఉడాయించారు. అదే సమయంలో బంగారాన్ని పరీక్షించిన యజమానికి అది నకిలీదిగా గుర్తించి బయటికి చూడగా సుల్తానాతో పాటు మిగతా వ్యక్తులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
శంకర్పల్లి: రాష్ట్రంలోని రైతులు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి, అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషన్ సభ్యుడు రాములునాయక్ అన్నారు. గురువారం శంకర్పల్లి మండలం ఎర్వగూడ గ్రామంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాతలు అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతోనే వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో గ్రామగ్రామాన అవగాహన సమావేశాలను నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. శాస్త్రవేత్త శర్మ మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడిని అలవాటు చేసుకోవాలని, ఎప్పటికప్పు డు భూసార పరీక్షలు చేయించి, ఎరువులు వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు లక్ష్మి, చేవెళ్ల ఏడీఏ సురేశ్ బాబు, శంకర్పల్లి ఇన్చార్జ్ వ్యవసాయాధికారి సురేశ్ బాబు, ఏఈఓ మనీషా, ఏఎంసీ మల్లేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. యూరియాను తగ్గించాలి.. షాబాద్: పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచుకోవాలని వ్యవసాయశాఖ సీనియర్ శాస్త్రవేతలు డాక్టర్ పి.సతీష్, శాస్త్రవేత్త డాక్టర్ డి.శిరీష, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ అన్నారు. పోలీపేట్, లక్ష్మారావుగూడ గ్రామాల్లో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేతలు అవగావాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందించవచ్చని తెలిపారు. పంట మార్పిడిని పాటించాలని సూచించారు. పచ్చిరొట్ట సాగు ద్వారా ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, వ్యవసాశాఖ అధికారి వెంకటేశం, ఏఈఓలు గీత, రాజేశ్వరి, కిరణ్మయి, వ్యవసాయ విద్యార్థులు ప్రవీణ్కుమార్, శ్రీను, అవనిజ, ఉమ తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ సాగుతో సత్ఫలితాలు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషన్ సభ్యుడు రాములు నాయక్ ఎర్వగూడలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ -
మొబైల్ స్నాచింగ్ కోసం బైక్ చోరీ...
బంజారాహిల్స్: మొబైల్ స్నాచింగ్ల కోసం బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు పాత నేరస్తులను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే..ఆగాపురాకు చెందిన నసీర్ఖాన్ అలియాస్ నజీర్ ఆటోడ్రైవర్గా పని చేసేవాడు. అప్జల్సాగర్కు చెందిన ఇర్ఫాన్ఖాన్ అలియాస్ అర్మాస్ ఫర్నీచర్ షాపులో వర్కర్గా పని చేస్తున్నాడు. స్నేహితులైన వీరు జల్సాలకు అలవాటు పడ్డారు. వీరిపై నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో మొబైల్ స్నాచింగ్లతో పాటు బైక్ చోరీలు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఏప్రిల్ 18న హయత్నగర్లో ఓ బైక్ చోరీ చేసిన బైక్ చోరీ చేసిన రషీద్ ఖాన్ అదే బైక్పై ఇర్ఫాన్ఖాన్తో కలిసి ఏప్రిల్ 30న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో 5 మొబైల్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్లో స్నాచింగ్ జరిగిన ప్రాంతం నుంచి నాలుగు రోజుల పాటు 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం ఉదయం వీరు ఇద్దరూ హబీబ్నగర్లోని ఓ ఇంటి ఎదుట ఆగడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో రషీద్ఖాన్పై ఫిలింనగర్, బంజారాహిల్స్, హయత్నగర్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, నాంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి, హుమాయున్నగర్ పోలీస్స్టేన్ల పరిధిలో 17 కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇర్ఫాన్ఖాన్పై హబీబ్నగర్, హుమాయున్నగర్, మార్కెట్, గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో 6 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి మొబైల్ స్నాచింగ్ల కోసమే బైక్ చోరీ చేసినట్లుగా గుర్తించారు. వీరి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు -
ఎడిటర్ ఇంట్లో సోదాలు అమానుషం
టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సాక్షి, రంగారెడ్డిజిల్లా: సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు చేయడాన్ని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీయూడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.సత్యనారాయణ, ఎం.సైదులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ బాధ్యత గల పత్రికా ఎడిటర్ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడం సరికాదన్నారు. నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులకు తిలోదకాలిస్తూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు వ్యవహరించడం అమానుషమన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా జర్నలిస్టులను భయపెట్టాలనే ఉద్దేశంతో ఏపీ పోలీసులు చట్టానికి విరుద్ధంగా వ్యవహారించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేస్తే నిబంధనల ప్రకారం నడుచుకోవాలే కానీ ఏకపక్షంగా ఇళ్లలోకి చొరబడటం ఏమిటని ప్రశ్నించారు. ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. పూడికతీత పనులు చేపట్టాలి గోల్కొండ: కార్వాన్ నియోజకవర్గంలో వర్షపునీటి పైప్లైన్లకు పూడికతీత పనులు చేపట్టాలని నియోజకవర్గం గుడ్ గవర్నెన్స్ కమిటీ వారు బల్దియా జోనల్ కమిషనర్ను కోరారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు గురువారం జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి, బీజేపీ నాయకుడు జొన్నకుంటి మధుసూదన్ మాట్లాడుతూ..వరద నీటి పైప్లైన్లు పూడికలతో నిండిపోయాయన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపై సైతం డ్రైనేజీ నీరు ప్రవహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మనీష్, గోదా లక్ష్మీకాంత్యాదవ్ తదితరులున్నారు. -
నమ్మక ద్రోహికి కటకటాలు
కడ్తాల్: పొలంలో పని చేస్తున్న మహిళపై దాడి చేసి బంగారు నగలు దోచుకెళ్లిన నిందితుడిని పోలీసులు కటకటాల పాలు చేశారు. మండలంలోని చరికొండలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ గంగాధర్ గురువారం వెల్లడించారు. గ్రామానికి చెందిన గుల్లకుంట మహేశ్గౌడ్ వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఆయన బుధవారం బంధువుల పెళ్లికి హైదరాబాద్కు వెళ్లాడు. తన పశువుల బాధ్యతను పక్క పొలానికి చెందిన నాగిళ్ల మహేశ్కు అప్పజెప్పాడు. అలాగే తన తల్లి జంగమ్మకు ఆసరాగా ఉండమని సూచించాడు. అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి ఊరికి రావడానికి ఆలస్యమవుతుందని మహేశ్గౌడ్ తెలిపాడు. దీంతో ఇదే అదునుగా భావించిన మహేశ్ పొలంలో పని చేస్తున్న జంగమ్మ మెడలోని బంగారు పుస్తెలతాడు, చైన్(6 తులాలు) లాక్కొని దాడి చేశాడు. ఆమె అపస్మారకస్థితిలో వెళ్లడంతో చనిపోయిందని భావించి వెళ్లిపోయాడు. దొంగిలించిన సొమ్మును అదే పొలంలో దాచిపెట్టాడు. రాత్రి 10 గంటలైనా తన తల్లి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన మహేశ్గౌడ్ వెంటనే మహేశ్కు ఫోన్ చేయగా.. సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో గ్రామస్తులతో కలిసి పొలానికి వెళ్లి వెతకగా గాయాలతో జంగమ్మ కన్పించింది. మహేశ్ దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లాడని ఆమె తెలిపింది. దీంతో కడ్తాల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లోకేషన్ ఆధారంగా నాగిళ్ల మహేశ్ను అరెస్ట్ చేశారు. దొంగిలించి బంగారంతో పాటు, సెల్ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మహిళపై దాడి కేసును ఛేదించిన పోలీసులు -
గొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..
● మహిళ దారుణ హత్య ● చాంద్రాయణగుట్టలో ఘాతుకం చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
షాద్నగర్ కవులకు సత్కారం
షాద్నగర్: హైదరాబాద్లోని త్యాగరాయగాన సభలో తెలుగు భాషా చైతన్య సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం తెలుగు భాష సదస్సు, కవి సమ్మేళనం నిర్వహించారు. షాద్నగర్ పట్టణానికి చెందిన కవులు నరేందర్రా వు, రవిప్రకాష్ హర్మాళ్ తమ కవితలు వినిపించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షు డు బడే సాబ్, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాసిం,విశ్రాంత ప్రొఫెసర్ జయరాములు వారి ని సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. చొరబాటుదారులను వెనక్కి పంపండి డీజీపీకి ఫిర్యాదు మీర్పేట: మహేశ్వరం నియోజకవర్గంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యాలను గుర్తించి వారి దేశాలకు తరలించాలని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల రాఘవేందర్ ముదిరాజ్ గురువారం డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం రాఘవేందర్ మాట్లాడుతూ.. అక్రమ చొరబాటుదారులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నందున, వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యహరించా లని అన్నారు. నియోజకవర్గంలో అధిక సంఖ్య లో నివసిస్తున్న వారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని డీజీపీకి వివరించినట్లు చెప్పారు. దీనికి డీజీపీ సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకురాలు హైందవిరెడ్డి ఉన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఇబ్రహీంపట్నం రూరల్:భూ సమస్యలపరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భా రతి చట్టం తీసుకొచ్చిందని, ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు సర్వేయర్లు అవసరమని కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహా యంగా రాష్ట్రంలో 5,000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందు కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తోందన్నారు.అన్ని మీ సేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు ప్రాస్పెక్టస్ పొందొచ్చని, మీ సేవా కేంద్రాల్లోనే ఈ నెల 17వ తేదీ వ రకు సమర్పించాలని సూచించారు. ఇంటర్లో గణితంలో 60 శాతం మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్, డిప్లోమా (సివిల్), బీటెక్ (సివిల్) సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్య ర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో 26వ తేదీ నుంచి 50 పని దినాల్లో శిక్షణ ఇస్తారన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’ మహేశ్వరం: ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని, సత్వరం పరిష్కరించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు స్థానిక డిపో మేనేజర్ లక్ష్మీసుధ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యా హ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ప్రయాణికులు 91542 98784 నంబర్కు ఫోన్ చేయా లని తెలిపారు. సలహాలు, సూచనలు అందించడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి మాడ్గుల: నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. మండలంలోని ఇర్విన్ గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయంలో రికారులు పరిశీలించారు. మండలస్థాయి అధి కారులు రైతులకు ఎప్పటికప్పుడు అందుబా టులో ఉండి సలహాలు, సూచనలు అందించా లని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్య వసాయాధికారి అరుణకుమారి, విస్తరణ అధి కారులు జోష్న, భార్గవి, రాజేష్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ముప్పు
చేవెళ్ల: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కమాన్ పట్టీలు విరిగిపోవడంతో అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేసి, నియంత్రించడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి కొండగల్, కోస్గి వెళ్తున్న కోస్గి ఆర్టీసీ బస్సు మీర్జాగూడ బస్ స్టేజీకి సమీపంలోకి రాగానే రోడ్డు ములుపు వద్ద కమాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో బస్సు రోడ్డు కిందికి దూసుకెళ్లి, ఆగిపోయింది. ఈ సంఘటనతో అందులో ఉన్న సుమారు 60మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు మరికొంత దూరం వెళ్లి ఉంటే బోల్తా పడి ఉండేదని చెప్పారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కమాన్పట్టీలు విరగడంతో ప్రమాదం రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు 60 మంది ప్రయాణికులు సురక్షితం -
కుర్చీలాట!
ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ చేసిన సీఈఐజీ ● సీటు దక్కించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు ● కాసుల వర్షం కురిపిస్తుండడంతో భారీగా డిమాండ్ ● ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ ప్రమాదాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాల్సిన తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి (సీఈఐజీ) కార్యాలయంలో కుర్చీలాట మొదలైంది. ఇప్పటికే అడ్డదారిలో వచ్చి అడ్డగోలు వసూళ్లకు పాల్పడిన సీఈఐజీ ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ కుర్చీని చేజిక్కించుకునేందుకు ఎవరికి వారు పోటీపడుతున్నారు. ఆశావహులు ప్రభుత్వ పెద్దలు, సచివాలయ కేంద్రంగా పని చేస్తున్న ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అడ్డదారిలో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్గా పదోన్నతి పొందినట్లు తెలిసింది. ఈ విషయం మరో డిప్యూటీ డీఈకి తెలిసి కోర్టు ద్వారా ఈ చర్యను అడ్డుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సదరు డిప్యూటీ ఈఐ రూ.కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరుగుతోంది? భారీ బహుళ అంతస్తుల భవనాలు, సినిమా హాళ్లు, హోటళ్లు, పరిశ్రమల్లో విద్యుత్ ప్రమాదాల నియంత్రణ కోసం ప్రభుత్వం తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ విభాగాన్ని 1987లో ఏర్పాటు చేసింది. 15 మీటర్ల ఎత్తున్న భవనాలు సహా 70 కిలోవాట్స్ సామర్థ్యానికి మించి విద్యుతత్్ డిమాండ్ ఉన్న ప్రతి కనెక్షన్స్ వీరి అనుమతి తప్పనిసరి చేసింది. ఈ నిబంధనే వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి (సీఈఐజీ)తో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి–1,2,3 డివిజన్లు, మెదక్–1,2 డివిజన్లు, మహబూబ్నగర్, నిజామాబాద్ డివిజన్లకు ఒక్కో డిప్యూటీ డీఈ ఇన్చార్జిగా పని చేస్తున్నారు. వీరితో పాటు హైదరాబాద్, నిజామాబాద్కు ఇద్దరు ఈఐలు ఉన్నారు. లైసెన్సింగ్ బోర్డు కార్యదర్శి, పది మంది డీఈలు, ముగ్గురు ఏఈలున్నారు. 2018 నుంచి ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. సీఈఐజీ సహా ఇతర కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సీఈఐజీ స్థాయి అధికారే ఇప్పటి వరకు వీటికి ఇన్చార్జి సీఈఐజీగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన కూడా ఉద్యోగ విరమణ చేయడంతో ఆయా కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. బిల్డర్లు, పరిశ్రమల యజమానులు థర్డ్పార్టీ కాంట్రాక్టర్లతో విద్యుత్ పనులు చేయిస్తుంటారు. వీరు నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలనే ఉద్దేశంతో ఐఎస్ఐ సర్టిఫైడ్ విద్యుత్ పరికరాలకు బదులు మార్కెట్లో తక్కువ ధరకు లభించే నాసిరకం కేబుళ్లు, ఎంసీబీలు, బ్రేకర్లు, ఆర్సీసీబీలు, ఎర్తింగ్స్ రాడ్స్ వాడుతున్నారు. భవిష్యత్తు అవసరాల మేరకు లైన్లు, కేబుళ్లు, ఎంసీబీలు వాడకపోవడంతో కొద్ది రోజులకే ష్టార్సర్క్యూట్ తలెత్తి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో రూ.కోట్ల ఆస్తి నష్టంతో పాటు విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. ఆ లింకును తొలగించండి 2020 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ 25 నాటికి టీఎస్ఐపాస్ ద్వారా 13,453 దరఖాస్తులు రాగా, వీటిలో 12,609 దరఖాస్తులను ఆమోదించారు. ఇదే సమయంలో జనరేటర్ల ఏర్పాటు కోసం 1,072 దరఖాస్తులు రాగా, వీటిలో 994 ఆమోదించారు. 93 సినిమా థియేటర్ల దరఖాస్తుల్లో 83 ఆమోదించారు. దరఖాస్తు సహా సీఈఐజీ తనిఖీ, ఽఽఅనుమతి ధ్రువీకరణ పత్రం జారీ కోసం రూ.10 వేల లోపే ఫీజు నిర్ణయించింది. దరఖాస్తు చేసిన 14 రోజుల్లోనే ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాలి. కానీ డిప్యూటీ ఇన్స్పెక్టర్లు మొదలు, సీఈఐజీ వరకు ఎవరి స్థాయిలో వారు ఫైళ్లను రోజుల తరబడి తొక్కిపెడుతున్నారు. బిల్డింగ్ విద్యుత్ లైన్స్ డ్రాయింగ్స్ మొదలు టీఎస్బీపాస్ పోర్టల్లో అప్లోడ్ చేయడం, క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆమోదం వరకు ఇలా భవన నిర్మాణ సామర్థ్యం/ పరిశ్రమ సామర్థ్యాన్ని బట్టి.. ఒక్కో ఫైలుకు ఒక్కో ధర నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ సంస్థలు, పరిశ్రమలు, అపార్ట్మెంట్లు, సోలార్ ప్లాంట్ల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. తర్వాత పీరియాడికల్ ఇన్స్పెక్షన్ పేరుతోనూ వసూలు చేస్తున్నారు. ఇచ్చేందుకు నిరాకరించిన వారి ఫైళ్లకు రకరకాల కొర్రీలు పెట్టి తిప్పిపంపు తున్నారు. సీఈఐజీ ఇన్స్పెక్టర్ల అక్రమ వసూళ్లతో విద్యుత్ సంస్థల్లో పని చేసే ఇంజినీర్లు చెడ్డపేరు మూటకట్టుకోవాల్సి వస్తోంది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో మాదిరి హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు సీఈఐజీ లింకును తొలగించాల్సిందిగా కోరుతూ ఇటీవల డిస్కం ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడం, ఇదే అంశంపై ఇటీవల సంబంధిత ఇన్స్పెక్టర్లతో సచివాలయ కేంద్రంగా సమావేశం నిర్వహించడం కొసమెరుపు. -
ఇసుక బేజార్!
ఇసుక బజార్కుఆదరణ కరువు ● ఆదిబట్లలో గత నెల 16న ప్రారంభం ● ప్రచార లోపంతో నామమాత్రంగా కొనుగోళ్లు ● నిల్వ ఉన్నది 89,000 మెట్రిక్ టన్నులు ● ఇప్పటికి అమ్మింది 154 టన్నులే .. ఇబ్రహీంపట్నం రూరల్: ఇసుక అక్రమ రవాణకు కళ్లెం వేయడంతోపాటు నాణ్యమైన ఇసుకను అందుబాటులోకి తీచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇసుక బజార్లకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని ప్రారంభించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్మెట్, ఆదిబట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో గతనెల 16న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈ ఇసుక బజార్కు ఆదరణ కరువైంది. ఆన్లైన్ విధానంలో విక్రయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక బజార్ల్లో సన్న ఇసుక టన్నుకు రూ.1,800, దొడ్డు ఇసుక రూ.1, 600 చొప్పున ధర నిర్ణయించారు. ప్రతి కొనుగోలు ఆన్లైన్ విధానంలో కొనసాగించాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుక అమ్మకాలు చేపట్టాలని విజిలెన్స్ కమిటీలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డంపులు లేకుండా అరికట్టారు. కేసులు నమోదు చేసి అక్రమ డంపులను కట్టడి చేశారు. అనంతరం ఇసుక బజార్లను తెరిచారు. ప్రస్తుతం ఆదిబట్లలోని ఇసుక బజార్లో రెండు వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసి, కాంట్రక్టర్ల ద్వారా రవా ణా, ఇసుక నింపే యంత్రాలను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు 89,000 మె ట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచారు. వంగమర్తి, వీరాపురం, విజయనగరం, అనంతారం నుంచి రీచ్ల ద్వారా ఇసుక తీసుకొచ్చి డంప్ చేశారు. ఎక్కడి నిల్వలు అక్కడే.. ఇసుక బజార్ను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు (22 రోజులు) అమ్మింది 154 టన్నులు మాత్రమే. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఇసుకబజార్ను ప్రారంభించిన అధికారులు ఆ మేరకు ప్రచారం చేయకపోవడంతో చాలామందికి ఇక్కడ ఇసుక నిల్వలు ఉన్నాయనే విషయమే తెలియకుండా పోయింది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పటికీ సరైన ప్రచారం లేకపోవడంతో ఎక్కడి నిల్వలు అక్కడే నిలిచిపోయాయి. రోజుకు కనీసం ఒక్క లారీ కూడా అమ్ముడు పోవడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రచారం లేకపోవడంతో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ఇసుక కోనుగోళ్ల కోసం ఆన్లైన్లో ముందుగా కస్టమర్ ఐడీని రూపొందించుకోవాలి. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలా పోర్టల్ రూపొందించింది. అవసరమైతే మీ సేవ కేంద్రాలకు వెళ్తే దరఖాస్తు చేస్తారు. లేదంటే టీజీఎండీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఇసుక బజార్ ద్వారా నాణ్యమైన ఇసుక అందిస్తున్నాం. – నవీన్, ఇసుకబజార్ అధికారి సరైన ప్రచారమే లేదు ఆదిబట్లలో ఇసుక బజార్ ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. అధికారులు వచ్చి ప్రారంభించి వెళ్లిపోయారు. స్థానికంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నా ఇసుక బజార్లో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఇదే ధరకు బయట దొరకడంతోపాటు సరైన ప్రచారం లేదు. ప్రభుత్వం ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో విక్రయాలు జరిపితే బాగుంటుంది. – బండ రాజు, ఆదిబట్ల -
సమస్యలు పరిష్కరించండి
చేవెళ్ల: పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, గౌరవ అధ్యక్షుడు సందీప్ గురువారం మహేందర్రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా ఈనెల 10న నిర్వహించే రాష్ట్ర స్థాయి పంచాయతీ కార్యదర్శుల సదస్సుకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేని గ్రామాల్లో కార్యదర్శులే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఆయా గ్రామాల్లో ఫీల్డ్అసిస్టెంట్లను నియమించాలని కోరారు. క్రీడా కోటాలో ఎంపికై న 98మంది జీపీఏఎస్లను తొలగించిన నేపథ్యంలో వారిని తిరిగి సర్వీస్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మండలి చీఫ్ విప్ మహేందర్రెడ్డి సానుకులంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవిశెట్టి, ప్రధాన కార్యదర్శి సంజీవ్కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలను వదిలేసి.. అందాల పోటీలా?
హయత్నగర్: పేదల సమస్యలను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల నిర్వహణలో నిమగ్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. పెద్దఅంబర్పేట్ మున్సిపల్ పరిధిలోని కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలో గత నెల 26న జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసెలు కాలిపోయిన బాధితులను గురువారం పరామర్శించారు. వారికి దుప్పట్లు, టవల్స్, ప్లాస్టిక్ బకెట్లు తదితర సామగ్రి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కోటీశ్వరులైన అందగత్తెలు సగం దుస్తులు ధరిస్తే.. గతి లేని పేదలు నిండుగా దుస్తులు ధరిస్తారని తెలిపారు. ఓటు వేసి గెలిపించే ప్రజలను పట్టించుకోకుండా, అందాలు ఆరబోసి వెళ్లిపోయే వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. పేదల భూములను కన్నేసి వారిని ఇక్కడి నుంచి తరిమేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే అభాగ్యుల గూళ్ల ను నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. బాధితులకు కేవలం రూ.6 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు సామగ్రి అందించేందుకు ముందుకు వచ్చిన విజయవాడ పాపులర్ షూమార్ట్ను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి, నాయకులు తాలు, పల్లె నర్సింహ, పబ్బతి లక్ష్మణ్, హరిసింగ్నాయక్, నర్సింహ, వట్టి వనిత, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపాటు గుడిసెలు కాలిపోయిన బాధితులకు సామగ్రి అందజేత -
ప్రహరీ పనులు ఆపేయండి
పహాడీషరీఫ్: మామిడిపల్లి గ్రామం 99/1 సర్వే నంబర్లో హౌసింగ్ బోర్డు అధికారులు చేపట్టిన ప్రహరీ నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని మాజీ కౌన్సిలర్ ఈరంకి వేణుకుమార్గౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు పెరమోని నరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టిన గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం మామిడిపల్లి రైతులు వందల ఎకరాల భూములు ఇచ్చారన్నారు. వీరిలో చాలా మందికి పరిహారం ఇవ్వలేదని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన కొంత భూమిని టీజీఐఐసీకి కేటాయించారని, అందులో కంపెనీలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ ఆచరణలోకి తేలేదని మండిపడ్డారు. 99/1 సర్వే నంబర్ భూమిలో మల్లన్నస్వామి, కొండ మైసమ్మ, రామాలయం, కాటమయ్యస్వామి, ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు అంబేద్కర్ విగ్రహం, దోబీఘాట్, క్రీడా మైదానం, శ్మశానవాటిక ఉందన్నారు. వీటిలోకి వెళ్లకుండా చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు అధికారులు చదను పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. భూములను త్యాగం చేసిన రైతులతో పాటు గ్రామంలోని నిరుపేదలకు ఈ భూమిలో 60 గజాల ఇంటి స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి రంగనాయకులస్వామి ఆలయం వెలుపల వరకు ప్రహారీ పనులు నిలిపి వేయాలన్నారు. దాదాపు 20 ఎకరాల స్థలాన్ని గ్రామ అవసరాలకు కేటాయించాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం వీరి దీక్షకు మాజీ కార్పొరేటర్ యాతం పవన్కుమార్ యాదవ్ కూడా మద్దతు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు నందీశ్వర్, గుర్జని గణేశ్గౌడ్, అర్జున్, పురుషోత్తం, రాజు, లక్ష్మీపతి, నర్సింహ, జగన్, శ్రీకాంత్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లివాసుల నిరసన సంఘీభావం ప్రకటించిన నాయకులు -
ఘనంగా ‘అవంతి’ వార్షికోత్సవం
అబ్దుల్లాపూర్మెట్: గుంతపల్లి లోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ విద్యాసంస్థల చైర్మన్, ఏపీ మాజీ మంత్రి ముత్తెంఽశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, నవతేజా టెక్నాలజీస్ డైరెక్టర్ ఏరె సంగమ్కర్, అవంతి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రియాంక హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ జయప్రద, ప్రిన్సిపల్స్ శేషతల్పసాయి తదితరులు పాల్గొన్నారు. -
‘లక్ష’ణమైన కాడెడ్లు!
యాచారం: మరో ఇరవై రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కాడెడ్ల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాలు కురిస్తే ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు మంగళవారం మాల్ సంతకు క్యూకట్టారు. ఆరడుగులకు పైగా ఎత్తున్న కాడెడ్లు ఇక్కడ అమ్మకానికి వచ్చాయి. ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు పెద్ద ఎడ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. పత్తి, మిర్చి, కంది పంటల్లో నిత్యం 10గంటలు పనిచేయగలిగే సామర్థ్యం వీటి సొంతం. కడుపునిండా మేత, నీళ్లు ఉంటే అలసట లేకుండా పనిచేస్తాయి. నల్గొండ జిల్లా హలియా, దేవరకొండ, మిర్యాలగూడ, మర్రిగూడ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో కాడెద్దులు విక్రయానికి వచ్చాయి. మాల్ పశువుల సంతలో ఒక్కో కాడెద్దుల జత రెండున్నర లక్షలకు పైగానే పలికింది. ఆరడుగులకు పైగా ఎత్తు, తెల్లటి రంగున్న కోడెలు, ఎద్దులు అందరి చూపులను ఆకర్షించాయి. ధృడంగా కనిపించిన వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఏపీలోని మాచర్ల, మార్కాపురం, నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లోని రైతులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మోతుబరి రైతులు ధరను పట్టించుకోకుండా వారికి నచ్చినవి కొన్నారు. 25శాతం కబేళాకే సాగుకు చేతకాని పశువులు, ఎద్దులతో పాటు వీటిని సాకలేని పలువురు రైతులు కబేళాకు విక్రయించారు. మంగళవారం సంతకు వచ్చిన మూగజీవాల్లో సుమారు 25శాతం కబేళాకే తరలిపోయాయి. నగరానికి చెందిన వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి తీసుకెళ్లారు. వయసు పైబడిన వాటిలో ఎక్కువగా వీరే కొనుగోలు చేశారు.మాల్ సంతలో జోరుగా క్రయవిక్రయాలు వానాకాలం నేపథ్యంలో కొనుగోలుకు ఆసక్తి చూపిన రైతులు -
వృద్ధుల బాధ్యత వారసులదే
మొయినాబాద్రూరల్: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం చట్టపరంగా వారి పిల్లలే చూసుకోవాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూధనరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్స్లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశాన్ని డాక్టర్ వి.పాండుగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుసూదనరావు, అనంతరెడ్డిలు హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007, నియమావళి రూల్స్ 2011ను వివరించారు. డాక్టర్ పాండుగౌడ్ మాట్లాడుతూ.. ఇండియన్స్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అందరం కలిసి పేద కుటుంబాల ప్రజలకు సహాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పాటు చేయాలని చట్టం 2007 అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సత్తయ్య, నాయకులు ఉపేందర్రెడ్డి, అనంతరెడ్డి, భాస్కర్, రమేశ్, చంద్రలింగం, సంగరి మల్లేశ్, గోపాల్రెడ్డి, మల్లారెడ్డి, కిషన్, రామ్మోహన్, సుగుణాకర్రావు, సయ్యాజీరావు, బల్వంత్రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదనరావు -
లారీని ఢీకొన్న డీసీఎం
ఇరుక్కుపోయి డ్రైవర్కు తీవ్ర గాయాలు నందిగామ: ముందు వెళ్తున్న లారీని వెనకాల నుంచి డీసీఎం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి(బైపాస్)పై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ ప్రసాద్ కథ నం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ అన్సార్కు చెందిన డీసీఎంపై అదే గ్రా మానికి చెందిన షేక్ జావేద్ డ్రైవర్గా పనిచేస్తున్నా డు. సోమవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లకు మామిడికాయలను తీసుకెళ్లడానికి డీసీఎం అక్కడి నుంచి బయలు దేరింది. మంగళవారం ఉదయం నందిగామ పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోల్ పంపు సమీపంలో రాగానే డ్రైవర్ జావేద్ డీసీఎంను అతివేగంగా నడిపిస్తూ ముందు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లా రీని వెనకాల నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో డీసీఎం లారీ వెనకభాగంలో ఇరుక్కుపోయి అందు లో జావేద్ చిక్కుకున్నాడు. స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో డీసీఎంను తొలగించి డ్రైవర్ను కాపాడారు. అనంతరం క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు లారీ యజమాని షేక్ అన్సార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.