breaking news
Ranga Reddy District News
-
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మారమోని శివకుమార్(21) స్థానిక వైన్స్లో పనిచేస్తున్నాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన బంధువు బోళ్ల మల్లేశ్ శుక్రవారం మైసిగండిలో నిర్వహించిన ఫంక్షన్లో శివకుమార్ పాల్గొన్నాడు. ఫంక్షన్ ముగిసిన అనంతరం అదే రాత్రి తలకొండపల్లిలోని బంధువుల ఇంటికి వారి వెంట తన బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో చల్లంపల్లి సమీపంలో బైక్పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కడ్తాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువకుడి నేత్రాలను కుటుంబసభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అందజేశారు. యువకుడి అదృశ్యం కేశంపేట: యువకుడు అ దృశ్యమైన సంఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి శివారులోని వాల్యతండాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగడ్డతండా పంచాయతీ పరిధిలోని దేవునిగుడితండాకు చెందిన లక్ష్మణ్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కొండారెడ్డిపల్లి శివారులోని వాల్యతండాలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు ముడావత్ శ్రీనివాస్ చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయ పనులు చేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం కుమారుడు ఇంటి వద్ద ఉండగా తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చారు. కుమారుడు కన్పించకపోవడంతో చుట్టపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిచ్చి కుక్క వీర విహారం ● ఆరుగురిని గాయపర్చిన శునకం ● ఒకరి పరిస్థితి విషమంబషీరాబాద్: మండల కేంద్రంలో ఓ పిచ్చి కుక్క నాలుగు రోజులుగా స్వైర విహారం చేసింది. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి కరిచింది. శనివారం ఇందిరానగర్లో ఇంటి ఎదుట ఆడుకుంటున్న విక్రాంత్(4), నరేష్(8)తో పాటు ఆసియా బేగం(22)ను విచక్షణా రహితంగా కరిచింది. ఆసియా బేగంకు తొడ, చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషయమంగా ఉందని హైదరాబాద్కు రిఫర్ చేశారు. ఇదే శునకం నాలుగు రోజు క్రితం గౌరీ గల్లిలో స్వప్న అనే మహిళతో పాటు ఇద్దరు వృద్ధులను కరిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో శనివారం గ్రామస్తులు కుక్కను కొట్టి చంపారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలనికోరుతున్నారు. -
మున్సిపల్ కమిషనర్పై విచారణకు ఆదేశం
మొయినాబాద్: వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేసే విషయంలో మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ వ్యవహరించిన తీరుపై కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని శనివారం చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ను ఆదేశించారు. ఈ విషయమై వారు విచారించగా కొత్తగా ఏర్పడిన చేవెళ్ల, శంకర్పల్లి మున్సిపాలిటీ కార్యాలయాల్లోనే జాతీయ జెండా ఎగురవేసినట్లు తెలిసింది. వార్డు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలో విషయంలో అక్కడి మున్సిపల్ కమిషనర్లు ప్రజలతో సమయస్ఫూర్తితో సానుకూలంగా మాట్లాడారని, మొయినాబాద్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ మాత్రం స్థానికులతో దురుసుగా మాట్లాడటం వివాదంగా మారినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని కలెక్టర్కు నివేదించినట్లు సమాచారం. ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. శంకర్పల్లి: ఓటు చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శనివారం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్చార్జి ఇంద్రసేనారెడ్డి, అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని దుర్వినియోగం చేయడం అన్యాయమని అన్నారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్చార్జి రామ్మోహన్, నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్, నాయకులు గౌరీ సతీశ్, వెంకటయ్య, చెన్నయ్య, నర్సింలు, శ్రీకాంత్ రెడ్డి, రమ్య, ప్రవీణ్, శ్రీనాథ్ పాల్గొన్నారు. ఆమనగల్లు: మార్వాడీ వ్యాపారసంస్థలకు వ్యతిరేకంగా పట్టణంలో వివిధ వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన బంద్ తాత్కాలికంగా వాయిదాపడింది. మార్వాడి గో బ్యాక్ అంటూ వర్తకులు ఇచ్చిన పిలుపు, మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన ఒకరోజు బంద్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్వాడీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పట్టణంలో బంద్కు పిలుపునివ్వడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బంద్పై మార్వాడీ వ్యాపారస్తులు, స్థానిక వర్తకసంఘం నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక వ్యాపారుల డిమాండ్లకు మార్వాడీలు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు స్థానిక వర్తకసంఘం నాయకులను పోలీసులు పిలిపించి మాట్లాడారని, ఈ నేపథ్యంలో 18న తలపెట్టిన బంద్ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం తాండూరులో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో స్నేహం కొనసాగుతుంద న్నారు. అయినా ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆకలి బాధలు తీర్చేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టులేనని అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో అంటరానితనం పోవాలనే నినాదంతో పోరాటం చేశామని తెలిపారు. పార్టీ అనుబఽంధ కార్మిక సంఘాల ద్వారా కార్మికుల పక్షాన తాము గళం వినిపిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ప్లాన్లను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పాలని ఆ సంఘం నాయకులు సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. -
ఒడిశా టు మహారాష్ట్ర
● గుట్టుగా గంజాయి అక్రమ రవాణా ● రోడ్డు ప్రమాదంతో బయటపడిన 16.50 కిలోలు అబ్దుల్లాపూర్మెట్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతని నుంచి 16.50కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం శివారులో విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఓ కారు డివైడర్ను ఢీ కొట్టిందన్న సమాచారం మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో కారును తనిఖీ చేశారు. కొన్ని టేపుతో చుట్టి ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కవర్ల మూటలు కనిపించగా వాటిని పరిశీలించడంతో గంజాయి అని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఖమ్మం జిల్లా వాస్రం తండాకు చెందిన భుక్యా మధుగా వెల్లడించాడు. తనకు ఖమ్మం జిల్లాకు చెందిన సాదిబ్ అనే వ్యక్తి స్నేహితుడని, ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తే రూ.50వేలు ఇస్తారని చెప్పడంతో అంగీకరించినట్టు తెలిపాడు. రాజమండ్రిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా గంజాయి తీసుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాగ్పూర్కు సరఫరా చేయాలని సూచించి రూ.50వేలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తుండగా మధు ప్రయాణిస్తున్న కారు బాటసింగారం వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయింది. స్థానికుల సమాచారం మేరకు వెళ్లిన పోలీసులకు గంజాయి దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధును అదుపులోకి తీసుకుని అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. తలకొండపల్లిలో గంజాయి పట్టివేత ఆమనగల్లు: అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని తలకొండపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకారం.. తలకొండపల్లి మండల కేంద్రం సమీపంలోని ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం ఎస్ఐ శేఖర్, సిబ్బంది కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. కడ్తాల్ వైపు నుంచి వస్తున్న కారును ఆపుతుండగా అందులోనుంచి ఇద్దరు పారిపోతుండగా పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా 287 గ్రాముల గంజాయి లభించింది. కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరిని తలకొండపల్లి గ్రామానికి చెందిన పద్మ వెంకటేశ్, కట్టమల్ల రఘువరన్గా గుర్తించారు. వారిని విచారించగా పద్మవెంకటేశ్ స్నేహితులు నగరంలోని ఉప్పల్కు చెందిన జోగురాజు, పిల్లి ప్రణయ్ గంజాయిని ఇచ్చారని వెల్లడించడంతో వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ శేఖర్, కానిస్టేబుల్ జాషువ, శ్రీను, శ్రీనివాస్ను సీఐ అభినందించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
అబ్దుల్లాపూర్మెట్: నిలబడి ఉన్న వ్యక్తిని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం నెమలి గ్రామానికి చెందిన కమ్మపాటి కృపారక్షణ (32) కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి హైదరాబాద్ జీడిమెట్ల నుంచి ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రం నూజివీడుకు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం ఽశివారులోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే టైరు పంక్చర్ అయ్యింది. దీంతో బస్సు డ్రైవర్ టైరును పంక్చర్ చేయిస్తుండగా కృపారక్షణ పక్కన నిల్చుని ఉన్నాడు. అదే సమయంలో హైదరాబాద్ వైపు అతివేగంగా వచ్చిన ఓ లారీ అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కృపారక్షణకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ తరలించారు. ● ఆగి ఉన్న వ్యక్తిని ఢీకొన్న లారీ ● అక్కడికక్కడే దుర్మరణం -
సరదాల దందా!
వీకెండ్ సరదాలకోసం నిర్మించుకున్న ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. బర్త్డే పార్టీలు, సరదా పార్టీలు, మందు పార్టీలు, రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి గలీజు దందాలకు నిలయాలుగా తయారయ్యాయి. ఎస్ఓటీ పోలీసులు తరచూ దాడిచేసి గుట్టు రట్టుచేస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడడం లేదు.మొయినాబాద్: నగర శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికిపైగా ఉన్నాయి. చాలా మంది 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్లో పిల్లలతో వచ్చి ఆనందంగా గడపడానికంటూ నిర్మించి తరువాత వాటిని లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు తీసుకుని అడ్డగోలుగా.. లీజుకు తీసుకుంటున్న నిర్వాహకులు వాటిలో అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్టుగెదర్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, బర్త్డేలు అంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. వీటితోపాటు రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు, పేకాట, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. యువకులను ఆకర్షించేలా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం సైతం చేయిస్తున్నట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు బయటపెట్టాయి. పార్టీల్లో అక్రమంగా మద్యం తాగడం, హుక్కా, గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. కేసులు పెడుతున్నా మారని తీరు ఎస్ఓటీ పోలీసులు తరచూ దాడులు చేసి పార్టీలను భగ్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహించేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఫాంహౌస్ల యజమానులు, నిర్వాహకులపై సైతం కేసులు పెడుతున్నారు. అయినా దందాలు మాత్రం ఆగడంలేదు. మామూళ్ల మత్తులో స్థానిక పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వెలుగుచూసిన కొన్ని ఘటనలు ● ఏడాదిన్నర క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ● ఏడాది క్రితం నజీబ్నగర్ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్లో ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. ● ఏడాది క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ● ఆరు నెలల క్రితం అజీజ్నగర్ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ● ఆరు నెలల క్రితం తోలుకట్ట రెవెన్యూలో ఓ ఎమ్మెల్సీకి చెందిన ఫాంహౌస్లో కోడిపందేలు నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. నిర్వాహకుడితోపాటు 64 మందిని పట్టుకున్నారు. భారీగా మద్యం, నగదు, క్యాసినో కాయిన్స్, కోడికత్తులు, కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● నాలుగు నెలల క్రితం ఎత్బార్పల్లిలోని ఫాంహౌస్లో బర్త్డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, 7 మంది యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్కా పాట్స్, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ● తాగాజా గురువారం రాత్రి బాకారంలోని ఓ ఫాంహౌస్లో అనుమతి లేకుండా మధ్యం వినియోగిస్తూ బర్త్డే పార్టీ నిర్వహిస్తున్న 51 మంది విదేశీయులను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి హుక్కా, 20 లీటర్ల విదేశీ మద్యం, 65 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ డిటేన్ సెంటర్కు విదేశీయులు అనుమతి లేకుండా ఫాంహౌస్లో బర్త్డే పార్టీ నిహించడంతోపాటు హుక్కా, విదేశీ మద్యం వినియోగించి పోలీసులకు పట్టుబడ్డ విదేశీయులను పోలీస్ డిటేన్ సెంటర్కు తరలించారు. బాకారం రెవెన్యూలోని ఎస్కే నేచర్ రీట్రీట్ ఫాంహౌస్లో గురువారం రాత్రి విదేశీయులు ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ వినియోగిస్తూ నిర్వహించిన బర్త్డే పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఇందులో పట్టుబడ్డ 51 మంది విదేశీయుల్లో 36 మందికి వీసాగడువు ముగిసినట్లు గుర్తించా రు. వారిని సొంత దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటి వరకు వారిని కోర్టు సూచ నతో పోలీస్ డిటేన్ సెంటర్లో ఉంచుతామని ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌస్లు పార్టీల పేరుతో గంజాయి, హుక్కా, మద్యం వినియోగం యథేచ్ఛగా పేకాట, కోడి పందేలు, ముజ్రా పార్టీలు అద్దెకు తీసుకుని గుట్టుగా నడుపుతున్న నిర్వాహకులు తరచూ గుట్టు రట్టవుతున్నా పడని అడ్డుకట్ట -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
● మంత్రి సీతక్క ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుచేవెళ్ల: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీరాజ్ శాఖమంత్రి సీతక్క అన్నారు. మండలంలోని పలు అభివృద్ధి పనులకు మండలి చీఫ్విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముడిమ్యాల నుంచి మల్కాపూర్ గ్రామానికి రూ.3.35 కోట్లతో చేపట్టే బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. చేవెళ్లలో రూ.1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాటాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ముడిమ్యాలలో మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా దుకాణాలు పెట్టించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, నియోజకవర్గం నాయకులు, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ పూజలు మండలంలోని తంగడపల్లిలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయస్వామి ఆలయంలో కొనసాగుతున్న విగ్రహప్రతిష్ఠ పూజలకు శనివారం మంత్రి సీతక్క, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణస్వామి
● బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి ● ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు శ్రీశైలం ముదిరాజ్ పరిగి: హైదరాబాద్ మాజీ మేయర్, రచయిత, జర్నలిస్ట్ కొరివి కృష్ణ స్వామిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు దోమ శ్రీశైలం ముదిరాజ్ అన్నారు. సంఘం నాయకులతో కలిసి శనివారం పట్టణంలో కృష్ణస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరానికి తొలి మేయర్గా విధులు నిర్వర్తించిన కృష్ణస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేశారని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆశోక్కుమార్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం తాలూకా గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్యముదిరాజ్, కార్యదర్శి కృష్ణయ్య ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బాబయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈసీ.. కబ్జా చేసి!
ఆక్రమణలో ఈసీ వాగు సాక్షి, రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ జిల్లా పూడూరు, పరిగి ప్రాంతాల్లో మొదలయ్యే ఈసీ వాగు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంషాబాద్ మండలాలను తాకుతూ హిమాయత్సాగర్ జలాశయంలోకి చేరుతుంది. వాగు సహజ సిద్ధంగా చేవెళ్ల–షాబాద్, మొయినాబాద్–శంషాబాద్ మండలాల సరిహద్దుల నుంచి ప్రవహిస్తుంది. శంషాబాద్ మండలం మల్కారం వరకు వెడల్పుగా ఉన్న వాగు అక్కడి నుంచి తగ్గింది. వాగులో భారీగా వరదలు వచ్చినప్పుడు వెడల్పు తగ్గిన చోటు నుంచి ఉప్పొంగి ప్రవహించేది. వరద వచ్చినప్పుడు బయటకు వచ్చిన నీరు నాలుగైదు గంటల్లో తగ్గిపోయేది. శంషాబాద్ మండలం కేబీ దొడ్డి వద్ద అంచమడుగు అనే కాలువ ఉండేది. ఈసీ వాగులో వరద ఎక్కువగా వచ్చినప్పుడు కాలువలో నుంచి సైతం వరద నీరు వెళ్లేది. ప్రస్తుతం వాగు సహజ సిద్ధమైన ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. కేబీదొడ్డి వద్ద అంచమడుగు కాలువను రియల్ వ్యాపారులు పూర్తిగా కబ్జా చేశారు. కాలువకు ఇరువైపులా తమ పట్టాభూమి ఉండటంతో చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మించారు. కాలువకు సైతం ఇరువైపులా కాంక్రీట్ వాల్ నిర్మించి పైనుంచి స్లాబ్ వేశారు. వాగులో వరద ఎక్కువ వచ్చినప్పుడు కాలువలోకి రాకుండా రిటర్నింగ్ వాల్ నిర్మించడంతో వరద నీరు మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ వైపు డైవర్ట్ అవుతోంది. అలా దారిమళ్లుతున్న వరదనీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. భారీ వరద రావడంతో.. మూడు రోజుల క్రితం ఈసీ వాగులో భారీ వరద రావడంతో కబ్జాదారుల బాగోతం బయట పడింది. వెంచర్ వెనుకభాగంలో నిర్మించిన రిటర్నింగ్ వాల్ పైనుంచి వరదనీరు వెంచర్లోకి చేరింది. అంచమడుగు కాలువలోకి రాకుండా అడ్డంగా మట్టికట్ట నిర్మించడంతో అది తెగిపోయి కేబీదొడ్డి వైపు భారీగా వరదనీరు వెళ్లింది. వెంచర్ అవతలివైపు ప్రహరీ అడ్డుగా ఉంటంతో పొలాల్లోనే నీళ్లు నిలిచిపోయాయి. కేబీదొడ్డి వద్ద గొర్రెల షెడ్డును ముంచేసింది. రిటర్నింగ్ వాల్కు తగిలి అమ్డాపూర్ వైపు డైవర్ట్ అయిన వరదనీరు ఓ ఫంక్షన్ హాల్లోకి వెళ్లింది. అంచమడుగు కాలువలోకి వెళ్లాల్సిన వరదంతా ఈసీ వాగు వంతెన కిందినుంచే వెళ్లాల్సి రావడంతో అంతనీరు ఒకేసారి వెళ్లలేక ఆ ప్రాంతమంతా చెరువులా మరింది. అమ్డాపూర్ వంతెన నుంచి వెంకటాపూర్ వంతెన వరకు ఆరు కిలోమీటర్ల దూరం దీని ప్రభావం పడింది. ఎప్పుడూ లేని విధంగా వెంకటాపూర్ వంతెనను తాకుతూ ప్రవహించింది. వాగుకు రెండు వైపులా పంటపొలాలు నీటమునిగాయి. మరోవైపు వరద తగ్గిన వెంటనే రియల్ వ్యాపారులు తెగిపోయిన మట్టికట్టను బుల్డోజర్లతో మట్టి నింపి పూడ్చేశారు. భారీ వరదతో బయటపడిన నిజ స్వరూపం కాలువను ఆక్రమించి చుట్టూ ప్రహరీ వరద చేరకుండా రిటర్నింగ్ వాల్ నిర్మాణం దారిమళ్లిన నీళ్లు.. వందల ఎకరాల్లో మునిగిన పంటలుకాదేదీ కబ్జాలకు అనర్హం అన్నట్లు అక్రమార్కులకు చెరువులు, వాగులు, వంకలు, కుంటలు ఏదీ వదలడం లేదు. ఖాళీగా కనిపిస్తే చాలు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఇష్టారీతిన ‘రియల్’ వెంచర్లు చేస్తూ ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా ప్రవహించే వరదనీటికి అడ్డుగా ఏకంగా రిటర్నింగ్ వాల్ నిర్మించారు. తాజాగా కురిసిన వర్షాలతో వరద దారిమళ్లి పంటపొలాలను ముంచెత్తింది. ఉధృతి మరింత ఎక్కువ కావడంతో అడ్డుకట్టలను బద్ధలు కొట్టుకుని వెంచర్నే ముంచేసింది.ఈసీ వాగులో భారీ వరద వచ్చి పంటపొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబీదొడ్డి వద్ద అంచముడుగు కాలువ చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మించి భారీగా మట్టి నింపడంతో వరద అమ్డాపూర్ వైపు మళ్లి పంట పొలాలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో వరదలు వస్తే పంటభూములన్నీ కొట్టుకుపోతాయని వాపోతున్నారు. -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
కేశంపేట: దేవాలయ నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కేశంపేట గ్రామంలో నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయ పనులు చేసేందుకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజుకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అతడి వద్ద అదే రాష్ట్రానికి చెందిన విజయబాలన్(40) పనులు చేసేందుకు గురువారం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం పనులు చేస్తుండగా దేవాలయం పక్కనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. గమనించిన గ్రామ స్తులు చికిత్స నిమిత్తం విజయబాలన్ను కేశంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటునుంచి అంబులెన్స్లో షాద్నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతి చెందాడు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. అనాఽథాశ్రమంలో వృద్ధుడి మృతి ఇబ్రహీంపట్నం రూరల్: అనారోగ్యంతో అనాథాశ్రమంలో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాదర్గుల్లో ఉన్న మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో కన్నప్ప స్వామి(66) రెండేళ్ల క్రితం నాంపల్లి రైల్వేస్టేషన్ ఫుట్పాత్ సమీపంలో సంచరిస్తుండగా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించారు. కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియలేదని, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దక్షిణమధ్య రైల్వేలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వేలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో జరిగినఇ వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్పిఎఫ్ నిర్వహించిన పరేడ్లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, రైల్వే పాఠశాల,కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
కొందుర్గు: అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు కంటెయినర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా నుంచి హైదరాబాద్ బహదూర్పురాకు కంటెయినర్లలో ఆవులను తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో శుక్రవారం మధ్యాహ్నం రామచంద్రాపూర్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఏపి29 టీఏ9171, టీఎస్07 యూజీ5594 నంబర్లు కలిగిన కంటెయినర్లలో అమానవీయంగా 90 ఆవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి గోశాలకు తరలించారు. వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు సునీల్, హతీఫ్ఖాన్, శంకర్, మహ్మద్ ఇస్తేశంమొద్దీన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. ఆవులను హైదరాబాద్ జియాగూడలోని శ్రీసమరిత్ కామధేను గోశాలకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఎంఎంఎస్ అందుకున్న ఏసీపీ మోహన్కుమార్ గోల్కొండ కోటలో ప్రదానం చేసిన ముఖ్యమంత్రి సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య మండల ఏసీపీగా పని చేస్తున్న శ్రీరాముల మోహన్కుమార్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎంఎస్) అందుకున్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోవ్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మోహన్కుమార్ 1995లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. 1996–99 మధ్య హాబీబ్ నగర్, 2000–03 మధ్య చార్మినార్, 2003–09 మధ్య దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ల్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2009లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఆపై మీర్చౌక్, దక్షిణ మండల టాస్క్ఫోర్స్, చార్మినార్, పంజాగుట్ట, తూర్పు మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేశారు. 2018లో డీఎస్పీగా పదోన్నతి పొందిన మోహన్కుమార్ దక్షిణ మండలం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా, సూర్యాపేట డీఎస్పీగా, నగర సీసీఎస్, పంజగుట్ట ఏసీపీగా పని చేశారు. ‘సహజవనరుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి’ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: సహజవనరుల పరిరక్షణ సమాజంలో అందరి లక్ష్యం, బాధ్యత కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభిప్రాయపడ్డారు. అప్పుడే మెరుగైన జీవనాన్ని కొనసాగించగలమని స్పష్టం చేశారు. హైడ్రా ఆ దిశగా పని చేయడానికి పునరంకితం కావాలని ఆకాక్షించారు. బుద్ధభవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్న మేరకే నగరంలో గొలుసుకట్టు చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా పని చేస్తోందన్నారు మూసారాంబాగ్ వంతెన హైడ్రా క్లియరెన్స్... హిమాయత్సాగర్ నుంచి భారీ మొత్తంలో నీటిని కిందకు వదలడంతో మూసీ నదిలో ప్రవాహం పెరిగింది. పై నుంచి వరదతో పాటు కొట్టుకువచ్చిన చెత్త, ప్టాస్టిక్ వ్యర్థాలు మూసారాంబాగ్ వంతెన వద్ద నిలిచిపోతున్నాయి. ఇవి అడ్డం పడి నదీ ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయి. ఫలితంగా చాదర్ఘాట్, మూసారాంబాగ్లోని శంకర్నగర్, మూసానగర్, రసూల్పుర తదితర బస్తీలను వరద ముంచెత్తుతోంది. ఈ విషయం గుర్తించి శుక్రవారం రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు ముసారంబాగ్ వంతెన వద్ద క్లియరెన్స్ చేపట్టాయి. అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు నిర్వహిస్తున్నాయి. గుర్రపు డెక్కతో పాటు గడ్డి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తోంది. రెండు జేసీబీలతో పాటు టిప్పర్లను అక్కడే ఉంచిన అధికారులు చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. దీంతో వరద సాఫీగా ముందుకు సాగుతోంది. శంషాబాద్ రూరల్: అనుమతి లేకుండా హుక్కా పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గండిగూడ గ్రామంలో ఉన్న ఎంఆర్జీ ఫాంహౌస్లో గురువారం రాత్రి కొందరు హుక్కా పార్టీ జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. వారి వద్ద హుక్కా తాగే పరికరాలు, ఒక స్కూటీ, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వార్డు ఆఫీస్పై ఎగరని జెండా
మొయినాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద శుక్రవారం జాతీయ జెండాను ఎగరవేయకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో మొయినాబాద్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. ఇందులో మొయినాబాద్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, హిమాయత్నగర్, అజీజ్నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ, సురంగల్ గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. ఈ గ్రామాలు పంచాయతీలుగా ఉన్నప్పుడు జీపీ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో పంచాయతీ కార్యాలయాలను వార్డు ఆఫీసులుగా మార్చారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయకపోవడంతో చిలుకూరు గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ను నిలదీశారు. వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయవద్దనే నిబంధన ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు మిగతా గ్రామాల్లోని వార్డు కార్యాలయాల వద్ద సైతం జాతీయ జెండా ఎగరవేయకపోవడంతో ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ జాతీయ జెండాను అవమాన పరిచే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. చిలుకూరులో మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన ప్రజలు -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
కందుకూరు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ సీతారామ్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని సరస్వతిగూడలో ఎస్ఐలు పరమేష్, మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంబాలపల్లి విష్ణువర్ధన్రెడ్డితో కలిసి డ్రగ్స్, మద్యంపై యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో నేటి యువత చిత్తవుతుందన్నారు. విచక్షణ కోల్పోయి సైకోలుగా ప్రవర్తిస్తున్నారన్నారు. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే శాఖాపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అందరితో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ముదిరాజ్, యాదయ్య, రాము, మహేందర్, వినోద్, వంశీ, మల్లేష్, మహేందర్, జంగారెడ్డి, వెంకట్రెడ్డి, అంజయ్య, కుమార్, యాదయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.కందుకూరు సీఐ సీతారామ్ -
1,500 గాంధీజీ విగ్రహాల ప్రదర్శన
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని 1,500 మహాత్మా గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు. గాంధీ గ్లోబల్ క్లబ్ ఫ్యామిలీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనతో విద్యార్థులకు గాంధీ గొప్పతనాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఒకే పాఠశాలలో 1,500 విగ్రహాలను ప్రదర్శించినందుకుగాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుందని ఇంటర్నేషనల్ చీఫ్ కో–ఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్ తెలిపారు. ఈ మేరకు స్కూల్ ఎండీ చింతల సంగమేశ్వర గుప్తాకు మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు. బడంగ్పేట్: వరద ముంపు కాలనీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. గుర్రంగూడ, శ్రీనివాసపురం, పంచాయతీరాజ్నగర్ తదితర ముంపు కాలనీలను శుక్రవారం ఆమె సందర్శించారు. వరద ఉన్న కాలనీలల్లో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు డ్రైనేజీ నాలాలను శుభ్రం చేయించేవారన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ కౌన్సిలర్ గుర్రం సాయికిరణ్రెడ్డి, కాలనీవాసులు ఉన్నారు. 18న వ్యాపార సంస్థల బంద్ ఆమనగల్లు: స్థానిక వ్యాపార సంఘాలు ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమానికి సిద్ధమయ్యాయి. మనప్రాంతం.. మన వ్యాపారం పేరుతో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 18న ఆమనగల్లు పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. మార్వాడీలు కిరాణం, స్వీట్స్, హార్డ్వేర్తో పాటు అన్ని రకాల వ్యాపారాలను ప్రారంభించారని, దీన్ని స్థానిక వ్యాపార సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. బంద్కు మద్దతు పలకాలని కోరుతూ కరపత్రాలు పంచుతున్నాయి. అబ్దుల్లాపూర్మెట్: బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్గా కొత్తపల్లి జైపాల్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సహకార సంఘం పరిధిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇష్టారాజ్యంగా వడ్డీలు మాఫీ చేశాడంటూ తాజా మాజీ చైర్మన్ చేగూరి భరత్కుమార్పై కొంతమంది మాజీ సర్పంచులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన జిల్లా సహకార శాఖ అధికారులు ఆయన్ని పదవి నుంచి తొలగించారు. అనంతరం జైపాల్రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సంఘం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కందాడి మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాల్రెడ్డి, మేనేజర్ జక్కుల ఐలేశ్ పాల్గొన్నారు. -
విదేశీయుల పార్టీ భగ్నం
బానిస కావొద్దు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కందుకూరు సీఐ సీతారామ్ శుక్రవారం సూచించారు. మొయినాబాద్: ఓ ఫామ్ హౌస్లో విదేశీయులు నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ, మొయినాబాద్ పోలీసులు దాడి చేసి 51 మందిని పట్టుకున్నారు. వీరి నుంచి హుక్కా, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన మొయినాబాద్ మండలం బాకారం రెవెన్యూలోని ఎస్కే నేచర్ రీట్రీట్ ఫాంహౌస్లో గురువారం రాత్రి జరిగింది. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉగాండా, కెన్యా, లిబేరియా, నైజీరియా, క్యామరోన్ దేశాలకు చెందిన 51 మంది విదేశీయులు కొంత కాలంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంది. మమా అనే మహిళ బర్త్డే సందర్భంగా అందరికీ పార్టీ ఇచ్చేందుకు ఆన్లైన్లో ఫామ్ హౌస్ను బుక్చేసింది. వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం అందరూ ఇక్కడికి చేరుకున్నారు. రాత్రి 11.30 గంటలకు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులతో కలిసి దాడి చేశారు. 20నుంచి 35 ఏళ్ల వయసున్న 37 మంది మహిళలు, 14 మంది పురుషులను పట్టుకున్నారు. ఫాంహౌస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి గురువారం రాత్రి 11.30 నుంచి శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు లోపలే ఉంచి తనిఖీలు చేశారు. హుక్కా, విదేశీ మద్యం.. ఫాంహౌస్లో బర్త్ డే పార్టీ నిర్వహిస్తున్న విదే శీయులు ఎలాంటి అనుమతి లేకుండా హుక్కా, విదేశీ మద్యం వినియోగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీరినుంచి హుక్కాతోపాటు 20 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, 65 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం ఉండటంతో కొంత మందికి నార్కోటెక్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు మహిళలకు పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. తనిఖీల్లో డ్రగ్స్ దొరకలేదు. పాజిటివ్ వచ్చిన ముగ్గురు మహిళలు గతంలో డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీ.. పట్టుబడిన వారిని శంషాబాద్ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం ఫాంహౌస్కు వచ్చి వీసా, పాస్పోర్టులు పరిశీలించారు. అయితే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న విదేశీయులు వీరికి సహకరించనట్లు తెలిసింది. అధికారులకు తప్పుడు వివరాలు చెప్పినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో 15 మంది నగరంలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పత్రాలు సరిగా లేకుండా వీసా గడువు ముగిసిన 36 మందిని వారి స్వదేశాల పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనుమతి లేకుండా ఫామ్హౌస్ను అద్దెకు ఇచ్చిన నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల అదుపులో 51 మంది వీరిలో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు 20 లీటర్ల విదేశీ మద్యం, 65 బీర్లు, హుక్కా స్వాధీనం పట్టుబడిన వారిలో ఉగాండా, కెన్యా, నైజీరియా లిబేరియా, క్యామరోన్ దేశస్తులు -
సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ డిమాండ్ చేశారు. అక్టోబర్ 26, 27 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో నిర్వహించే ఆ సంఘం 4వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని, పని భద్రత కరువైందన్నారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు నోచుకోవడం లేదన్నారు. కేవలం రూ.3 వేల వేతనం నెలకు ఇస్తే కుటుంబం ఎలా గడుస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆహ్వాన సంఘం ఏర్పాటు మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్గా పి.యాదయ్య, వైస్ చైర్మన్గా చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శిగా స్వప్న, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అలివేల, కార్యదర్శిగా పద్మ, కోశాధికారి నవనీతతోపాటు సభ్యులుగా రాజు, కవిత, బ్రహ్మయ్య, సామేల్, ఉమా, గణేశ్, కిషన్, ఎల్లేశ్, బుగ్గరాములు, కృష్ణ, నర్సింహ, చందునాయక్, పాండు తదితరులను ఎన్నుకున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ -
వేతన వెతలు!
● ఐదు నెలలుగా నిలిచిన జీతాలు ● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు ● ఆర్థిక ఇబ్బందుల్లో ల్యాబ్టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ● 104 డ్రైవర్లు, ఏఎన్ఎంలు, సపోర్టింగ్ స్టాఫ్ ● అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన సాక్షి, రంగారెడ్డిజిల్లా: వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడం.. వెరసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులకు మించి పని చేస్తున్నప్పటికీ అరకొరగా ఇచ్చే నెలవారీ వేతనాలు కూడా ఐదు నెలలుగా ఇవ్వకపోవడంతో ఆయా ఉద్యోగులంతా ఇంటి అద్దెల చెల్లింపు, నిత్యావసరాల కొనుగోలు, పిల్లల స్కూలు ఫీజుల కోసం స్నేహితులు, బంధువుల వద్ద చేయి చాచాల్సి వస్తోంది. చేసిన అప్పులు పేరుకపోతుండటం, గడువు ముగియడంతో ఇచ్చిన వారు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆర్థికంగానే కాదు మానసికంగానూ కుంగిపోవాల్సి వస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న 167 మంది ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, ఏఎన్ఎంలు జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. థర్డ్ పార్టీ ఏజెన్సీ లేక నిలిచిన చెల్లింపులు మారుమూల పల్లెల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 104 సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు వెళ్లి బీపీ, షుగర్, ఆస్తమా, ఫిట్స్, దగ్గు, జలుబు, జ్వరం, గర్భిణులకు పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు సరఫరా చేసేవారు. మొదట్లో హెచ్ఎంఆర్ఐ భాగస్వామ్యంతో సిబ్బంది నియామకం, వేతనాలు చెల్లింపు చేసేవారు. పదిహేనేళ్ల క్రితం ఉద్యోగులంతా 111 రోజుల పాటు ధర్నా చేసి థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయించారు. తర్వాత కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి సారథ్యంలో థర్డ్పార్టీని ఎంపిక చేసి, దాని ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నారు. జిల్లాలో 104 విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, సెక్యురిటీగార్డు మొత్తం 56 మంది ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. ల్యాబ్టెక్నీషియన్, ఫార్మాసిస్ట్కు నెలకు రూ.22,750 చెల్లిస్తుండగా పీఎఫ్ కటింగ్స్ పోను రూ.20,020 ఖాతాల్లో జమ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్కు రూ.19,500 వేతనంలో ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్ పోను రూ.17 వేల వరకు వారి ఖాతాల్లో జమ అవుతోంది. జిల్లాలో థర్డ్పార్టీ ఏజెన్సీ గడువు మార్చితో ముగిసింది. కొత్త ఏజెన్సీని ఇప్పటి వరకు ఎంపిక చేయలేదు. ఏ ఖాతా నుంచి సిబ్బందికి వేతనాలు చెల్లించాలనే అంశంపై సందిగ్ధం నెలకొంది.పదిహేడేళ్లుగా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తున్నా. ఇప్పటి వరకు రెగ్యులర్ కాలేదు. వేతనం పెరగలేదు. ఇచ్చే కొద్దిపాటి కూడా నెలవారీగా ఇవ్వడం లేదు. నా భర్త కూడా ప్రైవేటు ఉద్యోగే. మాకు ఇద్దరు పిల్లలు. వారి స్కూలు ఫీజులు, ఇంటి అద్దె, నిత్యావసరాల కొనుగోలు కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా విధిగా వేతనాలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. – ఝాన్సీ, డేటా ఎంట్రి ఆపరేటర్, షాద్నగర్ కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో పని చేస్తున్నాను. అదే ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నా. నెలకు రూ.ఏడు వేలు చెల్లించాల్సి ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. వారి స్కూలు ఫీజు, సరుకులు, ఇంటి అద్దె చెల్లింపు, ఇతర ఖర్చుల కోసం రూ.20వేలు అవుతోంది. ఐదు నెలలుగా వేతనాలు అందక బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేయాల్సి వస్తోంది. – ఎస్.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, 104 యూనియన్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా వేతనాలు చెల్లించే అవకాశం లేదు. థర్డ్పార్టీ ద్వారానే చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఏజెన్సీ గడువు ముగిసింది. రెన్యూవల్ లేదా కొత్త ఏజెన్సీ ఎంపికలో జాప్యం జరిగింది. వేతనాలకు సంబంధించి రూ.48 లక్షలు జిల్లా వైద్యారోగ్యశాఖ ఖాతాలో ఉన్నాయి. ఐదు నెలలుగా చెల్లింపు నిలిచి పోయిన మాట వాస్తవమే. ఏజెన్సీ ఎంపిక చేసిన వెంటనే చెల్లిస్తాం. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్ఓ -
ఓర్వలేకే తప్పుడు ఫిర్యాదులు
అబ్దుల్లాపూర్మెట్: సహకార సంఘం అభివృద్ధిని చూసి ఓర్వలేక తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి పదవి నుంచి తప్పించారని బాటసింగారం రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ చేగూరి భరత్ కుమార్ అన్నారు. తారామతిపేటలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన హయాంలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. కేవలం ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.12 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామని తెలిపారు. గతంలో చైర్మన్గా పనిచేసిన విఠల్రెడ్డి 2013 నుంచి 2020 మధ్యకాలంలో ఎలాంటి తీర్మానం లేకుండా 272 మందికి రూ.23 లక్షలకు పైగా రుణాలపై వడ్డీ మాఫీ చేశారని ఆరోపించారు. ఇదే తరహాలో తాను కూడా 58 మంది నిరుపేద రైతులు, చనిపోయిన రైతు కుటుంబాలకు వడ్డీలో రూ.15 లక్షల 46వేలు మాఫీ చేశామని తెలిపారు. మజీద్పూర్ మాజీ సర్పంచ్ సుధాకర్రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు సంఘం నుంచి రూ.కోటిన్నర మేర రుణాలు తీసుకుని 11 ఏళ్లుగా చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతోనే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు మొగుళ్ల యాదిరెడ్డి, మేకల రాములు, చింతల లక్ష్మమ్మల తదితరులు పాల్గొన్నారు. బాటసింగారం సహకార సంఘం మాజీ చైర్మన్ భరత్కుమార్ -
టాప్గేర్లో ఈ– బండి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఈ– బండి టాప్గేర్లో పరుగులు తీస్తోంది. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు రోడ్డెక్కాయి .కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097 ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీపీ రమేష్ సూచించారు. -
అది పిల్లి కూనే!
కొత్తూరు: మండలంలోని పెంజర్ల గ్రామంలో ఓ ఎంఎన్సీ పరిశ్రమకు చెందిన స్థలంలో చిరుత కూనలు సంచరిస్తున్నాయని స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. గ్రామంలో కొనసాగుతున్న ఓ మల్టీ నేషనల్ పరిశ్రమకు చెందిన ఖాళీ స్థలంలో కార్మికులకు ఇటీవల చిరుతపులి పిల్ల ఆకారంలో ఉన్న ఓ కళేబరం కనిపించింది. ఈ విషయం వైరల్గా మారడంతో విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన కూన కళేబరాన్ని పరిశీలించారు. మృతి చెందిన కూన అటవీ ఎషియన్ లియోపర్డ్ జాతికి చెందిన పిల్లికూనగా గుర్తించారు. దీంతో కార్మికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
అగ్ర భారతే లక్ష్యం
విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు పెద్దపీట వేయాలి ● ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ● సాక్షి ఆధ్వర్యంలో వందేళ్ల భారత్పై టాక్ షో ఇబ్రహీంపట్నం: ఒకే విధానంతో కూడిన వ్యవస్థ ఉన్నప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, యువతలో కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన సాక్షి టాక్ షోలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొ.రాధిక మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకత వెలికితీసే విద్యాబోధనకు సంబంధించిన కోర్సులు రావాలన్నారు. స్వయం శక్తితో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలను భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యతోనే దేశాభివృద్ధి విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలి. అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించాలి. విద్యాబోధనలో సమూల మార్పులు రావాలి. – జాస్మిన్, బీఏ, ఫస్టియర్ ఒకే వ్యవస్థ ఉండాలి దేశంలో ఒకే విధానంతో కూడిన వ్యవస్థ ఉండాలి. ప్రైవేటీకరణ పేరుతో దేశ వ్యవస్థను నాశనం చేయవద్దు. ఒకే గొడుగు కింద అన్ని వ్యవస్థలుంటే. దేశాభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. దేశంలో వనరులకు కొదవలేదు. వాటిని కాపాడుకుంటూ దేశ ప్రగతికి తోడ్పడాలి. – మనీషా, బీఎస్సీ, సెకండియర్ ప్రగతిబాటలో పల్లెలుండాలి పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు కావొస్తున్న గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి. – విజయ్, బీఏ, ఫస్టియర్ యువతను కాపాడుకోవాలి మన దేశంలో నైపుణ్యం గల యువత ఎంతో మంది ఉన్నారు. వారు విదేశాల్లో ఉపాధి పొందుతున్నారు. అలాంటి వారి శక్తి సామర్థ్యాలను దేశం ఉపయోగించుకోవాలి. ప్రతిభ గల వారికి ప్రాధాన్యతను ఇస్తూ దేశాభివృద్ధిలో భాగం చేయాలి – ప్రసన్నలక్ష్మి, బీఎస్సీ, సెకండియర్ స్వయం ఉపాధి కల్పించాలి స్వయం ఉపాధి పొందేలా యువతను తీర్చిదిద్దాలి. ఇతరులపై ఆధార పడకుండా వారే స్వశక్తితో ఉన్నంతగా ఎదిగేందుకు విద్యాబోధన దోహదపడాలి. ఆ దిశగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. స్టార్టప్ కంపెనీలు నెలకోల్పాలి. – ఫాతిమా, బీకాం, ఫస్టియర్ ఆరోగ్య భారత్గా తీర్చిదిద్దాలి ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుంది. అందుకు పల్లె నుంచి పట్ట ణం వరకు వైద్యసేవలను అందించాలి. మనిషి ఆరోగ్య ంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారుతారు. – కేశవర్ధన్, బీఎస్సీ, సెకండియర్ మహిళలకు సీట్లు ఇవ్వాలి చట్ట సభల్లో సమాన ప్రాతినిథ్యం కల్పించాలి. ఇంటికి దీపం ఇల్లాలు ఎలా అంటామో జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో మహిళలకు సీట్లు కేటాయించాలి. అప్పడే మహిళా సాధికారత సాధించి దేశ పురోగమనం సాధ్యమౌతుంది. – స్వాతి, బీఎస్సీ, ఫస్టియర్ టెక్నాలజీలో మార్పులు రావాలి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలి. ఫ్రెంచ్ విప్లవం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు విద్యార్థులే కీలకపాత్ర పోషించారు. వందేళ్ల స్వాతంత్య్ర భారత్ అభివృద్ధి దేశంగా ప్రపంచలో పేరుప్రఖ్యాతలు పొందాలంటే యువత చేతల్లోనే ఉంది. ఆ దిశగా వాళ్లకి తర్ఫీదు ఇవ్వాలి. – డా.సురేశ్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకుడు దేశాభివృద్ధికి కృషి చేయాలి విద్యార్థులు, యువత దేశాభివృద్ధికి పోటీ పడాలి. కుల, మత, ప్రాంత విభేదాలు మూడ నమ్మకాలు పక్కన పెట్టాలి. ఆర్టికల్ 14 ప్రకారం మహిళలకు సమాన హక్కులుండాలి. దేశంలో విజ్ఞానవంతులు కొదవలేదు. వారు విదేశాలకు వెళ్లకుండా సరైన అవకాశాలు సృష్టించాలి – డా.రమేశ్, అధ్యాపకుడు -
మా ఊరిలో మందు బంద్
● పలు గ్రామాల్లో సంపూర్ణమద్యపాన నిషేధం ● మహిళల చైతన్యంతో షాద్నగర్: కేశంపేట మండలం బోదనంపల్లిలో 14 ఏళ్ల క్రితం మొదలైన సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రోజు వరకూ అలాగే కొనసాగుతోంది. ఈగ్రామంలో ఎక్కడా బెల్టు షాపులు, మద్యం సేవించడం కనిపించదు. మద్యం ప్రియులు కావాలనును కుంటే బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఇదే స్ఫూర్తితో అల్వాల గ్రామస్తులు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. ఒక్కడితో మొదలై.. మద్య నిషేదం కోసం పలు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. ముందుగా ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్కు చెందిన నడుల్ల శేఖర్తో పోరాటం మొదలైంది. తమ గ్రామంలో మద్యపానం నిషేధించాలని కోరుతూ గత సెప్టెంబర్లో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. గ్రామ పెద్దలు, మహిళలు రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలిచారు. స్థానికంగా మద్యం విక్రయిస్తే రూ.50 వేలు జరిమానా విధిస్తామని, మద్యం అమ్మేవారిని పట్టిస్తే రూ.10 వేల నజరానా అందజేస్తామనిప్రకటించడంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. ఈ పోరాటం గంట్లవెళ్లి, చౌడమ్మగుట్టతండాలో కూడా కొనసాగుతోంది. జీవితాలు నాశనం కావొద్దని గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసలవుతున్నారు. ప్రజల జీవితాలు నాశనం కావొద్దని ఆలోచనతో పోరాటం ప్రారంభించా. స్థానికుల మద్దతుతో ఎమ్మెల్యేతో పాటు అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశాం. అందరి పోరాటంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. – శేఖర్, కిషన్నగర్, ఫరూఖ్నగర్ మండలం మహిళల పోరాటంతోనే నిషేధం మద్యంతో చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి. దీంతో గ్రామంలో బెల్టు దుకాణాలు తొలగించాలని, మహిళలు పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ దెబ్బతో గ్రామంలో 14 ఏళ్లుగా మద్యం నిషేధం అమలవుతోంది. – ఎదిర కళమ్మ, బొదనంపల్లి, కేశంపేట -
అవినీతే అసలు సమస్య!
మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏది? సమాజంలో అవినీతే ప్రధాన సమస్యగా మారిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు గడుస్తున్నా స్వేచ్ఛ, సమానత్వం అన్నివర్గాలకు అందడం లేదని తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 60 మందిని ‘సాక్షి’ సర్వే చేయగా 24 మంది వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం వంటివి అందరికీ అందడం లేదని 23 మంది తెలిపారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే అధికార యంత్రాంగం మరింత పకడ్బందీగా పనిచేయాలని 22 మంది, చట్ట సభల్లో మార్పు రావాలని 16 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. – చేవెళ్లనాణ్యమైన విద్య 8పేదరికం 8వైద్యం 10కుల వివక్ష 10అవినీతి24 -
ప్రజలను అప్రమత్తం చేయండి
కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం వర్షాల కారణంగా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అన్ని శాఖల అధికారులు తు.చా తప్పకుండా పాటించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి శాఖ అధికారులు వారి పరిధిలో విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవన్నారు. కాజ్వేల మీద ఎవరూ ప్రయాణం చేయకుండా చూడాలన్నారు. చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి అధికారులు హెడ్క్వార్టర్ మెయింటెన్ చేయాలని, వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరెంట్ స్తంభాల వద్ద జాగ్రత్తలు అవసరమన్నారు. ప్రధాన రహదారిపై నీరు ఆగిపోతే వెంటనే స్పందించాలన్నారు. శిథిలావస్థ భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. అకారణంగా ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. డప్పు చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేస్తుందన్నారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, సమస్యలను తక్షణమే తెలియజేయాలని సూచించారు. -
పటిష్ట భారత్కే జై
మొయినాబాద్/చేవెళ్ల: భారతదేశాన్ని ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రగామి దేశంగా చూడాలని యువత ఆకాంక్షిస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థులతో సాక్షి టాక్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వందేళ్ల భారత్ ఎలా ఉండాలని వారి కలలు, ఆకాంక్షలను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల డీఎస్ఏ డీన్ జరినా మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం కూడా చేరేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందన్నారు. వందేళ్ల భారత్ ఎలా ఉండాలని అంశంపై సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తిదాయంగా నిలుస్తుందన్నారు. దేశం కోసం యువత ఏం చేస్తామని, ఎలా ఉండాలని కోరుకునే ఈ కార్యక్రమం బాగుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తి నింపే విధంగా ఉంటాయని కితాబిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంతో మంది సమరయోధుల త్యాగాలతో వచ్చిన దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉంది. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదిరి చూడకుండా ప్రతిఒక్కరూ తమదే బాధ్యత అనే విధంగా దేశం కోసం పనిచేయాలి. 79 ఏళ్ల స్వాతంత్య్రంలో సాధించుకున్న విజయాలను గుర్తుచేసుకుంటూ వందేళ్ల భారత్ కోసం చేయాల్సిన బాధ్యతలను, లక్ష్యాలను గుర్తు చేసుకోవాలి. – చంద్రప్రకాశ్, ఈసీ డిపార్ట్మెంట్ అసోసియేట్ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అయ్యింది. కానీ అందరికీ విద్య, వైద్యం సరిగా అందని పరిస్థితి ఉంది. చదువును, ఆరోగ్యాన్ని కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వందేళ్ల భారత్లో మారాలి. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందాలి. – ప్రణిత్ సాంకేతిక రంగంలో దేశం మరింత అభివృద్ధి చెందాలి. మహిళలకు పూర్తి స్వేచ్ఛ రావాలి. ప్రతిఒక్కరూ చైతన్యవంతులు కావాలి. మహిళలంతా చదువుకుంటేనే వారికి పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు లభిస్తాయి. ఇంకా మార్పుకోసం ఎదురుచూడటం కాదు. వందేళ్ల భారత్లో మారి చూపించాలి. – గ్రీష్మ ప్రస్తుతం విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ల పద్ధతి కాకుండా ప్రతిభ ఆధారంగా అందరికీ సమాన అవకాశాలు లభించాలి. అప్పుడే సమన్యాయం జరుగుతుంది. దేశంలో ఈ విధానం అమలులోకి వస్తే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. – నాగ విఘ్నేశ్వర్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనిషి ఎప్పుడు మార్పును కోరుకోవాలి. అది సమాజ హితం వైపు ఉండాలి. ప్రతి మనిషిలో మానవత్వం, మహిళల పట్ల అందరిలో గౌరవం పెరగాలి. దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలి. – స్వర్ణ దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ప్రజల కోసం పనిచేసేలా ఉండాలి. ప్రస్తుత రాజకీయాలు స్వార్థం, అవినీతిమయంగా మారాయి. వీటిని రూపుమాపేందుకు చైతన్యవంతమైన యువత ముందుకు రావాలి. – మౌనిక 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అన్ని రంగాల్లో రాణించాలి. విద్య, వైద్యం, టెక్నా లజీ, పరిపాలన విభాగాలన్ని బలోపేతం కావాలి. యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి. అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకుని దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలి. – అమూల్య భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారతదేశంలోని ప్రజలందరిలో జాతీయభావం పెరగాలి. సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలి. దేశం విలువలను ప్రపంచానికి చాటే విధంగా యువత ఎదగాలి. – సమీనా మన రాజ్యాంగంలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆనాటి అవసరాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శంగా నిలిచింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులుండాలి. – శివరామకృష్ణ విదేశాలల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మించిన పురోగతిని మన దేశంలో మరింతగా అభివృద్ధి చెందాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలే ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీ లాంటి కోర్సులు మరిన్ని రావాలి. – సాయి దేశంలో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందుబాటులోకి రావాలి. అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రతిఒక్కరూ విద్యను అభ్యసించి నచ్చిన రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. – సిద్దు మన దేశంలో ఉన్న మతాలు, కులాల ప్రతిపాదికన ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థ పూర్తిగా పోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సమానమే అనే భావనతో జీవించేలా చట్టాలు రావాలి. రిజర్వేషన్ల వ్యవస్థతో పేదవారికి న్యాయం కంటే అన్యాయం ఎక్కువగా జరుగుతుంది. – జశ్వంత్ మన దేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతో ముందు చూపుతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అందించారు. దానిని మన పాలకులు సక్రమంగా అమలు చేయడంలో విఫలమవుతున్నారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి. – రాజేశ్ దేశంలో ఉన్న చట్టాల్లో అనేక మార్పులు చేయాలి. దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి భద్రతపై భరోసా కల్పించాలి. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు దేశం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. – సింధు అగ్రగామి దేశంగా నిలవాలని యువత ఆకాంక్ష మొయినాబాద్లోని కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సాక్షి టాక్ షో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు -
స్వేచ్ఛ– సమానత్వం అందరికీ చేరుతోందా..?
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏది? లేదు 23అంతంతే 21అవును16మీడియా10చట్ట సభలు16అధికార యంత్రాంగం 22న్యాయ స్థానాలు 12 -
ఔటర్పైకి దొర్లిపడిన బండరాళ్లు
మణికొండ: నార్సింగి నుంచి పోలీస్ అకాడమీ ఔటర్ సర్వీసు రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో భారీ బండరాయితో పాటు మరో చిన్నరాయి గురువారం సాయంత్రం సర్వీసు రోడ్డుపైకి దొర్లుకుంటూ వచ్చాయి. సర్వీసు రోడ్డు ఓ వైపు నుంచి పడి మధ్యలో డివైడర్పై నుంచి దాటి అవతలి రోడ్డు వరకు వెళ్లాయి. ఆ సమయంలో రెండు వైపుల నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. మంచిరేవుల 60 గజాల ఇందిరమ్మ కాలనీ పక్కనే ఔటర్ సర్వీసు రోడ్డు నిర్మాణ సమయంలో కొంత మేర గుట్టను తొలగించారు. పక్కనున్న గుట్టలను అలాగే వదిలివేయటంతో అవి వర్షాకాలం సమయంలో కూలుతున్నాయని స్థానికులు తెలిపారు. గురువారం రెండు రాళ్లు కూలగా మరో మూడు ప్రమాదకరంగానే రోడ్డును ఆనుకునే ఉన్నాయన్నారు. రోడ్డుపైకి వచ్చిన రాళ్లను ఔటర్ రింగ్ రోడ్డు నిర్వాహకులు వెంటనే తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మరోసారి ప్రమాదం జరగకముందే వాటిని తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. వాహనాలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ఆమనగల్లు: దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా పరిణమించిందని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా అండగా ఉండాలని ఆయన కోరారు. ఆమనగల్లులో గురువారం అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్ఆర్ రెస్పాన్సిబులిటీ నిధులు రూ.4 కోట్లతో చేపట్టిన బీసీ బాలుర వసతిగృహ భవన నిర్మాణానికి ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మార్కెట్ చైర్మన్ యాట గీత, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ నిత్యానందరెడ్డితో కలిసి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు చోర్ గద్దె దిగాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బిస్కెట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. ఆమనగల్లులో సబ్ రిజిస్ట్రార్, ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. జూనియర్ కాలేజీ స్థల వివాదాన్ని, కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకు బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. అభివృద్ధే లక్ష్యం.. కల్వకుర్తి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో కల్వకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, నాయకులు కేశవులు, యాట నర్సింహ, జగన్, మానయ్య, బీసీ సంక్షేమశాఖ డీడీ కేశురామ్, మున్సిపల్ కమిషనర్ శంకర్, తహసీల్దార్ లలిత తదితరులు పాల్గొన్నారు. ఓట్ల చోరీపై ఉద్యమానికి ప్రజలు సహకరించాలి నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆమనగల్లులో బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన -
వర్షాలకు అప్రమత్తంగా ఉండండి
డీఎల్పీఓ సతీష్రెడ్డి మొయినాబాద్రూరల్: భారీ వర్షాలు కురు స్తు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని డీఎల్పీఓ సతీష్రెడ్డి సూచించారు. గురు వారం మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామ పంచాయతీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శి కవితను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగారు. అనంతరం గ్రామ సమీపంలో ఉన్న కుంటలు, వాగులను ఆయన సందర్శించి పరిశీలించారు. ప్రమాదాలు ఉన్న చోట ప్రజలను వెళ్లకుండా చూడాలని పేర్కొన్నారు. పర్యటనలో పంచాయతీ కార్యదర్శి కవిత, కారోబార్ గోపాల్చారి పాల్గొన్నారు. -
కానిస్టేబుల్కు క్యాష్ రివార్డు
కడ్తాల్: కేసు చేధనలో వృత్తి నైపుణ్యం కనబరిచిన కానిస్టేబుల్ రాజశేఖర్ బుధవారం క్యాష్ రివార్డు అందుకున్నారు. వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన కొమ్మరి శివకృష్ణ హైదరాబాద్లో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కోడేరులో తన చెల్లెలు స్వప్న పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని సమాచారం అందడంతో ఈ నెల 8న తెల్లవారు జామున ఆయన తన బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. కడ్తాల్ మండల కేంద్రం సమీపానికి చేరుకోగానే, గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ రాజశేఖర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సీసీ టీవీ పుటేజీ సహకారంతో 24 గంటల వ్యవధిలోనే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించారు. ఈ మేరకు ఆయనకు ఠాణాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్లు, కానిస్టేబుల్ రాజశేఖర్కు ప్రోత్సాహకంగా రూ.5 వేలు క్యాష్ రివార్డు అందజేసి అభినందించారు. -
పెన్షన్ పెంచి ఇవ్వాలి
షాద్నగర్రూరల్: ప్రభుత్వం పెన్షన్దారులకు పెన్షన్ పెంచి ఇచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగల్ల ఉపేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6వేలు, చేయూత పెన్షన్ రూ. 4వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. అందాల పోటీలు, భూ స్వాములు, రైతు భరోసాకు, అభివృద్ధి పేరుతో, యాడ్ల పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు దివ్యాంగులు, చేయూత పెన్షన్దారులకు పెన్షన్ ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పోరాటాల ద్వారానే గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 16న షాద్నగర్లో నిర్వహించనున్న పెన్షన్దారుల సభకు మందకృష్ణమాదిగ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, చేయూత పెన్షన్దారులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు బాలరాజు, సురేష్, అశోక్, పాండు, శ్రవణ్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఎన్నిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా దళపతిరాజు సబితా రాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఫార్మసిస్టుల సంక్షేమం, ఉద్యోగ ఫార్మసీ చట్టాల అమలు, రిజిస్టర్ ఫార్మసిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘాన్ని బలో పేతం చేసే క్రమంలో మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సబితా రాజును సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్మా శంకర్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ మెరుగు రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు ఫసియుద్దీన్, మహ బూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తన్నీరు వేణు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, అల్లూరి క్షత్రియ సంఘం అధ్యక్షుడు కేవీఆర్ఆర్ వర్మ తదితరులు అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి కడ్తాల్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని జిల్లా యువజన విభాగం అధికారి టి. ఐజయ్య అన్నారు. మండల కేంద్రంలోని కేజేబీవీ పాఠశాలలో మేరాభారత్, ఎన్ఎస్ఎస్ యూనిట్ల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, ప్రశాంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకూ అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో పర్యావరణ అసమతుల్యత ఏర్పడి వర్షాలు సరైన సమయంలో కురవడం లేదని అన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరు మీద మొక్కను నాటి, దానిని తల్లిలాగే కాపాడుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అల్లాజీ, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు మొయినాబాద్: ప్రభుత్వ నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ షాపులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధి కారి ఉష డీలర్లను హెచ్చరించారు. మున్సిపల్ కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్లు, రికార్డులు, గోదాములు, లైసెన్స్ చెల్లుబాటు, యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఆర్పీ ధరలకు ఎరువులను విక్రయించాలని అన్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూరియాను కేవలం వ్యవసాయ అవసరాలకు విక్రయించాలని.. ఇతర వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని సూచించారు. యూరియా నిల్వల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన సమయానికి సరిపడా సరఫరా చేస్తామని చెప్పారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి అనురాధ ఉన్నారు. పాఠశాలలను సందర్శించిన రాష్ట్ర బృందం కొత్తూరు: మండల పరిధిలోని ఇన్ముల్నర్వ, పెంజర్ల గ్రామాల్లోని ఎంఎంపీఎస్, జెడ్పీ ఉన్నత పాఠశాలలను ప్రణాళికా సమన్వయకర్తల రాష్ట్ర బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఆన్లైన్లో విద్యార్థుల నమోదు వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు బోధన, బోధనేతర అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర బృందం సభ్యుల వెంట మండల విద్యాధికారి అంగూర్ నాయక్ ఉన్నారు. -
సీపీఎస్ రద్దు చేయకపోతే ఆందోళన
చేవెళ్ల: సీపీఎస్ విధానం రద్దు చేయకపోతే సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద 10వేల మందితో మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సామల మహేందర్రెడ్డి అన్నారు. చేవెళ్లలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల చేవెళ్ల, మల్కాపూర్, గుండాల, కేజీబీవీ, మోడల్ స్కూల్లో బుధవారం సంఘం మండల అధ్యక్షుడు దయానందం, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ పురందాస్, ఉపాధ్యాయులు హోహర్ ఉన్నీసా, దయానందం, రాజశేఖర్, బలరాం, రవీదర్రెడ్డి, వెంకటయ్య, కరుణాకర్రెడ్డి, తదితరులు ఉన్నారు. -
‘లింక్ కల’వదే!
కడ్తాల్: పల్లెలు ప్రగతి పథంలో నడవాలంటే రహదారులు ప్రధానం. కానీ పలు గ్రామాలను కలిపే లింక్ రోడ్లు ఏళ్ల తరబడి అనుసంధానానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు, ప్రయాణికులు కల దశాబ్దాలుగా నెరవేరడం లేదు. వీటిని బాగు చేయాలని కోరుతూ ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్వాయిపల్లి నుంచి గోవిందాయిపల్లి, గోవిందాయిపల్లి నుంచి గోవిందాయిపల్లితండా, చల్లంపల్లి– మక్తమాధారం, వంపుగూడ –టాక్రాజ్గూడ, మక్తమాధారం– పెద్దారెడ్డి చెరువుతండా, కర్కల్పహాడ్– వంకరాయితండా, సాలార్పూర్– రేకులకుంటతండా, చల్లంపల్లి– రేకులకుంటతండా, చల్లంపల్లి– పీవీబాయితండా, వంపూగూడ– పీవీ బాయితండా, ముద్వీన్– కోనాపూర్ రోడ్డు, వాసుదేవ్పూర్ నుంచి బాలాజీనగర్తండా, మైసిగండి– గానుగుమార్లతండాకు చెందిన అనుసంధాన రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మట్టి రోడ్లు బురదమయం అవుతున్నాయని పేర్కొంటున్నారు. పలు గ్రామాలకు ద్విచక్రవాహనాలు, ఆటోలు కూడా వెళ్ల లేని పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలుగా గడిచినా లింక్ రోడ్ల అభివృద్ధికి అడుగులు పడటం లేదని మండల ప్రజలు, తండాల గిరిజనులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. బీటీ రోడ్లుగా అభివృద్ధి చేస్తే.. ● గోవిందాయిపల్లి మీదుగా ఎక్వాయిపల్లి, మైసిగండి వరకు బీటీ రోడ్డు నిర్మించి, ఆర్టీసీ బస్సులు నడిపిస్తే గోవిందాయిల్లి ప్రజలు, విద్యార్థులు, రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ● చల్లంపల్లి నుంచి మక్తమాధారం వరకు బీటీ నిర్మిస్తే రావిచేడ్, మక్తమాధారం, షాద్నగర్ తది తర గ్రామాల మధ్య దూరభారం తగ్గడంతో పా టు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. ● ముద్వీన్– కోనాపూర్ రహదారిని బీటీగా అభివృద్ధి చేస్తే ఆకుతోటపల్లి, ఆమనగల్లు తదితర గ్రామాలకు వెళ్లేందుకు దూరం తగ్గడంతో పాటు ఆయా గ్రామాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ● వాస్దేవ్పూర్ నుంచి బాలాజీనగర్తండా వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తే, చల్లంపల్లి, తలకొండపల్లి తదితర గ్రామాలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వంలో నైనా ఆయా లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధ్వానంగా అనుసంధాన రహదారులు బస్సు సౌకర్యానికి సైతం నోచుకోని పలు తండాలు, గ్రామాలు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్న ప్రయాణికులు, ప్రజలు ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు -
మైసిగండిలో ఎమ్మెల్యే పూజలు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ తల్లి ఆలయాన్ని బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకున్నారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, ఆలయ ట్రస్టీ శిరోలీ, తహసీల్దార్ జ్యోతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్ , తులసీరాం, ఆలయ అర్చక సిబ్బంది తదితరులు ఉన్నారు. -
గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
షాద్నగర్రూరల్: ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని మత్స్యశాఖ జిల్లా అధికారిణి పూర్ణిమ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, స్వయం ఉపాధిని పెంపొందించేందుకు దర్తీ ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్న్ అభియాన్ (డీఏజేజీయూఏ) పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పథకాన్ని పీఎంఎంఎస్వై పథకానికి అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఈ పథకంలో వ్యకిగతమైన, కమ్యూనిటీ పరమైన యూనిట్లు ఉన్నాయన్నారు. ప్రతి యూనిట్ను 10శాతం లబ్ధిదారుడి వాటా, 90శాతం సబ్సిడీ ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు. చేపలు పట్టడం, అమ్మడం, రవాణా చేయడం, పెంపకంవంటి అంశాలపై అనుభవం కలిగి స్వయం ఉపాధిని పొందుతున్న గిరిజనులకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ అధికారులు ఏసుదాసు, అంబేడ్కర్, యాదగిరి, గిరిజన నేతలు శ్రీనునాయక్, రూప్లానాయక్, శ్రీనునాయక్, శ్రీను, చందునాయక్, గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల స్వాహాపై విచారణ
యాచారం: చౌదర్పల్లి గ్రామ స్వయం సహాయక సంఘాల్లో నిధుల స్వాహాపై బుధవారం అధికారులు విచారణ మొదలుపెట్టారు. గ్రామంలోని 30కి పైగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అందాల్సిన దాదాపు రూ.2 కోట్లకు పైగా నిధులను ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాహా చేసిన విషయం వెలుగులోకి రావడంతో రెండోరోజు కూడా గ్రామ మహిళలు ఆందోళన కొనసాగించారు. అప్పటి బ్యాంకు మేనేజర్ ఝాన్సీరాణిని పిలిచి వీబీకేతో కలిపి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కుమ్మకై ్క నిధుల స్వాహా! ఏదైనా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే ఐకేపీ అధికారుల నుంచి మైక్రో క్రెడిట్ ప్లాన్ (ఎంసీపీ) రికార్డులు అందిన తర్వాతే మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ యాచారం ఎస్బీఐలో మాత్రం వీబీకే వరలక్ష్మి, అప్పటి మేనేజర్ కుమ్మకై ్క ఎంసీపీ లేకుండానే నకిలీ డాక్యుమెట్లు, ఫోర్జరీ సంతకాల రికార్డులు సృష్టించి నిధుల స్వాహాకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అధికారుల ఫిర్యాదుల ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. ఐకేపీ సిబ్బందితో డీఆర్డీఏ డీపీఎం సమావేశం చౌదర్పల్లి సీసీ, వీబీకే పాత్రలపై వివరాల సేకరణ రెండోరోజు కొనసాగిన మహిళల ఆందోళన అధికారుల విచారణ చౌదర్పల్లిలోని స్వయం సహాయక సంఘాల్లో జరిగిన అక్రమాలను ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. డీఆర్డీఓ శ్రీలత ఆదేశాల మేరకు డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) లీలాకుమారి బుధవారం యాచారంలోని ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ ఏపీఎం రవీందర్, చౌదర్పల్లి సీసీ జంగయ్య, ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. అక్రమాలు జరుగుతుంటే ఏం పర్యవేక్షణ చేస్తున్నావని సీసీ జంగయ్యపై మండిపడ్డారు. ఎంసీపీలు పంపకుండానే వీబీకే, అప్పటి బ్యాంకు మేనేజర్ కలిసి నిధుల స్వాహాకు పాల్పడినట్లు ఆయన సమాధానమిచ్చారు. రికార్డులను పరిశీలించి ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై విచారణ చేపడతామని ఆమె తెలిపారు. అప్పటి బ్యాంకు మేనేజర్ ఝాన్సీరాణి పాత్రపై ఎస్బీఐ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్బీఐ ఏజీఎం రామకృష్ణయ్య యాచారం ఎస్బీఐలో విచారణ చేపట్టారు. 2022 నుంచి చౌదర్పల్లిలోని స్వయం సహాయక సంఘాలకు ఎన్ని రుణాలిచ్చారు, ఫోర్జరీ సంతకాలతో కూడిన నకిలీ డాక్యుమెంట్లను తనిఖీలు చేశారు. అవసరమైతే ఝాన్సీరాణిని పిలిచి విచారణ చేపడతామని తెలిపారు. -
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
పహాడీషరీఫ్: వర్షాల సందర్భంగా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారి శ్రీనివాస్ అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జల్పల్లి మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు, బుర్హాన్ఖాన్ చెరువులను బుధవారం ఆయన కమిషనర్ వెంకట్రామ్తో కలిసి పరిశీలించారు. పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండి పారుతున్న అలుగును పరిశీలించారు. మిగులు నీరు పి–7 కార్గో రోడ్డులో పారుతూ వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూశారు. చెరువుకు ఎక్కడి నుంచి నీరు వస్తోది.. మరిన్ని వర్షాలు కురిస్తే కట్ట సామర్థం ఏమిటి తదితర విషయాలపై నీటి పారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ జనార్దన్ను అడిగి తెలుసుకున్నారు. మిగులు నీరు రోడ్డుపైకి రాకుండా అడ్డుగోడ కట్టే విషయమై అధ్యయనం చేయాలని సూచించారు. తర్వాత జల్పల్లి కమాన్ రోడ్డులో నీట మునుగుతున్న రెండు కల్వర్ట్లను పరిశీలించారు. కల్వర్ట్ల ఎత్తు పెంచేందుకు అంచనాలు రూపొందించాలన్నారు. అనంతరం ఉస్మాన్నగర్లోని బుర్హాన్ఖాన్ చెరువును పరిశీలించి ముంపు ఇళ్లలో ఎవరైనా ఉంటే, ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ ఇష్రత్ ఆయేషా తదితరులు పాల్గొన్నారు. -
చుక్క నీరు చేరలే..
బాతుల చెరువు వెత ● ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ● అయినా వెలవెలబోతున్న కొన్ని చెరువులు ● ఆక్రమణలు.. అడ్డుగా నిర్మాణాలే కారణం సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అనేక వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. హిమాయత్సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. షాబాద్, పరిగి, షాద్నగర్, శంషాబాద్, మొయినాబాద్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఐదు రోజుల క్రితమే నాలుగు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. జంటజలాశయాల్లో కీలకమైన హిమాయత్సాగర్ గలగల పారుతుంటే ఉస్మాన్సాగర్ మాత్రం వెలవెలబోతోంది. జలాశయం ఎగువ ప్రాంతంలోని శంకర్పల్లి, మోమిన్పేట్, నవాబ్పేట్, మర్పల్లి, వికారాబాద్లోని వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడం, వాటిలో పెద్దఎత్తున ఫాం హౌస్లు వెలియడం, చెరువులోకి వరదనీటిని తెచ్చే వాగులకు అడ్డుగా భారీ ప్రహరీలు నిర్మించడమే ఇందుకు కారణం.వెలవెలబోతున్న బాతుల చెరువు -
డ్రగ్స్ నిరోధానికి కృషి చేద్దాం
ఇబ్రహీంపట్నం రూరల్: మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి చేద్దామని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం మిషన్ పరివర్తన సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను పూర్తి స్థాయిలో నివారించేందుకు పని చేద్దామన్నారు. డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని.. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని.. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి -
కాశన్నకుంట.. వెంచర్లే వెంట
కొత్తూరు: రియల్భూమ్ జోరుగా సాగిన సమయంలో మండలంలోని పలు చెరువులు, శిఖం భూముల్లో సైతం వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు. నిబంధనలు పాటించకుండా ఎఫ్టీఎల్ లెవల్లో రోడ్లు, స్తంభాలు పాతి మరీ వ్యాపారులు బహిరంగంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కొత్తూరు మండలకేంద్రం ఎస్సీ కాలనీ సమీపంలో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాశన్నకుంట చెరువు ఎఫ్టీఎల్లో రియల్వెంచర్ ఏర్పాటు చేశారు. దీంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యం చాలా వరకు తగ్గింది. వర్షాకాలంలో చెరువులో నీరు పూర్తిస్థాయిలో నిండినప్పుడు వెంచర్ రోడ్లు, రాళ్లు కనిపించవు. స్తంభాలు మాత్రం పైకి కనిపిస్తున్నాయి. -
దళితుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: దళితుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలం అయ్యారని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బి.సామేల్, కార్యదర్శి ప్రకాశ్కారత్ విమర్శించారు. సంఘం జిల్లాస్థాయి వర్క్షాపు బుధవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటికీ గ్రామాల్లో అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 25 ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదన్నారు. ఉన్నత విద్యనభ్యసించినా ఉద్యోగాలు రాక కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్కు 13 ఏళ్లుగా నిధులు కేటాయించడం లేదన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మనోహర్, వెంకటేశ్, ఆనంద్, వీరేష్, సత్తన్న, కుర్మయ్య, నర్సింహ, జంగయ్య, రాజు పాల్గొన్నారు. -
షార్ట్సర్క్యూట్తో గృహోపకరణాలు దగ్ధం
మహేశ్వరం: భారీ వర్షాల నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని తుమ్మలూరులో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన అక్కెర రమాదేవి ఇంట్లో షార్ట్సర్క్యూట్ కారణంగా టీవీ, రిఫ్రిజిరేటర్, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు, దుస్తువులు కాలిపోయాయి. తమది నిరుపేద కుటుంబమని.. భర్త మరణించాడని ఇద్దరు కూతుర్లను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ జీవనం సాగిస్తున్నాని ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని కోరింది. విద్యుత్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు పత్రం సమర్పించారు. కృత్రిమ ఇసుక తయారీ కేంద్రంపై దాడి ● ఫిల్టర్ ధ్వంసం ● లారీ, ట్రాక్టర్ సీజ్ కడ్తాల్: కృత్రిమ ఇసుక తయారు చేసినా, అనుమతులు లేకుండా ఇసుక తరలించినా చర్యలు తప్పవని సీఐ గంగాధర్ హెచ్చరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రెవెన్యూ సిబ్బంది, పోలీసులు అధికారులు మండల పరిధిలోని ముద్వీన్లో కొనసాగుతున్న కృత్రిమ ఇసుక తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఫిల్టర్ను ధ్వంసం చేశారు. ఫిల్టర్ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్, లారీని సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ బాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాములు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పోల్కంపల్లిలో గేదెల అపహరణఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు రెండు గేదెలను అపహరించుకొని వెళ్లిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని పొల్కంపల్లి అనుబంధ గ్రామమైన జాజోనిబావి గ్రామానికి చెందిన కసరమోని ఐలయ్య మంగళవారం రాత్రి తన డెయిరీ ఫాం వద్ద ఉన్న గదిలో నిద్రిస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి ఐలయ్య నిద్రిస్తున్న గదికి బయటి నుంచి తాళం వేసి రెండు గేదెలను తీసుకుని పరారయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఐలయ్య మెల్కోని డోర్ తీసే ప్రయత్నం చేయగా తెరుచుకోలేదు. దీంతో కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు అక్కడికి చేరుకొని తాళం పగులగొట్టారు. సుమారు రూ.3లక్షల విలువ చేసే గేదెలను అపహరించుకొని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల పనితీరు భేష్
షాద్నగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, పనితీరు బాగుందని రాష్ట్ర విద్యాశాఖ బృందం కితాబిచ్చింది. రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్లో భాగంగా బుధవారం రాష్ట్ర విద్యాశాఖ బృందం సభ్యులు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల, బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కుంటబడి), ఎంఆర్సీలోని భవిత సెంటర్, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు, డీఐఎస్ఈ నమోదు, మధ్యాహ్నభోజన పథకం, పాఠశాలల వివరాల నమోదు, పాఠ్య ప్రణాళికలు, భవిత్ సెంటర్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్ఓ నరేందర్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆజాద్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శశిధర్రెడ్డి, ఎంఈఓ మనోహర్, ప్రధానోపాధ్యాయులు భాగ్యమ్మ, పద్మనళిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ బృందం కితాబు -
వర్షాల వేళ జాగ్రత్త
ఇబ్రహీంపట్నం రూరల్: భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం భారీ వర్షాలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించినందున ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తమ యాక్షన్ టీంలకు సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని తెలిపారు. కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకొని 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి మందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పాఠశాలలు, హాస్టళ్లతో పాటు పురాతన భవనాల్లోని సాధారణ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరతలించా లన్నారు. భారీ వర్షాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఫంక్షన్ హాళ్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించి లీకేజీలు ఉంటే గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం చేయాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని, ముందస్తుగా నిల్వ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణాలు పూర్తయిన వాటికి బిల్లులు వెంటనే మంజూరు చేయాలని, డీవియేషన్తో నిలిచిపోయిన ఇళ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు ఈ నెల 16లోగా ప్రతిపాదనలు పంపాలన్నారు. వరదలు, ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 79931 03347, 040 23237416కు సమాచారం అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ సంగీత , డీఆర్డీఓ పీడీ శ్రీలత , డీపీఓ సురేష్మోహన్, వ్యవసాయ శాఖ అధికారి ఉష, హౌసింగ్ పీడీ నాయక్, డీఈఓ సుశీందరావు, ఎస్సీ సంక్షేమ అధికారి రామారావు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ నారాయణరెడ్డి -
నవ్విపోదురుగాక!
● అధికారుల అనాలోచిత నిర్ణయాలు ● ముర్తూజగూడలో ఇప్పటికే సబ్స్టేషన్ పనులు షురూ ● తాజాగా శంకుస్థాపన పేరుతో హడావుడి ● స్థానికుల అభ్యంతరంతో శిలాఫలకంలో పేరు మార్పు ● ఇటీవల తుక్కుగూడలోని ఆస్పత్రికీ ఇదే తరహా శంకుస్థాపన ● నిర్లక్ష్యంతో విమర్శలు మూటగట్టుకుంటున్న వైనం సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికారుల అనాలోచిత నిర్ణయాలు విస్తుగొలుపుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలోనూ అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తుక్కుగూడలో కనీసం భూమి కూడా కేటాయించని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా ఇన్చార్జి మంత్రి చేతుల మీదుగా ఇప్పటికే శంకుస్థాపన చేయించి నవ్వులపాలయ్యారు. తాజాగా మొయినాబాద్లో మరో వివాదానికి కారణమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై.. ఏకంగా పనులు చివరి దశకు చేరుకున్న సబ్ స్టేషన్కు శంకుస్థాపన పేరుతో హడావుడి చేయడం గమనార్హం. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమాన్ని సైతం నిర్లక్ష్యంగా రూపకల్పన చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏడాదిన్నరక్రితమే పనులు షురూ మొయినాబాద్ పరిసర గ్రామాల్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ముర్తూజగూడలో 33/11 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.8 కోట్లు మంజూరు చేసింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో శంకుస్థాపన పనులు నిలిచిపోయాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ఏడాదిన్నర క్రితమే దీనికి భూమి పూజ చేసి, నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయా పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. తాజాగా ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి గత సోమవారం ఏర్పాట్లు చేయడం, స్థానికులు అధికారులను నిలదీయడం వివాదాస్పదంగా మారింది. చివరికి అధికారులు శిలాఫలాకాలపై పేర్లు మార్చి ఇతర సబ్స్టేషన్ల పేరుతో అదే వేదికగా శంకుస్థాపన చేయాల్సి వచ్చింది. అసలేమైందంటే..? చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 30 సబ్స్టేషన్లు ఉన్నాయి. 1,02,811 గృహ, 24,969 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ కొత్తగా అనేక గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు వెలుస్తున్నాయి. విద్యుత్ వినియోగం రెట్టింపవుతోంది. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్యను నియంత్రించడంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా మరో ఐదు సబ్స్టేషన్లు మంజూరు చేసింది. రూ.20.5 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించతలపెట్టింది. వీటిలో చిలుకూరు (నాగిరెడ్డిగూడ), బాకారం, నర్రెగూడలో 33/11 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించదలచిన ప్రదేశంలో కాకుండా ఇప్పటికే మంజూరై, పనులు వివిధ దశల్లో కొనసాగుతున్న ముర్తూజగూడలో ఆయా సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముర్తూజగూడలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సబ్స్టేషన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పనులు ప్రారంభమైన ప్రదేశంలోనే మళ్లీ శంకుస్థాపన అంటూ అధికారులు హడావుడి చేయడం, మీడియాకు ఆహ్వానాలు పంపడం, స్థానికులు అడ్డుతగలడం, తర్వాత మేల్కొని శిలాఫలకాలు మార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
మొయినాబాద్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మొయినాబాద్ రైతు వేదికలో మంగళవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలకు పురుగు ముందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, మందులను వాడాలని తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు అందుబాటులో ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు బీమా పథకం కోసం 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న రైతులు అర్హులని.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలు పొందాలంటే రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించుకోవాలన్నారు. యూరియా, ఇతర ఎరువులు రైతులకు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏడీఏ సురేష్బాబు, మండల వ్యవసాయాధికిరి అనురాధ, ఏఈఓ సునీల్ పాల్గొన్నారు. -
అక్రమాలు సహించేది లేదు
ఆమనగల్లు: రైస్మిల్లర్లు ప్యాడిరైస్, రైస్మిల్లర్ల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు. మండల పరిధి పోలెపల్లి గ్రామంలోని శ్రీరామ రైస్మిల్లులో మంగళవారం సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ సూర్యనారాయణ, డీఎస్పీ రమణారెడ్డి, సీఐ అజయ్, ఎస్ఐ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, టీఏ జంగయ్య ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీల్లో 2022–23 రబీ సీజన్కు సంబంధించిన ప్యాడీరైస్ 33,47,960 క్వింటాళ్ల కేటాయింపు కాగా ప్రస్తుత తనిఖీల్లో 19,80,130 క్వింటాళ్లు తక్కువగా వచ్చినట్లు గుర్తించామని అడిషనల్ ఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. తక్కువగా వచ్చిన ప్యాడీరైస్ విలువ రూ.7.10 కోట్లు ఉంటుందన్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లు యజమానిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. లక్ష్మీ వెంకటసాయి రైస్మిల్లులోనూ తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. అక్రమాలకు పాల్పడే రైస్మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
రైతు సంక్షేమమే ధ్యేయం
హయత్నగర్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కొహెడలో నిర్మించిన ఆధునిక గోదాంను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకుని, సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం ఆధునిక గోదాంలు నిర్మిస్తోందని తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు వరి పంటకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు వంగేటి లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, చేపల యాదగిరి, కృష్ణారెడ్డి, కొండ్రు స్వప్న, శ్రీనివాస్, చెక్క లక్ష్మమ్మ, శీలం లక్ష్మమ్మ, సీఈఓ రాందాస్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్చారి తదితరులు పాల్గొన్నారు. -
తొలగింపా?
లాభాల మునగ మునగ సాగుతో ఆశించిన దిగుబడులతో పాటు లాభాలు ఆర్జించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.పొడిగింపా.. బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 20258లోuపీఏసీఎస్లకు ఈ నెల 14తో ముగుస్తున్న గడువుయాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు సర్కార్ పొడిగించిన ఆరు నెలల పదవీ కాలం గడువు ఈ నెల 14తో ముగియనుంది. మరో ఆరు నెలలు పొడిగిస్తారా.. లేదా అనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. పీఏసీఎస్లకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 16న చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16తో ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలల పదవీ కాలాన్ని పొడిగించింది. పొడిగించిన పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగిసే అవకాశం ఉన్నప్పటికీ ఏ నిర్ణయం వెలువడకపోవడంతో అటు అధికారులు, ఇటు పాలకవర్గ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో ఆరు నెలల గడువు పొడిగించాలా.. లేదా పాలకవర్గాలను రద్దు చేసి పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలా అనే విషయమై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలలు పొడిగించాలని డీసీసీబీ డైరెక్టర్లు ఇటీవల వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి విన్నవించారు. మరో 15 కొత్తవి ఏర్పాటు! ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 56 పీఏసీఎస్లు ఉన్నాయి. 56 చైర్మన్లలో 16 మందిని డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు)కి డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. మరో ఇద్దరు నామినేటెడ్ డైరెక్టర్లతో కలిపి మొత్తంగా 18మంది డైరెక్టర్లు ఉంటారు. వీరంతా డీసీసీబీ చైర్మన్తో పాటు, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. డీసీసీబీ ద్వారా మండల స్థాయిలో ఉన్న పీఏసీఎస్లకు రుణాలు అందజేస్తూ రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం డీసీసీబీ రూ.3 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలతో నడుస్తోంది. దాదాపు 1.25 లక్షల మందికి పైగా రైతులు సభ్యత్వం పొంది దీర్ఘకాలిక, స్వల్పకాలిక, బంగారు, వ్యక్తిగత రుణాలు పొందుతున్నారు. ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్లతో పాటు తాజాగా ఉమ్మడి జిల్లాలో మరో 15 కొత్తవి ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. రాజకీయ రంగు మండలాల స్థాయిలో జరిగే పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్ల ఎన్నికల విషయంలోనూ రాజకీయ ప్రభావితం అధికంగా ఉంటుంది. పేరుకే రైతుల ఓట్లతో డైరెక్టర్లు గెలిచే అవకాాశం ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం తీవ్ర పోటీ ఉంటుంది. రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను నిలబెట్టి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తారు. రైతుల ఓట్లను కూడగట్టుకోవడం కోసం భారీగా ఖర్చు చేస్తారు. 2020లో జరిగిన ఎన్నికల సమయంలో అప్పటి సర్కార్లో ఎన్నికై న చైర్మన్లే అత్యధికంగా కొనసాగుతున్నారు. కొన్ని మండలాల్లో పదవి పోతుందనే భయంతో కొందరు చైర్మన్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. రుణాల అందజేత విషయంలో తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు మాత్రం పీఏసీఎస్ల పదవీ కాలాన్ని పొడిగించకుండా తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు. న్యూస్రీల్ మరో ఆరునెలలు పొడిగించాలంటున్న పాలకవర్గాలు వెంటనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలంటున్న ఆశావహులు కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రభుత్వం నుంచి ఇంకా రాని స్పష్టత రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యం పీఏసీఎస్లకు మరో ఆరు నెలల పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నాం. ఉమ్మడి జిల్లా డీసీసీబీ రూ.3 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలతో నడుస్తోంది. సర్కార్ అవకాశం ఇస్తే ఈ ఆరు నెలల్లో కొత్త పీఏసీఎస్లతో పాటు, డీసీసీబీ బ్యాంకులకు బ్రాంచ్లను ఏర్పాటు చేస్తాం. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కృషి చేస్తాం. – కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
షాద్నగర్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కాశిరెడ్డిగూడలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరరహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ విజయ్కుమార్, ఎస్ఐ రాజేష్, తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం షాద్నగర్: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్నామని అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం పట్టణంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలకు పైగా ఎన్నో ఉద్యమాలు చేపట్టి సమస్యలు పరిష్కరించుకోగలిగామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్, నాయకులు సాయి చౌహాన్, రాహుల్, అరుణ్, ప్రకాష్, సునీల్, గణేశ్, అంకిత, నిఖిత, నందిని తదితరులు పాల్గొన్నారు. విజయ పాలసేకరణ కేంద్రం ప్రారంభం ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని జంగారెడ్డిపల్లిలో పాడిపరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ పాలసేకరణ కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాడిరైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిషన్రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ బొజ్జ సాయిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శంకర్ పాల్గొన్నారు. మేడిగడ్డతండా కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు ఆమనగల్లు: మండలంలోని మేడిగడ్డతండా కార్యదర్శి పి.వెంకటయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగం, చట్టబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకటయ్య మండల పరిధిలోని మంగళపల్లి ఇన్చార్జి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తూ ఎన్ఆర్ఈజీఎస్ ఖాతాద్వారా రూ.2.55 లక్షలు అడ్వాన్స్గా తీసుకుని వాడుకున్నాడు. మేడిగడ్డతండాలో పన్నుల ద్వారా వచ్చిన రూ.76,875, కోనాపూర్ పంచాయతీలో పనిచేసిన సమయంలో రూ.16,342 ట్రెజరీలో జమచేయకుండా సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. ఎంపీ డీఓ ఇచ్చిన నివేదిక మేరకు వెంకటయ్యను సస్పెండ్ చేశారు. ఆరుట్ల కార్యదర్శికి షోకాజ్ నోటీసు మంచాల: మండలంలోని ఆరుట్ల పంచాయతీ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్కు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి సురేష్మోహన్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడని డీపీఓ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు వివరణ కోరుతూ మంగళవారం నోటీసు జారీ చేశారు. ఇదే విషయమై ఎంపీడీఓ బాలశంకర్ను వివరణ కోరగా నోటీసు వచ్చిన మాట వాస్తవమే అని తెలిపారు. -
లాభాల మునగ
కందుకూరు: మునగ పంట సాగుకు మన రాష్ట్రంలోని నేలలు అనుకూలం. దీంతో ఆశించిన మేర దిగుబడులతో పాటు మంచి లాభాలు అర్జించవచ్చు. అలాగే ఇందులో పోషక విలువలు సైతం సమృద్ధిగా ఉండడంతో ఏ సీజన్లోనైనా డిమాండ్ ఉంటుంది. జిల్లాలో రెండు వేల ఎకరాలకు పైగానే మునగ సాగు చేస్తున్నారు. ఈ పంట సాగులో మెలకువలు, చేపట్టాల్సిన అంశాలు, సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. నేలలు నీరు నిలవని ఎర్ర, ఇసుక, ఒండ్రు మట్టి నేలలు మునగ సాగుకు అనుకూలమైనవి. నీటి వసతి ఉండి సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. రకాలు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన పీకేఎం–1 రకం మునగ సాగుకు అనుకూలమైంది. ఇది నాటిన ఆరు నెలల్లో కాపునకు వచ్చి రెండు సంవత్సరాల్లో మూడు కాపులనిస్తుంది. కాయలు పొడవుగా మంచి కండ కలిగి ఉంటాయి. ఎగుమతికి అనుకూలమైనవి. మొక్కల పెంపకం సేకరించిన విత్తనాన్ని కిలోకు 2–3 గ్రాముల కాప్టాన్ లేదా మాంకోజెబ్తో విత్తన శుద్ధి చేయాలి. రెండు పాళ్లు మంచి ఎర్రమట్టి, ఒక భాగం ఇసుక, ఇంకో భాగం బాగా చివికిన పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని 4●6 సైజులో కింద భాగంలో తగినన్ని రంధ్రాలు గల 150 గేజ్ మందం గల పాలిథిన్ సంచులలో నింపాలి. ఈ సంచుల్లో విత్తనాన్ని అంగుళం లోతులో విత్తాలి. ప్రతి రోజు నీరు పెట్టాలి. వర్షాకాలంలో పాదులో నేరుగా కూడా విత్తనాన్ని పెట్టవచ్చు. నాటిన 10–12 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది. ఒక ఎకరాకు 300 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాలను పాలిథిన్ సంచుల్లో విత్తినప్పుడు 40 రోజుల్లో మొక్కలు తోటలో నాటడానికి సిద్ధమవుతాయి. నాటడం పొలాన్ని దున్ని కలుపు లేకుండా శుభ్రం చేయాలి. 2.5●2.5 మీటర్ల దూరంలో అడుగు లోతు, అడుగు వెడల్పుతో గుంతలు తీసి, తవ్విన మట్టిని భూసారాన్ని బట్టి 5–10 కిలోల మాగిన పశువుల ఎరువు, 200 గ్రాముల సూపర్, 25 గ్రాముల 4 శాతం ఎండోసల్ఫాన్ పొడి మందు కలిపి గుంతలు పూడ్చి అందులో మొక్కల్ని నాటి నీరు పెట్టాలి. నీరు కట్టడం మొక్క పెరిగే దశలో 8–10 రోజులకోసారి, పూత, కాయదశలో 6–7 రోజులకోసారి అవసరాన్ని బట్టి నీటి తడి ఇవ్వాలి. డ్రిప్పు ద్వారా రోజు విడిచి రోజు 10–15 లీటర్ల నీరు ఇవ్వాలి. ఎరువులు పిందె పడిన దగ్గర నుంచి 25–30 రోజులకోసారి చెట్టుకి 75–100 గ్రాముల 17ః17ః17 ఎరువును వేయాలి. దీంతో కాయ పరిమాణం పెరుగుతుంది. సస్యరక్షణ పూతదశలో చీడపట్టకుండా 10 లీటర్ల నీటికి 20 మి.లీ రోగార్, 2 గ్రాముల మాంకోజెబ్, 2 మి.లీ ఫ్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో ఫ్రూట్టాప్ ఆశించకుండా 2 మి.లీ మలాథియాన్ మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి. ఈగ ఆశించి నల్లబడిన పిందెలను, కాయలను ఎప్పటికప్పుడు కోసి తొలగించాలి. పంటలో సస్యరక్షణ చర్యలే కీలకం నీటి వసతి నేలలు అనుకూలం కృషి విజ్ఞాన కేంద్రం నిపుణుడు శ్రీకృష్ణ -
మహిళలను పొదుపు సంఘంలో చేర్చాలి
కొందుర్గు: ప్రతి మహిళను పొదుపు సంఘంలో చేర్పించాలని డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ నర్సింలు అన్నారు. మంగళవారం మండల సమాఖ్యలో మహిళా సంఘాల సభ్యురాళ్లకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. గ్రామాల్లో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలందరినీ స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలన్నారు. దివ్యాంగులు, వృద్ధ మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కారు లక్ష్యమన్నారు. మహిళల జీవనోపాదులను మెరుగు పర్చుకొని మహిళలు ఆర్థికంగా రాణించాలన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భారతమ్మ, ఉపాధ్యక్షురాలు ఎ.భారతమ్మ, కోశాధికారి లక్ష్మీనర్సమ్మ, సీసీ లక్ష్మి, సరళ, జంగయ్య, నర్సింలు వివిధ గ్రామాల మహిళలు పాల్గొన్నారు. -
ఎల్లమ్మా.. బైలెల్లినాదో
తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రెండోరోజు అమ్మవారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఈ క్రతువును చూడటానికి లక్షలాది భక్తులు, శివసత్తులు తరలివచ్చారు. అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. రావిర్యాల నుంచి ఆలయం వరకు అమ్మవారి ఘటం, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, కళాకారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారిని ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీరాములుయాదవ్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ మోహన్రావు, మీగడ కాశీనాథ్, పాలక మండలి సభ్యులు గోవర్ధన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, పల్లవి, శ్రీలత, అర్జున్, బాల్రాజ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ● అంగరంగ వైభవంగా సూర్యగిరి వార్షికోత్సవాలు -
దేవాలయాలకు రక్షణ కల్పించాలి
కేశంపేట: రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పసుల నర్సింహయాదవ్ అన్నారు. ఇటీవల హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద పాక్షికంగా గోడను ధ్వంసం చేయడంతో బీజేపీ పిలుపు మేరకు చలో పెద్దమ్మతల్లి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంకుమార్చన నిర్వహించేందుకు పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. దీంతో కేశంపేట పోలీసులు మండలంలో పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి.. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన చలో పెద్దమ్మతల్లి కార్యక్రమాన్ని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హిందువులకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల మండల కన్వీనర్ కంచుకోట మహేశ్, సంస్కృతిక శాఖ జిల్లా కో–కన్వీనర్ కర్రెడ్ల నరేందర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కల్వకోలు తిరుపతి, దాసరి యాదయ్య, కోటి, సురేష్, మహేశ్, మల్లేశ్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, విడుదల చేశారు.బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహయాదవ్ -
రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలి
షాబాద్: జనాభాలో సగ భాగమైన బీసీలు సంఘటితమై రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుర్వగూడ గ్రామంలో బీసీ సేన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రమేశ్యాదవ్, ఉపాధ్యక్షుడిగా రాము, ప్రధాన కార్యదర్శిగా యాదయ్యగౌడ్ తదితరులను సభ్యులుగా ఎనుకున్నారు. సర్ధార్నగర్లో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కాసముని మల్లేశ్గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు ఐకమత్యంతో ఉంటూ ముందుకు సాగాలన్నారు. దేశ వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసి గ్రామ స్థాయి నుంచి బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించి హక్కులను సాధించుకోవాలన్నారు. బీసీ సేన రాజకీయ పార్టీలకతీతంగా పని చేస్తుందన్నారు. చట్ట సభలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించేంత వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహులు, బీసీ సేన జిల్లా, మండల సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు కృష్ణ -
వివాహిత అదృశ్యం
కేశంపేట: ఓ వివాహిత అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని లేమామిడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన సంపంగి మల్లేశ్కు కల్వకుర్తి మండలం సిలార్పల్లి గ్రామానికి చెందిన గీతతో గతేడాది వివాహం జరిగింది. అయితే గీత రాఖీ పండగకు పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య మణికొండ: ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా అక్కునూరు గ్రామానికి చెందిన బి.సుస్మిత (18) ఇబ్రహీంబాగ్లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంది. నార్సింగిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో మరో ఇద్దరితో కలిసి ఉంటుంది. సోమ వారం రూమ్మేట్ అర్చన కిందకు వెళ్లగా..గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుంది. అర్చన తిరిగి వచ్చి తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా లోపల గడియ వేసి ఉంది. దీంతో వార్డెన్ నవీనకు విషయం తెలిపింది. ఇద్దరు వచ్చి డోర్ను తెరిచి చూడగా సుస్మిత ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే 108కు ఫోన్ చేయటంతో వారు వచ్చి ఆమె మృతిచెందినట్టు ధృవీకరించారు. హాస్టల్ నిర్వాహకుడు సాయికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆత్మహత్యకు కారణా లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం మేడ్చల్ రూరల్: బైక్పైన వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఏపీలోని తెనాలి జిల్లా వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన కేసాని మధు(50) బతుకుదెరువు కోసం మేడ్చల్ వలస వచ్చాడు. కేఎల్ఆర్ వెంచర్లో నివాసం ఉంటూ మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులకు వెళ్లిన మధు మంగళవారం ఉదయం 8.45 గంటలకు ఇంటికి బైక్పై బయల్దేరాడు. మేడ్చల్లోని వివేకానంద విగ్రహం వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బైక్ కుడివైపు ఉన్న హ్యాండిల్కు తగలడంతో మధు లారీ చక్రాల కిందకు పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్మీకటాక్షం
మహేశ్వరం: రక్షా బంధన్ రోజున మహేశ్వరం ఆర్టీసీ డిపోకు లక్ష్మీకటాక్షం లభించింది. రాఖీ పండుగ నేపథ్యంలో మహేశ్వరం డిపో పరిధిలో 26,580 కిలో మీటర్ల దూరం సర్వీసులు నడిచాయి. పండుగ ఒక్క రోజే డిపోకు రూ.23.24లక్షల ఆదాయం సమకూరింది. మహాలక్ష్మీ పథకం కింద 48 వేల మంది మహిళలు ప్రయాణించగా రూ.13.96లక్షల ఆదాయం వచ్చింది. ●సమష్టి కృషి రాఖీ పండుగ నేపథ్యంలో రూ.23.24లక్షల ఆదాయం సమకూరింది. డిపోలో పని చేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది సమష్టి కృషితో ఆదాయం గడించాం. – లక్ష్మీ సుధ, ఆర్టీసీ డిపో మేనేజర్, మహేశ్వరం -
తెలంగాణ మోడల్ స్కూల్గా కేంద్రీకృతం చేయండి
సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి కడ్తాల్: పంచాయతీ పరిధిలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్(బాలుర, బాలికల), ప్రాథమికోన్నత పాఠశాలలను తెలంగాణ మోడల్ స్కూల్గా కేంద్రీకృతం చేయాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సిహారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలోని తెలంగాణ విద్యా కమిషన్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి జీనత్పర్ అజ్మీ సయ్యద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా పాఠశాలల్లో 700 మంది వరకు విద్యార్థులు, 45 మంది ఉపాధ్యాయులున్నారని వీరిని తెలంగాణ మోడల్ స్కూల్ విధానంలో ఏకీకృతం చేయాలని కోరారు. -
ఏర్పాట్లపై అసహనం
సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా చేసిన ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి భట్టి అసహనం వ్యక్తంచేశారు. సభావేదిక వద్ద సరైన వసతులు లేకపోవడంపై కినుక వహించారు. వర్షం కారణంగా టెంట్లు తడిసిపోవడంతో పాటు నేలపై వాన నీరు నిల్వడంతో ఇబ్బంది పడ్డారు. భట్టి మాట్లాడినంత సేపు స్థానిక నాయకులు కురుస్తున్న టెంట్ కిందే నిలబడ్డారు. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమ గ్రామం పేరు లేదని ముర్తూజగూడ వాసులు అధికారులను నిలదీశారు. అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సభావేదికపై కూర్చుని ప్రొటోకాల్ ఉల్లంఘించారు. -
పండుగ రోజున రూ.13లక్షలు అదనం
ఇబ్రహీంపట్నం: రాఖీ పండుగ రోజున ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డీపోనకు రూ.41లక్షల ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి పథకం నుంచి రూ.27లక్షలు కాగా నగదు రూపేనా రూ.14లక్షల ఆదాయం వచ్చింది. డిపోలో 86 ఆర్టీసీ, 61 అద్దె బస్సులుండగా పండుగ రోజున అదనంగా మరో 11 సర్వీసులు అదనంగా పెంచారు. పండుగ రోజున 40 వేల మంది ప్రయాణికుల్లో 25 వేల మంది మహిళలు ఉన్నారు. మాల్ నుంచి మహాత్మాగాంధీ(ఎంజీబీఎస్), సికింద్రాబాద్ రూట్లలో ఎక్కువ ఆదాయం సమకూరింది. వర్షం, ట్రాఫిక్ జామ్ కారణంగా సకాలంలో బస్సులు రాకపోకలు సాగించక పెట్టుకున్న టార్గెట్కన్నా రూ.70 వేల ఆదాయం తక్కువగా వచ్చింది. ఈ డిపోకు నిత్యం సుమారు రూ.28 లక్షల ఆదాయం వస్తుంది. రాఖీ పర్వదినాన రూ.13 లక్షల ఆదాయం అదనంగా సమకూరింది. ఆదాయం పెరిగింది రాఖీ పర్వదినాన ఆర్టీసీ ఆదాయం పెరిగింది. మహిళ ప్రయాణికులు సుమారు 25 వేల మంది ఉచితంగా ప్రయాణించారు. డిపోకు రూ.41 లక్షల ఆదాయం సమకూరింది. ట్రాఫిక్ జామ్ కారణంగా అనుకున్న టార్గెట్ సాధించలేకపోయాం. – వెంకట నర్సప్ప, డిపో మేనేజర్, ఇబ్రహీంపట్నం -
సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచుతాం
మొయినాబాద్: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కృష్టి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడలో చిలుకూరు, బాకారం, నవాబ్పేటకు సంబంధించిన 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ.. సోలార్ ఉత్పత్తిని పెంచడంకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ఇప్పటికే అదేశాలిచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పూర్తిగా సోలార్ విద్యుత్ను అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ, దేవాదాయ, ఇరిగేషన్ భూముల్లో అనుకూలతను బట్టి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ పంపిణీ వ్యవస్థను సైతం పెంచేందుకు కొత్తగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని.. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం కోసం రాష్ట్రంలో 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొయినాబాద్ ప్రాంతంలో పట్టణీకరణ పెరుగుతుండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంత విద్యుత్ అవసరాల కోసం 132 కేవీ సబ్ స్టేషన్ను మంజూరు చేస్తున్నామని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్కుమార్, విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్అలీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సభా వేదిక ఏర్పాటు చేసిన టెంట్ల కింద చేరిన వర్షం నీరు -
పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు
● సమన్వయంతో సమస్యలు లేకుండా చూడాలి ● కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వీఐపీలు, అధికారులు, మీడియా ఇతరులకు సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్య అథితి సందేశం రూపొందించేదుకు ఆయా శాఖలు సాధించిన ప్రగతి నివేదికలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి పంపాలన్నారు. వేడుకలకు హాజరయ్యే అతిథికి గౌరవ వందనంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దని విద్యుత్ అధికారులకు సూచించారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓకు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏఓ సునీల్కుమార్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కె.శ్రీనివాస్, డీఆర్ఓ సంగీత ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
గంట్లవెళ్లి ఎంపీపీఎస్లో ఫ్యాన్లు ధ్వంసం
షాద్నగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని గంట్లవెళ్లి ప్రాథమికోన్నత పాఠశాల(ఎంపీపీఎస్)లో సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాల హెచ్ఎం శ్రీధర్రెడ్డి దాతల సహకారంతో విద్యార్థుల సౌకర్యార్థం తరగతి గదుల్లో, వరండాలో సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు. వరుస సెలవులు ఉండడంతో వరండాలోని ఫ్యాన్లను దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు పాఠశాల మైదానంలో ఆడుకునేందుకు వస్తుంటారని.. వారిలో ఎవరైనా ఈ పని చేసి ఉంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి తదిపరి చర్యలు తీసుకుంటామని హెచ్ఎం శ్రీధర్రెడ్డి తెలిపారు. -
ఎన్ఐఎంయూ, ఎఫ్సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన
కందుకూరు: ఫ్యూచర్సిటీ భూముల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐఎంయూ), ఎఫ్సీడీఏ (ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ) కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ (ఎంఓహెచ్యూఏ) కార్యదర్శి కె.శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషన్ ఆర్వీ కర్ణన్ తదితరులు సోమవారం మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూలోని సర్వే నంబర్ 112 లోని భూమిని పరిశీలించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కోసం గతంలో కేటాయించిన 20 ఎకరాలు, ఎఫ్సీడీఏ కార్యాలయం కోసం అదే సర్వే నంబర్లో 7.20 ఎకరాలను క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు. వారి వెంట ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థ పటిష్టానికి కృషి రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేశ్ మాడ్గుల: విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. సోమవారం ఆయన మాడ్గుల జెడ్పీహెచ్ఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఫౌండేషన్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి సర్కార్ బడులను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దూర ప్రాంత విద్యార్థులకు స్కూల్ బస్లు ఏర్పాటు చేస్తామన్నా రు. త్వరలో 317 జీఓ రద్దు చేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని.. విద్యార్థుల భవిష్యత్ కోసం మరో గంట సమయం వెచ్చించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సర్ధార్ నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తది తరులు పాల్గొన్నారు. అయ్యో అవంతిక యాచారం: రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిని పంచాయతీ ట్రాక్టర్ పొట్టన పెట్టుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోనలి నక్కర్తమేడిపల్లికి చెందిన వన్నాడపు బీరప్ప, మానస దంపతుల కూతురు అవంతిక(3) సోమవారం సాయంత్రం ఇంటి ఎదుట ఆడుకుంటోంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడిపే జంగయ్య మద్యం మత్తులో చిన్నారిని బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. చిన్నారిని ఢీకొట్టిన డ్రైవర్ నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపారు. నిమ్స్లో సుందరీకరణ పనులు షురూ.. లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో సుందరీకరణ పనులకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఆస్పత్రి ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 8న ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దోనెపూడి చక్రపాణి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రణీత్ కౌర్తో కలిసి డైరెక్టర్ బీరప్ప భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు హెచ్ఎండీఏ రూ.4 కోట్ల నిధులు కేటాయించింది. ఆ మేరకు సోమవారం ఆస్పత్రి ప్రాంగణాన్ని అహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు కాంట్రాక్టర్ పనులను ప్రారంభించారు. తొలుత క్లీనింగ్ పనులకు సమాయత్తమయ్యారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణమంతా పచ్చదనంతో కనువిందు చేసేలా గార్డెనింగ్ పనులు చేపడతారు. -
కరెంటోళ్లకు దండాలు
మరమ్మతుల కోసం స్తంభం ఎక్కుతున్న లైన్మెన్ చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం వద్దకు వెళ్తున్న శ్రీకాంత్ ప్రజలకు వెలుగులు పంచే క్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వేములనర్వ గ్రామ పరిధిలోని చౌదరిగూడ ఫీడర్కు కరెంట్ సరఫరా చేసే స్తంభంపై ఆదివారం రాత్రి అంతరాయం ఏర్పడింది. ఏఈ ఈశ్వర్, లైన్ ఇన్స్పెక్టర్ రాజు, అసిస్టెంట్ లైన్మెన్ శ్రీకాంత్ సోమవారం ఉదయం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇప్పలపల్లి చెరువులోని స్తంభంపై ఇన్సులేటర్ కాలిపోయినట్లు అసిస్టెంట్ లైన్మెన్ శ్రీకాంత్ గుర్తించాడు. స్థానిక రైతు శ్రీనివాస్రెడ్డి సాయంతో నీట మునిగిన స్తంభంపైకి ఎక్కి ఇన్సులేటర్ బిగించి సమస్యను పరిష్కరించారు. ఇది చూసిన స్థానిక ప్రజలు, రైతులు కరెంటోళ్లకు దండాలు అంటూ ధన్యవాదములు తెలియజేశారు. – కేశంపేట -
స్వచ్ఛంద సేవలు అభినందనీయం
శంకర్పల్లి: టీచ్ ఫర్ చేంజ్, వేనీరావు ఫౌండేషన్ సేవలు అభినందనీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని జన్వాడ జెడ్పీహెచ్ఎస్లో టీచ్ ఫర్ చేంజ్, వేనీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు శానిటరీ ఫ్యాడ్స్, విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ మంచు లక్ష్మీప్రసన్న, వేనీ రావు ఫౌండేషన్ చైర్పర్సన్ రత్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచు లక్ష్మీప్రసన్న సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సంస్థని స్థాపించి, విద్యార్థులకు సాయం చేయడం గొప్ప విషయమన్నారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. 11 ఏళ్ల క్రితం సంస్థను ఏర్పాటు చేశామని.. భవిష్యత్లో మరింత విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జన్వాడ పాఠశాలలో ఒక స్మార్ట్ తరగతి గది నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని.. రానున్న రోజుల్లో మరో మూడు అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అక్బర్, శంకర్పల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, నాయకులు గోపాల్రెడ్డి, ప్రవీణ్, నర్సింహ, వెంకట్రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ గృహప్రవేశం
షాద్నగర్: ఇందిరమ్మ పథకంలో భాగంగా హాజిపల్లిలో నిర్మించిన ఓ ఇంటిని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన ఒంటరి మహిళ స్వరూపకు ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి విడతల వారీగా లబ్ధిదారుకు డబ్బులు అందడంతో మూడు నెలల్లో పనులు పూర్తి చేయించింది. గృహ ప్రవేశ వేడుకకు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే హాజిపల్లికి వెళ్లారు. నియోజకవర్గంలో తొలి ఇంటిని పూర్తి చేసిన స్వరూపతో పాటు ఆమె కూతురు, అల్లుడికి నూతన వస్త్రాలు అందించి, సారె పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు రాగా వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా విడతలవారీగా డబ్బులు జమ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్ఖాన్, చల్లా శ్రీకాంత్రెడ్డి, కృష్ణారెడ్డి, బాల్రాజ్గౌడ్, కొంకళ్ల చెన్నయ్య, హాజిపల్లి దర్శన్, శ్రీనివాస్, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏఈఈలకు పదోన్నతులు
డీఈఈలుగా ప్రమోషన్, బదిలీ కేశంపేట: ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఐదుగురికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పదోన్నతులు లభించాయి. షాద్నగర్ పరిధి ఫరూఖ్నగర్ మండలంలో ఏఈఈగా పనిచేస్తున్న సుజాతను నారాయణపేటకు, కొందుర్గు మండలంలో పనిచేస్తున్న క్రాంతిని వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్ఈ కార్యాలయానికి, కేశంపేటలో విధులు నిర్వర్తిస్తున్న గీతను వనపర్తికి, రేఖను జహీరాబాద్, మాధవిని జగిత్యాల జిల్లాకు బదిలీ చేస్తూ, ప్రమోషన్లు కల్పించారు. విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి కొందుర్గు: విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందిన ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివారలు.. గ్రామానికి చెందిన రాయికంటి బలరాం పాడిగేదెలను పోషిస్తూ జోవనోపాధి పొందుతున్నాడు. పాడిగేదెను మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కుగురై అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. గుంతల రోడ్డుపై నిరసన యాచారం: వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని తక్కళ్లపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తక్కళ్లపల్లి– తక్కళ్లపల్లి గేట్ మధ్యన ధ్వంసమైన రహదారిపై వరి నాటు వేసి నిరసన వ్యక్తంచేశారు. అధ్వానంగా మారిన రోడ్డుతో ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ, పంచాయతీరాజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆందోళన చేసిన వారిలో బీజేపీ నాయకులు పగడాల శ్రీశైలం, కుమార్ యాదవ్, డాక్టర్ సురేందర్, గడల సురేష్, బాబురావు, నర్సింహ, అంజయ్య, రాములు ఉన్నారు. మలక్పేట: విద్యుదాఘాతంతో ఓ ఉద్యోగి మృతి చెందిన సంఘటన సోమవారం మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ తెలిపిన మేరకు.. మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్లో ఎఫ్ఓసీ ఫీల్డ్ వర్కర్ ఆర్టిసన్ ఉద్యోగి అంజద్(42) విధినిర్వహణలో ఉండగా కరెంట్ షాక్తో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుగ్గ రామేశ్వరఆలయ పునఃనిర్మాణానికి కృషి
కంచి పీఠం ఆస్థాన పండితులు నారాయణ చక్రధర శర్మ షాబాద్: బుగ్గ రామేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని కంచి పీఠం ఆస్థాన పండితులు నారాయణ చక్రధర శర్మ అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కొమరబండ గ్రామంలోని బుగ్గరామేశ్వరాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామేశ్వరాలయం వాస్తు ప్రకారం ఎలా నిర్మిస్తే బాగుంటుందో చెప్పాలని గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని కొలను ఆధునికీకరణ, గ్రామం నుంచి ఆలయం వరకు బీటీ రోడ్డు వేయాలన్నారు. దుకాణ సముదాయాలు తదితర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, గ్రామస్తులు గోపాల్, తదితరులున్నారు. 14 వరకు ‘వాయిస్ ఫర్ బాయిస్’ కడ్తాల: మైసిగండి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రారంభమైన శారీరక, మానసిక, సామాజిక అవగాహన శిక్షణ శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా గిరిజన సంక్షేమాధికారి రామేశ్వరిదేవి, ఐటీడీఓ వెంకటయ్య ఆదేశాల మేరకు వాయిస్–4 సంస్థ ఆధ్వర్యంలో ఐటీడీఏ సహకారంతో ఈ నెల 5వ తేదీన శిబిరం ప్రా రంభించారు. సోమవారం ప్రోగ్రాం చీఫ్ ఫర్హాన్ మాట్లాడుతూ.. పాఠశాలలోని 7, 8, 9వ తరగతి విద్యార్థులకు శారీరక, మానసిక, సామాజిక అవగాహనను పెంపొందించే అంశాలతో పాటు, నేటి సమాజంలో సమానత్వపు దృక్పథాన్ని కలిగించడానికి ‘వాయిస్ ఫర్ బాయిస్’ప్రారంభించామన్నారు. ఈ నెల 14 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. బాలురకు, మహిళలపై గౌరవం, సానుభూతి, ఆత్మనియంత్రణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, సమాజంలో గౌరవంగా జీవించడం, ఇతరులతో మర్యాద పూర్వకంగా మెలగడం, ఉన్నత విద్యను అభ్యసించడం, ఆత్మస్థైర్యం పెంపొందించడం, ధైర్యంగా జీవించడం లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పాపయ్య, హెచ్డబ్ల్యూఓ బాలరాజు, ఉపాధ్యాయులు నయీముద్దీన్, సంతోశ్కుమార్, శ్రీశైలం, సురేశ్, భగవతి, మహేశ్వరి, పీడీ మంజుల, సంస్థ కోఆర్డినేటర్లు ఉన్నారు. -
బాల్యానికి మూడుముళ్లు
అధికారులు అడ్డుకుంటున్నా ఆగని బాల్యవివాహాలు ‘నందిగామ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13)కు మానసిక వైకల్యంతో బాధపడుతున్నకందవాడకు చెందిన ఓ వ్యక్తి(36)తో మే 28న నందిగామ శివారులోని ఓ ఆలయంలో వివాహమైంది. నిజానికి ఈ పెళ్లి ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని సదరు చిన్నారి పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయగా, వారు పోలీసు, రెవెన్యూ, సీ్త్రశిశు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి కుమారుడు, మధ్యవర్తి, పురోహితుడు, బాలిక తల్లిపై నందిగామ ఠాణాలో కేసు నమోదు చేసి బాధితురాలిని సఖీ కేంద్రానికి తరలించాల్సి వచ్చింది’అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ బాల్య వివాహాలు వెలుగు చూస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అభివృద్ధిలో అంతర్జాతీయ దేశాలతో పోటీ పడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అదే స్థాయిలో సామాజిక వెనుకబాటుతనం వెంటాడుతోంది. నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలకు ఆర్థిక అసమానతలు తోడయ్యాయి. ఫలితంగా 18 ఏళ్ల తర్వాత జరగాల్సిన అమ్మాయిల వివాహ తంతు.. 14 ఏళ్లకే ముగుస్తోంది. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోబోనని, అందరిలాగే తాను ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా.. తల్లిదండ్రులు వినిపించుకోవడం లేదు. బలవంతపు పెళ్లిళ్లకు పాల్పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో బాలికలు అత్యవసర ఫోన్ నంబర్లను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది నమోదైన బాల్య వివాహాలను పరిశీలిస్తే.. ఇదే విషయం స్పష్టమవుతోంది. గత ఏడాది అత్యధిక బాల్య వివాహాలు వెలుగు చూసిన జిల్లాలో జాబితాలో వికారాబాద్(94) ముందు వరుసలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి(54), మేడ్చల్ (53) జిల్లాలు ఉండడం గమనార్హం. ఐటీ చదువులకు, అంతర్జాతీయ పెట్టుబడులకు నిల యంగా మారిన ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, బాల్య వివాహాలు వెలుగు చూస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక అంతరాలే అసలు కారణం అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు రాకతో జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జిల్లాలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, సైబర్సిటీ, నానక్రాంగూడ, కోకాపేట్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ.వంద కోట్లకుపైగా పలుకుతోంది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్లు ఓఆర్ఆర్కు ఇరు పక్కలా హైరైజ్ భవనాలే దర్శనమిస్తున్నాయి. ఐటీ, వాటి అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు భారీగా వచ్చి చేరడంతో ప్రజల జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో నిలిచిన జిల్లా కూడా ఇదే. ఇలాంటి కీలకమైన జిల్లాలో ఇప్పటికీ అంతరాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఉన్నవాడు మరింత ఉన్నవాడిగా, లేని వాళ్లు మరింత లేనివాళ్లుగా మారుతున్నారు. సామాజిక వెనుకబాటుకు ఆర్థిక పరమైన అంశాలు తోడవడంతో కడుపున పుట్టిన పిల్లలను వదిలించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల శంషాబాద్ మండలంలో ఓ తల్లి అప్పుడే పుట్టిన బిడ్డను ఇతరులకు అమ్ముకుని పట్టుబడగా, ఉన్నత చదువులు చదివించి, బిడ్డను మరింత ప్రయోజకురాలిని చేయాల్సిన మరో తల్లి ఏకంగా తన బిడ్డకంటే రెట్టింపు వయసున్న వ్యక్తికి కట్టబెట్టేందుకు సిద్ధపడింది. అంతర్జాతీయ వేదికపై ఓ వెలుగు వెలుగుతున్న ఉమ్మడి జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా.. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, పైసా ఖర్చు లేకుండానే ఉన్నత చదువులు చెప్పిస్తున్నా.. వివాహం, ఇతర అంశాలకు వచ్చే సరికి తల్లిదండ్రుల ఆలోచన భిన్నంగా ఉంటోంది. అభం శుభం తెలియని వయసులో పెళ్లి చేస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. -
ఆర్టీసీకి గిరాఖీ
మూడు రోజులు.. రూ.1.20 కోట్ల ఆదాయం ఇలాషాద్నగర్: రాఖీ పండుగ సందర్భంగా షాద్నగర్ డిపో నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సు లను నడిపించారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు 1.65లక్షల మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఫలితంగా సంస్థకు మూడు రోజుల్లో రూ.1.20లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్, మహబూబ్నగర్ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ రూట్లలో అధికారులు స్పెషల్ సర్వీసులు పెంచి ఆదాయం గడించారు. ‘మహాలక్ష్మి’ల ప్రయాణం రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక. ఈ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 1.09లక్షల మందికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. ఈనెల 8న 29,594 మంది 9న 42,072 మంది, 10న 38,262 మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.77.24 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో పండుగ ఒక్క రోజే రూ.31లక్షలకు పైగా ఆదాయం చేరింది. రద్దీకి అనుగుణంగా బస్సులు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపించారు. అదనపు ట్రిప్పులతో పాటు, హైదరాబాద్ ఇతర డిపోల నుంచి బస్సులను తెప్పించి నడిపించారు. డ్రైవర్లు, కండక్టర్లు అధికారులు సిబ్బంది పండుగ రోజు సెలవులను పక్కన పెట్టి విధి నిర్వహణలో భాగస్వామ్యమై సంస్ధకు ఆదాయం సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు.11 ఎస్డిఎన్ఆర్ 803 బీ) ఉష, ఆర్టీసీ డిపో మేనేజర్, షాద్నగర్ రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపాం రాఖీ పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులు నడిపించాం. ఫలితంగా మూ డు రోజుల్లో 1.65 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. ఫలితంగా సంస్ధకు రూ .1.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. – ఉష, ఆర్టీసీ డిపో మేనేజర్, షాద్నగర్ తేదీ ప్రయాణికులు వచ్చిన ఆదాయం 8న 47,540 రూ.27.98 లక్షలు 9న 61,076 రూ.47.03 లక్షలు 10న 56,988 రూ.45.71 లక్షలు -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
షాద్నగర్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం దేవునిగుడితండాకు చెందిన కేతావత్ దేవ్లీ(70) ఈ నెల 7న మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజీపూర్ గ్రామ పంచాయతీ పరిఽధి ఉడిత్యాలతండాలో ఉంటున్న కూతురు వద్దకు వెళ్లింది. తిరిగి ఆదివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ఆమె షాద్నగర్కు వచ్చింది. గిరిజనుల అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తుండగా.. స్థానికంగా డయోగ్నిస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్ శ్వేత తన కారును పార్కింగ్ చేసే క్రమంలో దేవ్లీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం అంబులెన్స్లో తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి కొడుకు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
ధీమా ఇవ్వని బీమా
కేశంపేట: రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతుబీమాను ప్రవేశ పెట్టింది. అందుకు 18 నుంచి 59 ఏళ్లవారిని అర్హులుగా పేర్కొంది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి ఆధార్కార్డు, నామిని వివరాలతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను జతచేసి ఉన్న దరఖాస్తులను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించారు. అలా వారు సేకరించిన ఆధారాల ప్రకారం.. బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించింది. అనంతరం రైతుల పేరిట బీమా సంస్థ జారీ చేసిన ఐడీ నంబర్తో కూడిన బాండ్లను వ్యవసాయశాఖ.. రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు బాండ్లు తమకు అందలేదని, బీమా ఉందన్న ధీమా లేకుండా పోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. అధికారులే బాధ్యులు? బీమా పత్రాల్లో తప్పులు ఉంటే మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులే బాధ్యులని ప్రభుత్వం గైడ్లైన్స్లో పేర్కొంది. రైతులు తమ ఆధార్కార్డులో ఇంటిపేరు, పేరు, వయస్సు లాంటి వివరాలను మార్చుకుంటే క్లయిమ్ సమయంలో ఇబ్బందులు వస్తాయని, దీనికి అధికారులే బాధ్యతను వహించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆధార్కార్డులో మార్పులు, చేర్పులు, పుట్టిన తేది, నామిని తదితర వివరాలను మార్చుకోవాలని అనుకుంటే.. విస్తరణ అధికారులను సంప్రదించి బీమా నమోదులో సవరణ చేసుకోవాలని రైతులకు అవగాహనను కల్పించాల్సి ఉంటుంది. అవగాహన కరువు పత్రాల్లో ఏమైనా తప్పులు ఉంటే దానిని సరిచేసుకోవడానికి రెనివల్ సమయంలో అవకాశం కల్పించారు. అయితే బాండ్లు అందకపోవడంతో.. అందులో తప్పులు ఉన్న విషయం తెలియకపోవడం వలనే రైతులు మార్చుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఈ నెల 12 వరకు మాత్రమే మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు.. ఈ నెల 13 వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. కాగా.. బీమా ఉన్నప్పటికీ.. పత్రాలు అందక పోవడంతో అందులో తప్పులు ఏమున్నాయో తెలియడం లేదని రైతులు పేర్కొనడం గమనార్హం. 2019 నుంచి.. పథకం ప్రారంభంలో అర్హులైన రైతులకు ప్రభుత్వం బాండ్లను అందజేసింది. 2019 నుంచి ఇవ్వడం లేదు. దీని కారణంగా అందులో తప్పులు ఏమున్నాయో రైతులకు తెలియడం లేదు. ఏమైనా తప్పుడు సమాచారం ఉంటే.. భవిష్యత్లో రైతు కుటుంబ సభ్యులు క్లయిమ్కు వెళ్లినప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇప్పటి వరకు అఫిడవిట్ను వ్యవసాయ అధికారులకుసమర్పించి, క్లయిమ్ పొందేవారు. కానీ ఇప్పుడు అఫిడవిట్ లేదని, బీమా పత్రం ఆధారంగానే చెల్లింపు ఉన్నట్లు సమాచారం. ఎత్తివేసేందుకు కుట్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదు. గత ప్రభుత్వం తెచ్చిన రైతుబీమా పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే కొత్తగా నమోదు చేసుకునేందుకు మూడు రోజుల గడువే ఇచ్చింది. బీమా చేసుకున్న వారికి పత్రాలు అందజేయలేదు. – నవీన్కుమార్, మాజీ సర్పంచ్, కొత్తపేట బాండ్లు ఇవ్వాలి ప్రభుత్వాలు రైతులకు బీమా బాండ్లను అందించలేదు. వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే క్లయిమ్ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పవు. పత్రాలను అందజేస్తే.. మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం వెంటనే బీమా పత్రాలను రైతులకు అందజేయాలి. – నరేందర్రెడ్డి, సంతాపూర్ రైతులకు అందని పత్రాలు తప్పుల సవరణకు సమీపించిన గడువు రేపటితో ముగింపు అవగాహన లోపంతో అన్నదాతలు క్లెయిమ్లో తప్పని తిప్పలు -
కొండెక్కిన కూరగాయలు
నవాబుపేట/మోమిన్పేట: రోజురోజుకూ మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఏది కొందామన్నా కొండెక్కి కూర్చొని సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికితోడు నిత్యావసర వస్తువుల ధరలు సైతం అమాంతం పెరగడంతో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. భగ్గుమంటున్న ధరలను అదుపు చేసేందుకు పాలకులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నవాబుపేట, తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న తదితర వాణిజ్య పంటలు అధికంగా సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వర్షాలు సమయానికి కురవకపోవడం కూరగాయలు, పప్పుదినుసుల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో కాయకూరలకు ధరలు బాగా పెరిగాయి. రెట్టింపైన నిత్యావసరాలు కూరగాయలకు తోడు నిత్యావసర సరుకుల ధరలు నెల రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో పెసర్లు కిలోకి రూ.120, మినుములు కిలో రూ.100, బొబ్బర్లు రూ.90. ఉలువలు రూ.100, పచ్చజొన్నలు రూ.40, ధనియాలు రూ.100, వెల్లుల్లి రూ.100, మినపపప్పు రూ.130, శనగ రూ.70 పలుకుతున్నాయి. కోడిగుడ్డు ధర ప్రస్తుతం రూ.6 ఉంది. పెరిగిన ధరలను చూసి వినియోగదారులు జంకుతున్నారు. నిత్యం కూలినాలీ చేసుకొని జీవించే శ్రమజీవులు పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. శాకాహార ప్రియులతో.. శ్రావణమాసంలో మెజార్జీ హిందువులు మాంసాహారానికి దూరంగా ఉంటారు. కూరగాయల ధరల పెరుగుదలకు ఈ అంశం కూడా కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో కూరగాయలు, ఆకు కూరలతో చేసిన వంటలే ఉపయోగిస్తారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెజిటెబుల్స్ వినియోగం అమాంతం పెరిగింది. అందుకే ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. వికారాబాద్ మార్కెట్లో కూరగాయల ధరలు రకం ధర(కిలోకి) పచ్చిమిర్చి రూ.120 మునగకాయలు రూ.120 చిక్కుడు రూ.100 బీన్స్ రూ.100 క్యాప్సికం రూ.80 బెండకాయ రూ.80 బీరకాయ రూ.80 క్యారెట్ రూ.60 టమాట రూ.60 వంకాయ రూ.60 ఉల్లిగడ్డ రూ.60 సొరకాయ(ఒక్కటి) రూ.15ధరలు పెరగడంతో సామాన్యుల తిప్పలు అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ సాగు తగ్గడమే కారణమని విశ్లేషణ -
వర్షాకాలం.. విద్యుత్తో భద్రం
స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సర్వీస్ వైర్లతో ప్రాణాలకు ముప్పు యాలాల: వర్షాకాల నేపథ్యంలో తరచూ వ్యవసాయ బోర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. రైతులు విద్యుత్ సరఫరా కోసం తామే స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు మార్చడం, తీగలు సరిచేయడం చేస్తుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం. కరెంటు విషయంలో నిపుణులైన ట్రాన్స్కోసిబ్బంది వచ్చి సమస్య పరిష్కరించేంత వరకురైతన్నలు ఓపిక పట్టాలని ట్రాన్స్కో ఉన్నతాధికారులు సూచనలిస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు ఘటనల నేపథ్యంలో మండల ట్రాన్స్కో ఇన్చార్జ్ ఏఈ రఘువీర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ● రైతులు పొలాల వద్ద ఏర్పడే కరెంటు సమస్యల విషయంలో సొంతంగా మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు రావొద్దు. సమస్య వస్తే వెంటనే స్థానిక లైన్మెన్ లేదా ఏఈకి సమాచారం ఇవ్వాలి. ● వర్షాకాలం నేపథ్యంలో బోర్ల వద్ద, సర్వీస్ వైర్లు ముట్టుకునే సమయంలో భూమిపై తడి ఉంటే, తప్పనిసరి తగు భద్రత చర్యలు తీసుకొని ముందుకు వెళ్లాలి. కాళ్లకు తప్పనిసరిగా రబ్బరు చెప్పులు ధరించాలి. తడి చేతులతో ఎట్టి పరిస్థితుల్లో స్టార్టరు, బోర్లు, సర్వీసు వైర్లను తాకవద్దు. ● పొలాల్లోని స్తంభాలపై తీగలు తెగినప్పుడు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు ఎగిరినప్పుడు ట్రాన్స్కో అధికారులను సంప్రదించాలి. అలా కాకుండా అనధికార వ్యక్తులు స్తంభాలు ఎక్కడం నేరం. విద్యుత్ అధికారులు స్థానిక సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకొని మరమ్మతులకు పూనుకుంటారు. ● రైతులు కరెంటు విషయాల్లో కాస్త ఓపికగా ఉంటే ఎంతో మేలు. అరగంట, గంట ఆలస్యమైన ట్రాన్స్కో సిబ్బంది సమస్య ఉన్న ప్రాంతానికి వచ్చేంతవరకు ఆగండి. అంతేకానీ ఆలస్యమవుతుందనే భావనలో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ● విద్యుత్ సమస్య పరిష్కారంలో నిపుణులైన ట్రాన్స్కో సిబ్బంది, రక్షక పరికరాలతో విద్యుత్ స్తంభం ఎక్కడం, మరమ్మతులు చేయడం, కనెక్షన్ ఇవ్వడం, ఫ్యూజులు మార్చడం చేస్తుంటారు. ఈ విషయంలో కర్షకులు ట్రాన్స్కో సిబ్బందికి సహకరించాలి. ● రైతులు తమ వ్యవసాయ బోర్ల వద్ద, కరెంటు స్తంభాల వద్ద, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ బుడ్డీలు ఏర్పాటు చేసిన ప్రదేశం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గడ్డి, కంపచెట్లు, ఇతర మొక్కలు పెరగకుండా తొలగిస్తూ ఉండాలి. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా భూమి చదునుగా ఉండేలా చూడాలి. ● ప్రమాదవశాత్తు రైతులు కానీ, మూగ జీవాలు కానీ మరణిస్తే శాఖ పరంగా ఆర్థికపరమైన సాయం బాధిత కుటుంబాలకు అందుతుంది. ప్రమాద అనంతరం సంబంధిత పత్రాలు, వివరాలను ట్రాన్స్కో సిబ్బందికి అందజేస్తే 60 రోజుల్లో పరిహారం అందే అవకాశం ఉంది. పొలాల వద్ద రైతుల అప్రమత్తత అవసరం సమస్యలుంటే ట్రాన్స్కో సిబ్బందికిసమాచారం ఇవ్వాలి రఘువీర్, ట్రాన్స్కో ఇన్చార్జ్ ఏఈ -
ఎమ్మెల్యే మల్రెడ్డి ఇంట్లో విషాదం
హయత్నగర్: రాఖీ పౌర్ణమి రోజున ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే అక్క వంగేటి భూదేవి(75) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి చనిపోయారు. ఆమెకు ఒక అక్క, తమ్ముళ్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మండల పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మల్రెడ్డి యాదిరెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డితో పాటు ఒక సోదరి ఉన్నారు. ఆమె మృతితో స్వగ్రామం తొర్రూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. -
చెరువుకు జలకళ
తుర్కయంజాల్: వరుస భారీ వర్షాలతో తుర్కయంజాల్ మాసబ్ చెరువుకు జలకళ సంతరించుకుంది. వరద పోటెత్తడంతో అలుగు పారుతోంది. శనివారం సాయంత్రం కురిసిన వానతో చెరువు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు ప్రవహిస్తోంది. దీంతో సాగర్ రహదారిపై నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు.. ప్రవాహాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఇంజాపూర్లోని ఆపిల్ అవెన్యూ కాలనీలో ఇళ్ల మధ్యలో వాగుపై నిర్మించిన రోడ్డుపై అడుగున్నర మేర నీరు ప్రవహించింది. ఈ కాలనీలో గతంలో వెంచర్ నిర్వాహకులు.. వాగును కబ్జా చేసి దానిపై మూడు అడుగుల నాలాను నిర్మించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురిసి.. చెరువు అలుగు పారినప్పుడు నీరు, కృత్రిమంగా నిర్మించిన నాలా పొంగి, ఇలా ఇళ్ల మధ్య నుంచి ప్రవహిస్తుంటుంది. ఇళ్లనుముంచెత్తుతుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు వరద కొంత తగ్గుముఖం పట్టింది. దీంతో స్థానికులు చేపలను పట్టేందుకు ఉత్సాహం చూపారు. ఇంజాపూర్లోని ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల చుట్టూ వరద చేరింది. దిలావర్ఖాన్ చెరువు నీరు ఉధృతంగా పరుగులు తీస్తోంది. భారీ వర్షాలతో అలుగు పోస్తున్న మాసబ్ చెరువు ఇళ్ల మధ్య ప్రవహిస్తున్న వరద -
ఉధృతంగా ప్రవహిస్తున్న ఈసీ వాగు
చేవెళ్ల: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఎగువ ప్రాంతాలైన వికారాబాద్ జిల్లా పూడూరు, పరిగి ప్రాంతాలతోపాటు చేవెళ్ల మండలంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద వాగులో వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే హిమా యత్సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి ఒక అడుగు తక్కువగా ఉండడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈసీ వాగులో వరద పెరగడంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మరోవైపు వురుస వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రారంభమైన పనులకు శంకుస్థాపన
మొయినాబాద్: ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమానికై నా నిధులు మంజూరైన వెంటనే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతారు. కానీ మున్సిపల్ పరిధి లో విద్యుత్ అధికారులు మాత్రం వింతపోకడ అవలంబిస్తున్నారు.ఆరు నెలల క్రితమే పనులు మొద లైన కొనసాగుతున్న విద్యుత్ సబ్స్టేషన్కు సోమ వారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు చేతులమీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడ రెవెన్యూలో 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. ఆరు నెలల క్రితమే పనులు మొదలు పెట్టారు. సబ్స్టేషన్లో ఏర్పాటు చేసే ట్రాన్స్ఫార్మర్లు సైతం తెచ్చారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ సమయంలో శంకుస్థాపన చేపట్టడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా డిప్యూటీ సీఎం, మంత్రి రాక సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. రేషన్ కార్డుల పంపిణీ విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు చేతులమీదుగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మండల తహసీల్దార్ గౌతమ్కుమార్ తెలిపారు. కార్యక్రమానికి లబ్ధిదారులు, అధికారులు హాజరు కావాలని సూచించారు. ముర్తూజగూడలో ఏర్పాటవుతున్న విద్యుత్ సబ్స్టేషన్ ఆరు నెలల క్రితమే మొదలై కొనసాగుతున్న పనులు నేడు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు స్థానికంగా చర్చనీయాంశం -
‘నులి’మేద్దాం
● నేటి నుంచి నులి పురుగులనిర్మూలన కార్యక్రమం ● 1 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు షాద్నగర్: చిన్న పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగులను నివారించేందు కు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 1 నుంచి 19 ఏళ్లలోపు చిన్నారులు, కిశోర బాలిలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనుంది. సోమవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ స్కూళ్లలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిశుభ్రతే ప్రధానం అపరిశుభ్రతతోనే నులిపురుగులు శరీరంలో ప్రవేశిస్తుంటాయి. మట్టిలో ఆడుకోవడం, అదే చేతులతో ఆహార పదార్థాలు తినడం వంటివి చేస్తుంటారు. దీంతో మట్టిలో ఉన్న పురుగులు నోటి ద్వారా పేగుల్లోకి చేరి అక్కడ తిష్టవేస్తాయి. పేగులో ఉన్న ఆహారంలోని పోషకాలను గ్రహిస్తూ మెల్లగా వృద్ధి చెందుతాయి. దీంతో చిన్నారుల్లో రక్తహీనత ఏర్పడుతుంది. నులిపురుగులు పెరిగి కడుపునొప్పి, వాంతులు, విరోచనాలకు దారి తీస్తుంది. ఒక్కోసారి చిన్నారులు తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. చేతులను, చేతి గోళ్లను శుభ్రం చేసుకునేలా, పరిశుభ్రమైన నీటిని తాగేలా వారికి చిన్నతనం నుంచి నేర్పించాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి, ఇతర మందులు వాడుతున్నవారికి, ఫిట్స్ ఉన్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యశాఖ మార్గ దర్శకాల ప్రకారం 1–3 ఏళ్లలోపు చిన్నారుకుల సగం మాత్రను చెంచాలో పొడి చేసి కొంచం నీరు కలిసి తాగించాలి. 3–19 ఏళ్లలోపు చిన్నారులు, కిశోర బాలలకు పూర్తి మాత్రను ఇచ్చి బాగా నమిలి మింగమని చెబుతున్నారు. మాత్ర వేసిన తర్వాత కొద్ది మందిలో స్వల్ప దుష్ఫలితాలు కనిపిస్తాయని దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. తప్పనిసరి వేయించాలి చిన్నారుల ఆరోగ్య సంక్షేమానికి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 11న చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పని సరిగా వేయించాలి. – డాక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ, షాద్నగర్ -
ఫార్మా భూముల్లో హెలిక్యాప్టర్ చక్కర్లు
ఆసక్తిగా గమనించిన స్థానికులు యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన యాచారం, కందుకూరు మండలాల్లోని భూములపై ఆదివారం సాయంత్రం హెలిక్యాప్టర్ చక్కర్లు కొట్టింది. యాచారం మండల పరిధిలోని కుర్మి ద్ద, తాడిపర్తి, నానక్నగర్, నక్కర్తమేడిపల్లి, కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్పేట, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో హెలిక్యాప్టర్ అతి దగ్గరగా చక్కర్లు కొట్టడం స్థానికులు ఆసక్తిగా గమనించారు. కొన్ని నెలలుగా రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీస్ అధికారులు ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే చేసి, ఫెన్సింగ్ వేశారు. వారం రోజులుగా పరిహారం ఇచ్చి సేకరించిన సర్వే నంబర్లలోని రైతుల వారీగా కబ్జా భూములను సర్వే చేస్తున్నారు. -
‘రియల్’ డీలా!
ఆర్థిక మాంద్యం, హైడ్రా ఎఫెక్ట్●● పడిపోయిన భూముల క్రయవిక్రయాలు ● భారీగా తగ్గిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: రియల్ భూం జిల్లాలో పడిపోయింది.అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభా నికి తోడు పెరిగిన భూముల ధరలు.. హైడ్రా కూల్చి వేతలతో ఆస్తుల క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం చూపాయి.రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రే షన్ల సంఖ్య భారీగా తగ్గింది. 2023 జన వరి నుంచి జూలై వరకు జిల్లావ్యాప్తంగా 1,47,091 ఆస్తులకు రిజిస్ట్రేన్లు కాగా వీటి ద్వారా రూ.2,157.60 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 జనవరి నుంచి జూలై ఆఖరి వరకు 1,50,247 రిజిస్ట్రేషన్లు కాగా, వీటి ద్వారా రూ. 2,481.58 కోట్ల రాగా.. తాజాగా ఏడు నెలల్లో 1,47,236 డాక్యుమెంట్ల ద్వారా రూ.2,518. 98 కోట్లు వచ్చాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ ఆదాయం పెరగడం కొసమెరుపు. కోవిడ్ సంక్షోభం తర్వాత కోవిడ్ సంక్షోభం తర్వాత రియల్ భూం ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. నగరానికి ఆనుకుని ఉన్న కోకాపే ట, నార్సింగి, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, శంకర్పల్లి, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, సరూర్నగర్, ఎల్బీనగర్, పెద్ద అంబర్పేట్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మణికొండ, తుక్కుగూడ, ఆది బట్ల, కొత్తూరు, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కోకాపేటలో ఎకరం ఏకంగా రూ.100 కోట్లకుపైగా పలికింది. ఓఆర్ఆర్కు అటు ఇటుగా కొత్తగా అనేక గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హైరేంజ్ అపార్ట్మెంట్లు వెలిశాయి. వీటిలోని ప్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు కొనుగోలు చేసేందుకు నగర వాసులే కాకుండా దేశవిదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు, బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపాయి. ఫలితంగా రోజుకు సగటున 750 నుంచి 1000 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేవి. రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేది. రోడ్డున పడ్డ కమీషన్ ఏజెంట్లు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఆస్తుల అమ్మకాలు మందగించాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గి ఆ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. భవిష్యత్తుపై ఆశతో భూములపై భారీగా పెట్టుబడి పెట్టిన చిరు వ్యాపారులు తమ వెంచర్లలోని ఖాళీ స్థలాలు అమ్ముడుపోక ఆర్థికంగా చితికిపోతున్నారు. అప్పటి వరకు రియాల్టీపై ఆధారపడిన కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం విలవిల్లాడిపోతున్నారు. ఒకప్పుడు ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారు ప్రస్తుతం రోజువారీ ఖర్చుల కోసం తమ వద్ద ఉన్న ఆస్తులు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉపాధి లేకపోవడంతో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోగా, మరికొంత మంది జీవితాలు రోడ్డునపడ్డాయి. జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు ఇలా.. మాసం 2023 2024 2025 జనవరి 18,942 18,818 18,174 ఫిబ్రవరి 20,477 22,272 18,880 మార్చి 23,253 21,451 23,552 ఏప్రిల్ 19,025 18,426 22,508 మే 23,184 19,448 22,144 జూన్ 21,121 21,103 20,116 జూలై 21,089 28,729 21,862 ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం (రూ.కోట్లలో) మాసం 2023 2024 2025 జనవరి 306.25 274.32 259.91 ఫిబ్రవరి 273.41 397.27 335.53 మార్చి 331.27 406.85 359.17 ఏప్రిల్ 325.00 319.30 383.82 మే 338.55 290.91 379.57 జూన్ 326.30 332.99 440.57 జూలై 256.82 459.94 360.61 -
ఐక్య పోరాటానికి సిద్ధంకండి
● 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన్వెస్లీ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధనకు రాష్ట్రం నుంచి ఎంపికై న బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని.. లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీసీ బిల్లును తేల్చకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. దీనిని సాకుగా చూపి పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయడంలేదన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తూ ఇక్కడ అడ్డుపడటం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు అనుకూలం అంటునే బండి సంజయ్, కిషన్రెడ్డి, రాంచంద ర్రావు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపించారు. రేవంత్ సర్కార్ అందరినీ కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని.. అందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.సామేల్, తాడిగళ్ల భాస్కర్, దుబ్బాక రామచందర్, ఏర్పుల నర్సింహ, బి. జగదీశ్, జిల్లా కమిటీ సభ్యులు ఆలంపల్లి నరసింహారావు, జంగయ్య, శ్రీనివాస్రెడ్డి, జి.నర్సింహ, కిషన్, రుద్రకుమార్, జగన్, సుమలత, విఘ్నేష్, పురుషోత్తం పాల్గొన్నారు. -
చెల్లెలిని చూసేందుకు వెళ్తూ..
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కడ్తాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలివీ.. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన కొమ్మరి శివకృష్ణ (24) కొంత కాలంగా హైదరాబాద్లో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఉండే చెల్లెలు స్వప్న క్రిమిసంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందనే సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నగరం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో మండల కేంద్రం సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శివకృష్ణను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికత్స పొందుతూ అతను మృతి చెందాడు. శనివారం మృతుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచ్చిబౌలి: అదుపు తప్పి కారు పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. చత్తీస్ఘడ్ రాయపూర్కు చెందిన రూపక్ త్రిపాఠి(30) మాదాపూర్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కేపీహెచ్బీలో తమ్ముడు శాశ్వత్ త్రిపాఠితో కలిసి నివాసం ఉంటున్నారు. స్నేహితులతో కలిసి ఎర్టిగా కారులో కేపీహెచ్బీ నుంచి నాలెడ్జీ సిటీకి వెళుతుండా టీ హబ్ రోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో బెలూన్ తెరుచుకున్నప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న రూపక్ త్రిపాఠి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్లోని మెడికొవర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారులో ఉన్న సోదరునితో పాటు స్నేహితులు వైభవ్ పాటిల్, ఇషాన్ త్రిపాఠి, ఎస్ రాజ్ సింగ్లు క్షేమంగా బయటపడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఇటీవల రూపక్ త్రిపాఠి మొబైల్ యాప్ను డెవలప్ చేశాడు. యాప్ను లాంచ్ చేయాల్సి ఉందని చెప్పి చత్తీస్ఘడ్ నుంచి వారం రోజుల క్రితం ముగ్గురు స్నేహితులను పిలిపించుకున్నాడు. తెల్లవారు జామున ఐటీ కారిడార్ చూసేందుకు వెళుతూ కారు అదుపుతప్పడంతో రూపక్ త్రిపాఠి తిరిగి రాని లోకాలు వెళ్లాడు.కారు ముందు చక్రం ఊడిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు మృత దేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మందుల్లేవ్!
కడ్తాల్: కడ్తాల్తో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశు పోషణ చేపడుతున్నారు. ముప్పై, నలభై ఏళ్లుగా పాడి పరిశ్రమతో ఉపాధి పొందుతున్నారు. పశు సంపద అదనపు ఆదాయ వనరు కావడంతో, సాగు భూమిలోని కొంత విస్తీర్ణంలో గడ్డి పెంచడం వీరికి అలవాటుగా మారింది. సొంత భూమి లేనివారు సైతం ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా వీటికి ఏవైనా వ్యాధులు సోకితే సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేకపోవడం చికిత్సలకు ఇబ్బందిగా మారుతోంది. వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పశు సంపద భారీగా ఉండటంతో వెటర్నరీ హాస్పిటాళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మందుల కొరత పెద్ద సమస్యగా మారింది. తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక, ఆర్థికంగా భారమైన ప్రైవేటుగా మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పశువులకు సోకే వ్యాధులు పశువులకు కాలన్ని బట్టి వచ్చే వ్యాధులతో పాటు, సాధారణ వ్యాధులు సోకుతాయి. ప్రస్తుతం వర్షకాలం కావడంతో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జ్వరం, పారుడు రోగం, చర్మవ్యాధులు, గొంతు వాపు, జబ్బవాపు, గాలికుంటు, గురక, మసూచి, జీర్ణ సంబంధ వ్యాధులు, నోట్లో పుండ్లు పడుతుంటాయి. నిలిచిన మందుల సరఫరా పశు సంవర్ధక శాఖ అధికారులు ఏడాదికి నాలుగు విడతల్లో వెటర్నరీ ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తుంది. మండల పరిధిలోని పశు సంపద ఆధారంగా వీటిని పంపిణీ ఉంటుంది. కానీ గతేడాది అక్టోబర్ నుంచి మందుల సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో మూగజీవాలకు రోగా లొస్తే మందులు అందుబాటులో ఉండటం లేదు. అవగాహన అంతంతే.. పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. సీజనల్ వ్యాక్సిన్లు వేసే సమయంలో రైతులకు ఒకటి, రెండు మాటలు చెప్పి మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా వ్యాధులపై సరైన అవగాహన లేక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. సబ్ సెంటర్లు తక్కువే.. మండలంలో 24 జీపీలు ఉండగా, కడ్తాల్లో పశువైద్య కేంద్రం ఉంది. మండల పరిధిలోని 5 గ్రామాల్లో సబ్ సెంటర్లు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్తో పాటు, ఎల్ఎస్ఏ, జేవీఓలు ముగ్గురు, అఫీస్ సబార్డినేట్లు నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ముద్వీన్, చల్లంపల్లి గ్రామాల్లో సరిపడా సిబ్బంది ఉండగా, రావిచేడ్లో సబార్డినేట్ పోస్ట్ ఖాళీగానే ఉంది. అన్మాస్పల్లిలో పశువైద్య ఉప కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుని, సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ముద్వీన్, కర్కల్పహాడ్ గ్రామాల్లో భవనాలు లేవు. పూర్తి స్థాయి సేవలు అందాలంటే పంచాయతీకి ఒకటి చొప్పున సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉండటం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు మెడికల్ షాపుల యజమానులు వారికి నచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు. వెటర్నరీ ఆస్పత్రుల్లో మెడిసిన్ సమస్య పది నెలలుగా ప్రభుత్వం నుంచి నిలిచిపోయిన సరఫరా గత్యంతరం లేక ప్రైవేటులో తేవాలంటున్న వైద్యులు, సిబ్బంది సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్న మూగజీవాలు ఆందోళనలో రైతులు, పశుపోషకులు మండలంలో పశు సంపద ఆవులు 17,314 గేదెలు 2,017 గొర్రెలు 16,643 మేకలు 7,868 కోళ్లు 7,98,491 కుక్కలు 1.561 పందులు 1,127 -
చికిత్స పొందుతూ జీపీ కార్మికుడి మృతి
కేశంపేట: చికిత్స పొందుతూ జీపీ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని భైర్కాన్పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాదెకాడి శ్రీనయ్య (42) పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య, ముగ్గురు ఆడపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనయ్య తాగేందుకు డబ్బులు కావాలని తరచూ భార్య తో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 7న రాత్రి తాగి ఇంటికి వచ్చాడు. ఇంకా మద్య ం తాగేందుకు డబ్బులు కావాలని భార్యను అడగడంతో ఆమె లేవని తెలిపింది. దీంతో అదే రాత్రి ఇంట్లో ఉన్న కలుపుమందు తాగా డు. గమనించిన కుటుంబ సభ్యులు షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్, స్కూటీ ఢీ..వ్యక్తికి తీవ్ర గాయాలు దుద్యాల్: టిప్పర్ – స్కూటీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రోటిబండ తండా సమీపంలో లగచర్ల గేటు వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం గండిహనుమాన్(దామ్లా) తండాకు చెందిన హన్మంతు హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి స్కూటీపై వస్తున్న క్రమంలో లగచర్ల గేటు వద్ద హకీంపేట్ నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో హన్మంతు తలకు తీవ్ర గాయమైంది. మహబూబ్నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
గిరిజన తెగల్లో నేటికీ ఆకలి చావులు
● రాజ్యాంగ ఫలాలు వారికి దక్కడం లేదు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నిర్లక్ష్య వైఖరి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ యాచారం: గిరిజన, ఆదివాసీ తెగల్లో నేటికీ ఆకలి చావులు తప్పడం లేదని.. స్వయంగా ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ, గిరిజన హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండల పరిధిలోని మంతన్గౌరెల్లి నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన తెగల్లో ఏ విధమైన మార్పు రావడం లేదని, రాజ్యాంగ ఫలాలు వారికి దక్కడం లేదని అన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నాయని దుయ్యబట్టారు. నేటికీ అటవీ భూములను నమ్ముకుని జీవనోపాధి పొందుతుంటే వాటని ఆక్రమిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో ప్రాజెక్టులు, ఖనిజం తవ్వకాల పేరుతో బలవంత తరలింపు జరుగుతోందన్నారు. ఇప్పటికీ తండాల్లో రోడ్డు మార్గం, విద్యుత్, తాగునీటి సౌకర్యాం లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలసమయంలో అనేక హామీలు గుప్పిస్తూ గెలుపొందిన తర్వాత విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన తండాల్లో పర్యటించి వారి సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ కంట్రోల్ కమిటీ చైర్మన్ డీజీ నర్సింహరావు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
పూల ధరలకు రెక్కలు
శ్రావణమాసం,పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ● రకాలను బట్టి రూ.200 నుంచి రూ.2,500 వరకు.. నవాబుపేట: ఓవైపు శ్రావణమాసం పూజలు.. మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నెల పవిత్ర మాసం కావడంతో పూల వినియోగం భారీగా ఉంది. మహిళలు అమ్మవారిని వివిధ రకాల పూలతో కొలుస్తుంటారు. గత శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాటి నుంచి పూల రేట్లు మరింత పెరిగాయి. పెళ్లి వేదికను పూలతో అలంకరించడానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆర్థికంగా ఉన్నవారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. వధూవరులు మెడలో ధరించే పూలమాల ధర రూ.2 వేలకు పైగా ధర పలుకుతోంది. సాధారణ రోజులు ఒక మాల రూ.200 నుంచి రూ.500 వరకే ఉంటుంది. ఇక బంతి, చామంతి, మల్లె పూల దండలైతే రూ.1000 పైనే. లిల్లీ పూలదండకూడా భారీ ధర పలుకుతోంది. వారం రోజుల క్రితం మూర పూలు రూ.20కు ఇచ్చే వారు.. ప్రస్తుతం రూ.50 తీసుకుంటున్నారు. కిలో బంతి పూలు రూ.120 నుంచి రూ.150 పలుకుతున్నాయి. చామంతి కిలోకి రూ.300 నుంచి రూ.500 వరకు.. లిల్లీ పూలు కిలోకి రూ.600 నుంచి రూ.800 వరకు, కనకాంబరాలు కిలోకి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు, గులాబీ కిలో రూ. 250 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. ధరలు విపరీతంగా పెరగడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. -
● పెళ్లిలో తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
● ఎల్లలు దాటి వచ్చి..మొయినాబాద్: అన్నా చెల్లెలు, అక్కా తమ్ముల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. సోదరులు ఎక్కడు న్నా అక్కాచెల్లెళ్లు అక్కడికి వెళ్లి రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటుకుంటారు. పెళ్లి వేడుకలోనే వరుడు (తమ్ముడు)కి రాఖీ కట్టి రక్షాబంధన్ విశిష్టతను చాటిచెప్పింది ఓ సోదరి. గతంలో మొయినాబాద్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ప్రస్తుతం ఏసీబీ నిజామాబాద్ డీఎస్పీగా పనిచేస్తున్న శేఖర్గౌడ్ కూతురు నిషిత, కేశంపేటకు చెందిన అన్వేష్రెడ్డి వివాహ వేడుక శనివారం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని స్టార్ కన్వెన్షన్లో జరిగింది. పెళ్లి వేడుకలోనే అన్వేష్రెడ్డికి అక్క మౌనిక రాఖీ కట్టి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏసీపీ డీజీ విజయ్కుమార్, ఐపీఎస్ అధికారి కోటిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
చేవెళ్ల: అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించింది చేవెళ్ల మండలం జాలగూడ గ్రామానికి చెందిన అత్తెల్లి అక్షర. గ్రామానికి చెందిన అత్తెల్లి రవీందర్రెడ్డి, అనిత దంపతులు కుమార్తె అక్షర చేవెళ్లలోనే పదో తరగతి వరకు చదువుకుంది. ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేసి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాలెం వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది. మాస్టర్ చదివేందుకు అమెరికాలోని లూథియానా యూనివర్సిటీలో చేరింది. అక్కడ అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసుకొని ఫ్లోరిడా యూనివర్సటీలో పీహెచ్డీలో చేరింది. వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించడంపై ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివాసీల సంక్షేమానికి కృషి డీటీడీఓ రామేశ్వరి దేవి కడ్తాల్: ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డీటీడీఓ) రామేశ్వరి దేవి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం మండల పరిధిలోని మైసిగండి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో పోరాట యోధుడు కొమురంభీం చిత్రపటానికి అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల జీవన విధానం ప్రత్యేకమైనదని, అడవి తల్లిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. అడవిబిడ్డల హక్కుల కోసం కొము రం భీం అహర్నిశలు పాటుపడ్డారని, వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడని కొనియాడారు. గిరిజనులకే కాదు.. అన్ని జాతులకు ఆయన పోరాటం స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో హెచ్ఎం పాపయ్య, హెచ్డబ్ల్యూఓ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కొనాలంటే ‘చింత’ తుక్కుగూడ: చింత చిగురును ఇష్టపడని వారుండరు. ఏడాది కాలంలో జూలై నుంచి ఆగస్టు మాసం వరకు అధికంగా లభిస్తుంది. కొమ్మల చివరి ఉన్న చింత చిగురును కొయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో రుచికరమైన చింత చిగురులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో ధర రూ.1000 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తున్నారు. నానాటికి చింత చెట్ల సంఖ్య తగ్గిపోవడం, చిగురు కోసే వారు లేకపోవడంతో ధర పెరిగిపోతోంది. అబుదాబిలో రోడ్డు ప్రమాదం: దంపతుల మృతి శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని సూరజ్గార్డెన్ బస్తీకి చెందిన ఓ కుటుంబం అబుదాబిలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో దంపతులు మరణించగా వారి కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని సూరజ్గార్డెన్ బస్తీకి చెందిన సయ్యద్ వాహిద్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 7న ఉదయం కారులో ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. సయ్యద్ వాహిద్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా అతడి భార్య ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. నాలుగు నెలల బాలుడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 6, 8 సంవత్సరాల ఇద్దరు కుమార్తెలకు స్వల్పగాయాలయ్యాయి. దీంతో సూరజ్గార్డెలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం మృతదేహాలు రాగా ఖననం పూర్తి చేశారు. -
● హెల్మెట్ ధరించని వాహనదారులకు..
● పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్ ● ఆర్టీసీ.. ఫుల్ గి‘రాఖీ’పహాడీషరీఫ్: రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వాహనదారులకు బాలాపూర్ పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి రాఖీలు కట్టారు. హెల్మెట్ ధరించకుండా పుట్టింటికి భర్తలతో వెళ్తున్న వాహనాలను గుర్తించి హెల్మెట్ ధరించాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే ఏడాది రాఖీలు కట్టలేకపోతారని అవగాహన కల్పించారు. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో రాఖీ శుభాకాంక్షలు తెలిపి మరీ మహిళా పోలీస్ అధికారులతో రాఖీలు కట్టించారు. -
దోమలు కుట్టి.. జబ్బు పట్టి
విష జ్వరాల బారినపడుతున్న జనం ఏకధాటి వర్షాలకు పారిశుద్ధ్యలోపం తోడవడంతో వ్యాధులు పంజా విసురుతున్నాయి. అనేక మంది కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలతోబాధపడుతున్నారు. ఏ ఇంట్లోకి తొంగి చూసినా జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. సర్కారు దవాఖానాలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని 56 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని ఓపీకి మే నెలలో 1,32,442 మంది బాధితులు రాగా, జూన్లో 1,34,725 మంది వచ్చారు. జూలైలో ఏకంగా 1,43,962మందికి చేరుకున్నారు. ప్రతి నెలా పది వేల మందికిపైగా విషజ్వరాల బారినపడుతున్నట్లు అంచనా. తాజాగా డెంగీ దోమలు సైతం పంజా విసురుతుండటంతో పల్లె వాసులే కాదు.. పట్టణ ప్రాంత ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. కొంత మంది వైద్యులు డెంగీ జ్వరాలను బూచీగా చూపి సాధారణ జ్వరపీడితులను ప్లేట్లెట్స్ కౌంట్స్, ఇతర చికిత్సల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 142 డెంగీ కేసులు నమోదు కాగా, హెచ్1ఎన్1(స్వైన్ఫ్లూ) కేసులు 14 నమోదు కావడం ఆందోళన కగిలిస్తోంది. కలుషిత నీరు, ఆహారంతో అనేక మంది వాంతులు, విరేచనాలు, విష జ్వరాల బారినపడుతున్నారు. కునుకు లేకుండా చేస్తున్న దోమలు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 142 డెంగీ కేసులు నమోదు కాగా, వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 77, శివారు మున్సిపాలిటీల్లో 53 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 12 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు, ధనవంతులు ఎక్కువగా నివసించే శేరిలింగంపల్లి పీహెచ్సీలో 41, నార్సింగి పీహెచ్సీలో 29, సరూర్నగర్లో16, బాలాపూర్లో 11, అబ్దుల్లాపూర్మెట్లో 11, మైలార్దేవ్పల్లిలో 8, చించోడులో ఏడు చొప్పున కేసులు నమోదవడం విశేషం. ఆకర్షణ, ఆహ్లాదం కోసం ఇంటి ముందు కుండీల్లో మనీప్లాంట్స్, ఖాళీ ప్రదేశంలో రకరకాల పూలు, పండ్ల మొక్కలుపెంచుతున్నారు. ఏకధాటి వర్షాలకు ఆయా కుండీలు, ఇంటిపై ఖాళీ డబ్బాలు, ఇంటి పక్క ఖాళీ స్థలాల్లో పడేస్తున్న కొబ్బరి బొండాలు, టైర్లలో నీరు చేరి దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులపైనే కాదు సెల్లార్లో ఉన్న సంపులపై కూడా మూతలు లేకపోవడం, నిర్మాణాల కోసం తవ్విని సెల్లార్ గుంతల్లో నీరు చేరడం, స్లాబులు, గోడల క్యూరింగ్ కోసం వాడిన నీరు రోజుల తరబడి నిల్వ ఉంటూ దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయకపోవడంతో ఇవి మరింత వృద్ధి చెంది కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీ ఏకధాటి వర్షాలతో డయేరియా ముప్పు ఆస్పత్రులకు క్యూకడుతున్న జ్వరపీడితులు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలో నమోదైన సీజనల్ వ్యాధులుమాసం ఫీవర్ డయేరియా రక్తవిరేచనాలు స్వైన్ఫ్లూ డెంగీ జనవరి 11,215 98 119 03 09 ఫిబ్రవరి 10,891 111 114 03 02 మార్చి 11,511 117 143 01 02 ఏప్రిల్ 11,025 79 86 01 04 మే 10,718 58 138 – 18 జూన్ 10,202 77 119 – 45 జూలై 10,778 78 109 05 53 ఆగస్టు (7వరకు) 1,752 08 19 01 09 అప్రమత్తం చేశాం కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్ఎంలు, ఆశాలు ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పర్యటించారు. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన హైరిస్క్జోన్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య మెరుగు కోసం చర్యలకు సిఫార్సు చేశాం. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నాం. అన్నిరకాల పరీక్షలతో పాటు మందులను ఉచితంగా అందజేస్తున్నాం. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి -
స్వచ్ఛ శంకర్పల్లిలో భాగస్వాములుకండి
శంకర్పల్లి: మున్సిపల్ ప్రజలంతా స్వచ్ఛ శంకర్పల్లిలో భాగస్వాములు కావాలని సినీ నటుడు సునీల్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 100 రోజుల పట్టణ ప్రణాళికలో భాగంగా ఆయన సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ మున్సిపల్ శాఖ ‘మా ర్పు– అభివృద్ధికి మలుపు’ నినాదంతో ముందుకు వెళ్తూ.. 100 రోజుల ప్రణాళిక చేపట్టిందని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోల్లో వేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, అవకాశం ఉన్నచోట విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ‘స్వచ్ఛ తెలంగాణ– స్వచ్ఛ శంకర్పల్లి’ కోసం ప్రతి ఒక్కరం కృషి చెద్దామన్నారు. -
న్యాయవాది బలవన్మరణం
ఇబ్రహీంపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఓ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇబ్ర హీంపట్నం పీఎస్ పరిధిలో గురవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపటేల్గూడకు చెందిన న్యాయవాది పి.నరేందర్గౌడ్(34)కు ఇదే వృత్తిలో ఉన్న చంద్రికతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇరువురూ ఇబ్రహీంపట్నం న్యాయస్థానంలో కేసులు వాదిస్తున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నరేందర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో కోర్టుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అతన్ని వెతుకుతున్న క్రమంలో తమ వ్యవసాయ క్షేత్రంలోని పశువుల కొట్టంలో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాడీని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
సెల్ఫీ విత్ రాఖీ
అక్కాచెల్లెళ్ల ఆత్మీయ వేడుక రక్షాబంధన్. ఈ పర్వదినాన సోదరులకు కట్టే రాఖీ.. ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో ‘సెల్ఫీ విత్ రాఖీ’ ఫొటోలను ఆహ్వానిస్తోంది ‘సాక్షి’. మీ కుటుంబం, సమూహంలో శనివారం నిర్వహించిన రాఖీ సంబరాలను సెల్ఫీ తీసుకుని పంపిస్తే బాగున్నవాటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం. ఫొటోతో పాటు మీ పట్టణం లేదా గ్రామం పేరు రాసి పంపండి. పర్యావరణ హిత రాఖీలకు ప్రాధాన్యం ఉంటుంది. మీరు వాట్సప్ చేయాల్సిన నంబర్లు 92906 11217, 98669 34975 -
రోడ్డు పనులు అడ్డుకుంటున్న వ్యక్తిపై ఫిర్యాదు
కేశంపేట: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటున్న రైతుపై చర్యలు తీసుకోవాలని గోప్లాయకుంటతండా వాసులు శుక్రవారం తహసీల్దార్ అజాంఅలీకి వినతిపత్రం అందజేశారు. వివరాలు.. బైర్కాన్పల్లి శివారు గోప్లాయకుంట తండాకు 20 ఏళ్ల క్రితం కంకర రోడ్డును వేశారు. ప్రస్తుతం బీటీ రోడ్డు మంజూరు కావడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న రైతు తన పొలం పక్క నుంచి రోడ్డు వేయాలంటూ నిత్యం కాంట్రాక్టర్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. రోడ్డు నిర్మాణ మార్గం మార్చితే మిగిలిన రైతుల పొలాలు నీటమునుగుతాయని.. అధికారులు స్పందించి పాతరోడ్డు మాదిరిగానే బీటీ రోడ్డు వేసేలా తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాయికంటి రాంచంద్రయ్య, కరుణాకర్, నర్సింహ తదితరులు ఉన్నారు. -
కూరగాయలకు వెళ్లి.. వరదనీటిలో మునిగి..
మొయినాబాద్: కూరగాయలు తెచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన ఓ వలస కూలీ వరద నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో శుక్రవారం వెలుగుజూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. నారాయణఖేడ్ జిల్లా దామరగిద్దకు చెందిన వంశిరాజు ఇంద్రప్ప(50), భార్య అంజమ్మతో కలిసి రెండు నెలల క్రితం బతుకుదెరువుకోసం హిమాయత్నగర్కు వలస వచ్చారు. కూలిపనిచేస్తూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. కాగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంద్రప్ప కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో హిమాయత్నగర్ చౌరస్తాలో రోడ్డుపై వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. రోడ్డుపైన నిలిచిన వరదనీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇంద్రప్ప కల్వర్టు వద్ద గుంతలో పడి నీటిలో మునిగిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో నీటిలోనే మునిగి మృతి చెందాడు. తన భర్త తిరిగి రాలేదని అంజమ్మ రాత్రి సమయంలో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం తిరిగి వెతుకుతుండగా హిమాయత్నగర్ చౌరస్తాలో ఉడిపి హోటల్ దగ్గర ఉన్న కల్వర్టు గుంతలో మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వలస కూలీ మృతి -
దారి తప్పిన ప్లానింగ్
అన్నీ ఉన్నా అధ్యయనమేది? రోడ్ల నిర్మాణంలో సరైన ప్రణాళిక అవలంబించకపోవడంతోనే అసలు సమస్య వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఒక ప్రదేశంలో రోడ్డు నిర్మించాల్సి వస్తే దాని వల్ల ఎక్కువగా ఎవరి ప్రయోజనం... అంటే స్కూల్ జోనా? వాణిజ్య ప్రాంతమా? తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి. దానికి తగ్గట్టు మార్పుచేర్పులతో రహదారి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సిటీలో మాత్రం ఆర్టీరియల్ రోడ్లు, ఇన్నర్ రోడ్లు, ఇంటర్మీడియట్ రోడ్లు దేనికీ సరైన ప్రణాళిక, అధ్యయనం లేకుండానే నిర్మితమవుతాయి. అందుకే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. సాక్షి, సిటీబ్యూరో: చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం... ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోవాల్సిందే.. ఇక ఎక్కడై ప్రమాదం జరిగినా.. రోడ్డు గుంత పడినా.. వాహనం బ్రేక్డౌన్ అయినా గంటల తరబడి ట్రాఫిక్ జామే.. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇంజినీరింగ్ లోపాలే. రహదారులు, కూడళ్లను శాసీ్త్రయంగా అధ్యయనం చేసి నిర్మించకపోవడం. ట్రాఫిక్ కానీ, నాలాల విషయంలో కానీ మన అధికారులు, పాలకులు ఇంజినీర్ల పాత్ర విస్మరించడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయి. నాటి నివేదికలే ఇప్పటికీ దిక్కు నిజానికి ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత పూర్తిగా పోలీసులదే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ప్రధాన కూడళ్లలో సిగ్నళ్ల వద్ద నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధంగా వెళ్లేందుకు మాత్రమే వారు దోహదపడతారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం వంటివి అదనంగా చేస్తారు. ట్రాఫిక్ సజావుగా, సాఫీగా సాగిపోయేందుకు రోడ్లు, కూడళ్లలోని జంక్షన్లు, ఫ్లైఓవర్లు, ప్రధాన రోడ్లను కలిపే యాక్సెస్ రోడ్లు వంటివి ప్రణాళికాబద్ధంగా రూపొందించకపోవడంతోనే నగరంలో ఈ సమస్యలంటున్నారు ట్రాఫిక్ నిపుణులు. నాలాల విషయంలో ఇంజినీరింగ్ ప్రముఖుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1920లో రూపొందించిన నివేదికలే ఇప్పటికీ పనికి వస్తున్నట్లే.. రోడ్ల విషయంలో అలాంటి ప్రణాళికలు లేకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని స్పష్టం చేస్తున్నారు. లోపాలతోనే వేగానికి తూట్లు నగరంలో వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. విపరీతంగా విస్తరిస్తున్న ప్రధాన రోడ్లు, వాటిని కలిపే యాక్సెస్ రోడ్లు, చిన్నా చితకా రోడ్లతో పాటు చిన్నచిన్న గల్లీలనూ లెక్కేస్తే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటి నిర్మాణంలో ఎలాంటి ప్రణాళిక లేదన్నది నిపుణులు చెబుతున్న వాస్తవం. అత్యంత ప్రధానమైన రోడ్లలోనూ నానాటికీ రద్దీ పెరిగిపోతోంది. వాటికి సమాంతర రోడ్ల అభివృద్ధి అనే ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ అనేక పద్మవ్యూహంలా మారిపోతోంది. వాస్తవానికి నగరంలోని ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు (ప్రధాన రహదారులు) అయిన పంజగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక తదితర రోడ్లన్నీ వాహనాలు కనీసం గరిష్టంగా 60 కి.మీ. వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న పెద్దరోడ్లే. కానీ కేవలం ఇంజినీరింగ్ ప్రమాణాల లోపాలతోనే ఇప్పుడీ రోడ్లన్నీ ట్రాఫిక్ వలయంలో చిక్కిపోతూ సరాసరిన గంటకు కనీసం 30 కిమీ వేగంతోనూ వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి. కిర్లోస్కర్ కమిటీ నివేదికా బుట్టదాఖలే.. నగరంలో 2000వ సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షం–వరద తీవ్రత ప్రజలతో పాటు ప్రభుత్వానికీ ముచ్చెమటలు పట్టించింది. దీంతో వరద నివారణ చర్యలు సిఫార్సు చేయడానికి 2003లో కిర్లోస్కర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అప్పట్లో ఉన్న ఎంసీహెచ్ పరిధిలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను 170 కిలోమిటర్ల మేర విస్తరణ తక్షణం చేపట్టాలని, అందుకు రూ.264 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. 2007లో నగర శివార్లలోని పన్నెండు మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పోరేషన్లో విలీనమై జీహెచ్ఎంసీ ఏర్పడింది. ఇలా 625 చ.కి.మీల్లో విస్తరించిన గ్రేటర్కు సమగ్ర మాస్టర్ ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల, మేజర్, మైనర్ వరద నీటి కాలువ ఆధునీకరణ కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి అప్పట్లోనే రూ. 6247 కోట్లు అవసరం అవుతాయని తేల్చింది. ఈ నివేదికలు ప్రాథమిక స్థాయిలోనూ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు. ఆ ‘భుజం’కు ఊతమేది? నగరంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, బస్సు వంటివి బ్రేక్ డౌన్ అయినా గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. నిజానికి ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ఒక్కోటి 2.5 మీటర్ల వెడల్పుతో కనీసం నాలుగు లైన్లుగా ఉండాలి. దీనితో పాటు ఆ రోడ్డుకు సాంకేతికంగా ‘షోల్డర్స్’ అని పిలిచే ఖాళీ ప్రదేశం ఉండాలి. ఎందుకంటే ఆ మార్గంలో ఏదైనా వాహనం పాడయితే అది మిగతా వాహనాలకు అవాంతరం కాకుండా ఉండేందుకు దాన్ని షోల్డర్స్లో నిలిపి వేస్తారు. కానీ మనదగ్గర ఇవి ఏ ప్రాంతంలోనూ మచ్చుకు కూడా కనిపించవు. ఫుట్పాత్లుగా పిలిచే కాలిబాటలపై ఉన్న ఆక్రమణలను తొలగించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటూ అనేకసార్లు హైకోర్టు, లోకాయుక్త వంటి వ్యవస్థలు హెచ్చరించాయి. రహదారికి పక్కన తప్పనిసరిగా కాలిబాటలు ఉండాలి. ఫలితంగా పాదచారులు వీటిని ఆశ్రయిస్తే ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు ప్రమాదాలు అదుపులోకి వస్తాయి. సిటీలో ప్రధాన రోడ్లతో పాటు యాక్సెస్ రోడ్లకూ ఉన్న ఫుట్పాత్లు ఆక్రమణలో ఉన్నాయి. ఇలా జరగడానికి ఇంజినీరింగ్ లోపమే ప్రధాన కారణం. ట్రాఫిక్ టెర్రర్తో నగరంలో నరకం నాలాల సమస్యకు పరిష్కారం శూన్యం ఇంజినీరింగ్ లోపాలే ప్రధాన కారణం ప్రణాళికలు లేని అధికారులు, పాలకులు బుట్టదాఖలైన కిర్లోస్కర్ కమిటీ నివేదిక -
వరద సమస్యకు మూసీ పునరుజ్జీవమే పరిష్కారం
భారీ వర్షాలు కురిసినా తట్టుకొనేలా వ్యవస్థల ప్రక్షాళన ● నీటి ప్రవాహానికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా చర్యలు ● చెరువులు, కుంటలు, నాలాలు ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం ● అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవం ద్వారానే వరద నీటిని సమర్థంగా నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. వర్షాలతో నగర జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే శాశ్వత ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గురువారం రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో మరోసారి పునరావృతం కాకుండా అనుసరించాల్సిన తక్షణ, శాశ్వత చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. వాతావరణ మార్పులతోనే.. నగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని, అందు కు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునికీకరించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమ ర్థంగా అనుసరించాలని ఆదేశించారు. ఎలాంటి భారీ వర్షాన్నైనా తట్టుకొనేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలన్నారు. నగరంలో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరీ వాహక ప్రాంతంతో పాటు అన్ని ప్రాంతాలు, కాలనీలకు వరద ముప్పును నివారించవచ్చన్నారు. మూసీలో వరద నీరు చేరేలా.. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతంలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీరాలం చెరువులతో పాటు అన్ని చెరువులు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలన్నారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలోకి వదలాలని చెప్పారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు. ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాత నగరంలో పెడిస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు ఆహ్వానం
తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ వార్షిక వేడుకలు ఈనెల 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు రావాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, నాయకులు జెల్లాల లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ మొయినాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ మహ్మద్ అలీఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం(ఆర్సెటీ)లో కార్ డ్రైవింగ్, మొబైల్ రిపేరింగ్, బైక్ మెకానిక్, సీసీటీవీ కోర్సుల్లో నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ నెల 11న శిక్షణ మొదలవుతుందని.. 18–45 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్ఎస్సీ మె మో, రేషన్ కార్డు, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలతోపాటు నాలుగు పాస్పోర్ట్సైజు ఫొటోలతో ఈ నెల 9న ఆర్సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యంతోపాటు ట్రైనింగ్ మెటీరియల్, టూల్ కిట్స్ ఉచితంగా అందజేయనున్నట్టు చెప్పారు. వివరాలకు 95506 06019, 85001 65190 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పాల ఉత్పత్తులపై అవగాహన యాచారం: పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం గునుగల్, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ కొండల్రెడ్డి, ఫార్మర్ డీన్ డాక్టర్ రఘునందన్ తదితరులు శాసీ్త్రయ పద్ధతిలో పాడిపశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై మహిళా రైతులకు అవగాహన కల్పించారు. పశుపోషణ, తక్కువ ఖర్చుతో షెడ్ల నిర్మాణం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వంటి అంశాలను వివరించారు. కలాకండ్, పన్నీరు, చన్నారసగుల్లా, రసమలై, మజ్జిగ, లస్సీ తదితర పదార్థాల తయారీపై అవగాహన కల్పించి, శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు రత్నాకర్, శశికుమార్, సాహిత్యరాణి, మండల వ్యవసాయాధికారి రవినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యవారిపల్లి వాగులో వరద ఉధృతి
షాద్నగర్రూరల్: భారీ వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఫరూఖ్నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. చించోడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రదంలోకి వర్షపు నీరు చేరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీడీఓ బన్సీలాల్ శుక్రవారం అంగన్వాడీ కేంద్రం, వాగు పరిసరాలను పరిశీలించారు. వాగు సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రజలు వాగు సమీపంలోకి రావద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయ్యవారిపల్లికి ప్రయాణించేవారు మరో మార్గం ఎంచుకోవాలని చెప్పారు. వాగును పరిశీలించిన వారిలో ఎంపీఓ జయంత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.రాకపోకలు నిలిపివేసిన అధికారులు -
విన్యాసాలు అదుర్స్
ఇబ్రహీంపట్నం: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో దేశ రక్షణ, వాయుసేన దళాలు శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించాయి. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), భారత రక్షణ వాయుసేన (ఐఏఎఫ్) సంయుక్తంగా హెలికాప్టర్ల సాయంతో ‘హై–ఇంటెన్సిటీ రూఫ్ టాప్ స్లిదరింగ్’ పేరిట విన్యాసాలు ప్రదర్శించాయి. ఉగ్రమూకల దాడులు, యుద్ధ పరిస్థితులు, ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటే .. అలాంటి విపత్కర, అత్యవసర సమయాల్లో ప్రజలను ఏ విధంగా కమాండోలు కాపాడతారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ గగన్దీప్ సింగ్ కోహ్లి, ఎండీ హెచ్ఎస్ సైనీ, ఎన్ఎస్జీ దళాల కమాండోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బీసీల్లో ఐక్యత అవసరం
షాబాద్: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని బోడంపహాడ్లో బీసీ సేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా వెంకటేశ్, ఉపాధ్యాక్షులుగా లింగం, ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా చాకలి శ్రీనివాస్, కార్యదర్శులుగా మహేష్, లక్ష్మణ్, కోశాధికారిగా హరీశ్గౌడ్, కార్యదర్శిగా లక్ష్మణ్కు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో రాణించాలంటే గ్రామస్థాయి నుంచే ఐక్యంగా ఉండాలన్నారు. ప్రపంచ జనాభాలో 70శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారన్నారు. ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బర్క కృష్ణ నేతృత్వంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసేన మండల మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్చారి, యూత్ అధ్యక్షుడు అజయ్కుమార్, నాయకులు బాల్రాజ్, ఇనాయత్, అబ్బాస్ తదితరులున్నారు. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
● బోరుమోటారు సర్వీస్ వైర్ సరిచేసే క్రమంలో షాక్ ● ముద్దాయిపేటలో విషాదం యాలాల: వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృత్యువాత పడ్డాడు. యాలాల మండలం ముద్దాయిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాలేపల్లి రమేశ్గౌడ్(38) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరి సాగుకు కరిగేట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో బోరుకు కరెంటు సరఫరా చేసే సర్వీస్ వైర్ తెగిపడి ఉండటాన్ని గమనించాడు. దీన్ని అతికించే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా రమేశ్ అప్పటికే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య గౌరమ్మ, కొడుకు ప్రదీప్, కూతురు శ్రీజ ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే రమేశ్ మృతిని గ్రామస్తులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలు పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రమేశ్ అకాల మరణంతో ముద్దాయిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. వాగును విడిపించకుండా తవ్వకాలు ఏమిటి ? చిలుకవాగు పనులను అడ్డుకున్న స్థానిక రైతులు తాండూరు: రియల్ వ్యాపారులు కబ్జా చేసిన చిలుక వాగును విడిపించకుండా, తమ పొలాల నుంచి వాగును తరలించడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ మార్గం సాయిపూర్ ప్రాంతంలో శుక్రవారం చేపట్టిన వాగు తవ్వకం పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చిలుక వాగు పరివాహక ప్రాంతం తమ పొలాల మధ్య నుంచి వెళ్లదని తెలిపారు. ఆక్రమణలను తొలగించకుండా తమ భూముల పైనుంచి తవ్వకాలు చేపట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఆటో లాక్కెళ్లారని మనస్తాపం
మొయినాబాద్: కిస్తులు (ఈఎంఐ) చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ వారు ఆటో లాక్కెళ్లారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నక్కలపల్లిలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన అనిమోని బాలకిష్టయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో చిన్నతనంలోనే శ్రీకాంత్(26)ను దత్తత తీసుకు న్నారు. కొంతకాలానికి బాలకిష్టయ్య దంపతులు చనిపోయారు. దీంతో ఆయన మేనఅల్లుడు, నక్కలపల్లికి చెందిన బంటు కృష్ణ.. శ్రీకాంత్ బాగోగులు చూస్తున్నాడు. కృష్ణకు చెందిన పాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్న శ్రీకాంత్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో కిస్తు లు కట్టకపోవడంతో ఐదురోజుల క్రితం ఫైనాన్స్ సంస్థ వారు వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన అతను ఇంట్లోని దూలానికి టవల్తో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో కృష్ణ వెళ్లి చూశారు. శ్రీకాంత్ ఉరేసుకుని వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆటో తీసుకెళ్లిన రోజే ఉరేసుకుని ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య నక్కలపల్లిలో విషాదం -
తవ్విపోదురు గాక..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వానలొస్తే జనం చస్తున్నారు. ఉప్పొంగే నాలాలు.. చెరువులయ్యే రోడ్లతో ముందుకు సాగలేక అల్లాడుతున్నారు. ఎప్పుడో వేసవిలోనే పూర్తి చేయాల్సిన పనుల్ని సైతం పెండింగ్లో పెట్టి.. జలమండలి, టెలికాం, తదితర సంస్థలు అడ్డంగా తవ్విపారేసిన రోడ్లతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఏ పనులు ఏ సంస్థవో తెలియని సామాన్య ప్రజలు అన్నీ జీహెచ్ఎంసీవేనని భావించి దుమ్మెత్తిపోస్తున్నారు. జీహెచ్ఎంసీ చేయాల్సిన పనులకూ ట్రాఫిక్ విభాగం నుంచి సకాలంలో అనుమతులు లభించడం లేవని సమాచారం. ఇవి సమస్యలకు కారణాలు కాగా.. వర్షాకాల సమస్యల పరిష్కార బాధ్యతలు హైడ్రాకు అప్పగించాక వాటిలోనూ సమన్వయం కుదరడం లేదు. ప్రకటనల్లో మాత్రం సమన్వయంతో పని చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలోని హైడ్రా సిబ్బంది జీహెచ్ఎంసీని ఖాతరు చేయడం లేదని తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా మ్యాన్హోళ్ల మూత లు, డివైడర్ల చివరన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించకపోవడంతో వరదనీరు నిలిచిపోతోంది.అనుమతుల్లేకుండా అడ్డగోలు తవ్వకాలుహైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైఅండ్ సివరేజి బోర్డు (జలమండలి) నిర్వాకాలు శాపంగా మారాయి. తాగునీరు, మురుగునీటి పైపులైన్ల కోసం ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా జరిపిన తవ్వకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో చేయాల్సిన మ్యాన్హోళ్ల పనులు ఇప్పుడు చేస్తున్నారు. పనులు చేశాక సరిగా చదును చేయడం లేదు. సివర్ లైన్ల కోసం తవ్వకాలు జరిపీ, మట్టికుప్పలు అడ్డగోలుగా వదిలేస్తున్నారు. దాంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.ఉదాహరణకు ఎన్ఎండీసీ– విజయనగర్ కాలనీరోడ్ మార్గంలో తవ్వకాలు జరిపి రోడ్డు మూసేశారు. దాంతో ఇతర దారుల్లో తీవ్రట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్వి పారేశారు. ఇవన్నీ ఎలాంటి అనుమతుల్లేకుండా తవ్వినవే. మురుగునీటిని వరద కాల్వల్లో కలపడంతో వాటిలో మురుగు పొంగుతోంది. వర్షాల వేళ రోడ్లపై పెద్ద ప్రవాహాలు ఏర్పడుతున్నాయి. చాదర్ఘాట్, మలక్పేట తదితర ప్రాంతాల్లో తరచూ కనిపించే దృశ్యాలే ఇందుకు నిదర్శనం. ఇక వర్షాల వేళ ట్రాఫిక్ విభాగం పనితీరు సోమ వారం నాటి వర్షంతో బట్టబయలైంది. సాధారణంగా పది నిమిషాల్లో వెళ్లాల్సిన దూరానికి రెండు గంటలకు పైగా పట్టింది. చలానాల విధింపుపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకిలా?వర్షాకాలానికి ముందే వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజల సదుపాయార్థం తాము చేయాల్సిన పనులుంటే పరస్పర సమన్వయం, సహకారంతో పూర్తిచేయాలి. కానీ అది జరగడం లేదు. ఉదాహరణకు ఒక రోడ్డు వేయాలంటే ఆ మార్గంలో ఏర్పాటు చేయాల్సిన ఇతర విభాగాల పనులుంటే పూర్తయ్యాక వేయాలి. కానీ అది జరగడం లేదు. జీహెచ్ఎంసీ రోడ్లు వేయడం.. ఇతర విభాగాలు తవ్వడం.. మళ్లీ రోడ్లు వేయడం పరిపాటిగా మారింది. సకాలంలో ట్రాఫిక్ అనుమతులు లభించకపోవడం కూడా పనుల జాప్యానికి కారణమవుతోంది. బంజారాహిల్స్లో నాలాలో కుంగిన వాటర్ట్యాంకర్ను బయటకు తీసేందుకు కూడా ఎంతో సమయం పట్టడాన్ని ప్రజలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఆ తప్పు ఎదుటివారి మీదకు నెట్టడం.. ప్రశంసలైతే తామే అని చెప్పుకోవడం అన్ని విభాగాలకూ అలవాటుగా మారింది. -
పట్టణాలను హరిత వనాలుగా మార్చాలి
సీడీఎంఏ డైరెక్టర్ జోత్స్న షాద్నగర్ రూరల్: ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవంతో పట్టణాలు పచ్చని వనాలుగా మారాలని సీడీఎంఏ డైరెక్టర్ జోత్స్న అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి 10వ వార్డులోని ప్యారడైజ్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ సునీత ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించాలని కోరారు. సకాలంలో వర్షా లు కురవాలన్నా.. వాతావరణ సమతుల్యత కాపాడాలన్నా.. మొక్కల పెంపకం అవసరమన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వనమహోత్సవంలో భాగస్వాములై ప్రతి ఇంటికి మొక్క నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రావణి, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ బోధనతో విద్యార్థుల విజయం రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ వెంకటేశ్ మాడ్గుల: ఉత్తమ బోధనతో విద్యార్థుల విజ యం సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇర్విన్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్ త్రిబుల్ ఐటీ, ఎన్ఎమ్ఎస్కు ఎంపికై న విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో ఇర్విన్ విద్యార్థుల సత్తా అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల ప్ర ణాళికాయుత బోధనతోనే విజయాలు సాధ్యమవుతున్నాయని కితాబిచ్చారు. సమాజంతో పాటు వ్యక్తిగతంగానూ గుర్తింపు పొందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం హెచ్ఎం పర్వతాలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుశీంధర్ రావు, ఏంఈఓ సర్ధార్ నాయక్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సినీ హీరో గోపీచంద్శంకర్పల్లి: సినీ హీరో గోపీచంద్ గురువారం శంకర్పల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి విచ్చేశారు. మండల పరిధిలోని బ్లూమ్స్ వెంచర్లో ఉన్న 400 గజాల విల్లా విక్రయానికి గాను ఆ యన కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. దీంతో ఒకింత ఇబ్బంది పడిన గోపీచంద్ పని పూర్తయిన వెంటనే పట్టణ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. గంజాయి పట్టివేత సాక్షి, సిటీబ్యూరో: దాదాపు రూ.6 లక్షల విలువైన 11.5 కిలోల గంజాయిని ఎకై ్సజ్ పోలీసు లు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా సరూర్నగర్ చైతన్యపురికి చెందిన భూక్య శ్రీకాంత్ వద్ద 340 గ్రాముల గంజాయిని మొదట పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు అబ్బాస్ అనే వ్యక్తి వద్ద నుంచి 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు. అబ్బాస్ ఇచ్చిన సమాచారం మేరకు నడిమింటి మమత అనే మహిళ ఇంట్లో 10.693 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తం 11.5 కిలోలు పట్టుకున్నట్లు రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ తెలిపారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. -
బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి
షాబాద్: బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బీసీసేన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కడుమూరు విఠలయ్య, ఉపాధ్యక్షుడిగా కడుమూరి అశోక్, ప్రధాన కార్యదర్శిగా కావలి రాములు, కోశాధికారిగా కావలి సత్తయ్యలను ఎనుకున్నారు. యువజన కమిటీ అధ్యక్షుడిగా కావలి సందీప్, ప్రధాన కార్యదర్శిగా కడుమూరి ఆనంద్, ఉపాధ్యక్షుడిగా మహేందర్, కార్యదర్శిగా బుగ్గరాములు, కోశాధికారిగా ఉండాల మల్లేష్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ.. ఆధిపత్య పోరుతోనే బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని చెప్పారు. అందుకే బీసీలకు అండగా ఆర్.కష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మండల అధ్యక్షులు దయాకర్చారి, యూత్ అధ్యక్షుడు అజయ్కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
మరణంలోనూ జంటగా..
షాబాద్: ఆ అన్యోన్య దంపతుల బంధాన్ని మృత్యువు సైతం వేరు చేయలేకపోయింది. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య గంటల వ్యవధిలోనే ప్రాణాలు వదిలేసింది. ఈ ఘటన హైతాబాద్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన అన్నె ప్రసాద్రావు(83), పార్వతి (72) దంపతులు హైతాబాద్లో ఉంటున్నారు. బుధవారం రాత్రి ప్రసాద్రావు అస్వస్థతకు గురికావడంతో శంషాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయం తెలియగానే తీవ్ర మానసిక క్షోభకు గురైన పార్వతి గుండెపోటుతో మరణించింది. స్థానిక శ్మశానవాటికలో గురువారం ఇద్దరి అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రియల్ మాయ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అది పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉన్న భూమి. డీటీసీపీ, హెచ్ఎండీఏలు సైతం వెంచర్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయవు. కానీ కొంత మంది రియల్టర్లు ఏకంగా అనధికార వెంచర్ చేశారు. గుంటల్లో ఉన్న వ్యవసాయ భూమిని గజాల్లోకి మార్చి గుట్టుగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. ఇంతటితో ఆగకుండా నక్షబాటను కబ్జా చేసి పక్కనే ఉన్న పట్టా భూముల్లో కలిపేశారు. చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి సరిహద్దు భూముల్లోకి ఇతరుల రాకపోకలను నిలిపివేశారు. కబ్జాకు గురైన నక్షబాటకు విముక్తి కల్పించాలని కోరుతూ ఓ బాధితుడు ఇటీవల కలెక్టర్కు విన్నవించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి, నక్షబాట ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించినప్పటికీ.. దారి వదిలేందుకు రియల్టర్లు మాత్రం అంగీకరించడం లేదు. విధిలేని పరిస్థితుల్లో సదరు బాధితుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.అనధికారిక వెంచర్.. అడ్డగోలు అమ్మకాలు2018లో మెయినాబాద్ మండలం ముర్తుజగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 251, 252(ఓల్డ్ సర్వే నంబర్లు 88,146)లోని 11.24 ఎకరాల్లో కొంతమంది రియల్టర్లు 165 ప్లాట్లతో అనధికారిక వెంచర్ చేశారు. పద్మావతి కాలనీగా నామకరణం చేశారు. గుంటల్లో ఉన్న భూమిని గజాల్లోకి మార్చి, గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ క్రమంలో భూములకు ఆనుకుని ఉన్న 253 సర్వే నంబర్లోని నక్షబాటను సైతం కబ్జాచేసి పద్మావతి కాలనీలో కలిపేశారు. 111 జీఓ పరిధిలో వెంచర్ చేయడంతో పాటు 120 నుంచి 350 గజాల చొప్పున ప్లాట్లు చేసి విక్రయించారు. ఆ వెంచర్ నుంచి పై భాగంలో ఉన్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లే వారికి దారి లేకుండా చేసి రాకపోకలను నిషేధించారు.ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలను(1,866 గజాలతో ఒకటి, 216 గజాలతో మరొక పార్కును) ముర్తుజగూడ గ్రామ పంచాయతీ పేరున గిఫ్ట్ డీడ్ చేయడం కొసమెరుపు. నాలా కన్వర్షన్ కూడా కానీ ఈ భూములను రిజిస్ట్రేషేన్లు ఎలా చేస్తున్నారో అంతు చిక్కడం ప్రశ్న. వాస్తవ విస్తీర్ణానికి మించి వెంచర్లో భూములున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పక్క సర్వే నంబర్లలో ఉన్న మూడు ఎకరాల ఇనాం భూములను ఈ అనధికారిక వెంచర్లోనే కలిపేసినట్లు సమాచారం. స్థానికంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు రియల్టర్లతో కుమ్మకై ్క.. కళ్లముందే అక్రమంగా వెలుస్తున్న వెంచర్లను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రియల్టర్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.అవన్నీ అక్రమ వెంచర్లే..అనధికారిక వెంచర్లో నక్షబాట ఉన్నట్లు గుర్తించాం. మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి ఇతర రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏర్పాటు చేసిన ప్రహరీ తొలగిస్తాం. 111 జీఓ పరిధిలోని వెంచర్లకు ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. జీఓ పరిధిలో ఉన్న వెంచర్లన్నీ..అక్రమమైనవే. – గౌతంకుమార్, తహసీల్దార్, మొయినాబాద్దారి చూపండిముర్తుజగూడ సర్వే నంబర్ 254లో 1.16 ఎకరాల పట్టా భూమి ఉంది. సరిహద్దులోని సర్వే నంబర్లు 251, 252లో నక్షబాట ఉండేది. పట్టా దారులు ఆ నక్షబాటను కబ్జా చేశారు. రెండు సర్వే నంబర్లలోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి అనధికారిక వెంచర్ చేశారు. వెంచర్ చుట్టూ ప్రీకాస్ట్ వాల్స్ను ఏర్పాటు చేశారు. నక్షబాటను కబ్జా చేసి ప్లాట్లు చేయడంతో పాటు ఇతర రైతులు తమ భూముల్లోకి వెళ్లకుండా దారి మూసివేశారు. అధికారులు వెంటనే స్పందించి నక్షబాటను పునరుద్ధరించాలి. – ఆర్.మల్లికార్జున్, బండ్లగూడ -
మూడు రోజులైనా దొరకని ఆచూకీ
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు చూసేందుకు వచ్చి కృష్ణా నదిపై నిర్మించిన కొత్త వంతెన పైనుంచి దూకిన యువకుడి ఆచూకీ మూడు రోజులైనా లభించలేదు. మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని శివ(23) తన స్నేహితులైన దుసరి ప్రసాద్(గణేశ్), సొప్పరి శివ, పండుగ నర్సింహతో కలిసి ఈ నెల 4న నాగార్జునసాగర్ పర్యటనకు వెళ్లారు. నందికొండ మున్సిపల్ పరిధిలోని పైలాన్ కాలనీలో కృష్ణా నదిపై ఉన్న కొత్త వంతెన మీద నిలబడి ఫొటోలు దిగే క్రమంలో శివ వంతెన పైనుంచి కృష్ణా నదిలోకి దూకి గల్లంతయ్యాడు. శివ తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు సాగర్ సీఐ శ్రీనునాయక్, విజయపురి టౌన్ ఎస్ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. కృష్ణానదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు -
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు యాచారం: సీసీ కెమెరాలుంటే పోలీస్ నిఘా ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని తక్కళ్లపల్లిలో గురువారం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవాలని సూచించారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, యువకులు సమష్టిగా డబ్బులు జమ చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరిగిప్పుడు సులభంగా నేరస్తులను గుర్తించే అవకాశం ఉందన్నారు. సీసీ కెమెరాలుంటే నేరాలు, చోరీలు తగ్గుముఖం పడుతాయన్నారు. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతల సహకారం కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు, గ్రామస్తులు శ్రీశైలం, సంతోష, మల్లేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అప్పు ఇచ్చిన మహిళ కిడ్నాప్ ● కారులో తీసుకెళ్తుండగా.. మరో కారును ఢీకొన్న వైనం ● మహిళతో పాటు ఇద్దరికి గాయాలు శంషాబాద్ రూరల్: రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఘటన మహిళ కిడ్నాప్ కథగా మారింది. శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చేవెళ్ల మండలం, ఆలూరు వాసి కొండకల్ల పద్మజ అదే గ్రామానికి చెందిన కమ్మెట విజయ్గౌడ్కు రూ.నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇచ్చే విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో విజయ్గౌడ్ ఆమైపె కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పద్మజ భర్త బుచ్చయ్యను చికిత్స నిమిత్తం మల్కారంలోని ఆశాజ్యోతి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 5న భర్తకు దుస్తులు ఇచ్చేందుకు వచ్చిన పద్మజను గుర్తించిన విజయ్గౌడ్, వెంకటేష్, సాయితో కలిసి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కారు కొత్వాల్గూడ శివారులో ఔటర్ సర్వీసు రోడ్డులో వెళ్తుండగా.. అదుపుతప్పి ఎదురుగా వచ్చిన బీఎండబ్ల్యూ కారును ఢీకొంది. ఈ ఘటనలో పద్మజ, విజయ్గౌడ్, సాయికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. బీఎండబ్ల్యూ కారులో ఉన్న వారు ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎర్టిగా కారులో ఉన్న పద్మజను విచారించగా.. తనను కిడ్నాప్ చేసినట్లు తెలిపింది. దీంతో శంషాబాద్ పోలీసులు గురువారం ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. యువకుడిపై హత్యాయత్నం బంజారాహిల్స్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి దారికాచి ఆమె ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్నగర్కు చెందిన షేక్ ఆదిల్ టెంట్హౌస్లో పని చేసేవాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10సీ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న బోయిన్పల్లికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రతిరోజూ ఆదిల్ ఆమెను ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో బైక్పై ఎక్కించుకుని బోయిన్పల్లిలో ఇంటి సమీపంలో వదిలేసేవాడు. బుధవారం రాత్రి ఆదిల్ ఆమెను బైక్ ఎక్కించుకుని జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా వెళ్తుండగా అప్పటికే పథకం ప్రకారం చెక్పోస్టు సమీపంలో దారికాచిన ఆమె భర్త అంజద్ వీరిని అడ్డగించాడు. అందరూ చూస్తుండగానే ఆదిల్ తలపై బండరాయితో మోది అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆదిల్ను స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. గురువారం వికారాబాద్లోని సంగం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు విద్యా బోధన ఎలా చెబుతున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని వాడాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
రైస్మిల్ నుంచి రసాయన వ్యర్థాలు
ఇబ్రహీంపట్నం రూరల్: రైస్మిల్ మూసి వేయాలని ఉప్పరిగూడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని ఉప్పరిగూడలో గురువారం శ్రీనివాస రైస్ మిల్ నుంచి నాలుగు ట్యాంకర్లకు పైగా రసాయన వ్యర్థాలను రోడ్డుపైకి వదిలారు. పోచారం వరకు ఈ వ్యర్థాలు పారుతుండడంతో రాకపోకలు సాగించిన వారు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రైస్మిల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టి అనుమతులు లేకుండా పరిశ్రమ నెలకొల్పారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిల్లు యజమానికి సమాధానం ఇవ్వకుండానే అక్కడ నుంచి వెనుదిరిగారు. ఈ ఆందోళనలో ప్రభాకర్రెడ్డి, జితేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, శివకుమార్, మంత్రి శ్రావణ్, మోహన్రెడ్డి, కృష్ణ, మహేందర్, సుక్రు, గ్రామస్తులు పాల్గొన్నారు . దుర్గంధంతో ఇబ్బంది పడిన స్థానికులు ఆందోళన చేపట్టిన ఉప్పరిగూడ గ్రామస్తులు -
హామీల అమలుకు పోరాటం
మాడ్గుల: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గురువారం మండల కేంద్రంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాల ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభు త్వం నిధు లు మంజూరు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకొంటుందన్నారు. హామీల అమలుకు ఈ నెల 30 న చలో కొండారెడ్డిపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మండల అధ్యక్షుడు పెద్ద య్య యాదవ్, నాయకులు రామకిషన్, వెంకటేశ్, నర్సింహ, శ్రీను, వెంకన్న, అశోక్, సునీల్, రాజు, భూపేశ్ తదితరులు పాల్గొన్నారు. 30న ‘చలో కొండారెడ్డిపల్లి’ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి -
మనువాదాన్ని వ్యతిరేకించాలి
కందుకూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మైనార్టీ వర్గాలపై దాడులకు తెగబడుతుందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి మండలాలకు సంబంధించిన ప్రజాసంఘాలతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత టీచర్లతో అయ్యప్ప మాల వేసిన విద్యార్థి కాళ్లు మొక్కించి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గుడుల్లో దళితులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ ప్రవేశిస్తే ఆలయాలను శుద్ధి చేస్తున్నారన్నారు. ఇదంతా కేంద్రంలో మోదీ, అమిత్షా పాలనతోనే జరుగుతుందని విమర్శించారు. మతోన్మాదానికి, మనువాదానికి వ్యతిరేకంగా ప్రజలందరిని చైతన్య పరచడానికి ఈ నెల 13న ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ హాజరవుతున్నారన్నారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్రాజ్, కేవీపీఎస్ మండలాల కన్వీనర్లు ఏర్పుల శేఖర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ -
చంద్రమౌలికి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు
ఆమనగల్లు: నగరంలోని పీపుల్స్ ప్లాజాలో గురువారం జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడ్గుల మండలం కొల్కుపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు గుర్రం చంద్రమౌలికి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో సహజ రంగులతో నూతన డిజైన్లో ఇక్కత్ పట్టుచీర నేసిన చేనేత జిల్లా కళాకారుడు చంద్రమౌలిని అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రశంసాపత్రం, రూ.25వేల విలువైన చెక్కు, మెమొంటో అందజేశారు. అనంతరం చంద్రమౌళిని పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు కృష్ణయ్య, ప్రవీణ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్కుమార్, రాజేశ్, భాస్కర్, వెంకన్న, సాయి, శశికళ తదితరులు పాల్గొన్నారు. -
ఆప్యాయతల ‘రక్షాబంధన్’
అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా రాఖీ పండుగసోదరి కష్టసుఖాల్లో అనుక్షణం తోడుగా ఉండేందుకు సోదరులకు కట్టే రక్షాబంధన్ పర్వదినం రానే వచ్చేసింది. అనురాగం, ఆప్యాయతల మేళవింపులో జరుపుకొనే అపూర్వ వేదికకు ప్రతి తోబుట్టువు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణహితంగా పండుగను నిర్వహించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. షాబాద్: అక్కాచెల్లెళ్లు.. అన్నాదమ్ములకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకుంటారు.. ఏటా రాఖీ పండుగను ఘనంగా జరుపుకొంటారు.. విదేశాల్లో ఉన్న వారు కూడా రక్షాబంధన్కు ఇక్కడికి వచ్చి అన్నాదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపిస్తారు. శనివారం జరుపుకొనే రాఖీ పండుగకు ఆడపడుచులు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత అనుబంధం, అనురాగం, ఆప్యాయత తోబుట్టువుల మధ్య ఉంటుంది. ఇంటి ఆడపడుచుల సుఖాసంతోషాలే తమ సంతోషంగా భావిస్తారు. సోదరులు ఇంతటి విశిష్టమైన అనుబంధానికి ప్రతీకగా, సోదరుల క్షేమం కోరుతూ ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ నిర్వహిస్తారు. మొదలైన సందడి అనుబంధాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే హిందూ సంస్కృతిలో రక్షాబంధన్కు విశిష్టమైన స్థానం ఉంది. సోదరి, సోదరుల అనురాగానికి చిహ్నంగా ఈ వేడుక జరుపుకొంటారు. ఇళ్లల్లోనే కాకుండా ఆలయాల్లో, సామూహిక వేదికల వద్ద ఈ పర్వదినాన్ని ఆనందోత్సహాల నడుమ నిర్వహించుకోనున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అంతా రాఖీ బంధన్ వేడుకను నిర్వహించేందుకు నాలుగు రోజుల ముందు నుంచే ఆడపడుచులు ఉత్సాహంగా రాఖీలు కోనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీక్ష సంకల్పమే రక్ష ఏదైనా కార్యక్రమం నిర్వహించ తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యాన్ని గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు తదితర కార్యక్రమాల్లో ఈ రక్షాధారణ తప్పనిసరి. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. ఆనాటి నుంచి ఆనవాయితీగా ఈ ఆచారం వస్తోంది. జోరుగా రాఖీల విక్రయాలు అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ దగ్గర పడుతుండడంతో మండలంలో రాఖీల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా, దుకాణదారులు పలు డిజైన్లల్లో రాఖీలు అందుబాటులో ఉంచారు. ప్రకృతి మెచ్చిన ‘వృక్షాబంధన్’ కడ్తాల్: ప్రకృతికి మానవాళి రక్షణగా ఉండాలనే గొప్ప సంకల్పంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ వినూత్నంగా గత 12 ఏళ్లుగా విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ నిర్వహిస్తోంది. ప్రకృతికి మానవాళికి మధ్య సైతం అనుబంధం పెంపొందాలనే సదుద్దేశంతో వృక్షాబంధన్ కార్యక్రమం ఏటా దిగ్విజయంగా కొనసాగుతుంది. పిల్లలు, యువకులు, గ్రామస్తులు, విద్యార్థులు అందరి ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష... మనమంతా భూమాతకు రక్ష’ అనే గొప్ప సంకల్పంతో వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆవు పేడతో రాఖీలు తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలాంటి హాని కలుగచేయని వస్తువులను వినియోగించాలని ప్రకృతి ప్రేమికులు పదే పదే చెబుతుంటారు. ఈ క్రమంలోనే మరో ముందడుగు వేసి ఆవు పేడ, మూత్రంతో ఏకంగా రాఖీలను తయారు చేశారు. పర్యావరణాన్ని రక్షించుటతో హిందూ సంప్రదాయ పండగలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తాయనేది సహజసిద్ధంగా తయారు చేసిన రాఖీలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాండూరు పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి ఏటా పర్యావరణ ప్రేమికురాలిగా తన వంతు బాధ్యతగా ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన రాఖీలను సోదరులకు కట్టాలని ఆమె చెబుతున్నారు. ఈ రాఖీలు తిరిగి భూమిలోకి చేరి మట్టి సారవంతాన్ని పెంపొందిస్తాయంటున్నారు. పరిగి ప్రాంతానికి చెందిన శివరామకృష్ణా చారి అనే వ్యవసాయ విద్య అభ్యసించిన ఓ యువకుడు దీర్ఘాయుష్షు అనే సంస్థను నెలకొల్పి ఆవుపేడ, మూత్రంతో రాఖీలను తయారు చేసి, పర్యావరణ పరిరక్షణపై తన వంతు బాధ్యతను బహిర్గతం చేస్తున్నారు. ఇలాంటి రాఖీలు మార్కెట్లో విక్రయానికి సైతం పెట్టడం విశేషం. -
దొరకని ఆచూకీ
● నాగార్జునసాగర్ అందాలు చూడ్డానికి వెళ్లి.. ● ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన యువకుడు ● గల్లంతై మూడు రోజులైనా లభించని జాడ మంచాల: నాగార్జునసాగర్ అందాలు చూడడానికి స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడి ఆచూకీ మూడు రోజులైనా దొరకలేదు. మండలంలోని జాపాల గ్రామానికి చెందిన మంతని శివ (24), సోప్పరి శివ, కాగజ్ఘట్ గ్రామానికి చెందిన దూసరి గణేశ్, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన పండుగ నర్సింహ స్నేహితులు. సోమవారం సాయంత్రం సరదాగా చూసొద్దామని నాగార్జునసాగర్ వెళ్లారు. కొద్ది సేపు బ్రిడ్జిపై కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. అంతలోనే శివ బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులైనా జాడ కనిపించలేదు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లిదండ్రులు గారాబంగా పెంచారు. ఆచూకీ దొరకకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
టీసీ ఇచ్చి.. ఇంటికి పంపి!
కేశంపేట: ప్రవర్తన సరిగా లేదనే కారణంతో ఓ పదో తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. విద్యా సంవత్సరం మధ్యలో హాస్టల్ నుంచి పంపిస్తే తన కొడుకు చదువు పాడవుతుందని తండ్రి ఎంత వేడుకున్నా ప్రిన్సిపాల్ కనికరించలేదని బాధితుడు వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతగట్టుతండాకు చెందిన పదో తరగతి విద్యార్థి సబావట్ రాహుల్ ఐదో తరగతి నుంచి కేశంపేట జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఇటీవల అతని ప్రవర్తన బాగోలేదంటూ ప్రిన్సిపాల్ ప్రీతి బుధవారం విద్యార్థి తండ్రి రాజును హాస్టల్కు పిలిపించారు. మీ కొడుకు వ్యవహారం రోజురోజుకూ శ్రుతిమించుతోందని, అతన్ని భరించలేమని చెప్పారు. విద్యార్థి తండ్రి ఎంతగా వేడుకున్నా ప్రిన్సిపాల్ ససేమిరా అన్నారు. టీసీ తీసుకోకుండా వెళ్లేది లేదంటూ తలుపులు మూసి, తాళం వేశారు. దీంతో రాజు 100కు డయల్ చేసి తనను హాస్టల్లో బంధించారని ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ విద్యార్థితో పాటు అతని తండ్రితో సంతకాలు చేయించుకుని టీసీ చేతిలో పెట్టారు. ఇదిలా ఉండగా టీసీలో రాహుల్ ప్రవర్తన బాగుందని రాయడం గమనార్హం విద్యార్థి ప్రవర్తన బాగో లేదంటూ ప్రిన్సిపాల్ నిర్ణయం కేశంపేట జ్యోతిబాపూలే గురుకులంలో ఘటన -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కె.హన్మంత్రావు అన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం సంఘం నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్త్కార్డులు వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ప్రయత్నం చేయాలని, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకోసం టీపీయూఎస్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, గౌరవ అధ్యక్షుడు గణపురం సురధీర్, మండల కోశాధికారి దూత కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి చర్యలు
షాద్నగర్: చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్రి ఆవరణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల హెచ్ఎంలు, అంగన్వాడీ సూపర్వైజర్లకు నులి పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను సరఫరా చేస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలను పంపిణీ చేసి చిన్నారులతో మింగించాలని సూచించారు. ఒకటి నుంచి రెండేళ్ల వయసుఉన్న పిల్లలకు సగం మాత్రను నీటిలో కలిపి వేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో నివసించడం, చేతులు సరిగా కడుక్కోకపోవడం ద్వారా నులి పురుగులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, వైద్యులు స్రవంతి, రాఘవేందర్, ఎంపీహెచ్ఈఓ శ్రావణ్కుమార్, హెల్త్ సూపర్వైజర్లు శ్రీరామ, అమృత, హెల్త్ అసిస్టెంట్ రెడ్యానాయక్, లింగం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి -
నేడు డయల్ యువర్ డీఎం
షాద్నగర్రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్నగర్ డిపో మేనేజర్ ఉష బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని తెలిపారు. 99592 26287 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సమాచార హక్కుచట్టం సరిగ్గా అమలు చేయాలి కొందుర్గు: ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలు కావడం లేదని రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ అన్నారు. కొందుర్గు తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. కొందుర్గు తహసీల్దార్ కార్యాలయంలో సిటిజన్చార్ట్ సరిగ్గా లేదని, 1, 2 రిజిస్టర్లు నిర్వహించడం లేదన్నారు. అప్పిలేట్ అధికారి బదిలీ అయి నెలలు గడస్తున్నా ఆమె పేరే చార్ట్పై ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మూడు నెలలుగా రాష్ట్రంలోని మెదక్, భ్రదాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో పర్యటించినట్టు తెలిపారు. సమాచార హక్కు చట్టంపై సరైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆమనగల్లు ఠాణాలో రికార్డుల తనిఖీ ఆమనగల్లు: పట్టణంలోని పోలీస్ స్టేషన్ను బుధవారం షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ ఆవరణను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సీఐ జానకీరామ్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్తో సమావేశమై పలు సూచనలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఐదు క్లినిక్లకు షోకాజ్ నోటీసులు శంకర్పల్లి: ఆర్ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, ఆపై ఎలాంటి వైద్య సేవలందించినా కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్రబాబు హెచ్చరించారు. పట్టణంలోని ఎనిమిది ఆర్ఎంపీ క్లినిక్స్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఐదింటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు పూర్తి స్థాయి డాక్టర్లు కాదని, దీనిని రోగులు గమనించాలని సూచించారు. ఆస్పత్రికి వెళ్లే ముందు ఆ డాక్డర్కి ఉన్న అర్హతలపై ఆరా తీయాలన్నారు. తనిఖీల్లో శంకర్పల్లి పీహెచ్సీ వైద్యురాలు రేవతిరెడ్డి, సిబ్బంది మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానంతో ప్రాణం నిలుస్తుంది: చిరంజీవి రాయదుర్గం: రక్తదానంతో ఒక ప్రాణం నిలుస్తుందని, నేటి యువతకు మళ్లీ మళ్లీ చెబుతున్నా.. రక్తదాతలు కావాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో నాలెడ్జి సిటీలోని ఫినిక్స్ సంస్థలో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఒక జర్నలిస్ట్ రాసిన కథనం చదివిన తర్వాత బ్లడ్బ్యాంక్ పెట్టాలనే ఆలోచన తనకు వచ్చిందని గుర్తు చేశారు. సినీనటులు తేజ సజ్జా, సంయుక్త, ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ భూములు పరాధీనం
వికారాబాద్: వక్ఫ్ బోర్డు భూములు రోజురోజుకూ అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి. మెజార్టీ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పరిగి మండలం సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలో వక్ఫ్ భూములను పక్క పొలం రైతులు ఆక్రమించారని ఎర్రగడ్డపల్లికి చెందిన కొందరు కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. సమాధులను సైతం కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ భూములను గతంలో వక్ఫ్ బోర్డు అధికారులు పలుమార్లు సందర్శించారు. కబ్జాకు గురయ్యాయని తేల్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు వచ్చిన ప్రతి సారీ వక్ఫ్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు నెపం మోపి కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో 2,170 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండగా అవి చాలా వరకు కాగితాలకే పరిమితమయ్యాయి. పొజిషన్లో మాత్రం వేరేవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల చేతుల్లోకి ఎప్పుడో వెళ్లి పోయాయి. కొన్ని చోట్ల సంరక్షకులుగా ఉన్న వారే యజమానులుగా మారిపోయారు. మరి కొన్ని చోట్ల కాగితాల్లో భూములు కనిపిస్తున్నాయి. పరాధీనం అయిన భూములపై ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. ఒక వేళ విచారణ జరిపినా నేతల ఒత్తిడి.. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు కారణంగా నివేదికలు బుట్టదాఖలు అవుతున్నాయి. సర్వే చేయడంలో విఫలం వక్ఫ్ భూములు ఉన్నదెంత.. ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎవరి ఆధీనంలో ఉన్నాయి..? అనే దానిపై ఆ శాఖ అధికారులకే స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులకు అవగాహన ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. ఇటు రెవెన్యూ.. అటూ వక్ఫ్ బోర్డు అధికారుల కనుసన్నల్లోనే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వక్ఫ్ భూములపై 1958 – 64 ప్రాంతంలో సర్వే నిర్వహించారు. 2006లో మరోసారి సర్వే చేసినా ఆ వివరాలను ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ సర్వే ప్రకారం వక్ఫ్ భూముల విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెండో విడత సర్వే చేసి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం 2017 ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ ప్రక్షాళన సర్వేలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు వెల్లడవుతాయని అందరూ భావించారు. కానీ మొదటి విడతలో కేవలం లిటిగేషన్ లేని భూములను మాత్రమే సర్వే చేశారు. రెండో విడత సర్వే చేసి ఉంటే వక్ఫ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలిసేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అనేక చోట్ల కబ్జా ● పరిగి మండలం సుల్తాన్పూర్ శివారులో ఓ దర్గా సమీపంలో ఉన్న వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇందులో సుమారు ఐదెకరాల భూమి పరాదీనం అయ్యింది. గార్డియన్గా ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వాటిని తన పేరున రాయించుకున్నాడు. ఈ విషయంలో స్థానకంగా నివాసముండే ఓ వ్యక్తి రెవెన్యూతో పాటు వక్ఫ్బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపి నివేఽధిక కూడా ఉన్నతాధికారులకు అందజేశారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గతేడాది అధికారులు ఆ భూములను పరిశీలించి కబ్జాకు గురైనట్టు తేల్చారు, కాని ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. వీటితో పాటు పరిగి మున్సిపల్ పరిధిలోని 568 సర్వే నెంబర్లో సుమారు 205 ఎకరాల భూమి ఉండగా అందులో చాలా వరకు అన్యాక్రాంతం అయ్యింది. పరిగి మండలం రాపోల్ గ్రామంలో వక్ఫ్ భూములు పరాధీనమయ్యాయి. ఇదే మండలం నారాయణ్పూర్లో 24 ఎకరాలు ఉండగా 22 ఎకరాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వికారాబాద్, ధారూరు, తాండూరు మండలాల్లో సైతం అన్యాక్రాంతం అయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 2,170 ఎకరాలు ఆక్రమణలపై తరచూ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, వక్ఫ్ బోర్డ్ అధికారులు 2006 సంవత్సరంలో సర్వే.. నేటికీ వెల్లడి కాని భూముల వివరాలు -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
అబ్దుల్లాపూర్మెట్: జనగాంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి 4వ జాతీయ జావెలిన్ డే వేడుకలు, కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్నకు మండల విద్యార్థులు ఎంపికయ్యారు. బాటసింగారం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు మల్యాల యాదగిరి తెలిపారు. ఈ నెల 5న సరూర్నగర్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాల తరఫున పాల్గొన్న కొడిశెల విలాస్, గాండ్ల ఈశ్వరిలు ప్రతిభ చాటారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు వారు ఎంపిక కావడంతో బుధవారం ఇద్దరికి క్రీడా దుస్తులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో కాడెద్దు మృతి కేశంపేట: విద్యుదాఘాతంలో కాడెద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బొదునంపల్లి గ్రామశివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి ఎదిరె ఆంజనేయులు తన వ్యవసాయ పొలంలోని పశువుల పాకలో రోజు మాదిరిగా తన పశువులను కట్టేశాడు. రాత్రి సమయంలో కాడెద్దు తాడును తెంపుకొని బయటకు వచ్చింది. సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భూమికి తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదవశాత్తు వైర్లు తగిలి విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందింది. కాడెద్దు విలువ సుమారు రూ.1.10 లక్షలు ఉంటుందని, తమని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. ఖాతా డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి కేపీహెచ్బీకాలనీ: కిరాణా షాపు ఖాతా డబ్బులు ఇవ్వకపోగా..నిర్వాహకురాలిపై దాడి చేసి కత్తితో దాడి చేసిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లోని ఎల్ఐజి 143లో మణిమాల కుటుంబం నివాసం ఉంటుంది. ఈమె స్ధానికంగా కిరాణా షాపు నిర్వహిస్తుంది. ఇదే కాలనీలోని ఎల్ఐజి 183లో నివాసం ఉండే రాజేష్రెడ్డి కిరాణా షాపులో కిరాణా సామాగ్రి కొనుగోలు చేస్తుంటాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో రాజేష్ రెడ్డి డబ్బులు ఖాతా పెట్టి కిరాణా సామాగ్రి తీసుకునేవాడు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఖాతా డబ్బులు ఇవ్వలేదు. దీంతో డబ్బులు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయగా..బుధవారం మధ్యాహ్నం మణిమాల ఇంటికి వెళ్లిన రాజేష్రెడ్డి ఆమైపె అకస్మాత్తుగా దాడి చేశాడు. గొంతు నులిమి పక్కనే ఉన్న కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. తీవ్రమైన పెనుగులాటలో మణిమాల గొంతుపై కత్తి కోసుకుపోగా, రాజేష్ రెడ్డి చేతికి కూడా గాయాలయ్యాయి. మణిమాల గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించి 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కింద పడిపోయిన రాజేష్రెడ్డిని కూడా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణిమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజేష్రెడ్డి ప్రవర్తన ఇటీవల కాలంలో విచిత్రంగా ఉందని, ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో పాటు మద్యానికి అలవాటు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. -
మోసం!
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025తూకం..‘సొమ్ము’ చేసుకుంటున్న వ్యాపారులు● ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం ● పట్టించుకోని తూనికలు, కొలతల అధికారులు ● జిల్లాలో గత ఏడాది 275 కేసులు ● ఈ ఏడాది ఇప్పటి వరకు 98 నమోదు ఇదింతే.. అడగొద్దు..8లోuసాక్షి, రంగారెడ్డిజిల్లా: వినియోగదారులు అవసరాన్ని, అమాయకత్వాన్ని కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 349 పెట్రోల్ బంకులు ఉండగా, వందకుపైగా వేబ్రిడ్జ్లు ఉన్నాయి. నిత్యావసరాలు విక్రయించే కిరాణాలు, సూపర్ మార్కెట్లు మొదలు.. చికెన్, మటన్ దుకాణాలు, రైతుబజార్లు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లపై విక్రయించే కూరగాయలు, పండ్ల తూకాల్లోనూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా షాపుల్లో తనిఖీలు నిర్వహించి తక్కెడ, బాట్ల తూకాలను పరిశీలించాల్సిన తూనికలు కొలతలశాఖ పరోక్షంగా వారికి సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2024లో జిల్లా వ్యాప్తంగా 275 కేసులు నమోదు చేయగా, 2025లో ఇప్పటి వరకు 98 కేసులను మాత్రమే నమోదు చేయడం ఈ శాఖ అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. తూకాల్లో మోసాలపై ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించడం లేదు. 27 మండలాలు, 526 రెవెన్యూ గ్రామాలు, 15 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న జిల్లాకు కేవలం ముగ్గురే అధికారులు ఉండటం కూడా తక్కువ కేసులు నమోదు కావడానికి మరో కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. న్యూస్రీల్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 200 గజాల ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారు జామునే చంపాపేట ఇసుక లారీల అడ్డాకు చేరుకున్నాడు. నచ్చిన ఇసుకను మాట్లాడుకుని ఆ పక్కనే ఉన్న ఓ వే బ్రిడ్జ్లో తూకం వేయించాడు. ఇసుక బరువు 32 టన్నులు ఉన్నట్లు బిల్లు జారీ చేశారు. అనుమానం వచ్చి మార్గమధ్యలో ఉన్న మరో వేబ్రిడ్జ్లో తూకం వేయించగా 28 టన్నులే వచ్చింది. ఓ ద్విచక్రవాహనదారుడు జెడ్పీరోడ్డులోని ఓ పెట్రోల్బంకులో పెట్రోలు కొట్టించాడు. ట్యాంక్ నిండా పెట్రోలు పోయించినప్పటికీ.. ఎంతకీ ఇంజన్ స్టార్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చి చెక్ చేయగా బైక్లో పోసింది పెట్రోల్ కాదని, నీళ్లు అని తేలింది. ఎల్బీనగర్కు చెందిన ఓ గృహిణి నిత్యావసరాల కొనుగోలు కోసం సమీపంలోని ఓ మార్ట్కు వెళ్లింది. ర్యాక్లో ఓ వరుసలో సర్దిపెట్టిన పప్పులు, ఉప్మారవ్వ, చక్కర, గోధుమపిండి (ప్యాకెట్లు కేజీల్లో) సహా ఇతర వస్తువులు బిల్లింగ్ చేయించింది. ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానం వచ్చి తూకం వేయగా ఒక్కో ప్యాకెట్లో 100 గ్రాములు తక్కువ ఉండటాన్ని చూసి విస్తుపోయింది. ప్రశ్నిస్తే వాగ్వాదం ఇంటి నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం బాలాపూర్లోని ఓ ప్రైవేటు డంప్ నుంచి ఇసుక కొనుగోలు చేశాను. వాహనం ట్రక్కు నిండా ఇసుక నింపి స్థానికంగా ఉన్న ఓ వేబ్రిడ్జిలో తూకం వేయగా 12 టన్నులు ఉన్నట్లు చూపించింది. అనుమానం వచ్చి మరోచోట తూకం వేయగా రెండు టన్నుల వ్యత్యాసం చూపించింది. అదేమని ప్రశ్నిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. – రవీంద్రాచారి, రియల్టర్ ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు మార్గమధ్యలో పెట్రోల్ ఖాళీ కావడంతో పక్కనే ఉన్న ఓ బంక్కు వెళ్లి కొట్టించాను. బైక్ స్టార్ట్ చేసి తీరా అర కిలోమీటర్కు వెళ్లిన తర్వాత ఆగిపోయింది. అనుమానం వచ్చి చూడగా పెట్రోల్ నీళ్లలా ఉంది. బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే తమ తప్పేమీ లేదని, కంపెనీ నుంచే ఇలా వచ్చిందని బుకాయించారు. విజిలెన్స్, తూనికలు కొలతలశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – తిరుమలేష్, ద్విచక్రవాహనదారుడు -
మా సమస్యలు పరిష్కరించండి
హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం తొర్రూర్లో హెచ్ఎండీఏ ద్వారా రూపొందించిన లే అవుట్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చేపట్టిన ప్లాట్ల వేలాన్ని భూములు ఇచ్చిన రైతులు అడ్డుకున్నారు. తమకు పరిహారంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా వేలం వేయడంపై అభ్యంతరం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూర్లోని సర్వే నంబర్ 383/1లో సుమారు 117 ఎకరాల ప్రభుత్వ భూమిని లే అవుట్ చేసి ప్లాట్లుగా విభజించి అమ్మేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి హెచ్ఎండీఏ అధికారులు సేకరించారు. పొజీషన్లో ఉన్న రైతులకు పరిహారం కింద ఒక్కొక్కరికి 300 గజాల ఇంటి స్థలాన్ని అదే లే అవుట్లో ఇచ్చేందుకు ఒప్పించారు. ఈ మేరకు అలాట్మెంట్ పత్రాలు జారీ చేశారు. అనంతరం కొన్ని ప్లాట్లను వేలం వేశారు. తమకు ఇచ్చిన పత్రాల ఆధారంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ స్థలాలపై పూర్తి హక్కుల కల్పించాలని రైతులు కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి అధికారం పొందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 510 ప్లాట్లలో 100 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. గ్రామంలోని ఓ కన్వెన్షన్ హాలులో వేలం వేసేందుకు బుధవారం ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్రెడ్డి, ఈఈ నరేందర్రెడ్డి వచ్చారు. బహిరంగ వేలం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న రైతులు వేలం పాటకు అడ్డు తగాలారు. పోలీసులు కలుగ జేసుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వేలం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని అక్కడికి పంపించారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, 10–15 రోజుల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలాన్ని అడ్డుకున్న రైతులు అడిషనల్ కలెక్టర్ హామీతో శాంతించిన వైనం -
విధుల్లో ఉన్న కండక్టర్ గుండెపోటుతో మృతి
అబ్దుల్లాపూర్మెట్: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్కు గుండెపోటు రావడంతో మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన నిమ్మల బాలరాజ్గౌడ్ (54) హయత్నగర్– 2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరిన బాల్రాజ్ రాత్రి 8.45గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి బస్లో వచ్చాడు. రాత్రి బస్సును కాలనీలో పార్క్ చేసి(నైట్ హాల్ట్), బ్లాక్ నం.62/1లో విశ్రాంతి తీసుకుంటుండగా రాత్రి 11.20 గంటలకు ఛాతిలో నొప్పి వస్తోందని డ్రైవర్ ఉపేందర్కు చెప్పాడు. దీంతో ఆయన 108కు సమాచారం ఇవ్వగా అతన్ని పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతి మాట్లాడటం లేదని.. సుభాష్నగర్: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతి గత కొన్ని రోజులుగా మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని చనిపోయిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన సందీప్ (20) రాజీవ్ గాంధీనగర్లో నివాసం ఉంటున్నాడు. సందీప్కు విజయవాడకు చెందిన ఓ యువతి ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమైంది. తరచూ చాటింగ్ చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుండి సదరు యువతి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురైన సందీప్ మంగళవారం రాత్రి ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
డాక్టర్ నమ్రతపై మరో కేసు
సాక్షి,సిటీబ్యూరో/రామ్గోపాల్పేట: సరోగసి పేరు తో శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతపై బుధవారం మరో కేసు నమోదైంది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని రిజిస్టర్ చేసిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కలిపి ఇప్పటి వరకు నమ్రత, ఆమె ముఠాపై నమోదైన కేసుల సంఖ్య ఆరుకు చేరింది. తాజాగా ఈ కేసులో మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 22కు చేరింది. నమ్రతపై 2020లో విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. వీటి ప్రభావంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లైసెన్సులు అధికారులు పొడిగించలేదు. ఆ సమయంలో తాను ఆస్పత్రి మూసేస్తున్నట్లు సమాచారం ఇచ్చిన నమ్రత అక్రమంగా కొనసాగించారు. తన పేరు బయటకు రాకుండా ఉండటానికి చికిత్స కోసం సంప్రదించిన వారికి మరో డాక్టర్ పేరుతో ఉన్న లెటర్ హెడ్పై మందులు, పరీక్షల వివరాలు రాసి ఇచ్చారు. రాజస్థాన్ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు సృష్టి సెంటర్పై దాడి చేసినప్పుడు ఈ లెటర్హెడ్స్ పోలీసులకు లభించలేదు. అయితే వరుసగా ఠాణా మెట్లు ఎక్కుతున్న బాధితుల్లో కొందరు తమ ఫిర్యాదులతో పాటు నమ్రత రాసి ఇచ్చిన మందుల చీటీలు తదితరాలను జత చేశారు. వీటిలో కొన్ని సదరు డాక్టర్ పేరుతో ఉండటాన్ని గమనించిన పోలీసులు దీనిపై ఆరా తీశారు. సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన ఆమె ఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. పోలీసులు ఆమెను సంప్రదించినప్పుడే తన పేరుతో ఉన్న లెటర్ హెడ్స్ దుర్వినియోగం అవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆమె స్వయంగా గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమ్రతపై బుధవారం మరో కేసు నమోదైంది. రాజస్థాన్ దంపతుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు నమ్రత ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇది మంగళవారంతో పూర్తి అయింది. తాజాగా మరో కేసులో కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క సహ నిందితులుగా ఉన్న సంతోషి, కళ్యాణిల పోలీసు కస్టడీ పూర్తి కావడంతో కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. 86 మందికి సరోగసి ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాలు, దర్యాప్తు, ఫిర్యాదుల ఆధారంగా నమ్రత తనకు ఉన్న వివిధ సెంటర్ల ద్వారా 86 మంది దంపతులకు సరోగసి చేసినట్లు గుర్తించారు. వీటిలో సక్రమం ఎన్ని? అక్రమం ఎన్ని? చైల్డ్ ట్రాఫికింగ్ ఎన్ని? అనే అంశాలు ఆరా తీస్తున్నారు. దీనికోసం ఆ ప్రక్రియలు చేయించుకున్న దంపతుల కోసం గాలిస్తున్నారు. రాజస్థాన్ దంపతులతో పాటు మరో మూడు జంటలకు శిశువుల్ని విక్రయించినట్లు బయటపడింది. దీంతో ఈ శిశువులను రెస్క్యూ చేసిన పోలీసులు శిశువిహార్కు తరలించారు. ఈ వ్యవహారాల్లో దళారులుగా వ్యవహరించిన వారితో పాటు శిశువుల్ని ఉద్దేశపూర్వకంగా విక్రయించిన ముగ్గురు తల్లుల్ని కటకటాల్లోకి పంపారు. బుధవారం గోపాలపురం పోలీసులు నమ్రతతో సంబంధాలు కలిగి ఉండి, శిశు విక్రయాల దందా నడిపిన విశాఖపట్నం వైద్యులు రవి, రమ్యలతో పాటు ఏజెంట్లు విజయ్, సరోజ, రత్న, శిశువుల్ని విక్రయించిన ముగ్గురు తల్లుల్ని అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మంది అరెస్టులతో కలిపి ఇప్పటి వరకు ‘సృష్టి’ సంబంధిత కేసుల్లో కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 22కు పెరిగింది. ఫిర్యాదు చేసిన నగరానికి చెందిన గైనకాలజిస్ట్ తాజాగా మరో ఎనిమిది మంది నిందితుల అరెస్టు లోతుగా దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు -
చోరీ కేసులో దంపతుల అరెస్టు
ఆమనగల్లు: వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాన్ని అపహరించిన ఓ జంటని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు తలకొండపల్లి ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామ సమీపంలో గత నెల 30న సాయిబాబ గుడి దగ్గర బెంచిపై అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు మల్లమ్మ కూర్చుని ఉంది. ఇద్దరు ఆమె వద్దకు వచ్చి మాటలు కలిపారు. ఈ క్రమంలో మెడలో ఉన్న బంగారు గుండ్లహారం తీసుకొని నకిలీ ఆభరణం తిరిగి ఇచ్చారు. ఇంటికి వెళ్లిన వృద్ధురాలు అనుమానంతో తన మనవడికి చూపించగా ఆభరణం నకిలీదని గుర్తించి వెంటనే తలకొండపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి వెల్జాలలో ఆభరణం దొంగిలించి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో బంగారు షాపులో వాటిని విక్రయించినట్లు గుర్తించారు. అనంతరం నిందితులను శంషాబాద్ సీసీఎస్ పోలీసుల సహాయంతో జడ్చర్లలో నవాబ్పేట మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలైన ఎరుకలి శ్రీను, అరుణలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ వివరించారు. కేసును త్వరితగతిన ఛేదించిన క్రైం కానిస్టేబుల్ జాషువాను అభినందించారు. -
ప్రైవేటుకు దీటుగా గురుకులాలు
తాండూరు టౌన్: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో బోధన సాగుతోందని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల (ట్రైస్) కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ అన్నారు. బుధవారం తాండూరులోని తెలంగాణ గురుకుల బాలికల పాఠ శాల, కళాశాలను తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, లైబ్రరీ, ల్యాబొరేటరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆన్లైన్ బోధనను పరిశీలించారు. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సిలబస్తో పాటు ఆన్లైన్ తరగతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో అత్యుత్తమ బోధన అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తోందన్నారు. ప్రతి ఏటా ప్రైవేటుకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. తాండూరు గురుకులంలో బోధన, ఫలితాలు, వసతులు భేషుగ్గా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బోధన, వసతుల కల్పనలో మేటి ట్రైస్ సెక్రటరీ రమణకుమార్ తాండూరులోని గురుకుల బాలికల పాఠశాల సందర్శన -
జయశంకర్కు ఘన నివాళి
చిన్నారుల ఆరోగ్యానికి.. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి అన్నారు. 8లోuఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడి, ఉద్యమానికి ఊపిరి పోసింది ప్రొఫెసర్ జయశంకర్ అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి ఉత్సవాలను బుధవారం కలెక్టరేట్లోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్పాత్ర మరువలేనిదని తెలిపారు. ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని, స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏఓ సునీల్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి కేశురాం, వెనుకబడిన సంఘాల నాయకుడు మల్లేష్ యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు డబుల్ బెడ్రూం ఇళ్ల పెండింగ్ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సంబంధిత అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, పెండింగ్ పనులపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. లబ్ధిదారులకు కేటాయింపు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా సంపుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి 15 రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని, లేని పక్షంలో బాధ్యులైన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్, విద్యుత్, అర్డబ్ల్యూఎస్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రూ.13 కోట్లు ఫట్!
సాక్షి, సిటీబ్యూరో: ఒకటి కాదు.. వంద కాదు.. ఏకంగా 72,549 వీధిదీపాలు లేకుండానే వాటి ఏర్పాటు, నిర్వహణ పేరిట కాంట్రాక్టు ఏజెన్సీకి నిధులు చెల్లించారు. ఈ అవినీతి తంతు ఏకంగా ఏడేళ్లు సాగింది. ఇవి ఎల్ఈడీ వీధిదీపాల నిర్వహణకు గాను జీహెచ్ఎంసీ ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్)కు గత ఏప్రిల్ నెలాఖరు వరకు ముగిసిన ఏడేళ్ల కాంట్రాక్టు కాలంలో చెల్లించిన నిధులు. ఒక్కో వీధిదీపం నిర్వహణకు నెలకు రూ.22 వంతున ఏడేళ్ల కాలానికి దాదాపు రూ.13,40,70,552 చెల్లించారు. ఇవి కేవలం నిర్వహణ పేరిట. ఇక వీధిదీపాల ఏర్పాటు ఖర్చు మరింత అ‘ధనం’. ఎంతో కాలంగా నగరంలో కారుచీకట్లు అలుముకున్నా, ఒప్పందం మేరకు 98 శాతం వీధిదీపాలు వెలగకున్నా, ఈఈఎస్ఎల్పై జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోలేదు. మరోవైపు జీహెచ్ఎంసీ తమకు కోట్ల నిధులు చెల్లించాల్సి ఉందంటూ ఈఈఎస్ఎల్ ప్రచారం చేసుకుంది. కాంట్రాక్టు ఒప్పందం మేరకు డ్యాష్బోర్డు పని చేయకున్నా, సీసీఎంఎస్ (సెంట్రల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) బాక్స్లు పని చేయకున్నా జీహెచ్ఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. తప్పుడు లెక్కలు ఈఈఎస్ఎల్ ఒప్పందం ముగియడానికి ముందు.. తిరిగి వీధిదీపాల నిర్వహణ బాధ్యతలు కొత్తగా ఎవరికివ్వాలన్న అంశం చర్చకు రాగా, అప్పటి కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు అసలు నగరంలో వాస్తవంగా ఉన్న వీధిదీపాలెన్నో లెక్క తీయాలని భావించి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించగా, 4,77,539 వీధిదీపాలు మాత్రమే లెక్క తేలాయి. ఒప్పందం ప్రకారం 5,50,088 వీధిదీపాలు ఏడేళ్లపాటు వెలుగులు విరజిమ్మాలి. అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసేంత వరకు కూడా అసలెన్ని వీధిదీపాలున్నాయో, ఎన్ని వెలిగాయో కూడా చూడకుండానే చెల్లింపులు చేశారంటే నిజంగా నిద్రపోయారా, లేక నిద్ర నటించి అవినీతిని ప్రోత్సహించారా? అన్నది జీహెచ్ఎంసీకే తెలియాలి. పర్యవేక్షణ లేమి.. ● జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగాన్ని చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారు. ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి అందుతున్న ఫిర్యాదుల్లో సింహభాగం వీధిదీపాలవే అయినా సమస్యను పరిష్కరించలేకపోయారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లలో ఇప్పటికీ 50 శాతం వీధిదీపాలు వెలగడం లేవు. పేరెన్నికగన్న దుర్గంచెరువు బ్రిడ్జిమీద సైతం నెలలో సగం రోజులు చీకట్లే అలుముకుంటున్నాయి. ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారమైనట్లు మెసేజ్ తప్ప నిజంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫిర్యాదు చేసేందుకు ప్రజలు కార్యాలయాలకు వెళ్లినా అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు తప్ప సంబంధిత ఇంజినీర్లు కనిపించరు. అదేమంటే క్షేత్రస్థాయి విధులకు వెళ్లారని చెబుతారు. కానీ, వారు క్షేత్రస్థాయిలోనూ కనిపించరు. ● పనులకు సంబంధించిన ఎస్టిమేట్స్ సైతం ఫోన్లు చేసి చెప్పి ఆపరేటర్ల ద్వారానే వేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాత్రి 9 గంటల వరకు క్షేత్రస్థాయి విధులు నిర్వహించాల్సిన ఇంజినీర్లు దాదాపు 7 గంటల సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్నట్లు సంబంధిత వాట్సాప్ గ్రూపు లో ఒక ఫొటో పెడుతూ ఉన్నతాధికారులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. జెన్కో నుంచి వచ్చిన డీఈఈ స్థాయి వారికే సదుపాయాలతో కలిపి ఏటా దాదాపు రూ. 50 లక్షల జీతం చెల్లిస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేదు. ఏడేళ్లు దాటినా వీధిదీపాల లెక్కలే సరిగ్గా లేవంటే పనితనం అంచనా వేసుకోవచ్చు. తాత్కాలికం పేరుతో.. పండుగలు, ప్రత్యేక దినోత్సవాల పేరిట ఆయా సందర్భాల్లో తాత్కాలిక వీధిదీపాల పేరుతో ఏటా దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి నగరమంతా ఎల్ఈడీ వీధిదీపాల నిర్వహణ అన్నప్పుడు విడిగా మళ్లీ తాత్కాలికం పేరిట నిధుల ఖర్చెందుకో అర్థం కాదు. ప్రత్యేక సందర్భాల్లో రంగుల కాంతుల వంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేయవచ్చు కానీ.. వీధిదీపాలు తాత్కాలికం ఏమిటో అంతుపట్టదు. వివిధ పనుల్లోనూ అవినీతి చేతివాటం ఎంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ పోల్స్ మార్చడం తదితర పనులకు కాంట్రాక్టర్లు 60 శాతం లెస్కు టెండర్లు వేస్తున్నారంటే, వాటి వెనుక అవినీతి ఎంతో అంచనా వేసుకోవచ్చు. దారి మళ్లుతున్న కేబుల్? శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్ జోన్లలో అవసరం లేకున్నా కేబుల్ తదితర సామగ్రి భారీగా కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని ఎక్కడ వినియోగించారో, ఏంచేశారోలెక్కాపత్రం ఉండదు. వక్రమార్గంలో అవి ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం అవుతాయనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ, ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని సమాచారం. వెలుతురు వెనుక అవినీతి చీకటి? ఎల్ఈడీ వీధిదీపాల పేరిట లూటీ ఏడేళ్లు సాగిన అక్రమాల తంతు కళ్లు మూసుకున్న బల్దియా వస్తే .. కదలరు ఇతర విభాగాల నుంచి జీహెచ్ఎంసీకి వచ్చే అధికారులు గరిష్టంగా ఐదేళ్ల వరకు డిప్యుటేషన్లో కొనసాగవచ్చు. విద్యుత్ విభాగంలో పని చేస్తున్న ఇంజినీర్లు మాత్రం ఆ కాలపరిమితి దాటినా కొనసాగుతున్నారు. బాధ్యతల అప్పగింతలోనూ వివక్ష కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. కొందరు ఈఈలకు ఒక్క సర్కిల్ పర్యవేక్షణ మాత్రమే ఉండగా, కొందరికి ఆరేడు సర్కిళ్లు కూడా ఉండటం వెనుక మతలబు ఏమిటో సంబంధీకులకే తెలియాలి మరి. -
రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
తుర్కయంజాల్: రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మంగళవారం డీసీసీబీ చైర్మన్ అధ్యక్షతన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 మంది సభ్యులను సంఘంలో నూతనంగా చేర్చుకున్నామని, 24 మంది రైతులకు రూ. 2.65 కోట్లు రుణాలను మంజూరు చేశామన్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్ను ఆమోదించడంతో పాటు, 2025–26 మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మూడు నెలల జమా ఖర్చులను ఆమోదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ, సంజీవ రెడ్డి, యాదగిరి, ఎస్.లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సీఈఓ వై.రాందాసు తదితరులు పాల్గొన్నారు.డీసీసీబీ చైర్మన్ సత్తయ్య -
బాలుడు అదృశ్యం
కొందుర్గు: బాలుడు అదృశ్యమైన ఘటన కొందర్గు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన దర్గ చందు(15) స్థానిక బీసీ హాస్టల్లో ఉంటూ కొందుర్గు జెడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో జూలై 31న పాఠశాలకు మూడు రోజులు సెలవులున్నాయని కుటుంబ సభ్యులకు అబద్దపు సమాచారం ఇచ్చి స్వగ్రామానికి వచ్చాడు. అనుమానం వచ్చిన బాలుడి తండ్రి నర్సింలు ఈ నెల 2న పాఠశాల ఉన్నప్పటకీ ఇంటికి ఎందుకు వచ్చావని మందలించాడు. ఈ నెల 3న హాస్టల్కు వెళ్తున్నాని చెప్పి బయలుదేరాడు. తండ్రి మంగళవారం హాస్టల్కు వెళ్లగా సిబ్బంది రాలేదని చెప్పా రు. నర్సింలు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఎటువంటి ఆచూకీ లభించక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొండాపూర్లో అక్రమ బ్లాస్టింగ్ పాఠశాలలో పడ్డ బండరాళ్లు గచ్చిబౌలి: కొండాపూర్లో నిబంధనలకు వి రుద్ధంగా చేపట్టిన బ్లాస్టింగ్తో పక్కన్నే ఉన్న చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో బండ రాళ్లు పడటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాళ్లు పడ్డ ప్రాంతంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్లో ఓ రియల్ఎస్టేట్ సంస్థ సైట్లో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బండ రాళ్లు పగులగొట్టేందుకు బ్లాస్టింగ్ చేపట్టారు. కాంట్రాక్టర్ కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకపోవడంతో సైట్ను ఆనుకొని ఉన్న చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఎగిరి బండ రాళ్లు పడ్డాయి. ఆ సమయంలో కొంత మంది విద్యార్థులు ఆటలు ఆడుకుంటుండగా మరికొంత మంది లంచ్ బ్రేక్ కావడంతో ఆవరణలో ఉన్నారు. బండరాళ్లు ఉవ్వెత్తున దూసుకురావడంతో విద్యార్థులు ఆందోళనతో తరగతి గదుల్లోకి పరుగులు తీశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్లు స్కూల్లో పడ్డాయని వైస్ ప్రిన్సిపాల్ రంజిత్ గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేశారు. బ్లాస్టింగ్ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
కుర్మిద్దలో ‘మార్బని’
యాచారం: కుర్మిద్దలో జపాన్కు చెందిన మార్బని అనే కంపెనీకి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి యాచారం మండల పరిధిలోని కుర్మిద్దలో 426.32 ఎకరాలు, కందుకూరు మండలం మీరాఖాన్పేటలో 546.10 ఎకరాలు కేటాయిస్తున్నారు. కుర్మిద్ద గ్రామంలోని సర్వేనంబర్ 311, 312తో పాటు 290, 291, 294, 295, 296, 297, మీరాఖాన్పేట పరిధిలోని సర్వే నంబర్ 113, 114, 118లో దాదాపు వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సర్కార్ సదరు కంపెనీకి ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మొదట్లో ససేమిరా.. తర్వాత అంగీకారం మార్బని కంపెనీకి కుర్మిద్దలోని సర్వేనంబర్ 290 నుంచి 297 వరకున్న పట్టా భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అన్నారు. సర్కార్ నిర్మించడానికి నిర్ణయించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పక్కనే ఈ భూ ములు ఉండడంతో మొదట్లో ఆగ్రహం వ్యక్తమైంది. మెరుగైన పరిహారంతోపాటు 121 గజాల ప్లాటు ఆఫర్తో మెత్తబడ్డారు. పట్టా భూములు ఇవ్వడానికి ముందుకు రావడంతో రెవెన్యూ అధికారులు దాదాపు 50 ఎకరాలకు పైగా సేకరించారు. టీజీఐఐసీ ద్వారా రూ.30 లక్షలు, మార్బని కంపెనీ నుంచి రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇప్పించారు. కంపెనీకి కేటాయించడానికి ఇంకా పట్టా భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు రైతులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. మొండిగౌరెల్లిలో అభిప్రాయసేకరణ మొండిగౌరెల్లిలోని 820 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరణకు మూడు నెలల క్రితం సర్కార్ నోటిఫికేషన్ ప్రకటించింది. గ్రామంలోని సర్వేనంబర్ 19, 68, 127 అసైన్డ్ నంబర్లతో పాటు పలు పట్టా సర్వేనంబర్లలో ఉన్న భూములను కూడా నోటిఫికేషన్లో పొందుపర్చింది. పారిశ్రామిక పార్క్ కోసమంటూ ప్రకటించింది. ఏ కంపెనీలకు ఆ భూములను కేటాయిస్తుందో మాత్రం నేటికీ ప్రకటించలేదు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి గ్రామంలోని అసైన్డ్, పట్టా భూములను పరిశీలించి భూసేకరణపై రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భూములిచ్చే విషయంలో మిశ్రమ స్పందన రావడంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఢిపెన్స్కు అసైన్డ్ భూములు! మొండిగౌరెల్లిలో అత్యధికంగా రైతులు పుదీన, ఆకుకూరలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఈ గ్రామాన్ని కూరగాయలు, ఆకుకూరల పెంపు కోసం దత్తత తీసుకుంది. గ్రామ రైతులు కూడా రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. పట్టా భూములతో పాటు, వెంచర్ ద్వారా ప్లాట్లు చేసిన భూమిని మినహాయించాలని కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు రైతు కమిషన్ చైర్మన్ సూచించారు. తాజాగా ఆ గ్రామ భూములు డిఫెన్స్కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డిని సంప్రదించగా కుర్మిద్దలోని వెయ్యి ఎకరాలను మార్బని కంపెనీకి సర్కార్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. జపాన్కు చెందిన కంపెనీ ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు కేటాయింపు ఎకారకు రూ.45 లక్షల చొప్పున పట్టా రైతులకు పరిహారం మీరాఖాన్పేట టీజీఐఐసీ వెంచర్లో 121 గజాల ప్లాటు మొండిగౌరెల్లి అసైన్డ్ భూములు ఢిపెన్స్కు ఇచ్చే ఆలోచన -
దళితవాడకు అడ్డు కంచె తొలగింపు
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో నెలకొన్న దళితవాడకు అడ్డంగా కంచె వివాదం సద్దుమణిగింది. రాకపోకలకు ఇబ్బందులు రాకుండా దారిని ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటుపై మంగళవారం దళిత సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ, టీఎమ్మార్పీఎస్, ధర్మసమాజ్పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, కేవీపీఎస్, ప్రజా సంఘాల నాయకులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అడ్డుగా వేసిన కంచెను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అవసరాలకోసం ఇచ్చిన స్థలంలో కంచె వేయడం ఏమిటని ప్రశ్నించారు. దళితులకు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే కంచె ఏర్పాటు చేశారని ఆరోపించారు. కంచె ఏర్పాటుతో దళితులు తమ ఇళ్లకు రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. కంచె ఏర్పాటుతో ఇబ్బంది కలుగుతుందంటే తొలగిస్తామని బూర్గుల నర్సింగ్రావు సోదరి సుమన చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, వివిధ సంఘాల నాయకులు సామేల్, జంగయ్య, చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనునాయక్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. స్మృతివనం ఏర్పాటు చేస్తాం స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్రావు గ్రామ అవసరాలకు ఇచ్చిన స్థలంలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తామని ఆయన సోదరి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బూర్గుల సుమన వెల్లడించారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించిన ఆమె గ్రామస్తులు, దళితులతో మాట్లాడారు. దళితులు వెళ్లడానికి దారి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామానికి ఇచ్చిన స్థలంలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారని, ఆ స్థలంలో బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నారని అన్నారు. ఆ స్థలంలో బూర్గుల నర్సింగ్రావు ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారని, ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారని చెప్పారు. ఏ రోజూ తాము ఆ స్థలాన్ని తిరిగి తీసుకోవాలనే ఆలోచన చేయలేదన్నారు. స్మృతివనం ఏర్పాటుచేస్తే మొక్కలను పశువులు మేస్తాయనే ఆలోచతో కంచె వేశామే తప్ప ఆక్రమించుకునేందుకు కాదని స్పష్టం చేశారు. సద్దుమణిగిన వివాదం -
ద్విచక్ర వాహనాల దొంగకు రిమాండ్
షాద్నగర్రూరల్: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రిమాండ్కు తరలించామని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఠాణాలో సీఐ విజయ్కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని చెరుకుపల్లికి చెందిన నర్సింలు జూన్ 19న ద్విచక్రవాహనంపై షాద్నగర్కు వచ్చాడు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న కొరియర్ కార్యాలయం పక్కన తన బైక్ పార్క్ చేసి వెళ్లాడు. మరునాడు వచ్చి చూడగా కనిపించలేదు. దీంతో ఆయన షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక నైపుణ్యంతో కొత్తూరు మండలం ఇన్ముల్నర్వకు చెందిన కొర్రా వినోద్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. నాలుగు బైక్లు స్వాధీనం నిందితుడిపై ఇప్పటికే షాద్నగర్ ఠాణా పరిధిలో నాలుగు, ఆర్జీఐ పీఎస్ పరిధిలో ఒకటి, కొత్తూరు పరిధిలో నాలుగు, అప్జల్గంజ్ పీఎస్ పరిధిలో రెండు కేసులు నమోదై జైలు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. నిందితుడి నుండి రూ.2 లక్షల విలువ చేసే బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివారెడ్డి, సిబ్బంది రవీందర్, సంతోశ్, కర్ణాకర్, జాకీర్, రాజు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఇద్దరు చైన్ స్నాచర్లకు.. ఇబ్రహీంపట్నం: ఇద్దరు చైన్ స్నాచర్లను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. తలకొండపల్లికి చెందిన సంఘీ నాగరాజు(25) అల్మాస్గూడలో నివసిస్తూ ఆమెజాన్ కంపెనీలో ప్యాకింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. 2023లో ఓ రేప్ కేసులో జైల్కు వెళ్లి వచ్చాడు. షార్ట్ ఫిల్మ్లు తీస్తున్న నాగరాజుకు నెల రోజుల క్రితం జడ్చర్లకు చెందిన వేదవ్యాస్ (24)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే రూంలో ఉంటున్నారు. వ్యసనాలకు బానిసలైన వీరు ఇరువురూ సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ బాటపట్టారు. ఈ నెల 1వ తేదీన పోల్కంపల్లి పంచాయతీ పరిధిలోని జాజోనిబావికి చెందిన లావణ్య(33) తమ పొలంలో పశువులను మేపుతుండగా నాగరాజు, వేదవ్యాస్ బైక్పై వచ్చి ఆమె మెడలోంచి పుస్తెల తాడును అపహరించేందుకు యత్నించారు. సదరు మహిళ అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చారు. అప్రమత్తమైన దుండగులు వెంటనే పుస్తెలతాడును వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్న క్రమంలో మంగళవారం మంగళ్పల్లి వద్ద చైన్ స్నాచింగ్ కోసం యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. చైన్స్నాచింగ్కు వాడిన వేదవ్యాస్ ఆర్15 బైక్ను సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.నాలుగు బైక్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ -
మహాసభలను జయప్రదం చేయాలి
తుర్కయంజాల్: సెప్టెంబర్ 19, 20 తేదీల్లో తుర్కయంజాల్లో నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయా లని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ కోరారు. రాగన్నగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని, పని భద్రత లేదని, ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నా పర్మినెంట్కు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం 2వ పీఆర్సీలో కనీస వేతనం రూ.26వేలు ఇవ్వడంతో పాటు, 60 ఏళ్లు పైబడిన, మరణించిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు పనికల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా కల్పించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె సెగ తప్పదని హెచ్చరించారు. అనంతరం ఆహ్వాన సంఘం చైర్మన్గా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.కిషన్, కోశాధికారిగా సీహెచ్ ఎల్లయ్య, పాలడుగు భాస్కర్, ఎం.చంద్రమోహన్తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. సమావేశంలో 14 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల నుంచి కార్మికులు పాల్గొన్నారు. -
ఆహార విక్రయంలో ప్రమాణాలు పాటించాలి
షాద్నగర్రూరల్: వీధి ఆహార విక్రేతలు పరిశుభ్రతను పాటించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని నెస్ట్లే ఇండియా కార్పొరేట్ అఫైర్స్ మేనేజర్ ఎం.డి.వసీం అన్నారు. పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో మంగళవారం నేషనల్ అసోసియేషన్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా, నెస్లే ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వీధి ఆహార విక్రేతలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ.. వీధి ఆహార విక్రేతలు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. ఆహార నిల్వ, ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. 26 ఏళ్లుగా వీధి ఆహార విక్రేతల హక్కులకోసం పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1,700 మంది వీధి ఆహార విక్రేతలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నేషనల్ అసోసియేషన్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రంగాశాలివాహన్ మాట్లాడుతూ.. నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తే వినియోగదారుల్లో వీధి ఆహారంపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రమాణాల ప్రకారం శిక్షణ తీసుకున్న వీధి ఆహార విక్రేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ విజయ్కుమార్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఖలీల్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
జిల్లా వ్యవసాయాధికారి ఉష కడ్తాల్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి టి.ఉష అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీని ఆమె పరిశీలించారు. మండల పరిధిలో ఎంత వరకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయిందో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా చూడాలని, తగినంత నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం మైసిగండి గ్రామంలో పర్యటించారు. క్వాలిటీ సీడ్ ఫర్ ఎవ్రీ విలేజ్ (క్యూఎస్ఈవీ) పథకంలో లబ్ధిదారుడైన గ్రామానికి చెందిన రామవత్ లక్ష్మణ్నాయక్ సాగు చేసిన వరి పంటను పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, రావిచేడ్ గ్రామాల్లో విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ శోభారాణి, ఏఓ కవిత, ఏఈఓ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి షాబాద్: పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల సభ్యుడు డాక్టర్ సుశీల్ హరిపాండ్ దేశ్ముఖ్, డాక్టర్ కవాస్ ఆనంద్ కృష్ణరాజ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చందనవెల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ ఉప వైద్యధికారి డాక్టర్ నాగేంద్రబాబుతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల నాణ్యతను మెరుగుపర్చాలని, రోగుల్లో నమ్మకం, ప్రజారోగ్య వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ధిష్ట ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్, డిస్టిక్ట్ క్వాలిటీ మేనేజర్ రాము, సీహెచ్ఓ సురేందర్నాయక్, వైద్య సిబ్బంది కవిత, నీలవేణి, నవీన్, కమార్, నవీన్, గోపాల్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చేవెళ్ల: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ అన్నారు. చేవెళ్లలోని ఆదర్శ పాఠశాలలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ, కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణంపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించాలని అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మోహిదీన్, ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డి, యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం జిల్లా కో ఆర్డినేటర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆడిట్లో తప్పుల గుర్తింపు సామాజిక తనిఖీలో వెల్లడి కందుకూరు: మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రామీణ ఉపాధిహామీ పథకం 2024–25 సంవత్సరానికి సంబంధించి 12వ విడత సామాజిక తనిఖీని డీఆర్డీఓ శ్రీలత ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు నిర్వహించారు. మొత్తం మండలంలో ఈజీఎస్ కింద కూలీలు, మెటీరియల్ ఖర్చులకు రూ.6.28 కోట్లు, పీర్ పనులకు గాను రూ.1.34 కోట్లు, ఫారెస్ట్ కింద రూ.35.18 లక్షలు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అనంతరం పంచాయతీల వారీగా నిర్వహించిన ఆడిట్లో గుర్తించిన తప్పులకు సంబంధించి సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మస్టర్లలో కొట్టివేతలు, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో సంబంధిత సిబ్బందికి జరిమానా కింద రూ.16వేలు విధించారు. మళ్లీ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని డీఆర్డీఓ శ్రీలత ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ సుభాషిణి, ఎంపీడీఓ సరిత, అంబుడ్స్మన్ సునీత, ఏపీడీ చరణ్, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఎస్ఆర్పీ కాశయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఈసీలు, టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు. స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం షాద్నగర్రూరల్: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి డిప్లమా, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సులకు ఈనెల 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సిర్టిఫికెట్లతో పాటు వాటి జిరాక్స్ కాపీలను నిర్ధారిత ఫీజుతో ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు. మరిన్ని వివరాలకు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మహేశ్వరం పాలిటెక్నిక్ కళాశాలలో.. మహేశ్వరం: మహేశ్వరం ప్రభుత్వ పాలిటెక్నినిక్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ కోర్సుల్లో 45 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 94901 20175, 72076 83644 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వాహనాల వేలం: రూ.3.11 లక్షల ఆదాయం ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన మూడు వాహనాల వేలం పాటలో రూ.3,11,800 ఆదాయం వచ్చినట్లు ఎకై ్సజ్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఒక బజాజ్ ఆటో, రెండు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలకు వేలం వేశారు. 38మంది రూ.5వేల చొప్పున డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు. మొక్కలు నాటుతున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు -
డ్రగ్స్కు బానిసలు కావొద్దు
ఇబ్రహీంపట్నం: విద్యార్థులు, యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గంజాయి, డ్రగ్స్ను నిర్మూలించాలని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను నిషేధించాలని ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయికు బానిసై జ్ఞానాన్ని, విచక్షణను, శక్తిసామర్థ్యాలను కోల్పోయి జీవితాలను నిస్తేజంగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు. చదువులు, ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను పెడదారి పట్టిస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వం ఈ మహమ్మారిని ప్రారద్రోలేందుకు కలిసికట్టుగా పోరు సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.జగన్, జిల్లా ఉపాధ్యక్షుడు అలంపల్లి జంగయ్య, నాయకులు పి.శివశంకర్, ఆర్.స్వామి, రాఘవేందర్, శివ, చైతన్య, మహేశ్, ప్రభాకర్, లెనిన్, వినోద్, యాదగిరి పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతే లక్ష్యం
బడంగ్పేట్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బాలాపూర్ మండలం మల్లాపూర్లోని వైఏఆర్ గార్డెన్లో మంగళవారం చేపట్టిన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 12 వేల కొత్త రేషన్కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నరకం బియ్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు తీసుకువస్తున్నామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్ర వాప్తంగా ఇప్పటి వరకు 65 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు రేషన్కార్డులు అందించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే సబితారెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, కందుకూరు ఆర్డీవో రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ మేయర్ చిగురింత పారిజాత తదితరులు పాల్గొన్నారు. పోటాపోటీగా నినాదాలు రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎమ్మెల్యే సబితారెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. 2 గంటల సమయంలో మంత్రి అక్కడికి చేరుకోగానే బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా సబితమ్మ జిందాబాద్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. అంతే రెట్టింపుతో కాంగ్రెస్ నాయకులు సైతం నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సబితారెడ్డి మైక్ తీసుకుని ప్రొటోకాల్ పాటించకుండా ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. మీరుమీరే పంపిణీ చేసుకుంటే మేమెందుకు ఇక్కడ అంటూ బహిష్కరించి వెళ్లబోయారు. మీరు వెళ్లొద్దంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెను కోరారు. అదేసమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. రెండు గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. ఏసీపీ జానకిరాం ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం సబితారెడ్డి అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. రేషన్కార్డులు అందుకోవాలని చంటి బిడ్డలతో వచ్చి న తల్లులు ఏంజరుగుతుందో అర్థంకాక విస్తుపోయి చూశారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
గుడిమల్కాపూర్@అజీజ్నగర్!
సమీకృత మార్కెట్ను తరలించే యోచన మొయినాబాద్: మెహిదీపట్నం సమీపంలో ఉన్న గుడిమల్కాపూర్లో 1992లో అప్పటి అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పూల మార్కెట్ నిర్మించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల మార్కెట్, 11 ఎకరాల విస్తీర్ణంలో పూలమార్కెట్ కొనసాగుతున్నాయి. నిత్యం వేల మంది రైతులు కూరగాయలు, పూలు తీసుకుని మార్కెట్కు వెళ్తున్నారు. ప్రతిరోజు 20–25 టన్నుల కూరగాయలు, 30–40 టన్నుల పూలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ట్రాఫిక్ తిప్పలు తప్పేలా.. రైతులతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయలు, పూలను లారీలు, డీసీఎంలలో తీసుకొస్తుంటారు. కొనడానికి వచ్చేవారు సైతం వాహనాలను తెస్తుంటారు. మార్కెట్ స్థాయికి మించి వాహనాలు వస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ జాం అవుతోంది. పండుగల సమయంలో సమస్య మరింత జఠిలంగా మారి గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుంటాయి. దూర ప్రాంతాల నుంచి మార్కెట్కు వచ్చే రైతులు ట్రాఫిక్ సమస్యతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మార్కెట్లో దళారులు ఎక్కువై రైతులు నష్టపోతున్నారు. మార్కెట్లో మౌలిక సదుపాయాలు సైతం కరువయ్యాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మార్కెట్ను నగర శివారుకు తరలించే ప్రక్రియను మొదలు పెట్టారు. ఓఆర్ఆర్ పక్కనే స్థల పరిశీలన ఔటర్ రింగ్రోడ్డు పక్కనే అజీజ్నగర్ రెవెన్యూలోని సర్వేనంబర్ 176లో 150 ఎకరాలను మార్కెట్ ఏర్పాటుకు పరిశీలించారు. ఓఆర్ఆర్ సమీపంలో మార్కెట్ ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి, స్థానిక రైతులకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతులకు సైతం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు 150 ఎకరాల భూమిని సర్వే చేసి కలెక్టర్కు నివేదిక పంపారు. మార్కెట్ తరలింపునకు సంబంధించిన ప్రతిపాదనలను గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీతోపాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రభుత్వానికి పంపారు. భూ కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే స్థల సేకరణ చేపట్టి పనులు మొదలు పెట్టనున్నారు. రైతుల సౌలభ్యం కోసం గుడిమల్కాపూర్లో స్థలం సరిపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ను ఓఆర్ఆర్ సమీపంలోకి తరలించాల ని ప్రతిపాదించాం. రైతుల సౌలభ్యంకోసం, మెరుగైన వసతులు కల్పించేందుకు మార్కెట్ కమిటీలో చర్చించి 150 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. – కావలి చంద్రశేఖర్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఓఆర్ఆర్ పక్కనే అజీజ్నగర్ రెవెన్యూలో భూ పరిశీలన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన అధికారులు మార్కెట్ ఏర్పాటైతే రైతులకు సౌలభ్యం ఇబ్బందులు తీరతాయి గుడిమల్కాపూర్ మార్కెట్లో ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మార్కెట్లో వాహనాల పార్కింగ్కు స్థలం లేదు. ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. మార్కెట్ను అజీజ్నగర్కు తరలిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – గడ్డం వెంకట్రెడ్డి, సురంగల్, మొయినాబాద్ -
మొయినాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని మృగవని పార్కు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీకి చెందిన సిద్ధార్థ (27) మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తన కారులో నార్సింగి నుంచి మొయినాబాద్ వైపు వెళ్తున్నాడు. మృగవని జాతీయ పార్కు వద్ద వెనకనుంచి అతివేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన సిద్ధార్థ కారు డివైడర్ పైనుంచి అవతలివైపునకు దూసుకెళ్లింది. ఈ సమయంలో మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సిద్ధార్థ అక్కడికక్కడే చనిపోయాడు. కారు బెలూన్లు తెరుచుకున్నప్పటికీ అతని ప్రాణాలు దక్కలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, లారీ కింది భాగంలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కావడంతో సిద్ధార్థ అప్పటికే మృతిచెందాడు. సినిమా స్టంట్స్ తరహాలో జరిగిన ప్రమాదం కారణంగా అజీజ్నగర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉండగా సిద్ధార్థ కారును ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. సినిమా స్టంట్స్ తరహాలో ఘటన సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికక్కడే దుర్మరణం -
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి
తాండూరు టౌన్: పరిసరాల పరిశుభ్రతపై వి ద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పట్టణ మున్సిపల్ డీఈ, ఇంచార్జి కమిషనర్ మణిపాల్ సూచించారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు. ఇళ్లు, పాఠశాల, మైదానం వంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లోని పూల కుండీల్లో, టైర్లలో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ఇంటిలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి, మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి పోయి ప్రజలు అనారోగ్యం పాలవుతారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగుతూ వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడంతో పాటు ఇంట్లో వారికి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, పాఠశాల హెచ్ఎం ప్రతిభా భారతి, వార్డు ఆఫీసర్లు కార్తీక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తడి, పొడి చెత్త వేరుచేయాలి పరిగి: పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని గంగపుత్ర కాలనీలో వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు రోజు తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరుగా వేయాలని సూచించారు. చెత్త సేకరణకు ప్రతి రోజు వాహనాలు వస్తున్నాయని వాటిలోనే చెత్తను వేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ దశరథ్ పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ డీఈ మణిపాల్ -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
కుల్కచర్ల: విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని ముజాహిద్పూర్ ప్రభుత్వ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిబా అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్పూర్ మాడల్స్కూల్లో 10వ తరగతి చదువుతున్న నరేశ్ ఈ నెల 2, 3 తేదీల్లో చైన్నైలోని రామకృష్ణ పాలిటెక్నిక్ కాలేజ్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ పోటీలలో ప్రతిభను కనబరిచాడు. ఈ మేరకు ఆయన్ను జాతీయస్థాయి పోటీలకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం నరేశ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
నందిగామ: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, పర్యాటక సాంస్కృతిక క్రీడల ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. మండల పరిధిలోని మొదుళ్లగూడ శివారులోని సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించి దీక్షారంబ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. టెక్నాలజీ రంగంలో శరవేగంగా మార్పులు వస్తున్నాయని, వాటికి అనుకూలంగా విద్యార్థుల్లో సైతం మార్పురావాలని సూచించారు. టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.సైబర్ క్రైం డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి విషయంపై ప్ర త్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్లర్లు విద్యా యోరవడేకర్, శంతరాం బలవంత్ ముజుందార్, వైస్ చాన్సలర్ రా మ కృష్ణన్ రామన్, కుమార్ విజయ్ మిశ్రా, వేణుగోపా ల్ రెడ్డి, పలువురు డైరెక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య
వ్యాధి తగ్గడం లేదని మనస్తాపం షాద్నగర్ రూరల్: వ్యాధి తగ్గడం లేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కేశంపేట రైల్వేగేట్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బల్లేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం కంకల్కు చెందిన పిచ్చకుంట్ల కిష్టయ్య(80) కుటుంబంతో కలిసి కొన్నేళ్లుగా పట్టణంలోని రతన్కాలనీలో అద్దెకు ఉంటున్నారు. కిష్టయ్య చాన్నాళ్లుగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తగ్గకపోవడం, వృద్ధాప్య సమస్యలు చుట్టముట్టడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే గూడ్సు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన రైల్వే పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ రాహుల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేడే ఆఖరు షాద్నగర్ రూరల్: మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ దుకాణాల సముదాయంలోని షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారం ముగియనుందని ఎంపీ డీఓ బన్సీలాల్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 1–ఏ, 13–ఏ, 16– ఏ, 17–ఏ నంబర్ దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు సీల్డ్ టెండర్ల ద్వారా వేలం నిర్వహించి, షాపులను కేటాయిస్తామన్నారు. ఇందులో పాల్గొనే వారు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి ఎంపీడీఓ, ఎంపీపీ ఫరూఖ్నగర్ పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లించి దరఖాస్తు ఫారాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. బుధవారం ఆఫీసులో సీల్డ్ టెండర్లను తెరిచి, దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేధింపుల భర్తపై కేసు నమోదు మొయినాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్తపై మొయినాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనికేపల్లి గ్రామానికి చెందిన చీపిరి రాజుకు 2012లో నాగిరెడ్డిగూడకు చెందిన సరితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సరితకు మరో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. సోదరులు లేకపోవడంతో పుట్టింటి నుంచి భూమి, ఇల్లు ఇప్పించాలని రాజు కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. అతని బాధ భరించలేక కొంత కాలం క్రితం 6 గంటల భూమి ఇచ్చారు. అయినా ఇల్లు కావాలంటూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో గత ఆదివారం సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి అక్కడికి చేరుకున్న రాజు భార్యపై దాడిచేశాడు. దీంతో సోమవారం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవిత సెంటర్లో ఫిజియోథెరపీ ఎంఈఓ చంద్రప్ప బంట్వారం: వారానికోసారి నిర్వహించే ఫిజి యోథెరపీకి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు తప్పక తీసుకురావాలని కోట్పల్లి ఎంఈఓ చంద్రప్ప అన్నారు. సోమవారం భవిత సెంటర్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు డాక్టర్ శ్రీకాంత్ ఫిజియోథెరపీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. సుమారు 20 మందికి పైగా పిల్లలకు ఫిజియోథెరపీ చేయించామన్నారు. వీరికి ప్రతిరోజు తరగతులు ఉంటాయన్నారు. వారానికోసారి ఫిజియోథెరపీ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమం తప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ స్పెషల్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీకాంత్, ఐఈఆర్పీ దిలీప్కుమార్, సీఆర్పీ నర్సింలు పాల్గొన్నారు.