breaking news
Ranga Reddy District Latest News
-
చెరువులో పడి బాలుడి మృతి
● నాదర్గుల్ సున్నం చెరువులో ఘటన ● మృతదేహాన్ని వెలికి తీసిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది ఇబ్రహీంపట్నం రూరల్: సైకిల్తో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి, మతిస్థిమితం లేని బాలుడు మృతి చెందిన సంఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. బడంగ్పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లోని ఆశోక్రెడ్డి కాలనీలో నివాసం ఉండే మహ్మద్ అజ్మత్అలీ, అయేషాల దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా, చిన్నవాడు ఉమైర్(6) మానసిక పరిస్థితి బాగోలేదు. దీంతో తల్లితో పాటు ఇంట్లో ఉండేవాడు. రోజు ఆడుకోవడానికి బయటకు వెళ్తుంటాడు. అతన్ని గమనిస్తూ తల్లి ఇంటి పనులు చేసుకునేది. సాయంత్రం ఇంట్లో ఉన్న చిన్న సైకిల్ తీసుకుని బాలుడు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఉమైర్ కోసం వెతకగా కనిపించలేదు. కాలనీలోని చిన్నారులను అడగగా సైకిల్ తీసుకుని చెరువు కట్టవైపు వెళ్లాడని చెప్పారు. అక్కడికి వెళ్లి వెతుకుతుండగా కట్టపై సైకిల్ కనిపించింది. కంగారు పడిన తల్లి పోలీసులకు సమాచారం అందించింది. అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు చెరువులో వెతకగా ఉమైర్ మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఆప్రాంతం దద్దరిల్లింది. గృహిణి అదృశ్యం పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన చక్రధర్ ఐదేళ్ల క్రితం తన భార్య జయంతి(26)తో కలిసి జీవనోపాధి నిమిత్తం జల్పల్లిలోని శ్రీరాం కాలనీకి వలస వచ్చాడు. ఈ నెల 22న ఒడిశాకు వెళ్తానని చెప్పిన జయంతి పుట్టింటికి వెళ్లలేదు. ఆమె ఆచూకీ కోసం అన్ని ప్రాంతాల్లో వెతికినా లాభం లేకపోవడంతో భర్త ఆదివారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాన్ బ్రోకర్పై కేసు నమోదు ఫిలింనగర్: తాకట్టు పెట్టిన బంగారు నగలతో పాటు వడ్డీకి తీసుకున్న డబ్బులతో పరారైన పాన్బ్రోకర్పై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్, గౌతంనగర్ బస్తీలో రాజస్థాన్కు చెందిన మాణిక్చౌదరి అనే పాన్ బ్రోకర్ నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. స్థానికులు చాలామంది అతడి వద్ద ఆభరణాలు తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నారు. ఇటీవల షాపు ఎత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బసవతారకనగర్ బస్తీకి చెందిన జనార్దన్రెడ్డి అనే వ్యక్తి ఐదు తులాల బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుని ఆగస్టు 4న రూ.2.55 లక్షలు చెల్లించాడు. ఈ నెల 18న బంగారం తిరిగి ఇస్తానని చెప్పిన మాణిక్చౌదరి బోర్డు తిప్పేయడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపోలో ఆస్పత్రి బాలాజీ టెంపుల్లో పూజారిగా పనిచేస్తున్న ఆరుట్ల వెంకటరమణ రూ.18 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఫిలింనగర్ పోలీసులు నిందితుడు మాణిచౌదరిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఫిలింనగర్లో పలువురిని నమ్మించి రూ. లక్షలు వసూలు చేయడమే కాకుండా పలువురు రాజకీయ నాయకుల వద్ద కూడా డబ్బులు తీసుకుని మోసం చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. -
లారీ టైర్ల కింద నలిగి తండ్రీకూతురు దుర్మరణం
చేవెళ్ల: సిమెంట్ ట్యాంకర్ బైక్ను ఢీకొట్టిన ఘటనలో తండ్రీకూతురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన తాండ్ర రవీందర్(32) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఏఎన్ఎంగా పనిచేసే భార్య రత్నమ్మ, కూతురు కృప(13), కొడుకు ఉన్నారు. మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట వద్ద కొనసాగుతున్న బంట్వారం ఎస్సీ గురుకుల పాఠశాలలో కృప 7వ తరగతి చదువుతోంది. కూతురుకు జ్వరం వచ్చిందని తెలియడంతో చూసివెళ్లేందుకు రవీందర్ హాస్టల్కు వచ్చాడు. బుధవారం వినాయక చవితి కూడా ఉండటంతో అనుమతి తీసుకుని కూతురుతో పాటు ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో చేవెళ్ల వద్ద వెనక నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్ అతివేగంగా బైక్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ ఎగిరి కింద పడ్డారు. లారీ డ్రైవర్ వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లడంతో చక్రాల కింద నలిగిపోయారు. వెనక టైర్ల కింద పడిపోయిన రవీందర్ను చూసి, అడ్కడే ఉన్న స్థానికులు పెద్దగా అరిచారు. దీంతో డ్రైవర్ లారీని వెనక్కి తీయడంతో రవీందర్ మృతదేహం చక్రాల పైనున్న ఇనుప రేకుల మధ్య ఇరుక్కుపోయింది. ప్రమాదంలో తండ్రీకూతురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవీందర్, కృప మృతితో బీరెల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన చేవెళ్లకు బయలుదేరారు. 25సిహెచ్వి 04, వెనక నుంచి బైక్ను ఢీకొట్టిన సిమెంట్ ట్యాంకర్ హాస్టల్ నుంచి కూతురును ఇంటికి తీసుకెళ్తుండగా చేవెళ్ల వద్ద ఘటన బీరెల్లిలో విషాదఛాయలు -
ధరలు ‘గణ’ం
ఈసారి 20 శాతానికిపైగా పెరిగిన వినాయక విగ్రహాల రేట్లు సాక్షి, సిటీబ్యూరో: భక్తకోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య వేడుకల కోసం నగరం సిద్ధమవుతోంది. మండపాల అలంకరణ, విగ్రహాల కొనుగోళ్లు, పూజా సామగ్రి విక్రయాలతో సందడి నెలకొంది. ఈసారి గణనాథుడి విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది కంటే 20 శాతానికి పైగా ధరలు పెరిగినప్పటికీ అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకులు, కాలనీలు, అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాలు పెద్ద ఎత్తున విగ్రహాలను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ధూల్పేట్, నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి హౌసింగ్బోర్డు, మియాపూర్ తదితర ప్రాంతాల్లో విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. 20 ఫీట్ల ఎత్తు ఉన్న విగ్రహాలు గత సంవత్సరం రూ.85 వేల వరకు విక్రయించగా, ఈసారి రూ.లక్ష దాటింది. ఎక్కువ మంది కొనుగోలు చేసే 12 ఫీట్లు, 16 ఫీట్ల విగ్రహాల ధరలు కూడా బాగా పెరిగాయి. గత సంవత్సరం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు లభించిన విగ్రహాల ధరలు ఇప్పుడు రూ.70 వేల నుంచి రూ.80 వేలు దాటాయి. విగ్రహాలకు అదనపు అలంకరణలు, హంగూ ఆర్భాటాలకు అనుగుణంగా ధరలను పెంచారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర ముడిపదార్ధాలు, రవాణా తదితర ఖర్చులు భారీగా పెరగడంతో విగ్రహాల ధరలను కొంత మేరకు పెంచాల్సి వచ్చినట్లు ధూల్పేట్కు చెందిన బబ్బూసింగ్ తెలిపారు. ధూల్పేట్లోనే తయారు చేసిన 12 జ్యోతిర్లింగాల మహాకాళ వినాయక విగ్రహాన్ని రూ.2 లక్షల వరకు విక్రయించారు. దారులన్నీ ధూల్పేట్వైపే.. తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ ధూల్పేట వినాయక విగ్రహాలకు ఎంతో ఆదరణ ఉంది. దీంతో అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి నచ్చిన విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. 5 ఫీట్ల నుంచి 30 ఫీట్ల భారీ విగ్రహాల వరకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 12 ఇంచులు, 6 ఇంచుల విగ్రహాలు కూడా విక్రయిస్తున్నట్లు రాకేష్ సింగ్ తెలిపారు. 20 నుంచి 30 అడుగుల వరకు ఉన్న విగ్రహాలు, వాటి ఆకృతులు, డిజైన్లు, వినియోగించిన రంగులు, ఫైబర్, తదితరాల ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ధరలు ఉన్నాయి. ధూల్పేట్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వైవిధ్యభరితమైన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయక విగ్రహాలతో పాటు దుర్గామాత ఉత్సవాలకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేసే ధూల్పేట దక్షిణాది రాష్ట్రాలకే ప్రధాన మార్కెట్గా ఉంది. కానీ కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలను హైదరాబాద్కు తరలించి విక్రయిస్తున్నారు. దీంతో పోటీ బాగా పెరిగిందని ధూల్పేటకు చెందిన రాజేశ్వరి తెలిపారు. నిర్వహణ కూడా భారీగానే.. అపార్ట్మెంట్లు, కాలనీ అసోసియేషన్లు, యువజన సంఘాలు, భక్తసమాజాలు నవరాత్రి ఉత్సవాలకు సన్నద్ధమవుతున్నాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న గణనాథుడి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గ్రేటర్లో సుమారు 4 వేలకు పైగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఉన్నట్లు అంచనా. ఖైరతాబాద్, బాలాపూర్ సహా ప్రధాన మండపాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు భారీ మండపాలను ఏర్పాటు చేస్తున్నాయి. విగ్రహాలతో పాటు ఏర్పాట్లు, నిర్వహణ ఖర్చులు సైతం భారీగానే పెరుగుతున్నాయని నిజాంపేట్కు చెందిన ఓ అపార్ట్మెంట్ కార్యదర్శి తెలిపారు. మండపాలు, నిర్వహణ ఖర్చులూ అధికమే 20 అడుగుల విగ్రహం రూ.లక్షకుపైగానే అయినా జోరు తగ్గని విక్రయాలు ధూల్పేట్, నాగోలు, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో సందడి -
తండ్రిని చంపిన కొడుకుకు రిమాండ్
మొయినాబాద్: మద్యం తాగి పనికి వెళ్లకుండా గొడవలు పెడుతున్నాడనే కారణంతో తండ్రిని కొట్టి చంపిన కొడుకును రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడకు చెందిన మహ్మద్ అజ్జుఖాన్(50) కూలీ పనులుచేసేవాడు. ఈనెల 6న ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తన వద్ద డబ్బులు తీసుకుని పనికి ఎందుకు రాలేదని అజ్జుఖాన్ను అడిగాడు. ఇదే విషయమై అజ్జుఖాన్ భార్య సైతం నిలదీస్తుండగా అక్కడికి వచ్చిన కొడుకు మహ్మద్ అజీమ్ఖాన్ తండ్రిపై కోపోద్రిక్తుడయ్యాడు. మద్యం తాగి పనికి వెళ్లకుండా గొడవ పెడుతున్నావంటూ కర్ర తీసుకుని తలపై బాదడంతో అజ్జుఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 14న మృతి చెందాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు సోమవారం నిందితుడు అజీమ్ఖాన్ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కేశంపేట: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ నరహరి అన్నారు. ఇంటర్ స్టూడెంట్, పదో తరగతి విద్యార్థులతో కలిసి హాస్టల్లో రాత్రి వేళ హుక్కా సేవించడంపై ఆదివారం ‘హాస్టల్లో హుక్కా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. సోమవారం మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్, సైబర్ క్రైమ్ అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నతంగా రాణించాలని సూచించారు. చదువు ద్వారా సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజ్కుమార్, మండల విద్యాధికారి చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ అబ్దుల్ హమీద్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, కళాశాల లెక్చరర్లు నారాయణ, లక్ష్మీరాజ్, మల్లేశ్, భరత్, ధృవకుమార్, అస్మా, రాణి, ఆసిఫొద్డీన్ తదితరులు పాల్గొన్నారు. సీఐ నరహరి -
స్క్రాప్ గోడౌన్లో అగ్నిప్రమాదం
కుషాయిగూడ: ఓ స్క్రాప్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన కుషాయిగూడ పోలీస్ష్టేషన్ పరిధిలోని సాయికృష్ణనగర్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమ్మిగడ్డకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్క్రాప్ గోడౌన్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీనిపై సమాచారం అందడంతో కుషాయిగూడ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఆరు గంటల పాటు శ్రమించి సోమవారం తెల్లవారుజామున మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక సమాచారం మేరకు 30 లక్షల వరకు ఆస్థినష్టం జరిగి ఉంటుందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
చూస్తోంది ఏఐ
ఇట్టే పట్టేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఓ గ్రామ కార్యదర్శి సెలవు పెట్టకుండా ఆన్డ్యూటీలో పెళ్లి చూపులకు వెళ్లాడు. ఉదయం పెళ్లి చూపులు ముగించుకుని మధ్యాహ్నం ఆఫీసుకు చేరుకున్నాడు. ఆయన తన ఫోన్ను అటెండర్కు ఇచ్చి లొకేషన్ నుంచి యాప్లో హాజ రు వేయించాల్సిందిగా సూచించాడు. అటెండర్ సదరు కార్యదర్శి ఫొటోకు బదులు తన ఫొటో లొకేషన్ నుంచి షేర్ చేశాడు. అప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ యాప్’ గుర్తించింది. సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసింది. ఆరా తీయగా అసలు విషయం బయటికొచ్చింది. దీంతో సదరు కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇలా విధులకు డుమ్మా కొడుతూ ఒకరికి బదులుగా మరొకరితో ఫేక్ అటెండెన్స్ వేయించుకుంటున్న కార్యదర్శుల తీరుపై జిల్లా పంచాయతీ విభాగం సీరియస్ అయింది. ఇప్పటికే ఆమనగల్లు మండలం సింగంపల్లి కార్యదర్శి సహా ఫరూఖ్నగర్ మండలం బీమారం కార్యదర్శులపై ఇదే అంశంలో సస్పెండ్ చేసింది. వీరితో పాటు మరో ఐదుగురిపై చర్యలు తీసుకుంది. ఫేక్ అటెండెన్స్కు స్వస్తి చెప్పేందుకే.. జిల్లా వ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలు ఉండగా, 318 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 73 మంది ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు పని చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధిలో వీరే కీలకం.ఇంటి నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు సహా పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల పర్యవేక్షణ వంటివి చూసుకోవాల్సి ఉంది. మెజార్టీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లకుండానే వెళ్లినట్లు తప్పుడు హాజరు న మోదు చేయిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకోవాల్సిన కార్యదర్శులు తరచూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ ఫేక్ అటెండెన్స్ విధానానికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం బయోమెట్రిక్ ఐరీస్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పంచాయతీ కార్యదర్శుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తాత్కాలికంగా దాన్ని నిలిపివేసింది. ప్రత్యామ్నాయంగా ఎనిమిది నెలల క్రితం ‘ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్’విధానాన్ని ప్రవేశపెట్టింది. కార్యదర్శులు ప్రతి రోజూ ఉదయం పది గంటలకు విధులు నిర్వర్తించే పంచాయతీ లొకేషన్కు చేరుకుని ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ యాప్ ద్వారా ఫొటో తీసి పంచాయతీ యాప్లో వేసి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది. అవగాహన లేకే.. ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ యాప్పై మెజార్టీ కార్యదర్శులకు అవగాహన లేదు. తెలియక కొంత మంది తప్పు చేస్తే..తెలిసి మరికొంత మంది తప్పు చేసి దొరికిపోతున్నారు. ఇప్పటికే ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో పదిహేను మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విధి నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇట్టే దొరికిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఫిర్యాదులకు స్పందించకుండా, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్యదర్శులపై కూడా నిఘా కొనసాగుతోంది. -
విద్యుత్ శాఖలో అవినీతిపై అధికారుల ఆరా
మొయినాబాద్:విద్యుత్ శాఖలో అవినీతి దందాపై ఉన్నతాధికారులు విచారణ కు ఆదేశించారు. సోమ వా రం ‘సాక్షి’లో ‘కనెక్షన్.. కలెక్షన్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. విజిలెన్స్, ఇంటలిజన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమాలపై ఆరా తీశారు. మొయినాబాద్లో పర్యటించిన అధికారులు బాధితులను కలిసి విషయాలను తెలుసుకున్నారు. కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు, సిబ్బంది ఏ విధంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. ఎవరి ద్వారా తీసుకుంటున్నారనే విషయాలను రాబట్టినట్టు సమాచారం. విచారణలో వెలుగుచూసిన అంశాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. చిలుకూరు సన్నిధిలో రాజవంశ సభ్యురాలు మొయినాబాద్: తిరువనంతపురం రాజవంశ సభ్యురాలు, చారిత్రక రచయిత్రి, ప్రసిద్ధ కవి పద్మశ్రీ అశ్వతి తిరునాల్ గౌరి లక్ష్మీబాయి చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. సోమ వారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు రంగరాజన్ వారికి వాక్ పుస్తకాన్ని అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు. లక్ష్మీబాయి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చక ట్రస్టీ కుటుంబానికి, తిరువనంతపురం పద్మనాభదాస రాజవంశానికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని మరోసారి గుర్తు చేశారని ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. తిరువనంతపురం చరిత్ర, పద్మనాభ స్వామి దేవాలయంపై ఆమె చేసిన రచనలు విశేష ఆదరణ పొందాయని చెప్పారు. మైసిగండిని దర్శించుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని సోమవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ అర్చక సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక సిబ్బంది శాలువా, పూలమాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, ట్రస్టీ శిరోలీ, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాల ని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమస్యలు తెలపడానికి వచ్చిన వారి నుంచి అదన పు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్ ఓ సంగీత ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ..శాఖల వారీగా స్వీకరించిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ వారం మొత్తం 74 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 38, ఇతర శాఖలకు సంబంధించి 36 వచ్చాయన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
పోలీసుల అత్యుత్సాహం తగదు
అబ్దుల్లాపూర్మెట్: న్యాయం కోసం పోరాడుతున్న రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు. అరెస్టులు, కేసులకు ఎర్రజెండా భయపడదన్నారు. అనాజ్పూర్ సర్వే నంబర్ 274,75, 76,77,78,81 లోని సీలింగ్ భూముల్లో రైతులకు 125 ఎకరాలకు సంబంధించి పట్టాపాసు పుస్తకాలు జారీచేయడంతో పాటు, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం అనాజ్పూర్లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలి పారు. నిరసనలో జాన్వెస్లీతో పాటు ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, పహాడీషరీఫ్ ఠాణాకు తరలించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నర్సింహ, నాయకులు శివకుమార్, ముత్యాలు, సుమలత, లింగస్వామి, బాలరాజు, యాదయ్య, భిక్షపతి, జంగయ్య, రాములు, మహేశ్, రవి, రైతులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును తరలించొద్దు
ఇబ్రహీంపట్నం: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించొద్దంటూ సీపీఎం, బీజేపీ సోమవారం వేర్వేరుగా ఆందోళనబాట పట్టాయి. సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సామేల్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు దూర ప్రాంతానికి రిజిస్ట్రేషన్లకు వెళ్లాల్సివస్తే ఇబ్బందులు పడతారన్నారు. ఇబ్రహీంపట్నం ఎస్ఆర్వో కార్యాలయాన్ని మంఖాల్కు తరలించే యోచనను విరమించుకోవాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుగ్గరాములు, జగన్, ఎల్లేష్, వీరేశం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై బీజేపీ రాస్తారోకో ఎస్ఆర్వో కార్యాలయాన్ని తరలించొద్దని బీజేపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, మాజీ కౌన్సిలర్లు ముత్యాల భాస్కర్, నాయిని సత్యనారాయణ మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించడం భావ్యం కాదన్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద శాశ్వత భవన నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయిందని, నిర్మాణాన్ని పూర్తి చేసి అందులోకి మార్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ముత్యాల మహేందర్, కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వినతులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించొద్దని సోమ వారం నిర్వహించిన డివిజన్ ప్రజావాణిలో వినతులు వెల్లువెత్తాయి. రియల్ వ్యాపారులు, స్థానికులు తహసీల్దార్ సునీతకు వినతిపత్రాలు అందజేశారు. -
భూములు ఇచ్చేది లేదు
కందుకూరు:మండలంలోని తిమ్మాపూర్ రెవెన్యూలో అసైన్డ్ భూముల సేకరణకు ప్రభు త్వం సిద్ధమైంది. సర్వే నంబర్లు 38, 162లోని 566.39 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐ సీ ద్వారా పారిశ్రామిక పార్కుకు సేకరించడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా సోమవారం ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి సమక్షంలో గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం ఎకరాకు మూడు రెట్లు అంటే రూ.59.40 లక్షల మేర పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. భూములను ప్రభుత్వానికి ఇచ్చి సహకరించాలని కోరారు. రైతులు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఆ భూములనే నమ్ముకుని జీవిస్తున్నామని, ప్రభుత్వానికి ఇస్తే ఉపాధి కోల్పోతామని ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. 20 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను పట్టాగా చేస్తామని గతంలో అధికార పార్టీ ప్రకటించిందని, ఆవిధంగా మార్చాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని అధికారులు వారికి తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, సీఐ సీతారామ్, నాయబ్ తహసీల్దార్ రాజు, ఆర్ఐ యాదగిరి, టీజీఐఐసీ మేనేజర్ అజీజసుల్తానా తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలకు డీజే అనుమతి లేదు
ఇబ్రహీంపట్నం రూరల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు స్పష్టం చేశారు. ఆదిబట్ల పోలీస్స్టేషన్ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకొనేలా చూడాలన్నారు. విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరి ఆన్లైన్ అనుమతులు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి మండపం వద్దకు వెళ్లి పరిశీలించాలన్నారు. ప్రభుత్వం మండపాలకు ఉచిత విద్యుత్ అందజేస్తోందని తెలిపారు. విద్యుత్, అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మసలు కోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్లో నమోదైన కేసుల పురోగతి గురించి సీఐని అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తదితరులు ఉన్నారు. -
పారితోషికం తగ్గిస్తే ఊరుకోం
ఇబ్రహీంపట్నంరూరల్: ఆశ వర్కర్లు పని చేయడం లేదని, వారికిచ్చే పారితోషికంలో కోత పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం పెంచిన పారితోషికాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని అన్నారు. రూ.18వేలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పీఆర్సీ, ఎరియర్స్ వెంటనే చెల్లించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఇన్సూరెన్స్ రూ.50 వేలు చెల్లిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఆదివారం, పండుగలకు సెలవు ఇవ్వాలని, ప్రభు త్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్, కార్యదర్శి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ కె.రామారావు అన్నారు. పెన్షనర్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినాన్ని పాటించాలని, ఉదయం 11 గంటలకు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సెప్టెంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జరిగే జేఏసీ బస్సు యాత్రలో అధిక సంఖ్య లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి కార్యాచరణ నోటీసు అందజేశారు. పెన్షన్ విద్రోహదినం, హైదరాబాద్ సభకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించా రు. కార్యక్రమంలో శ్రీనేష్కుమార్నోరీ, యశ్వంత్, వెంకటేశ్, నూతనకంటివెంకట్,శాంతిశ్రీ,రంగయ్య, అనిత,మహేశ్,ఈశ్వర్,బాలరాజ్గౌడ్ పాల్గొన్నారు. -
బాలాపూర్ గణేశుడి దర్శనానికి రండి
బడంగ్పేట్: ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథుడి దర్శనానికి రావాలని ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం మర్యా దపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. సీఎంను కలిసినవారిలో కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత, ఉత్సవ సమితి అధ్యక్షు డు కళ్లెం నిరంజన్రెడ్డి తదితరులు ఉన్నారు. నేత్రోనిలనంతో మహాశక్తి గణపతికి ప్రాణ ప్రతిష్ఠ ఖైరతాబాద్: శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి సోమవారం ఉదయం 10.30 గంట లకు కంటి పాపను అమర్చి శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే చేశామని, ఈసారి మహాగణపతిని దర్శించుకునే భక్తులకు అన్ని విఘ్నా లు తొలగిపోవడంతో పాటు విశ్వశాంతి నెలకొనేందుకే విశ్వశాంతి మహా గణపతిగా నామకరణం చేసినట్లు విఠల్ శర్మ సిద్ధాంతి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి సాయంత్రం ఆగమన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా మరాఠా బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. -
గుర్తుంచుకోండి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణేష్ సందడి జోరందుకుంది. ఇప్పటికే అనేక మండపాలకు వినాయక విగ్రహాలు చేయగా...సోమ, మంగళవారాల్లో ఈ హడావుడి మరింత ఎక్కువ అవుతుంది. గతానికి భిన్నంగా ఈసారి ఆగమన్ పేరుతో విగ్రహం ఖరీదు చేయడం, మండపం వరకు తీసుకువెళ్లడం, ఏర్పాటు చేయడాన్నీ అట్టహాసంగా చేస్తున్నారు. వినాయకచవితి ముగిసిన మూడో రోజుల నుంచి నిమజ్జనాలు ప్రారంభం అవుతాయి. ఇలా వాహనాలపై విగ్రహాలకు తీసుకువెళ్లే సందర్భంలో అవి ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లకు తగిలి ధ్వంసం కావడం, ఇరుక్కుపోవడం జరిగే ఆస్కారం ఉంది. ఫలితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం అవుతుంది. ఆదివారం పంజగుట్ట ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన విగ్రహం తీవ్ర ట్రాఫిక్ జామ్స్కు కారణమైంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలని, నగరంలోని ఫ్లైఓవర్ల ఎత్తును, విగ్రహాల ఎత్తుతో పోల్చుకుని అందుకు తగ్గ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.● గణేష్ విగ్రహంతో కూడిన వాహనం వెళ్లే మార్గంలోని వంతెనల కన్నా గరిష్టంగా ఐదు అడుగులు తక్కువగా విగ్రహం ఎత్తు ఉండాలి. వంతెన కింది ఉన్న రోడ్డు నుంచి ఈ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటారు.● ‘గణేష్’ని తీసుకువెళ్లే వాహనం (లారీ, వ్యాన్ తదితరాలు) ఎత్తు గరిష్టంగా ఐదు అడుగులు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విగ్రహం ఎత్తు వంతెన కంటే కనిష్టంగా 5 తక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది.● పోలీసు విభాగం గణేష్ విగ్రహాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ప్రస్తుతం నగరంలో చాలా చోట్ల మెట్రో రైల్ మార్గం ఉంది. కొన్ని చోట్ల మెట్రో రైల్ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ నిర్వాహకులు దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు.● ప్రధానంగా ఎంజే మార్కెట్ మీదుగా భారీ విగ్రహాలు వెళ్లడం కష్టసాధ్యం. వీటిని మండప నిర్వాహకులు దృష్టిలో పెట్టుకుని, ముందుగానే అనువైన దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. విగ్రహం ఎత్తుతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.● విగ్రహాల తరలింపునకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పోలీసు కంట్రోల్ రూమ్ (100, 112) లేదా స్థానిక పోలీసుల్ని సంప్రదించాలి. -
కుంగ్ఫూ పోటీల్లో న్యూమాంక్స్ సత్తా
కొందుర్గు: నగరంలోని యూసూప్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆల్ స్టైల్ కుంగ్ఫూ, కరాటే పోటీల్లో కొందుర్గు న్యూమాంక్స్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు మాస్టర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు అండర్–12 కటాస్ విభాగంలో ఎదిర అనసూయ గోల్డ్ మెడల్, అండర్–14 బాలికల ఫైరింగ్ విభాగంలో నహీద్ గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. బాలురు అండర్–16 ఫైరింగ్లో సాయితేజ గోల్డ్ మెడల్ సాధించగా అండర్–8 విభాగంలో ఎండీ ముజీబ్ ప్రతిభ చూపినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను న్యూమాంక్స్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్పటేల్, తెలంగా చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాల్రాజ్ అభినందించారు. వేర్వేరు విభాగాల్లో ముగ్గురికి గోల్డ్మెడల్ -
ప్రజాసేవే ఉద్యోగుల ధర్మం
మొయినాబాద్: ప్రజలకు సేవ చేయడమే ఉద్యోగుల ధర్మమని.. ప్రజలతో కలిసి పనిచేసే ఉద్యోగులను చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. మొయినాబాద్ పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహించిన గణేశ్ జూలై 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆదివారం మొయినాబాద్లో ఆయన వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిషన్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగులకు సాధారణమే అయినా ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులన్నీ ఇలాంటిస సమయంలోనే గుర్తొస్తాయన్నారు. ప్రతి ఉద్యోగి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి, పోలీసు సిబ్బంది, గణేశ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చేవెళ్ల ఏసీపీ కిషన్ -
ఫ్లైవుడ్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన సలీమ్ గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ప్లై వుడ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఇందులో మల్టీ పర్పస్గా వెల్డింగ్, ప్లైవుడ్, సోఫాల తయారీతో పాటు మేకలు, కోళ్లను పెంచుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గోడౌన్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ అగ్నిమాపక అధికారి చంద్రనాయక్ నేతృత్వంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే చాంద్రాయణగుట్ట నుంచి అగ్నిమాపక కేంద్రంతో పాటు గౌలిగూడ నుంచి రోబోటిక్ యంత్రాన్ని రంగంలోకి దించి మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తుంది. కొన్ని మూగజీవాలు మంటల్లో చిక్కుకుపోయి చనిపోయాయి. కోళ్లు, రెండు మేకలు మృతి చెందాయి. ప్రమాదానికి గల కారణంగా ఇంకా తెలియరాలేదని అగ్నిమాపక అధికారి చంద్రనాయక్ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కాటేదాన్లో ఫైర్ వాహనాలు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో గౌలిగూడ నుంచి రోబోటిక్ యంత్రాన్ని తీసుకువచ్చి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి మంటలు ఆర్పారు. హిందూ ఉత్సవ సమితి స్థల అభివృద్ధికి కృషి తాండూరు: హిందూ ఉ త్సవ కేంద్ర సమితికి కేటాయించిన స్థలంలో పండుగలు జరుపుకునేందుకు వేదికగా మండపాలను నిర్మిస్తామని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, హిందూ ఉత్సవ సమితి చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని ఖాంజాపూర్ గేట్ వద్ద హిందూ ఉత్సవ కేంద్ర సమితి స్థలంలో బోరు వేయించారు. స్వప్నపరిమళ్, పట్లోళ్ల నర్సింహులు, బుయ్యని శ్రీనివాస్రెడ్డి, సందల్ రాజుగౌడ్ సంఘం సభ్యులతో కలిసి పూజలు ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులు సంతోశ్ కుమార్, భానుకుమార్, రామకృష్ణ, నాయకులు ప్రభాకర్గౌడ్, రామకృష్ణ, ప్రవీణ్గౌడ్, పటేల్ కిరణ్, వేణుగోపాల్, శ్రీనివాస్, శ్రీకాంత్రెడ్డి తదితరులున్నారు. -
జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
చేవెళ్ల: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు జీఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏడాదికి రెండు జతల యునిఫాం, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 19, 20 తేదీలలో జిల్లాలోని తుర్కయంజాల్లో నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చేవెళ్ల మున్సిపల్ కార్మికుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా జి.నరేశ్, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ నరేశ్, కోశాధికారిగా సిద్దమ్మ, ఉపాధ్యాక్షులుగా దస్తగిరి, భాస్కర్, నర్సింలు, సహాయ కార్యదర్శులుగా జనార్ధన్, అఫ్జల్, మహేందర్, కిష్టయ్య, కమిటీ సభ్యులుగా మాణిక్యం, మల్లమ్మ, జంగమ్మ, అడివమ్మ, శివయ్య, శ్రీనివాస్ తదితరులను నియమించారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ఆమనగల్లు: ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను విస్మరిస్తోందని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.కిషన్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో యూనియన్ ఆమనగల్లు విభాగం 3వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ మాట్లాడుతూ.. ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని.. చాలీ చాలని వేతనాలతోనే నెట్టుకొస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని.. రెండవ పీఆర్సీలో రూ.26వేల కనీస వేతనం అమలు చేయాలని, 60 ఏళ్లు పైబడిన, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉపాధి కల్పించాలని.. రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇంజమూరి నర్సింహ, శివశంకర్, వగ్గు రవి, హంసమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా నర్సింహ, కోశాధికారిగా గోపాల్, ఉపాధ్యక్షురాలిగా హంసమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రశాంత్, సహాయ కార్యదర్శిగా గణేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విజయ్కుమార్, సభ్యులుగా యాదమ్మ, పద్మ, సుగుణమ్మ, సుధాకర్, చిట్టిబాబు, రాములు, శివ, శ్రీను నియమితులయ్యారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి -
పంజగుట్ట కూడలిలో బ్రిడ్జిని తాకిన విగ్రహం
పంజగుట్ట: వినాయకుని విగ్రహం తరలిస్తున్న వాహనం పంజగుట్ట కూడలి వద్ద బ్రిడ్జికి తాకడంతో వాహనం రోడ్డుపైనే ఆగిపోయి కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం ఓ పెద్ద డీసీఎంలో భారీ వినాయకున్ని తీసుకుని పంజగుట్ట నుండి అమీర్పేట వైపునకు వెళ్తుండగా..పంజగుట్ట కూడలి వద్ద పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి అడ్డంకిగా మారింది. దీంతో వాహనాన్ని అక్కడే ఆపేశారు. రోడ్డు మధ్యలో వాహనం ఆగడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని బంజారాహిల్స్ వైపునకు మళ్లించడంతో అక్కడ వాహనం సాఫీగా వెళ్లిపోయింది. -
వసూళ్ల పర్వం!
సోమవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2025లొసుగుల ముసుగులో సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అధికారులు.. చిన్నచిన్న అంశాలను సాకుగా చూపించి పెద్దమొత్తంలో దోచుకుంటున్నారు. అనధికారిక వెంచర్లలో నాలా కన్వర్షన్ కాని ఖాళీ స్థలాలు, జీపీ లే అవుట్లలో ప్రజావసరాల కోసం వదిలిన పార్కు స్థలాలు, గ్రామ కంఠం భూముల్లో వెలసిన నిర్మాణాలు, లీగల్ హైర్లేని జీపీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వీరి పాలిట వరంగా మారాయి. దీంతో జిల్లాలోని పలువురు సబ్రిజిస్ట్రార్ల(ఎస్ఆర్ఓ)కు కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. మధ్యవర్తుల సాయంతో.. ఉమ్మడి జిల్లాలో నెలకు సగటున 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుండగా వీటిద్వారా ప్రభుత్వానికి రూ.360 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్లు, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇప్పించుకుంటున్న కొంతమంది ఇందుకోసం పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు డాక్యుమెంటుకో రేట్ పెట్టి వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇలా ఒక్క గండిపేటకే నలుగురు అధికారులు వచ్చివెళ్లారు. లీగల్ హైర్ లేని, పాత లే అవుట్లలో ఏలింకూ లేని ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు రూ.పది లక్షల నుంచి రూ.పదిహేను లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గ్రామ కంఠం, అర్బన్ సీలింగ్, 111 జీఓ పరిధిలోని భూముల్లో వెలిసిన బహుళ అంతస్తుల భవనాల్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందుకోసం డాక్యుమెంట్ రైటర్లు, పర్సనల్ డ్రైవర్లను మధ్యవర్తులుగా నియమించుకుంటున్నారు. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరే సమయంలో మధ్యవర్తుల నుంచి సొమ్ము తీసుకెళ్తున్నారు. మచ్చుకు కొన్ని.. ● కోర్టు పరిధిలో ఉన్న సికిందర్గూడలో పది ఎకరాల వివాదాస్పద భూమికి రాత్రికి రాత్రే నాలా కన్వర్షన్ ఉత్తర్వులు జారీ చేయడం, ఓ తెల్ల కాగితంపై లే అవుట్ గీయడం, ఖాళీ ప్లాట్లకు బండ్లగూడ మున్సిపాలిటీ ఇంటి నంబర్లు జారీ చేయడం, ఆ వెంటనే 23 ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం ఇటీవల స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విలువైన ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ● లీగల్ హైర్ సర్టిఫికెట్ లేదనే సాకుతో రాళ్లగూడ ప్రకాశ్నగర్లోని 250 గజాల చొప్పున ఉన్న రెండు ఏజీపీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు శంషాబాద్ ఎస్ఆర్ఓ ఆరు మాసాల క్రితం రూ.2 లక్షలు వసూలు చేశారు. ● మెయినాబాద్ సర్వే నంబర్ 176/23లోని 0.33 ఎకరాల లావణి పట్టా భూమిని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ చేయించారని, ఈ భూములకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కూడా చేశారని, తమకు తెలియకుండా తమ భూములకు నాలా కన్వర్షన్ చేయించి, గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు నాగమ్మ, ఆమె ముగ్గురు కుమార్తెలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు లేదని ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు. కనెక్షన్.. కలెక్షన్! ఆస్తుల రిజిస్ట్రేషన్లలో లోపించిన పారదర్శకత ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రేటు అక్రమాలకు నిలయంగా పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏసీబీకి చిక్కుతున్నా మారని తీరు -
హత్య కేసు.. కొత్తమలుపు!
● రెండో భర్తతో కలిసి మొదటి భర్తను హత్య చేసిన మహిళ ● నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మొయినాబాద్: అజీజ్నగర్ డెయిరీ ఫామ్లో జరిగిన హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్లో పనిచేయడానికి వచ్చిన మహిళ తన మొదటి భర్తతో కలిసి రెండో భర్తను హత్య చేసినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న సామ రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో పని చేసే రాజేశ్కుమార్(24) శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అన్ని విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. నెల రోజుల క్రితమే.. అజీజ్నగర్లోని రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో పనిచేసేందుకు బిహార్కు చెందిన ఏజెంట్ పవన్ ద్వారా నెల రోజుల క్రితం రాజేశ్కుమార్, పూనం దేవి దంపతులు వచ్చారు. అయితే తన మొదటి భర్త మహేశ్సాని అలియాస్ గుడ్డును వదిలేసిన పూనందేవి.. రాజేశ్కుమార్ను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రాజేశ్కుమార్, పూనందేవి అజీజ్నగర్లోని డెయిరీ ఫామ్లో పనిచేస్తున్నారు. ఇటీవల రాజేశ్కుమార్ మద్యం తాగి తనను వేధిస్తున్నాడని పూనందేవి తన మొదటి భర్త మహేశ్సానీకి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఈనెల 21న మహేశ్సాని అజీజ్నగర్ వచ్చాడు. అతను తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి రాజేశ్కుమార్ను హత్య చేసి, పారిపోయారు. హత్య కేసు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఏజెంట్ పవన్తో ఫోన్లో మాట్లాడి పరారైన నిందితుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ వద్ద హత్యకు గురైన రాజేశ్కుమార్ వివరాలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. నిందితులు మహేశ్సాని, పూనందేవిల వివరాలు తనకు తెలియదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో వీరు బిహార్ వెళ్లారా..? మరెక్కడైనా ఉన్నారా..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు దొరికితేనే కేసు విషయాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
బ్యాలెట్ పేపర్లు రెడీ
రద్దు చేయాలి కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు.సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు రెడీగా ఉన్నాం. ఇప్పటికే పది లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించాం. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు తెప్పించి సర్వం సిద్ధం చేశాం. జిల్లా వ్యాప్తంగా 526 పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ చొప్పున జిల్లా వ్యాప్తంగా 4,682 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం’ అని జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే.. ఓటర్ల జాబితా సిద్ధం 2018తో పోలిస్తే ప్రస్తుతం పంచాయతీల సంఖ్య కొంత తగ్గింది. గతంలో 558 పంచాయతీలు ఉండగా, కొత్తగా చేవెళ్ల, మెయినాబాద్ మున్సిపాలిటీలు ఏర్పాటు కావడం.. ఔటర్కు సమీపంలో ఉన్న పలు పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో కలపడంతో 526కు తగ్గింది. ఆయా గ్రామాల పరిధిలో మొత్తం 7,94,653 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,99,404 మంది పురుషులు, 3,95,216 మంది మహిళలు, 33 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసి ఉంచాం. ఆ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి 2024 జనవరి 30తో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. వీధిలైట్లు, ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులు, మంచినీటి మోటార్ రిపేర్ల కోసం నిధుల సమస్య తలెత్తుతోంది. కొన్ని సందర్భాల్లో కార్యదర్శులే సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.104.54 కోట్లు రాగా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.4.75 కోట్లు వచ్చాయి. 75 శాతానికి కంటే తక్కువ ఆస్తిపన్ను వసూలైన పంచాయతీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలయ్యేలా చేసి, సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. ‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బ్యాలెట్ బాక్సులు జిల్లాలో 526 జీపీలు, 4,668 వార్డులు, 4,682 పోలింగ్ స్టేషన్లు ‘సాక్షి’తో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ తరచూ విధులకు గైర్హజరయ్యే పంచాయతీ కార్యదర్శులపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ఇప్పటికే కచ్చితమైన హాజరు కోసం జీపీఎస్ ఆన్లైన్ అటెండెన్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేక్ అటెండెన్స్కు చెక్ పెడుతున్నాం. ఆమనగల్లు మండలం సింగంపల్లి కార్యదర్శి జంగయ్య సహా ఫరూఖ్నగర్ మండలం బీమారం పంచాయతీ కార్యదర్శి అనిల్కుమార్పై ఫేక్ అటెండెన్స్ వ్యవహారంలో సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవలే ఓ కార్యదర్శికి ఒక రోజు సర్వీసు కట్ చేశాం. ఏసీబీకి చిక్కినట్టే చిక్కి, విధులకు ఎగనామం పెడుతున్న మరో కార్యదర్శిపై కూడా వేటు పడింది. వారం రోజుల వ్యవధిలోనే ఐదుగురు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మరో 15 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ప్రభుత్వం త్వరలో బయోమెట్రిక్, ఫేస్రీడింగ్, ఐనిస్ అటెండెన్స్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది.సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నాం జిల్లా వాప్తంగా 3,016 మంది పారిశుద్ధ్య కార్మికులు, 61 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పని చేస్తున్నారు. నిజానికి వీరికి పంచాయతీల బడ్జెట్ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఏడాదిగా 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో వారి వేతనాలను 18 నెలల నుంచి ప్రభుత్వమే స్వయంగా చెల్లిస్తోంది. ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడిని నెలకు సగటున రూ.9,500 చొప్పున, డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.19,500 చొప్పున చెల్లిస్తున్నాం. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి రూ.7.20 కోట్లు ఇటీవలే చెల్లించాం. ఆగస్టు నెలకు సంబంధించిన వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలోనే అవి కూడా చెల్లిస్తాం. -
జై
24.12 ఎకరాలకు ఫెన్సింగ్ 24.12 ఎకరాల ప్రభుత్వ భూమికి రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ చేశారు. మట్టి గణపతికిభక్తుల ఆలోచనా ధోరణి మారింది. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ప్రమాదకరమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, సింథటిక్ కలర్లతో తయారు చేసిన ఎత్తయిన విగ్రహాలకు బదులు స్వచ్ఛమైన బురద మట్టితో తయారు చేసిన ప్రతిమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మేరకు వాటి విక్రయాలు సైతం జోరందుకున్నాయి. ● వినాయక ఉత్సవాల్లో పర్యావరణానికి పెద్దపీట ● మారుతున్న మండప నిర్వాహకుల ఆలోచనా ధోరణి ● మార్కెట్లో విరివిగా మట్టి విగ్రహాల విక్రయాలు ● ఆరు అంగుళాల నుంచి ఐదు అడుగుల ఎత్తు వరకు.. ● రూ.150 నుంచి రూ.14 వేల వరకు ధర హుడాకాంప్లెక్స్: వినాయక విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడంపై పర్యావరణవేత్తలు, న్యాయస్థానాలు ఆందోళన వ్యక్తం చేయడం.. పలు రకాల ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎత్తయిన విగ్రహాల కొనుగోలు, రవాణా, మండపం ఏర్పాటు, ప్రతిష్ఠాపన, ఘనమైన పూజల నిర్వహణ, నిమజ్జనం వంటి అంశాల్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్న విషయం విధితమే. కొన్ని సందర్భాల్లో భక్తులు ప్రమాదాలకు గురైన సంఘటనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తగత భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటు పడేవిధంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి గతంలో ప్రధాన రోడ్లు, షాపుల్లో ఎటు చూసినా రంగులు అద్దుకున్న గణనాథుల విగ్రహాలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం మట్టి విగ్రహాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఆరు అంగుళాల నుంచి ఐదు అడుగుల ఎత్తు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో విగ్రహం ఎత్తు, సైజును బట్టి రూ.150 నుంచి రూ.14 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇతర విగ్రహాలతో పోలిస్తే దరలు కాస్త తక్కువగా ఉండటం, పర్యావరణహితంగా విగ్రహాలను తయారు చేయడంతో మెజార్టీ భక్తులు వీటి కొనుగోళ్లకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నారు. మండపాల్లో జాగ్రత్తలు తప్పనిసరి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించే వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరని నిపుణులు పేర్కొంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. విగ్రహాల తరలింపు, మండపం ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు, నిమజ్జనం వరకు ఇలా ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ● మండపం ఏర్పాటుకు నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి పొందాలి. ● మండపాలకు విద్యుత్ కనెక్షన్లు నేరుగా తీసుకోరాదు. డిస్కం ఇంజనీర్లకు సమాచారం ఇచ్చి, వారి అనుమతి మేరకే తీసుకోవాలి. స్తంభాలను నేరుగా ఎక్కడం కానీ, లైన్లకు వైర్లను వేలాడదీయడం కానీ చేయరాదు. ● లైన్ల కింది నుంచి విగ్రహాలను తరలించే సమయంలో తడిసిన కర్రలతో కానీ ఇనుప రాడ్లతో కానీ వైర్లను తాకరాదు. అలా తాకడం ద్వారా విద్యుత్షాక్కు గురయ్యే ప్రమాదం ఉంది. ● సాధారణంగా మండపంలో లైటింగ్ కోసం వైర్లకు అనేక చోట్ల జాయింట్లు వేస్తుంటారు. విద్యుత్ సామర్థ్యం మేరకు ఎంపిక చేసుకోవడంతో పాటు జాయింట్లు లేకుండా చూసుకోవాలి. ● ఎంసీబీలను విధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత ఇంజనీరుకు/ లైన్మెన్కు సమాచారం ఇవ్వాలి. ● రాత్రి పూట విగ్రహాలకు కాపలాగా నిర్వాహకులతో పాటు పోలీసు గస్తీ ఉండేలా చూసుకోవాలి. ● డీజే, ఇతర సౌండ్ సిస్టం ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ సిస్టం నిలిపివేయాలి. లేదంటే స్థానికుల నుంచి పోలీసుస్టేషన్లకు ఫిర్యాదు లు వెళ్లి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. -
ఆక్రమణలు తొలగించిన హైడ్రా
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి సర్వే నంబర్ 201లోని శ్రీ సూర్య సాయి నగర్లో పార్కు ఆక్రమణలను శనివారం హైడ్రా అధికారుల బృందం కూల్చివేసింది. కాలనీలోని 482 గజాల విస్తీర్ణంలో 283, 284 నంబర్ ప్లాట్లను 2018లో మున్సిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అయినప్పటికీ కొందరు స్థానికులు ప్రహరీ నిర్మించి ఆక్రమించారు. దీనిపై కాలనీవాసులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవల హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. తాజాగా హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేశ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పార్కు స్థలంలోని నిర్మాణాలను కూల్చివేశారు. కొలతలు వేసి, మున్సిపల్ అధికారుల చేత బోర్డు ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాము 20 ఏళ్లుగా సర్వే నంబర్ 159లో కబ్జాలో ఉన్నామని, గతంలో హైడ్రా నుంచి నోటీసులు వచ్చినప్పటికీ రిప్లై ఇచ్చామని, అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని కబ్జాలో ఉన్న రైతులు వాపోయారు. గతంలో హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉందని గుర్తు చేశారు. హైడ్రా ఏడీ సర్వే చేపట్టి రిపోర్టు ఆధారంగా భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ప్రీకాస్టు వాల్ తొలగింపు ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. రోడ్డుకు అడ్డంగా వేసిన ప్రీకాస్టు వాల్ తొలగించి రోడ్డుకు విముక్తి కల్పించారు. మున్సిపల్ కేంద్రంలోని బీరప్ప గుడికి సమీపంలో చక్రధర వెంచర్లో రోడ్డుకు అడ్డంగా కొంతమంది ప్రీకాస్టు వాల్ నిర్మించారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారుల దృష్టికి వెళ్లడంతో శనివారం హైడ్రా సీఐ తిరుమలేశ్ ఆధ్వర్యంలో జేసీబీలతో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా సీఐ తిరుమలేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా పనులు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. నిర్భయంగా హైడ్రాను సంప్రదిస్తే తగున్యాయం చేస్తామని తెలిపారు. -
రిజర్వేషన్ల సాధనకు సత్యాగ్రహ దీక్ష
షాద్నగర్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్లో ఈనెల 25న సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్టు బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. మున్సిపల్ పరిధిలోని చటాన్పల్లిలో శని వారం బీసీ సేన జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీనివాస్ అధ్యక్షతన బీసీ సేన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలంతా కలిసికట్టుగా పోరాటం చేస్తేనే రాజ్యాధికారం సాధ్యమని అన్నారు. బీసీల హక్కుల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా ఆర్.కృష్ణయ్య పోరాటం చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. బీసీలంతా దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మేకల వెంకటేశ్, సుధాకర్, చంద్రశేఖర్, పాలాది శ్రీనివాస్, బాస వరలక్ష్మి, భూషణ్, నరేష్, చందూలాల్, శంకర్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
రేపటి నుంచి ఫీవర్ సర్వే
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతో పాటు సోమవారం నుంచి ఇంటింటికీ జ్వరాల సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.వెంకటేశ్వరరావు సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆశాలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి జ్వర పీడితులను గుర్తించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామాల్లో డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. సమన్వయంతో పని చేయాలి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని డీఎంహెచ్ఓ సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంల సమన్వయంతో పంచాయతీ, మల్టీపర్పస్ సిబ్బందితో గ్రామంలో అవసరమైన పారిశుద్ధ్య పనులకు చర్యలు చేపట్టాలన్నారు. దోమల ద్వారా డెంగీ, చికున్ గున్యా మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని హ్యాబిటేషన్లలో ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వర్షాలకు డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయించాలన్నారు. వర్షం నీరు నిలువ ఉంచకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ షికాహయత్, డాక్టర్ విజయ పూర్ణిమ, జల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు -
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి
ఇబ్రహీంపట్నం: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ను వెంటనే విడుదల చేయాలని, విద్యాశాఖకు మంత్రిని నియమించాలి ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం బస్టాండ్ వద్ద చేపటిన దీక్షలో ఫెడరేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడు పి.జగన్, డివిజన్ అధ్యక్షుడు వంశీ, కార్యదర్శి తరంగ్లు మాట్లాడారు. ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.8,150 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఫీజు చెల్లించని కారణంగా పై చదువుల కోసం విద్యార్థులు కళాశాలల యాజమాన్యం వద్దకు వెళితే.. ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని మొండికేస్తున్నారని తెలిపారు. విద్యాశాఖను తన వద్దనే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. విద్యార్థుల సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్, ఎస్ఎఫ్ఐ నాయకులు జస్వంత్, వినయ్, ప్రదీప్, కిషోర్, నగేష్, విజయ్, రాకేష్, చరణ్, శరత్లు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ -
హరితం.. ఆహ్లాదం
● ఇంటి ఆవరణలో మొక్కలు నాటేందుకు అనువైన సమయం ● వనమహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ షాద్నగర్: ఇటీవల ఇంటి ఆవరణలో మొక్కల పెంపకంపై ఆకస్తి పెరిగింది. వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటడానికి అనువుగా ఉంటుంది. ప్రభుత్వం వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేస్తుంది. వాయుకాలుష్యంతో ముప్పు రోజు రోజుకు వాతావరణం కలుషితమవుతతోంది. చెట్ల సంఖ్య తగ్గడంతో సహజంగానే ధూళి కణాలు గాలిల్లో కలుస్తున్నాయి. ఫలితంగా ఇది ప్రజారోగ్యానికి శాపంగా మారింది. ప్రతి ఏటా వాయు కాలుష్యంతో పలువురు మృత్యువాత పడుతుండగా ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారు. మొక్కలు నాటడం ● వర్షాలు కురుస్తుండటంతో ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటుకోవచ్చు. ● ఇండోర్ ప్లాంట్ల పై ఇటీవల ఆసక్తి కనబరుస్తున్నారు. ● మల్లె, చామంతి, గులాబీ, ఆర్కే ఫామ్, సైకస్, కాకస్, జెర్బరా, ఉసిరి, లిల్లీ, అశ్వగంధ, ఆర్బిడ్, క్రోటాన్, మనీప్లాంట్, స్నే ప్లాంట్, పుదీనా, తులసీ, అలోవెరా, సరస్వతీ తదితర రకాలు ఇంటి పరిసరాల్లో నాటుకోవచ్చు. ● జమ్మి, మేడి, ఉత్తరేణి, తెల్ల జిల్లేడు, దత్తాత్రేయ, మారేడు, గరిక, బ్రహ్మ కమలం, వంటి నవగ్రహాల మొక్కల సైతం నాటుకోవచ్చు. ● స్ధ్ధలం ఎక్కవగా ఉంటే మామిడి, సీతాఫలం, జామ, వాటర్ ఆపిల్, బత్తాయి, జామ, దానిమ్మ, వంటి పండ్ల మొక్కలను నాటొచ్చు. కురగాయలకు ఎండే అండ నేల పై లేదా ఇంటి మేడ పై ప్లాస్టిక్ గ్రో బ్యాగులు, సిమెంట్ కుండీల్లో, పాత బకెట్లు, రంజన్లలో మొక్కలు పెంచుకోవచ్చు. అద్దె ఇంటిలో ఉంటున్న వారు కుండీల్లో పెంచితే మరో చోటుకు సులభంగా తరలించవచ్చు. తీగ జాతి మొక్కలతో చిన్న మొక్కలకు ఇబ్బంది రాకుండా తాళ్ల సాయంతో పైకి పాకించాలి. చీడ పీడలు ఆశిస్తే వేపనూనె లేదా కార్బండిజం, మ్యాంకోజెబ్, మోనోక్రోటోపాస్ కలిపిన మిశ్రమాన్ని మొక్కల పై పిచికారీ చేయాలి. రోజులో కనీసం ఆరు గంటలు సూర్వరశ్మి తగిలే ప్రాంతాల్లో టమాట, బీర, బెండ, పొట్ల, చిక్కుడు, కాకర, వంకాయ, మిరపలతో పాటు ఆకు కూరల సాగుకు అనుకూలంగా ఉంటుంది. మట్టి ఎప్పుడు మార్చాలంటే.. ● ప్రతీ రెండేళ్లకు వానాకాలం ఆరంభంలో కుండీల్లోని మట్టిని మార్చాలి. ● ఎర్ర మట్టి లేదా సారవంతమైన మన్ను, ఇసుక, పశువుల పేడ, వర్మికంపోస్టు, ఎండుటాకులు, రంపపు పొట్టు, బొగ్గు, లిండేన్ పొడిని కలిపి కుండీల్లో నింపుకోవాలి. ● కుండీల్లో తయారయ్యే అమ్మోనియాన్ని బొగ్గు పీల్చేస్తుంది. లిండేన్ పొడి పురుగులను చంపుతుంది. ఇసుక, ఆకులు, రంపపు పొట్టు నేలలో గాలి ప్రసరణకు, తేమను నిలిపేందుకు దోహదపడతాయి. ● అతి తక్కువ పరిమాణంలో యూరియా, డీఏపీ, పొటాష్, జింక్ కలిసి వేయాలి ● నీటిలో కరిగే ఎరువులను మొక్కల పై పిచికారి చేయాలి. కుండీల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరు భాగపస్వామ్యం కావాలి. వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా పూలు, పండ్ల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నాం. ప్రతీ ఒక్కరు మొక్కలు, నాటడంతో పాటుగా వాటిని కాపాడాలి. – సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్ -
మహిళలు స్వయం శక్తితో ఎదగాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలు స్వయం శక్తితో ఎదగాలని జిల్లా పట్టణ పేదరిక నిర్మూళన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.వెంకటనారాయణ అన్నారు. మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా స్వయం శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయంలో స్ట్రీట్ ఫుడ్ పెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటనారాయణ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని తెలిపారు. ఆర్థిక ప్రగతితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. మహిళా స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేయడానికి దశల వారీగా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. మహిళలను చైతన్యం చేసి స్వయం శక్తితో ఎదిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలకృష్ణ, ఏడీఎంసీ అశోక్, చైతన్యం, మేనేజర్ రమేశ్, టీపీఓ అబీబున్నీసాబేగం, డీఈ స్వర్ణకుమార్, సీనియర్ అసిస్టెంట్ స్వప్న, స్వయం సహాయక సంఘాల మహిళలలు తదితరులు పాల్గొన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటనారాయణ -
వ్యక్తి అదృశ్యం
మొయినాబాద్: మద్యం సేవించవద్దన్నందుకు భార్యతో గొడవపడిన వ్యక్తి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధి చిలుకూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధ/లోని చిలుకూరు ఇంద్రారెడ్డినగర్ కాలనీలో నివసిస్తున్న సయ్యద్ రసూల్ భార్య నజ్నిన్ శుక్రవారం రాత్రి మద్యం తాగొద్దంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రసూల్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
24.12 ఎకరాలకు ఫెన్సింగ్
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్ రెవెన్యూ తుక్కుగూడ పరిధిలోని వర్టెక్స్ వెంచర్ సమీపం సర్వే నెంబర్ 68, 70, 71, 73, 85, 86లో ఉన్న 24.12 ఎకరాల ప్రభుత్వ భూమికి రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు పోలీసుల సహకారంతో శనివారం చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ చేశారు. గతంలో ఈ భూమిని ప్రభుత్వం తుక్కుగూడలో భూమి లేని పేదలకు పంపిణీ చేసింది. సదరు భూమిని రైతులు ఓ రియల్ వ్యాపారికి విక్రయించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పీఓటీ నోటీసులు జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి చుట్టూ పోలీసుల సహకారంతో రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పలువురు రియల్ వ్యాపారులు రెవెన్యూ, హెచ్ఎండీఓ అధికారులకు అడ్డుతగిలి మా పట్టా భూమిని స్వాధీనం చేసుకోవద్దంటూ వాగ్వావాదానికి దిగారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేస్తున్నామని, పట్టా భూమి జోలికి రావడం లేదని సర్ది చెప్పారు. పట్టా భూమి ఉంటే సర్వే చేసి కొలిచి చూపుతామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి చుట్టూ పోలీసుల పహారాలో ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్, సీలింగ్ భూములను విక్రయిస్తే పీఓటీ కింద ప్రభుత్వం సాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, హెచ్ఎండీఓ తహసీల్దార్ దివ్య, హెచ్ఎండీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్, మహేశ్వరం డిప్యూటీ తహసీల్దార్ నరేశ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగిన రియల్టర్లు -
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
కేశంపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానంతో ఐసీడీఎస్, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా ఉందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. ప్రీప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని కోరుతూ ఎంఈఓ చంద్రశేఖర్కు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ టీచర్లు సీఐటీయూ మండల కన్వీనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ప్రముఖులు మనన్నలు పొందిన ఐసీడీఎస్ వ్యవస్థను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్య కారణంగా సంవత్సరాల లోపు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల పైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చిన్నారులకు విద్యకంటే పౌష్టికాహారం ముఖ్యమన్నారు. ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు బోధనా బాధ్యతలను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకే అందించాలన్నారు. విద్యా వలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు అదనంగా అందించాలన్నారు. ఆరేళ్లలోపు పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు సంబంధం లేని బీఎల్ఓ తదితర అదనపు పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శశికళ, లక్ష్మి, శివలీల, సుగుణ, సుమలత, సుష్మ, సుమతి, నిర్మలమ్మ, విజయలక్ష్మి, నిర్మల, వినోద, జయమ్మ, భాగ్యలక్ష్మి, అమృత, మంజుల తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు -
గన్తో బెదిరించి తండ్రీ కొడుకులపై దాడి
విజయనగర్కాలనీ: గన్తో బెదిరించి కత్తితో దాడిచేసిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళ్హాట్కు చెందిన ఓ బాలుడు (16) ఈ నెల 22న మెహిదీపట్నంలోని మజీద్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆసిఫ్నగర్ సెయింటాన్స్ బాలికోన్నత పాఠశాల వద్దకు రాగానే ఓ స్కార్పియో కారులో వచ్చిన కొందరు యువకులు పక్కకు తప్పుకోవాలంటూ అతన్ని దుర్భాషలాడుతూ...వాహనాన్ని ఆపి గన్తో బెదిరించారు. భయబ్రాంతులకు గురైన ఆ యువకుడు తన తండ్రి అఫ్సర్ అలీ సయ్యద్ ఫారూఖ్కు సమాచారం అందించాడు. అక్కడకి చేరుకున్న ఫారూఖ్ విషయం ఏంటని ప్రశ్నించగా..అతడిపై కూడా కత్తితో దాడిచేశారు. -
విద్యుత్ తీగల చోరీ
కడ్తాల్: బీవీఆర్ వెంచర్లో విద్యుత్ వైర్ల చోరీ ఘటన మరువక ముందే.. శుక్రవారం రాత్రి మ రో వెంచర్లో 20 స్తంభాల నుంచి విద్యుత్ తీగలను కత్తిరించుకు వెళ్లారు. ఈ ఘటన కడ్తాల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలోని టోల్గేట్ సమీపంలో జేజేఆర్ వెంచర్లో ఈ నెల 22న రాత్రి గుర్తు తెలియని దుండగులు విద్యుత్ వైర్లను అపహరించారు. శనివారం ఉదయం వెంచర్ యజ మాని రాధాకిషన్ రెడ్డి వెళ్లిచూడగా విద్యుత్ తీగ లు కనిపించ లేదు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. డీగ్రీ ప్రవేశానికి గడువు పెంపు ఇబ్రహీంపట్నం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశానికి గడువును ఈ నెల 30 వరకు పెంచామని అధ్యాపకుడు డా.ఈ.శంకర్ తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ రాధికతో కలిసి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తక్కువ ఫీజుతో డిగ్రీ కోర్సులను పూర్తి చేసే అవకాశాన్ని యూనివర్సిటీ కల్పించిందని తెలిపారు. రెగ్యులర్ కోర్సులతో దూరవిద్య సమానమేనని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9441512966 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సురేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఇబ్రహీంపట్నం: వినాయక ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సూచించారు. శనివారం ఓ ఫంక్షన్ హాల్లో డివిజన్ స్థాయిలో గణేశ్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. శాంతియుతంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం, మంచాల, ఫార్మాసిటీ, ఆధిబట్ల, మాడ్గుల సీఐలు, విద్యుత్ ఏఈ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మామిడి కిశోర్ ప్రకారం... శివరాంపల్లి పిల్లర్ నంబర్ 3వ వద్ద ఓ యువకుడు పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటన స్థలా నికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. యువకుడి వయ స్సు 30–35 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలి పారు. మృతుడు స్థానికంగా భిక్షాటన చేస్తూ ఉండేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మా ర్చురీకి తరలించారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే ఉస్మానియా మార్చురీ సిబ్బంది లేదా రాజేంద్రనగర్ పోలీసులను సంప్రదించాలన్నారు. -
తప్పిపోయిన విద్యార్థి కుటుంబ సభ్యుల చెంతకు
యాచారం: తప్పిపోయిన విద్యార్థిని యాచా రం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలు... కందుకూరు మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మనిచరణ్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్నాడు. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి శుక్రవారం ఉదయం యాచారం ఆర్టీసీ బస్టాండ్లో వేచి ఉన్నాడు. గమనించిన యాచారం పోలీసులు ప్రశ్నించగా సరిగా వివరాలు చెప్పలేదు. వసతి గృహంలో చదువుకుంటున్నానని చెప్పడంతో వసతి గృహం ఇన్చార్జితో పాటు తల్లితండ్రులకు సమాచారం అందించారు. నిర్ధారణ చేసుకున్నాక విద్యార్థి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వనస్థలిపురం: వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రూ.70 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజస్ట్రార్ ఎస్.రాజేష్కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుర్కయాంజాల్ పరిధిలోని 200 గజాల స్థల విషయం వివాదాస్పదంగా మారింది. దీని రిజిస్ట్రేషన్కు సబ్రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.70 వేలు ఇస్తానన్నాడు. ఈ మేరకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తన సహాయకుడు, డాక్యుమెంట్ రైటర్ వద్ద టైపిస్ట్గా పని చేసే రమేష్ ద్వారా రూ.70 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. కార్యాలయంలో జరిగే అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య రాజేంద్రనగర్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మామిడి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీరయ్య(26), శ్రావణిలు బుద్వేల్ ప్రాంతంలో నివాసముంటున్నారు. బీరయ్య కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడు. శుక్రవారం ఇంట్లో భార్య శ్రావణి వంట చేస్తుండగా గ్యాస్ అయిపోయింది. దీంతో బీరయ్య ఇదే ప్రాంతంలో ఉంటున్న అత్తగారింటికి వెళ్లి అన్నం అక్కడే వండుకొని రమ్మని భార్యకు తెలిపాడు. దీంతో భార్య తల్లిగారింటికి వెళ్లింది. అనంతరం బీరయ్య ఇంట్లో దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకున్నాడు. భోజనానికి వస్తానని చెప్పిన భర్త ఇంకా రాకపోవడంతో శ్రావణి ఇంటి వద్దకు వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంతకూ తెరవకపోవడంతో స్థానికుల సహయంతో తలుపులు పగలగొట్టి చూడగా ఉరేసుకొని ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచమానా నిర్వహించి ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి దశదినకర్మ రోజే..
కుమారుడి మృతి మొయినాబాద్: తల్లి దినవారం రోజే కుమారుడు మృతి చెందిన ఘటన మెయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లికి చెందిన కమ్మరి వెంకటేశ్ చారి(50) తల్లి పది రోజుల క్రితం మృతి చెందడంతో గురువారం దినవారం(దశదిన కర్మ) కార్యక్రమాలు ముగించారు. రాత్రి లంగర్హౌస్ వద్ద ఉన్న సంగెం ఆలయంలో నిద్ర చేసేందుకు తన కుమా రుడు విశాల్ చారితో కలిసి బైక్పై బయలుదేరారు. రాత్రి 10.50 గంటల సమయంలో పట్టణ సమీపంలోని తాజ్ హోటల్ వద్దకు రాగానే వీరి బైక్ను క్రేన్ ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే వెంకటేశ్చారి మృతి చెందినట్లు నిర్ధారించారు. విశాల్ చారి చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
108 అంబులెన్స్లో ప్రసవాలు
షాద్నగర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణులకు 108 సిబ్బంది పురుడు పోశారు. వివరాలు.. షాబాద్ మంలడలం సర్దార్నగర్కు చెందిన తుల్జాబాయికి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను షాద్నగర్లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు నెలలు నిండలేదని, బీపీ ఎక్కువగా ఉందని, ప్రసూతి చేసేందుకు ఇబ్బంది అవుతుందని వెంటనే హైదరాబాద్లోని పేట్లబుర్జు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 108 వాహనంలో హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో ిసిబ్బంది రాంచంద్రయ్య, మహబూబ్ ఆమెకు పురుడు పోశారు. తుల్జాబాయి పండంటి ఆడ బిడ్డకు జన్మించిందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నీలోఫర్కు తరలిస్తుండగా.. మొయినాబాద్: పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భణిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తెలిపిన ప్రకారం.. మొయినాబాద్కు చెందిన మౌనిక డెలివరీ కోసం గురువారం రాత్రి మొయినాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో సిబ్బంది ఆమెను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంలో నగరంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలిస్తుండగా పురుటి నొప్పులు ఎక్కువ అవడంతో సిబ్బంది ప్రసవం చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్రేమంగా ఉన్నారు. అనంతరం వారిని నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డలు క్షేమం -
సెల్ఫోన్ అందజేత
కేశంపేట: మండల పరిధిలోని బోధునంపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి జనవరిలో హైదరాబాద్లోని ఆరంఘర్ నుంచి నిర్దవెళ్లికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సెల్ఫోన్ పోగోట్టుకున్నాడు. సెల్ఫోన్ దొంగిలించిన వ్యక్తులు కృష్ణారెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి 1.45లక్షలను ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన కేశంపేట పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలోని రూ.87 వేలను కోర్టు ఆదేశాల మేరకు కృష్ణారెడ్డి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. పోగోట్టుకున్న సెల్ఫోన్ లభ్యం అవడంతో శుక్రవారం సీఐ నరహరి, ఎస్ఐ రాజ్కుమార్ బాధితుడు కృష్ణారెడ్డికి అందజేశారు. -
సంక్షేమ పథకాలను వినియోగించుకోండి
మాడ్గుల: పేద, మధ్య తరగతి మహిళలు, నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని ఉన్నతాధికారి డాక్టర్ ముత్తు కుమార స్వామి, హెచ్ఆర్ ఖన్నా అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పశు సంవర్థక శాఖను వారు సందర్శించి మాట్లాడారు. పశు సంతతిపై మార్కెట్లో దుష్ప్రచారం పెరగడం వలన ఎన్ఎల్ఎమ్ పథకంపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఈ పథకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఇర్విన్ గ్రామంలో ఎన్ఎల్ఎమ్ స్కీమ్తో మంజూరైన షిప్ ఫార్మ్ను వారు పరిశీలించారు. రైతులకు సూచనలు చేశారు. రాష్ట్ర పశు సంవర్ధక అధికారులు మధుసూదన్, శ్రీనివాస్రావు, వెంకటయ్యగౌడ్, డాక్టర్ శంకర్ యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిల్మ్సిటీ కబ్జాలను వెలికితీయాలి
● బఫర్జోన్, ఎఫ్టీఎల్లో నిర్మాణాలను తొలగించాలి ● సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీఫిల్మ్సిటీ యాజమాన్యం కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి ప్రజలకు పంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఫిల్మ్సిటీ యాజమాన్యం వేముల కత్వా, ఇందిరా సాగర్, పటేల్కుంటల్లో ఎఫ్టీఎల్, బఫర్జోన్ను ఆక్రమించి భారీ ప్రహరీలను నిర్మించిందని తెలిపారు. ఫిల్మ్సిటీ మెయిన్గేటు వద్ద బఫర్జోన్లో నిర్మాణం చేపట్టారని, ఇందిరా సాగర్ను పూర్తిగా ఆక్రమించారని ఆరోపించారు. ఫిల్మ్సిటీ యాజమాన్యం అక్రమణలకు అడ్డులేకుండా పోయిందని మండిపడ్డారు. సర్వే నంబర్ 307లో 60 ఎకరాలకు పైగా భూమి ఉందని, అందులో 20 ఎకరాలు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ పేరున ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్నారు. 301 సర్వే నంబర్లో ఆరు ఎకరాలు అనాజ్పూర్ ఎస్సీ రైతులకు పట్టాలు ఇచ్చారని, ఆ భూమి ఫిల్మ్సిటీ లోపల ఉండడంతో రైతులు రాకపోకలు సాగించకుండా కోర్టు ఆర్డర్ అడ్డం పెట్టుకొని ఫిల్మ్సిటీ ఆధీనంలో పెట్టుకుందని విమర్శించారు. సర్వే నంబర్ 251లో పది ఎకరాలు ఆక్రమించారని, ప్రభుత్వం వెంటనే సర్వే చేసి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని వెలికితీసి భూమిలేని పేదలకు పంచాలన్నారు. కలెక్టర్ స్పందించి సమగ్ర సర్వే చేపట్టాలని కోరారు. లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింహ, మహేశ్, బాలరాజ్, కావలి రాములు, మల్లయ్య, రవి, వెంకటేష్, బాల్రాజ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు -
చేపల పెంపకం కేంద్రాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి
షాద్నగర్రూరల్: విధుల్లో నిబద్ధతను కనబరిచిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్(డీఐ) వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బంగారు పతకం, నగదు పురస్కారాన్ని అందజేసి అభినందించారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులను సత్కరించారు. ఈ సందర్భంగా డీఐ వెంకటేశ్వర్లు సీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా బంగారు పతకం, నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డీఐ మాట్లాడుతూ.. బంగారు పతకాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. -
సారు.. ఇదేం తీరు!
మొయినాబాద్: విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే తప్పటడుగులు వేస్తున్నారు. నవ సమాజాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులు వృత్తికే కళంకం తెస్తున్నారు. మొన్న వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడమేకాకుండా ప్రశ్నించిన విద్యార్థిని తండ్రిని బూతులు తిట్టి చెప్పుతో దాడికి యత్నించాడు. ఈ సంఘటన మరవక ముందే హిమాయత్నగర్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి వచ్చి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బడికి.. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ హిమాన్షహ కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడు. మద్యం మత్తులో పాఠాలు చెప్పకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గురువారం కొంత మంది పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని మందలించారు. శుక్రవారం గ్రామ పెద్దలతోపాటు ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులను పిలిపించి విషయాన్ని వివరించారు. తీరు మార్చుకోవాలని.. లేదంటే జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి మల్లయ్య పాఠశాలకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సర్వత్రా విమర్శలు మొయినాబాద్ మండలం వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 25 రోజుల క్రితం హిందీ పండిత్ ప్రవీణ్కుమార్ పదో తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తండ్రి పాఠశాలకు వెళ్లి అడిగాడు. దీంతో రెచ్చిపోయిన సదరు ఉపాధ్యాయుడు బూతులు తిడుతూ చెప్పుతో దాడికి ప్రయత్నించాడు. తోటి ఉపాధ్యాయులు వారించినా వినలేదు. ఈ ఘటనపై ఎంఈఓ మల్లయ్య జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. అయినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. షీటీం పోలీసులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి వెళ్లారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిని విధుల నుంచి తొలగించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పే గురువులే తప్పటడుగులు మొన్న వెంకటాపూర్లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన తాజాగా హిమాయత్నగర్లో మద్యం తాగి విధులకు.. -
తహసీల్దార్ల బదిలీ
ఆమనగల్లు: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీచేస్తూ శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు తహసీల్దార్లను నియమించారు. కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మహ్మద్ ఫయిం ఖాద్రిని ఆమనగల్లు తహసీల్దార్గా, కొందుర్గు తహసీల్దార్గా పనిచేస్తున్న రమేశ్ను తలకొండపల్లి తహసీల్దార్గా నియమించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న నాగయ్యను ఫరూఖ్నగర్ తహసీల్దార్గా, నందిగామ తహసీల్దార్గా పనిచేస్తున్న రాజేశ్వర్ను కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్గా, మహేశ్వరం తహసీల్దార్గా పనిచేస్తున్న సైదులును నందిగామ తహసీల్దార్గా బదిలీచేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న చిన్న అప్పలనాయుడును మహేశ్వరం తహసీల్దార్గా కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న రాజేందర్రెడ్డిని కొందుర్గు తహసీల్దార్గా, ఫరూఖ్నగర్ తహసీల్దార్గా ఉన్న పార్థసారధిని కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
సర్వేయర్ల కొరత!
కొందుర్గు: రోజురోజుకూ భూముల విలువలు పెరగడం.. క్రయవిక్రయాలు అధికం కావడంతో భూముల కొలతలు నిర్వహించడం తప్పనిసరిగా మారింది. చాలాకాలం క్రితం కొలవడంతో వ్యవసాయ భూములకు హద్దురాళ్లు లేకుండా పోయాయి. రైతులు ఒకరి భూముల్లో మరొకరు కబ్జాలో ఉండడం పరిపాటిగా మారింది. తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గొడవలు లేకుండా భూములను కొలతలు చేయించుకొని హద్దురాళ్లు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ సర్వేయర్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒక్కో మండలానికి ఒక సర్వేయర్ ఉండాల్సి ఉండగా కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ సర్వేయర్లు సరపడా లేకపోవడంతో ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు మండలాల బాధ్యతలు అప్పగించారు. ఆరు మండలాలకు ముగ్గురే.. షాద్నగర్ డివిజన్లోని ఆరు మండలాలలకు సంబంధించి ముగ్గురే సర్వేయర్లు ఉన్నారు. ఒక్కో సర్వేయర్కు రెండు మండలాల చొప్పున బాధ్యతలు అప్పగించారు. చేవెళ్ల డివిజన్ షాబాద్తోపాటు మహేశ్వరం, గండిపేట మండలాల బాధ్యతలు సైతం షాద్నగర్ డివిజన్లో పనిచేస్తున్న సర్వేయర్లకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. భూముల కొతలకు సంబంధించి దరఖాస్తులు కార్యాలయాల్లో పేరుకుపోతున్నాయి. నాలుగు నెలలుగా ఆగిన సర్వేపనులు ప్రభుత్వం భూ భారతి పోర్టల్ అందుబాటులోకి తేవడం.. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడంతో సర్వే పనులు పెండింగ్లో పడ్డాయి. భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో కొందుర్గు మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. దీంతో ఈ మండలంలో మే నెలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో సర్వేయర్ పాల్గొనాల్సి వచ్చింది. జూన్ 3వ తేదీ నుంచి రాష్ట్రమంతా సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా కొందుర్గు సర్వేయర్గా విధులు నిర్వర్తిస్తున్న సర్వేయర్ ఆంజనేయులు ఇన్చార్జి మండలాలైన జిల్లేడ్ చౌదరిగూడ, షాబాద్ మండలాల్లో జూన్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. ఆ వెంటనే లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ ఉండటంతో జూలై 29 నుంచి సెప్టెంబర్ 25 వరకు శిక్షణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కొందుర్గు మండలానికి 9 మంది, జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను క్షేత్రస్థాయి శిక్షణ కోసం నియమించారు. వారు ఈనెల 7న ఆయా మండలాల్లో క్షేత్రస్థాయి శిక్షణ కోసం విధుల్లో చేరారు. ప్రస్తుతం వారికి సర్వేయర్ ఆంజనేయులు 40 రోజుల పాటు క్షేత్రస్థాయి శిక్షణ అందిస్తున్నారు. దీంతో భూముల కొలతల్లో జాప్యం జరుగుతోంది. రెండుమూడు మండలాలకు ఒక్కరే.. అదనంగా ఇన్చార్జి బాధ్యతలు పేరుకుపోతున్న దరఖాస్తులు ముందుకు సాగని భూముల కొలతలు లైసెన్స్డ్ సర్వేయర్లతోనైనా సమస్యలు తీరేనా? అన్ని గ్రామాల్లో రైతుల పొలాలకు సంబంధించి హద్దురాళ్ల ఆచూకీ కనిపించకుండా పోయాయి. రైతుల మధ్య గొడవలు తప్పడం లేదు. ఒక్కో సర్వేయర్కు రెండు మూడు మండలాలు అప్పగిస్తే సర్వే పనులు ఎలా ముందుకు సాగుతాయి. మండలానికి ఒకరుంటే దరఖాస్తులు పెండింగ్లో ఉండవు. – ప్రేమ్కుమార్, చెర్కుపల్లి లైసెన్స్డ్ సర్వేయర్లకు క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వడం సంతోషకరమైన విషయం. వీరి శిక్షణలో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి హద్దురాళ్లను ఏర్పాటుచేయాలి. సర్కారు భూములు బయటకొస్తాయి. వాటిని అన్యాక్రాంతం కాకుండా చూడాలి. – శెట్టి వజ్రలింగం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కొందుర్గు -
మహిళలకు కేంద్రం పెద్దపీట
చేవెళ్ల: మహిళలకు కేంద్రం పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నా రు. చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చట్టంగా మార్చి అమలు చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మండలంలో ప్రారంభించిన పల్లెపల్లెకూ బీజేపీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి ఖానాపూర్లో దళిత రైతు ఇంట్లో బస చేశారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని రైతులు రవీందర్రెడ్డి, శేఖర్రెడ్డి పంట పొలాలలను పరిశీలించి వారితో మాట్లాడారు. అక్కడి నుంచి ఆలూరులో మహిళా సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నారీశక్తిని ఆర్థికశక్తిగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా మహిళలు వ్యాపారం చేసుకునేందుకు రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు తక్కువ వడ్డికే రుణాలు అందించి చేయూత అందిస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించి ఓ పార్టీ మోసం చేస్తే 19 నెలలే పాలించిన ఈ ప్రభుత్వం మరింత నాశనం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఎన్నికల్లో గెలిస్తే తులంబంగారం ఇస్తామని ఇవ్వలేదని, ఇందిరమ్మ ఇళ్లు, రైతు బంధు, రుణమాఫీ ఇవ్వలేదన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించి మార్పు చూడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కార్యదర్శి జి. వెంకట్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రభాకర్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.విజయలక్ష్మి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో హామీల అమలులో కాంగ్రెస్ విఫలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టండి
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఏకధాటి వర్షాలు.. భారీ వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు సోమవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య నిర్వహణ పనులు, దోమల నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రతి రోజూ కాలనీలు/బస్తీల్లో ఫాగింగ్ చేయడంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. క్లోరినేషన్ తర్వాతే తాగునీటిని సరఫరా చేయాలని, పైపులైన్లకు లీకేజీలు లేకుండా, నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రైడే పాటించాలని, ఈ నెలాఖరులోగా వనమహోత్సవాన్ని పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సంబంధిత అధికారులు ల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలకు సిద్ధంకండి ఇబ్రహీంపట్నం రూరల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం గణేశ్ ఉత్సవాలపై డీసీపీలు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించి మార్గదర్శకాలను అనుసరించి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నిమజ్జనం కోసం జిల్లాలో 44 చెరువులను గుర్తించినట్లు తెలిపారు. శోభాయాత్ర నిర్వహించే రూట్లలో రోడ్లకు ప్యాచ్ వర్కులు చేయాలన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో క్రేన్లు, బారికేడ్లు, వేదికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొవాలని ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మెడికల్, శానిటేషన్ కంట్రోలింగ్ రూం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్కుమార్, మాదాపూర్ అడిషనల్ డీసీపీ సాయిరామ్, ఆర్డీఓలు అనంతరెడ్డి, చంద్రకళ, సరిత, జగదీశ్వర్రెడ్డి, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేకుండా చూడండి
షాద్నగర్రూరల్: రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావుకు విన్నవించారు. శుక్రవారం మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుత సీజన్లో వ్యవసాయానికి సరిపడా యూరియాను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లేడుచౌదరిగూడ మండలానికి వ్యవసాయ మార్కెట్ యార్డును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి తుమ్మలకు షాద్నగర్ ఎమ్మెల్యే వినతి -
నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి
తుర్కయంజాల్: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కోరారు. శుక్రవారం ఆదిబట్ల ఠాణా పరిధి తుర్కయంజాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. విగ్రహాల తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ ఏడాది ఇప్పటికే తొమ్మది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వర్షాలు నేపథ్యంలో తేమ కారణంగా మూడు ఫీట్ల దూరంలో ఉన్నప్పటికీ విద్యుత్ తీగల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని సూచించారు. ప్రభుత్వం 11 రోజుల పాటు మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ కొందరు విద్యుత్ శాఖ వారిని సంప్రదించకుండా నిర్లక్ష్యంగా తీగలకు కొండీలను తగిలిస్తున్నారని ఇది సరికాదన్నారు. ఐఎస్ఐ మార్క్తో పాటు ఎంసీబీని కొనుగోలు చేసి సమాచారం ఇస్తే విద్యుత్ శాఖ సిబ్బంది లీగల్గా కనెక్షన్ను ఇస్తారని చెప్పారు. వినాయకుడి వద్ద ఉంచే దీపం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్వేషాలకు, వివాదాలకు తావివ్వకుండా పండుగను నిర్వహించుకోవాలని, ముందు తరాలకు ఆదర్శంగా ఉండేలా నిర్వాహకులు మెలగాలని కోరారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, పోలీసులకు సహకరించాలని కోరారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను ప్రశాంతంగా ముగిసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిబట్ల సీఐ రవి కుమార్, మున్సిపల్ డీఈ భిక్షపతి, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి -
మజీద్పూర్ స్కూల్ను సందర్శించిన గుజరాత్ బృందం
అబ్దుల్లాపూర్మెట్: మండలంలోని మజీద్పూర్ ప్రభుత్వ పాఠశాలను గుజరాత్ విద్యాఽశాఖాధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 80 మంది విద్యాధికారులు ప్రత్యేక పర్యటనలో భాగంగా సందర్శించి తెలంగాణ విద్యా రంగంలో చేసిన మార్పులను తెలుసుకున్నారు. మన తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పాటతో అమ్మఆదర్శ కమిటీ సభ్యులు అలరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పి.సుశీందర్రావు, స్టేట్ సీఎంవో కె.జోసెఫ్, ఏఎంవో జయచంద్రారెడ్డి, రంగారెడ్డి సీఎంవో వెంకటేశ్వర్లు, ఎంఈవో జగదీశ్వర్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రమేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్భాస్కర్రెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మహేశ్ పాల్గొన్నారు. -
కాలుష్య కారక పరిశ్రమను మూసేయండి
షాబాద్: కాలుష్యానికి కారణమైన కుందనా పరిశ్రమను వెంటనే మూసివేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని చందనవెల్లి రెవెన్యూలో కొనసాగుతున్న కుందానా కంపెనీ ఎదుట గ్రామస్తులతో ఆందోళన చేపట్టారు. అనంతరం కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ కాంతారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ నుంచి రసాయనాలతో కూడిన పొల్యూషన్ వల్ల ఎన్నో పశువులు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. రసాయనాలు పంట పొలాల్లోకి వెళ్లి పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. పొల్యూషన్ కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారని వాపోయారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశ్రమల శాఖ పరిశ్రమను పరిశీలించి సీజ్ చేయాలన్నారు. లేదంటే కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ కొలన్ ప్రభాకర్రెడ్డి, సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు భీమయ్య, అరుణ్కుమార్, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, యాదయ్య, గ్రామస్తులు, తదితరులున్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ -
పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం
● ‘పనుల జాతర’కు స్పందన కరువు ● కార్యక్రమంపై ప్రజలకు సమాచారం ఇవ్వని సెక్రటరీ కేశంపేట: ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా ఉద్యోగులు తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో వారిదే ప్రముఖ పాత్ర. పాపిరెడ్డిగూడ పంచాయతీ కార్యదర్శి పనితీరు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి అనంతరం గ్రామసభ నిర్వహించాలని మండలాధికారులు సూచించారు. ఈ గ్రామసభలకు గ్రామ ప్రత్యేక అధికారులతో పాటుగా మాజీ ప్రజాప్రతినిధులను, గ్రామస్తులను ఆహ్వానించాలని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి, లబ్ధి తదితర విషయాలను వివరించాలన్నారు. పాపిరెడ్డిగూడ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండానే గ్రామసభను ఏర్పాటుచేశాడు. ప్రజలు అందుబాటులో లేక రోడ్డు పైన వెళ్తున్న వారిని నలుగురిని తీసుకువచ్చి గ్రామసభను నిర్వహించాడు. గ్రామస్తులకు మందస్తు సమాచారం అందించకపోవడంతో గ్రామంలో పనుల జాతర కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. -
వ్యవసాయానికి సాగు నీరివ్వాలి
షాద్నగర్రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చంద్రసాగర్, అమ్రాబాద్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి వ్యవసాయ రంగానికి సాగు నీటిని అందించాలని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. చంద్రసాగర్, అమ్రాబాద్ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టా లని కోరుతూ గురువారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనం ఆవరణలో పాలమూరు అధ్యయన వేదిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లాకు అప్పర్ప్లాట్కు జరిగిన అన్యాయం మరెక్కడా జరగలేదని ఆరోపించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పాలమూరు ప్రజలు వలస కూలీలు, నిర్వాసితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు నీటి తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేయడంలేదని ఆరోపించారు. అప్పర్ప్లాట్ దిగువ రైతాంగానికి, ఎగువ రైతాంగానికి మధ్య విభేదాలు తలెత్తకుండా చంద్రాసాగర్ రిజర్వాయర్ ఆధారంగా నీటిని లిఫ్ట్చేసి సాగు నీరందించాలన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అర్జునప్ప, నర్సింలు, కృష్ణ, నర్సింలుగౌడ్, బాలయ్య, తిరుమలయ్య, చంద్రశేఖర్, కృష్ణయ్య, శివరాములు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ -
గణేశ్ ఉత్సవాల్లో అప్రమత్తంగా ఉండాలి
కందుకూరు: వినాయ చవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకీరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఎంఆర్ఆర్ ఫంక్షన్హాల్లో గురువారం సీఐ సీతారాం ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుపై ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. విద్యుత్ సరఫరా కోసం నాణ్యమైన విద్యుత్ తీగలనే వాడాలన్నారు. డీజేకు అనుమతి లేదన్నారు. ప్రధాన మండపాల వద్ద నిర్వాహకులే సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, ఎంపీడీఓ సరిత, విద్యుత్ ఏఈ వేణుగోపాల్రెడ్డి, ఆర్ అండ్ బీ ఏఈ రవి, ఫైర్ ఆఫీసర్ నాగార్జున, మెడికల్ ఆఫీసర్ ఉమెరా సుల్తానా పాల్గొన్నారు. -
ఫ్యూచర్సిటీతోనే అభివృద్ధి
యాచారం: ఫార్మాసిటీ బదులు ఫ్యూచర్సిటీని నిర్మిస్తున్నామని, ఇందుకు ప్రజల మద్దతు అవసరమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కుర్మిద్ద, మంగళిగడ్డతండా, మర్లకుంటతండా, తాడిపర్తి గ్రామాల్లో గురువారం రూ.12 కోట్ల నిధులతో ఎమ్మెల్యే 117 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీని నిర్మించాలని కుట్రలు చేశారన్నారు. కానీ రేవంత్రెడ్డి సర్కార్ ఫార్మాసిటీని రద్దు చేసి అదే భూముల్లో ఫ్యూచర్సిటీని నిర్మిస్తున్నామన్నారు. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 20 ఏళ్ల దూరదృష్టితో అభివృద్ధి పనులు చేపట్టడానికి టీజీఐఐసీ ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందన్నారు. అందులో భాగంగా యాచారం–కందుకూరు రోడ్డును వంద అడుగులకు విస్తరించడానికి కృషి చేస్తానన్నారు. ఫార్మాసిటీ భూసేకరణలో నకిలీ, బినామీ పేర్లతో రూ.కోట్లాది పరిహారం పొందిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ అనంత్రెడ్డికి సూచించారు. కుర్మిద్దలో అసైన్డ్ పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న ఎకరాలకు మొత్తం పరిహారం ఇవ్వకుండా అప్పటి అధికారులు మోసం చేశారని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వనందుకు అప్పటి అధికారులు టీజీఐఐసీ పేరు మీద భూ రికార్డులు మార్చేశారని, వాటిని మళ్లీ తమపై మార్చేలా కృషి చేయాలని కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల్లోని రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురునాథ్రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీలు శ్రీనివాస్రెడ్డి, రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఎంపీటీసీ యాదయ్యచారి, మాజీ సర్పంచులు వెంకట్రెడ్డి, రమేష్, రాజశేఖర్రెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, అరవింద్నాయక్, సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
ఏసీబీ కేసు.. రెండు రోజులకే ఆఫీసు!
● ఏకంగా సీట్లో కూర్చొని పలు దస్త్రాలపై సంతకాలు ● చర్చనీయాంశమైన ఆమనగల్లు తహసీల్దార్ లలిత తీరు ● సస్పెన్షన్ వేటు.. కేసు నమోదుకు కలెక్టర్ సిఫార్సు సాక్షి, రంగారెడ్డిజిల్లా: మూడు రోజుల క్రితం ఏసీబీ అదుపులో ఉన్న తహసీల్దార్ గురువారం ఏకంగా అదే ప్రభుత్వ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ప్రభుత్వ అధికారిగా సీట్లో కూర్చొని, ఏకంగా పలు దస్త్రాలపై సంతకాలు సైతం చేశారు. కార్యాలయ ఉద్యోగులంతా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి లోనయ్యారు. పట్టాదారు పాసు పుస్తకంలో దొర్లిన పేరు తప్పిదాన్ని సరి చేసేందుకు ఆమనగల్లు తహసీల్దార్ లలిత ఓ రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. అప్పటికే సర్వేయర్ రవి సహకారంతో రూ.50 వేలు తీసుకుంది. మరింత మొత్తం కావాలని డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఈ నెల 19న అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వ హించారు. తహసీల్దార్ లలిత, మండల సర్వేయర్ కోట రవిపై కేసు నమోదు చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరు తూ కలెక్టర్కు నివేదించారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. నిజానికి వారిద్దరినీ అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్లు అంతా భావించారు. కానీ ఏసీబీ అధికారులు అలా చేయకుండా కేవలం నోటీసులిచ్చి వదిలేశారు. దీన్ని సదరు తహసీల్దార్ అవకాశంగా తీసుకున్నారు. బుధవారం విధులకు దూరంగా ఉన్నప్పటికీ గురువారం ఏకంగా ఆఫీసులో ప్రత్యక్షమై పలు దస్త్రా లపై సంతకాలు కూడా చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర వరకు సీట్లోనే కూర్చొని కనిపించారు. తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు అవినీతి ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న తహసీల్దార్ లలితను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. భూభారతి లాగిన్ సహా ప్రభుత్వ సిమ్కార్డును సైతం మార్చివేసినట్లు తెలిపారు. ఏసీబీ కేసు నమోదైన తర్వాత విధులకు హాజరు కావడం నేరమని, విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్ ద్వారా సదరు తహసీల్దార్పై ఆమనగల్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ డీటీ ద్వారా తమకు ఫిర్యాదు అందిందని, ఈ మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనున్నట్లు ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. -
మద్యం మత్తులో వ్యక్తి మృతి
చేవెళ్ల: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మూర్చ వ్యాధితో పాడి పోయి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కేసారం బస్స్టేజీ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రాయిచూర్ గ్రామానికి చెందిన సురేశ్(30) భార్య సోనీలు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సురేశ్కి మూర్చ వ్యాధితో పాటు మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 19న భార్యాభర్తలు నగరంలో ఉండే సురేశ్ సోదరుడు హనుమంతు వద్దకు ఆస్పత్రికి చూపించుకునేందుకు వెళ్లారు. అక్కడే ఉండగా 20న సురేశ్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. ఆయన మద్యం తాగి హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కి చేవెళ్లలో దిగిపోయాడు. కేసారం గేట్ వద్ద అతనికి మూర్చ రావడంతో అక్కడే కిందపడి మృతి చెందాడు. స్థానికులు గమనించి గురువారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెళ్లి పరిశీలించి అతని వద్ద లభించిన ఆధారాలతో విచారణ చేయగా కొడంగల్కు చెందిన సురేశ్గా గుర్తించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. భార్య సోని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నాలుగు గుర్తుతెలియని మృతదేహాలు స్వాధీనంచిలకలగూడ: వేర్వేరు ఘటనల్లో నాలుగు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను చిలకలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది, చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ప్రాంగణంలోని వెయిటింగ్హాలు వద్ద రెండు రోజులుగా ముగ్గురు వ్యక్తులు అపస్మారకస్ధితిలో ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అత్యవసర విభాగంలో చేర్పించారు. చికిత్సపొందుతూ గురువా రం గుర్తుతెలియని ముగ్గురు మృతి చెందారు. మృతులంతా గాంధీఆస్పత్రి పరిసర ప్రాంతా ల్లో నివసించే యాచకులుగా భావిస్తున్నారు.మైలార్గడ్డలో...సీతాఫల్మండి మైలార్గడ్డలో బాలాజీ స్వీట్షాపు సమీపంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో పడున్నట్లు గస్తీ పోలీసులు గుర్తించారు. ప్రత్యేక వాహనంలో గాంధీ అత్యవసర విభాగానికి తరలించగా, చికిత్స పొందుతు గురువారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు గుర్తించేందుకు మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్లో వాటర్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్
ధ్రువపత్రాన్ని జారీ చేసే ప్రక్రియను సులభతరం ● ఆన్లైన్ సేవలు ప్రారంభించిన జలమండలి ఎండీసాక్షి,సిటీబ్యూరో: మహానగర పరిధిలో నూతన భవన నిర్మాణదారులకు జలమండలి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా భవనాలు నిర్మించుకునే వారు జీహెచ్ఎంసీ అనుమతుల కోసం సమర్పించాల్సిన వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రాన్ని జారీ చేసే ప్రక్రియను సులభతరం చేసి ఆన్లైన్ లోనే పొందేలా సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. గురువారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కలిసి జూబ్లీహిల్స్ లోని జలమండలి థీమ్ పార్క్ లో ఆన్న్లైన్లో వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రాన్ని జారీ చేసే సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ● గ్రేటర్ పరిధిలోని నూతన భవనం నిర్మించాలంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ తప్పనిసరి. ఆ పర్మిషన్ కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజబిలిటీ తో పాటు జలమండలి జారీ చేసే వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో, తర్వాత ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో సీజీఎం జారీ చేసేవారు. వివిధ కారణాల రీత్యా ఈ ప్రక్రియలో జాప్యం జరిగేది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ధ్రువపత్రాల జారీని ఆన్లైన్లోనే పొందేలాగా మార్పులు చేశారు. ధ్రువపత్రాలు జారీ ఇలా... జలమండలి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వెబ్సైట్ ద్వారా నీటి ఫిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం ఆనన్లైన్లో దరఖాస్తు చేయాలి. దీని కోసం అప్లై ఆన్లైన్ ఫర్ వాటర్ ఫీజిబులిటీ సర్టిఫికెట్ అనే లింక్ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన వెంటనే ఫైల్ నంబర్ జనరేట్ అవుతోంది. అవసరమైన పత్రాలను దరఖాస్తు సమయంలోనే అప్లోడ్ చేయాలి. ఇండెమ్నిటీ బాండ్ను రికార్డ్ కీపింగ్ కోసం సమర్పించాల్సి ఉంటుంది. ● ఒక్కో దరఖాస్తుపై రూ. 5,000 ప్రాసెసింగ్ ఫీజును నగదు కౌంటర్, ఆన్న్లైన్ విధానం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కనెక్షన్ చార్జీలు అందిన ఫైళ్లకు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ఆధారంగా సీజీఎం (రెవెన్యూ) డిజిటల్ సంతకంతో ఫిజిబిలిటీ సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
హెచ్ఎండీఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: తొర్రూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం అడిషన్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరల్లో సర్వే నంబర్ 383లో 117 ఎకరాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన వెంచర్లో ప్లాట్లు కేటాయించి నేటికీ రిజిస్ట్రేషన్ చేయలేదని అన్నారు. భూములు కోల్పోయిన తమకు 2022లో ఎకరానికి 300 గజాల చొప్పున కేటాయించినప్పటికీ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పిన నాలుగేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి హక్కులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బాధితులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగల కింద వినాయక మండపం
● గాలి వీచడంతో హైటెన్షన్ వైర్లపై పడిన ప్లాస్టిక్ కవర్లు ● అప్రమత్తతతో తప్పిన ముప్పు తుర్కయంజాల్: వినాయక మండపాల ఏర్పాటు, తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలీసుల హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు వరుసగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ సూరజ్నగర్ కాలనీలో హైటెన్షన్ లైన్ కింద కొందరు యువకులు మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పైకప్పుగా వేసిన కవర్లు గాలికి ఎగిరి హైటెన్షన్ లైన్పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన యువకులు వెంటనే పక్కకు తప్పుకుని, పోలీసులకు సమాచారం అందించారు. కరెంట్ సరఫరాను నిలిపివేయించి, జేసీబీ సాయంతో మండపాన్ని తొలగించారు. విద్యుత్ తీగలకు దూరంగా మరోచోట ఏర్పాటు చేసుకోవాలని యువకులకు పోలీసులు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సలీం షాద్నగర్: జర్నలిస్టులు మీడియా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం అన్నారు. గురువారం పట్టణ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) షాద్నగర్శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర మఫిషియల్ కమిటీ చైర్మన్ గుడుపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎండి.సలీం హాజరై మాట్లాడుతూ.. పడిపోతున్న మీడియా విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందన్నారు. సమాజంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా పెరిగిపోవడంతో మీడియా విలువలు తగ్గుతున్నాయన్నారు. ప్రస్తుతం మీడియాలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందుతున్నాయన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వస్తాయన్నారు. అనంతరం డివిజన్ నూతన ప్రింట్ మీడియా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీశైలం, భాస్కర్, రమేష్, రాఘవేందర్యాదవ్, నర్సింహ, ఫయాజ్, శ్రీనివాస్, విష్ణు, సాబేర్, శ్రీకాంత్, సంతోష్, శంకర్, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వలస కూలీ వద్ద గంజాయి లభ్యం కేసు నమోదు చేసిన పోలీసులు కేశంపేట: ఒడిషాకు చెందిన వలసకూలీ గురువారం గంజాయితో పోలీసులకు చిక్కాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో ఒడిషాకు చెందిన బిస్వాంత్ మేహర్ భార్యతో కలిసి జీవిస్తున్నాడు. సొంత రాష్ట్రంలో తన అమ్మానాన్నల వద్ద ఉన్న కూతురును చూసే సాకుతో రెండు నెలలకోసారి ఒడిషాకు వెళ్తాడు. తిరిగి వచ్చే క్రమంలో గంజాయి వెంటతెస్తాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం పౌల్ట్రీఫాంలో బిస్వాంత్ మేహర్ గదిని తనిఖీ చేయగా 46 గ్రాముల గంజాయి లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సికింద్రాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదం బారిన పడిన ఒక మహిళ ప్రాణాలను అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రక్షించాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ డివిజనల్ సెక్యురిటీ ఆఫీసర్ ఏ.నవీన్కుమార్ గురువారం వెల్లడించారు. ఈనెల 20న సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు శ్రీకాకుళం జిల్లా కాంచిలికి చెందిన ముప్పినేటి సారద్ అనే 52 ఏళ్ల మహిళ ఎక్కే ప్రయత్నం చేసింది. బీ2 బోగీ ఎక్కబోయిన మహిళ అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్సంజయ్కుమార్ ప్రమాదం బారిన పడుతున్న మహిళను గుర్తించి బయటకు లాగి బోగీ, ప్లాట్ఫామ్ మధ్య నలిగిపోకుండా రక్షించాడు. విధుల్లో అప్రమత్తంగా ఉండి ప్రమాదం బారిన పడిన మహిళను రక్షించిన కానిస్టేబుల్ సంజయ్కుమార్ను ఆర్పీఎఫ్ అధికారులు అభినందించారు. -
మహిళలు స్వశక్తితో ఆర్థిక ప్రగతి సాధించాలి
కడ్తాల్: మహిళలు స్వశక్తితో ఆర్థిక ప్రగతి సాధించాలని తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవేందర్ అన్నారు. మండల కేంద్రంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు సొంత కాళ్లపై నిలబడేందుకు అభయ ఫౌడేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు మాధవులు, నాయకులు కుమార్గౌడ్, మహేశ్, వెంకటేశ్, రమేశ్నాయక్, ఇమ్రాన్బాబా తదితరులు ఉన్నారు.మీర్పేట మున్సిపల్ కమిషనర్గా నాగమణిమీర్పేట: మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నాగమణి గురువారం బాధ్యతలు చేపట్టారు. దమ్మాయిగూడ కమిషనర్గా పనిచేసిన ఆమె బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఏఎంసీ సంరెడ్డి నాగేందర్రెడ్డి, డీఈ వేణుగోపాల్, ఇతర సిబ్బంది నాగమణికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
బాదుడు!
ఫ్యూచర్సిటీతోనే అభివృద్ధి ఫార్మాసిటీ బదులు ఫ్యూచర్సిటీ నిర్మిస్తున్నామని, ప్రజల మద్దతు అవసరమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.లోడు.. భారంగా కొత్త విద్యుత్ కనెక్షన్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్త విద్యుత్ కనెక్షన్లు వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నాయి. అపార్ట్మెంట్లు, మల్టీస్టోరేజ్, హైరేజ్ బిల్డింగ్స్లోని గృహాల విద్యుత్ (ఎల్టీఎం) కనెక్షన్లు మరింత భారం కానున్నాయి. వినియోగదారుడి అవసరం, అభిప్రాయంతో సంబంధం లేకుండా డిస్కమే స్వయంగా కనెక్టివిటీ లోడు నిర్ణయించడం, ఈ మేరకు కచ్చితమైన నిబంధనలు అమల్లోకి తేవడంతో ఆయా గృహ విద్యుత్ వినియోగదారులు ఆర్థిక భారం మోయకతప్పని పరిస్థితి నెల కొంది. సింగిల్ బెడ్రూమ్ ఇంటికి రెండు కిలోవాట్లు, డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఐదు, త్రిబుల్బెడ్రూమ్ ఇంటికి పది, నాలుగు అంతకంటే ఎక్కువ బెడ్రూమ్లున్న ఇంటికి 15 కిలోవాట్ల లోడును తప్పనిసరి చేసింది. వినియోగదారులంతా దరఖాస్తు సమయంలో ఆయా కిలోవాట్లకు నిర్దేశించిన ఫీజు మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. ఫలితంగా కొత్తగా ఇల్లు కట్టుకోవాలని భావించిన వారిపై గతంతో పోలిస్తే అదనపు భారం తప్పడం లేదు. తక్కువ సామర్థ్యం లోడుతో దరఖాస్తు ప్రస్తుతం గ్రేటర్ జిల్లాల్లో 64 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో 53 లక్షల గృహ, మరో 8 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో డిమాండ్ 68 నుంచి 70 మిలియన్ యూనిట్లు నమోదవుతుండగా వేసవిలో 90 మిలియన్ యూనిట్లు దాటుతోంది. దీనికి తోడు నెలకు సగటున 2,500పైగా కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. మెజార్టీ నిర్మాణ సంస్థలు/ బిల్డర్లు భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఒక్కో ప్లాటుకు ఒక కిలోవాట్ చొప్పున కనెక్టివిటీ లోడు నిర్ణయించి, ఆ మేరకు కిలోవాట్కు రూ.1,616 ఫీజు చెల్లించి కొత్త కనెక్షన్లకు దరఖాస్తు చేస్తున్నారు. తీరా గృహ ప్రవేశం తర్వాత ఎంచుకున్న లోడుకు మించి విద్యుత్ను వినియోగిస్తున్నారు. సామర్థ్యానికి మించి వినియోగిస్తుండడంతో వేడికి వైర్లు ఒత్తిడికి లోనై కాలిపోవడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు తీవ్ర ఒత్తిడికి లోన వుతున్నాయి. లో ఓల్టేజీ కారణంగా సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య తలెత్తి ఇంట్లో విలువైన విద్యుత్ గృహోపకరణాలు కాలి బూడిదైపోతున్నాయి. భవిష్యత్తు అవసరాల మేరకు ముందే కనెక్టివిటీ లోడు ఎంపిక చేసుకుంటే సమస్యలు ఉండవని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ స్పష్టం చేస్తోంది. ఇంటి నిర్మాణ ప్లాన్, కిచెన్లు, పడకగదుల నిష్పత్తి ఆధారంగా కనెక్షన్లు, కనెక్టివిటీ లోడు ముందే ఎంపిక చేసుకోవడం ద్వరా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని, విద్యుత్ కనెక్షన్లు పొందాలని భావించిన పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది. విస్తీర్ణాన్ని బట్టి డిస్కం మోత సింగిల్ బెడ్రూమ్, డబుల్, త్రిబుల్, ఫోర్ బీహెచ్కేకు విడివిడిగా కనెక్టివిటీ లోడు వినియోగదారులకు షాక్ కొత్త నిబంధనలతో ఆందోళనఔటర్ రింగ్ రోడ్డుకు అటుఇటుగా అనేక కొత్త అపార్ట్మెంట్లు, మల్టీ స్టోరేజ్ భవనాలు, హైరేజ్ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వినియోగదారుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆయా నిర్మాణ సంస్థలు తక్కువ కనెక్టివిటీ లోడు కనెక్షన్లు తీసుకుంటున్నాయి. నిజానికి గతంలో ఏడాది సగటు విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని, కనెక్టివిటీ లోడుకు మించి విద్యుత్ను వినియోగించిన వారికి నోటీసులు జారీ చేసేవారు. డెవెలప్మెంట్ చార్జీలు వసూలు చేసి, ఆ మేరకు పబ్లిక్ డీటీఆర్, సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచేవారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో ఆయా వినియోగదారులంతా కనెక్షన్ల కోసం గృహ ప్రవేశానికి ముందే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. -
బాలాపూర్ గణేశుడి రూట్ మ్యాప్ పరిశీలన
బడంగ్పేట్: బాలాపూర్ గణనాథుడి శోభాయాత్రకు తరలివెళ్లే ప్రాంతాలను గురువారం పోలీసులు పరిశీలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, మహేశ్వరం ఏసీపీ జానకీరెడ్డి, బాలాపూర్ సీఐ సుధాకర్తో కలిసి పర్యటించారు. గణేశుడి కోసం వేస్తున్న సెట్ గురించి ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఉత్సవాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. -
ఉద్యాన పంటల్లో సస్యరక్షణ
కృషి విజ్ఞాన్ కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ కందుకూరు: ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలైన టమాటా, బెండ, వంగ, కాకర, జామ వంటి తదితర పంటల్లో ప్రధాన సమస్యలను ఉద్యాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయా పంటలకు ఆశిస్తున్న తెగుళ్లు, పురుగులు, వాటి నివారణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన అంశాలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై కృషి విజ్ఞాన్ కేంద్రం క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ముందస్తు రక్షణ చర్యలివే సూక్ష్మజీవుల మిశ్రమం యొక్క అప్లికేషన్ అనగా ట్రైకోడెర్మా, సూడోమోస్, పెసెలోమైసెస్, అజాటోబాక్టర్, ఫాస్ఫో బాక్టీరియా, ఫోటాస్ బాక్టీరియా, జింక్ బాక్టీరియాలను మొక్కలను నాటడానికి ముందు పశువుల ఎరువులో అభివృద్ధి చేసి పొలంలో వేసుకుంటే తెగుళ్లు, వ్యాధులు, సాగు ఖర్చు తగ్గుతాయి. కూరగాయల పంటలలో ముందు జాగ్రత్త చర్యగా నాటిన 15 రోజుల్లోపు కార్బెండజమ్ 2గ్రా లీటరు నీటితో కలిపి నేల తడిచేలా పిచికారీ చేస్తే మట్టిలో పుట్టే రోగాలు రాకుండా చూడవచ్చు. రసం పీల్చే తెగుళ్లను నివారించడానికి లీటరు నీటికి ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మి.లీ పిచికారీ చేయాలి. అన్ని ఉద్యాన పంటలు సూక్ష్మపోషక లోపం లక్షణాలను కనబరుస్తున్నట్లు గుర్తించడమైనది. మ్యాక్స్ లేదా గ్రోత్ లేదా విపుల్ లేదా స్వర్ణపాల్ లేదా ఫార్ములాస్– 4 లేదా అర్కా వెజిటబుల్ స్పెషల్ 2– 3 గ్రా. లీటరు నీటికి పూల మొగ్గ ప్రారంభించే ముందు, పుష్పించే ముందు, పండు దశల్లో మూడుసార్లు పిచికారీ చేయాలి. పంట గుర్తించిన సమస్య తీసుకోవాల్సిన చర్యలు ● టమాటాలో..ఆకు ముడత లీటర్ నీటిలో ఒక మి.లీ లేదా 1.5 గ్రాముల క్లోరోథలనిల్ లేదా ఒక మి.లీ.లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ప్రొఫికోనోజోల్ పిచికారీ చేయాలి ● బ్యాక్టీరియల్ ఎండు తెగులు..కాపర్ఆక్సీక్లోరైడ్ 30 గ్రా+స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి ఒక గ్రాముతో మట్టిని తడిపి, అదే మోతాదులో రసాయనాలతో ఫోలియర్ను పిచికారీ చేయాలి. ● బూజు తెగులు..లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రా లేదా డైఫెంకోనోజోల్ 0.5 మి.లీ లేదా సాఫ్ 2 గ్రాములు కలిపి స్ప్రే చేయాలి. ● తేనెబంగ, తామర పురుగుల.. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. లేదా డైఫెంతురియన్ 1.25గ్రా నివారణకు లేదా అసిఫెట్ 1.5 గ్రా లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పండు తొలుచు పురుగు .. వరి తవుడు+బెల్లం+ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరీఫాస్తో విషపు ఎరలను వరుసల మధ్య వేయాలి. అబామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ 1 మి.లీ లేదా థయోడికార్బ్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పాము పొడ తెగులు ట్రైజోఫాస్ 2 మి.లీ లేదా డైఫెంతురీయన్ 1.25 గ్రాము, వేప నూనె 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● కాయ కుళ్లు తెగులు..లీటరు నీటికి 5 గ్రా కాల్షియం నైట్రేట్ను వారం మధ్యలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ● పూత, పిందె రాలకుండా..ప్లానోఫిక్స్ 3 మి.లీ+ సూక్ష్మపోషక మిశ్రమం 45 గ్రా. 15 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ● వంకాయలో సస్యరక్షణ..కాయ, కొమ్మ రెనాక్సిపైర్ 0.3 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ తొలిచే పురుగు ఒక మి.లీ లీటరుకు 5 మి.లీ వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి. ● ఎర్ర నల్లి..సల్ఫర్ 3గ్రా లేద ఆఅబామెక్టిన్ 1.0 గ్రా. లేదా ఫెంతురియన్ 1.25 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ లేదా ప్రొపార్జైట్ 2 మి.లీ లీటరు నీటికి వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి. ● బెండతోటలో..కాయ తొలుచు పురుగు రెనాక్సిఫైర్ 0.3 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ 1 మి.లీ లీటరు నీటికి 5 మి.లీ వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి. ● రసం పీల్చే పురుగు..తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3గ్రా లేదా డైఫెంతురియన్ 1.25గ్రా లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఎర్ర పురుగు..సల్ఫర్ 3గ్రా లేద ఆఅబామెక్టిన్ 1.0 గ్రా. లేదా డైఫెంతురియన్ 1.25 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ లేదా ప్రొపార్జైట్ 2 మి.లీ లీటరు నీటికి వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి. ● కాకర,బెండలో..కాయ తొలుచు పురుగు సామూహిక ట్రాపింగ్ కోసం ఫెరోమోన్ ఉచ్చులు(15–20/ఎకరం)ఉంచాలి. డైక్లోరోవాస్ 1 మి.లీ లీటరు నీటికి పిచికారీ చేయాలి. ● రసం పీల్చే పురుగు..తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3గ్రా లేదా డైఫెంతురియన్ 1.25గ్రా లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● జామ..ఫ్రూట్ ఫ్లై సామూహిక ట్రాపింగ్ కోసం ఫెరోమోన్ ఉచ్చులు (15–20/ఎకరం) ఉంచాలి.మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దు
● భూభారతికి ప్రాధాన్యత ఇవ్వాలి ● సత్వరమే పరిష్కరించాలి ● అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ భారతి దరఖాస్తులు, ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు. భూభారతి దరఖాస్తులు, ఇతర అంశాలపై సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులతో గురువారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? ఎంత మందికి నోటీసులు ఇచ్చారు? క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారంకాకుంటే దరఖాస్తుదారుడికి సమా చారం అందించాలని ఆయన సూచించారు. గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని సివిల్ సప్లయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి, ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణదారులుపై చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ సంగీత, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు సిద్ధంకండి ఇబ్రహీంపట్నం రూరల్: రానున్న ఖరీఫ్ సీజన్లో అవసరమైన ధాన్యం సేకరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై గురువారం అదనపు కలెక్టర్ చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 33 వేల హెక్టార్ల ధాన్యం సేకరణ అంచనా వేసినందున, ఎక్కడా సమస్య తలెత్తకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలుకు 33 కేంద్రాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరును మరోసారి పరిశీలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, గన్నీ బ్యాగులు, టార్పిలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి వనజాత, జిల్లా మేనేజర్ గోపీకృష్ణ, డీఆర్డీఓ శ్రీలత, వ్యవసాయాధికారి ఉష, జిల్లా కో ఆపరేటివ్ అధికారి సుధాకర్, మార్కెటింగ్ శాఖ అధికారి రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదుశాతమే క్లియర్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జూన్ మూడు నుంచి 21 వరకు గ్రామాల వారీగా భూభారతి సదస్సులు నిర్వహించింది. జిల్లాలోని 27 మండలాల పరిధిలో 613 రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి మొత్తం 22,139 దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో 8,966 మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించిన అర్జీలుండగా.. 1,652 సక్సేషన్, 1,557 నిషేధిత జాబితా నుంచి తొలగింపు, 1,158 డీఎస్ పెండింగ్, 1,932 విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, 967 భూ స్వరూపంలో మార్పులు, 742 పేర్ల నమోదులో దొర్లిన తప్పులను సరి చేయడం, 656 అసైన్డ్ భూముల సమస్యలు, 142 ఓఆర్సీ నాట్ ఇష్యూడ్, 2217 ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులున్నాయి. ఆయా దరఖాస్తులన్నింటికీ ఆగస్టు 15 లోగా ఓ పరిష్కార మార్గం చూపించాల్సిందిగా జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు రెవెన్యూ అధికారులు దరఖాస్తుల పరిశీలన పేరుతో రోజుల తరబడి హడావుడి చేసి బాధితులకు నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటివరకు ఐదు శాతం దరఖాస్తులకే పరిష్కారం చూపారు. ఆ మూడు విభాగాల్లోనూ.. భూ సమస్యల్లో ప్రధానమమైన మూడు అంశాలున్నాయి. వీటిలో డేటా కరెక్షన్ కోసం 5,504 దరఖాస్తులు రాగా, వీటిలో 392 అర్జీలకు ఆమోదముద్ర వేశారు. 36 దరఖాస్తులను తిరస్కరించి, మరో 300 క్యాన్సల్ చేశారు. 4,776 అర్జీలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండటం గమనార్హం. సక్సేషన్ కోసం 235 దరఖాస్తులు అందగా, వీటిలో ఇప్పటివరకు 42కు ఆమోదముద్ర వేశారు. ఒకటి తిరస్కరించారు. మరో 10 దరఖాస్తులను క్యాన్సల్ చేశారు. మరో 182 పెండింగ్లోనే ఉన్నాయి. ఇక మ్యూటేషన్ కోసం 155 రాగా, వీటిలో 25 మాత్రమే ఆమోదం తెలిపారు. తొమ్మిది తిరస్కరించగా.. 121 పెండింగ్లో పెట్టారు. చేవెళ్లలో అత్యధికంగా 84 దరఖాస్తులు, జిల్లేడుచౌదరిగూడలో 59 అర్జీలు ఆమోదం పొందాయి. ఇప్పటికీ భూ బాధితులు తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మెజార్టీ సమస్యలు భూ బాధితుల నుంచే అందుతుండటం గమనార్హం. అదనపు కలెక్టర్ వద్దే 4,600 ‘ధరణి’ పోర్టల్లో అన్ని దరఖాస్తులను కలెక్టరే స్వయంగా ఆమోదించడమో? తిరస్కరించడమో? చేయాల్సి వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ను తీసుకొచ్చింది. సాంకేతికంగా పలు సంస్కరణలను కూడా ప్రవేశపెట్టింది. అప్పటి వరకు కలెక్టర్కు మాత్రమే ఉన్న లాగిన్ను ఆ తర్వాత తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లకు కూడా కల్పించింది. ఆయా అధికారుల పరిధిలోనే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. కానీ జిల్లాలోని ఒక్క అదనపు కలెక్టర్(రెవెన్యూ) వద్దే 4,600 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు మరికొంత సమయం పడుతుందని, భూ బాధితులంతా ఓపిక పట్టాలని సూచిస్తూ ఆయన చాంబర్ ఎదుట నోటీసు బోర్డు పెట్టడం గమనార్హం. భూ భారతి సదస్సుల్లో భాగంగా మంచాల మండలంలో అత్యధికంగా 2,943 దరఖాస్తులు అందగా, వీటిలో 2,942 మందికి నోటీసులు జారీ చేశారు. వీటిలో డేటా కరెక్షన్ కోసం 86 అర్జీలు రాగా, ఇప్పటి వరకు కేవలం ఒక దరఖాస్తును మాత్రమే ఆమోదించారు. మిగిలినవన్నీ ఇప్పటికీ పరిశీలన దశలోనే ఉన్నాయి. చేవెళ్ల మండలంలో 1,009 దరఖాస్తులు అందగా, అధికారులు పరిశీలించి వీటిలో 364 అర్జీలను తిరస్కరించారు. మిగిలిన 645 అప్లికేషన్లలో 310 ఆమోదించారు. మరో 335 పెండింగ్లో పెట్టారు. యాచారంలో 2,082 దరఖాస్తులు అందగా, వీటిలో కేవలం 33 మాత్రమే ఆమోదించారు. ఇక కందుకూరులో 1,842 దరఖాస్తులకు 34 దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందాయి. ఇలా కేవలం ఈ మూడు మండలాల్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న 27 మండలాల నుంచి 22,139 దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 1,011 అర్జీలు మాత్రమే ఆమోదించారు. మిగిలిన వారికి కేవలం నోటీసులు జారీ చేసి వదిలేశారు. పారదర్శకత లోపించిన రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా 22,139 అర్జీల స్వీకరణ 1,011 ఆమోదం.. మరో 50 తిరస్కరణ నోటీసులతో సరిపెడుతున్న అధికారులు ఆందోళనలో భూ బాధితులు -
పట్టుదలతోనే క్రీడల్లో రాణింపు
హుడాకాంప్లెక్స్: కృషి, పట్టుదల ఉంటే క్రీడల్లో రాణించవచ్చని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2025 స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చారని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ ఉత్సవ త్రికే రన్’ పేరిట ఓమ్నీ ఆస్పత్రి నుంచి సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ రన్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ ఇన్చార్జి మధుయాస్కీగౌడ్, క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్గుప్తా, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యువత డ్రగ్స్, మద్యపానానికి అలవాటు పడొద్దని, పాఠశాల, కళాశాల అయిపోయిన వెంటనే గ్రౌండ్కు పరుగులు తీయాలన్నారు. 2035లో ఒలింపిక్ పోటీలలో పాల్గొనేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నేడు తల్లిదండ్రులు సైతం పిల్లలను ఆటల్లో ప్రోత్సహిస్తున్నారని గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారుడు మత్తు వదిలి మైదానం బాట పట్టమని రాహుల్గాంధీ పిలుపునిచ్చారని తెలిపారు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే శంషాబాద్ నుంచి భారీ ర్యాలీ తీసి గౌరవిస్తామని, కోచ్ల కొరత లేకుండా చేస్తామన్నారు. శిక్షణ ఇచ్చేలా త్వరలో మైదానాలు అందుబాటులో ఉంచుతామని వివరించారు. స్టేడియంలో జిమ్ ఇతర వసతులు కల్పించడానికి రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు ఉపేందర్రెడ్డి, జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్వర్రావు, కోశాధికారి రాజశేఖర్, కోచ్లు విజయ్కుమార్, సాయిబాబా, రమాదేవి, యాదయ్య, జనయ్సింగ్, కిషోర్, సైదులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
గణేశ్ ఉత్సవాలకు పటిష్ట భద్రత
పహాడీషరీఫ్: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్లో బుధవారం ఆమె అన్ని శాఖల అధికారులు, ఉత్సవ సమితి నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ వినాయక ఉత్సవాలకు ఏటా భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేయడాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ అధికారులు వినాయక నిమజ్జన రూట్లో రోడ్డుపై అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా మండపంతో పాటు పరిసరాలలో సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ శాఖ తరఫున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట రోజున అన్ని శాఖల అధికారలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మండపం నుంచి చాంద్రాయణగుట్ట రూట్లోని గుర్రం చెరువు కట్ట మైసమ్మ వరకు మార్గాన్ని పరిశీలించారు. సమావేశంలో అదనపు డీసీపీ సత్యనారాయణ, టీజీఎస్పీడీసీఎల్ మహేశ్వరం డీఈ గోపాలకృష్ణ, బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, బడంగ్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల కమిషనర్లు సరస్వతి, బి.వెంకట్రామ్, మహేశ్వరం ఏసీపీ జానకీరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా వినాయక చవితి జరుపుకోవాలి: ఏసీపీ యాచారం: వినాయక చవితి పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు నిర్వాహకులకు సూచించారు. యాచారంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం వినాయక మండపాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ వేళ నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాల వివరాలను పోలీస్స్టేషన్లో నమోదు చేసుకోవాలన్నారు. డీజేలు పెట్టరాదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదని పేర్కొన్నారు. విగ్రహాలను ఏ ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నారో ముందే సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రాధారాణి, ఉప తహసీల్దార్ కీర్తిసాగర్, యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ సీఐలు నందీశ్వర్రెడ్డి, సత్యనారాయణ, ఎంపీఓ శ్రీలత, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. డీసీపీ సునీతారెడ్డి -
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగు పర్చాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆమె అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం వంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా తనిఖీలు–తెలంగాణ ప్రభుత్వం లేబర్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ విభాగం జారీ చేసిన జీవో ఆర్టీ నంబరు 331 ప్రకారం జిల్లా కలెక్టర్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వాటి ద్వారా తక్షణమే పరిశ్రమల ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. అన్ని కెమికల్ పరిశ్రమల్లో నిబంధనలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కార్మికుల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీలక్ష్మి, పీసీబీ ఈఈఈ వెంకటనర్సు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్యాంసుందర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎన్జీ వైదేహి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సంగీత -
డ్వాక్రా అక్రమాల వడపోత
యాచారం: గ్రామ స్వయం సహాయక సంఘాల్లో నిధుల స్వాహా, అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం వడపోత ప్రారంభించింది. ఏడాది వ్యవధిలోనే మండల పరిధిలోని మల్కీజ్గూడ, చౌదర్పల్లి గ్రామాల్లో రూ.లక్షల నిధులు దుర్వినియోగంపై జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుట్టను తవ్వి అక్రమాల పాములను పట్టేందుకు అటు ఐకేపీ, ఇటు ఎస్బీఐ ఉన్నతాధికారులు విచారణను ముమ్మరం చేశారు. మహిళల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న అధికారులు ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంఘాలకు చెందాల్సిన నిధులను స్వాహా చేశారు. ఏడాదికి ఒక గ్రామంలో అక్రమాలు వెలుగులోకి వస్తుండడం, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు, రికవరీ లేకపోవడంతో మిగతా గ్రామాల్లో అవినీతి వ్యవహారం రాజ్యమేలుతోంది. మండలాల్లోని స్వయం సహాయక సంఘాల్లో నిధుల గోల్మాల్పై విచారణ పూర్తి చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. విచారణకు ప్రత్యేక కమిటీ చౌదర్పల్లి గ్రామ స్వయం సహాయక సంఘాల్లో జరిగిన నిధుల గోల్మాల్పై నిగ్గు తేల్చేందుకు డీఆర్డీఓ శ్రీలత ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. కమిటీలో ఇద్దరు డీపీఎంలు యాదయ్య, లీలాకుమారి, ఇద్దరు ఐకేపీ ఆడిటర్లు శ్రీనివాస్, మధు ఉంటారు. ప్రత్యేక విచారణ కమిటీకి స్థానిక ఏపీఎం రవీందర్ సహకారం అందిస్తారు. పది రోజుల్లోనే పూర్తి నివేదిక అందజేయనుంది. చౌదర్పల్లిలో వీబీకే వరలక్ష్మి పర్యవేక్షణ చేస్తున్న 30 స్వయం సహాయక సంఘాల్లోని ఆర్థిక లావాదేవీలపై 2020 నుంచి విచారణ చేయనున్నారు. వాటికి సంబంధించి పొదుపు, లోన్, సీ్త్రనిధి అకౌంట్లు యాచారం ఎస్బీఐలో స్టేట్మెంట్లు తీసుకుని పరిశీలించనున్నారు. శుక్రవారం నుంచి గ్రామంలోని సంఘాల మహిళలతో ప్రత్యేక సమావేశమై వివరాలు సేకరించనున్నారు. యాచారం ఎస్బీఐలో 2020 నుంచి మేనేజర్ల అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా సంఘాల్లో లేని మహిళల పేర్ల మీద డబ్బులు జమ చేయడంపై బ్యాంక్ ఏజీఎం రామకృష్ణయ్య ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. అప్పటి ఎస్బీఐ మేనేజర్ ఝాన్సీరాణి నాటి మల్కీజ్గూడ, నేటి చౌదర్పల్లి గ్రామాల్లోనే కాక బ్యాంకు పరిధి కింద ఉన్న పలు గ్రామాల్లో ఐకేపీ సిబ్బందితో కుమ్మకై అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. షోకాజ్ నోటీసులు జారీ ఏడాదిలోనే మల్కీజ్గూడ, చౌదర్పల్లి గ్రామాల్లో డ్వాక్రా సంఘాల్లో రూ.లక్షల నిధుల గోల్మాల్ అక్రమాలపై పర్యవేక్షణ చేయని ఏపీఎంలు(బదిలైన) సుదర్శన్రెడ్డి, సాంబశివుడు, సీసీ జంగయ్యకు డీఆర్డీఓ శ్రీలత బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాలుగైదు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఏళ్లుగా అదే స్థానంలో పనిచేస్తున్న సీసీ(కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు)లు కూడా పట్టించుకోవడం లేదని అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న సీసీలను బదిలీలు చేసేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. చౌదర్పల్లిలో డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన నిధుల గోల్మాల్ అక్రమాలపై ఓ నలుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించాం. ఈ కమిటీ వారంలో నివేదిక అందజేయనుంది. బాధ్యులైన వారిపై చర్యలుంటాయి. ఇద్దరు ఏపీఎంలు, సీసీకి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. అక్రమాలకు పాల్పడే వీబీకేలపై కూడా చర్యలు తప్పవు. – శ్రీలత, డీఆర్డీఓనిధుల స్వాహాపై విచారణ చౌదర్పల్లిలో అవకతవకలపై ఏపీఎంలకు షోకాజ్ నోటీసులు మహిళా సంఘాల్లో భారీ గోల్మాల్ లోతుగా పరిశీలిస్తున్న అధికారులు త్వరలోనే చట్టపరమైన చర్యల దిశగా అడుగులు జిల్లా వ్యాప్తంగా సీసీల బదిలీలకు రంగం సిద్ధం -
మహాధర్నాను విజయవంతం చేయండి
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డిమొయినాబాద్/శంకర్పల్లి: సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే డిమాండ్తో సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి కోరారు. బుధవారం మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహాధర్నా వాల్పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన పెన్షన్ను సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి క్రిష్ణారెడ్డి, ఎంఈఓ మల్లయ్య, మండల అధ్యక్షుడు బందయ్య, హెచ్ఎంలు రఘునాథ్, శేఖర్రెడ్డి, అబ్దుల్ హమీద్, నాయకులు వెంకటయ్య, హమీద్, లక్ష్మణ్, రాములు, శివకుమార్, భీమ్లా, యాదగిరి, విజయ్కుమార్, విజయబాయ్, రాధా, శారద, శ్రీదేవి, మంగ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. -
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగు పర్చాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆమె అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం వంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా తనిఖీలు–తెలంగాణ ప్రభుత్వం లేబర్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ విభాగం జారీ చేసిన జీవో ఆర్టీ నంబరు 331 ప్రకారం జిల్లా కలెక్టర్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వాటి ద్వారా తక్షణమే పరిశ్రమల ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. అన్ని కెమికల్ పరిశ్రమల్లో నిబంధనలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కార్మికుల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీలక్ష్మి, పీసీబీ ఈఈఈ వెంకటనర్సు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్యాంసుందర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎన్జీ వైదేహి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సంగీత -
ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యం!
● చేయి తడిపితేనే ఫైల్ కదిలేది ● ఏసీబీకి పట్టుబడుతున్నా తీరు మారని వైనం తాండూరు: ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచావతారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఓ వైపు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. వివిధ పనుల నిమిత్తం తాండూరు రెవెన్యూ డివిజన్ పరిఽధిలోని కార్యాలయాలకు వచ్చే ప్రజలను కొంతమంది ఉద్యోగులు పీక్కు తింటున్నారు. చేయి తడిపితేనే ఫైలు కదిలేది అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంతో పాటు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, విద్యుత్, ఎకై ్సజ్, మైన్స్, ఆర్అండ్బీతో పాటు మరికొన్ని ప్రధాన శాఖలు అవినీతిమయంగా మారాయి. ● తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన ఓ పార్టీ నాయకుడు తమ కాలనీలో ఇళ్లు కట్టుకున్న వారికి ఇంటి నంబర్ కేటాయించాలని మున్సిపల్ ఆఫీసులోని సీనియర్ అసిస్టెంట్ను రమేశ్ను కలిశాడు. ఇందుకు ఆయన ఒక్కో ఇంటికి రూ.6 వేలు ఇవ్వాలంటూ పది ఇళ్లకు రూ.60 వేలు వసూలు చేశాడు. లబ్ధిదారుల నుంచి ఈ మొత్తం ఇప్పించడంతో వారికి ఇంటి నంబర్లు కేటాయించారు. అనంతరం ఇదే నాయకుడు తాను నిర్మించుకున్న రేకుల షెడ్డుకు ఇంటి నంబర్ ఇవ్వాలని కోరగా రమేశ్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్ని ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేసినా నెల రోజుల పాటు కాలయాపన చేశారని, దీంతో నేరుగా ఐజీకి ఫోన్ చేయడంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు రెడ్ హ్యాండెడ్గా సీనియర్ అసిస్టెంట్ను పట్టుకున్నారని బాధితుడు తెలిపాడు. ● దాడులు జరుగుతున్న విషయం తెలియడంతో కమిషనర్ విక్రంసింహారెడ్డితో పాటు సిబ్బంది మొత్తం అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రమేశ్ను ఏసీబీకి పట్టించిన వ్యక్తి 2022 డిసెంబర్లో తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరొద్దీన్ను సైతం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించాడు. ● తాండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారింది. గతంలో డీఏఓ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. చంపుతామని బెదరిస్తున్నారు..తాండూరు టౌన్: మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేశ్ను ఏసీబీకి పట్టించాననే కక్షతో తనను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు ఇర్షాద్ వాపోయాడు. ఈ మేరకు బుధవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమేశ్ తమ్ముడు నాగేశ్తో పాటు బాతుల నాగు వ్యక్తి మున్సిపల్ ఆఫీసులో తనను బెదిరించారని తెలిపాడు. వీరినుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. ఈ విషయమై సీఐ సంతోష్కుమార్ను అడగగా సాక్ష్యాధారాలను పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. -
పోలీసులకు చిక్కిన గ్యాంగ్ రేప్ నిందితుడు
మంచాల: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మంచాల పోలీసులు బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్ రాష్ట్రం బచ్చావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2006లో గ్యాంగ్ రేప్కు పాల్పడిన నిందితుడు సికిందర్ రహమతుల్లా 2014 వరకు శిక్ష అనుభవించాడు. 2014లో పెరోల్పై బయటకు వచ్చి, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఇతని కోసం గుజరాత్ పోలీసులు 11 ఏళ్లుగా గాలిస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో మంచాల మండలంలోని లింగంపల్లి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్న రహమతుల్లాను పట్టుకున్న స్థానిక పోలీసులు గుజరాత్ పోలీసులకు అప్పగించారు. లాడ్జి గదిలో వ్యక్తి మృతి కొత్తూరు: లాడ్జి గదిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల మేరకు.. కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన జోగన్నగూడెం రమేశ్(37) ఈ నెల 19న పని ఉందని ఇంట్లో చెప్పి కొత్తూరుకు వచ్చాడు. కొంత కాలంగా ఆయనకు మూర్చా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా పట్టణంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని మద్యం తాగాడు. మధ్యరాత్రి లాడ్జి సిబ్బంది గమనించగా పడుకున్న చోటనే రమేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
సెకండ్ ‘హ్యాండ్’ !
మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. జనాన్ని మోసం చేసి ఈజీగా మనీ సంపాదించడం కోసం కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కార్లను అద్దెకు తీసుకుని, ఫేక్ నంబర్లు, ఆర్సీ తయారు చేసి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. అదే కారును తస్కరించి, తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ ముఠాను మాచారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ ఫేస్బుక్ అప్లికేషన్లో చూసి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజు ఓ వ్యక్తి వచ్చి అది తన కారని చెప్పి తీసుకుపోయాడు. కారు విక్రమయించిన వ్యక్తులకు ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన గతనెల 7వ తేదీన మాచారెడ్డి పీఎస్లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొందరు ముఠాగా ఏర్పడి సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించారు. ముఠాగా ఏర్పడి.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపీనగర్కు చెందిన మహమ్మద్ ఇయాజ్, వికారాబాద్లోని ఆలంపల్లికి చెందిన మహమ్మద్ జాహీద్ అలీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పృధ్వి జగదీష్, రాచర్ల శివకృష్ణ, వేములవాడకు చెందిన వివేక్, శేరిలింగంపల్లి మండలానికి చెందిన కర్ణకోట సాకేత్, అలీ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముందుగా ట్రావెల్స్ సంస్థల నుంచి వ్యక్తిగతంగా ఇచ్చే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుంటారు. వాటి నంబర్ ప్లేట్లు మార్చేసి నకిలీ ఆర్సీ, ఇతర పత్రాలు సృష్టిస్తారు. అనుమానం రాకుండా నకిలీ ఆర్సీ తయారు చేయడానికి ఆన్లైన్ వెబ్సైట్లలో ఖాళీ మైక్రో సిమ్ కార్డులు, ఖాళీ చిప్ కార్డులను కొంటారు. వాటిపై పేర్లు, వివరాలను ప్రింటింగ్ చేస్తారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతర పత్రాలన్నీ తయారు చేస్తారు. ఆపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కారు అమ్మకానికి ఉందని పెట్టి, తక్కువ ధరకే వాటిని అమ్మనున్నట్లు పేర్కొంటారు. కారు, చౌక ధరను చూసి ఆకర్షితులైనవారు వారి వలలో చిక్కుతున్నారు. ట్రాకర్లను అమర్చి చోరీ.. కారును అమ్మేటప్పుడు దాంట్లో జీపీఎస్ ట్రాకర్ను అమరుస్తారు. దీంతో కారు ఎక్కడుందో వారికి తెలిసిపోతుంది. కారున్న చోటుకు వెళ్లి రాత్రికి రాత్రి వారు విక్రయించిన కారునే చోరీ చేసి తీసుకువచ్చి అసలు యజమానికి అప్పగిస్తున్నారు. అలా వీలు కాని సందర్భాల్లో ఇతరులను పంపి కారు మాది అంటూ బెదిరింపులకు పాల్పడి ఎత్తుకొస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని కారు అమ్మిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో పూర్తి చేస్తున్నారు. నిందితులపై పలు కేసులు.. నిందితులు ఈ విధంగా గతంలోనూ పలు చోట్ల నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. శంకర్పల్లి, మంచాల, అంబారిపేట, రామచంద్రాపురం, చందానగర్, మియాపూర్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో నిందితులపై పలు కేసులు నఉన్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మాచారెడ్డిలో కేసు నమోదైన నాటి నుంచి పరారీలో ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారిని బుధవారం రిమాండ్కు తరలించామన్నారు. మరో నిందితుడు అలీ ఇంకా పరారీలో ఉన్నాడన్నారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, 15 సెల్ఫోన్లు, జీపీఎస్ పరికరాలు, ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్కార్డులు, చిప్ కార్డులు, ఫోర్జరీ చేసిన ఆర్సీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన రూరల్ సీఐ రామన్, ఎస్సై అనిల్, ఐటీ సెల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది సుభాష్రెడ్డి, సిద్దిరాములు, శ్రీకాంత్లను అభినందించారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు ఫేస్బుక్ ద్వారా తక్కువ ధరకు విక్రయం ఆపై అదే కారును చోరీ చేసి.. యజమానికి అప్పగింత ముఠా గుట్టురట్టు చేసిన మాచారెడ్డి పోలీసులు ఆరుగురు నిందితుల అరెస్ట్, పరారీలో మరొకరు వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
ఆలయాల్లో భారీ చోరీ
● రూ.లక్షకు పైగా నగదు, కానుకలు ఎత్తుకెళ్లిన దుండగులు ● సీసీ కెమెరాల వైర్లు కట్చేసి, ధ్వంసం చేసిన వైనం యాలాల: మండలంలోని సంగెంకుర్దు పరిధిలో ఉన్న సంగమేశ్వరాలయం, శనైశ్వరాలయంలో భారీ చోరీ జరిగింది. పక్కపక్కనే ఉన్న ఆలయాల్లోని హుండీలను ధ్వంసం చేసిన దుండగులు పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగంకుర్దు శివారులోని కాకరవేణి నది ఒడ్డున సంగమేశ్వరాలయం, దీని పక్కనే శనైశ్వరాలయం ఉంది. ఎప్పటిలాగే ఆలయ పూజారి జగదీశ్ మంగళవారం రాత్రి గేట్లు మూసేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వెళ్లగా హుండీలు, సీసీ కెమెరాలు ధ్వంసమైనట్లు గుర్తించి, చైర్మన్తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ విఠల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సంగమేశ్వరాలయ హుండీలో సుమారు రూ.50 వేల నుంచి 60 వేల వరకు నగదు, బహుమతులు, శనైశ్వరాలయంలోని హుండీలో దాదాపు రూ.50 వేల నగదు, భక్తులు వేసిన కానుకలు చోరీకి గురయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా నాలుగో సారి.. సంగమేశ్వరాలయంలో వరుసగా నాలుగోసారి దొంగలు పడ్డారని స్థానికులు తెలిపారు. ఆలయం గ్రామానికి దూరంగా ఉండటంతో ఈ దురాఘతానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆలయ అభివృద్ధికి వినియోగించే భక్తుల డబ్బులు దొంగల పాలవుతున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల వైర్లను కట్ చేయడంతో పాటు ధ్వంసం చేసి చోరీలకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
వెంగళరావునగర్: నగరంలోని కాలనీలు, బస్తీలు నిరంతరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. యూసుఫ్గూడ సర్కిల్–19 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. పరిశుభ్రత, ప్రజారోగ్యం.. ఈ రెండూ విడదీయరాని అంశాలని, పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయని చెప్పారు. ఆరోగ్యకర నగర నిర్మాణమే లక్ష్యంగా మాన్సూన్ శానిటేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నగర ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వానలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కర్ణన్ సూచించారు. అనంతరం సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, జానకమ్మతోట, రహమత్నగర్, ఎస్సీఆర్ హిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. కర్ణన్ వెంట శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్రావు, హెల్త్ అండ్ శానిటేషన్ అదనపు కమిషనర్ సి.ఎన్.రఘుప్రసాద్, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్రెడ్డి, ఏసీపీ ప్రసీద, డీఈఈ భద్రు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.మండపాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్ఐ యాదగిరిదుద్యాల్: గణపతి మండపాలకు పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ యాదగిరి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27న వినాయక చవితి పురస్కరించుకుని మండలంలోని ప్రతీ గ్రామంలో వినాయకుల ప్రతిమలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకుగాను మండల వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర పోలీస్ శాఖ ఒక ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిందన్నారు. ఈ వెబ్ సైట్లో మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తే అనుమతి లభిస్తుందని తెలిపారు. ఈ అనుమతి ఉంటేనే అవసరమైన సమయంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.రామంతాపూర్ విషాదంపై లోకాయుక్త స్పందనసుమోటోగా కేసు నమోదు, నోటీసులు జారీసాక్షి, సిటీబ్యూరో: రామంతాపూర్లోని గోఖలేనగర్లో కృష్ణాష్ణమి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కృష్ణుడి శోభాయాత్రలో చోటు చేసుకున్న విద్యుత్ షాక్ విషాదంపై లోకాయుక్త స్పందించింది. విద్యుత్ షాక్తో ఐదుగురు చనిపోవడంపై సుమోటోగా కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మేడ్చల్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్ ఎస్ఈ, ఉప్పల్ ఇన్స్పెక్టర్లకు బుధవారం నోటీసులు జారీ చేశారు.వర్షాలకు కూలిన ఇళ్లు చేవెళ్ల: భారీ వర్షాల కారణంగా మండలంలోని ఆలూరు గ్రామంలో ఓ పాత ఇల్లు కూలింది. గ్రామానికి చెందిన షాబాద్ పెంటయ్యది మట్టిగోడలతో పెట్టిన ఇల్లు కావటంతో వర్షాలకు బాగా తడిసి మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలింది. పాత ఇల్లు కావటంతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు తడిసిపోయిందని బాధితుడు పెంటయ్య పక్కనే వేరే ఇంట్లో ఉంటున్నట్లు తెలిపాడు. ఇంట్లో ఎవరు లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపాడు. తమను ఆదుకోవాలని కోరుతున్నాడు.సర్ధార్నగర్లో..షాబాద్: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం మండల పరిధిలోని సర్ధార్నగర్ గ్రామానికి చెందిన కాసమోని వెంకటేశ్ ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. -
అమ్మ మందలించిందని..
ఇబ్రహీంపట్నం: తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిన బాలున్ని ఇబ్రహీంపట్నం పోలీసులు క్షేమంగా అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దేవరకొండకు చెందిన విజయకుమారి, హరిష్ దంపతులు అబ్దుల్లాపూర్మెట్ మండలం బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు తుర్కయంజాల్ కాకతీయ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు.చిన్న విషయంలో అమ్మ మందలించిందనే కారణంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తుర్కయంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసుల కంటపడ్డాడు. అతన్ని ఆరా తీసి, పీఎస్కు తీసుకెళ్లి తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు.సాంకేతిక సమస్యలతో తిరుపతి విమానం రద్దు శంషాబాద్: సాంకేతిక సమస్యలతో తిరుపతి విమానం రద్దు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 5.55 గంటలకు 53 మంది ప్రయాణికులతో అలయన్స్ ఎయిర్లైన్స్కు చెందిన 91877 విమానం తిరుపతికి బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానంలో టేకాఫ్ తీసుకునే ముందు సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని నిలిపివేశారు. కొన్ని గంటల తర్వాత విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్లైన్స్ వర్గాలు ప్రయాణికులకు వెల్లడించారు.ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవంతాండూరు టౌన్: తాండూరు ఫొటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈమేరకు స్థానిక వినాయక్ చౌక్లో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఒక ఫొటో అనేక పాత, మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందని తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, హీరాలాల్, జగదీశ్వర్ పాల్గొన్నారు. -
ఫిజిక్స్లో విద్యారాణికి పీహెచ్డీ పట్టా
షాద్నగర్రూరల్: ఫిజిక్స్లో ‘వేరియబుల్ అపోడైజేషన్ రీసెర్చ్ గైడ్ ఆప్టికల్ ఇమేజింగ్ సిస్టం’పై చేసిన పరిశోధనకు గాను షాద్నగర్ పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన ఎస్.విద్యారాణికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసింది. విద్యారాణి ప్రొఫెసర్ కరుణసాగర్ నేతృత్వంలో పరిశోధన చేసి గ్రంధాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ నారాయణన్, వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. డాక్టరేట్ అందుకున్న సంధ్యారాణి సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ షాద్నగర్ డివిజన్లో సూపర్ వైజర్గా పని చేస్తున్న సంధ్యారాణి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గంగపుత్ర కమ్యూనిటీలో మహిళా సాధికారత అంశంపై అసోసియేటెడ్ ప్రొఫెసర్ ధీరజ్ పర్యవేక్షణలో ఆమె పరిశోధన చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్, యూనివర్సిటీ వీసీ కుమార్ మొలుగారం చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఐదుగురు అధ్యాపకులకు డాక్టరేట్ హయత్నగర్: హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న లెక్చరర్లు అవేష్ మోహియుద్దీన్, మధు, మక్ల, యాదగిరిరెడ్డి, నాగరాజు డాక్టరేట్ అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు తెలిపారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, వీసీ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేసినందుకు గాను అవేష్ మోహియుద్దీన్, మధుకు, రాజనీతి శాస్త్రంలో పరిశోధనలకు యాదగిరిరెడ్డి, నాగరాజులక, ఇంగ్లిష్లో పరిశోధనలకు మక్లకు దక్కాయి. పట్టా అందుకున్న విద్యారాణిడాక్టరేట్ను అందుకుంటున్న సంధ్యారాణి -
భలే మంచి బేరం
అమ్మకానికి తుర్కయంజాల్, బాచుపల్లి లేఅవుట్లలో ప్లాట్లు సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ చోట్ల ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఏర్పాట్లు చేపట్టింది. గతంలో ఉప్పల్, కోకాపేట్, బుద్వేల్, హయత్నగర్, బోడుప్పల్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో విజయవంతంగా ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించి ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సర్కార్ పచ్చజెండా ఊపింది. దీంతో పలు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ లేవుట్లను పూర్తి చేసినప్పటికీ.. వాటిని వేలం వేసేందుకు అధికారులు సర్కార్ ఆమోదం కోసం ఎదురు చూశారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేపట్టారు. మొద టి విడతగా సెప్టెంబర్ మొదటి వారంలో తుర్కయంజాల్, బాచుపల్లిలోని 82 ప్లాట్లను విక్రయించనున్నారు. ఆ తర్వాత మిగతా స్థలాలను అమ్మకానికి పెట్టనున్నారు. ప్రస్తుతం రియల్ రంగానికి సానుకూలమైన వాతావరణం ఉండడంతో అమ్మకానికి ఇదే అదనుగా భావిస్తున్నట్లు సమాచారం. అనూహ్య స్పందన ఇటీవల హౌసింగ్బోర్డు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్కు కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ స్థలాలకు సైతం మధ్యతరగతి, ఉన్నత ఆదాయవర్గాల నుంచి మంచి స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో వివిధ చోట్ల నిర్వహించిన బిడ్డింగ్కు ఎన్నారైలు భారీ స్పందించారు. కోకాపేట్, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు ధరల్లో అమ్ముడయ్యాయి. ప్రస్తుతం బైరామల్గూడ, కోకాపేట్, చందానగర్, పుప్పాలగూడ, బౌరంపేట్, చెంగిచెర్ల, సూరారంలలో మొత్తం 11 చోట్ల ఉన్న స్థలాలను విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో బిడ్డింగ్ నిర్వహించనున్న ప్లాట్లు.. లే అవుట్ సర్వే ప్లాట్ల నంబర్ సంఖ్య తుర్కయంజాల్ 471/1 12 బాచుపల్లి 39,40 70 దశలవారీగా వేలం నిర్వహించనున్న స్థలాలు గ్రామం సర్వే చదరపు నంబర్ గజాలు బైరామల్గూడ 57 2420 కోకాపేట్ 144 8591 చందానగర్ 174 484 పుప్పాలగూడ 146 1400 బాచుపల్లి 363 2299 బౌరంపేట్ 694 2420 బౌరంపేట్ 130 530 బౌరంపేట్ 130 1500 బౌరంపేట్ 130 666 చెంగిచెర్ల 33/1 1210 సూరారం 166/167 4840 రెండు చోట్ల 82 ప్లాట్లు విక్రయానికి సిద్ధం మరో 11 ప్రాంతాల్లోనూ సన్నాహాలు దశలవారీగా ఆన్లైన్ బిడ్డింగ్కు హెచ్ఎండీఏ చర్యలు -
అవినీతి జలగలు!
ఏసీబీకి వరుసగా పట్టుబడుతున్న అధికారులు ● ఆర్ఐ మొదలు తహసీల్దార్లు, అదనపు కలెక్టర్ల వరకు ● తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు ● అయినా మారని తీరు సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా ప్రజలను అవినీతి జలగలు పట్టిపీడిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకుంటున్నా.. కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న జిల్లా.. అవినీతి కేసుల్లోనూ అదే రికార్డును కొనసాగిస్తోంది. అడ్డదారుల్లో జిల్లాకు రావడం, ఆ తర్వాత ఫోకల్ పోస్టుల్లో తిష్టవేయడం, పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాదించుకునే క్రమంలో ఏసీబీకి పట్టుబడుతుండటం పరిపాటిగా మారింది. పారదర్శకత, అవినీతి నిర్మూలనకు పెద్దపీట వేయాల్సిన ఉన్నతాధికారులు సైతం ఏసీబీ కేసుల్లో పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్, ఇబ్రహీంపట్నం, తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి చేపల ఘటనను ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే తాజాగా ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో మరో రెండు భారీ చేపలు ఏసీబీ వలకు చిక్కడం గమనార్హం. మచ్చుకు కొన్ని.. పాసుబుక్లో జెండర్ సవరణ కోసం జూలై 29న రూ.50 వేలు తీసుకున్న ఆమనగల్లు తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవి తాజాగా మరో రూ.లక్ష డిమాండ్ చేసి మంగళవారం ఏసీబీకి చిక్కారు. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని పట్టా భూమిగా మార్చేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేసిన ఘటనలో మే 28న ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. తర్వాత 12 గంటల పాటు తహసీల్దార్ ఆఫీసులో తనిఖీలు చేసింది. గత ఆగస్టులో నిషేధిత జాబితాలోని 14 గుంటల భూ వ్యవహారంలో గుర్రంగూడకు చెందిన బాధితుడు ముత్యంరెడ్డి నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ అప్పటి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్రెడ్డి సహా సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్రెడ్డి ఏసీబీకి చిక్కారు. భూమి పేరు మార్పిడీ వ్యవహారంలో రూ.50 వే లు తీసుకుంటూ జూలై 1న తలకొండపల్లి తహ సీల్దార్ నాగార్జున సహా వీఆర్ఏ యాదగిరి పట్టుబడ్డారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గత మే 31న నెక్నంపూర్లోని ఓ నిర్మాణానికి నిరంభ్యంతర పత్రం జారీ కోసం రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ సహా గండిపేట మండల సర్వేయర్ పి.గణేశ్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్, ఎస్సీ ఆఫీసులోని ఏడబ్ల్యూ సెక్షన్ ఏఈ నిఖేష్కుమార్ ఏసీబీ కేసులో అరైస్టె జైలుకు వెళ్లారు. గొర్రెల పథకం స్కాంలో సంబంధం ఉన్న జిల్లా పశువైద్య శాఖ అధికారి అంజలప్ప సహా అప్పటి భూగర్భ జలవనరులశాఖ అధికారి రఘుపతిరెడ్డి సైతం ఏసీబీ కేసులో అరైస్టె, తర్వాత విడుదలయ్యారు. గోపన్పల్లిలోని ఓ నిర్మాణానికి ట్రాన్స్ఫార్మర్, సీటీ మీటర్ జారీ కోసం రూ.50 వేలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్ను ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. మంచాల మండలంలోని ఓ వెంచర్లో రోడ్డుకు అడ్డుగా ఉన్న 11కేవీ, 33 కేవీ లైన్ షిఫ్టిక్ కోసం రూ.18 వేలు లంచంగా తీసుకుంటూ సరూర్నగర్ సర్కిల్ ఎలక్ట్రికల్ డీఈ (టెక్నికల్) టి.రామ్మోహన్ ఏడాది క్రితం ఏసీబీకి పట్టుబడ్డారు. -
నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యం
తుర్కయంజాల్: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన ఉద్దేశమని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు మంగళవారం పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలు, బలహీన వర్గాలు, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం పలు మహిళా స్వయం సహాయాక సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇంజాపూర్ ఉన్నత పాఠశాలకు చెక్కు, సౌండ్ సిస్టం అందజేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ శ్రీ వాత్సవ, తెలంగాణ జోనల్ అధికారి ముఖేష్ కుమార్ పాల్గొన్నారు. -
మహ్మద్నగర్వాసికి జాతీయ అవార్డు
కందుకూరు: భారత్కే అన్మోల్ 2025 ఢిల్లీ ఎడిషన్ జాతీయ అవార్డును మండల పరిధిలోని మహ్మద్నగర్కు చెందిన సినీ నిర్మాత (స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ) ఎండీ ఆసిఫ్జానీ అందుకున్నారు. కానిస్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నషా ముఖ్త్ భారత్–మాదకద్రవ్యరహిత భారతదేశం ఒక మైలురాయి అన్న అంశంపై సోమవారం రాత్రి ఢిల్లీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. మాదకద్ర వ్యాల నివారణపై అవగాహన కల్పిస్తున్నందుకు ఈ అవార్డు వరించింది. వృక్షశాస్త్రంలో గోల్డ్ మెడల్ కడ్తాల్: మండల కేంద్రానికి చెందిన శ్రీవాణి వృక్ష శాస్త్రంలో గోల్డ్మెడల్ సాధించింది. ఉస్మానియా యూనివర్సిటీలో 2022–24 విద్యా సంవత్సరంలో ఆమె బోటనీ సబ్జెక్ట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా మంగళవారం వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్ర మంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకుంది. శ్రీవాణి గోల్డ్ మెడల్ సాధించడంపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు అభినందించారు. కూరగాయల సాగుపై రైతులకు అవగాహన యాచారం: మండల పరిధిలోని చౌదర్పల్లిలో మంగళవారం కూరగాయల పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. ఏ సీజన్లో ఏవి సాగు చేయాలి, మార్కెట్కు తరలింపు, విత్తనాలు, నార్ల ఎంపిక తదితర విషయాలపై అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి బసవన్నప్ప వివరించారు. ఆధునిక పద్ధతుల్లో కూరగాయల పంటలు సాగు చేస్తే అధిక దిగుబడితో మంచి లాభాలు వస్తామని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి సురేష్ తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి రవినాథ్, రుక్మిణి, రాధ తదితరులు పాల్గొన్నారు. నానో యూరియాతో అధిక దిగుబడులు షాద్నగర్: రైతులు నానో యూరియాను వాడి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందొచ్చని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న మన గ్రోమోర్ ఎరువుల గోదామును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో ఎరువుల నిల్వలు, వాటికి సంబంధించిన రికార్డులు, ఈపాస్ యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు అపోహలు నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి, మండల వ్యవసాయ అధికారి నిషాంత్కుమార్, ఏఓ టెక్నికల్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
నూనె గింజల సాగుతో మంచి రాబడి
షాబాద్: నూనె గింజల సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుందని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ మతూర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని రేగడిదోస్వాడలో మంగళవారం భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో నూనె గింజల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకంలో భాగంగా నూనె తీసే యంత్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అధివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ తదితర అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వొంగూరు విజయ్ భాస్కర్రెడ్డి, సీఈవో చందన షెడ్యూల్ కులాల ఉప పథకం ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్, సుగుణ మాల రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు లింగం, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకోవాలి
అబ్దుల్లాపూర్మెట్: కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయాధి కారి ఉష సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా శ్రీపాత మామిడి తోటల పున రుజ్జీవనం–వాతావరణ బులిటెన్– డిజిటల్ వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంశ్రీ అంశా లపై రైతులకు అవగాహన కల్పించారు. తెగుళ్ల నివా రణకు పురుగు మందు పిచికారీకి డ్రోన్ స్ప్రేలను వినియోగించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించినట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలకు పిచికారీ చేయొచ్చని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐ.పల్లవి, వ్యవసాయ విస్తరణాధికారి ఎన్.రఘు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–15 బాలుర, బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారంతో ముగిసాయి. బాలుర విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రథమ స్థానంలో, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో, మంచిర్యాల తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్, ద్వితీయ స్థానం సూర్యాపేట, తృతీయ స్థానం నారాయణ్పేట జిల్లాలు దక్కించుకున్నాయి. విజేతలకు షీల్డ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి హీర్యానాయక్, గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్రావు, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, పీఈటీలు, పీడీలు నాగరాజు, సుధాకర్, షబ్బీర్, చెన్నకిష్టారెడ్డి, భాస్కర్రెడ్డి, సుధాకర్, రవికుమార్, బస్వరాజ్, మల్లేష్, బాబయ్య, వెంకటేశ్, శ్రీలత, జోనల్ సెక్రటరీ పీడీ సుశీల తదితరులు పాల్గొన్నారు. సాదాసీదాగా ముగింపు రాష్ట్ర స్థాయిలో 32 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్న వాలీబాల్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాదాసీదాగా కార్యక్రమం ముగించడంతో క్రీడాకారులు నిరుత్సా హానికి గురయ్యారు. -
గ్రాంటు రాక.. ఖర్చు చేయలేక!
కేశంపేట: బడులు తెరిచి రెండు నెలలు దాటినా పాఠశాల గ్రాంట్లు విడుదల కాలేదు. దీంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు, చాక్పీసులతోపాటు డస్టర్లు, స్టేషనరీ కొనుగోలుకు తమ జేబుల్లోంచి వెచ్చిస్తున్నారు. గతంలో పాఠశాల ప్రారంభంలోనే గ్రాంట్లు విడుదల చేసేవారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,300 పాఠశాలలు ఉన్నాయి. అన్ని స్కూళ్లకు ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో కలిసి సమకూర్చుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి.. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం రెండు రకాలుగా గ్రాంట్లు విడుదల చేస్తోంది. పాఠశాల గ్రాంటు, స్పోర్ట్స్ గ్రాంటు రూపంలో ఇస్తోంది. ఈ నిధులను పాఠశాల అకౌంట్లో జమ చేస్తుంది. వీటిని అవసరాల మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు సీనియర్ ఉపాధ్యాయుడు సంయుక్తంగా చెక్కుపై సంతకం చేసి డ్రా చేస్తారు. పాఠశాల గ్రాంటు నుంచి కరెంట్ బిల్లులు చెల్లించడం, మరుగుదొడ్ల పరిశుభ్రత, చాక్పీసులు, డస్టర్లు, స్టేషనరీలాంటివి కొనుగోలు చేస్తారు. స్పోర్ట్స్ గ్రాంటు నుంచి విద్యార్థుల కోసం క్రీడాసామగ్రి కొనుగోలుకు వెచ్చిస్తారు. నిధులు ఇలా (రూపాయల్లో..)పిల్లల సంఖ్య పాఠశాల గ్రాంట్ స్పోర్ట్స్ గ్రాంట్ 1–15 10,000 5,000 16–100 25,000 5000 101–250 50,000 5000 251–1000 75,000 10,000 -
ప్రభుత్వ హాస్టళ్లలో టాస్క్ఫోర్స్ తనిఖీలు
ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో సివిల్ సప్లయ్ టాస్క్ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బియ్యం నిల్వలు స్టాక్, సప్లయ్కి సంబంధించిన వివారాలను అడిగి తెలుసుకున్నారు. వంట గది, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం సివిల్ సప్లయ్ టాస్క్ఫోర్స్ డీఎస్సీ రమేష్రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సీఐ అజయ్బాబు, ఎస్ఐ కృష్ణ, డిప్యూటీ తహీసీల్దార్ రామకృష్ణ, గురుకుల ప్రిన్సిపల్ శ్రీరామ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఇబ్రహీంపట్నం: అందివచ్చిన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి అండర్–15 బాలుర, బాలికల వాలీబాల్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని, మేధో సంపత్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభాపాటవాలు చాటాలని, క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే విద్యార్థులను పీఈటీలు, పీడీలు ప్రోత్సహించి, వారికి మంచి అవకాశాలు దక్కేలా తమవంతు కృషి చేయాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 25న పుణేలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. పోటీలకు ములుగు జిల్లా మినహా 32 జిల్లాల నుంచి సుమారు 700 మంది వాలీబాల్ క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో గురుకుల విద్యాపీఠం్ ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్రావు, మండల విద్యాధికారి హీర్యానాయక్, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్రెడ్డి, పీడీ, పీఈటీల సెక్రటరీ ఎండీ షబ్బీర్, క్రీడల అబ్జర్వర్ వెంకట్నారాయణ, జోనల్ సెక్రటరీ పీడీ సుశీల తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కుంకుమార్చన
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చనువెల్లి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం అన్నారు. సంగమేశ్వర దేవాలయంలో సోమవారం ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివలింగానికి అర్చన చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ భక్తిభావాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, లక్ష్మీపతియాదవ్, పద్మనాభం, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. – మొయినాబాద్ రూరల్ -
చల్లంగ చూడమ్మ.. పోచమ్మ తల్లి
బోనాల ఊరేగింపులో కళాకారుల ప్రదర్శనఊరేగింపులో ఉత్సాహంకడ్తాల్ మండల పరిధిలో సోమవారం పోచమ్మ బోనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. పూజల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి తదితరులు పాల్గొన్నారు. – కడ్తాల్ -
నూతనంగా బడి భవనం నిర్మించండి
యాచారం: శిథిలావస్థ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని మండల పరిధిలోని మంతన్గౌరెల్లి గ్రామస్తులు కోరారు. సోమవారం విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్రావును నగరంలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. పురాతన భవనం కావడంతో పై కప్పు పగుళ్లు ఏర్పడిందని, తరగతి గదులు కురుస్తున్నాయని తెలిపారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తావునాయక్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు చందునాయక్, ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు భాస్కర్నాయక్, నాయకులు కుమార్, జంగయ్య, రవి, గణేశ్ పాల్గొన్నారు. -
మొయినాబాద్ కమిషనర్పై చర్యలు తీసుకోండి
మొయినాబాద్: జాతీయ జెండాను అవమనించేలా వ్యవహరించిన మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. అజీజ్నగర్లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ వినోద్కు వినతిపత్రం అందించారు. మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖాజామోయిజుద్దీన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను అవమానించే విధంగా వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. వార్డు కార్యాలయలపై ఎందుకు జెండా ఎగురవేయలేదని అడిగినందుకు దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. ఇలాంటి అధికారులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు అంజన్కుమార్గౌడ్, జిల్లా నాయకుడు ఎన్.ప్రభాకర్రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కలెక్టర్ ఆగ్రహం! మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్పై కలెక్టర్ నారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆర్డీఓ నివేదికను పరిశీలించిన కలెక్టర్ సోమవారం కమిషనర్ను తన కార్యాలయానికి పిలిపించి చీవాట్లు పెట్టినట్టు సమాచారం. ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియదా.. ఏదైనా సమస్య తలెత్తితే నచ్చజెప్పి సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి దురుసుగా ప్రవర్తించి వివాదం సృష్టిస్తావా అంటూ తీవ్ర స్థాయిలో మందలించినట్టు తెలిసింది. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. -
మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
శంకర్పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు మరకత శివాలయాన్ని సోమవారం విశ్రాంత ఐఏఎస్ శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శరత్ దంపతులు లింగానికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శరత్ దంపతులకి జ్ఞాపిక, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు సదానందం, సభ్యులు హనుమంతు, అర్చకులు ప్రమోద్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించండి షాద్నగర్: ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరుతూ సోమవా రం మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామస్తు లు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాంతో వెళ్లి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ నవీన్ నికోలస్ను కలిసారు. గ్రామంలోని ప్ర భుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవా నికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారని, పాఠశా ల అభివృద్ధికి రూ.10కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. పనులు నేటికీ ప్రారంభం కాలేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల నుంచి 11 మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై వెళ్తున్నారని, డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. స్పందించిన కమిషనర్ పాఠశాలను సెప్టెంబర్ 1న సందర్శిస్తా మని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కమిషనర్ను కలిసిన వారిలో శ్యాంసుందర్, దయాసాగర్, బాబు తదితరులు ఉన్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న ఈసీ వాగు మొయినాబాద్రూరల్: మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. చేవెళ్ల, షాబాద్ మండలాల మీదుగా మొయినాబాద్ మండలాన్ని తాకుతూ నక్కలపల్లి, అమ్డాపూర్, బాకారం ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ హిమాయత్సాగర్లోకి చేరుతోంది. అమ్డాపూర్ సమీపంలో పంటపొలాల నుంచి జోరుగా ప్రవహిస్తోంది. హనుమంతుడి చరిత్ర స్ఫూర్తి మంత్రం చేవెళ్ల: హనుమంతుడి చరిత్ర ప్రపంచానికి స్ఫూర్తి మంత్రమని త్రిదండి అహోబిల పీఠాధిపతి రామానుజ జీయర్స్వామి అన్నారు. మండలంలోని తంగడపల్లిలో ఆరు రోజులుగా కొనసాగుతున్న అభయాంజనేయ స్వామిఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠ, నాబిశిల ప్రతిష్ఠ ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు రామానుజ జీయర్స్వామి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. హనుమంతుని గుడి లేని ఊరు ఉండదని పేర్కొన్నారు. యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని, దేశ రక్షణ, ధర్మ రక్షణ కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, పీఏసీఎస్ చైర్మన్లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
మండపాలకు అనుమతి తప్పనిసరి
శంకర్పల్లి: వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారు పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్, సీఐ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం శంకర్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు గార్డెన్స్లో మండపాల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గణేశ్ పండగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించుకోవాలని, డీజేలకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి సౌండ్ సిస్టం పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమా ర్, విద్యుత్ శాఖ ఏఈ ప్రదీప్, ఎస్సైలు సురేశ్, దేవేందర్, శ్రీశైలం, బేతప్ప పాల్గొన్నారు. -
ఫాగింగ్.. పరేషాన్!
● దోమకాటుకు పల్లెలు విలవిల ● మూలనపడిన యంత్రాలు ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ దౌల్తాబాద్: దోమకాటుతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణకు గత ప్రభుత్వ హయాంలో వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫాగింగ్ మిషన్లు చాలా పంచాయతీల్లో చెడిపోగా.. మరికొన్నింటిలో మిషన్లు మాయమయ్యాయి. దోమకాటుకు పల్లెవాసులు విలవిలలాడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్తో పాటు ఇతర వైరల్ జ్వరాలు తాండవం చేస్తున్నాయి. దోమల నివారణకు కొనుగోలు చేసిన యంత్రాలు పంచాయతీల్లో లేకపోవడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం ఒక్కో యంత్రానికి రూ.35వేల నుంచి రూ.40వేలు వెచ్చించి కొనుగోలు చేసింది. కొన్ని గ్రామాల్లో మేజర్ పంచాయతీల నుంచి అడపాదడపా తీసుకుని పారిశుద్ధ్య కార్మికులు ఫాగింగ్ చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో యంత్రాలు మాయం కావడంతో పక్కన పంచాయతీల నుంచి తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటీవల స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఫాగింగ్ యంత్రాలకు మరమ్మతులు చేయించాలని అధికారులు సూచనలు చేస్తున్నప్పటికీ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. డీజిల్, పెట్రోలు, లిక్విడ్లను సమ పద్ధతుల్లో వినియోగించకపోవడంతో యంత్రాలు చెడిపోయినట్లు తెలుస్తోంది. ఖర్చు తడిసి మోపెడు మండలంలోని చాలా గ్రామాల్లో ఫాగింగ్ యంత్రా లు మరమ్మతులు చేయించలేక మూలన పడేశారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. చెడిపోయిన యంత్రాలకు మరమ్మతులు చేయించాలంటే చాలా ఖర్చులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల స్వైరవిహారం గ్రామ పంచాయతీల్లో వారంలో రెండుసార్లు ఫాగింగ్ చేపట్టాల్సి ఉంటుంది. వర్షాకాలం సీజన్ ప్రారంభంలో వీటి వినియోగం మరింత ఎక్కువ చేసినప్పుడే దోమలను సగం వరకు నియంత్రణ చేయవచ్చు. గ్రామం మొత్తంగా నెలలో ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయడం లేదు. ఒకసారి పిచికారీ చేసిన ఫొటోలనే ప్రతి నెలా వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదేశాలు జారీ చేశాం ప్రతి గ్రామంలో దోమల నివారణ కోసం మందు ను పిచికారీ చేయాలని కార్యదర్శులకు సూచనలు చేశాం. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ మిషన్లు పాడైనట్లు తెలిసింది. వాటిని మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. వ్యాధుల తీవ్రత దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణకు నిరంతరం పర్యవేక్షించేలా కృషి చేస్తాం. – శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్ -
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
షాబాద్: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని దేవాదాయ ధర్మాదాయశాఖ ఈఓ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల పరిధి కొమరబండ గ్రామంలో శ్రీ బుగ్గరామేశ్వరస్వామి దేవాలయంలో శ్రావణమాస చివరి సోమవారం సందర్భంగా శివపార్వతులకు కల్యాణం, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య దేవతామూర్తుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. కార్యక్రమలో ఆలయ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, సభ్యులు సత్యనారాయణ, రాణిమ్మ, సునీత, మాజీ సర్పంచ్లు చంద్రశేఖర్, దేవేందర్రెడ్డి, నాయకులు రంగదాసు, నర్సింహ్మారెడ్డి, గోపాల్రెడ్డి, అంజయ్య, సత్తయ్యగౌడ్, కుమార్, నరేష్, వెంకటేశ్, నర్సింహులు, బాలరాజ్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఈఓ శ్రీనివాస్ -
రాజకీయ లబ్ధికోసమే భూ ధారాదత్తం
బడంగ్పేట్: పేదలు సాగుచేసుకుంటున్న భూములను గత ప్రభుత్వం లాక్కొని.. రాజకీయ లబ్ధికోసం, ఓట్ల కోసం క్రైస్తవులకు ధారాదత్తం చేసిందని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొద్రమోని పురుషోత్తం ఆరోపించారు. సోమవారం కార్పొరేషన్ పరిధి కుర్మల్గూడలో జి.కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల భూములను నాటి బీఆర్ఎస్ సర్కార్బలవంతంగా గుంజుకుందని విమర్శించారు. కుర్మల్గూడలో ఇళ్లులేని ఎంతో మంది పేదలు ఉన్నారని, వారికి 60 గజాలు కేటాయించడానికి మనస్సు రాని బీఆర్ఎస్.. క్రైస్తవుల మెప్పు పొందడానికి వారి సమాధులకు ఎకరాల కొద్దీ స్థలాన్ని ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. ఆ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుజాత, నాగేంద్రమ్మ, భానుప్రసాద్, ఆర్.ఝాన్సీ, రాజు, ఎం.అరుణ, జి.జగదాంబ, పి.జ్యోతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం -
మృత్యుపాశాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వినియోగదారుల ఇళ్లలో వెలుగులు నింపాల్సిన విద్యుత్ లైన్లు.. జీవితాల్లో చీకట్లను మిగుల్చుతున్నాయి. నెత్తిన మృత్యుపాశాల్లా వేలాడుతున్న వైర్లు ఎప్పుడు.. ఎవరిపై తెగిపడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎలాంటి ఈదురు గాలులు, వర్షాలు లేకపోయినప్పటికీ వైర్లు తెగి పడుతుండటాన్ని పరిశీలిస్తే డిస్ట్రిబ్యూషన్ లైన్ల వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం డిస్కం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయినా ప్రమాదాలు తగ్గకపోగా మరింత పెరుగుతుండటం, అమాయకులు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడుతుండం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ ఇంజనీర్లు మాత్రం తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు భిన్న వాదనలు ముందుకు తెస్తున్నారు. ముట్టుకుంటే షాకే.. ఇప్పటికీ ఎక్కడ చూసినా నిజాం కాలం నాటి ఓవర్హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. తరచూ వైర్లు తెగిపడుతుండటంతో పాటు స్తంభాలను ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లూజు లైన్లు సరిచేయడం, దెబ్బతిన్న పిన్ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్ బాక్సులను మార్చడం, డీటీఆర్ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్ ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. కంపెనీ కేటాయించిన నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయే తప్ప సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. విద్యుత్ ప్రమాదాలు ఆగడం లేదు. గత ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు సెక్షన్ల వారీగా టీజీ గెయిన్స్ (జీఐఎస్ అసెట్ ఇన్స్పెక్షన్ అండ్ మేనేజ్మెంట్) పేరుతో సర్వే చేయించారు. దెబ్బతిని వంగిన స్తంభాలు, కిందికి వేలాడుతున్న వైర్లు, లూజ్ కాంటాక్ట్లు, ఎలాంటి రక్షణ లేని డీటీఆర్లు, ఫ్యూజ్బాక్స్లు, రింగ్ మెయిన్ యూనిట్లు, ఏబీ స్విచ్లు, హెచ్జీ ఫూ్య్జ్ బాక్స్లు 4.50 లక్షల వరకు ఉన్నట్లు గుర్తించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా కొన్ని పనులు చేపట్టినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గలేదు. పలు బస్తీల్లోని ఇరుకు గల్లీల్లో ప్రమాదకరంగా మారిన కండక్టర్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఉరి తాళ్లుగా మారిన కేబుళ్లు ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కండక్టర్లు, స్తంభాలు తెగిపడుతుంటే.. మరోవైపు వాటి మెడకు టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ఏ స్తంభాన్ని పరిశీలించినా పెద్ద మొత్తంలో వైర్లు వేలాడుతూ కన్పిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా స్తంభాలకు జంక్షన్ బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి ఇల్లీగల్గా కరెంట్ వాడుతున్నారు. ఇదిలా ఉంటే భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటం, అటు ఇటుగా ఉన్న స్తంభాలు విరిగిపడుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూ విద్యుత్ అంతరాయాలకు కారణమవుతున్నా ఆపరేటర్లపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నెత్తిన వేలాడుతున్న విద్యుత్ వైర్లు -
గణేశ్ ఉత్సవాల వేళ జాగ్రత్త
షాద్నగర్రూరల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ లక్ష్మీనారాయణ సూచించారు. నవరాత్రులను పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో పట్టణ సీఐ విజయ్కుమార్ ఆధ్వర్యంలో శాంతిసంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని, మండపాల వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎవరైనా అను మానాస్పదంగా కనిపించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వెంటనే పోలీసులకు, డయ ల్ 100కు సమాచారం అందించాలని కోరారు. రా త్రి సమయాల్లో మండపాలవద్ద పోలీసు పహారా ఉంటుందని, పాయింట్ బుక్లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బండారి రమేష్, గౌరవ అధ్యక్షుడు అందెబాబయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్అలీఖాన్ బాబర్, మున్సిపల్ చైర్పర్సన్ సునీత, విద్యుత్ ఏడీ సత్యనారాయణ, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు సుశీల, రాంచందర్, శరత్కుమార్, ప్రణయ్, శ్రీకాంత్, ఎంవీఐ వాసు, ఫైర్ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
డిఫాల్టర్లను వదిలేసి.. మాపై పడతారా!
● చిన్న సన్నకారు రైతుల మండిపాటు ● సంఘం అధికారులు వేధిస్తున్నారంటూ ఆందోళన అబ్దుల్లాపూర్మెట్: రైతుల ముసుగులో కొందరు రైతుసేవా సహకార సంఘం నుంచి అధిక మొత్తంలో రుణాలు పొంది, చెల్లించడం లేదని.. డిఫాల్టర్లు చెల్లిస్తేనే తాము చెల్లిస్తామని రైతులు స్పష్టం చేశారు. రుణాలను త్వరగా చెల్లించాలని సంఘం అఽధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. సోమవారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయం ఎదుట మజీద్పూర్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సాగు చేయని వారికి పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చి, వసూలు చేయకుండా కాలం గడుపుతున్నారని, చిన్నమొత్తం రుణంగా ఇచ్చి చిన్న సన్నకారు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రుణాలు మంజూరు చేసి, డబ్బులు ఇవ్వకుండా కొందరు రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. కొంత మంది 200 గజాల ప్లాటు తప్పుడు పత్రాలు పెట్టి, బ్యాంకులో రుణాలు పొందారని పేర్కొన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని, రుణాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణాలు పొంది సాగు చేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి, రూ. కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలుత అలాంటి వారి నుంచి రుణం వసూలు చేయాలని సూచించారు. -
ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులు పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 70 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండల, గ్రామస్థాయిలో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. వన మహోత్సవంలో ఆయా శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పేమెంట్స్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయండి
పరిగి: స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. వందశాతం రిక్రూట్మెంట్ చేయాల్సిన పోస్టులను.. 2024 డీఎస్సీలో 30శాతం చేసి, మిగతా 70శాతం పదోన్నతులు కల్పించడం సరికా దని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016లో తెచ్చి న వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి, వందశాతం రిక్రూట్మెంట్ ద్వారానే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. -
దండిగా.. నిండుగా..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాలు నాగార్జున సాగర్, గోదావరితో పాటు మంజీరా, సింగూర్, ఉస్మాన్సాగర్, హిమయాత్ సాగర్ జలాశయాల్లో దండిగా నీరు చేరింది. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. దీంతో వచ్చే ఏడాది వేసవి వరకు తాగునీటి తరలింపునకు ఎలాంటి కొరత లేకుండాపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. మహా నగరానికి నాగార్జున సాగర్, గోదావరి నుంచే సుమారు 75 శాతానిపైగా తాగునీటి సరఫరా ఉంటుంది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం 1, 2, 3 దశల కింద నాగార్జున సాగర్ జలాశయం నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రోజువారీగా 270 ఎంజీడీల నీటిని తరలిస్తుండగా, గోదావరి నీటి సరఫరా పథకం కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 168 ఎంజీడీలు సరఫరా జరుగుతోంది. సింగూర్ నుంచి 75 ఎంజీడీలు, మంజీరా నుంచి 45 ఎంజీడీలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ నుంచి 40 ఎంజీడీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. మరోవైపు గోదావరి మూడు, నాలుగో దశ, మంజీరా అదనపు పైపులైన్ ఏర్పాట్లకు జలమండలి సన్నహాలు చేస్తోంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా నీటిని సరఫరా చేసేందుకు అదనపు జలాల తరలింపునకు ఏర్పాట్లు చేస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో.. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువవుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద పోటెత్తి నాగార్జున సాగర్ జలాశయం నిండకుండలా మారింది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం పూర్తి నీటి మట్టానికి రెండున్నర అడుగులు దూరంలో ఉంది. ఎగువ ప్రాంతం కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు నీటిని నగరంలోని కీలక ప్రాంతమైన ఐటీ కారిడార్ పరిధిలోకి వచ్చే.. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, లింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు గోదావరి జలాలు సరఫరా జరుగుతోంది. నాగార్జున సాగర్ నీళ్లతో ప్రధాన జలాశయాలు కళకళ రానున్న వేసవి వరకు నగర తాగునీటికి బేఫికర్ మరోవైపు గోదావరి 3, 4 ఫేజ్లు, మంజీరా రెండో దశ అదనపు జలాల తరలింపునకు జలమండలి ఏర్పాట్లు జంట జలాశయాలకు వరద ప్రవాహం జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్లకు వరద ప్రవాహం అధికమైంది. హిమాయత్ జలాశయం పూర్తి నీటిమట్టం చెరువవుతుండటంతో గేట్లు ఎత్తి దిగువన నీటిని విడుదల చేస్తు న్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయంంలోకి కూడా వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల పరీవాహక ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, శంకరపల్లి, ముమాన్పల్లి, దోబీపేట్ చేవెళ్ల, అందాపూర్, కొత్వాల్ పేట్, నర్కూడ, తాండూరు, మొయినా బాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి వరద నీటి ప్రవాహం మూసీ, ఈసీల ద్వారా జలాశయాలలోకి చేరుతోంది. మరోవైపు మంజీరా, సింగూర్ ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం జోరుగా సాగుతోంది. భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువ వదులుతున్నారు. మొత్తానికి వచ్చే వేసవి నాటికి నగర దాహార్తి తీరేందుకు ఎటువంటి ఢోకా ఉండదు. -
లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ
ఆమనగల్లు: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్లో నిర్వహించే లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన, మహాత్మాగాంధీ సుస్థిర మహావిజ్ఞాన సదస్సు పోస్టర్ను ఆదివారం పట్టణంలో లయన్స్క్లబ్ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో గాంధీ భావజాలం ఉన్నట్లయితే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ సాహితీ అధ్యక్షుడు గోపాల్జీ, లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన కమిటీ కో కన్వీనర్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. షాబాద్: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ఆచార్య సోమశేఖర్, ఆచార్య గణపతి, ఆచార్య కేతన్ మహాజన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బోనగిరిపల్లి వద్ద ఉన్న మహర్షివేద గురుకులంలో ఆదివారం ఉపనయన సంస్కారం కార్యక్రమం నిర్వహించారు. యజ్ఞ హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం దేవుడికి కేటాయించాలని సూచించారు. దేవాలయాలవద్దకు వెళ్లినప్పుడు నిష్టతో పూజలు చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. షాద్నగర్రూరల్: శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత సారాంశాన్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుందని త్రైత సిద్ధాంతం ప్రభోద సేవా సమితి–ఇందూ జ్ఞాన వేదిక నగర కమిటీ అధ్యక్షురాలు సద్గుణ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని త్రైతసిద్ధాంతం ప్రభోద సేవా సమితి– ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని క్రిష్టియన్ కాలనీలో రెండు రోజులుగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం శ్రీకృష్ణుడి ప్రతిమతో పరమేశ్వర థియేటర్ రోడ్డు, గంజి, మెయిన్రోడ్డు, కాలేజ్రోడ్డులోని పురవీధులుగా మీదుగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో భాగంగా కోలాట నృత్యాలు, భగవద్గీత శ్లోక ఉచ్చరణలతో, భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గుణ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ చెడు వ్యసనాలను వదిలిపెట్టి సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అరుంధతి, కుల్దీప్రెడ్డి, ధన్వంతరి, సుధీర్, దినేష్, శిరీష, వాసంతి, సాత్విక, నవ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ నెల 19న వికారాబాద్కు రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రమేష్కుమార్, శివరాజు, వడ్లనందు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఇక్కడికి రానున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్నెగూడ రోడ్లో, వికారాబాద్లో శివారెడ్డి పేట వద్ద కమలనాథులు ఘన స్వాగతం పలికి, ర్యాలీగా వస్తారని చెప్పారు. అనంతరం ఎన్నెపల్లి చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి అనంతపద్మనాభ స్వామి దర్శనానికి వెళ్తారన్నారు. పార్టీ నాయకులు కేపీ రాజు, విజయభాస్కర్రెడ్డి, కృష్ణ, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలి
ఇబ్రహీంపట్నం: హమాలీ కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వీరయ్య డిమాండ్ చేశారు. రైస్ మిల్లు హమాలీ కార్మికుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఒకటవ మహాసభను స్థానిక పాషనరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా హమాలీ కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. రైస్ మిల్లు యాజమాన్యాలు కార్మికులకు సంవత్సరానికి రూ.7 వేల బోనస్, ప్రమాద బీమా రూ.15 లక్షలు ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, రెండేళ్లకు ఒకసారి ఆగ్రిమెంట్ రూపంలో కూలీ రేట్లు పెంచాలని కోరారు. అనంతరం హమాలీ కార్మికుల మహాసభ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్లేశ్, ప్రధాన కార్యదర్శిగా దుర్గయ్య, కోశాధికారిగా జంగయ్య, ఉపాధ్యక్షులుగా జంగయ్య, వెంకటేశ్, సహాయ కార్యదర్శులుగా శ్రీశైలం, రామ్రెడ్డి, జంగయ్య, ఆర్గనైజర్గా బుగ్గరాములు, పండిత్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యోలమోని స్వప్న, మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ్ పాల్గొన్నారు. -
ఆగని ఆక్రమణలు!
● ప్రజా ప్రయోజనార్థం వదిలిన భూములు యథేచ్ఛగా కబ్జా ● రూ.కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం ● నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్న అధికారులు తుర్కయంజాల్: ప్రజా ప్రయోజనార్థం వదిలిన భూములు పరాధీనం అవుతున్నాయి. అక్రమార్కు లు రెచ్చిపోయి కబ్జాలకు ప్రయత్నిస్తున్నా అధికారుల చర్యలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం.. పనులను అడ్డుకోవడం వంటి పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంలో, భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడంలో, వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హద్దు రాళ్లు నాటుతుండగా.. తుర్కయంజాల్ రెవెన్యూ కమ్మగూడలోని సర్వే నెంబర్లు 227,228లో మను లే అవుట్లోని 871 గజాల భూమికి బై నంబర్లు వేసి డాక్యుమెంట్లు చేసిన వ్యక్తులు పలుమార్లు కబ్జాకు ప్రయత్నించారు. బహిరంగ మార్కెట్లో రూ.5 కోట్ల విలువైన ఈ భూమి సాగర్ రహదారికి కూతవేటు దూరంలో ఉండడంతో కమర్షియల్ భవన నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అధికారులు ఎన్నిసార్లు ఆపడానికి ప్రయత్నించినా కబ్జాదారులు తమ ప్రయత్నాలు విరమించడం లేదు. తాజాగా వరుసగా సెలవులు రావడంతో ఇదే అదనుగా రెండు రోజుల క్రితం ప్లాట్లకు హద్దు రాళ్లను నాటుతుండగా స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. భవన నిర్మాణ అనుమతి కోసం గతంలో హెచ్ఎండీఏకు, మున్సిపాలిటీకి పలుమార్లు దరఖాస్తు చేసిన విచారణ సమయంలో తిరస్కరిస్తూ వచ్చారు. ఇటీవల అధికారులు 400 గజాల ప్లాటుకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్చరిక బోర్డుల తొలగింపు తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి రాగన్నగూడలోని సర్వే నంబర్లు 549, 551, 552లో 1984లో 55 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో శ్రీమిత్ర డెవలపర్స్ వారు వెంచర్ను చేసి ప్లాట్లు విక్రయించారు. ఆ సమయంలో ప్రజాప్రయోజనార్థం సుమారు మూడు ఎకరాల ఖాళీ స్థలాన్ని వదిలారు. ఇది హెచ్ఎండీఏ, డీటీసీపీ నుంచి అనుమతి వెంచర్ కాకపోవడంతో ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు మరో లే అవుట్ను సృష్టించి అమాయకులకు విక్రయించారు. దీనిపై వరుసగా మీడియాలో కథనాలు రావడం, పలువురు స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు నామమాత్రంగా బోర్డులు ఏర్పాటు చేయడం, తరువాత అక్రమార్కులు వాటిని తొలగించడం పరిపాటిగా మారింది. తాజాగా శ్రీశైలం అనే వ్యక్తి 600 గజాల భూమిలో ప్రహరీ నిర్మిస్తుండటంతో మున్సిపల్ అధికారులు అడ్డుకున్నా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూడు ఎకరాల భూమికి సమీపంలో టీసీఎస్, ఔటర్ రింగ్ రోడ్డు వంటివి ఉండటంతో దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 కోట్ల పై మాటే. 4,211 గజాల భూమి ప్లాట్లుగా.. సర్వే నంబర్లు 501, 505,530, 533, 657, 658, 659, 660, 661, 662లోని శ్రీమిత్ర వెంచర్లో 9వేల 438 చదరపు గజాల స్థలాన్ని ప్రజా ప్రయోజనార్థం మొదటి లే అవుట్లో వదిలారు. ఖరీదైన భూమి కావడంతో అక్రమార్కులు 2013లో మరో లే అవుట్ను సృష్టించి కేవలం 2వేల గజాల వరకు ప్రజా ప్రయోజనార్థం వదిలారు. సుమారు 7,700 గజాల భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 15 కోట్ల పైమాటే. ఫిర్యాదులు అందిన ప్రతిసారి అధికారులు బోర్డులు ఏర్పాటుచేయడం అనంతరం తొలగించడం యథావిధిగా మారాయి. ఇవే కాకుండా మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్, మన్నెగూడ, మునగనూర్, తొర్రూర్, కొహెడలోని అనేక పార్కులు, ప్రజా ప్రయోజనార్థం వదిలిన భూములు యథేచ్ఛగా కబ్జాకు గురువుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజా ప్రయోజనార్థం, పార్కుల కోసం వదిలిన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కమ్మగూడలోని మను ఎన్క్లేవ్లోని భూమికి వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకుంటాం. శ్రీమిత్ర వెంచర్లోని స్థలాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – కె.అమరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
కనెక్షన్లు.. కలెక్షన్లపై
సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025డిస్కంలో ఇంటిదొంగలు! నజర్కాంట్రాక్టర్లుగా ఆర్టిజన్లు గ్రేటర్లో పది సర్కిళ్లు ఉండగా, మూడు (మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్) జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 30 ఆపరేషన్ డివిజన్లు ఉండగా, 220 వరకు ఆపరేషన్ సెక్షన్లు పని చేస్తున్నాయి. 213 మంది ఆపరేషన్ ఏఈలు 12 వేల మందికిపైగా జేఎల్ఎంలు, ఆర్టిజన్లు పని చేస్తున్నారు. ఇతర విభాగాల్లోని ఉద్యోగులతో పోలిస్తే వీరి వేతనాలు కూడా ఎక్కువే. క్షేత్రస్థాయిలోని కొంత మంది ఏఈలు, జేఎల్ఎంలు, ఆర్టిజన్లు గుట్టుగా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. బిల్డర్లతో కుమ్మకై ్క డిస్కం ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని నిర్మాణాలకు కొత్త కనెక్షన్లు జారీ చేసే విషయంలో భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు లేని భవనాలకు, అసైన్డ్/ప్రభుత్వ/ భూదాన్ భూముల్లో వెలుస్తున్న భారీ నిర్మాణాలకు గుట్టుగా కనెక్షన్లు జారీ చేస్తున్నారు. కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసే సమయంలో వినియోగదారుని ఫోన్ నంబర్ కాకుండా ఇతర నంబర్లు నమోదు చేయిస్తున్నారు. నెలవారీ బిల్లుల సమాచారం మాత్రమే కాదు సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య, లైన్ల పునరుద్ధరణ కోసం తీసుకుంటున్న ఎల్సీల వంటి సమాచారం వారికి చేరడం లేదు. అంతేకాదు మూడు నుంచి ఐదు కిలోవాట్ల డిమాండ్ ఉన్న వారికి కేవలం కిలోవాట్ కనెక్షన్ జారీ చేస్తున్నారు. తర్వాత లో ఓల్టేజీ సమస్య తలెత్తుతుండగా ఓల్టేజీ పెంపు పేరుతో సంస్థ నిధులను కొల్లగొడుతున్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని పలువురు ఇంజనీర్లు బిల్డర్లతో దోస్తీ చేస్తూ అనధికారిక భవనాలకు తక్కువ లోడుతో కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. ఆ తర్వాత లో ఓల్టేజీని సాకుగా చూపించి సంస్థ నిధులతో డెవలప్మెంట్ పనులు చేయిస్తున్నారు. ప్రత్యక్షంగా వినియోగదారుల జేబును గుల్ల చేస్తుండడంతో పాటు సంస్థ అంతర్గత నష్టాలకు కారణమవుతున్నారు. వినియోగదారుని పేరున నమోదు కావాల్సిన ఎల్టీఎం అగ్రిమెంట్లు ఒకే వ్యక్తి నంబర్పై 843 వెలుగు చూశాయి. కాంట్రాక్టర్ల పేరునే కాదు ఏకంగా ఓ లైన్మెన్ నంబర్పై 140 ఎల్టీఎం అగ్రిమెంట్లు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పరిశీలనలో తేలాయి. సంస్థ నుంచి నెలవారీ వేతనాలు తీసుకుంటూ పరోక్షంగా నష్టాలకు కారణమవుతున్న ఇంజనీర్లు, ఆర్టిజన్ కార్మికులపై సీఎండీ సీరియస్ అయినట్లు తెలిసింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజనీర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. బిల్డర్లతో కుమ్మక్కు.. తక్కువ లోడుతో కనెక్షన్లు జారీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్న ఆర్టిజన్లు బస్తీ పర్యటనల్లో పలు లోపాల గుర్తింపు సంస్థ నష్టాలకు కారణమవుతున్న ఇంజనీర్లపై వేటుకు రంగం సిద్ధంవిద్యుత్ లైన్లు, తరచూ సాంకేతిక లోపాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించేందుకు ఇటీవల ఇంజనీర్లు బస్తీబాట పట్టారు. డైరెక్టర్లు సహా సీఎండీ వరకు ఇలా ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ క్రమంలో అక్రమాలను గుర్తించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఏఈలతో సీఎండీ నిర్వహించిన రివ్యూ మీటింగ్లోనూ ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. కొంత మంది ఏఈలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. డిస్కం నుంచి నెలవారీ వేతనాలు తీసుకుంటూ గుట్టుగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన క్షేత్రస్థాయి ఏఈలు, జేఎల్ఎంలు, ఆర్టిజన్లపై కూడా దృష్టిసారించినట్లు తెలిసింది. ప్రజావసరాల కోసం డిస్కం స్టోర్ల నుంచి డ్రా చేసిన మెటీరియల్ను ప్రైవేటు అపార్ట్మెంట్లు/ సంస్థలకు తరలించిన వారిని సైతం గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
సర్దార్ పాపన్నగౌడ్ సేవలు మరువలేనివి
కడ్తాల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని ముద్వీన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం వారు అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సర్దార్ పాపన్నగౌడ్ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ వీరత్వానికి ప్రతీక అంటూ కొనియాడారు. ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని, అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్బండ్పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు స్థలంతో పాటు రూ.3 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మార్కెట్ చైర్ పర్సన్ యాటగీత, జైగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు రామారావుగౌడ్, బీసీ పొలిటికల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజుగౌడ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, టాస్క్ సీఓఓ రాఘవేందర్రెడ్డి, పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అడుగుకో గుంత.. వెళ్లాలంటే చింత
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు ● వాహనదారులకు తప్పని పాట్లు మొయినాబాద్: రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. అడుగడుగునా గుంతలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని ఆర్ అండ్ బీ రోడ్లతోపాటు గ్రామాల లింకు రోడ్లు సైతం అధ్వానంగా మారాయి. వర్షాల కారణంగా హిమాయత్నగర్– తంగడపల్లి ఆర్ అండ్ బీ రోడ్డులో చిలుకూరు వద్ద పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులు నడుములు పట్టేస్తున్నాయని వాపోతున్నారు. చిలుకూరు–మొయినాబాద్ లింకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేపట్టకపోవడంతో గుంతల్లో వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. మొయినాబాద్– అమీర్గూడ రోడ్డులో అడుగుకో గుంత ఏర్పడింది. పెద్దమంగళారం–చందానగర్ రోడ్డుపై వెళ్లడానికే వాహనదారులు, స్థానికులు జంకుతున్నారు. సురంగల్–శ్రీరాంనగర్ రోడ్డుపై వర్షం నీరు నిలిచి గుంతలు ఏర్పడి బురదమయంగా మారింది. అజీజ్నగర్ ఎస్సీ కాలనీ వద్ద రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు ఇళ్ల మధ్యలోనుంచే ఉండటంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
విస్తారంగా వర్షాలు
నీటమునిగిన పంటలు పూడూరు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండల పరిధి రేగడిమామిడిపల్లి, బార్లపల్లి, చన్గోముల్, తిమ్మాపూర్, కంకల్, మిట్టకంకల్, చింతలపల్లి, పూడూరు, పుడుగుర్తి తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చన్గోముల్– బార్లపల్లి మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుపై బురద వచ్చి చేరింది. పుడుగుర్తి, కడుమూరు, కంకల్, మంచన్పల్లి, మేడిపల్లికలాన్, ఈసి వాగు పరుగులు తీస్తోంది. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత బొంరాస్పేట: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ట్రాక్టర్ల యజమానులు అంజిలయ్య, శ్రీకాంత్లపై కేసునమోదు చేశా మని ఎస్ఐ బాల వెంకటరమణ తెలిపారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం
శంషాబాద్ రూరల్: వేర్వేరు ఘటనలో ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి సమాచారం మేరకు... మహారాష్ట్రకు చెందిన సూర్యవంశీ రాజేంద్ర(35), పూజ దంపతులు ఉపాధి కోసం పదేళ్ల కిందట వలస వచ్చి ఇందిరానగర్ దొడ్డిలో నివామసుంటున్నారు. ఈ నెల 10న పూజ ఉదయం పనికి వేళ్ల సమయంలో రాజేంద్ర ఇంట్లోనే ఉన్నాడు. స్వగ్రామం వెళ్తానని చెప్పాడు. అదే రోజు సాయంత్రం పూజ పని నుంచి తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. భర్తకు చెందిన దుస్తులు, బ్యాగు కనిపించలేదు. అతను స్వగ్రామం వెళ్లి ఉంటాడని భావించింది. దీంతో భర్తకు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ అయింది. అత్తకు ఫోన్ చేసి అడగగా అక్కడకు రాలేదని చెప్పింది. దీంతో అతని కోసం అన్ని చోట్ల వెతికినా జాడ తెలియకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. ముచ్చింతల్కు చెందిన బొడ్డు రత్నం(48) ఈ నెల 13న నందిగామ మండలం చేగూరులో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. అదే రోజు రాత్రి రత్నం భార్య మంజుల తన కూతురుకు ఫోన్ చేసి వాకబు చేసింది. అతను కూతురు వద్దకు వెళ్లలేదని తెలియడంతో అన్ని చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఊరికి వెళ్తున్నానని చెప్పి.. కనిపించకుండా పోయి
పహాడీషరీఫ్: యువ కుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సాబెర్ హుస్సేన్ (20) రెండు నెలల క్రితం తుక్కుగూడకు వలస వచ్చి హర్షగూడలో ఉన్న కంపెనీలో లేబర్గా పని చేస్తున్నాడు. తనకు ఇక్కడ పని చేయడం ఇష్టలేదని తోటి స్నేహితుడు లస్కర్కు చెప్పి సొంతూరు వెళ్తానంటూ ఈ నెల 6న బయల్దేరాడు. సొంతూరుకు వెళ్లకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ విషయమై స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గానీ 87126 62367 నంబర్లో గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎకై ్సజ్ పోలీసులు దాడిచేశారంటూ ఫిర్యాదు తమపై కూడా దాడి జరిగిందని ఎకై ్సజ్ పోలీసులు సైతం.. జీడిమెట్ల: నాంపల్లి ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ కోటమ్మ తన సోదరుడిపై సర్జికల్ బ్లేడ్తో దాడిచేయించారని కుత్బుల్లాపూర్కు చెందిన పవన్ కుమార్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా నాంపల్లి ఎకై ్స జ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ కోటమ్మ సైతం తన విధులకు కొందరు అటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ ఇరువురి ఫిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ● శనివారం రాత్రి ఓ యువకుడి గంజాయి,హష్ అయిల్ సేవిస్తుండగా ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. రెండవ వ్యక్తిని పట్టుకునేందుకు కుత్బుల్లాపూర్లోని అయోధ్యనగర్కు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కోటమ్మ తన సిబ్బందితో వెళ్లారు. అక్కడ దర్యాప్తు చేస్తుండగా స్థానికంగా ఉన్న హేమంత్, నితీష్, రవితేజ, చరణ్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆమె జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ● శనివారం రాత్రి ఎకై ్సజ్ అధికారులు బాలు మహేందర్,హేమంత్ అనే ఇద్దరిని విచారణ చేస్తున్నారు. వెంకటేశ్వర నగర్కు చెందిన చంటియాదవ్ చూసి వారిని పట్టుకోవడానికి మీరెవరు అంటూ ప్రశ్నించాడు. దీంతో వారు దాడిచేశారని.. డాక్టర్లు 23కుట్లు వేశారని బాధితుడి సోదరుడు పవన్కుమార్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యానికి బానిసై.. ఉరివేసుకుని
మొయినాబాద్: మద్యానికి బానిసైన ఓ డ్రైవర్ కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని హిమాయత్నగర్లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్కు చెందిన కావలి వెంకటేశ్ (48) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. దీంతో ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ మద్యం మత్తులో భార్యకు ఫోన్ చేసి తాను ఉరివేసుకుని చనిపోతున్నానని చెప్పాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి పరిశీలించారు. మద్యం మత్తులో ఉండడంతో పోలీస్స్టేషన్కు తీసుకెళ్లకుండా ఇంటిదగ్గరే వదిలి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో మద్యం మత్తులోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ బలవన్మరణం -
మూగజీవాలు భద్రం
● సీజనల్ వ్యాధులతో జాగ్రత్త ● అప్రమత్తత తప్పనిసరి ● లేదంటే పశుసంపదకు ముప్పు ● పశువైద్యాధికారి విశ్వనాథం నవాబుపేట: వానాకాలం సీజన్లో మనుషులకే కాదు.. మూగజీవాలకు వ్యాధుల ముప్పు తప్పదు. ఈ కాలంలో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు తదితర రోగాలు చుట్టుముడతాయి. ఈగలు, దోమల దాడి పెరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు యాజమాన్య చర్యలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాటి జీవన స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని, ఎలాంటి వ్యాధి సోకినా వెంటనే వైద్య చికిత్స అందించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ విశ్వనాథం రైతులకు సూచిస్తున్నారు. కాగా మండలంలో ఆవులు, ఎడ్లు 4,232 ఉండగా.. గేదెలు 1,162, గొర్రెలు 3,573, మేకలు 7,874 ఉన్నాయి. గాలికుంటు గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాలా బలహీనంగా ఉంటుంది. పాడి పశువులు నీరసించి పోతుంటాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. సాగు పనులకు ఎడ్లు సహకరించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్లలో పెంచుకునే వాటికి ఈ రోగం వ్యాపిస్తుంటుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సోకే ప్రమాదం ఉంది. వ్యాధి బారిన పడిన పశువులకు నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3,4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడి మేత తీసుకోలేక నీరసించిపోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది. జబ్బవాపు వయసులో ఉన్న ఆరోగ్య వంతమైన పశువులు, తెల్లజాతి పశువులకు ఈ జబ్బవాపు వ్యాధి సంక్రమిస్తుంటుంది. ఇది సోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతుంది. మేత మేయదు. నిత్యం పడుకొనే ఉంటుంది. జబ్బభాగం వాచి, నల్లగా కములుతుంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతుంటుంది. వాపు ఉన్నచోట చేతితో తాకితే గరగరమని శబ్దం వస్తుంది. సకాంలో వైద్యం అందించకపోతే పశువు నీరసించి, చనిపోతుంది. సకాలంలో సూదిమందు, గ్లూకోజ్ ద్రావణాన్ని అందించాలి. ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకా వేయిస్తే మేలు. గొర్రెల్లో కాలిపుండ్లు వర్షాకాలంలో గొర్రెలు బురదలో తిరగడం వలన కాలిపుండ్ల వ్యాధి సోకుతుంది. గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లుతుంది. చీముపట్టి నొప్పితో ముందుకాళ్లపై గెంటుతాయి. వ్యాధి ముదిరితే గిట్ట లూడిపోతాయి. ఇది సోకిన జీవాలకు 10 శాతం మైలతుత్తం, పదిశాతం జింక్సల్ఫేట్, లేదంటే ఐదుశాతం ఫార్మలిన్లో ఏదైనా ఒక ఆయిట్మెంట్ పూయాలి. యాంటిబయాటిక్ ఇంజెక్షన్ వరుసగా 3–5 రోజుల పాటు వేయించాలి. గొర్రెలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనియొద్దు. గురక వ్యాధి ప్రస్తుత కాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు(గురక) ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న వాటికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని బారిన పడిన వాటికి అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. మేత మేయదు. గొంతుపై, మెడ కింద వాపు కన్పిస్తుంది. ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. వణుకుతూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. పాడి పశువుల్లో పాలదిగుబడి తగ్గుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువ అయితే ఎడతెరపి లేకుండా దగ్గుతూ, అపస్మారక స్థితికి వెల్లి చనిపోతుంది. దోమలు దాడి చేస్తే.. నేల చిత్తడిగా ఉండి, వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో నీరు నిల్వ ఉన్న గుంతలు, మురుగునీటి కాల్వల్లో ఈగలు, దోమలు ఆవాసాన్ని ఏర్పర్చుకుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులపై దాడి చేస్తుంటాయి. ఈ సీజన్లో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. తద్వారా పశువులు మేత సరిగా మేయవు, నిద్ర పోవు. ఫలితంగా అవి రక్తహీనతకు గురవుతాయి. ఈగలు, దోమ కాటు వలన పశువు శరీరంపై పుండ్లు ఏర్పడతాయి. అందుకు పశువుల పాకలు, నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్ను పిచికారీ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండుపిడుకలు, వేపాకుతో పొగపెడితే ఈగలు, దోమలు తగ్గుతాయి. లేత గడ్డి ప్రమాదం తొలకరి జల్లులకు మొలిచే లేత గడ్డి మొక్కలను పశువులు అతిగా తింటుంటాయి. అయితే ఆ గడ్డిలో హైడ్రో ౖసైనెడ్ విష పదార్థం ఉంటుంది. దీనిని మేసిన 15 నిమిషాలకే పశువుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే అది మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు పశువులకు లేత గడ్డిని మేతగా వేయవద్దు. తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
ర్యాష్గా డ్రైవింగ్ చేస్తే చర్యలు
రాజేంద్రనగర్: వాహనదారులు ప్రమాదకర విన్యాసాలు, ప్రజలకు ఆటంకం కలిగించేలా ర్యాష్గా డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.రాజు హెచ్చరించారు. ఇటీవల మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన బాబానగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ రషీద్, చంపాపేట్కు చెందిన జాఫర్ అహ్మద్ షా, బాలాపూర్కు చెందిన సయ్యద్ అఫ్రోజ్ అనే యువకులను అదుపులోకి తీసుకొని వారి నుంచి హోండా షైన్ వాహనం (ఏపీ12పీ 7745), యాక్టివా (టీఎస్10ఎఫ్జీ 5061) వాహనాలను స్వాధీనం చేసుకొని మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించామన్నారు. ఈ 16వ తేదీన బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వైపు ముగ్గురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలను నడుపుతూ వాహనాలపై మద్యం సేవిస్తూ ప్రజలకు, వాహనదారులు ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ విషయాన్ని ఇతర వాహనదారులు వీడియోలు తీసి రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులకు ఆన్లైన్లో తెలపగా.. వారిని గుర్తించి స్టేషన్కు తీసుకొచ్చి వారి పత్రాలను పరిశీలించి తదుపరి విచారణ నిమిత్తం మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించామని వివరించారు. పెద్దమ్మ ఆలయంలో భక్తురాలి గొలుసు చోరీ ఫిలింనగర్: జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించేందుకు వచ్చిన ఓ మహిళా భక్తురాలి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఎల్బీనగర్కు చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చారు. అదే సమయంలో మొక్కు తీర్చుకుంటుండగా ఆమె హ్యాండ్బ్యాగ్ చోరీకి గురైంది. అందులో ఉన్న 13 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురి కావడంతోఆమె కొడుకు నరేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము మొక్కు తీర్చుకునేందుకు రాగా గుర్తుతెలియని వ్యక్తులు తన తల్లి హ్యాండ్బ్యాగ్ చోరీ చేశారని, అందులో బంగారంతో పాటు నగదు ఉందని పేర్కొన్నారు. ఇక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఆమె హ్యాండ్బ్యాగ్ను చోరీ చేస్తున్నట్లుగా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసుల వేట అత్తాపూర్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవడం..కొద్ది రోజుల తరువాత మరో అమ్మాయితో ప్రేమ అంటూ వెంట పడుతున్న నిత్య పెళ్లి కొడుకు కోసం అత్తాపూర్ పోలీసులుగ గాలిస్తున్నారు. పెళ్లి పేరుతో మోసపోయిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవికుమార్ ఎలియాస్ రఫీపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. రవికుమార్ కొంత కాలంగా అత్తాపూర్ పరిసర ప్రాంతాలలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగంగా చేస్తున్నట్లు నటించసాగాడు. తనకంటే వయస్సులో కంటే చిన్న వారిని గుర్తించి ప్రేమ పేరుతో నమ్మించి వివాహాలు చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయిలను లొంగదీసుకోవడంతో పాటు శారీరకంగా మానసికంగా హింసిస్తాడని పోలీసులు తెలిపారు. ప్రేమించుకునే సమయంలో మాట్లాడుతున్న సంభాషణలు వారు గడిపిన ప్రదేశాలను ఆడియో... వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరిస్తూ ఉండటంతో బాధిత యువతులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. తప్పించుకు తిరుగుతున్న రఫీపై వివిధ కేసులు నమోదు చేశారమన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
● మంత్రి సీతక్క ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుచేవెళ్ల: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీరాజ్ శాఖమంత్రి సీతక్క అన్నారు. మండలంలోని పలు అభివృద్ధి పనులకు మండలి చీఫ్విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముడిమ్యాల నుంచి మల్కాపూర్ గ్రామానికి రూ.3.35 కోట్లతో చేపట్టే బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. చేవెళ్లలో రూ.1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాటాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ముడిమ్యాలలో మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా దుకాణాలు పెట్టించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, నియోజకవర్గం నాయకులు, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ పూజలు మండలంలోని తంగడపల్లిలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయస్వామి ఆలయంలో కొనసాగుతున్న విగ్రహప్రతిష్ఠ పూజలకు శనివారం మంత్రి సీతక్క, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. -
ఒడిశా టు మహారాష్ట్ర
● గుట్టుగా గంజాయి అక్రమ రవాణా ● రోడ్డు ప్రమాదంతో బయటపడిన 16.50 కిలోలు అబ్దుల్లాపూర్మెట్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతని నుంచి 16.50కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం శివారులో విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఓ కారు డివైడర్ను ఢీ కొట్టిందన్న సమాచారం మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో కారును తనిఖీ చేశారు. కొన్ని టేపుతో చుట్టి ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కవర్ల మూటలు కనిపించగా వాటిని పరిశీలించడంతో గంజాయి అని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఖమ్మం జిల్లా వాస్రం తండాకు చెందిన భుక్యా మధుగా వెల్లడించాడు. తనకు ఖమ్మం జిల్లాకు చెందిన సాదిబ్ అనే వ్యక్తి స్నేహితుడని, ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తే రూ.50వేలు ఇస్తారని చెప్పడంతో అంగీకరించినట్టు తెలిపాడు. రాజమండ్రిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా గంజాయి తీసుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాగ్పూర్కు సరఫరా చేయాలని సూచించి రూ.50వేలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తుండగా మధు ప్రయాణిస్తున్న కారు బాటసింగారం వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయింది. స్థానికుల సమాచారం మేరకు వెళ్లిన పోలీసులకు గంజాయి దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధును అదుపులోకి తీసుకుని అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. తలకొండపల్లిలో గంజాయి పట్టివేత ఆమనగల్లు: అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని తలకొండపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకారం.. తలకొండపల్లి మండల కేంద్రం సమీపంలోని ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం ఎస్ఐ శేఖర్, సిబ్బంది కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. కడ్తాల్ వైపు నుంచి వస్తున్న కారును ఆపుతుండగా అందులోనుంచి ఇద్దరు పారిపోతుండగా పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా 287 గ్రాముల గంజాయి లభించింది. కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరిని తలకొండపల్లి గ్రామానికి చెందిన పద్మ వెంకటేశ్, కట్టమల్ల రఘువరన్గా గుర్తించారు. వారిని విచారించగా పద్మవెంకటేశ్ స్నేహితులు నగరంలోని ఉప్పల్కు చెందిన జోగురాజు, పిల్లి ప్రణయ్ గంజాయిని ఇచ్చారని వెల్లడించడంతో వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ శేఖర్, కానిస్టేబుల్ జాషువ, శ్రీను, శ్రీనివాస్ను సీఐ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మారమోని శివకుమార్(21) స్థానిక వైన్స్లో పనిచేస్తున్నాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన బంధువు బోళ్ల మల్లేశ్ శుక్రవారం మైసిగండిలో నిర్వహించిన ఫంక్షన్లో శివకుమార్ పాల్గొన్నాడు. ఫంక్షన్ ముగిసిన అనంతరం అదే రాత్రి తలకొండపల్లిలోని బంధువుల ఇంటికి వారి వెంట తన బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో చల్లంపల్లి సమీపంలో బైక్పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కడ్తాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువకుడి నేత్రాలను కుటుంబసభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అందజేశారు. యువకుడి అదృశ్యం కేశంపేట: యువకుడు అ దృశ్యమైన సంఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి శివారులోని వాల్యతండాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగడ్డతండా పంచాయతీ పరిధిలోని దేవునిగుడితండాకు చెందిన లక్ష్మణ్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కొండారెడ్డిపల్లి శివారులోని వాల్యతండాలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు ముడావత్ శ్రీనివాస్ చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయ పనులు చేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం కుమారుడు ఇంటి వద్ద ఉండగా తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చారు. కుమారుడు కన్పించకపోవడంతో చుట్టపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిచ్చి కుక్క వీర విహారం ● ఆరుగురిని గాయపర్చిన శునకం ● ఒకరి పరిస్థితి విషమంబషీరాబాద్: మండల కేంద్రంలో ఓ పిచ్చి కుక్క నాలుగు రోజులుగా స్వైర విహారం చేసింది. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి కరిచింది. శనివారం ఇందిరానగర్లో ఇంటి ఎదుట ఆడుకుంటున్న విక్రాంత్(4), నరేష్(8)తో పాటు ఆసియా బేగం(22)ను విచక్షణా రహితంగా కరిచింది. ఆసియా బేగంకు తొడ, చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషయమంగా ఉందని హైదరాబాద్కు రిఫర్ చేశారు. ఇదే శునకం నాలుగు రోజు క్రితం గౌరీ గల్లిలో స్వప్న అనే మహిళతో పాటు ఇద్దరు వృద్ధులను కరిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో శనివారం గ్రామస్తులు కుక్కను కొట్టి చంపారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలనికోరుతున్నారు. -
మున్సిపల్ కమిషనర్పై విచారణకు ఆదేశం
మొయినాబాద్: వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేసే విషయంలో మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ వ్యవహరించిన తీరుపై కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని శనివారం చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ను ఆదేశించారు. ఈ విషయమై వారు విచారించగా కొత్తగా ఏర్పడిన చేవెళ్ల, శంకర్పల్లి మున్సిపాలిటీ కార్యాలయాల్లోనే జాతీయ జెండా ఎగురవేసినట్లు తెలిసింది. వార్డు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలో విషయంలో అక్కడి మున్సిపల్ కమిషనర్లు ప్రజలతో సమయస్ఫూర్తితో సానుకూలంగా మాట్లాడారని, మొయినాబాద్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ మాత్రం స్థానికులతో దురుసుగా మాట్లాడటం వివాదంగా మారినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని కలెక్టర్కు నివేదించినట్లు సమాచారం. ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. శంకర్పల్లి: ఓటు చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శనివారం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్చార్జి ఇంద్రసేనారెడ్డి, అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని దుర్వినియోగం చేయడం అన్యాయమని అన్నారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్చార్జి రామ్మోహన్, నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్, నాయకులు గౌరీ సతీశ్, వెంకటయ్య, చెన్నయ్య, నర్సింలు, శ్రీకాంత్ రెడ్డి, రమ్య, ప్రవీణ్, శ్రీనాథ్ పాల్గొన్నారు. ఆమనగల్లు: మార్వాడీ వ్యాపారసంస్థలకు వ్యతిరేకంగా పట్టణంలో వివిధ వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన బంద్ తాత్కాలికంగా వాయిదాపడింది. మార్వాడి గో బ్యాక్ అంటూ వర్తకులు ఇచ్చిన పిలుపు, మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన ఒకరోజు బంద్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్వాడీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పట్టణంలో బంద్కు పిలుపునివ్వడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బంద్పై మార్వాడీ వ్యాపారస్తులు, స్థానిక వర్తకసంఘం నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక వ్యాపారుల డిమాండ్లకు మార్వాడీలు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు స్థానిక వర్తకసంఘం నాయకులను పోలీసులు పిలిపించి మాట్లాడారని, ఈ నేపథ్యంలో 18న తలపెట్టిన బంద్ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం తాండూరులో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో స్నేహం కొనసాగుతుంద న్నారు. అయినా ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆకలి బాధలు తీర్చేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టులేనని అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో అంటరానితనం పోవాలనే నినాదంతో పోరాటం చేశామని తెలిపారు. పార్టీ అనుబఽంధ కార్మిక సంఘాల ద్వారా కార్మికుల పక్షాన తాము గళం వినిపిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ప్లాన్లను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పాలని ఆ సంఘం నాయకులు సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. -
సరదాల దందా!
వీకెండ్ సరదాలకోసం నిర్మించుకున్న ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. బర్త్డే పార్టీలు, సరదా పార్టీలు, మందు పార్టీలు, రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి గలీజు దందాలకు నిలయాలుగా తయారయ్యాయి. ఎస్ఓటీ పోలీసులు తరచూ దాడిచేసి గుట్టు రట్టుచేస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడడం లేదు.మొయినాబాద్: నగర శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికిపైగా ఉన్నాయి. చాలా మంది 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్లో పిల్లలతో వచ్చి ఆనందంగా గడపడానికంటూ నిర్మించి తరువాత వాటిని లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు తీసుకుని అడ్డగోలుగా.. లీజుకు తీసుకుంటున్న నిర్వాహకులు వాటిలో అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్టుగెదర్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, బర్త్డేలు అంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. వీటితోపాటు రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు, పేకాట, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. యువకులను ఆకర్షించేలా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం సైతం చేయిస్తున్నట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు బయటపెట్టాయి. పార్టీల్లో అక్రమంగా మద్యం తాగడం, హుక్కా, గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. కేసులు పెడుతున్నా మారని తీరు ఎస్ఓటీ పోలీసులు తరచూ దాడులు చేసి పార్టీలను భగ్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహించేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఫాంహౌస్ల యజమానులు, నిర్వాహకులపై సైతం కేసులు పెడుతున్నారు. అయినా దందాలు మాత్రం ఆగడంలేదు. మామూళ్ల మత్తులో స్థానిక పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వెలుగుచూసిన కొన్ని ఘటనలు ● ఏడాదిన్నర క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ● ఏడాది క్రితం నజీబ్నగర్ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్లో ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. ● ఏడాది క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ● ఆరు నెలల క్రితం అజీజ్నగర్ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ● ఆరు నెలల క్రితం తోలుకట్ట రెవెన్యూలో ఓ ఎమ్మెల్సీకి చెందిన ఫాంహౌస్లో కోడిపందేలు నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. నిర్వాహకుడితోపాటు 64 మందిని పట్టుకున్నారు. భారీగా మద్యం, నగదు, క్యాసినో కాయిన్స్, కోడికత్తులు, కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● నాలుగు నెలల క్రితం ఎత్బార్పల్లిలోని ఫాంహౌస్లో బర్త్డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, 7 మంది యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్కా పాట్స్, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ● తాగాజా గురువారం రాత్రి బాకారంలోని ఓ ఫాంహౌస్లో అనుమతి లేకుండా మధ్యం వినియోగిస్తూ బర్త్డే పార్టీ నిర్వహిస్తున్న 51 మంది విదేశీయులను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి హుక్కా, 20 లీటర్ల విదేశీ మద్యం, 65 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ డిటేన్ సెంటర్కు విదేశీయులు అనుమతి లేకుండా ఫాంహౌస్లో బర్త్డే పార్టీ నిహించడంతోపాటు హుక్కా, విదేశీ మద్యం వినియోగించి పోలీసులకు పట్టుబడ్డ విదేశీయులను పోలీస్ డిటేన్ సెంటర్కు తరలించారు. బాకారం రెవెన్యూలోని ఎస్కే నేచర్ రీట్రీట్ ఫాంహౌస్లో గురువారం రాత్రి విదేశీయులు ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ వినియోగిస్తూ నిర్వహించిన బర్త్డే పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఇందులో పట్టుబడ్డ 51 మంది విదేశీయుల్లో 36 మందికి వీసాగడువు ముగిసినట్లు గుర్తించా రు. వారిని సొంత దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటి వరకు వారిని కోర్టు సూచ నతో పోలీస్ డిటేన్ సెంటర్లో ఉంచుతామని ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌస్లు పార్టీల పేరుతో గంజాయి, హుక్కా, మద్యం వినియోగం యథేచ్ఛగా పేకాట, కోడి పందేలు, ముజ్రా పార్టీలు అద్దెకు తీసుకుని గుట్టుగా నడుపుతున్న నిర్వాహకులు తరచూ గుట్టు రట్టవుతున్నా పడని అడ్డుకట్ట -
బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణస్వామి
● బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి ● ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు శ్రీశైలం ముదిరాజ్ పరిగి: హైదరాబాద్ మాజీ మేయర్, రచయిత, జర్నలిస్ట్ కొరివి కృష్ణ స్వామిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు దోమ శ్రీశైలం ముదిరాజ్ అన్నారు. సంఘం నాయకులతో కలిసి శనివారం పట్టణంలో కృష్ణస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరానికి తొలి మేయర్గా విధులు నిర్వర్తించిన కృష్ణస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేశారని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆశోక్కుమార్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం తాలూకా గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్యముదిరాజ్, కార్యదర్శి కృష్ణయ్య ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బాబయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈసీ.. కబ్జా చేసి!
ఆక్రమణలో ఈసీ వాగు సాక్షి, రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ జిల్లా పూడూరు, పరిగి ప్రాంతాల్లో మొదలయ్యే ఈసీ వాగు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంషాబాద్ మండలాలను తాకుతూ హిమాయత్సాగర్ జలాశయంలోకి చేరుతుంది. వాగు సహజ సిద్ధంగా చేవెళ్ల–షాబాద్, మొయినాబాద్–శంషాబాద్ మండలాల సరిహద్దుల నుంచి ప్రవహిస్తుంది. శంషాబాద్ మండలం మల్కారం వరకు వెడల్పుగా ఉన్న వాగు అక్కడి నుంచి తగ్గింది. వాగులో భారీగా వరదలు వచ్చినప్పుడు వెడల్పు తగ్గిన చోటు నుంచి ఉప్పొంగి ప్రవహించేది. వరద వచ్చినప్పుడు బయటకు వచ్చిన నీరు నాలుగైదు గంటల్లో తగ్గిపోయేది. శంషాబాద్ మండలం కేబీ దొడ్డి వద్ద అంచమడుగు అనే కాలువ ఉండేది. ఈసీ వాగులో వరద ఎక్కువగా వచ్చినప్పుడు కాలువలో నుంచి సైతం వరద నీరు వెళ్లేది. ప్రస్తుతం వాగు సహజ సిద్ధమైన ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. కేబీదొడ్డి వద్ద అంచమడుగు కాలువను రియల్ వ్యాపారులు పూర్తిగా కబ్జా చేశారు. కాలువకు ఇరువైపులా తమ పట్టాభూమి ఉండటంతో చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మించారు. కాలువకు సైతం ఇరువైపులా కాంక్రీట్ వాల్ నిర్మించి పైనుంచి స్లాబ్ వేశారు. వాగులో వరద ఎక్కువ వచ్చినప్పుడు కాలువలోకి రాకుండా రిటర్నింగ్ వాల్ నిర్మించడంతో వరద నీరు మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ వైపు డైవర్ట్ అవుతోంది. అలా దారిమళ్లుతున్న వరదనీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. భారీ వరద రావడంతో.. మూడు రోజుల క్రితం ఈసీ వాగులో భారీ వరద రావడంతో కబ్జాదారుల బాగోతం బయట పడింది. వెంచర్ వెనుకభాగంలో నిర్మించిన రిటర్నింగ్ వాల్ పైనుంచి వరదనీరు వెంచర్లోకి చేరింది. అంచమడుగు కాలువలోకి రాకుండా అడ్డంగా మట్టికట్ట నిర్మించడంతో అది తెగిపోయి కేబీదొడ్డి వైపు భారీగా వరదనీరు వెళ్లింది. వెంచర్ అవతలివైపు ప్రహరీ అడ్డుగా ఉంటంతో పొలాల్లోనే నీళ్లు నిలిచిపోయాయి. కేబీదొడ్డి వద్ద గొర్రెల షెడ్డును ముంచేసింది. రిటర్నింగ్ వాల్కు తగిలి అమ్డాపూర్ వైపు డైవర్ట్ అయిన వరదనీరు ఓ ఫంక్షన్ హాల్లోకి వెళ్లింది. అంచమడుగు కాలువలోకి వెళ్లాల్సిన వరదంతా ఈసీ వాగు వంతెన కిందినుంచే వెళ్లాల్సి రావడంతో అంతనీరు ఒకేసారి వెళ్లలేక ఆ ప్రాంతమంతా చెరువులా మరింది. అమ్డాపూర్ వంతెన నుంచి వెంకటాపూర్ వంతెన వరకు ఆరు కిలోమీటర్ల దూరం దీని ప్రభావం పడింది. ఎప్పుడూ లేని విధంగా వెంకటాపూర్ వంతెనను తాకుతూ ప్రవహించింది. వాగుకు రెండు వైపులా పంటపొలాలు నీటమునిగాయి. మరోవైపు వరద తగ్గిన వెంటనే రియల్ వ్యాపారులు తెగిపోయిన మట్టికట్టను బుల్డోజర్లతో మట్టి నింపి పూడ్చేశారు. భారీ వరదతో బయటపడిన నిజ స్వరూపం కాలువను ఆక్రమించి చుట్టూ ప్రహరీ వరద చేరకుండా రిటర్నింగ్ వాల్ నిర్మాణం దారిమళ్లిన నీళ్లు.. వందల ఎకరాల్లో మునిగిన పంటలుకాదేదీ కబ్జాలకు అనర్హం అన్నట్లు అక్రమార్కులకు చెరువులు, వాగులు, వంకలు, కుంటలు ఏదీ వదలడం లేదు. ఖాళీగా కనిపిస్తే చాలు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఇష్టారీతిన ‘రియల్’ వెంచర్లు చేస్తూ ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా ప్రవహించే వరదనీటికి అడ్డుగా ఏకంగా రిటర్నింగ్ వాల్ నిర్మించారు. తాజాగా కురిసిన వర్షాలతో వరద దారిమళ్లి పంటపొలాలను ముంచెత్తింది. ఉధృతి మరింత ఎక్కువ కావడంతో అడ్డుకట్టలను బద్ధలు కొట్టుకుని వెంచర్నే ముంచేసింది.ఈసీ వాగులో భారీ వరద వచ్చి పంటపొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబీదొడ్డి వద్ద అంచముడుగు కాలువ చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మించి భారీగా మట్టి నింపడంతో వరద అమ్డాపూర్ వైపు మళ్లి పంట పొలాలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో వరదలు వస్తే పంటభూములన్నీ కొట్టుకుపోతాయని వాపోతున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
కొందుర్గు: అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు కంటెయినర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా నుంచి హైదరాబాద్ బహదూర్పురాకు కంటెయినర్లలో ఆవులను తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో శుక్రవారం మధ్యాహ్నం రామచంద్రాపూర్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఏపి29 టీఏ9171, టీఎస్07 యూజీ5594 నంబర్లు కలిగిన కంటెయినర్లలో అమానవీయంగా 90 ఆవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి గోశాలకు తరలించారు. వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు సునీల్, హతీఫ్ఖాన్, శంకర్, మహ్మద్ ఇస్తేశంమొద్దీన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. ఆవులను హైదరాబాద్ జియాగూడలోని శ్రీసమరిత్ కామధేను గోశాలకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఎంఎంఎస్ అందుకున్న ఏసీపీ మోహన్కుమార్ గోల్కొండ కోటలో ప్రదానం చేసిన ముఖ్యమంత్రి సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య మండల ఏసీపీగా పని చేస్తున్న శ్రీరాముల మోహన్కుమార్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎంఎస్) అందుకున్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోవ్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మోహన్కుమార్ 1995లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. 1996–99 మధ్య హాబీబ్ నగర్, 2000–03 మధ్య చార్మినార్, 2003–09 మధ్య దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ల్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2009లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఆపై మీర్చౌక్, దక్షిణ మండల టాస్క్ఫోర్స్, చార్మినార్, పంజాగుట్ట, తూర్పు మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేశారు. 2018లో డీఎస్పీగా పదోన్నతి పొందిన మోహన్కుమార్ దక్షిణ మండలం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా, సూర్యాపేట డీఎస్పీగా, నగర సీసీఎస్, పంజగుట్ట ఏసీపీగా పని చేశారు. ‘సహజవనరుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి’ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: సహజవనరుల పరిరక్షణ సమాజంలో అందరి లక్ష్యం, బాధ్యత కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభిప్రాయపడ్డారు. అప్పుడే మెరుగైన జీవనాన్ని కొనసాగించగలమని స్పష్టం చేశారు. హైడ్రా ఆ దిశగా పని చేయడానికి పునరంకితం కావాలని ఆకాక్షించారు. బుద్ధభవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్న మేరకే నగరంలో గొలుసుకట్టు చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా పని చేస్తోందన్నారు మూసారాంబాగ్ వంతెన హైడ్రా క్లియరెన్స్... హిమాయత్సాగర్ నుంచి భారీ మొత్తంలో నీటిని కిందకు వదలడంతో మూసీ నదిలో ప్రవాహం పెరిగింది. పై నుంచి వరదతో పాటు కొట్టుకువచ్చిన చెత్త, ప్టాస్టిక్ వ్యర్థాలు మూసారాంబాగ్ వంతెన వద్ద నిలిచిపోతున్నాయి. ఇవి అడ్డం పడి నదీ ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయి. ఫలితంగా చాదర్ఘాట్, మూసారాంబాగ్లోని శంకర్నగర్, మూసానగర్, రసూల్పుర తదితర బస్తీలను వరద ముంచెత్తుతోంది. ఈ విషయం గుర్తించి శుక్రవారం రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు ముసారంబాగ్ వంతెన వద్ద క్లియరెన్స్ చేపట్టాయి. అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు నిర్వహిస్తున్నాయి. గుర్రపు డెక్కతో పాటు గడ్డి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తోంది. రెండు జేసీబీలతో పాటు టిప్పర్లను అక్కడే ఉంచిన అధికారులు చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. దీంతో వరద సాఫీగా ముందుకు సాగుతోంది. శంషాబాద్ రూరల్: అనుమతి లేకుండా హుక్కా పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గండిగూడ గ్రామంలో ఉన్న ఎంఆర్జీ ఫాంహౌస్లో గురువారం రాత్రి కొందరు హుక్కా పార్టీ జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. వారి వద్ద హుక్కా తాగే పరికరాలు, ఒక స్కూటీ, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
కందుకూరు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ సీతారామ్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని సరస్వతిగూడలో ఎస్ఐలు పరమేష్, మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంబాలపల్లి విష్ణువర్ధన్రెడ్డితో కలిసి డ్రగ్స్, మద్యంపై యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో నేటి యువత చిత్తవుతుందన్నారు. విచక్షణ కోల్పోయి సైకోలుగా ప్రవర్తిస్తున్నారన్నారు. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే శాఖాపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అందరితో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ముదిరాజ్, యాదయ్య, రాము, మహేందర్, వినోద్, వంశీ, మల్లేష్, మహేందర్, జంగారెడ్డి, వెంకట్రెడ్డి, అంజయ్య, కుమార్, యాదయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.కందుకూరు సీఐ సీతారామ్ -
వార్డు ఆఫీస్పై ఎగరని జెండా
మొయినాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద శుక్రవారం జాతీయ జెండాను ఎగరవేయకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో మొయినాబాద్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. ఇందులో మొయినాబాద్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, హిమాయత్నగర్, అజీజ్నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ, సురంగల్ గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. ఈ గ్రామాలు పంచాయతీలుగా ఉన్నప్పుడు జీపీ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో పంచాయతీ కార్యాలయాలను వార్డు ఆఫీసులుగా మార్చారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయకపోవడంతో చిలుకూరు గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ను నిలదీశారు. వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయవద్దనే నిబంధన ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు మిగతా గ్రామాల్లోని వార్డు కార్యాలయాల వద్ద సైతం జాతీయ జెండా ఎగరవేయకపోవడంతో ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ జాతీయ జెండాను అవమాన పరిచే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. చిలుకూరులో మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన ప్రజలు -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
కేశంపేట: దేవాలయ నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కేశంపేట గ్రామంలో నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయ పనులు చేసేందుకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజుకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అతడి వద్ద అదే రాష్ట్రానికి చెందిన విజయబాలన్(40) పనులు చేసేందుకు గురువారం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం పనులు చేస్తుండగా దేవాలయం పక్కనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. గమనించిన గ్రామ స్తులు చికిత్స నిమిత్తం విజయబాలన్ను కేశంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటునుంచి అంబులెన్స్లో షాద్నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతి చెందాడు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. అనాఽథాశ్రమంలో వృద్ధుడి మృతి ఇబ్రహీంపట్నం రూరల్: అనారోగ్యంతో అనాథాశ్రమంలో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాదర్గుల్లో ఉన్న మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో కన్నప్ప స్వామి(66) రెండేళ్ల క్రితం నాంపల్లి రైల్వేస్టేషన్ ఫుట్పాత్ సమీపంలో సంచరిస్తుండగా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించారు. కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియలేదని, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దక్షిణమధ్య రైల్వేలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వేలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో జరిగినఇ వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్పిఎఫ్ నిర్వహించిన పరేడ్లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, రైల్వే పాఠశాల,కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
వేతన వెతలు!
● ఐదు నెలలుగా నిలిచిన జీతాలు ● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు ● ఆర్థిక ఇబ్బందుల్లో ల్యాబ్టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ● 104 డ్రైవర్లు, ఏఎన్ఎంలు, సపోర్టింగ్ స్టాఫ్ ● అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన సాక్షి, రంగారెడ్డిజిల్లా: వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడం.. వెరసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులకు మించి పని చేస్తున్నప్పటికీ అరకొరగా ఇచ్చే నెలవారీ వేతనాలు కూడా ఐదు నెలలుగా ఇవ్వకపోవడంతో ఆయా ఉద్యోగులంతా ఇంటి అద్దెల చెల్లింపు, నిత్యావసరాల కొనుగోలు, పిల్లల స్కూలు ఫీజుల కోసం స్నేహితులు, బంధువుల వద్ద చేయి చాచాల్సి వస్తోంది. చేసిన అప్పులు పేరుకపోతుండటం, గడువు ముగియడంతో ఇచ్చిన వారు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆర్థికంగానే కాదు మానసికంగానూ కుంగిపోవాల్సి వస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న 167 మంది ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, ఏఎన్ఎంలు జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. థర్డ్ పార్టీ ఏజెన్సీ లేక నిలిచిన చెల్లింపులు మారుమూల పల్లెల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 104 సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు వెళ్లి బీపీ, షుగర్, ఆస్తమా, ఫిట్స్, దగ్గు, జలుబు, జ్వరం, గర్భిణులకు పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు సరఫరా చేసేవారు. మొదట్లో హెచ్ఎంఆర్ఐ భాగస్వామ్యంతో సిబ్బంది నియామకం, వేతనాలు చెల్లింపు చేసేవారు. పదిహేనేళ్ల క్రితం ఉద్యోగులంతా 111 రోజుల పాటు ధర్నా చేసి థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయించారు. తర్వాత కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి సారథ్యంలో థర్డ్పార్టీని ఎంపిక చేసి, దాని ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నారు. జిల్లాలో 104 విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, సెక్యురిటీగార్డు మొత్తం 56 మంది ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. ల్యాబ్టెక్నీషియన్, ఫార్మాసిస్ట్కు నెలకు రూ.22,750 చెల్లిస్తుండగా పీఎఫ్ కటింగ్స్ పోను రూ.20,020 ఖాతాల్లో జమ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్కు రూ.19,500 వేతనంలో ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్ పోను రూ.17 వేల వరకు వారి ఖాతాల్లో జమ అవుతోంది. జిల్లాలో థర్డ్పార్టీ ఏజెన్సీ గడువు మార్చితో ముగిసింది. కొత్త ఏజెన్సీని ఇప్పటి వరకు ఎంపిక చేయలేదు. ఏ ఖాతా నుంచి సిబ్బందికి వేతనాలు చెల్లించాలనే అంశంపై సందిగ్ధం నెలకొంది.పదిహేడేళ్లుగా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తున్నా. ఇప్పటి వరకు రెగ్యులర్ కాలేదు. వేతనం పెరగలేదు. ఇచ్చే కొద్దిపాటి కూడా నెలవారీగా ఇవ్వడం లేదు. నా భర్త కూడా ప్రైవేటు ఉద్యోగే. మాకు ఇద్దరు పిల్లలు. వారి స్కూలు ఫీజులు, ఇంటి అద్దె, నిత్యావసరాల కొనుగోలు కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా విధిగా వేతనాలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. – ఝాన్సీ, డేటా ఎంట్రి ఆపరేటర్, షాద్నగర్ కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో పని చేస్తున్నాను. అదే ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నా. నెలకు రూ.ఏడు వేలు చెల్లించాల్సి ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. వారి స్కూలు ఫీజు, సరుకులు, ఇంటి అద్దె చెల్లింపు, ఇతర ఖర్చుల కోసం రూ.20వేలు అవుతోంది. ఐదు నెలలుగా వేతనాలు అందక బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేయాల్సి వస్తోంది. – ఎస్.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, 104 యూనియన్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా వేతనాలు చెల్లించే అవకాశం లేదు. థర్డ్పార్టీ ద్వారానే చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఏజెన్సీ గడువు ముగిసింది. రెన్యూవల్ లేదా కొత్త ఏజెన్సీ ఎంపికలో జాప్యం జరిగింది. వేతనాలకు సంబంధించి రూ.48 లక్షలు జిల్లా వైద్యారోగ్యశాఖ ఖాతాలో ఉన్నాయి. ఐదు నెలలుగా చెల్లింపు నిలిచి పోయిన మాట వాస్తవమే. ఏజెన్సీ ఎంపిక చేసిన వెంటనే చెల్లిస్తాం. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్ఓ -
టాప్గేర్లో ఈ– బండి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఈ– బండి టాప్గేర్లో పరుగులు తీస్తోంది. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు రోడ్డెక్కాయి .కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097 ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీపీ రమేష్ సూచించారు. -
ఓర్వలేకే తప్పుడు ఫిర్యాదులు
అబ్దుల్లాపూర్మెట్: సహకార సంఘం అభివృద్ధిని చూసి ఓర్వలేక తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి పదవి నుంచి తప్పించారని బాటసింగారం రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ చేగూరి భరత్ కుమార్ అన్నారు. తారామతిపేటలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన హయాంలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. కేవలం ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.12 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామని తెలిపారు. గతంలో చైర్మన్గా పనిచేసిన విఠల్రెడ్డి 2013 నుంచి 2020 మధ్యకాలంలో ఎలాంటి తీర్మానం లేకుండా 272 మందికి రూ.23 లక్షలకు పైగా రుణాలపై వడ్డీ మాఫీ చేశారని ఆరోపించారు. ఇదే తరహాలో తాను కూడా 58 మంది నిరుపేద రైతులు, చనిపోయిన రైతు కుటుంబాలకు వడ్డీలో రూ.15 లక్షల 46వేలు మాఫీ చేశామని తెలిపారు. మజీద్పూర్ మాజీ సర్పంచ్ సుధాకర్రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు సంఘం నుంచి రూ.కోటిన్నర మేర రుణాలు తీసుకుని 11 ఏళ్లుగా చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతోనే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు మొగుళ్ల యాదిరెడ్డి, మేకల రాములు, చింతల లక్ష్మమ్మల తదితరులు పాల్గొన్నారు. బాటసింగారం సహకార సంఘం మాజీ చైర్మన్ భరత్కుమార్ -
1,500 గాంధీజీ విగ్రహాల ప్రదర్శన
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని 1,500 మహాత్మా గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు. గాంధీ గ్లోబల్ క్లబ్ ఫ్యామిలీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనతో విద్యార్థులకు గాంధీ గొప్పతనాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఒకే పాఠశాలలో 1,500 విగ్రహాలను ప్రదర్శించినందుకుగాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుందని ఇంటర్నేషనల్ చీఫ్ కో–ఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్ తెలిపారు. ఈ మేరకు స్కూల్ ఎండీ చింతల సంగమేశ్వర గుప్తాకు మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు. బడంగ్పేట్: వరద ముంపు కాలనీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. గుర్రంగూడ, శ్రీనివాసపురం, పంచాయతీరాజ్నగర్ తదితర ముంపు కాలనీలను శుక్రవారం ఆమె సందర్శించారు. వరద ఉన్న కాలనీలల్లో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు డ్రైనేజీ నాలాలను శుభ్రం చేయించేవారన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ కౌన్సిలర్ గుర్రం సాయికిరణ్రెడ్డి, కాలనీవాసులు ఉన్నారు. 18న వ్యాపార సంస్థల బంద్ ఆమనగల్లు: స్థానిక వ్యాపార సంఘాలు ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమానికి సిద్ధమయ్యాయి. మనప్రాంతం.. మన వ్యాపారం పేరుతో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 18న ఆమనగల్లు పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. మార్వాడీలు కిరాణం, స్వీట్స్, హార్డ్వేర్తో పాటు అన్ని రకాల వ్యాపారాలను ప్రారంభించారని, దీన్ని స్థానిక వ్యాపార సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. బంద్కు మద్దతు పలకాలని కోరుతూ కరపత్రాలు పంచుతున్నాయి. అబ్దుల్లాపూర్మెట్: బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్గా కొత్తపల్లి జైపాల్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సహకార సంఘం పరిధిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇష్టారాజ్యంగా వడ్డీలు మాఫీ చేశాడంటూ తాజా మాజీ చైర్మన్ చేగూరి భరత్కుమార్పై కొంతమంది మాజీ సర్పంచులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన జిల్లా సహకార శాఖ అధికారులు ఆయన్ని పదవి నుంచి తొలగించారు. అనంతరం జైపాల్రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సంఘం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కందాడి మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాల్రెడ్డి, మేనేజర్ జక్కుల ఐలేశ్ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ డిమాండ్ చేశారు. అక్టోబర్ 26, 27 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో నిర్వహించే ఆ సంఘం 4వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని, పని భద్రత కరువైందన్నారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు నోచుకోవడం లేదన్నారు. కేవలం రూ.3 వేల వేతనం నెలకు ఇస్తే కుటుంబం ఎలా గడుస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆహ్వాన సంఘం ఏర్పాటు మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్గా పి.యాదయ్య, వైస్ చైర్మన్గా చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శిగా స్వప్న, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అలివేల, కార్యదర్శిగా పద్మ, కోశాధికారి నవనీతతోపాటు సభ్యులుగా రాజు, కవిత, బ్రహ్మయ్య, సామేల్, ఉమా, గణేశ్, కిషన్, ఎల్లేశ్, బుగ్గరాములు, కృష్ణ, నర్సింహ, చందునాయక్, పాండు తదితరులను ఎన్నుకున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ -
విదేశీయుల పార్టీ భగ్నం
బానిస కావొద్దు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కందుకూరు సీఐ సీతారామ్ శుక్రవారం సూచించారు. మొయినాబాద్: ఓ ఫామ్ హౌస్లో విదేశీయులు నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ, మొయినాబాద్ పోలీసులు దాడి చేసి 51 మందిని పట్టుకున్నారు. వీరి నుంచి హుక్కా, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన మొయినాబాద్ మండలం బాకారం రెవెన్యూలోని ఎస్కే నేచర్ రీట్రీట్ ఫాంహౌస్లో గురువారం రాత్రి జరిగింది. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉగాండా, కెన్యా, లిబేరియా, నైజీరియా, క్యామరోన్ దేశాలకు చెందిన 51 మంది విదేశీయులు కొంత కాలంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంది. మమా అనే మహిళ బర్త్డే సందర్భంగా అందరికీ పార్టీ ఇచ్చేందుకు ఆన్లైన్లో ఫామ్ హౌస్ను బుక్చేసింది. వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం అందరూ ఇక్కడికి చేరుకున్నారు. రాత్రి 11.30 గంటలకు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులతో కలిసి దాడి చేశారు. 20నుంచి 35 ఏళ్ల వయసున్న 37 మంది మహిళలు, 14 మంది పురుషులను పట్టుకున్నారు. ఫాంహౌస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి గురువారం రాత్రి 11.30 నుంచి శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు లోపలే ఉంచి తనిఖీలు చేశారు. హుక్కా, విదేశీ మద్యం.. ఫాంహౌస్లో బర్త్ డే పార్టీ నిర్వహిస్తున్న విదే శీయులు ఎలాంటి అనుమతి లేకుండా హుక్కా, విదేశీ మద్యం వినియోగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీరినుంచి హుక్కాతోపాటు 20 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, 65 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం ఉండటంతో కొంత మందికి నార్కోటెక్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు మహిళలకు పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. తనిఖీల్లో డ్రగ్స్ దొరకలేదు. పాజిటివ్ వచ్చిన ముగ్గురు మహిళలు గతంలో డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీ.. పట్టుబడిన వారిని శంషాబాద్ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం ఫాంహౌస్కు వచ్చి వీసా, పాస్పోర్టులు పరిశీలించారు. అయితే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న విదేశీయులు వీరికి సహకరించనట్లు తెలిసింది. అధికారులకు తప్పుడు వివరాలు చెప్పినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో 15 మంది నగరంలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పత్రాలు సరిగా లేకుండా వీసా గడువు ముగిసిన 36 మందిని వారి స్వదేశాల పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనుమతి లేకుండా ఫామ్హౌస్ను అద్దెకు ఇచ్చిన నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల అదుపులో 51 మంది వీరిలో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు 20 లీటర్ల విదేశీ మద్యం, 65 బీర్లు, హుక్కా స్వాధీనం పట్టుబడిన వారిలో ఉగాండా, కెన్యా, నైజీరియా లిబేరియా, క్యామరోన్ దేశస్తులు -
అది పిల్లి కూనే!
కొత్తూరు: మండలంలోని పెంజర్ల గ్రామంలో ఓ ఎంఎన్సీ పరిశ్రమకు చెందిన స్థలంలో చిరుత కూనలు సంచరిస్తున్నాయని స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. గ్రామంలో కొనసాగుతున్న ఓ మల్టీ నేషనల్ పరిశ్రమకు చెందిన ఖాళీ స్థలంలో కార్మికులకు ఇటీవల చిరుతపులి పిల్ల ఆకారంలో ఉన్న ఓ కళేబరం కనిపించింది. ఈ విషయం వైరల్గా మారడంతో విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన కూన కళేబరాన్ని పరిశీలించారు. మృతి చెందిన కూన అటవీ ఎషియన్ లియోపర్డ్ జాతికి చెందిన పిల్లికూనగా గుర్తించారు. దీంతో కార్మికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
అగ్ర భారతే లక్ష్యం
విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు పెద్దపీట వేయాలి ● ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ● సాక్షి ఆధ్వర్యంలో వందేళ్ల భారత్పై టాక్ షో ఇబ్రహీంపట్నం: ఒకే విధానంతో కూడిన వ్యవస్థ ఉన్నప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, యువతలో కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన సాక్షి టాక్ షోలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొ.రాధిక మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకత వెలికితీసే విద్యాబోధనకు సంబంధించిన కోర్సులు రావాలన్నారు. స్వయం శక్తితో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలను భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యతోనే దేశాభివృద్ధి విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలి. అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించాలి. విద్యాబోధనలో సమూల మార్పులు రావాలి. – జాస్మిన్, బీఏ, ఫస్టియర్ ఒకే వ్యవస్థ ఉండాలి దేశంలో ఒకే విధానంతో కూడిన వ్యవస్థ ఉండాలి. ప్రైవేటీకరణ పేరుతో దేశ వ్యవస్థను నాశనం చేయవద్దు. ఒకే గొడుగు కింద అన్ని వ్యవస్థలుంటే. దేశాభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. దేశంలో వనరులకు కొదవలేదు. వాటిని కాపాడుకుంటూ దేశ ప్రగతికి తోడ్పడాలి. – మనీషా, బీఎస్సీ, సెకండియర్ ప్రగతిబాటలో పల్లెలుండాలి పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు కావొస్తున్న గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి. – విజయ్, బీఏ, ఫస్టియర్ యువతను కాపాడుకోవాలి మన దేశంలో నైపుణ్యం గల యువత ఎంతో మంది ఉన్నారు. వారు విదేశాల్లో ఉపాధి పొందుతున్నారు. అలాంటి వారి శక్తి సామర్థ్యాలను దేశం ఉపయోగించుకోవాలి. ప్రతిభ గల వారికి ప్రాధాన్యతను ఇస్తూ దేశాభివృద్ధిలో భాగం చేయాలి – ప్రసన్నలక్ష్మి, బీఎస్సీ, సెకండియర్ స్వయం ఉపాధి కల్పించాలి స్వయం ఉపాధి పొందేలా యువతను తీర్చిదిద్దాలి. ఇతరులపై ఆధార పడకుండా వారే స్వశక్తితో ఉన్నంతగా ఎదిగేందుకు విద్యాబోధన దోహదపడాలి. ఆ దిశగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. స్టార్టప్ కంపెనీలు నెలకోల్పాలి. – ఫాతిమా, బీకాం, ఫస్టియర్ ఆరోగ్య భారత్గా తీర్చిదిద్దాలి ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుంది. అందుకు పల్లె నుంచి పట్ట ణం వరకు వైద్యసేవలను అందించాలి. మనిషి ఆరోగ్య ంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారుతారు. – కేశవర్ధన్, బీఎస్సీ, సెకండియర్ మహిళలకు సీట్లు ఇవ్వాలి చట్ట సభల్లో సమాన ప్రాతినిథ్యం కల్పించాలి. ఇంటికి దీపం ఇల్లాలు ఎలా అంటామో జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో మహిళలకు సీట్లు కేటాయించాలి. అప్పడే మహిళా సాధికారత సాధించి దేశ పురోగమనం సాధ్యమౌతుంది. – స్వాతి, బీఎస్సీ, ఫస్టియర్ టెక్నాలజీలో మార్పులు రావాలి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలి. ఫ్రెంచ్ విప్లవం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు విద్యార్థులే కీలకపాత్ర పోషించారు. వందేళ్ల స్వాతంత్య్ర భారత్ అభివృద్ధి దేశంగా ప్రపంచలో పేరుప్రఖ్యాతలు పొందాలంటే యువత చేతల్లోనే ఉంది. ఆ దిశగా వాళ్లకి తర్ఫీదు ఇవ్వాలి. – డా.సురేశ్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకుడు దేశాభివృద్ధికి కృషి చేయాలి విద్యార్థులు, యువత దేశాభివృద్ధికి పోటీ పడాలి. కుల, మత, ప్రాంత విభేదాలు మూడ నమ్మకాలు పక్కన పెట్టాలి. ఆర్టికల్ 14 ప్రకారం మహిళలకు సమాన హక్కులుండాలి. దేశంలో విజ్ఞానవంతులు కొదవలేదు. వారు విదేశాలకు వెళ్లకుండా సరైన అవకాశాలు సృష్టించాలి – డా.రమేశ్, అధ్యాపకుడు -
మా ఊరిలో మందు బంద్
● పలు గ్రామాల్లో సంపూర్ణమద్యపాన నిషేధం ● మహిళల చైతన్యంతో షాద్నగర్: కేశంపేట మండలం బోదనంపల్లిలో 14 ఏళ్ల క్రితం మొదలైన సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రోజు వరకూ అలాగే కొనసాగుతోంది. ఈగ్రామంలో ఎక్కడా బెల్టు షాపులు, మద్యం సేవించడం కనిపించదు. మద్యం ప్రియులు కావాలనును కుంటే బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఇదే స్ఫూర్తితో అల్వాల గ్రామస్తులు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. ఒక్కడితో మొదలై.. మద్య నిషేదం కోసం పలు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. ముందుగా ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్కు చెందిన నడుల్ల శేఖర్తో పోరాటం మొదలైంది. తమ గ్రామంలో మద్యపానం నిషేధించాలని కోరుతూ గత సెప్టెంబర్లో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. గ్రామ పెద్దలు, మహిళలు రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలిచారు. స్థానికంగా మద్యం విక్రయిస్తే రూ.50 వేలు జరిమానా విధిస్తామని, మద్యం అమ్మేవారిని పట్టిస్తే రూ.10 వేల నజరానా అందజేస్తామనిప్రకటించడంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. ఈ పోరాటం గంట్లవెళ్లి, చౌడమ్మగుట్టతండాలో కూడా కొనసాగుతోంది. జీవితాలు నాశనం కావొద్దని గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసలవుతున్నారు. ప్రజల జీవితాలు నాశనం కావొద్దని ఆలోచనతో పోరాటం ప్రారంభించా. స్థానికుల మద్దతుతో ఎమ్మెల్యేతో పాటు అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశాం. అందరి పోరాటంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. – శేఖర్, కిషన్నగర్, ఫరూఖ్నగర్ మండలం మహిళల పోరాటంతోనే నిషేధం మద్యంతో చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి. దీంతో గ్రామంలో బెల్టు దుకాణాలు తొలగించాలని, మహిళలు పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ దెబ్బతో గ్రామంలో 14 ఏళ్లుగా మద్యం నిషేధం అమలవుతోంది. – ఎదిర కళమ్మ, బొదనంపల్లి, కేశంపేట -
స్వేచ్ఛ– సమానత్వం అందరికీ చేరుతోందా..?
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏది? లేదు 23అంతంతే 21అవును16మీడియా10చట్ట సభలు16అధికార యంత్రాంగం 22న్యాయ స్థానాలు 12 -
ప్రజలను అప్రమత్తం చేయండి
కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం వర్షాల కారణంగా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అన్ని శాఖల అధికారులు తు.చా తప్పకుండా పాటించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి శాఖ అధికారులు వారి పరిధిలో విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవన్నారు. కాజ్వేల మీద ఎవరూ ప్రయాణం చేయకుండా చూడాలన్నారు. చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి అధికారులు హెడ్క్వార్టర్ మెయింటెన్ చేయాలని, వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరెంట్ స్తంభాల వద్ద జాగ్రత్తలు అవసరమన్నారు. ప్రధాన రహదారిపై నీరు ఆగిపోతే వెంటనే స్పందించాలన్నారు. శిథిలావస్థ భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. అకారణంగా ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. డప్పు చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేస్తుందన్నారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, సమస్యలను తక్షణమే తెలియజేయాలని సూచించారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ఆమనగల్లు: దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా పరిణమించిందని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా అండగా ఉండాలని ఆయన కోరారు. ఆమనగల్లులో గురువారం అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్ఆర్ రెస్పాన్సిబులిటీ నిధులు రూ.4 కోట్లతో చేపట్టిన బీసీ బాలుర వసతిగృహ భవన నిర్మాణానికి ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మార్కెట్ చైర్మన్ యాట గీత, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ నిత్యానందరెడ్డితో కలిసి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు చోర్ గద్దె దిగాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బిస్కెట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. ఆమనగల్లులో సబ్ రిజిస్ట్రార్, ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. జూనియర్ కాలేజీ స్థల వివాదాన్ని, కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకు బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. అభివృద్ధే లక్ష్యం.. కల్వకుర్తి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో కల్వకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, నాయకులు కేశవులు, యాట నర్సింహ, జగన్, మానయ్య, బీసీ సంక్షేమశాఖ డీడీ కేశురామ్, మున్సిపల్ కమిషనర్ శంకర్, తహసీల్దార్ లలిత తదితరులు పాల్గొన్నారు. ఓట్ల చోరీపై ఉద్యమానికి ప్రజలు సహకరించాలి నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆమనగల్లులో బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన -
వర్షాలకు అప్రమత్తంగా ఉండండి
డీఎల్పీఓ సతీష్రెడ్డి మొయినాబాద్రూరల్: భారీ వర్షాలు కురు స్తు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని డీఎల్పీఓ సతీష్రెడ్డి సూచించారు. గురు వారం మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామ పంచాయతీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శి కవితను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగారు. అనంతరం గ్రామ సమీపంలో ఉన్న కుంటలు, వాగులను ఆయన సందర్శించి పరిశీలించారు. ప్రమాదాలు ఉన్న చోట ప్రజలను వెళ్లకుండా చూడాలని పేర్కొన్నారు. పర్యటనలో పంచాయతీ కార్యదర్శి కవిత, కారోబార్ గోపాల్చారి పాల్గొన్నారు. -
అవినీతే అసలు సమస్య!
మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏది? సమాజంలో అవినీతే ప్రధాన సమస్యగా మారిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు గడుస్తున్నా స్వేచ్ఛ, సమానత్వం అన్నివర్గాలకు అందడం లేదని తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 60 మందిని ‘సాక్షి’ సర్వే చేయగా 24 మంది వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం వంటివి అందరికీ అందడం లేదని 23 మంది తెలిపారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే అధికార యంత్రాంగం మరింత పకడ్బందీగా పనిచేయాలని 22 మంది, చట్ట సభల్లో మార్పు రావాలని 16 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. – చేవెళ్లనాణ్యమైన విద్య 8పేదరికం 8వైద్యం 10కుల వివక్ష 10అవినీతి24 -
పటిష్ట భారత్కే జై
మొయినాబాద్/చేవెళ్ల: భారతదేశాన్ని ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రగామి దేశంగా చూడాలని యువత ఆకాంక్షిస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థులతో సాక్షి టాక్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వందేళ్ల భారత్ ఎలా ఉండాలని వారి కలలు, ఆకాంక్షలను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల డీఎస్ఏ డీన్ జరినా మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం కూడా చేరేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందన్నారు. వందేళ్ల భారత్ ఎలా ఉండాలని అంశంపై సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తిదాయంగా నిలుస్తుందన్నారు. దేశం కోసం యువత ఏం చేస్తామని, ఎలా ఉండాలని కోరుకునే ఈ కార్యక్రమం బాగుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తి నింపే విధంగా ఉంటాయని కితాబిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంతో మంది సమరయోధుల త్యాగాలతో వచ్చిన దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉంది. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదిరి చూడకుండా ప్రతిఒక్కరూ తమదే బాధ్యత అనే విధంగా దేశం కోసం పనిచేయాలి. 79 ఏళ్ల స్వాతంత్య్రంలో సాధించుకున్న విజయాలను గుర్తుచేసుకుంటూ వందేళ్ల భారత్ కోసం చేయాల్సిన బాధ్యతలను, లక్ష్యాలను గుర్తు చేసుకోవాలి. – చంద్రప్రకాశ్, ఈసీ డిపార్ట్మెంట్ అసోసియేట్ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అయ్యింది. కానీ అందరికీ విద్య, వైద్యం సరిగా అందని పరిస్థితి ఉంది. చదువును, ఆరోగ్యాన్ని కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వందేళ్ల భారత్లో మారాలి. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందాలి. – ప్రణిత్ సాంకేతిక రంగంలో దేశం మరింత అభివృద్ధి చెందాలి. మహిళలకు పూర్తి స్వేచ్ఛ రావాలి. ప్రతిఒక్కరూ చైతన్యవంతులు కావాలి. మహిళలంతా చదువుకుంటేనే వారికి పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు లభిస్తాయి. ఇంకా మార్పుకోసం ఎదురుచూడటం కాదు. వందేళ్ల భారత్లో మారి చూపించాలి. – గ్రీష్మ ప్రస్తుతం విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ల పద్ధతి కాకుండా ప్రతిభ ఆధారంగా అందరికీ సమాన అవకాశాలు లభించాలి. అప్పుడే సమన్యాయం జరుగుతుంది. దేశంలో ఈ విధానం అమలులోకి వస్తే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. – నాగ విఘ్నేశ్వర్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనిషి ఎప్పుడు మార్పును కోరుకోవాలి. అది సమాజ హితం వైపు ఉండాలి. ప్రతి మనిషిలో మానవత్వం, మహిళల పట్ల అందరిలో గౌరవం పెరగాలి. దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలి. – స్వర్ణ దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ప్రజల కోసం పనిచేసేలా ఉండాలి. ప్రస్తుత రాజకీయాలు స్వార్థం, అవినీతిమయంగా మారాయి. వీటిని రూపుమాపేందుకు చైతన్యవంతమైన యువత ముందుకు రావాలి. – మౌనిక 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అన్ని రంగాల్లో రాణించాలి. విద్య, వైద్యం, టెక్నా లజీ, పరిపాలన విభాగాలన్ని బలోపేతం కావాలి. యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి. అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకుని దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలి. – అమూల్య భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారతదేశంలోని ప్రజలందరిలో జాతీయభావం పెరగాలి. సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలి. దేశం విలువలను ప్రపంచానికి చాటే విధంగా యువత ఎదగాలి. – సమీనా మన రాజ్యాంగంలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆనాటి అవసరాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శంగా నిలిచింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులుండాలి. – శివరామకృష్ణ విదేశాలల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మించిన పురోగతిని మన దేశంలో మరింతగా అభివృద్ధి చెందాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలే ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీ లాంటి కోర్సులు మరిన్ని రావాలి. – సాయి దేశంలో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందుబాటులోకి రావాలి. అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రతిఒక్కరూ విద్యను అభ్యసించి నచ్చిన రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. – సిద్దు మన దేశంలో ఉన్న మతాలు, కులాల ప్రతిపాదికన ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థ పూర్తిగా పోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సమానమే అనే భావనతో జీవించేలా చట్టాలు రావాలి. రిజర్వేషన్ల వ్యవస్థతో పేదవారికి న్యాయం కంటే అన్యాయం ఎక్కువగా జరుగుతుంది. – జశ్వంత్ మన దేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతో ముందు చూపుతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అందించారు. దానిని మన పాలకులు సక్రమంగా అమలు చేయడంలో విఫలమవుతున్నారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి. – రాజేశ్ దేశంలో ఉన్న చట్టాల్లో అనేక మార్పులు చేయాలి. దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి భద్రతపై భరోసా కల్పించాలి. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు దేశం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. – సింధు అగ్రగామి దేశంగా నిలవాలని యువత ఆకాంక్ష మొయినాబాద్లోని కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సాక్షి టాక్ షో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు -
ఔటర్పైకి దొర్లిపడిన బండరాళ్లు
మణికొండ: నార్సింగి నుంచి పోలీస్ అకాడమీ ఔటర్ సర్వీసు రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో భారీ బండరాయితో పాటు మరో చిన్నరాయి గురువారం సాయంత్రం సర్వీసు రోడ్డుపైకి దొర్లుకుంటూ వచ్చాయి. సర్వీసు రోడ్డు ఓ వైపు నుంచి పడి మధ్యలో డివైడర్పై నుంచి దాటి అవతలి రోడ్డు వరకు వెళ్లాయి. ఆ సమయంలో రెండు వైపుల నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. మంచిరేవుల 60 గజాల ఇందిరమ్మ కాలనీ పక్కనే ఔటర్ సర్వీసు రోడ్డు నిర్మాణ సమయంలో కొంత మేర గుట్టను తొలగించారు. పక్కనున్న గుట్టలను అలాగే వదిలివేయటంతో అవి వర్షాకాలం సమయంలో కూలుతున్నాయని స్థానికులు తెలిపారు. గురువారం రెండు రాళ్లు కూలగా మరో మూడు ప్రమాదకరంగానే రోడ్డును ఆనుకునే ఉన్నాయన్నారు. రోడ్డుపైకి వచ్చిన రాళ్లను ఔటర్ రింగ్ రోడ్డు నిర్వాహకులు వెంటనే తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మరోసారి ప్రమాదం జరగకముందే వాటిని తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. వాహనాలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం -
కానిస్టేబుల్కు క్యాష్ రివార్డు
కడ్తాల్: కేసు చేధనలో వృత్తి నైపుణ్యం కనబరిచిన కానిస్టేబుల్ రాజశేఖర్ బుధవారం క్యాష్ రివార్డు అందుకున్నారు. వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన కొమ్మరి శివకృష్ణ హైదరాబాద్లో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కోడేరులో తన చెల్లెలు స్వప్న పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని సమాచారం అందడంతో ఈ నెల 8న తెల్లవారు జామున ఆయన తన బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. కడ్తాల్ మండల కేంద్రం సమీపానికి చేరుకోగానే, గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ రాజశేఖర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సీసీ టీవీ పుటేజీ సహకారంతో 24 గంటల వ్యవధిలోనే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించారు. ఈ మేరకు ఆయనకు ఠాణాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్లు, కానిస్టేబుల్ రాజశేఖర్కు ప్రోత్సాహకంగా రూ.5 వేలు క్యాష్ రివార్డు అందజేసి అభినందించారు. -
పెన్షన్ పెంచి ఇవ్వాలి
షాద్నగర్రూరల్: ప్రభుత్వం పెన్షన్దారులకు పెన్షన్ పెంచి ఇచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగల్ల ఉపేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6వేలు, చేయూత పెన్షన్ రూ. 4వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. అందాల పోటీలు, భూ స్వాములు, రైతు భరోసాకు, అభివృద్ధి పేరుతో, యాడ్ల పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు దివ్యాంగులు, చేయూత పెన్షన్దారులకు పెన్షన్ ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పోరాటాల ద్వారానే గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 16న షాద్నగర్లో నిర్వహించనున్న పెన్షన్దారుల సభకు మందకృష్ణమాదిగ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, చేయూత పెన్షన్దారులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు బాలరాజు, సురేష్, అశోక్, పాండు, శ్రవణ్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్సర్క్యూట్తో గృహోపకరణాలు దగ్ధం
మహేశ్వరం: భారీ వర్షాల నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని తుమ్మలూరులో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన అక్కెర రమాదేవి ఇంట్లో షార్ట్సర్క్యూట్ కారణంగా టీవీ, రిఫ్రిజిరేటర్, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు, దుస్తువులు కాలిపోయాయి. తమది నిరుపేద కుటుంబమని.. భర్త మరణించాడని ఇద్దరు కూతుర్లను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ జీవనం సాగిస్తున్నాని ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని కోరింది. విద్యుత్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు పత్రం సమర్పించారు. కృత్రిమ ఇసుక తయారీ కేంద్రంపై దాడి ● ఫిల్టర్ ధ్వంసం ● లారీ, ట్రాక్టర్ సీజ్ కడ్తాల్: కృత్రిమ ఇసుక తయారు చేసినా, అనుమతులు లేకుండా ఇసుక తరలించినా చర్యలు తప్పవని సీఐ గంగాధర్ హెచ్చరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రెవెన్యూ సిబ్బంది, పోలీసులు అధికారులు మండల పరిధిలోని ముద్వీన్లో కొనసాగుతున్న కృత్రిమ ఇసుక తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఫిల్టర్ను ధ్వంసం చేశారు. ఫిల్టర్ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్, లారీని సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ బాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాములు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పోల్కంపల్లిలో గేదెల అపహరణఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు రెండు గేదెలను అపహరించుకొని వెళ్లిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని పొల్కంపల్లి అనుబంధ గ్రామమైన జాజోనిబావి గ్రామానికి చెందిన కసరమోని ఐలయ్య మంగళవారం రాత్రి తన డెయిరీ ఫాం వద్ద ఉన్న గదిలో నిద్రిస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి ఐలయ్య నిద్రిస్తున్న గదికి బయటి నుంచి తాళం వేసి రెండు గేదెలను తీసుకుని పరారయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఐలయ్య మెల్కోని డోర్ తీసే ప్రయత్నం చేయగా తెరుచుకోలేదు. దీంతో కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు అక్కడికి చేరుకొని తాళం పగులగొట్టారు. సుమారు రూ.3లక్షల విలువ చేసే గేదెలను అపహరించుకొని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఎన్నిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా దళపతిరాజు సబితా రాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఫార్మసిస్టుల సంక్షేమం, ఉద్యోగ ఫార్మసీ చట్టాల అమలు, రిజిస్టర్ ఫార్మసిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘాన్ని బలో పేతం చేసే క్రమంలో మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సబితా రాజును సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్మా శంకర్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ మెరుగు రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు ఫసియుద్దీన్, మహ బూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తన్నీరు వేణు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, అల్లూరి క్షత్రియ సంఘం అధ్యక్షుడు కేవీఆర్ఆర్ వర్మ తదితరులు అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి కడ్తాల్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని జిల్లా యువజన విభాగం అధికారి టి. ఐజయ్య అన్నారు. మండల కేంద్రంలోని కేజేబీవీ పాఠశాలలో మేరాభారత్, ఎన్ఎస్ఎస్ యూనిట్ల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, ప్రశాంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకూ అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో పర్యావరణ అసమతుల్యత ఏర్పడి వర్షాలు సరైన సమయంలో కురవడం లేదని అన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరు మీద మొక్కను నాటి, దానిని తల్లిలాగే కాపాడుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అల్లాజీ, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు మొయినాబాద్: ప్రభుత్వ నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ షాపులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధి కారి ఉష డీలర్లను హెచ్చరించారు. మున్సిపల్ కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్లు, రికార్డులు, గోదాములు, లైసెన్స్ చెల్లుబాటు, యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఆర్పీ ధరలకు ఎరువులను విక్రయించాలని అన్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూరియాను కేవలం వ్యవసాయ అవసరాలకు విక్రయించాలని.. ఇతర వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని సూచించారు. యూరియా నిల్వల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన సమయానికి సరిపడా సరఫరా చేస్తామని చెప్పారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి అనురాధ ఉన్నారు. పాఠశాలలను సందర్శించిన రాష్ట్ర బృందం కొత్తూరు: మండల పరిధిలోని ఇన్ముల్నర్వ, పెంజర్ల గ్రామాల్లోని ఎంఎంపీఎస్, జెడ్పీ ఉన్నత పాఠశాలలను ప్రణాళికా సమన్వయకర్తల రాష్ట్ర బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఆన్లైన్లో విద్యార్థుల నమోదు వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు బోధన, బోధనేతర అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర బృందం సభ్యుల వెంట మండల విద్యాధికారి అంగూర్ నాయక్ ఉన్నారు. -
‘లింక్ కల’వదే!
కడ్తాల్: పల్లెలు ప్రగతి పథంలో నడవాలంటే రహదారులు ప్రధానం. కానీ పలు గ్రామాలను కలిపే లింక్ రోడ్లు ఏళ్ల తరబడి అనుసంధానానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు, ప్రయాణికులు కల దశాబ్దాలుగా నెరవేరడం లేదు. వీటిని బాగు చేయాలని కోరుతూ ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్వాయిపల్లి నుంచి గోవిందాయిపల్లి, గోవిందాయిపల్లి నుంచి గోవిందాయిపల్లితండా, చల్లంపల్లి– మక్తమాధారం, వంపుగూడ –టాక్రాజ్గూడ, మక్తమాధారం– పెద్దారెడ్డి చెరువుతండా, కర్కల్పహాడ్– వంకరాయితండా, సాలార్పూర్– రేకులకుంటతండా, చల్లంపల్లి– రేకులకుంటతండా, చల్లంపల్లి– పీవీబాయితండా, వంపూగూడ– పీవీ బాయితండా, ముద్వీన్– కోనాపూర్ రోడ్డు, వాసుదేవ్పూర్ నుంచి బాలాజీనగర్తండా, మైసిగండి– గానుగుమార్లతండాకు చెందిన అనుసంధాన రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మట్టి రోడ్లు బురదమయం అవుతున్నాయని పేర్కొంటున్నారు. పలు గ్రామాలకు ద్విచక్రవాహనాలు, ఆటోలు కూడా వెళ్ల లేని పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలుగా గడిచినా లింక్ రోడ్ల అభివృద్ధికి అడుగులు పడటం లేదని మండల ప్రజలు, తండాల గిరిజనులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. బీటీ రోడ్లుగా అభివృద్ధి చేస్తే.. ● గోవిందాయిపల్లి మీదుగా ఎక్వాయిపల్లి, మైసిగండి వరకు బీటీ రోడ్డు నిర్మించి, ఆర్టీసీ బస్సులు నడిపిస్తే గోవిందాయిల్లి ప్రజలు, విద్యార్థులు, రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ● చల్లంపల్లి నుంచి మక్తమాధారం వరకు బీటీ నిర్మిస్తే రావిచేడ్, మక్తమాధారం, షాద్నగర్ తది తర గ్రామాల మధ్య దూరభారం తగ్గడంతో పా టు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. ● ముద్వీన్– కోనాపూర్ రహదారిని బీటీగా అభివృద్ధి చేస్తే ఆకుతోటపల్లి, ఆమనగల్లు తదితర గ్రామాలకు వెళ్లేందుకు దూరం తగ్గడంతో పాటు ఆయా గ్రామాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ● వాస్దేవ్పూర్ నుంచి బాలాజీనగర్తండా వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తే, చల్లంపల్లి, తలకొండపల్లి తదితర గ్రామాలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వంలో నైనా ఆయా లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధ్వానంగా అనుసంధాన రహదారులు బస్సు సౌకర్యానికి సైతం నోచుకోని పలు తండాలు, గ్రామాలు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్న ప్రయాణికులు, ప్రజలు ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు