పాలసేకరణ ధరలు పెంచండి
కడ్తాల్: పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని వివిధ గ్రామాల విజయ డెయిరీ సొసైటీ చైర్మన్లు, పాడి రైతులు కోరారు. మంగళవారం వారు హైదరాబాద్లోని తెలంగాణ పాడి పారిశ్రామాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్డీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, సంస్థ ఎండీ చంద్రశేఖర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ.. ఎస్ఎన్ఎఫ్ డిటెక్షన్ను తీసివేయాలని కోరారు. పాడిరైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పాలసేకరణ ధరలను పెంచాలని కోరారు. సకాలంలో పాలబిల్లులు అందించాలని, సబ్సిడీపై దాణ, మినరల్ మిక్చర్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్గుప్తా, పాడి రైతులు, సొసైటీ చైర్మన్లు కడారి రామకృష్ణ, రంగయ్య, శ్రీకాంత్రెడ్డి, నర్సింహారెడ్డి, జితేందర్రెడ్డి, కృష్ణయ్య, రంగనాయక్, హరి ప్రవీన్యాదవ్, నర్సింలు, దశరథ్, బాలాచారి, దుర్గేశ్, శంకర్నాయక్ తదితరులు ఉన్నారు.
టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి పాడిరైతుల వినతి


