breaking news
Ranga Reddy District Latest News
-
అభివృద్ధిలో కలిసి సాగండి
● చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ● మున్సిపాలిటీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం చేవెళ్ల: మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. 17 వార్డు రంగారెడ్డి కాలనీలో 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను బుధవారం స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్లుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటి అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. కొత్త మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు. ఏన్నో ఏళ్లుగా ఉన్న రంగారెడ్డి కాలనీలోని సీసీ రోడ్డు సమస్య తీరడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డు నాణ్యతతో వేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపాల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. టీయూటీఎఫ్డీసీ నిధులు మంజూరు ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో మున్సిపాలిటీకి రూ.28.5కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరైనట్లు చైర్పర్సన్ దేవర సమతారెడ్డి తెలిపారు. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు పూర్తి చేస్తామాన్నరు. తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన పనులను పరిశీలించి, సూచనలు చేశారు. -
చర్చల్లో నిలిచిన మహేశ్వరం
మహేశ్వరం: తెలంగాణ శాసన సభ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్త చర్చకు తెరలేపాయి. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిసరనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్ల రంగు దుస్తులు ధరించి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. తనను జుట్టు, మెడపట్టి అడ్డుకున్నారని.. ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మాజీ హోంమంత్రిగా పనిచేసిన సబితారెడ్డిపై పురుష పోలీసులు దాడి చేశారని, ఆమె గొంతు పట్టుకున్న దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ ఘటన మహిళా లోకానికి అవమానమని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని మండిపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆమె అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. గతంలోనూ సభలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో వాగ్వాదం జరిగింది. నాటి సభలో సబితారెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం విదితమే. -
కేటీఆర్పై చర్యలకు ఫిర్యాదు
సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శివశంకర్రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామ పంచాయతీలు సజావుగా సాగాలన్నా, నిర్వహణ సక్రమంగా ఉండాలన్నా ఉప సర్పంచ్ల జాయింట్ చెక్పవర్ను రద్దు చేయాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.శివశంకర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సర్పంచ్ల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సునీల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధులు, విధులు ఉండేవి సర్పంచ్లకు మాత్రమేనని వారికి మాత్రమే చెక్పవర్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పంచాయతీలకు రావాల్సిన మైనింగ్, స్టాంప్డ్యూటీ, సినరేజ్ ఫీజులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే జాయింట్ చెక్పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గణేశ్, శ్రీనివాస్నాయక్, పద్మకృష్ణ, రవి, శ్రీనివాస్, రమేశ్ తేజ నాయక్, శంకర్, కోటేశ్వర్గౌడ్, చంద్రబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ‘ప్రాజెక్ట్ ప్రగతి’ పేరిట 5 ప్రాంతాల్లో ఏర్పాటుసాక్షి, సిటీబ్యూరో: నగరంలో వివిధ ప్లాట్ఫారమ్ల ద్వారా పనిచేస్తున్న గిగ్, డెలివరీ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, జెప్టో సంస్థ సంయుక్తంగా ‘ప్రాజెక్ట్ ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా నగరంలో 5 ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. 2024లో నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది కార్మికులకు శుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవని, 80 శాతం మందికి విశ్రాంతి కోసం నీడ లేదా చల్లని ప్రదేశం లభించడం లేదని తేలింది. ఈ లోటును తీర్చేందుకు వారికి తగిన సదుపాయాలు కల్పిస్తూ ప్రాజెక్ట్ ప్రగతి పేరిట సదుపాయాల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో విశ్రాంతి స్థలం, తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, వైఫై సౌకర్యం లభించనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, జెప్టో సీఓఓ వికాస్ శర్మ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్కృష్ణారెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, తదితరులు పాల్గొన్నారు. -
చోరీ సొత్తు రికవరీ
అనంతగి: దొంగతనం కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంతోపాటు చోరీ సొత్తు రికవరీ చేస్తామని అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో అంతర్రాష్ట్ర దొంగ వికాస్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్ కాలనీలో మే ఒకటో తేదీ రాత్రి ఓ ఇంట్లో బంగారం, నగదు చోరీకి గురైంది. కేసు విచారణ చేపట్టిన జిల్లా సీసీఎస్, వికారాబాద్ టౌన్ పోలీసులు జూన్ 4న వికాస్ సింగ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు అనుమతితో నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా అనేక విషయాలు బయటికి వచ్చాయి. వికాస్ సింగ్పై వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు, పరిగి పీఎస్ పరిధిలో ఒక కేసు ఉంది. ఈ కేసులకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లా కుడువర్ పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో తన తల్లి ద్వారా తనఖా పెట్టిన సుమారు 25 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. అశోక్ కుమార్ సోనీ, వికాస్ అగ్రహారి తదితరుల బంగారం దుకాణాల నుంచి దొంగ సొత్తును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కేసులో పురోగతి సాధించిన డీఎస్పీ అంజయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ను ఎస్పీ అభినందించారు. అంతర్రాష్ట్ర దొంగ వికాస్ సింగ్ కేసులో పురోగతి యూపీలో 25 తులాల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా -
సెక్యూరిటీగార్డును ఢీకొట్టిన కారు
● యువకుడి దుర్మరణం ● బీటెక్ విద్యార్థి అరెస్ట్ ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటు చేసుకోగా.. బుధవారం ప్రమాదానికి కారణమైన యువకుడిని అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. రోహిత్సింగ్యాదవ్(22) మూడు రోజుల క్రితం కోహెడ రోడ్డులోని ఓ ఫంక్షన్ హల్లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీని ముగించుకుని శ్రీ గురు కాలేజీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీ టీవీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా ఎర్టిగా వాహనం అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపిస్తూ ఆయన్ను ఢీకొట్టినట్టు గుర్తించారు. సేకరించిన ఆధారాలతో ఈ ప్రమాదానికి కారకుడైన ఫిర్జాదిగూడకు చెందిన బీటెక్ విద్యార్థి వరుణ్ను బుధవారం అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తుదిమెరుగుల్లో మహా గణపతి
రేపు నేత్రోనిలనంఖైరతాబాద్: శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిగా కొలువుదీరనున్న ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. మట్టితో రూపుదిద్దుకుంటున్న మహాగణపతికి శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. 14న వినాయక చవితికి రెండు రోజుల ముందే మహాగణపతి సంపూర్ణంగా తయారై భక్తులకు దర్శనమిచ్చేలా పనులు వేగిరం చేశారు. విగ్రహానికి శుక్రవారం కంటి పాప (నేత్రోనిలనం) అమర్చి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. మహా గణపతి దర్శనానికి వచ్చే భక్తులకు 12 రోజుల పాటు 9 రకాల ప్రసాదాలను అందజేస్తామని బుధవారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కమిటీ సభ్యులు తెలిపారు. -
సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ
షాద్నగర్: సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ నారాయణరావు అని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఉద్యమకారుల సంక్షేమ సంఘం భవనంలో కాళోజీ నారాయణ రావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషకు, యాసకు కాళోజీ వన్నె తెచ్చారని కొనియాడారు. తెలంగాణ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఆదర్శంగా నిలిచారని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులు, స్వాభిమానం, సామాజిక చైతన్యం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటేశ్, రవిగౌడ్, సునీల్రెడ్డి, విఠలయ్య, రాజు, శేఖర్, మల్లేశ్, ప్రభాకర్, సునీల్రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో.. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్థూపం వద్ద కాళోజీ జయంతిని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తాలూక చైర్మన్ జనార్ధన్, నాయకులు కరుణాకర్, బాల్రాజ్, శ్రీనివాస్, శ్రీహరి, రామారావు, సుజీవన్, కృష్ణయ్య, వెంకటరమణ, క్రాంతికుమార్, రాము, వేణుగోపాల్, శ్రీధర్, ముబారక్, చందు, షర్ఫొద్దీన్, మనీశ్ పాల్గొన్నారు. ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి -
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం
తీవ్రంగా గాయపడిన విద్యార్థి షాబాద్: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్షం కారణంగా ఓ విద్యార్థి కాలు విరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన విద్యార్థి జశ్వంత్ షాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చేందుకు షాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో వేచియున్నాడు. షాద్నగర్ నుంచి రేగడి చిల్కమర్రికి వెళ్లే బస్సు బస్టాండ్లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుండగా బాలుడు బస్సు ఎక్కుతుండగానే ఒక్కసారిగా కదలడంతో కిందపడిపోయాడు. దీంతో అతడి కాలు మీదుగా బస్సు టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఓప్రైవేట్ వాహనంలో క్షతగాత్రుడిని పాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. శంకర్పల్లి: పాఠశాలకి వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శంకర్పల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సురేశ్ తెలిపిన ప్రకారం.. రావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన మల్లికార్జున్(16) శంకర్పల్లిలోని అన్నపూర్ణ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. పాఠశాల దగ్గర బస్సు దిగిన విద్యార్థి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనదారుడు మృతి అబ్దుల్లాపూర్మెట్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వెలువర్తి గ్రామానికి చెందిన మారబోయిన వినయ్(25) మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్మెట్ నుంచి బాటాసింగారం వైపు ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యలో ఇనాంగూడ బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. పరిగి: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుడగజంగం హన్మంతు(42) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి రాలేడు. ఉదయం గ్రామ సమీపంలోని చెరువు గట్టుపై చెప్పులు, దుస్తులు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలించగా మృతదేహం లభించింది. మృతుడికి భార్య మేరమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యాలాల: మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామకంఠం పరిధిలో ఏర్పాటు చేసిన మంచినీటి బావితో పాటు రాకపోకలకు వినియోగించే దారి కబ్జాకు గురైందని యాలాల సర్పంచ్ శివయ్య, కాంగ్రెస్ నేత పేరి రాజేందర్రెడ్డి బుధవారం ఆరోపించారు. 1970 ప్రాంతంలో మంచినీటి బావిని తవ్వించారని, ప్రస్తుతం అది ఆక్రమణకు గురవుతోందన్నారు. బావిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బావితో పాటు ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు గ్రామకంఠం పరిధిలో ఉన్న రహదారి సైతం పూర్తిగా ఆక్రమణకు గురై, నిత్యం ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి కబ్జా నుంచి బావి తోపాటు దారిని రక్షించాలని వారు కోరారు. అబిడ్స్: నాంపల్లిలో ఉన్న ఎగ్జిబిషన్ సొసైటీకి ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించేందుకు సొసైటీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. పాలక మండలిలో చోటు దక్కించుకునేందుకు రెండు ప్యాన్ళ్లు తమ అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్ సొసైటీకి మంత్రి డి.శ్రీధర్బాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యద ర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు మేనేజింగ్ కమిటీలో ఈ ఏడుగురు సభ్యులను ఈ ఎన్నికల్లో ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు. -
నాణ్యమైన విద్యను బోధించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం ఆమె మండల పరిధిలోని ఉప్పరిగూడ ప్రీప్రైమరీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధిస్తున్న తీరును తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీపై అంగన్వాడీ టీచర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య పెంచేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ పోషణ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఐదవ తరగతిలో కూర్చుని పాఠాలు విన్నారు. టీచర్ సపోర్టు గ్రూపులుగా విభజించి వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని చెప్పారు. వర్ణమాల, గుణింతాలు రాని మూడు, నాలుగు, ఐదవ తరగతి విద్యార్థులను కేటగిరీలుగా విభజించి టైం టేబుల్ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీవేణి, ఎంఈఓ హీర్యానాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వినితాదేవి, హెచ్ఎం వీకే లక్ష్మీ, టీఆర్పీ రంగారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు . అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని
మేస్త్రీ ఆత్మహత్య మొయినాబాద్: మద్యం తాగి వచ్చిన మేస్త్రీ భార్యను డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘనపురం గ్రామానికి చెందిన లేగల బుచ్చయ్య(45) భార్య, పిల్లలతో కలిసి మొయినాబాద్లో అద్దెకు ఉంటూ మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం ఉదయం పనికోసం మొయినాబాద్లోని అడ్డమీదకు వెళ్లాడు. ఉదయం 10 గంటల వరకు పని దొరక్కపోవడంతో మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న బుచ్చప్ప భార్య భాగ్యమ్మను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని.. సాయంత్రం ఇస్తానని చెప్పడంతో ఇంట్లోని గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి తలుపులు తట్టింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూసే సరికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘనటా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మొయినాబాద్ రూరల్: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో పోలీసుల లాఠీచార్జీ ఎంతవరకు సమంజసమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలో గాయపడిన బీజేవైఎం నాయకుడు శ్రీకాంత్ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకుడు ప్రభాకర్రెడ్డితో కలిసి పరామర్శించారు. ఉద్యమ ఉధృతి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పోరాటం అభినందనీయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, బట్టు జ్ఞానేశ్వర్, రెడ్డిపల్లి సర్పంచ్షాపురం రాజు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. -
షాద్నగర్ చాలా హాట్ గురూ..!
● రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగుతున్న నియోజకవర్గ పేరు ● కేసీఆర్పై హాట్ కామెంట్లు, అసెంబ్లీ వద్ద నిరసనలో దూకుడుగా ప్రవర్తించి వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే వీర్లపల్లి, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి ● రసవత్తర రాజకీయ చరిత్రలో షాద్నగర్ షాద్నగర్: షాద్నగర్ నియోజకవర్గానికి ఆది నుంచే ప్రత్యేక చరిత్ర ఉంది. తాజా రాకీయ పరిణామాలతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మారో మారు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నేతల దూకుడు ఈ రాజకీయ చర్చలకు కారణమైంది. ఒకరు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాగా.. మరొకరు ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి. ఈ ఇద్దరు నాయకుల పోకడలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. వీర్లపల్లి నోట.. కేసీఆర్ మాట.. ఈ మాట చిన్నదే అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. ఓ మీడియా చానెల్తో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ చావును కోరుకుంటున్నామంటూ’షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడడం వివాదాస్పదమై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ మాటలకు ఉలిక్కిపడిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. నేతలు సైతం ఎమ్మెల్యేను ఇష్టారాజ్యంగా దూషించారు. అయితే చివరికి ఈ అంశం అధిష్టానాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేయడంతో సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్పందించారు. ముఖ్యంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు పిండప్రదానం చేయడంతో ఎమ్మెల్యేకు కోపం వచ్చిదంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడ తాను ఫ్లోలో అలా మాట్లాడానని.. ఒకరి చావు కోరడం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ మీడియాకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే గతంలో రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చిండు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్ల వీడియోలు ఎమ్మెల్యే ప్రదర్శించారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడిన మాటలు సంచలనానికి దారి తీసింది. ‘నవీన’పోకడలు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు నియోజకవర్గ నాయకుడు ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఆందోళనలో నవీన్రెడ్డి పాత్ర అందరికి తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్పై అతను చేసిన వ్యాఖ్యలు, పోలీసులపై అతను వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ సోషల్ మీడియా విమర్శలు గుప్పించింది. షాద్నగర్లో కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్పీకర్ను దూషించిన కేసులో ఎమ్మెల్సీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం అరెస్టులు, శాసన మండలిలో సస్పెండ్ చేయడం లాంటి సంఘటనలతో ఒక్కసారి నవీన్రెడ్డి వార్తల్లోకి ఎక్కాడు. గతంలో ఆయన ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను విమర్శించడం వివాదాస్పదం కావడం, ఇప్పుడు తన వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లో నిలిచాడు. నాగర్కుంట నవీన్రెడ్డి, ఎమ్మెల్సీ వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్నగర్ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటు చేసుకున్న రాజకీయంలో ఇరువురూ నియోజకవర్గ నేతలే ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారి వివాదాస్పదమయ్యాయి. అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డిని ఎర్రచందనం స్మగ్లర్ అంటూ కామెంట్ చేయడం, సబితారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన సమయంలో సీనియర్ను పక్కకు పెట్టి ఆమెకు ఎలా ఇస్తారంటూ చేసిన వాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక రాజకీయ వేడితో షాద్నగర్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో నిలుస్తుంది. -
ముదిరిన పోరు
మాటల తూటాలు..అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో షాద్నగర్, మహేశ్వరం నియోజకవర్గ నేతల తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అసెంబ్లీ వద్ద నిరసన నేపథ్యంలో ఇక్కడి నేతలు వ్యవహరించిన తీరు, పరస్పర వ్యాఖ్యలు, విమర్శలు వేడెక్కిస్తున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాలు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాయి.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెరిగిన పొలిటికల్ హీట్ రాష్ట్ర వ్యాప్తంగా షాద్నగర్, మహేశ్వరం నియోజకవర్గాలపై చర్చ నేతల కామెంట్లతో కాకరేపుతున్న రాజకీయం -
ప్రకృతి వ్యవసాయమే మేలు
● వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ● కలెక్టరేట్లో కిసాన్ మేళాకు విశేష స్పందన ఇబ్రహీంపట్నం రూరల్: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో కొంగరకలాన్లోని ఐడీఓసీలో జిల్లా స్థాయి కిసాన్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటలు, సుస్థిర వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ సాంకేతికలు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా ముదిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు అమలు చేస్తున్న అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని సూచించారు. సుస్థిర, లాభదాయక వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తామన్నారు. అనంతరం కొహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కొహెడ మార్కెట్ నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునికతతో రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. రైతులకు భూసార పరీక్షపై అవగాహన అవసరం అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ మధుమోహన్, కేవీకే హయత్నగర్ శాస్త్రవేత్తలు పంటల వైవీధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటలపై సాంకేతిక సూచనలు అందించారు. కిసాన్ మేళాలో ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతుల ఆధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా 15 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అతిథులు స్టాల్స్ను పరిశీలించారు. భూసార పరీక్షలపై కొంగరకలాన్ పాఠశాల విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. -
భగీరథ నీటిని పొదుపుగా వాడుకోవాలి
షాద్నగర్ రూరల్: ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మిషన్ భగీరథ క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ సునీల్ సూచించారు. బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామంలో భగీరథ నీటి సరఫరా, క్వాలిటీ, క్వాంటిటీ, పంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామంలో మిషన్భగీరథ నీటి సరఫరా ఎలా ఉంది, ఇంటింటికి ఎన్ని రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతుంది, కుళాయిలు ఏ విధంగా పని చేస్తున్నాయనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంట్రా ఏఈఈ అభినవ్, పంచాయతీ కార్యదర్శి తేజస్విని, అంగన్వాడి టీచర్ రోజా తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ సునీల్ -
అనుమతులు తీసుకోండి
మొయినాబాద్: గణేశ్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చేవెళ్ల డీసీపీ యోగేష్గౌతం అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో బుధవారం గణేష్ ఉత్సవ కమిటీలు, గణేశ్ విగ్రహాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహం ఎత్తు, నిమజ్జనం చేసే తేదీ, ప్రదేశం తదితర వివరాలను పోలీస్ ప్రొటోకాల్ వెబ్సైట్లో నమోదు చేసి అనుముతు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో శబ్ద కాలుష్యం లేకుండా నిబంధనలను పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ మండపాల్లో అగ్ని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ ఊరేగింపులు నిర్వహించాలని తెలిపారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటించి, సహకరించాలన్నారు. ఎవైనా అనుమానాస్పద కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో ఏసీపీ కిషన్, ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీలకు డీసీపీ యోగేష్గౌతం సూచన ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పిలుపు డీజేలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక ర్యాలీలతో ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని వెల్లడి -
సబితారెడ్డిని కలిసిన చేవెళ్ల నేతలు
చేవెళ్ల: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిని చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నగరంలోని ఆమె నివాసానికి చేరుకుని పరామర్శించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ సమాజం మండిపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దౌర్జన్యాలపై గట్టిగా పోరాడాలని సూచించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆమెను కలిసిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, గోనె కరుణాకర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, కుర్వ మల్లేశ్, విజయ్భాస్కర్రెడ్డి, తలారి యాదయ్య, డీఎం.చందు, వెంకటేశ్వర్రెడ్డి, దండు సత్యం, వెంకటేశ్, రామగౌడ్, క్రిష్ణారెడ్డి, రాజు, వెంకటేశ్వర్రెడ్డి, అనంత్రెడ్డి, కృష్ణ, రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. ● ఉప్పల్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్పై కేసు సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఏకంగా పదకొండేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్ అరుణ్ కుమార్పై ఉప్పల్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తనకు ఇష్టం లేకుండా రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, పెళ్లికి ముహూర్తాలు పెట్టి కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గత నెల ఆఖరి వారంలో ఈ కేసు నమోదు కాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ ప్రశాంత్నగర్కు చెందిన యువతితో అరుణ్కుమార్కు 2013లో పరిచయమైంది. 2014లో అరుణ్కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నమ్మిన తాను అతడితో సన్నిహితంగా మెలిగానని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అరుణ్కుమార్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో ఆగస్టు 24న ఉదయం సుమారు 7.30 గంటలకు అతడి ఇంటికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ వాచ్మెన్తో పాటు కుటుంబ సభ్యులను ఆరా తీయగా..అరుణ్కుమార్కు అప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందని పేర్కొన్నారు. అతడు ఈ ఏడాది జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని యువతి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సత్తార్ అనంతగిరి: నర్సరీలు ఏర్పాటు చేసేవారు, ఇప్పటికే నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎంఏ సత్తార్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నర్సరీలను ఏర్పాటు చేయరాదన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని నర్సరీల యజమానులకు తెలంగాణ నర్సరీ చట్టంపై అవగాహన కల్పించారు. కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల నారు పెంచుతున్న వారు ఉద్యాన శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన నారు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు కమల, సురేంద్రనాథ్, యమున, సంతోష్ కుమార్, అక్షిత రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారులు పాల్గొన్నారు. పరిగి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పరిగి పోలీసులు పట్టుకున్నారు. అయితే గోప్యత పాటిస్తున్నారు. బుధవారం ఉదయం మండలంలోని రాఘవాపూర్ వద్ద ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఎన్ని క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. నిందితులు ఎవరు అనే విషయాలు వెల్లడించడం లేదు. దోమ: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కుమ్మరికుంట తండాలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతు కేతావత్ తుల్చా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. తన వద్ద ఉన్న పశువుల్లో ఓ ఆవు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికాడు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ సమీపంలో కరెంట్ షాక్కు గురై చనిపోయింది. ఆవు విలువ రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి
పరిగి: డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌస్, నందు మిత్రులు. సెంట్రింగ్ పనులు కలిసి, విడిగా చేస్తుంటారు. ఇటీవల నందు వికారాబాద్లో ఓ సెంట్రింగ్ పనిని గుత్తకు తీసుకున్నాడు. పని సక్రమంగా చేయకపోవడంతో నిర్వాహకులు గౌస్కు అప్పగించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పాత బకాయి, ఎన్నెపల్లిలో పని చేసిన డబ్బులు ఇవ్వాలని గౌస్ నిత్యం నందును అడగ సాగాడు. గతంలో ఇద్దరు కలిసి కొన్ని పనులు చేయగా అందులో గౌస్ లెక్క తేలాల్సి ఉందని గ్రామస్తులు తెలిపారు. గౌస్ తరచూ నందును డబ్బులు అడగడం, రోడ్లపై నిలదీస్తుండటంతో నందు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బర్కత్పల్లి రోడ్డు పక్కన కూర్చున్న గౌస్తో నందు గొడవకు దిగి కత్తితో దాడి చేశాడు. గౌస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
తల్లీకొడుకుల ఆత్మహత్య
తాండూరు రూరల్: కుటుంబ కలహాలతో తల్లీ కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డి కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రవీణ్కుమార్ రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు మండలం కోటబాసుపల్లికి చెందిన కమ్మరి శంకర్, తుల్జమ్మ(46) దంపతులు. వీరికి నరేష్(26) కొడుకు ఉన్నారు. గ్రామంలోని మైసమ్మ దేవాలయం సమీపంలో కమ్మరి వృత్తి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నరేష్కు నాలుగేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్కు చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి పాప భవాని ఉంది. నరేష్ దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో కూతురును తీసుకుని ఏడాది క్రితం మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై మాట్లాడేందుకు నరేష్ తండ్రి శంకర్ పది రోజుల క్రితం మౌనికను గ్రామానికి పిలిపించి, పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అయితే మౌనికను ఎందుకు పిలిచావంటూ నరేష్, అతని తల్లి శంకర్తో గొడవపడ్డారు. వారం రోజుల క్రితమే.. శంకర్ కుటుంబానికి ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డినగర్లో ఉన్న ఓ ఇల్లు కొన్నాళ్లుగా వృథాగా ఉంది. ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయిన తుల్జమ్మ, నరేష్ రెండు రోజుల పాటు ఈ ఇంట్లోనే ఉన్నారు. వారం రోజుల క్రితమే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో మంగళవారం ఓ పశువుల కాపరి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తుల్జమ్మ సోదరుడు రమేష్ అక్క, అల్లుడి మృతదేహాలను గుర్తించాడు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ హించి, బంధువులకు అప్పగించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తుల్జమ్మ, నరేష్ను వెతికేందుకు శంకర్ తమ బంధువుల గ్రామానికి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణం తాండూరు మండలం ఐనెల్లి శివారులో ఘటన కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు కేసు నమోదు చేసిన పోలీసులు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగురు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆయా కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆమనగల్లు: టెంపో ట్రావెలర్ను మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి సోమవారం టెంపో ట్రావెలర్లో 17 మంది వెళ్తున్నారు. అర్ధరాత్రి ఆమనగల్లులోని రాజీవ్చౌరస్తా వద్ద మాడ్గుల నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మిల్క్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంనలో టెంపో ట్రావెలర్లో ఉన్న నిజమాబాద్కు చెందిన కై లాస్, కన్నా, నాగరాజు, ధన్రాజ్, గోపాల్, శ్రీరామ్, భూమి తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్కు చెందిన సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.ప్రమాదంలో గాయపడిన వారు -
హామీల పేరుతో కాంగ్రెస్ మోసం
పక్కాగా సాగు లెక్క పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది.తుర్కయంజాల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తుర్కయంజాల్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లను ప్రకటించిందని, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచిన వాటి ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా అందడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కోర్టుల్లో కేసులు వేయించి నిలిపివేయించారని అన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, అరాచకాలపై అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన శంకుస్థాపనలకు ప్రస్తుత ఎమ్మెల్యే రిబ్బన్లు కట్ చేస్తూ, ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేస్తూ కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, నాయకులు బొక్క గౌతమ్ రెడ్డి, రొక్కం చంద్రశేఖర్ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, మర్రి సంపతీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి -
మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి
కొత్తూరు: వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని షాద్నగర్ డీసీపీ శిరీష అన్నారు. పట్టణంలోని ఓ హోటల్లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పోలీసుశాఖ ప్రవేశపెట్టిన వెబ్సైట్లో అనుమతులు తీసుకోవాలన్నారు. విగ్రహాలను మండపాలకు తెచ్చే సమయంలో, నిమజ్జన సమయంలో ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇతరులు ఇబ్బందులు పడేలా రోడ్ల మధ్య మండపాలను ఏర్పాటు చేయొద్దని తెలిపారు. మండపాల వద్ద, నిమజ్జన సమయంలో డీజేలు పెట్టొద్దని సూచించారు. బలవంతపు చందాలకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి ఘర్షణలకు చోటు లేకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నాగార్జునరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి రెవెన్యూ శివారులో ఉన్న సుందర్ ఇస్పాత్ ఐరన్ కంపెనీపై రైతులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయని సమీపంలోని రైతులు అరుంధతి, కార్తీక్రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పొల్యూషన్ కంట్రోల్బోర్డు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి రెవెన్యూ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ, పీసీబీ, ఇండస్ట్రియల్, వ్యవసాయశాఖతో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి షాద్నగర్ ఆర్డీఓ సరిత, వ్యవసాయ శాఖ నుంచి జిల్లా వ్యవసాయాధికారి సుజాత, పీసీబీ నుంచి సురేష్, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ నుంచి జిల్లా అధికారి సురేష్, ఇండస్ట్రియల్ నుంచి జనరల్ మేనేజర్ కలిసి ఐరన్ కంపెనీతో పాటు సమీపంలోని రైతుల వ్యవసాయ భూములు, వేసిన పంటలను పరిశీలించారు. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రభావంతో పంటలు, భూములు నాశనం అవుతున్నాయని రైతులు ఆరోపించారు. హైకోర్టు ఆదేశించినా కంపెనీని తరలించడం లేదని వాపోయారు. కమిటీ వెంట తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి, ఆర్ఐ విజయలక్ష్మి, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు. కమిటీ సభ్యులు కలెక్టర్కు నివేదిక అందించనున్నట్టు సమాచారం. -
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం
యాచారం: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని అన్నారు. నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి కోసం ఆర్థిక రుణాలు, రాజీవ్ వికాస్ పథకం కోసం దరఖాస్తులు స్వీకరించి నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.జగన్, ఉపాధ్యక్షుడు ఆలంపల్లి జంగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్, నాయకులు రాఘవేంద్ర, శివశంకర్, మహేశ్, దినేష్, కవిత, ప్రశాంత్, శివ, హఫీజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ -
హష్ ఆయిల్ విక్రేత అరెస్టు
రూ.1.42 కోట్ల సరుకు స్వాధీనం కొత్తూరు: నిషేధిత హష్ హాయిల్ విక్రయించడానికి యత్నిస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ, కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్కు చెందిన హెచ్.ధృవ్ అలియాస్ ధృవ్జోషి (30) ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు. ఒడిశా నుంచి హష్ ఆయిల్ తెచ్చి కొత్తూరు పరిధిలో విక్రయించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మంగళవారం ఇన్ముల్నర్వ శివారులో పీఅండ్జీ పరిశ్రమకు వెళ్లే రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ధృవ్జోషి కనిపించాడు. అతని వద్ద ఉన్న బ్యాగులో సుమారు 11.319 కిలోల హష్ ఆయిల్ను గుర్తించారు. స్టేషన్కు తరలించి విచారించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన రోహిత్ అనే వ్యక్తి నుంచి హష్ ఆయిల్ తీసుకొచ్చి కమీషన్ ప్రాతిపదికన విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు రూ.1.42 కోట్ల విలువైన ఆయిల్ ప్యాకెట్లు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
యాచారం: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వస్తున్న వారు ఆ తర్వాత వాటిని విస్మరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూ సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఈ విషయంలో నాటి కేసీఆర్ సర్కార్కు, నేటి రేవంత్రెడ్డి సర్కార్కు ఏ మాత్రం తేడా లేదన్నారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని ప్రజలు ఓట్లేసి పంపిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగత ధూషణలకు దిగుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పాలక ప్రభుత్వాలు పేదల నుంచి వేలాది ఎకరాలు సేకరిస్తూ వారికి జీవనోపాధి లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.సామేల్, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
పక్కాగా సాగు లెక్క
దౌల్తాబాద్: పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మండల పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియమించింది. సర్వే కోసం కేంద్రం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. ఈ మేరకు వలంటీర్లు యాప్ డౌన్లోడ్ చేసుకుని పంటల వివరాలు అందులో నమోదు చేస్తున్నారు. 25 మంది నియామకం మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం 25 మంది వలంటీర్లు నియమించారు. వారు తమకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు చేస్తున్నారు. వలంటీర్లు సదరు గ్రామానికి చెందిన వారే కావడంతో సర్వే చురుగ్గా సాగుతోంది. కచ్చితమైన డేటా రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణతో మండలంలో ఏ పంట ఎంతమేర సాగవుతుందో ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుంది. దీని ఆధారంగా రైతులకు ఎరువులు ఇతర సంక్షేమ పథకాలు, పంట నష్టపరిహారం అందుతాయి. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ రైతుబంధు, ఇతర పథకాలు వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే సర్వేతో నమోదు చేసిన మేరకు రైతులు పండించిన పంట ఉత్పత్తులుకు సరైన గిట్టుబాటు లభించే అవకాశం ఉంటుంది. డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియామకం వానాకాలం సీజన్లో భాగంగా రైతులు సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేసేందుకు డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టాం. ప్రస్తుతం వలంటీర్లు గ్రామాల్లో క్రాప్ బుకింగ్ సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేస్తాం. – తులసి, ఏఓ, దౌల్తాబాద్ -
నీరు నిల్.. కష్టాలు ఫుల్
వికారాబాద్: భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రతతో చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. దీంతో పంటలు ఎండుముఖం పట్టాయి. దిక్కు తోచని రైతులు ఆందోళనతో ఆకాశం వంక చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది నీరు పాతాలానికి చేరింది. గతేడాది ఆగస్టు చివరన జిల్లాలో సగటున 6.57 మీటర్లు ఉండగా ఈ ఏడాది 11.73 మీటర్ల లోతుకు పడిపోయాయి. వర్షాకాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక వేసవి పరిస్థతి ఎలా ఉండబోతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి లభ్యతకు కారణాల అన్వేషణ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో సగటున 25.56 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇది వేసవి సీజన్కు చెందిన మార్చి, ఏప్రిల్ మాసాలతో సమానమవడం ఆందోళన కలిగించే విషయం. కోట్పల్లి మండలంలో అత్యల్పంగా 6.40 మీటర్ల లోతులోనే నీళ్లు ఉన్నాయి. దోమ, మర్పల్లి మండలాల్లోనూ 18–20 మీటర్ల లోతుకు అడుగంటాయి. కోట్పల్లి మండలంలో నీటి లభ్యతకు కారణాలను విశ్లేషించి మిగిలిన మండలాల్లో ఆ దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన లఖ్నాపూర్, కోట్పల్లి, జుంటుపల్లి, శివసాగర్ లాంటి ప్రాజెక్టులు మినహా చిన్న చిన్న చెరువులు, కుంటలు ఇప్పుడే అడుగంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులే కారణం ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుంచి తలెత్తిన వర్షాభావ పరిస్థితుల కారణంగానే భూగర్భజలాలు అడుగంటుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 12 మండలాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో అత్యధిక లోటు వర్షపాతం, ఒక మండలంలో అధిక వర్షపాతం, ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు 533 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం 409 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇంకుడు గుంతలు మచ్చుకై నా కనిపించడం లేదు. జిల్లాలో వేలల్లో ఇంకుడు గుంతలు తవ్వించామని అధికారులు చెబుతున్నా.. వాటి నిర్వహణ గాలికొదిలేశారు. చెక్ డ్యామ్లు, ఫాంఫండ్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవటంతో అవి నామమాత్రంగా మారాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా అడుగంటి పోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బోరు బావులు తవ్వుతున్నారు. వాతావారణ పరిస్థితులు, నీటి లభ్యత లాంటి విషయాలపై అవగాహన లేకుండా బోర్లు వేయడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. కొందరు రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లు వినియోగించి బోరుబావుల ద్వారా పొలాలకు నీరు పారిస్తున్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక భూగర్భజలాల నీటి మట్టాలు పడిపోతున్నాయి. పంటలు ఎండుముఖం పట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో కరువు ముదిరే ప్రమాదం కనిపిస్తోంది.నీటి పొదుపు సామాజిక బాధ్యత భూగర్భ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. ఇందుకు అందరూ సహకరించాలి. ఇంకుడు గుంతలు తవ్వి నిర్వహణ చేపట్టాలి. కుంటలు, చెరువులు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లలో పూడిక తీసి నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వాడడం సామాజిక బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో అనుమతులు లేకుండానే బోరుబావులు తవ్వుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే పరీక్షలు నిర్వహించి రిపోర్టు ఇస్తాం. దీంతో బోరుబావులు తవ్వుకునే వారు నష్టపోకుండా ఉంటారు. – రవి, జిల్లా అధికారి, గ్రౌండ్ వాటర్ ముంచుకొస్తున్న జల సంక్షోభం అడుగంటుతున్న భూగర్భ జలాలు 13 మండలాల్లో లోటు వర్షపాతం ఆందోళనలో ప్రజలు -
స్పీకర్ను అవమానించడం అప్రజాస్వామికం
షాద్నగర్: గౌరవమైన పదవిలో ఉన్న స్పీకర్పై అవమానకరంగా మాట్లాడడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీలు తాతా మధు, నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటడం, వ్యక్తిగత ధూషణలకు పాల్పడడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు రమేష్, బాదేపల్లి సిద్ధార్థ, జాంగారి రవి, రవికుమార్, జాంగారి జంగయ్య, పెంటనోళ్ల ఆంజనేయులు, సాయిలు, సురేందర్, జంగయ్య, శ్రీను, బాల్రాజ్, శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్హెచ్ఓ మహేందర్రెడ్డికి అభినందనలు
ఇబ్రహీంపట్నం: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సివిల్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికై న ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ మద్ది మహేందర్రెడ్డికి ఏసీపీ కేపీవీ రాజు, ఎస్ఐలు, సిబ్బంది మంగళవారం బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: ఇందిరమ్మ టవర్స్ పథకంలో దరఖాస్తుదారుల నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు డిపాజిట్ (ఈఎండీ)గా ఆన్లైన్ ద్వారా రూ.10 వేలు స్వీకరించారు. ఇళ్ల కేటాయింపు లాటరీ పూర్తి కావ డంతో ఎంపిక కాని దరఖాస్తుదారులకు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. దరఖాస్తుదా రులు చెల్లించిన అకౌంట్కే డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అయితే.. కొంతమంది దరఖాస్తుదారులు నగదు ద్వారా, ఇతరుల అకౌంట్ నుంచి చెల్లించామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. ఇలా చెల్లించిన వారికే జమ అయ్యేలా చూడటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov.in ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ఏ అకౌంట్ ద్వారా చెల్లింపు చేశారో, అదే అకౌంట్కు తిరిగి జమ అవుతుందని తెలిపారు. లాటరీ ద్వారా ఎంపికై న వారి వివరాల పరిశీలన కొనసాతోందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని గౌతం వెల్లడించారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి ఇళ్ల కేటాయింపు పత్రాలను (అలాట్మెంట్)) అందజేస్తామన్నారు. -
● కారును బైక్ ఢీకొట్టగా..
శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ బైక్ ముందు యూ టర్న్ తీసుకునేందు కోసం ఆగిన కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ రుధ్వీర్ కుమార్ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్పల్లికి చెందిన బార్మాల నిశాంత్ (19) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం బైక్పై స్నేహితుడు కంటేశ్ని తీసుకొని పటాన్చెరు వైపు వెళ్తున్నాడు. పట్టణ శివారులోని సురేందర్రెడ్డి హాలు వద్ద ఓ కారు శంకర్పల్లి వైపు యూటర్న్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. అతివేగం కారణంగా నిశాంత్ అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టి, పక్కనే వెళ్తున్న మరో కారు అద్దాలపై పడ్డారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిశాంత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంటేశ్కి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
11, 12 తేదీల్లో కబడ్డీ ఎంపిక పోటీలు
తుక్కుగూడ: అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం నుంచి జాతీయ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ పోషణ మాసం–2026కు సంబంధించిన పోస్టర్ను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన అంగన్వాడీ.. మన బాధ్యత’ అంశంతో అక్టోబర్ 9వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. చిన్నారులకు అందించే సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, వారి సంరక్షణ, అభ్యసనం, ఆటలు, తల్లులకు అందించే పౌష్టికాహారం తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకుడు బండి నర్సింహ్ సన్మానించారు. గౌతమ్కుమార్ ఇటీవల ట్రెసా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు అల్తాఫ్ హుస్సేన్, సయ్యద్ అయూబ్ తదితరులు ఉన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కవ్వగూడ కార్యదర్శి వజ్రలింగం తప్పుడు ఆరోపణలతో తనపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని ఎంపీఓ రమేష్ పేర్కొన్నారు. కవ్వగూడ సర్వే నంబర్ 412,414,415,416,429,432,438లోని భూములు పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉంటాయని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లేవని, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శిపై గతంలో చార్జి మెమో కూడా జారీ చేశామని తెలిపారు. అది జీర్ణించుకోలేకే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా తనపై ఆరోపణలు చేసిన సదరు కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. -
బంజారాల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి
కడ్తాల్: మైదాన ప్రాంత గిరిజనులతో పాటు, బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బంజారా సేవాదళ్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాంరాథోడ్ మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మైదాన ప్రాంత గిరిజనుల సమగ్రాభివృద్ధికి బోర్డును ఏర్పాటు చేయాలని, రాబోయే డీలిమిటేషన్లో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సిద్ధాపూర్ డంపింగ్యార్డు సమస్యను పరిష్కరించాలని, జీఓ నంబర్ 641ను పునః సమీక్షించాలని, ఫ్యూచర్సిటీలోని 20 ఎకరాల స్థలంలో సంత్ సేవాలాల్ భవ్య మందిరం నిర్మించాలని, 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేలా, పునరావాసం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. కార్యక్రమంలో బంజారా సేవాదళ్ అధికార ప్రతినిధి సురేశ్నాయక్, ప్రధాన కార్యదర్శి నరేశ్ నాయక్, నాయకులు హనుమంత్ నాయక్, లక్ష్మణ్ నాయక్, పాపియా నాయక్ ఉన్నారు. -
● రోడ్డు దాటుతూ లారీ ఢీకొని..
కేశంపేట: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బోధునంపల్లికి చెందిన రిటైర్డు పట్వారీ బండ వెంకట్రెడ్డి మంగళవారం కేశంపేట చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా డ్రైవర్ లారీని అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకట్రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయమై బాధితుడి కుమారుడు శ్రీనివాస్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పరమేశ్ తెలిపారు. -
బుద్వేల్ టు నాచారం
రేడియల్– 2 రోడ్డు నిర్మాణానికి కార్యాచరణసాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు– 2 నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు వివిధ ప్రాంతాల్లో రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రావిర్యాల నుంచి ఫ్యూచర్సిటీ మీదుగా ట్రిపుల్ ఆర్ సమీపంలోని ఆమనగల్లు వరకు ఒకటో రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బుద్వేల్ నుంచి ఎన్హెచ్–167 (ఎన్) సమీపంలోని నాచారం వరకు 81.15 కి. మీ మేర రెండో రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) తాజాగా నోటిఫికేషన్ వెల్లడించింది. నిర్మాణ సంస్థల నుంచి టెక్నికల్ బిడ్లను ఆహ్వానించింది. ఈ నెల 30 వరకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొంది. మొత్తం 81.15 కి.మీ.. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వెలుపలి పారిశ్రామిక ప్రాంతాలకు ఈ రేడియల్ రోడ్డు కనెక్టివిటీ సదుపాయాన్ని ఇవ్వనుంది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ సమీపంలోని తుర్క ఎంకపల్లి వరకు.. అక్కడి నుంచి ఎన్హెచ్ 67 (ఎన్) వరకు ఈ రోడ్డును పొడిగించనున్నారు. మొత్తం నాలుగు వరుసల్లో నిర్మించనున్న రేడియల్ రోడ్డు– 2ను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు హెచ్జీసీఎల్ అధికారులు తెలిపారు. మొదటి దశలో బుద్వేల్ నుంచి షాబాద్ వరకు 29.50 కి.మీ, రెండో దశలో షాబాద్ నుంచి గూడూర్ వరకు 27, మూడో దశలో గూడూర్ నుంచి నాచారం వరకు 24.65 చొప్పున మొత్తం 81.15 కి.మీ మేర పూర్తి చేయనున్నారు. ఔటర్ నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు కనెక్టివిటీ మూడు దశల్లో నిర్మాణానికి హెచ్జీసీఎల్ టెండర్లు టెక్నికల్ బిడ్లకు దరఖాస్తుల ఆహ్వానం ఈ రేడియల్ –2 రోడ్డు నిర్మాణానికి రూ.5,060 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను అందజేసింది. ఈ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్పేట్ జిల్లాల్లోని 41 గ్రామాల పరిధిలో 1,486.30 ఎకరాలను సేకరించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 21 గ్రామాల్లో 831.36 ఎకరాలు (44.70 కి.మీ.), వికారాబాద్లోని 18 గ్రామాల్లో 558.18 ఎకరాలు (31.50 కి.మీ.), నారాయణ్పేట్ జిల్లాలోని 2 గ్రామాల్లో 96.16 ఎకరాల (5.05 కి.మీ.) భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 902.16 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. భూసేకరణకు ప్రభుత్వం రూ.3,800 కోట్లు కేటాయించింది. -
నేడు కిసాన్ మేళా
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ పథకం కింద రైతుల కోసం బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కిసాన్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి సుజాత మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం, నూతన పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడుల సాధన, సుస్థిర వ్యవసాయం, యాంత్రీకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య, పశుసంవర్థక శాఖలు, ఆయా కంపెనీల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై సమాచారం అందిస్తామన్నారు. రైతులు– శాస్త్రవేత్తల పరస్పర చర్చా కార్యక్రమం ఉంటుందన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సాగుపై అవగాహన అవసరం కేశంపేట: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత అన్నారు. మండల పరిధిలోని కొత్తపేట రైతువేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులు, డీలర్లకు పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆరుతడి పంటల సాగుతో పాటు పశుపోషణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సన్నవడ్లకు బోనస్ లభించాలంటే ధాన్యం కొనుగోలు చేసిన షాపులోనే రైతు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. బోనస్కు సంబంధించి డీలర్లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామశివరావు, ఏఈఓలు వినయ్, తేజ్కుమార్, ప్రశాంత్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
హామీలపై నిలదీస్తారనే దౌర్జన్యాలు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజలకు రేవంత్రెడ్డి సర్కార్ ఇచ్చిన బూటకపు హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీస్తారనే అసెంబ్లీకి వెళ్లనీయకుండా పోలీసులతో దౌర్జన్యంగా అడ్డుకున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంగళ్పల్లి గేటు వద్ద సాగర్రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో అధికార పార్టీకి వెన్నులో వణుకు మొదలైందన్నారు. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇప్పటికై నా అణచివేతలు మానుకొని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, కర్నాటి రమేష్గౌడ్, చీరాల రమేష్, బుగ్గరాములు, ఏర్పుల చంద్రయ్య, కృపేష్, బూడిద రాంరెడ్డి, నీలం శ్వేత, మాధవి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి -
సమష్టి బాధ్యతలతో యువత శక్తివంతం
శంకర్పల్లి: విభిన్న రంగాలకు చెందిన విద్యార్థులు సమష్టి బాధ్యతలు చేపట్టడం ద్వారా యువత శక్తివంతంగా తయారవుతారని ఇక్ఫాయ్ గ్రూప్స్ చైర్పర్సన్ శోభారాణి యశస్వీ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అపరాజిత అండర్ గ్రాడ్యుయేట్ క్లబ్’ని ఆమె రిజిస్ట్రార్ విజయలక్ష్మితో కలిసి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఇది ఒక అధికారిక విద్యార్థి క్లబ్ అని, భిన్న రంగాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒకేచోట తమ అభిప్రాయాలు, ఆసక్తులు, అభిరుచులు తెలుసుకొని, సమష్టిగా పని చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొ.మహేంద్ర హెచ్.సోనావానే, కో–ఆర్డి నేటర్లు డా.చెంజి, ప్రొ.వి.పద్మావతి, డా.టి.నేహా తదితరులు పాల్గొన్నారు. ఇక్ఫాయ్ గ్రూప్స్ చైర్పర్సన్ శోభారాణి -
అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి..
● బైక్పై వెళ్తుండగా ప్రమాదం ● అక్కడికక్కడే ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు మొయినాబాద్: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన కృష్ణ (50), అదే గ్రామానికి చెందిన నర్సింహ సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వైపు బైక్పై వెళ్తున్నారు. అజీజ్నగర్ రెవెన్యూలో ఉన్న రాణే ఇంజన్వాల్స్ కంపెనీ వద్దకు రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయాలైన నర్సింహను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హామీల అమలులో విఫలం
బీఆర్ఎస్ నాయకులు కొడంగల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో డీటీ అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల గడిచినా హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 ఎక్కడని ప్రశ్నించారు. వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు పింఛన్ల మొత్తం పెంచలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎరన్పల్లి శ్రీనివాస్, మున్నూరు బిచ్చప్ప, శ్రీనివాస్రెడ్డి, మాఫీ వెంకటయ్య, ఏర్పుల మోహన్, జగన్, బాల్రాజు, హన్మంతు, రాజశేఖర్, రఫీ తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: ప్రజల సహకారంతో గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేస్తామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం నగరం నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, బందోబస్తు తదితర వాటిపై సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్ర, ఏఎస్పీ రాజేష్ మీనాతో కలిసి మాట్లాడారు. ఉత్సవాలు, నిమజ్జనం వేడుక ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండపాలను క్రమం తప్పకుండా సందర్శించి భద్రతను పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. నిమజ్జన రూట్లను ముందుగానే చెక్ చేసి ట్రాఫిక్ నియంత్రణ, బారికేట్ల ఏర్పాట్లు, పార్కింగ్ తదితర వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు
కడ్తాల్: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని మహేహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలతో పాటు నేరాల నియంత్రణ, స్నేహపూర్వక పోలీసింగ్, సమయపాలన, బాధ్యతాయుతంగా విధుల నిర్వహణపై సిబ్బందితో మాట్లాడారు. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, నిఘా వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించి, నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. పిర్యాధు దారులతో మర్యాదగా వ్యవహరించి, చట్ట ప్రకారం త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి -
రెడీ మిక్స్ ప్లాంట్ పనులు ఆపండి
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో కొత్తగా వేస్తున్న ఆర్ఎంసీ రెడీమిక్స్ ప్లాంట్ పనులను వెంటనే నిలిపివేయాలని స్థానిక ప్రజలు, కౌన్సిలర్ మధుసూదన్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ యాదగిరికి, తహసీల్దార్ కృష్ణయ్యకు వినతిపత్రాలు అందజేశారు. వార్డులో ఏర్పాటు చేస్తున్న క్రషర్కు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. దీనివల్ల ఇళ్లల్లోకి దుమ్ముధూళి రావడంతో పాటు చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజుగుట్ట ప్రజలు, తదితరులు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్కు వినతి -
కాల్వల నిర్మాణంలో తీవ్ర జాప్యం
కొడంగల్: పట్టణ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరవుతున్నా అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అలసత్వంతో పనులు ముందుకు సాగడం లేదు. కొడంగల్లోని మహబూబ్నగర్ – చించోలీ జాతీయ రహదారికి ఇరువైపులా చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా పేదల ఇళ్లు కూల్చారు. ఆలయాలు, మసీదులు, దర్గాలకు సంబంధించిన కట్టడాలను తొలగించారు. నిరుపేదలు నివాసం ఉండే గాంధీనగర్లో సైతం కట్టడాలను కూల్చివేశారు. ఎక్కడా కూడా ఆటంకం లేకుండా పనులు చకచకా జరిగిపోయాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం అడ్డుగా ఉన్న భవనాలను ఎందుకు తొలగించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులను పెట్టి మా ఇళ్లు, పూరి గుడిసెలను తొలగించిన అధికారులు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాల్వల నిర్మాణానికి అడ్డుగా ఉన్న తమ భవనాలు కూల్చ వద్దని సదరు యజమాని అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారులు ఆ భవనాలను వదిలేసి పనులను అర్ధాంతరంగా ఆపినట్లు కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు -
అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
షాద్నగర్: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అన్నారు. సో మవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వా మ్యంలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అట్టడుగు వర్గానికి చెందిన దళిత బిడ్డ అయిన స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని డి మాండ్ చేశారు. స్పీకర్పై కనీస గౌరవం లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రా జ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలన్నారు. శంకర్పల్లి: అక్రమ లేవుట్లలో నిర్మించిన నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. జన్వాడ రెవెన్యూలో అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు, నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఈనెల 6న ‘నిబంధనలు నిల్.. వెంచర్లు ఫుల్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నార్సింగి సర్కిల్, హెచ్ఎండీఏ అధికారులు స్పందించారు. సదరు నిర్మాణాలను సోమవారం కూల్చివేశారు. అన ంతరం నా ర్సింగి అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి ప్ర సీదా, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమేశ్ మా ట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లు, నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కందుకూరు: బంజారాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో సోమవారం మంత్రులు డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంజారా సమాజానికి మంత్రి వర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ఫ్యూచర్సిటీలో 20 ఎకరాలు కేటాయించి, అందులో సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించాలని, సిద్ధాపూర్ డంపింగ్ యార్డు జీఓ నంబర్ 641ను రద్దు చేయాలని, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్పై అసెంబ్లీలో చర్చించి బంజారా సమాజానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు హనుమాన్ నాయక్, ప్రధాన కార్యదర్శులు నరేష్ నాయక్, కాట్రావత్ హనుమంత్ నాయక్, అధికార ప్రతినిధి ఇస్లావత్ సురేష్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాపియా నాయక్ పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: సరూర్నగర్లోని జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రష్మితను రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు వరించింది. ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సహా 9 మంది విద్యార్థునులకు ఎంబీబీఎస్, 11 మంది బీడీఎస్, ముగ్గురికి ఐఐటీ, 150 మంది విద్యార్థులకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కాయి. మొత్తంగా మంచి ఫలితాలు సాధించినందుకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2018లో నాగార్జునసాగర్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా ఎంపికయ్యారు. అనతి కాలంలోనే ప్రిన్సిపాల్గా పదోన్నతి పొందారు. 2021లో పరిగిలో పని చేశారు. తర్వాత సరూర్నగర్ కాలేజీ ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కొడంగల్ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి టీచర్స్ డే వేడుకల్లో భాగంగా సీఎం చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ప్రిన్సిపాల్కు ఉత్తమ అవార్డు రావడంపై తోటి అధ్యాపకులు సహా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
గ్రీవెన్స్లో స్పందించకపోవడంతో..
హస్తినాపురంలో ఉంటున్నాం. డబుల్బెడ్రూం కోసం దరఖాస్తు చేశాం. నా పేరున స్థిరచరాస్తులు లేవు. నెల రోజుల క్రితం నాపేరు లిస్ట్–2లో ఉండగా, తాజాగా లిస్ట్–3లోకి మారింది. అదేమంటే కారు ఉన్నట్లు చూపిస్తున్నారు. నిజానికి నాపేరున కానీ, నా భర్త పేరున కానీ ఎలాంటి వాహనాలు లేవు. గ్రీవెన్స్లో ఇదే అంశాన్ని లేవనెత్తాను. అక్కడ ఎలాంటి స్పందన లభించకపోవడంతో కలెక్టరేట్కు వచ్చాను. – శాలిని, ఓంకార్నగర్ తక్కెళ్లపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 348లో 1.10 ఎకరాల భూమి ఉండగా, దీనిలో 24 గుంటలే పట్టాదారుపాసు పుస్తకంలో ఎక్కించారు. సర్వే నంబర్ 343లో 30 గుంటల భూమికి ఆరు గుంటలే నమోదైంది. మిగిలిన భూమిని రికార్డు చేయాల్సిందిగా అనేకసార్లు తహసీల్దార్కు విన్నవించినా పని కాలేదు. విధిలేని పరిస్థితుల్లో కలెక్టర్ను ఆశ్రయించాను. ఇప్పటికే నాలుగు విడతలు తిరిగినా పని కాలేదు. అధికారుల చుట్టూ తిరిగితిరిగి మోకాళ్లు అరిగిపోయాయి. – బింగి అయిలయ్య, నక్కర్తమేడిపల్లి -
పోటాపోటీ ఆందోళనలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ఆందోళనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉమ్మడి జిల్లా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, అరెస్టులతో ఒక్కసారిగా హీటెక్కింది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహిళా ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు, స్పీకర్పై అనుచిత వాఖ్యలు చేయడంపై అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్నగర్, కల్వకుర్తి, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. మరోవైపు పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి పార్టీశ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలుచోట్ల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర ఆందోళనలు ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లిన బీజేపీ నాయకులు ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు -
జాతరకు పోటెత్తిన భక్తజనం
భక్తులతో కిక్కిరిసిన సప్తకొలనులుబషీరాబాద్: జిల్లా సరిహద్దులోని నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో కొలువుదీరిన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి జాతర సోమవారం భక్తజన సంద్రంగా మారింది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి సప్తకొలనుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు యాకూబ్సాబ్ దర్గాను సందర్శించారు. పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూలతో సుందరంగా అలంకరించిన స్వామివారి రథాన్ని భక్తులు ఆలయ పరిసరాల్లో ఘనంగా ఊరేగించారు. జాతరలో మిఠాయిలు, గాజులు, ఆటబొమ్మల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నీళ్లనల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్ గ్రామాల సర్పంచులు వేణుగోపాల్రెడ్డి, జయవీర్లాల్, నామ్యానాయక్, నీళ్లపల్లి గ్రామ నాయకులు సుధాకర్రెడ్డి, రుక్మారెడ్డి, గోపాల్రెడ్డి, మధుసూధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవుడి వద్ద రాజకీయాలా? ఏకాంబరి రామలింగేశ్వర ఆలయం పేరున యువత ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవ చేస్తుంటే రాజకీయాలు చేస్తారా అని ట్రస్ట్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆలయం వద్ద ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడారు. ఏడేళ్ల నుంచి రూ.10 లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆలయ చైర్మన్ రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్కుమార్, సభ్యులు వెంకట్నాయక్, గురుప్రసాద్, పీకే శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఏకాంబరి రామలింగేశ్వరుడి దర్శనానికి భక్తుల బారులు సప్తకొలనుల్లో పుణ్యస్నానాలు యాకూబ్సాబ్ దర్గాలో పూజలు కనుల పండువగా రథోత్సవం -
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
● పునరావాస ప్రయోజనాలను కల్పిస్తాం ● ఆలూరు భూసేకరణ సభలో ఆర్డీఓ పార్థసింహారెడ్డి ● పరిహారం పెంచాలని రైతుల డిమాండ్ చేవెళ్ల: ఆలూరులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న వారికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని ఆర్డీఓ పార్థసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం రెవెన్యూ అధికారులు, ఆలూరు సర్పంచ్ కౌలంపేట భాగ్యశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. భూసేకరణ, పరిహారం, పునరావాసం, పునరుద్ధరణ ప్రయోజనాలను వివరించారు. నిర్వాసితులకు ప్రభుత్వం కల్పించనున్న ప్రయోజనాలను తెలియజేశారు. భూసేకరణకు సానుకులంగా స్పందించిన రైతులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని, వక్ఫ్ బోర్డు అంటూ అన్యాయం చేయకుండా పూర్తి పరిహారం రైతులకే ఇవ్వాలని కోరారు. గుంటల్లో భూమి కలిగి ఉన్న వారికి కూడా పునరావాసం కింద ఇచ్చే ప్రయోజనాలను వర్తింపజేయాలన్నారు. గ్రామంలో పెద్ద భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు పరిహారం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని, కోకాపేట వంటి ప్రాంతాల్లోని భూములను వందల కోట్లకు అమ్ముతున్న ప్రభుత్వం రైతులకు అందించే పరిహారాన్ని అంత తక్కువగా ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. మరికొంత మంది ఇది వక్ఫ్బో,ర్డు భూమి కాదని ఇనాం భూమి అని కోర్టులో కేసు వేశామని, ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న రైతులకు ఓఆర్సీలు ఇవ్వాలని న్యాయస్థానం చెప్పిందన్నారు. మోజార్జీ రైతులు భూసేకరణకు అనుకులంగా ఉండటంతోపాటు పరిహారం, ఆర్అండ్అర్ ప్రకారం కల్పించే ప్రయోజనాలపై ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ ప్రవీణ్, జీపీఓలు, గ్రామ నాయకులు, రైతులు, పాల్గొన్నారు. -
నర్సు శిరీష హత్య ప్రదేశంలో వివరాల సేకరణ
మహేశ్వరం: తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సు శిరీషపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రదేశాన్ని సోమవారం గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇందిర, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు నిశితంగా పరిశీలించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించడంతో హత్య జరిగిన ప్రదేశంలో వివరాలు సేకరించారు. నర్సు నివాసం ఉన్న గది, చుట్టూ పరిసరాలు, సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, గది డోర్లు, కిటికీలు, గ్రిల్స్తో పాటు హంతకుడు పనిచేసిన మెకానిక్ షెడ్ను పరిశీలించారు. ఆస్పత్రిలోని వైద్యులు, శిరీష స్నేహితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన నర్సులు ఉంటున్న గదులను పరిశీలించి, ప్రతీ అంశాన్ని రికార్డు చేశారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు తదితరులు ఉన్నారు. -
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్పై విమర్శలు సరికాదు
షాద్నగర్రూరల్: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రజా సంఘాల నాయకులు విమర్శించడం సరికాదని గిరిజన ఆదివాసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పారిశ్రామికవేత్తలకోసం నిర్మిస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రిజర్వాయర్ నిర్మాణంకోసం తట్టెడు మట్టిని తీయకుండా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని మండిపడ్డారు. డిండి నుంచి నీటిని నల్లగొండకు తరలించుకుపోతే స్థానిక ఎమ్మెల్యేకు ఏం సంబంధమని, అది జాతీయ సమస్య అని తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు సంబంధించి 10టీఎంసీల నీటి సామర్థ్యాన్ని 2.8 టీఎంసీలకు కుదించిన పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. భూ సేకరణ అనంతరం నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మహ్మద్ అలీఖాన్ బాబర్, ఎం.డి.ఇబ్రహీం, సయ్యద్ఖదీర్, గంగాధర్ తిలక్, షర్పొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు కోర్పోలు లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు నిర్వహిస్తున్న కంబైన్డ్ ఫౌండేషన్ కోర్సు (సీఎఫ్సీ) గ్రూప్–2 బ్యాచ్ ఏలో భాగంగా 223 మంది ట్రైనీ అధికారులు సోమవారం అన్మాస్పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతికి దగ్గరగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ట్రైనీ అధికారులకు సూచించారు. పర్యావరణ శాస్త్రవేత్త నక్క సాయిభాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ఫైళ్లు కాదు ప్రకృతిని అర్థం చేసుకోవాలన్నారు. అభివృద్ధి పేరుతో అడువులను నాశనం చేయకుండా కాపాడాలన్నారు. పర్యావరణవేత్త ఉమామహేశ్వర్రెడ్డి పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్య సంరక్షణ, సుస్థిర జీవన విధానాలు, అటవీ సంరక్షణ కార్యక్రమాలను తెలియజేశారు. సంస్థ ప్రతినిధులు రజనీకాంత్, పాలడుగు నగేశ్ బయో ఎంజైమ్, బయోచార్, విత్తన బంతుల తయారీ, ఔషధ మొక్కల వినియోగంపై ట్రైనీ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ లక్ష్మణ్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. -
అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
హుడాకాంప్లెక్స్: దేశంలో, రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆలిండియా వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగం అన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభ సందర్భంగా సోమవారం కొత్తపేట చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, కార్మిక, కర్షక, రాజ్యాధికారం కోసం పనిచేయాలని కోరారు. దేశం పూర్తిగా అవినీతిమయం, లీకేజీలమయమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆలిండియా వర్కర్స్ పార్టీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగి, అవినీతి రహిత పాలన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నవంబర్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు యాదాద్రిలో ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు. -
‘చలో హైదరాబాద్’ జయప్రదం చేయాలి
షాద్నగర్రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్ను’ విజయవంతం చేయాలని టీజీఈ జేఏసీ జిల్లా కన్వీనర్ యశ్వంత్ పిలుపునిచ్చారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం టీజీఈ జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ నర్సింలు ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధాయుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం యశ్వంత్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు గొంతెమ్మ కోరికలను కోరడంలేదని, ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను ఇస్తామని, ఆరు నెలల్లో పీఆర్సీని చెల్లిస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఏపీఎస్ను అమలు చేస్తామని, పెండింగ్లో ఉన్న సరెండర్, మెడికల్ బిల్లులను వెంటనే క్లియర్ చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు, కో చైర్మన్ గోపాల్నాయక్, కో కన్వీనర్ వెంకటప్ప, తహసీల్దారు నాగయ్య, ఎంపీడీఓ శ్రీకాంత్, ఎంపీఓ జయంత్రెడ్డి పాల్గొన్నారు. వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులుటీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ యశ్వంత్ -
ఆరుసార్లు విన్నవించినా అంతే ..
కందుకూరులోని 430/ఎ, 431/ఎ2/ఎ సర్వే నంబర్లలో వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కొడుకుల పేరున తలో నాలుగు ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేయాలని 2025 మే 29న చలానా కట్టిన. రిజిస్ట్రేషన్ సమయంలో మా తమ్ముడు, అక్క వచ్చి అడ్డుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. చలానా రూపంలో చెల్లించిన రూ.6.18 లక్షలు తిరిగి చెల్లించాల్సిందిగా అభ్యర్థించా. ఇప్పటికే ఆరుసార్లు ప్రజావాణికి వచ్చి విన్నవించినా లాభం లేదు. ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు. – ఎస్.మల్లేష్, ఎదులాబాద్ ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు రెవెన్యూ సర్వే నంబర్ 488,489,490,495లలో నా భార్య స్వరూప పేరున ఐదెకరాల పట్టా భూమి ఉంది. 38ఈ, పీటీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. నా భార్య పేరున సక్షేషన్ అయింది. కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి, భూమిని కబ్జా చేశారు. రోడ్లు వేసి, వెంచర్ చేసి గుట్టుగా విక్రయించారు. రెవెన్యూ కోర్టును ఆశ్రయించి మొత్తం భూమిని నిషేధిత జాబితాలో పెట్టించాను. కబ్జాదారుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు హియరింగ్ నిర్వహించకుండా దాటవేస్తున్నారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ హియరింగ్ నిర్వహించ లేదు. – కె.కృష్ణారెడ్డి, కప్పాడు -
వాణి వినరే..!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తోంది. ఇటీవల మండల, రెవెన్యూ కేంద్రాలకూ విస్తరించింది. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి 80 నుంచి 100 మంది వస్తున్నారు. వీరిలో 60 శాతం భూ బాధితులే. ఈ రెండేళ్లలో ఎన్ని ఫిర్యాదులు అందాయి.. ఎన్ని పరిష్కరించారంటే అధికారుల వద్ద సమాధానం లేదు. ఫిర్యాదులు స్వీకరించడం తప్ప వాటి పరిష్కారానికి ఆసక్తి చూపడం లేదు. చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం ఎన్నాళ్లు తిరగాలి అంటూ పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణికి పోటెత్తుతున్న వినతులు మొక్కుబడిగా అధికారుల చర్యలు పరిష్కారం కాని సమస్యలు మళ్లీమళ్లీ తిరుగుతున్న బాధితులు -
విద్యుత్ షాక్తో ఆర్టిజన్ మృతి
మీర్పేట: ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి ఆర్టిజన్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతిపురి తండాకు చెందిన కర్నాటి కృష్ణకాంత్ (43) మీర్పేట సెక్షన్ పరిధిలో ఆర్టిజన్ (జూనియర్ లైన్మెన్)గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నందిహిల్స్ రోడ్ నం–2లోని ఓ ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఆన్లైన్లో ఫిర్యాదు రావడంతో కృష్ణకాంత్కు ఏఈ ఫోన్ చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో అతను వెంకటాద్రి హోమ్స్ అపార్ట్మెంటు ముందున్న ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి కింద పడగా తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహంతో ఆందోళన విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యుత్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే తన భర్త మృతి చెందాడని భార్య శాంత ఆరోపించారు. న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు సముదాయించినప్పటికీ వినకపోవడంతో అంబులెన్స్లో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సెక్టార్ తన భర్త పరిధిలోనిది కాదని, అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా పంపించారని ఫిర్యాదులో పేర్కొంది. ఏఈ వివరణ మరమ్మతుల కోసం వెళ్లిన కృష్ణకాంత్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయాల్సింది మరో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేశాడని, సరైన అవగాహన లేకే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని ఏఈ బాలాగౌడ్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
కొడంగల్: విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రివల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) జాతీయ అధ్యక్షుడు రవిశంకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని, నిరుద్యోగులకు ప్రతీ నెల రూ.4వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వడ్డె భీమ్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్, వెంకటేశ్, మహ్మ ద్ ఫయాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
శిక్షారత్న అవార్డు ప్రదానం
షాద్నగర్: గ్రీన్ ఫీల్డ్ డీమ్డ్ యూనివర్సిటీ హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్కు శిక్షారత్న అవార్డు అందజేశారు. ఆదివారం నందిగామ మండలం కన్హాశాంతి వనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ స్థాపించి ఓటర్లను చైతన్య పరుస్తూ కార్యక్రమాలు నిర్వహించినందుకు అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు, చైతన్య సదస్సులు నిర్వహిస్తానని డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. బడంగ్పేట్: తెలంగాణ విమోచన జైత్రయాత్రలో భాగంగా ‘చలో చార్మినార్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్ను ఆదివారం ఉదయాన్నే పోలీసులు నాదర్గుల్లోని ఆయన ఇంటికి చేరుకుని ముందస్తు అరెస్ట్ చేశారు. అడ్డుకోబోయిన కార్యకర్తలు, నాయకులను సైతం అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. తెలంగాణ రజాకార్ల పాలన నుంచి ఇంకా విముక్తి కాలేదని అన్నారు. రాష్ట్రంలో రజాకార్ల పాలనను తలపించే పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో చలో చార్మినార్ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి తోకల శ్రీనివాస్రెడ్డి తదితరులు శ్రీరాములును కలిసి మాట్లాడారు. కడ్తాల్: బంజారా సేవాదళ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా మండల పరిధిలోని గుర్లకుంటతండాకు చెందిన వాక్డోవత్ హన్మానాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లోని కర్మన్ఘాట్లో ఆదివారం నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశంలో బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాంరాథోడ్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హన్మానాయక్ మాట్లాడుతూ.. బంజారాల సమాజ ప్రగతి, సంఘం ఆశయాల సాధనకు నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. అనంతరం గిరిజన నాయకులు హన్మానాయక్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం: సీపీఎం జిల్లా నూతన కార్యదర్శిగా బోడ సామెల్ను జిల్లా కమిటీ నియమించింది. తులేకలాన్ గ్రామానికి చెందిన సామెల్ ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. అకస్మాత్తుగా జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్యను తొలగించి బోడ సామెల్ను నియమించడంతో వామపక్షాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి యాదయ్య తప్పుకున్నాడా లేక ఆ పార్టీ సెంట్రల్ కమిటీ యాదయ్యను తప్పించిందా అనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో సస్పెండైన కార్మిక సంఘం ఓ మహిళ నేత ఫిర్యాదు మేరకు సెంట్రల్ కమిటీ యాదయ్యను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. -
కడాకు నిధుల వరద
సొంత గడ్డకు ప్రాధాన్యం.. పక్క నియోజకవర్గాలకు మొండిచేయివికారాబాద్: వడ్డించే వాడు మనవాడైతే వెనుక బంతిలో కూర్చున్న పర్వాలేదన్నట్టుగా కొడంగల్ నియోజకవర్గ పరిస్థితి ఉందని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ మినహా మిగిలిన నియోజకవర్గలపై వివక్ష చూపుతున్నారంటూ ఆయా నియోజకవర్గ పరిధి ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదలు జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘కడా’కే పరిమితమైన సమీక్షలు తాజాగా శుక్ర, శనివారాల్లో సీఎం జిల్లా పర్యటనలోనూ ఇదే పునరావృతమైంది. రెండు రోజుల ఆయన సుధీర్ఘ పర్యటన పూర్తిగా కడా(కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ)కే కట్టుబడ్డారు. జిల్లా అధికారుల సమీక్షా, బీఎల్ఏ, కార్యకర్తల సమావేశంలోనూ ఆయన మాటలు కడా పరిధి దాటలేదు. పలుమార్లు జిల్లాలో పర్యటించిన ఆయన మున్సిపల్ ఎన్నికల ముందు పరిగి మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగభకు హాజరవడం మినహా మిగిలిన మూడు నియోజకవర్గాలు, కలెక్టరేట్లో ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు. జిల్లాకు వచ్చిన ప్రతీసారి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం సొంత నియోజకవర్గానికే అధికారులను రప్పించి భారీ షెడ్లు వేయించి అక్కడే రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్నారు తప్ప కలెక్టరేట్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ను వినియోగించుకోవడంలేదు. నియోజకవర్గ స్థాయి సమీక్షకు జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎందుకనేది పాలుపోవడం లేదు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతీసారి వికారాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వెళ్లి సీఎంను కలుస్తున్నారు. పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు సైతం ఆయన పర్యటనలో భాగస్వాములు అవుతున్నారు. పనులు పరిశీలించే సమయంలో పక్కన ఉంచుకుంటున్నారు. కడాలో కొనసాగుతున్న పనులపై అధికారులతో సమీక్షించే సమయంలోనూ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎంకు చెరో పక్క కూర్చుకుంటున్నారు. గంటల తరబడి కొనసాగుతున్న సమీక్షల్లో ఇతర నియోజకవర్గాల గురించి.. ఆ నియోజకవర్గాలకు మంజూరు చేసిన పనుల గురించి, వాటి పురోగతి గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. కనీసం పనుల ప్రోగ్రెస్ ఎలా ఉందని సంబంధిత జిల్లా అధికారులను అడగటంలేదు. గతంలో సీఎం నిర్వహించిన జిల్లా పర్యటనలన్నింటిలో ఇదే కొనసాగగా తాజా పర్యటనలోనూ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. సీఎం సొంత నియోజకవర్గంలో పనుల పురోగతిని పర్యవేక్షించటంతో పాటు జూనియర్ కళాశాల భవన సముదాయం, సీహెచ్సీ భవనం, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ భవనం ప్రారంభించారు. ఈ పనులు మంజూరైన సమయంలోనే జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో మంజూరైన పనులు ఇంకా శంకుస్థాపనలకే పరిమితమవటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సమీక్షల సమయంలో పక్కనే ఉంటున్న స్పీకర్, ఎమ్మెల్యేలు కొడంగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.400 కోట్లు యాభైశాతం పనులు పూర్తి మిగిలిన నియోజకవర్గాలకు రూ.30 కోట్లు మంజూరు శిలాఫలకాలకే పరిమితమైన పనులు విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సీఎం సమీక్షలు సొంత నియోజకవర్గానికే పరిమితం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తిని సీఎం పదవి వరించి వెయ్యిరోజులైంది. అప్పుడప్పుడు అభివృద్ధి పేరిట హడావుడి చేస్తున్న మంత్రుల పర్యటనలు ఆర్అండ్బీ రోడ్లు దాటి ఇంకో శాఖకు విస్తరించడం లేదు. కొడంగల్ మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. చిన్న మున్సిపాలిటీ కొడంగల్లో రూ.400 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, యూజీడీ పనులు ఇప్పటికే యాభై శాతం పూర్తయ్యాయి. మున్సిపల్ శాఖ బాధ్యతలు సైతం చూస్తున్న సీఎం సొంత జిల్లాలో మిగిలిన మూడు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గతేడాది నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యేలు చేసిన హడావుడి శిలాఫలకాల వద్దే ఆగిపోయాయి. జిల్లాలో పనులకు టెండర్లు పిలిచి ఏడాది కావస్తున్నా..? ఒక్క పరిగి–వికారాబాద్, పరిగి–షాద్నగర్ రోడ్లు మినహా మిగతా పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు. ప్రారంభమైన పనులు సైతం మధ్యలోనే నిలిచిపోయాయి. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రహదారులు పాడై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంజూరైన పనులు ప్రారంభించడంలో జాప్యం కారణంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ప్రజా విమర్శలు తప్పడం లేదు. -
డబ్బా ధ్వంసంతో దుమారం
బషీరాబాద్: మండల పరిధిలోని మైల్వార్లో రేకుల డబ్బా ధ్వసం ఘటన వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన యువకుడు కందనెల్లి నగేశ్ స్వయం ఉపాధి కోసం రూ.1.50లక్షలు వెచ్చించి బస్టాండ్ సమీపంలో జిరాక్స్, స్టేషనరీ షాపు ఏర్పాటు చేశాడు. గత నెలలో షాపు ఏర్పాటుకు సర్పంచ్కు రాతపూర్వకంగా దరఖాస్తు చేశానని, పంచాయతీ కార్యదర్శి మౌఖిక సూచనల మేరకే డబ్బా ఏర్పాటు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలో సర్పంచ్ సీమా సుల్తానా అనుచరులు ప్రారంభానికి ముందే డబ్బాను ధ్వంసం చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా డబ్బా ఏర్పాటు చేసి తమపై దాడికి యత్నించాడని సర్పంచ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్ఐ విఠల్ గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వాంగ్మూలాలు నమోదు చేసి ఘటనా స్థలిని పరిశీలించారు. దర్యా ప్తు అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట: సీఎం రేవంత్రెడ్డికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ దుద్యాల, బొంరాస్పేట మండలాల నాయకులతో కలిసి పాత పోలీసు స్టేషన్ నుంచి భూలక్ష్మి చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యేల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, తనకు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం చుట్టుకుందని విమర్శించారు. సీఎం వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై నిర్భందాలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే ప్రజలు మిమ్మల్ని రానివ్వకుండా తిరగబడే రోజులొస్తాయని హెచ్చరించారు. రేవంత్రెడ్డికి తమ అధినేత కేసీఆర్ను ప్రశ్నించే అర్హత లేదన్నారు. వందకోట్లు సీఎం ఫ్యామిలీకే ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. కొడంగల్ ప్రాంతంలో తన హయాంలోనే అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ప్రస్తుతం ఇళ్లు, పెన్షన్లు, ఫైరవీలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు. ● రూ.1.50 లక్షల పెట్టుబడి బూడిద ● పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు -
పవర్గ్రిడ్ కబడ్డీ టోర్నీ విజేత ఎస్ఆర్–1
మొయినాబాద్: పవర్గ్రిడ్ అంతర్ ప్రాంతీయ కబడ్డీ టోర్నమెంట్లో సదరన్ రీజియన్–1 (ఎస్ఆర్–1) జట్టు విజేతగా నిలిచింది. మొయినాబాద్లోని ఫైర్ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్లో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్ ప్రాంతీయ కబడ్డీ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న పవర్గ్రిడ్ ప్రాంతీయ కార్యాలయాల నుంచి క్రీడాకారులు పాల్గొని అత్యత్తమ క్రీడా నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొని హోరాహోరిగా తలపడ్డాయి. ఎస్ఆర్–1, ఎస్ఆర్–2 జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎస్ఆర్–1 జట్టు ఎస్దర్–2 జట్టుపై 38–34 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఎస్ఆర్–1 జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఎస్ఆర్–2 జట్టు రన్నరప్గా నిలువగా తృతీయ స్థానంలో కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు, నాలుగో స్థానంలో నార్తర్న్ రీజియన్–3(ఎన్ఆర్–3) జట్లు నిలిచాయి. ఉత్తమ రైడర్గా అమన్ ఠాకూర్ (కార్పొరేట్ సెంటర్), ఉత్తమ క్యాచర్గా క్లారెక్స్ (ఎస్ఆర్2), ఉత్తమ ఆల్రౌండర్గా లవన్కుమార్ (ఎస్ఆర్–1) నిలిచి బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఆర్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్, చీఫ్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ఇబ్రహీంపట్నం: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగివేసారిపోయారని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కిషన్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తిరిగిరావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తప్పుచేశామన్న భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజలను దృష్టి మళ్లించేందుకే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించాలన్న ముఖ్యమంత్రి ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శిలాఫలకాలతో కాలం వెళ్లదిస్తున్నాడే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీపీలు కృపేశ్, ఇందిర, పార్టీ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, రాజు నాయక్, బుగ్గరాములు, రమేష్గౌడ్, చీరాల రమేష్, కిషన్గౌడ్, జగదీశ్వర్, అల్వాల వెంకట్రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి -
టిప్పర్ను ఢీకొట్టిన కారు
● దంపతుల దుర్మరణం ● ఒకరి పరిస్థితి విషమం పరిగి: ముందు వెళ్తున్న సిమెంట్ టిప్పర్ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామం చింతల్చెరువు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. పూడూరు మండలంలోని గంగోనిపల్లి గ్రామానికి చెందిన మున్నూరు నర్సింలు, భార్య అంజమ్మ, తమ్ముడి కుమారుడు అభిరామ్ పనినిమిత్తం నారాయణపేట జిల్లా కోస్గికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలోని చింతల్ చెరువు ప్రాంతానికి రాగానే కారు ముందు వెళ్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగడంతో నర్సింలు అక్కడికి అక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులు అంజమ్మ. అభిరామ్ను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న అంజమ్మ మృతి చెందగా.. అభిరామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాస్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
టీఆర్పీతోనే ముస్లింలకు న్యాయం
పహాడీషరీఫ్: తెలంగాణ రాజ్యాధికారి పార్టీ (టీఆర్పీ) అధికారంలోకి వస్తే ముస్లింల వెనుకబాటును దూరం చేస్తామని ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. జల్పల్లి సర్కిల్ పరిధిలోని షాహిన్నగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జల్పల్లి కమాన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు పర్యాయాలు ఓటు వేయించుకొని మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే సబితారెడ్డి జల్పల్లి ప్రాంత అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. జల్పల్లిలో కనీస సదుపాయాలు లేక ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ దోస్తాన్ చేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పి మాట తప్పాయన్నారు. జల్పల్లి పంచాయతీ నుంచి జీహెచ్ఎంసీ వరకు రూపాంతరం చెందడం మినహా ప్రజల తలరాతలు మారలేదన్నారు. రాష్ట్ర జనాభాలో ముస్లింల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో కార్పొరేట్ శక్తులు బ్యాంక్లను లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ షర్ఫూద్దీన్ హామెద్, బాలాపూర్ మండల అధ్యక్షుడిగా మజ్హర్ అలీకి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు వనజ, ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్, ఎంపీజే అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ముజీబ్ షేక్ షోయబ్ నాయకులు మహ్మద్ గౌస్, రవూఫ్, వహీద్, నయీం, అజీం, సలీం, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న -
పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఇబ్రహీంపట్నం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కామ్రేడ్ తోడే అడివయ్య పోరాట జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ ఆదివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. అడివయ్య మనుమరాలు, బాలచందర్ కుమార్తె తోడే మానస అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలన్నారు. నాటి ప్రజల హక్కుల కోసం కామ్రేడ్స్ తోడే అడివయ్య, కృష్ణమూర్తి, కె.కోటప్ప, పి.జంగయ్య, కె. జంగారెడ్డిలాంటి యోధులు పోరాడి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు. చరిత్రను పుస్తకాల్లో చదవడంతో సరిపెట్టకుండా, నాటి యోధుల త్యాగాల స్ఫూర్తిని నేటి సామాజిక పోరాటాల్లో కొనసాగించాలన్నారు. తండ్రి చివరి కోరిక నేరవేర్చిన పిల్లలు కామ్రేడ్ తోడే అడివయ్య జీవిత చరిత్రను పుస్తకరూపంలో ప్రజలకందించాలని తపన పడి రచించిన అతని కుమారుడు తోడే బాలచందర్ అకస్మాత్తుగా మృతిచెందారు. తండ్రి బాలచందర్ చివరి కోరికను కుమార్తె తోడే మానసకుమారి, కుమారుడు డా.తోడే మదన్ పుస్తకావిష్కరణ వేడుకలను ప్రముఖుల మధ్య నిర్వహించి నెరవేర్చారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు ఝాన్సీ, సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు ప్రేమలత, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు జంగారెడ్డి, ఎ.మల్లేష్, హైకోర్టు న్యాయవాది భగవంత్రెడ్డి, రిటైర్డ్ డీసీపీ జాన్వెస్లీ, హుణనాయక్, కె.రాంరెడ్డి, టి.సత్యనారాయణ, మధుసూధన్రెడ్డి, చందునాయక్, బి.సత్తన్న, కుటుంబసభ్యులు తోడే మానస, మదన్, సీపీఐ మండల కార్యదర్శి సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి బోడ సామేల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
షాద్నగర్: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు ఆధు నిక సాంకేతికతతో కూడిన స్మార్టు కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ కార్టు ద్వారా డూప్లికేషన్కు అవకాశం లేకుండా మరింత పారదర్శకంగా సేవలు అందుతాయన్నారు. అర్హులైన ప్ర తీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్, కమిషనర్ సునీత, తహసీల్దార్ నాగయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ఖాన్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
శరవేగంగా గ్రీన్ఫీల్డ్
ఆమనగల్లు: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకు నిర్మించే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. మండలంలోని ఆకుతోటపల్లి గ్రామం నుంచి రోడ్డు పనులను ప్రారంభించారు. మూడు నాలుగు నెలలుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. దీంతో కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఆధ్వర్యంలో పనులు షురూ అయ్యాయి. ప్రస్తుతం వందమీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపడుతున్నారు. రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణాన్ని మొదటి ఫేస్లో రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు (19.20 కి.మీ), రెండో ఫేస్లో మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు (22.30 కి.మీ) రోడ్డు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు భూసేకరణ చేపట్టారు. ఇందుకోసం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలో 59 మంది రైతులకు చెందిన 83.10 ఎకరాలు, ఆమనగల్లు మున్సిపల్ పరిధిలోని సాకిబండతండాలో 26 మంది రైతులకు చెందిన 66.23 ఎకరాల భూమిని రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. కడ్తాల్లో 72.23 ఎకరాలు, ముద్విన్ గ్రామంలో 179.02 ఎకరాలు సేకరించడానికి ప్రతిపాదించారు. ఈ మేరకు అధికారులు రైతులతో పలు విడతలు చర్చించి నష్టపరిహారం నిర్ణయించారు. భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారికి దాదాపు 90 శాతం మందికి ప్రభు త్వం పరిహారం చెక్కులు అందించింది. నిరాకరించినవారికి జనరల్ అవార్డు కింద పరిహారం అందించనున్నట్లు సమాచారం. కడ్తాల్ మండలంలో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆకుతోటపల్లి నుంచి రోడ్డు ప్రారంభం వందమీటర్ల వెడల్పుతో నిర్మాణం వడివడిగా సాగుతున్న పనులు నిర్మాణం పూర్తయితే తగ్గనున్న ట్రా‘ఫికర్’ భూముల ధరలు పెరిగే అవకాశం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి నుంచి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణ పనులను ఎల్అండ్టీ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు. మూడునాలుగు నెలల క్రితమే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. మీర్ఖాన్పేట నుంచి కడ్తాల్, ఆకుతోటపల్లి మీదుగా ట్రిపుల్ ఆర్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆకుతోటపల్లి సమీపంలో క్రషర్ ఏర్పాటు చేశారు. వందమీటర్ల వెడల్పుతో నిర్మాణ పనులు చేస్తున్నారు. రేడియల్ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు, సైకిల్ట్రాక్, ఫుట్పాత్తో పాటు మెట్రో రైలు నిర్మాణానికి డిజైన్ చేయడంతో ఆ మేరకు పనులు చేపడుతున్నారు. నిర్మాణం పూర్తయితే హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గనుంది. కొన్నేళ్లుగా రియల్ఎస్టేట్ రంగం ఈ ప్రాంతంలో పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో రియల్టర్ల సందడి ప్రారంభమైంది. రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
లైట్ తీసుకున్నారు
మొయినాబాద్: సాధారణంగా ఏ వస్తువైనా పాడైతే మరమ్మతులు చేయించి మళ్లీ ఉపయోగిస్తారు. మున్సిపల్ అధికారులు మాత్రం స్క్రాప్లో పడేస్తారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని పెద్దమంగళారంలో గతంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు కొంత కాలం క్రితం పాడయ్యాయి. వాటికి మరమ్మతులు చేయించి తిరిగి వాడుకునే అవకాశం ఉన్నా అధికారులు అలా చేయలేదు. వాటిని విద్యుత్ స్తంభాల నుంచి పూర్తిగా తొలగించి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న ఓ భవనంలో స్క్రాప్ కింద పడేశారు. సుమారు వందకుపైగా లైట్లను ఇలా పడేయడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సృజనాత్మకత పెంపొందించుకోవాలి
శంకర్పల్లి: విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో ఎప్పటికప్పుడు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలపతి రావు, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన 11వ మూట్ కోర్టు పోటీలు ఆదివారంతో ముగిశాయి. కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు హాజరై చివరి రౌండ్కి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలుగా పారుల్ యూనివర్సిటీ విద్యార్థులు, రన్నరప్గా ఎస్వీకేఎం స్కూల్ ఆఫ్ లా విద్యార్థులు నిలిచారు. వీరికి అతిథులు బహుమతులు అందజేశారు. అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ.. న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఓపిక, శోధన వంటివి ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి, వాదనలు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్ గ్రూప్ చైర్పర్సన్ శోభారాణి, ఇక్ఫాయ్ లా స్కూల్ డైరెక్టర్ ప్రొ.రవి శేఖరరాజు, డైరెక్టర్ జనరల్ ప్రొ.విజయేందర్ కుమార్, మూట్ కోర్టు సొసైటీ సభ్యురాలు డా.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
వానరా.. ఇదేమి బాధరా..
కడ్తాల్: కోతుల బెడదతో మండలంలోని చల్లంపల్లి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గుంపులుగా సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి సామగ్రిని చిందవందర చేయడంతో పాటు అందిన వాటిని ఎత్తుకెళ్తున్నాయి. ఇళ్లపై.. వీధుల్లో పదుల సంఖ్యలో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక భయాందోళనకు గురవుతున్నారు. పలువురిపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి వానర మూకను అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. -
ప్రైవేటు హాస్టల్ భవనంలో షార్ట్ సర్క్యూట్
మొయినాబాద్: ప్రైవేటు హాస్టల్ భవనంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మున్సిపాలిటీలోని అజీజ్నగర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్నగర్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు కాలిపోయి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆగిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో హాస్టల్ భవనంలో సుమారు 90 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తప్పిన పెను ప్రమాదం -
కోడి పందేలు, జూదం గుట్టు రట్టు
ఇబ్రహీంపట్నం రూరల్: కోడి పందేలపై శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. పందెం రాయుళ్లను అరెస్టు చేసి నగదుతో పాటు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. మన్నెగూడ ఆర్టీఓ కార్యాలయం వెనుక భాగంలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు, జూదం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. పాత పౌల్ట్రీ ఫామ్ వేదికగా ప్రత్యేకంగా పందెం కోళ్లను పెంచుతూ పందేలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుండి పందెం రాయుళ్లను ఆహ్వానించి, వారికి భోజన వసతి కల్పించి పందేలు, పేకాట నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు, స్థల యజమాని పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.3,60,510 నగదు, 31 పందెం కోళ్లు, 146 కోడి కత్తులు, 20 స్మార్ట్ ఫోన్లు, స్కోర్ నోట్బుక్, మూడు కార్లు, మరో మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆదిభట్ల పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో శంషాబాద్ జోన్ ఇన్స్పెక్టర్ డి.కృష్ణమోహన్, ఎస్ఐలు మన్సూర్ అలీ, ఎన్.నర్సింగరావు పాల్గొన్నారు. వారిని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కేఎస్ రావు అభినందించారు. 22 మంది పందెం రాయుళ్ల అరెస్టు నగదు, పందెం కోళ్లు, వాహనాలు స్వాధీనం -
వీఐపీ రూట్.. ట్రాఫికర్
పోటీలతో క్రీడాస్ఫూర్తి.. నాదర్గుల్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పాఠశాల ప్రాంగణంలో శనివారం ఖేల్ ఖూద్–26 పోటీలు నిర్వహించారు.మొయినాబాద్: మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రధాన రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, హోటళ్ల ముందు పార్కింగ్ సరిగా లేక వాహనదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు షాపుల ఎదుట బండి కొట్లు ఏర్పాటు చేయడంతో వాహనాలను రోడ్లుపైనే నిలుపుతున్నారు. దీంతో ప్రతి రోజు మొయినాబాద్ ప్రధాన చౌరస్తాతోపాటు హిమాయత్నగర్, అజీజ్నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. హిమాయత్నగర్ చౌరస్తా నుంచి అజీజ్నగర్ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్, టైల్స్ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. దీన్ని పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం, పోలీసులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. రాంగ్ రూట్లో స్కూల్, కాలేజీ బస్సులు మొయినాబాద్తోపాటు చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల్లో ఫాంహౌస్లు, రిసార్ట్స్లు అధికంగా ఉన్నాయి. వీకెండ్స్లో చాలా మంది ఫాంహౌస్లు, రిసార్ట్స్లకు, అనంతగిరికి వెళ్తుండడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సైతం ఉదయం, సాయంత్రం స్కూల్, కళాశాలల బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. స్కూల్, కళాశాలల బస్సులు రాంగ్రూట్లో వెళ్తూ ట్రాఫిక్ అంతరాయానికి ఓ కారణమవుతున్నాయి. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. మున్సిపల్ అధికారులు వీటిపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారనే అపవాదు ఉంది. దీంతో రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, వ్యాపార సముదాయాల ఎదుట ఖాళీ స్థలం ఎంత ఉంది. పార్కింగ్ స్థలం ఉందా అనే విషయాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ఎదుట స్థలాన్ని కబ్జాచేసి వాటిలో బండికొట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వారి వద్ద రోజు లెక్క అద్దె వసూలు చేస్తూ లక్షలు దండుకుంటున్నారు. షాపుల ఎదుట అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. వీఐపీ రూట్.. అయినా మారని పరిస్థితి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిని వీఐపీ మూవ్మెంట్ రూట్గా ప్రకటించారు. సీఎం కొడంగల్ వెళ్లాలంటే ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తన నియోజకవర్గం వికారాబాద్కు వెళ్లేందుకు ఇదే మార్గం. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికారాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే పోలీసులు వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించారు. కానీ అందుకు తగినట్లు చర్యలు తీసుకోవడం లేదు. ఫొటోలు తీసి ఛలాన్లు మొయినాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఫోటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నా క్లియర్ చేయకుండా రోడ్డుపక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ఎదుట పార్కింగ్ స్థలం లేక రోడ్డుపక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి ఫైన్లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. వీకెండ్స్లో విపరీతం హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ అంతరాయం పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపైనే పార్కింగ్ ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు మొయినాబాద్లో షాపుల ఎదుట సామగ్రి పెట్టినా, బండికొట్లు పెట్టినా వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు తెలిపాం. అలా పెట్టినవారికి చలాన్లు వేస్తున్నాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్ సమస్య వస్తోంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సతీశ్, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ కన్వెన్షన్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి అజీజ్నగర్ చౌరస్తా వద్ద అంతరాయం కారణంగా అరగంట పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. మొయినాబాద్ నుంచి అప్పా జంక్షన్ వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం. సాధారణ రోజులో కేవలం పది నిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ శని, ఆదివారం వచ్చిందంటే సుమారు అరగంటకు పైగా సమయం పడుతుంది. ఇదీ మొయినాబాద్లో ట్రాఫిక్ పరిస్థితి. -
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్వైన్ఫ్లూ.. డెంగీ జ్వరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. కోవిడ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటున్న జిల్లా వాసులకు తాజాగా ఫ్లూ ఫియర్ పట్టుకుంది. పూర్తిగా మాయమై పోయిందనుకున్న ఈ స్వైన్ఫ్లూ వైరస్ మళ్లీ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో జూలైలో రెండు స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, ఆగస్టులో ఏకంగా 26 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2009లో హైదరాబాద్లో మొదటి సారిగా ‘హెచ్1 ఎన్1’అనే ‘ఇన్ఫ్లూయెంజా–ఎ’వైరస్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పెద్ద సంఖ్యలో స్వైన్ఫ్లూ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ప్రతీ రెండేళ్లకోసారి వైరస్ కొత్తగా రూపాంతరం చెందుతోంది. 2017కు ముందు ‘కాలిఫోర్నియా స్ట్రెయిన్’గా వ్యాప్తిలో ఉన్న వైరస్ రెండేళ్ల కిందట ‘మిషిగాన్ స్ట్రెయిన్’గా కొత్త అవతారమెత్తింది. 2015–2019 మధ్య కాలంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత వైరస్ కొంత తగ్గుముఖం పడుతూ వచ్చింది. గత ఆరేళ్లుగా ఆనవాళ్లు పెద్దగా కనింపచలేదు. తాజాగా 2026 జూలై, ఆగస్టు మాసాల్లో మళ్లీ స్వైర విహారం చేస్తోంది. ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తూ, సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నెలలో 132 డెంగీ కేసులు ఎల్నినో కారణంగా ప్రస్తుతం వర్షాలు కూడా లేవు. ఇంటి ఆవరణలోని పూల కుండీలు, వాటర్ ట్యాంకులు, ఇంటిపై ఉన్న టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ డబ్బాల్లోనూ నీరు కూడా నిల్వ లేదు. కానీ డెంగీ దోమలు మాత్రం విజృంభిస్తున్నాయి. బస్తీలు, కాలనీలు, శివార్లు తేడా లేకుండా ఇటీవల ఆయా ప్రాంతాల్లో కొత్తగా అనేక బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటి కింద ఉన్న నీళ్ల ట్యాంకులపై మూతలు లేక పోవడం, క్యూరింగ్ కోసం వాడిన నీరు రోజుల తరబడి నిల్వ ఉంచుతుండడం వల్ల నేడవి డెంగీ(టైగర్)దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఆ పక్కనే ఉన్న సిటిజన్లపై పగటిపూట తమ పంజా విసురుతున్నాయి. ఫలితంగా జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 77 డెంగీ కేసులు మాత్రమే నమోదు కాగా, కేవలం ఒక్క ఆగస్టులోనే 132 కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డెంగీ జ్వరాలను సకాలంలో గుర్తించకపోవడం, చికిత్సను జాప్యం చేయడంతో రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయి రోగనిరోధక శక్తి తగ్గుతోంది. మనిషి రక్తంలో 1.50 లక్షల–4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. జ్వరపీడితుల్లో ఈ కౌంట్ తగ్గుతుంది. ప్రస్తుతం ఆస్పత్రులకు వస్తున్న చాలా మంది రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్ 40వేల లోపే ఉంటోంది. వాస్తవానికి 25 వేల వరకున్న పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఒకవేళ కౌంట్ 20 వేలకు పడిపోయి నోరు, ముక్కు నుంచి బ్లీడింగ్ అయితే వెంటనే ప్లేట్లెట్స్ పునరుద్ధరించాలి. లేదంటే షాక్కు గురై కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంది. మళ్లీ విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ, డెంగీ జిల్లాలో 26 ఫ్లూ, 209 డెంగీ కేసులు ఆగస్టులోనే 132 డెంగీ ఫీవర్స్ చాపకింది నీరులా సీజనల్ వ్యాధులు -
టూరిస్ట్ సీఎంను నమ్ముకుంటే ప్రయోజనం శూన్యం
హుడాకాంప్లెక్స్: టూరిస్ట్ సీఎంను నమ్ముకుంటే ప్రయోజనం శూన్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్నగర్ డివిజన్ కొత్తపేట చౌరస్తా నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టు వరకు యువజన నాయకులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదని అన్నారు. స్వయాన సీఎం విద్యా శాఖ మంత్రి అయి ఉండి కూడా పాలిటెక్నిక్ విద్యార్థులపై నిరంకుశంగా వ్యవరిస్తునారని దుయ్యబట్టారు. తక్షణమే వీరి సమస్యను ప్రభుత్వం పరిష్కారించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ నగర్లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, బీఆర్ఎస్ నాయకుడు దర్పల్లి అశోక్, యువజన నాయకులు కొండల్ రెడ్డి, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
శంకర్పల్లి: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కొండకల్ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. శనివారం ఉదయం 11.30కి హైదరాబాద్–వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్ను హుస్సేన్ సాగర్ రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి(25) మృతి చెందాడు. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు వికారాబాద్ రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని వికారాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత
● ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ● జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత ఇబ్రహీంపట్నం: విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే నిర్మాణ ప్రక్రియ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం శేరిగూడలోని ఇందు కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్మయి తదితరులు జిల్లా స్థాయిలో ఎంపికై న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కొంతమంది డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని...అలాంటి వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశ భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, ఆ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల విద్యాధికారులు, ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కార్యకర్తలే నా బలం
కొడంగల్/బొంరాస్పేట/వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తమ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలే తనకు బలమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వారి సహకారం.. అండ దండలతోనే తనకు ఈ పదవి, హోదా దక్కిందని పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు తొలగించడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తడి బట్టతో గొంతు కోసినట్లు ఓట్లను తొలగించి పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పేద వాడికీ ఓటు హక్కు ఉండాలన్నారు. ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే బాధ్యత తనపై ఉందన్నారు. కొడంగల్లో మాత్రమే ప్రతి కార్యకర్త ఒక రేవంత్రెడ్డిగా భావించి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. దేశ స్థాయిలో కొడంగల్కు గుర్తింపు వచ్చిందంటే అది మీ వల్లే సాధ్యమైందని కార్యకర్తలకు సూచించారు. కొడంగల్లో 81 వేల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. పేర్లలో తప్పులు, అడ్రసులో మార్పులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నోటీసులు ఇచ్చారని అన్నారు. వాటిని సరి చేయించి ఓటును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నా రు. ఇది పేదల సమస్య. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు తొలగించడానికి కుట్రలు జరుగుతున్నాయని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పేద వాడికి ఓటు హక్కు కల్పించాలన్నారు. కొడంగల్లో 35వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు చెప్పారు. ఓట్లను కాపాడుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్నారు. లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇంటింటికి వెళ్లి సర్లో పేర్లు నమోదు చేయించాలన్నారు. ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా పోతాయని హెచ్చరించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసి కొడంగల్ను ముందు వరుసలో నిలబెట్టాలన్నారు. కొడంగల్ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. మళ్లీ కొడంగల్పై కక్ష కట్టి సర్లో ఓట్ల తొలగించడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి సహకారంతోనే పదవి, హోదా -
పోటీలతో క్రీడాస్ఫూర్తి పెంపు
బడంగ్పేట్: నాదర్గుల్లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పాఠశాల ప్రాంగణంలో శనివారం దక్షిణ మధ్య క్షేత్ర సమితి ఖేల్ ఖూద్–26 క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీబీఎస్ఈ బోర్డు డిప్యూటీ కార్యదర్శి జంగం సునీల్కుమార్, ఇస్రో పూర్వ సైంటిస్ట్ పద్మశ్రీ జ్ఞానగాంధీ, వనమాలి ఆర్గానిక్ డైరెక్టర్ రాజయ్య, మాజీ ఐఏఎస్ ఉమామహేశ్వర్రావు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరస్వతి విద్యాపీఠం పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు తొలుత అతిథులకు గౌరవ వందనం చేశారు. అనంతరం అతిథులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆటల పోటీలు ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘటన తెలంగాణ కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు, సరస్వతి విద్యాపీఠం తెలంగాణ కార్యదర్శి అనఘా వెంకటలక్ష్మి, క్రీడల ప్రముఖ్ సత్యనారాయణ, విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్ కాసోజు భూషన్, వీబీవీకే పాఠశాల అధ్యక్షుడు రమేష్గుప్తా, ఉపాధ్యక్షుడు బస్సు సుధాకర్రెడ్డి, కార్యదర్శి విష్ణువర్థన్రాజు, కృష్ణారెడ్డి, కోశాధికారి కొండ కల్యాణ్, సభ్యులు సునీత, వెంకటేశ్వర్రావు, పాఠశాల ప్రిన్సిపాల్ కరణాకర్ తదితరులున్నారు. సీబీఎస్ఈ బోర్డు డిప్యూటీ కార్యదర్శి సునీల్కుమార్ -
చేవెళ్ల అభివృద్ధికి సహకారం
చేవెళ్ల: చేవెళ్ల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం ఆయన వికారాబాద్ జిల్లాకు వెళ్తూ మార్గమధ్యలో చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతావెంకట్రెడ్డి ఇంటి వద్ద కాసేపు ఆగారు. ఆయనకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేవెళ్ల అభివృద్ధి, నిధులు, ఎన్హెచ్–163 రోడ్డు పనుల పురోగతిపై చర్చించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారాని చర్యలు తీసుకుంటాన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ ద్వారా విద్యాభివృద్ధికి సహకారం అందిస్తానని చెప్పారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు శైలజరెడ్డి, ఎం.శ్రీనివాస్, కృష్ణానాయక్, గోపాల్రెడ్డి, కళ్యాణి, మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.బాల్రాజ్, నాయకులు ఆగిరెడ్డి, వసంతం, ఎం.యాదగిరి, శ్రీను, కర్నె శివప్రసాద్, ఖదీర్పాషా, తదితరులు ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
‘చేయూత’ దరఖాస్తు గడువు పెంపు
కలెక్టర్ నారాయణరెడ్డి తుక్కుగూడ: చేయూత పెన్షన్ దరఖాస్తు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన ట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు గడువులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. ఒంటరి మహిళ పెన్షన్ కోసం తహసీల్దార్, ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్, లోకల్ ఎంకై ్వరీ రిపోర్టు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. వితంతు పెన్షన్ దరఖాస్తుదారులు భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ వివరాలు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దివ్యాంగులు సదరం పత్రాన్ని దరఖాస్తు సమయంలో జత చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో పెన్షన్ వచ్చి, పలు కారణాల వల్ల నిలిచిపోయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కల్లుగీత కార్మికులు తప్పకుండా ఎకై ్సజ్ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నారు. చేనేత కార్మికులు ఏ.డీ హ్యండ్లూమ్స్ శాఖ అధికారులు ఇచ్చిన కార్డును ఇవ్వాలన్నారు. దరఖాస్తు సమయంలో సందేహాలు ఉంటే 92475 24051 నంబర్లో సంప్రదించాలన్నారు. డిప్యూటీ సీఎంను కోరిన చేవెళ్ల ఎమ్మెల్యే షాబాద్: బడుగుల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రె స్ ప్రభుత్వ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం ఆయన సర్ధార్నగర్ ఏఎంసీ చైర్మన్ సురేందర్రెడ్డితో కలిసి సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల అభివృద్ధి పనులుకు నిధులు మంజూరు చేయాలని చెప్పారు. ఏట్ల ఎర్రవల్లి చిన్న వాగు బ్రిడ్జికి నిధులు సరిపోక పనులు మధ్యలోనే ఆగిపోయాయని దాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై దురుసుగా ప్రవర్తించిన యువకుడు మొయినాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్ చౌరస్తా వద్ద శనివారం ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ్ ఈ పరీక్షలను పర్యవేక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పది మందిని పట్టుకుని కేసు నమోదు చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనికోసం వచ్చిన ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీశ్ను నెట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. అతని తరపున ఓ కౌన్సిలర్ వచ్చి యువకుడిని తీసుకెళ్లి పోయాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను నెట్టివేసి దురుసుగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేయకుండా వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ షాద్నగర్ రూరల్: పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ సమక్షంలో హౌసింగ్ కార్పొరేషన్ రిటైర్డ్ ఏఈ బాలయ్య పార్టీలో చేరారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల్లో బహుజనులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. సబ్బండ వర్గాలకు సమన్యాయం బీఎస్పీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింలు, కుమార్, మహేందర్, చెన్నయ్య, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు. -
78 రోజులకు తీవ్ర జ్వరం
ఈడిన్ ఈజిఫ్టై(టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాల(ప్లేట్స్లెట్స్) సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. తాగునీటి ట్యాంకులపై మూతలు పెట్టడం, చెట్లపొదలను శుభ్రం చేయడం, పూల కుండీల్లో నీటినిల్వ లేకుండా చేయడం ద్వారా డెంగీ దోమలను దరి చేరకుండా చూడొచ్చు. జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న వారికి వైద్య పరీక్షలు సహా అన్ని రకాల మందులు అందజేస్తున్నాం. ప్రైవేటుకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందిపడటం కంటే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించి, సకాలంలో చికిత్సలు పొందడం ఉత్తమం. – డాక్టర్ డి.స్వర్ణకుమారి, డీఎంహెచ్ఓ -
మూడు రోజులకు మించితే..
సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు సహా కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ భారిన పడే అవకాశాలు ఎక్కువ. సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. అయితే స్వైన్ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. మూడు రోజులు కంటే ఎక్కువ వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడుదు. – డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, మహేశ్వరం మెడికల్ కాలేజీ -
చిలుకూరులో కృష్ణాష్టమి వేడుకలు
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏడాది శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని చిలుకూరులో నవమి రోజు వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగా శనివారం స్వామివారిని ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయం ముందు ఉట్టి కొట్టారు. ఆలయ అర్చకుడు రంగరాజన్ కృష్ణాష్టమి విశిష్టతను భక్తులకు వివరించారు. వేడుకల్లో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి, మాజీ సర్పంచ్ సంగెరి మల్లేశ్, కౌన్సిలర్ జగపతి, నాయకులు జనార్ధన్రెడ్డి, యాదగిరి, నర్సింహగౌడ్, రాజేశ్, అర్చకులు పాల్గొన్నారు. -
‘లక్ష్మీదేవిపల్లి’ డీపీఆర్ విడుదల చేయాలి
షాద్నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లిలో నిర్మించే రిజర్వాయర్కు సంబంధించిన డీపీఆర్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) రాష్ట్ర కోశాధికారి టీజీ శ్రీనివాస్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుమలయ్య డిమాండ్ చేశారు. శనివారం వారు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ఉద్యమ సమంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ను మార్చి జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్ను రూపొందించారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చివరిదైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం, భూసేకరణకు నోటీఫికేషన్ జారీ చేయడం హర్షనీయమని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలన్నారు. ఈ రిజర్వాయర్తో ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలియజెప్పాల్సిన భాద్యత ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినబాక ప్రభాకర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు అర్జునప్ప, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీందర్ పాల్గొన్నారు. టీవీవీ రాష్ట్ర కోశాధికారి టీజీ శ్రీనివాస్ -
● కళాత్మక బోధన
బొంరాస్పేట: కళాత్మక బోధనతో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొదిస్తున్న వడిచర్ల ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం నరేందర్గౌడ్ 2025లో తెలంగాణ నుంచి సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ అనే జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఢిల్లీలోని భారత్ భవన్లో ప్రత్యేక శిక్షణపొందారు. మండల, జిల్లా స్థాయిల్లోని సమావేశాలు, ఆదర్శ బోధన తరగతులు, కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక గుర్తింపుతో ఉపాధ్యాయుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ధన అభ్యసన సామర్థ్యాలు పెంచింది. విద్యార్థులు చురుకుగా మారారు. -
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు
కేశంపేట: స్థానిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న విద్యావతి ఉత్తమ జీహెచ్ఎంగా, పాపిరెడ్డిగూడ, కొత్తపేట, నిర్ధవెళ్లి హైస్కూళ్లలో పనిచేస్తున్న ఆనంద్బాబు, హారతి, కరుణాకర్గౌడ్, కేశంపేట, పాపిరెడ్డిగూడ, మంగళిగూడ, కేశంపేట, అల్వాల ప్రాథమిక పాఠశాలలకు చెందిన అప్పారావు, అరుణ, లక్ష్మీశిరీష, అపర్ణ, శ్రీధర్ పురస్కారాలకు ఎంపికయ్యారు. శనివారం మధ్యాహ్నం శ్రీ హిందు ఇంజనీరింగ్ కళాశాల మంగళ్పల్లి, ఇబ్రహీంపట్నం వద్ద పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. -
గంజాయి పట్టివేత
ఒకరి అరెస్టు ఆమనగల్లు: తలకొండపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శుక్రవారం 1.245 కిలోగ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తలకొండపల్లి బస్టాండ్ వద్ద గంజాయి సరఫరా జరుగుతుందని అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా ఓ వ్యక్తి కవర్ పట్టుకుని రావడంతో అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు. అతడి నుంచి 1.245 కిలో గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నగరంలోని మంగళ్హాట్కు చెందిన రాజన్సింగ్గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజన్సింగ్ను అరెస్టు చేశారు. గంజాయిని దూల్పేటకు చెందిన అంగోరిబాయి నుంచి కొనుగోలు చేశాడని ఎస్ఐ తెలిపారు. తనిఖీల్లో హెడ్కానిస్టేబుల్ హిమవంతరావ్, కానిస్టేబుల్ జాషువ, రమేశ్, కురుమయ్య, బానుప్రకాశ్, సంజీవరెడ్డి ఉన్నారు. -
● మొయినాబాద్ మండలంలో ఆరుగురు
మొయినాబాద్ రూరల్: మొయినాబాద్ మండలం నుంచి కనకమామిడి పాఠశాలలో పనిచేస్తున్న సంగీత, నదీమ్నగర్ కేజీబీవీలో పని చేస్తున్న ఉదయశ్రీ, శ్రీరామ్నగర్ పాఠశాల టీచర్ స్వర్ణలత, ఎం.సులోచన మేడిపల్లి ప్రాథమిక, జి.మంజుల తోల్కట్ట ఉన్నత, నాగిరెడ్డిగూడలో పనిచేస్తున్న టి.మహేష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మున్సిపల్ పరిధిలో ఇద్దరుమొయినాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీలో ఇద్దరు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో హిమాయత్నగర్ మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, అజీజ్నగర్ ఉన్నత పాఠశాలకు చెందిన పి.బాలమణి ఉన్నారు. -
● కందుకూరు నుంచి 13 మంది
కందుకూరు: మండల పరిధిలోని 13 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో వి.అంజయ్య(కందుకూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం), ఓ.శ్రీనివాస్శర్మ(నేదునూరు ఉన్నత హెచ్ఎం), జి.సంజీవరెడ్డి(ఆకులమైలారం ఉన్నత), ఎన్.కల్పనగౌడ్(రాచులూరు జెడ్పీహెచ్ఎస్), కె.శ్రీధర్, కె.హరిప్రసాద్(మీర్ఖాన్పేట ఉన్నత), వై.శ్రీనివాస్రావు(లేమూరు ఉన్నత), కె.వెంకటరమణ, ఎల్.శేఖర్(నేదునూరు మోడల్), బి.సువర్ణ(కందుకూరు ఎంపీపీఎస్), సీహెచ్ కళావతి(ఎంపీపీఎస్ పులిమామిడి), ఎస్.నజీర్హుస్సేన్(దాసర్లపల్లి యూపీఎస్), డి.రంగనాథ్(మాదాపూర్ యూపీఎస్) ఉన్నారు. -
ఆత్మహత్య చేసుకుంటానని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
సకాలంలో స్పందించి యువకుడిని కాపాడిన పోలీసులు యాచారం: ప్రేమ విఫలమై తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. సాంకేతిక పరిజ్ఞానంతో స్పందించిన పోలీసులు అతడిని కాపాడారు. వివరాలివీ.. మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామానికి చెందిన చేపంగి కిషోర్ (23) బోనాల పండుగ సందర్భంగా గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని తన మేనమామ గ్రామమైన ముచ్చర్లకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. ఇది గుర్తించిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పోలీసులు పోస్టుపెట్టిన యువకుడు గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి, ఆ పీఎస్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అక్కడి ఎస్ఐ సైదులు సిబ్బందితో కలిసి కిషోర్ ఉన్న స్థలం వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ప్రేమలో విఫలం కావడంతోనే మనస్తాపానికి గురై చనిపోవాలనుకున్నట్లు తెలిపాడు. కిషోర్తో పాటు అతడి కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు. -
కేటీఆర్ను కలిసిన నేతలు
నిందితులిద్దరూ తండ్రీకొడుకులు ఇబ్రహీంపట్నం రూరల్: సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో హుండీ దొంగిలించిన దొంగలను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ రమేష్ కథనం ప్రకారం.. కాలీవాల రోహిత్ (28), కాలీవాల సోమ్రాజ్ (60) తండ్రీకొడుకులు. అల్లం వెల్లుల్లి, పండ్ల వ్యాపారం చేస్తూ లాల్దర్వాజ సమీపంలో నివసిస్తున్నారు. గత నెల 26న సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో నగదుతో పాటు హుండీని దొంగిలించారు. దర్యాప్తు చేపట్టిన ఆదిభట్ల క్రైం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారించారు. బొంగ్లూర్ సమీపంలో తిరుగుతుండగా క్రైం ఎస్ఐ నోయల్రాజ్ బృందం ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వీరి నుంచి టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం, రూ.12,120 నగదు స్వాధీనం చేసుకున్నారు. రోహిత్పై గతంలో పలు దేవాలయాల్లో 17కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ నోయల్రాజ్, హెడ్కానిస్టేబుల్ రవికుమార్, సిబ్బంది కిరణ్రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్, శివ చంద్ర, సంతోష్, సందీప్, భరత్ను సీఐ అభినందించారు. అనంతగిరి: అత్వెల్లికి చెందిన రోజువారీ కూలీ మొగులయ్య(35) మద్యానికి బానిసై గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని వికారాబాద్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
కావాలి సారూ.. మీవంటి వారు
పూడూరు: సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపే శక్తి వీరికి మాత్రమే సాధ్యం. ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్ది అనేక అవార్డులు అందుకున్న వారిలో పూడూరు మండలం కంకల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఈశ్వర్రావు ఒకరు. ఎక్కడ పని చేసినా తనకంటూ ప్రత్యేకతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాతల సహకారంతో స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతూ, నూతన ఒరవడితో బోధన చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాను మొదటిసారి ఉద్యోగంలో చేరిన వీరన్నపేట్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉండగా, దాతల చేయూతతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వైటెక్ సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, కళావేదికల నిర్మాణం, స్పోర్ట్స్ మెటీరియల్, స్మార్ట్ టీవీలు అందించడంలో కీలకపాత్ర పోషించారు. కరోనా సమయంలో రంగారెడ్డి జిల్లా స్థాయిలో ఆన్లైన్ తరగతులు బోధించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కంకల్ పాఠాశాలలో విద్యార్థుల సంఖ్యను 119 నుంచి 157కు పెంచడంలో తోటి ఉపాధ్యాయులతో కలిసి తీవ్రంగా శ్రమించారు. మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్గా నిరంతర సేవలు అందిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు సమాజానికి ఎంతో అవసరం. అందుకున్న అవార్డులు.. ● మండలస్థాయి అవార్డు 2019 ● మనం మన ఊరి బడి రాష్ట్రస్థాయి అవార్డు 2021 ● డాక్టర్ ఎన్టీఆర్ జాతీయ కీర్తి పురస్కారం 2022 ● రాష్ట్రస్థాయి ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేటర్ అవార్డు 2022 ● ఆచార్యదేవోభవ జాతీయ అవార్డు 2022 ● బెస్ట్ అకడమిక్ రిసోర్స్ టీచర్ అవార్డు 2022 ● అబ్దుల్ కలాం నేషనల్ లెవెల్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు 2022 ● గురుస్పందన అవార్డు 2023 ● గుజరాత్ మంథన్ శిక్షక్ పురస్కారం 2023 ● వికారాబాద్ జిల్లాస్థాయి అవార్డు 2025 ● బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్గా ఢిల్లీకి ఎంపిక 2025 ● టీఎల్ఎం మేళాలో మండల, జిల్లా స్థాయి ప్రథమ పురస్కారాలు ● అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీంలో చోటు -
సంతోషంగా ఉంది
జిల్లా స్థాయి ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. విద్యార్థుల్లోని క్రీడా సామర్థ్యాలను వెలికి తీసి, ప్రోత్సహించా. పలువురు కబడ్డీ, వాలీబాల్ రాష్ట్ర స్థాయిలో సత్తాచాటారు. – వెంకటేశ్, పీడీ, ముద్వీన్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా స్థాయి అవార్డుతో బాధ్యత పెరిగింది. 25 ఏళ్ల ఉపాధ్యాయ జీవిత ప్రయాణాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు. తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఉన్నతికి నా వంతు కృషిచేస్తా. – మంజుల, రావిచేడ్ జెడ్పీహెచ్ఎస్ -
స్టెరాయిడ్స్ విక్రయిస్తుండగా ఇద్దరి అరెస్టు
చందానగర్: అక్రమంగా స్టెరాయిడ్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ శివాజీనగర్లో నివాసముండే సారా సాయిరాం(39) మెడికల్ రిప్రజెంటేటివ్. చందానగర్లోని శాంతినగర్కు చెందిన కుంచల రవీంద్ర (25) జిమ్ ట్రైనర్. సాయిరాం తరచూ హిమాచల్ ప్రదేశ్ నుంచి స్టెరాయిడ్స్ తీసుకువచ్చి రవీంద్రకు విక్రయించేవాడు. వాటిని జిమ్కు వచ్చే కస్టమర్లకు రవీంద్ర విక్రయించేవాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున చందానగర్ పీజేఆర్ స్టేడియం పక్కన స్టెరాయిడ్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్సీపురం ఎస్ఓటీ, చందానగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. సుమారు రూ.1,02,150 విలువ చేసే 10 మిల్లిలీటర్ల 227 ఇంజక్షన్లు, వైద్య బిల్లులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని చందానగర్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను రిమాండ్కు తరలించారు. 1.02 లక్షల విలువ చేసే ఇంజక్షన్ల స్వాధీనం -
సీపీఎస్ను రద్దు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ యశ్వంత్, కన్వీనర్ డాక్టర్ రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు దాటవేసే ధోరణి అవలంబిస్తోందని, ఇది సరికాదన్నారు. రాష్ట్ర ఉద్యోగ జేఏసీ కార్యాచరణలో భాగంగా 10న నిర్వహించే ‘చలో హైదరాబాద్’ను జిల్లా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ శ్రీనేష్కుమార్ నోరీ, కో చైర్మన్ గోపాల్, ప్రవీణ్, శాంతిశ్రీ, సుధాకర్, రాజేష్, బల్వంత్రెడ్డి, వైస్ చైర్మన్లు నూతనకంటి వెంకట్, సైదమ్మ, రాకేష్, మాధవ్, మహేశ్, ప్రమీల, వెంకటప్ప, పాండు, జగన్నాథ్ శర్మ, అరుణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ది అరాచక పాలన
మొయినాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ మంగళవారం మొయినాబాద్లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ మోసాలను ఎండగడుతుంటే తట్టుకోలేని ఆ పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. దీనిపై మరింత అవగాహన పెంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, సీనియర్ నాయకుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్ జగపతి, నాయకులు ప్రభాకర్రెడ్డి, నీలకంఠం, సుధాకర్రెడ్డి, రవీందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
ఖర్గేను కలిసిన స్పీకర్
అనంతగిరి: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మంగళవారం రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ కమిటీ హాల్లో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ సన్నాహక సమావేశం కోసం స్పీకర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట ఓఎస్డీ వెంకటేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెం మైపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి మేడ్చల్: ఔటర్ రింగు రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని మరో లారీ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైన్నె నుంచి హైదరాబాద్లోని మియాపూర్కు ప్లైవుడ్ లోడ్తో వెళ్తున్న లారీని డ్రైవర్ కండ్లకోయ వద్ద సర్వీసు రోడ్డుపై నిలిపి ఉంచారు. చిరుజల్లులు రావడంతో బిహార్కు చెందిన డ్రైవర్ బిహరీ రాయ్(35) లారీపైకెక్కి టార్పాలిన్ కవర్లు కప్పుతున్నాడు. అదే సమయంలో కీసర నుంచి తెల్లాపూర్ వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొనడంతో బిహారిరాయ్ కింద పడి తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు
సిటీ కోర్టులు: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం అందజేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పాటిగూడ గ్రామానికి చెందిన బాలిక డిసెంబర్ 14న పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లి, సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. తమ కుమార్తె అదృశ్యం వెనుక అదే గ్రామానికి చెందిన చందు అనే వ్యక్తి ఉన్నాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 2018 డిసెంబర్ 15న చందు అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ భిక్షపతిగౌడ్ వాదనలు వినిపించారు. నేరానికి పాల్పడినట్లు రుజువుకావడంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. -
8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
రాజేంద్రనగర్: స్కూలుకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్న ఓ విద్యార్థి ఉరేసుకున్నాడు. రాజేంద్రనగర్ ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్నగర్ జిల్లా గోపాలపేట మండలానికి చెందిన పి.మోహన్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. నగరానికి వలస వచ్చి రాజేంద్రనగర్ బన్సీలాల్నగర్లో నివసిస్తున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో కుమారుడు పి.ప్రశాంత్(14) 8వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు ప్రతిరోజు వెళ్లి బుద్ధిగా చదువుకోవాలని ప్రశాంత్ను తల్లి మందలించడంతో రెండు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. రెండురోజుల అనంతరం కుటుంబసభ్యులు వెతికి పట్టుకొచ్చారు. అప్పటి నుంచి ప్రశాంత్ ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో మోహన్ ఇంటికి రాగా తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ప్రశాంత్ విగతజీవిగా కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురికీ తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
తాండూరు రూరల్: జీవితంపై విరక్తిచెంది ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. మృతుడు తాండూరు మండలం అంతారం వాసిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొర్ర నాగప్ప (35) భార్యాపిల్లలతో కలిసి బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద నివాసముంటున్నాడు. సోమవారం సాయంత్రం బేగంపేట్ స్టేషన్ సమీపంలో రైలు వస్తుండగా, కింద పడ్డాడు. మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు సాయంతో రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. కుత్బుల్లాపూర్: మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.9 కిలోల ఆల్ఫాజోలమ్, కారు, బైక్, రూ. 40 వేల నగదుతోపాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు కామారెడ్డికి చెందిన మాజీ ఎకై ్సజ్ కానిస్టేబుల్ నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. కామారెడ్డి జిల్లాకు చెందిన గొల్ల రమేష్ గతంలో ఎకై ్సజ్ కానిస్టేబుల్గా పనిచేశాడు. ఆ తర్వాత అతను కల్లు వ్యాపారి నాతి చంద్రాగౌడ్, డ్రైవర్లు సందిళ కృష్ణ, కుమ్మరి సాయిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కుచి విశ్వనాథంతో కలిసి ముఠా ఏర్పాటు చేసి కొంతకాలంగా మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తూ నగరంలో విక్రయిస్తున్నాడు. గత 31న కొంపల్లి జయభైరి పార్కు వద్ద ముగ్గురు అల్ఫాజోలమ్ విక్రయించేందుకు వస్తున్నారని సమాచారం అందడంతో పేట్బషీరాబాద్ ఎస్ఐ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసి కృష్ణ, సాయిలు, విశ్వనాథంలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గొల్ల రమేష్, చంద్రాగౌడ్లను కూడా అరెస్టు చేశారు. నిందితులను మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.● ఇద్దరు ఏపీ రైతుల అరెస్టు అమీర్పేట: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎస్ఆర్నగర్లో విక్రయించేందుకు తీసుకువచ్చిన రూ.21.37 లక్షల విలువ చేసే హష్ ఆయిల్ను పోలీసులు పట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు చినబులుడు గ్రామ నివాసి పొద్దు మోహన్రావు (41) డుంబ్రిగుడ మండలం పాతలంటి గ్రామానికి చెందిన టి.బిస్తుదాస్(27) రైతులు. మోహన్రావు అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎంచుకున్నాడు. ఆగస్టు 30 ఒడిశాలో 1.710 లీటర్ల హష్ ఆయిల్ కొనుగోలు చేసి 31వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు బిస్తుదాస్తో కలిసి సికింద్రాబాద్కు రైలులో వచ్చారు. ఆటోలో ఎస్ఆర్నగర్కు చేరుకుని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ సమీపంలో వినియోగదారుడి కోసం వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. -
మాస్టర్ప్లాన్లో మార్పులు
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం మాస్టర్ప్లాన్లో మార్పులకూ ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న రోడ్ల మధ్య ఏర్పడిన మిస్సింగ్ లింక్లను గుర్తించి కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్డు వెడల్పుల పెంపు, అవసరమైన చోట్ల భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మంగళవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఐదు రోడ్డు అభివృద్ధి ప్రతిపాదనల్లో 595 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నిబంధనలు, చట్టాల మేరకు వాటిని సేకరించనున్నారు. ఎక్కడెక్కడ? ● బైరాగిగూడ–నార్సింగి: గ్రీన్వ్యాలీ నుంచి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వరకు 30 మీటర్ల వెడల్పుతో మిస్సింగ్ లింక్ రోడ్డు. ● బడంగ్పేట్–నాదర్గుల్: బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి రామాలయం–నాదర్గుల్ మీదుగా వెళ్లే 925 మీటర్ల మార్గాన్ని 30 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నారు. బడంగ్ మెయిన్ రోడ్ నుంచి నాదర్గుల్ రోడ్ వరకు మరో మిస్సింగ్ లింక్ 30 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి. ● తొండుపల్లి–ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్: ఎన్హెచ్–44 తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు 24, 36 మీటర్ల వెడల్పుతో రోడ్డు. ● తొర్రూరు–నాగార్జునసాగర్ రోడ్: ఇప్పటికే మాస్టర్ప్లాన్లో ఉన్న 18 మీటర్ల రోడ్డును 30 మీటర్లకు పెంచనున్నారు. ఇంజాపూర్ లేక్ నుంచి రామ్జీ చాయ్ హోటల్ వరకు మార్గంలో 135 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం రోడ్డు విస్తరణ కాదు.. మాస్టర్ప్లాన్లో మార్పులు ఈ మిస్సింగ్ లింక్ రోడ్లను మాస్టర్ప్లాన్లో చేర్చాలని, అవసరమైన చోట్ల ప్రస్తుత రోడ్డు వెడల్పులను పెంచా లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంటే శివారు ప్రాంతాల్లో భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ నెట్వర్క్ను ఇప్పుడే రీడిజైన్ చేసే ప్రక్రియ మొదలైనట్టే.మరోవైపు రోడ్ల కోసం ప్రభావితమయ్యే ఆస్తుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ముఖ్యంగా బడంగ్పేట్–తుర్కయంజాల్ మార్గంలో 216, బడంగ్పేట్–నాదర్గుల్ మార్గంలో 148, తొర్రూరు–నాగార్జునసాగర్ రోడ్డులో 135 ఆస్తులు ప్రభావితం కానుండటంతో భూసేకరణ ప్రక్రియ కీలకంగా మారనుంది. మిస్సింగ్ లింక్లకు మోక్షం శివార్లలో కొత్త రోడ్లకు రంగం సిద్ధం కసరత్తు చేపట్టిన జీహెచ్ఎంసీ -
యూఎల్సీల క్రమబద్ధీకరణ?
మిగులు స్థలాల్లో నివాసాలకు శాశ్వత పట్టాలు సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న నివాసాల స్థలాలను క్రమబద్ధీకరించి శాశ్వత హక్కులు కల్పించిన సర్కారు.. తాజాగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి కూడా అదే విధంగా క్రమబద్ధీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం ముందస్తు కసరత్తు చేస్తోంది. మహానగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని యూఎల్సీ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని లక్షలాది కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి. చాలా చోట్ల సీఎం డిక్లరేషన్న సరిగా పూర్తికాకపోవడం, సెక్షన్ 22ఎ జాబితాలో చేరడంతో క్రయవిక్రయాలు, నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం తాజాగా సమగ్ర రెగ్యులరైజేషన్ విధానం రూపొందించాలని నిర్ణయించింది. ఇది కేవలం హక్కుల కల్పనే కాకుండా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయం చేకూర్చే అవకాశం కూడా లేకపోలేదు. రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరిస్తూ విధాన రూపకల్ప నకు సిద్ధమవుతున్నారు. రెండు వేల ఎకరాలపైనే.. మహా హైదరాబాద్ పరిధిలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు సుమారు రెండు వేల ఎకరాలకు పైగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా మేడ్చల్–మల్కాజిగిరిలోనే భూమి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని భూములు ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్ నగర పరిధిలోని భూములు తక్కువగా ఉన్నా.. విలువ ఎక్కువగా ఉండటంతో వాటికి డిమాండ్ ఎక్కువైంది. జిల్లాల వారీగా వేర్వేరు స్థాయిలో సమస్యలు ఉండటంతో విధానం రూపకల్పనలో ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. యూఎల్సీ మిగులు భూముల విస్తీర్ణం రెవెన్యూ జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 50,69,215 చదరపు మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 28,46,860 చదరపు మీటర్లు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 3,83,586 చదరపు మీటర్ల స్థలాల ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం వేలాది దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వేల దరఖాస్తులకు కన్వియేన్స్డీడ్లు జారీ చేయడంతో ఖజానాకు భారీగానే జమ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 5,263 దరఖాస్తులు అందగా అందులో 4,927 పరిష్కారం కావడంతో ప్రభుత్వానికి రూ.61.61 కోట్లు రెవెన్యూ లభించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మొత్తం 11,388 అర్జీలు రాగా, అందులో 5,809 పరిష్కారం కావడంతో 408.32 కోట్ల రాబడి వచ్చింది. సమగ్ర విధానం సెక్షన్ 22ఎ జాబితాలో చేరిన భూముల కారణంగా ఏర్పడిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సర్కారు కసరత్తు చేస్తోంది. గతంలో జీవో 58, 59 ద్వారా మీసేవ ద్వారా కొన్ని స్థాయిల్లో పట్టాలు ఇచ్చినా సంపూర్ణ పరిష్కారం లభించలేదు. ప్రస్తుతం అమలులోకి రాబోతున్న ప్రత్యేక విధానంలో క్షేత్రస్థాయిలో డీటెయిల్డ్ సర్వే చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లక్షలాది ఇళ్లు పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి అసైన్డ్ భూముల తర్వాత మరో మెగా రెగ్యులరైజేషన్ -
వైభవంగా సూర్యగిరి ఎల్లమ్మ కల్యాణం
తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ 43వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాలు దాటి తమ భక్తిని చాటుకున్నారు. మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అంబోజీ శ్రీకాంత్ యాదవ్ ఇంట్లో ప్రతిష్ఠించిన అమ్మవారి ఘటాన్ని మీగడ కాశీనాథ్ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, తీగల కృష్ణారెడ్డి తదితరులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ మోహన్రావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. హాజరైన ప్రముఖులు -
పనిచేసే చోటే కుప్పకూలి మేసీ్త్ర మృతి
మొయినాబాద్: బతుకుదెరువుకోసం భార్యపిల్లతో వలస వచ్చిన ఓ మేసీ్త్ర పనిచేసే చోటే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన బుధ్రం సత్నామి (54) నెల రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి మొయినాబాద్ ప్రాంతానికి వలస వచ్చాడు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ఉన్న వనమ్ విల్లాస్లో మేస్త్రిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పనిచేస్తూ సత్నామి తల తిరుగుతోందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు చికిత్స నిమిత్తం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలిసివచ్చిన పండుగ
మహేశ్వరం: రాఖీ పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు మహేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపడంతో లాభం వచ్చిందని డిపో మేనేజర్ లక్ష్మీ సుధ తెలిపారు. డిపోలో మొత్తం 80 వరకు బస్సులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో డిపోలో ప్రతిరోజు సుమారు రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఆదాయం వచ్చేది. రక్షాబంధన్ సందర్భంగా పండుగ రోజు, మరుసటి రోజు కలిపి ఒక్కోరోజు రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చింది. రెండు రోజులకు కలిపి రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు అదనంగా ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్ తెలిపారు. -
నేడు లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేత
ఇబ్రహీంపట్నం రూరల్: ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకంలో భాగంగా బుధవారం లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఉదయం 11 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరుకానున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 278 మంది లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున అందజేస్తారని చెప్పారు. లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. పహాడీషరీఫ్: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని ఆర్జీఐఏ డివిజన్ ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్ సూచించారు. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధి హార్డ్వేర్ పార్కు ఫేజ్–1లోని అమేజాన్ కంపెనీలో మంగళవారం ఉద్యోగులకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డితో కలిసి ఏసీపీ మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకొని అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారని అన్నారు. ఆన్లైన్ ఫైనాన్షియల్ మోసాలు, ఆకర్షించే లింక్లు, సామాజిక మాధ్యమాల మోసాలు, డిజిటల్ అరెస్ట్ల పేరిట బెదిరింపులపై కనీస అవగాహన అవసరమన్నారు. ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంక్లకు సంబంధించిన పిన్, సీవీవీ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దని, అనుమానాస్పద లింక్లను ఓపెన్ చేయకుండా చూసుకోవాలన్నారు. పొరపాటున సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఐ దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: సరూర్నగర్లోని దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని మంగళవారం దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుద్ధిమాంద్యం పిల్లలకు అందిస్తున్న చికిత్స, సేవలను నోడల్ ఆఫీసర్ రమేశ్, పునరావాసకేంద్రం అధికారి అతుల్ శ్రీవాస్తవ ఆయనకు వివరించారు. కేంద్రంలో అందిస్తున్న సేవా కార్యక్రమాలపై సత్యనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. తనవంతు సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు. షాద్నగర్రూరల్: పట్టణ సమీపంలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో తెలుగుభాష అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరి రాసిన కవితకు పురస్కారం దక్కింది. నగరంలోని కోఠిలో స్థాపించిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవితలు, వ్యాసాల పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు, రచయితలు హాజరయ్యారు. పోటీల్లో రాజేశ్వరి రాసిన కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసి శ్రీకృష్ణదేవరాయ భాషానిలయం వారి ప్రత్యేక సంచికలో ముద్రించారు. విశ్రాంత ఐఏఎస్ రమణాచారి, తెలంగాణ గ్రంథాలయ కార్యదర్శి రియాజ్, పాలపిట్ట మ్యాగజిన్ సంపాదకుడు గుడిపాటి వెంకటాచలం ఆమెకు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. -
‘పట్నం’ డిపోకు అ‘ధనం’
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నండిపోకు ఒక్క రాఖీ వేడుక రోజే రూ.39.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యం డిపోకు రూ.32 లక్షలు వస్తుండగా పండుగ రోజు అదనంగా రూ.7.50 లక్షల వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణం ద్వారా రూ.25.50 లక్షలు రాగా నగదు రూపంలో సుమారు రూ.14 లక్షలు సమకూరింది. పండుగ రోజు పది సర్వీసులు ప్రత్యేకంగా తిరిగాయి. 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణించారు. మాల్ నుంచి మహాత్మగాంధీ బస్స్టేషన్, సికింద్రాబాద్ రూట్లలో ఆదాయం ఎక్కవగా వచ్చింది. రాఖీ పర్వదినం ముందు రోజు రూ.4 లక్షలు, పండుగ మరుసటి రోజు రూ.3.60 లక్షలు, సోమవారం రూ.5 లక్షలు వచ్చాయి. రాఖీతోపాటు ఆదివారం పట్నంలో బోనాల ఉత్సవాలు ఉండటంతో ఆర్టీసీకి అదనంగా ఆదాయం సమకూరింది. అదనంగా ఆదాయం రాఖీ పండుగ రోజు 1.60 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులు సుమారు లక్ష మంది ఉన్నారు. డిపోకు రూ.39.50 లక్షల ఆదాయం రాగా అదనంగా రూ.7.50 లక్షలు సమకూరింది. గత గురువారం నుంచి సోమవారం వరకు అదనంగా రూ.20 లక్షల ఆదాయం వచ్చింది. – సుజాత, డిపో మేనేజర్, ఇబ్రహీంపట్నం -
ఇంద్రసేనారెడ్డి సేవలు ఎనలేనివి
ఇబ్రహీంపట్నం: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, నిజాయతీగా వ్యవహరిస్తూ గుర్రం ఇంద్రసేనారెడ్డి రాష్ట్ర స్థాయిలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా (అబ్దుల్లాపూర్మెట్) ఉద్యోగ విరమణ చేసిన గుర్రం ఇంద్రసేనారెడ్డితోపాటు ఆయన సతీమణి శ్రీవాణిని సన్మానించి, అభినందనలు తెలుపుతూ మంగళవారం పెద్ద అంబర్పేటలోని ఓ ఫంక్షన్హాల్లో వీడ్కోలు సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 36 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఎలాంటి మచ్చ లేకుండా సమర్థవంతంగా ఇంద్రసేనారెడ్డి విధులు నిర్వర్తించారన్నారు. కుటుంబంతోపాటు సమాజంపై ప్రేమ, అనుబంధం కలిగిన ఇంద్రసేనారెడ్డితో తమకు విడదీయరాని బంధం ఉందన్నారు. విధి నిర్వహణతోపాటు సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఇకపై కూడా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువ ఉద్యోగులు ఇంద్రసేనారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, రిటైర్డ్ ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) కనకరత్నం, రామ్మోహన్రావు, ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
ఆర్టీసీకి ఫుల్ గిరాఖీ
షాద్నగర్: షాద్నగర్ డిపో నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపించారు. గత నెల 27 నుంచి 31వ తేదీ వరకు 3,03, 239 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఫలితంగా సంస్థకు రూ.1.59 కోట్లకుపైగా సమకూరింది. హైదరాబాద్, మహబూబ్నగర్ రూట్లతో పాటు పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ రూట్లలో స్పెషల్ బస్సులు నడిపి ఆదాయం గడించారు. మహాలక్ష్ముల ప్రయాణం రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక. ఈ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పండగ సందర్భంగా ఐదు రోజుల్లో సుమారు రెండు లక్షల మందికిపైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. గత నెల 28న పండగ రోజు సుమారు 45వేల మంది ప్రయాణం సాగించడంతో ఆ ఒక్కరోజే రూ.35.39 లక్షల ఆదాయం వచ్చింది. అదనపు ట్రిప్పులు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. సిబ్బంది బస్టాండ్లోనే మకాం వేసి రద్దీకి అనుగుణంగా బస్సులు నడిచేలా చర్యలు చేపట్టారు. అదనపు ట్రిప్పులను నడిపించారు. డ్రైవర్లు, కండక్టర్లు అధికారులు సిబ్బంది పండుగ రోజు సెలవులను పక్కన పెట్టి విధి నిర్వహణలో భాగస్వామ్యమై సంస్థకు ఆదాయం సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. రాఖీ వేడుక ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది.. ఐదురోజుల పాటు బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.. బస్టాండ్లలో ఎక్కడ చూసినా కిటకిటలాడుతూ కనిపించారు.. ఆయా రూట్లలో అధికారులు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపించారు.. ఖజానాకు కాసుల వర్షం కురిసింది. కాసులు కురిపించిన రక్షాబంధన్ లక్షల్లో బస్సుల్లో ప్రయాణం ఐదురోజుల పాటు కిటకిట డిపోలకు భారీగా ఆదాయం రాఖీ పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులు నడిపించాం. మూడు లక్షలకు మందికి పైగా బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా డిపోకు రూ.1.59 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. – కరుణశ్రీ, డిపో మేనేజర్, షాద్నగర్ -
షార్ట్ సర్క్యూట్తో కిరాణ దుకాణం దగ్ధం
తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కిరాణ దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల సర్కిల్ పరిధి కమ్మగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో కిరాణ దుకాణం నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం షాపు మూసి భోజనానికి వెళ్లారు. కొద్ది సేపటికే దుకాణం నుంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. వెంటనే హయత్నగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.లక్షన్నరకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడం, అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 3 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ శంకర్పల్లి: తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అయ్పప్పరెడ్డిగూడలో సరస్వతి అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గతనెల 30న ఇంటికి తాళం వేసి వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం దుర్గం చెరువుకి తన కూతురు, అల్లుడుతో కలిసి రాఖీ కట్టేందుకు వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికులు ఆమెకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి చేరుకొని దొంగతనం జరిగినట్లు గుర్తించింది. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 30 తులాల వెండి, కొంత నగదు దొంగలు అపహరించుకొని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్సాయిపై కేసు మణికొండ: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈశ్వర్సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరూ ‘బాసింగ బలాలే’ జానపద నృత్యంలో నటించి పాపులర్ అయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వసతి గృహాలు వెంటనే నిర్మించాలి
చేవెళ్ల: పట్టణంలో కళాశాల విద్యార్థులకు వసతి గృహాలను వెంటనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్లలో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్లలో వసతి గృహాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం 2018లోనే ఎస్సీ, బాలుర, బాలికల కళాశాలల వసతి గృహాలు మంజూరు చేసిందన్నారు. కానీ ఇప్పటివరకు పనులను ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహించారని వాపోయారు. మంజూరైన వసతిగృహాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తు న్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు సరైన సవతి లేక ఇబ్బందులు పడుతున్నారని, అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తుందని తెలి పారు. ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించి వెంటనే వస తిగృహాల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేసి, రోడ్డు దిగ్భందాలు భారీ నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మాల చందు, నాయకులు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన -
పిల్లల మధ్య కూర్చుని.. పాఠాలు విని
కొందుర్గు: అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థిగా మారి పిల్లల మధ్య కూర్చుని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలంలో మంగళవారం ఆమె పర్యటించారు. చౌదరిగూడ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఐదో తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయురాలు లీలామోహన్నాయక్ బోధించిన తెలుగు, మహేశ్ బోధించిన ఆంగ్లం పాఠాలు విన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్న తీరును విద్యార్థులకు వివరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న పథకాలపై సమీక్షించారు. ఆరోగ్య ఉపకేంద్రంలో ఆశా కార్యకర్తలతో మాట్లాడారు. ఆ తర్వాత ఇంద్రానగర్లో ఏర్పాటుచేసిన వీబీజీరామ్జీ గ్రామసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. కూలీలకు ఉపాధిహామీ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేసిందన్నారు. ఈ పథకం ద్వారా కూలీలకు 125 పనిదినాలు, 318 రకాల పనులు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. గ్రామసభల్లో చర్చించి ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికలు చేసుకొని అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, ఎంపీడీఓ పుష్పలత, ఎంఈఓ కిరణ్కుమార్ రెడ్డి, ఎంపీఓ హన్మంతు రెడ్డి, ఏపీడీ చరణ్గౌతమ్, ఏపీఓ నర్సింగ్రావు, ఏపీఎం హరిలాల్, ఏఈ వంశీ, ఇంద్రానగర్ సర్పంచ్ మహబూబ్బీ, హెచ్ఎం సునీత పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
● ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ● కొడంగల్, దౌల్తాబాద్లో పలు నిర్మాణాల పరిశీలన కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 4, 5 తేదీల్లో కొడంగల్లో పర్యటించనున్న నేపథ్యంలో సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మంగళవారం పట్టణంలోని ఆస్పత్రి భవనం, ఆర్అండ్బీ అతిథి గృహం, పాఠశాల భవనాలను పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం హెలిపాడ్ను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ దీపక్ తివారి, కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు. దేశానికే తలమానికం.. బొంరాస్పేట: హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూపుదిద్దుకుంటోందని సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్బాబు అన్నారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉమెన్ డిగ్రీ కాలేజీ, నర్సింగ్ హాస్టల్ను వచ్చే మార్చి వరకు పూర్తి చేయాలన్నారు. ఫిజియోథెరపీ, పారామెడికల్, నర్సింగ్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. ఇంజనీరింగ్, వెటర్నరీ కాలేజీ పనులను పరిశీలించారు. 35 ఎకరాల్లో నిర్మించే సైనిక్ స్కూల్పై ఆరా తీశారు. ఎత్తిపోతల కాల్వలకు రైతులు అంగీకరించారని, రేడియల్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అదనపు ఎస్పీ రాజేష్మీన, ఎస్ఈ విజయభాస్కర్ రెడ్డి, కేఎల్ఎస్ఆర్ సీజీఎం కృష్ణప్రసాద్, జీఎం హర్షవర్ధన్రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్రెడ్డి, తహసీల్దార్ కిషన్నాయక్, ఎంఈఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు చేయండి దౌల్తాబాద్: మండలంలో సుమారు రూ.25 కోట్లతో నిర్మిస్తున్న మహాత్మజ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతం చేసి, మార్చి నెలాఖరువరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గోకఫసల్వాద్ సమీపంలో కొనసాగుతున్న పూలే పాఠశాల, దౌల్తాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీటిని సందర్శిస్తారని తెలిపారు. అనంతరం దౌల్తాబాద్లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కానున్న దౌల్తాబాద్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట ఈడబ్ల్యూడీసీ చీఫ్ ఇంజనీర్ షఫీమియా, డీఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉసేనప్ప, నాయకులు రెడ్డిశ్రీనివాస్, భీంరెడ్డి తదితరులు ఉన్నారు. -
అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా
బంట్వారం: కేసులు పెండింగ్ పడకుండా చూడాలని వికారాబాద్ డీఎస్పీ అంజయ్య అన్నారు. సోమవారం ఆయన కోట్పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి, రికార్డులు పరిశీలించారు. శాంతి భద్రతలను కాపాడుతూనే.. నేరాలను నియంత్రించాలని సూచించారు. రాత్రి వేళ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో ధారూరు సీఐ రఘురాములు, కోట్పల్లి ఎస్ఐ శైలజ పాల్గొన్నారు. ఏజీవర్సిటీ: ఏజీవర్సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజెమెంట్ (నారమ్స్) 51వ ఫౌండేషన్ డే వేడుకలు మంగళవారం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ సుందరం తెలిపారు. ఐసీఏఆర్ ఆధ్వర్యంలో 1976లో రాజేంద్రనగర్లో ఏర్పాటైన ఈ అత్యున్నత సంస్థ, వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ, నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ బ్యాంకుల్లో లభించిన నకిలీ నోట్లపై ఆర్బీఐ ఫిర్యాదుతో సీసీఎస్లో కేసు నమోదైంది. ఒకే లావాదేవీలో నాలుగు కంటే ఎక్కువ నోట్లు లభించడంతో ఎన్ఎస్ వర్మను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆర్బీఐ అధికారులు అందించిన 10 నోట్లలో తొమ్మిది రూ.100 నోట్లు, ఒకటి రూ.500 నోటు ఉంది. వీటిని తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి, సిటీ బ్యూరో: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్, జాతీయ స్వర్ణ పతక విజేత ప్రణవ్ మాధవ్ సూరపనేనిని సోమవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) కార్యాలయంలో చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్–ఎండీ సోని బాలదేవి అభినందించారు. ఇటీవల ఏషియన్ షార్ట్ ట్రాక్ చాంపియన్షిప్లో ప్రణవ్ రజతం, రెండు కాంస్య పతకాలు సాధించాడు. 2030 వింటర్ ఒలింపిక్స్లో పాల్గొనే వీలు కల్పించే సీనియర్ వరల్డ్ టూర్కూ అర్హత సాధించాడు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణతో పాటు దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసి నేపథ్యంలో ఆయనను శాట్జ్ చైర్మన్, ఎండీ ప్రశంసించారు. ప్రణవ్ మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని శివసేనారెడ్డి ఆకాంక్షించారు. ఆర్థిక సాయం అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రణవ్ భవిష్యత్ అంతర్జాతీయ పోటీలు, శిక్షణ అవసరాలు, దీర్ఘకాలిక క్రీడా లక్ష్యాలను వివరించారు. ప్రణవ్ ఉన్నత స్థాయి శిక్షణ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన అంశాలను సోని బాలదేవి అడిగి తెలుసుకున్నారు. గంజాయి చాక్లెట్ల విక్రేతకు జైలు చార్మినార్: బీహార్కు చెందిన రబింద్రా బెహరా (42) అనే నిందితుడికి ఎల్బీనగర్ కోర్టు కాంప్లెక్స్లో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. వాణి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల నగదు జరిమానాను విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. 2018లో కాటేదాన్ ప్రాంతంలో 5.6 కిలోల అక్రమ గంజాయి చాక్లెట్ల రవాణా, అమ్మకం కేసులో పట్టుబడ్డాడు. పీపీ మంజుల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. -
సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సమర్పించే వినతులను సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: ఇటీవల అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ నివాసానికి సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్రావు షాద్నగర్రూరల్: విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించడం ద్వారా వారిలో ఆలోచనా విధానం పెంపొందుతుందని జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్రావు అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బూర్గులలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ (మొబైల్ సైన్స్ ల్యాబ్ వాహనం) ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక, సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు సైన్స్ ల్యాబ్ ఆన్వీల్స్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ మొబైల్ వాహనం ప్రతిరోజు ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శిస్తూ విద్యా ర్థులు సైన్స్ ప్రయోగాలను స్వయంగా నిర్వహించి నేర్చుకునే విధానాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్, ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ డాక్టర్ వెంకట్రెడ్డి, విశ్రాంత ప్రధానోపాద్యాయుడు జనార్దన్, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రాజెక్టు మేనేజర్ అరుణ్, బూర్గుల ఉపసర్పంచ్ శివలీల, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు కేశురాం పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో సంచార జాతుల 75వ విముక్తి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. విద్య ద్వారా యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి, నైపుణ్యావృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంచార విముక్తి జాతుల హక్కులు, వారి చారిత్రక నేపథ్యం, సమాజ అభివృద్ధిలో వారి పాత్రపై సంచార జాతుల నాయకులు కుమార్ మహేంద్ర, ఒంటెద్దు నరేందర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంచార జాతుల నాయకులు డేరంగుల కృష్ణ, రామస్వామి, ఓరుగంటి రమేష్, వరికుప్పల సుధాకర్, పన్నీరు నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం తరలిస్తున్న వాహనం సీజ్
ధారూరు: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న అనుమానంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది డీసీఎంను స్వాధీనం చేసుకొని, ధారూరు పోలీస్స్టేషన్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది తనిఖీల్లో 100 క్వింటాళ్ల బియ్యం లోడుతో వెళ్తున్న వాహనాన్ని గుర్తించారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఉన్న 25 కిలోల చొప్పున ఉన్న బస్తాలను పరిశీలించారు. అనంతరం సీఐ రఘురామ్, సివిల్ సప్లై డీటీ రసీద్లకు ఆ వ్యానును అప్పగించగా.. వారు బియ్యంను పరిశీలించి, శాంపిల్ను ల్యాబ్కు తీసుకెళ్లారు. ల్యాబ్ రిపోర్టు వచ్చాక వాస్తవం మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. హయత్నగర్, ఎల్బీనగర్లో కాలేజీలు బంద్ చేసి రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. చదువులు పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పదిహేను రోజుల్లో బకాయిలు ఇవ్వకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫీజు బకాయిలు ఇచ్చే వరకు సీఎం రేవంత్రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టిన భూములను తొలగించాలి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ మల్లేష్, నాయకులు రాజేందర్, అనంతయ్య, అరవింద్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య -
అక్రమార్కుల తిష్ట!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిషేధిత భూముల జాబితా (22ఏ)పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పట్టా భూములను ఈ జాబితా నుంచి తొలగించేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. కొంత మంది ఫైరవీకారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమాయకులను మభ్య పెట్టి అక్రమ వసూళ్లకు తెరతీస్తున్నారు. మేం ఎంత చెబితే అంత.. జిల్లాలోని గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, హయత్నగర్, సరూర్నగర్, బాలాపూర్ మండలాల పరిధిలో మూడు వేల ఎకరాలకుపైగా భూములు కొత్తగా నిషేధిత జాబితాలో చేరాయి. వీటిలో ఏళ్ల క్రితమే వెలసిన హుడా లే అవుట్లు, ఖాళీ స్థలాలు, నివాసాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రి బిల్లుల చెల్లింపు కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల పేరుతో ఆస్తులు అమ్మకానికి పెట్టిన వారికి తీరా ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినట్లు తెలిసి మనోవేదనకు గురవుతున్నారు. తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కొనుగోలుదారులు ఒత్తిడి తెస్తుండటంతో చేసేది లేక ఆయా కార్యాలయాల సమీపంలోని ధరణి ఆపరేటర్లు సహా డాక్యుమెంట్ రైటర్లు, ఇతర ఫైరవీకారులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల బలహీనతను వారు క్యాష్ చేసుకుంటున్నారు. ‘ఫలానా అధికారి తనకు చాలా దగ్గర అని, తాను ఎంత చెబితే అంత’ అని నమ్మబలుకుతున్నారు. సరూర్నగర్లోని ఓ ఫైరవీకారుడు ఏకంగా కలెక్టరేట్లోని సెక్షన్ ఆఫీసులు తిరిగి ఫొటోలు, లొకేషన్లు బాధితులకు షేర్ చేసినట్లు తెలిసింది. ఆ క్రెడిట్ తమదేనంటూ వసూళ్లు దిద్దుబాటు చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు, వాటి పూర్వ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అర్బన్ లాండ్ సీలింగ్ (యూఎల్సీ) నుంచి పట్టా భూములుగా మారిన సర్వే నంబర్లు, వాటి విస్తీర్ణం, సరిహద్దులను గుర్తించి, నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఒక్కో రెవెన్యూ పరిధిలో 40 వేల నుంచి 50 వేల చదరపు గజాల విస్తీర్ణం నిషేధిత జాబితాలో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసి, ఆ మేరకు వాటికి సంబంధించిన జీఓలు, కోర్టు ఉత్తర్వులు, మెమోలను పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. నిజానికి ఎలాంటి ఫైరవీలతో పని లేకుండానే అధికారులే స్వయంగా దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే కొన్నింటిని ఆ జాబితా నుంచి తొలగించారు. ఫైరవీకారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. తమ కృషితోనే ఆ జాబితా నుంచి బయటపడిందని పేర్కొంటూ అక్రమ వసూళ్లకు దిగుతున్నారు. ఈ అంశం క్షేత్రస్థాయిలోని పలువురు అధికారుల దృష్టికి సైతం వెళ్లింది. లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చేందుకు బాధితులు ముందుకు రాకపోవడంతో చర్యలు తీసుకోలేకపోతున్నారు. ‘22 ఏ’ను క్యాష్ చేసుకుంటున్న మాయగాళ్లు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పిస్తామని మాయమాటలు అమాయకులను మభ్యపెట్టి వసూళ్ల పర్వం నమ్మి మోసపోవద్దంటున్న రెవెన్యూ అధికారులు నిషేధిత భూముల జాబితా (22 ఏ) చుట్టూ అక్రమార్కులు తిష్టవేశారు. రెవెన్యూలోని కీలక అధికారులతో తనకు పరిచయం ఉందని, తాము అడిగినంత ముట్టజెబితే జాబితా నుంచి విముక్తి కల్పించే విధంగా చేస్తామని నమ్మబలికి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ సహా డివిజనల్ రెవెన్యూ, మండల రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో హల్చల్ చేస్తున్నారు. అదే పనిమీద ఉన్నామంటూ నమ్మించేందుకు అక్కడి నుంచి బాధితులకు ఫొటోలు, లొకేషన్లు షేర్ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే బాధితులే స్వయంగా తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ను కలిసి విన్నవించాలి. సంబంధిత అధికారులకు అర్జీలు అందజేసిన 48 గంటల్లోనే సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు. 22 ఏ జాబితా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు దృష్టికి తెస్తే సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఇప్పటికే 765 జీవోలను పోర్టల్లో అప్లోడ్ చేశాం. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ వేలం వేసిన భూముల వివరాలను సైతం సేకరించి, వాటిని జాబితా నుంచి తొలగిస్తున్నాం. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం సేకరించిన భూములు, అవార్డీల వివరాలను కూడా సేకరించి జాబితా నుంచి తొలగిస్తున్నాం. – కలెక్టర్ నారాయణరెడ్డి -
వెయ్యిరోజులైనా చేసిందేమీ లేదు
మీర్పేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. మీర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సభలు, ప్రచార కార్యక్రమాలతో ప్రభు త్వం కాలం వెల్లదీస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. హామీల అమలుకు స్పష్టమై న కార్యాచరణ ప్రకటించి, అర్హులందరికీ ప్రభు త్వ పథకాల ప్రయోజనాలు అందించాలని డి మాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామం, ప్రతి వార్డులో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేలా జాబితాను తయారు చేసి అధికారులకు అందజేశామని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఓట్లు పొందిన తరువాత వాటిని మరిచిపోవడం ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజల ముందుంచాలన్నారు. హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జిల్లా, మండల స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
వెంటాడిన మృత్యువు
గచ్చిబౌలి: మృత్యువు వెంటాడి మరీ ప్రాణం తీసింది. ఓ ప్రమాదంలో గాయాలతో బయటపడగా.. మరో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో ఖాజాగూడలో రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తి(35)ని ఇన్నోవా కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. కారు డ్రైవర్ జైద్ షాఖాద్రీ(21).. ఓ క్యాబ్ డ్రైవర్ సహాయంతో బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఖాజాగూడ నుంచి నానక్రాంగూడ వైపు వెళ్తున్న ఫార్చునర్ కారు ఢీకొట్టింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్నోవా డ్రైవర్ జైద్ షా ఖాద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైన నిందితుడి, కారు కోసం సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ● గాయపడ్డ వ్యక్తిని తరలిస్తుండగా ఢీకొన్న కారు ● ఒకరి మృతి, మరొకరికి గాయాలు -
జీఓ 97ను రద్దు చేయాలి
షాద్నగర్: పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం జారీ చేసిన చేసిన జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు రిషబ్ జైన్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి సోమవారం పట్టణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వం బలోపేతం చేయకుండా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాల విలీన నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని అన్నారు. కొన్ని రోజులుగా విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించి మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో విలీనం చేసే కుట్రలు విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శివప్రసాద్, చింతల పవన్, నర్సింహ, పరమేశ్వర్, బాలు, రాజు, రాంమోహన్రెడ్డి, చింటు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్
అనంతగిరి: ఒంటరిగా నివసించే వితంతు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాల అపహరిస్తున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం వికారాబాద్లో సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ వెల్లడించారు. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ స్నేహ మెహ్ర కేసును వికారాబాద్ సీసీఎస్కు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితురాలి కదలికలను గుర్తించారు. గతంలో ఆమె పాల్పడిన నేరాల వివరాలు, చేసిన విధానం తదితర అంశాలను విశ్లేషించారు. మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన లక్ష్మి అసాడేగా గుర్తించారు. తాండూరులో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు, 9.5 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, నవనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉంది. ఈ మూడు కేసుల్లో మొత్తం 14.5 తులాల బంగారు ఆభరణాలు అపహరించింది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, బర్షి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, హైదరాబాద్ సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు గుర్తించారు. కేసు దర్యాపులో పురోగతి సాధించి, నిందితురాలిని అరెస్టు చేసిన వికారాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, తాండూరు టౌన్ ఎస్ఐ మమత, హెడ్ కానిస్టేబుళ్లు జయవర్ధన్, శివకుమార్, కానిస్టేబులు రామకృష్ణ, సాయప్ప, శివరాజ్, పాండు, రాజు, రవీందర్, గాయత్రిని జిల్లా అదనపు ఎస్పీ రాజేశ్ మీనా అభినందించారు. -
కాంగ్రెస్ మోసాలపై పోరుబాట
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ చేపట్టనున్న పోరుబాటను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని శేరిగూడలో సోమవారంపార్టీ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ప్రజలకిచ్చి న 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని.. అధికారం చేపట్టి 1000 రోజులు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆ పార్టీ హామీలపై సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం తదితర అంశాలపై ప్రజలకు అర్థమయ్యేవిధంగా వివరించాలన్నారు. పోరుబాటను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
షాబాద్: పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంఎస్ గార్డెన్లో సోమవారం పార్టీ మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడిపల్లి పెంటారెడ్డి సన్మానసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలకు తావులేకుండా కార్యకర్తలంతా ఏకతాటి పైకి వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు కాంగ్రెస్దేనని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి పామెన భీంభరత్, సర్ధార్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ మద్దూరు మల్లేష్, గౌరీసతీష్, మొయినాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్, చేవెళ్ల సహకారం సంఘం చైర్మన్ దేవర వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మొయినాబాద్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీశ్ హెచ్చరించారు. సోమవారం మొయినాబాద్ బస్టాప్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, రోడ్లు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ను ఉపయోగించాలన్నారు. పాదచారులు రహదారికి ఎడమవైపునే నడవాలని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని.. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, ప్రమాదకరమైన ఓవర్టెక్లు చేయొద్దన్నారు. మద్యం సేవించి, మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని చెప్పారు. ఈ నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంగించినవారిపై కేసులు నమోదు చేశారు. చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీశ్ -
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
షాద్నగర్: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి అన్నారు. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలోని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కొప్పునూరి శ్రీశైలం ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని కేకేఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాలశ్రవణ్ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీశైలం దంపతులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమన్నారు. విద్యారంగాభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శశిరేఖ యాదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి -
నాలా దారి మళ్లింపు
శంకర్పల్లి: ప్లాట్టు చేసేందుకు రియల్ వ్యాపారులు సహజ సిద్ధంగా ఉన్న నాలాను దారి మళ్లిస్తున్నారు. భూములకు విలువ పెరగడంతో నాలాను పూడ్చేసి.. మరో పక్క నుంచి పైపులు వేస్తున్నారు. శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు వరదనీరు వెళ్లేందుకు సహజ సిద్ధమైన నాలా ఉంది. ఈ నాలాపై గతంలో అధికారులు కల్వర్టులు నిర్మించారు. ఇటీవల భూమి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు అందులో ప్లాట్లు చేసుందుకు నాలాను దారి మళ్లిస్తున్నారు. ఉన్న నాలాను పూడ్చేసి మరో పక్క నుంచి వరదనీరు వెళ్లేలా పైపులు వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నాలాను దారి మళ్లించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్ను వివరణ కోరగా.. నాలాను దారి మళ్లిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించామని.. పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు నిలిపివేయకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ భూ సేకరణ విభాగంలో స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ) గా పని చేసిన కె.స్వర్ణలత సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు,ఉద్యోగులు, సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. మెట్రో రైల్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ తో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.1995లో నిజామాబాద్ రెవిన్యూశాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన స్వర్ణలత తెలంగాణాలోపలు జిల్లాల్లో వివిధ హోదాలలో పనిచేశారు. హెచ్ఎంఆర్ఎల్ లో ఎస్డీసీగా సేవలందజేశారు.పాతనగరంలో మెట్రో రైల్ కారిడార్ కు అవసరమైన భూసేకరణ లో ప్రభావిత ఆస్తులనుస్వాధీనం చేసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారని, ఆమె సేవలు మరువలేనివని జేఎండీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భూసేకరణ అనేది సున్నితమైన అంశమని, భూముల యజమానులను ఒప్పించి స్వాధీనం చేసుకోవడం ఎంతో కష్టమైన పని అని పేర్కొన్నారు.సాక్షి, సిటీబ్యూరో: OÐðl§ýlŠѧýlÅ MýSÌS-VýS¯]l² õ³§ýl ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ Úëïßæ¯ŒS {VýS*‹³ Ô¶æ$¿ýæ-ÐéÆý‡¢ ^ðlí³µ…-¨. Ey鯌S M>ÆöµÆó‡sŒæ ÝùçÙÌŒæ Æð‡Ýëµ°Þ¼Ísîæ (ïÜG-‹Ü-BÆŠ‡) M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ ¿êVýS…V> BǦMýS…V> Ððl¯]l$-MýS-º-yìl¯]l ѧéÅ-Æý‡$¦ÌS MøçÜ… {ç³™ólÅMýS ±sŒæ ÝëPÌS-ÆŠ‡í-Ù‹³ A…§ýl-gôæçÜ$¢-¯]l²r$Ï Úëïßæ¯ŒS {VýS*‹³ B‹œ C¯ŒS-íÜtr*Å-çÙ¯ŒSÞ O^ðlÆý‡Ã¯ŒS yéMýStÆŠ‡ Aº$ª-ಲ್ Q©ÆŠ‡ {ç³MýSsìæ…-^éÆý‡$. ÝùÐ]l$ÐéÆý‡… VýS¯ŒS-¸-û…{yîl Ò$yìlĶæ* ç³Ï‹Ü Byìl-sZ-Ç-Ķæ$…ÌZ Ò$yìlĶæ*™ø Ð]l*sêÏyýl$-™èl*.. {糆¿ýæ E…yìl yýlº$¾ÌôæÏMýS OÐðl§ýlÅ MðSÈÆŠ‡ BW-´ù-MýS*-yýl-§ýl¯ól E§ólªÔèæ…™ø D ç³£ýlMýS… ™ðl^éa-Ð]l$-¯é²Æý‡$. ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ {ç³™ólÅ-MýS…V> AÐ]l-M>Ôèæ… MýSÍ-µ…-^é-Ð]l$¯é²Æý‡$. ±sŒæ&2026ÌZ MýS±çÜ… 350 Ð]l*Æý‡$PË$ Ý뫨…-_¯]l ™ðlÌS…V>׿ ѧéÅ-Æý‡$¦Ë$ AÆý‡$áÌS-¯é²Æý‡$. G…í³OMð ¯]l ÐéÇMìS ½§ýl-ÆŠ‡ÌZ° Úëïßæ¯ŒS {VýS*‹³ B‹œ C¯ŒSíÜt-r*Å-çÙ-¯ŒSÞÌZ 100 Ô>™èl… r*ÅçÙ¯ŒS ïœk Ð]l*ø ¯é׿Å-OÐðl$¯]l ±sŒæ Mø_…VŠæ CÝë¢Ð]l$° {ç³MýS-sìæ…-^éÆý‡$. §ýlÆý‡RêçÜ$¢MýS$ _Ð]lÇ ™ól© òÜò³-t…-ºÆŠ‡ 5, 2026 Ð]lÆý‡MýS$ ^ólçÜ$-Mø-Ð]l-^èla-¯é²Æý‡$. ÑÐ]l-Æ>ÌSMýS$ 18001216235¯]l$ ¯ðl…ºÆý‡$MýS$ ¸ù¯ŒS-^ólĶæ$-Ð]l^èl$a. -
చోరీ సొత్తు స్వాధీనం
తాండూరు టౌన్: ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన నిందితున్ని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చెరువెంటి ఈశ్వరాలయం సమీపంలో నివాసం ఉంటున్న పట్లోళ ఉమాదేవి ఇంటికి శనివారం గతంలో ఆమె వద్ద పనిచేసిన పనిమనిషి భర్త మొగులప్పతో పాటు మరో వ్యక్తి వచ్చారు. ఆమె మెడకు చీరకొంగు బిగించి, స్పృహ తప్పిన తర్వాత మెడలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన విషయం విధితమే. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే ఇద్దరు నిందితుల్లో ఒకరైన సంజీవ్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఐదున్నర తులాల మంగళసూత్రం, నల్లపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు మొగులప్ప పరారీ ఉన్నట్లు చెప్పారు. సంజీవ్ను రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుడికి రిమాండ్ -
పార్కింగ్ స్థలంలో ద్విచక్రవాహనాలు దగ్ధం
మణికొండ: రోజు మాదిరిగానే పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలు తెల్లవారు జామున చూసేసరికి ఆహుతవ్వటంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. నార్సింగి ఎస్ఐ వెంకటేశం తెలిపిన మేరకు..హైదర్షాకోట్ సాయిహర్షనగర్ కాలనీలోని మహ్మద్ ఖాజకు చెందిన నివాసాన్ని అద్దెకు ఇస్తున్నాడు. అందులో అద్దెకు ఉంటున్న వారు తమ 8 ద్విచక్ర వాహనాలను పార్కింగ్లో నిలిపి పైన నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి వాహనాలను పార్క్ చేశారు.సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు పార్కింగ్లో నుంచి మంటలు రావటంతో గమనించి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. నాలుగు బైక్లు పూర్తిగా కాలిపోగా మరో నాలుగు పాక్షికంగా కాలిపోయాయి. మతి స్థిమితం లేని చైతన్య అనే యువకుడు ఇంట్లోకి వచ్చినట్టు సీసీ కెమరాల్లో నిక్షిప్తం అయ్యింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అతనికి మతిస్థిమితం సరిగా లేదని ఎస్సై తెలిపారు. -
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
పహాడీషరీఫ్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఎల్.బి.నగర్ న్యాయస్థానం సోమవారం 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన ప్రకారం.. 2023 డిసెంబర్లో ఎర్రకుంటకు చెందిన ఆటోడ్రైవర్ ముఖరం(26) 16 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఈ క్రమంలోనే తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు యువతిని రక్షించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ను విచారించిన రంగారెడ్డి జిల్లా రేప్, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.లక్ష పరిహారం ప్రకటించారు. కందుకూరు: కందుకూరు పోలీస్ స్టేషన్లో వదిలేసిన మూడు బైక్లు ఉన్నాయని, వాటి యజమానులు ఆధారాలతో వచ్చి తీసుకెళ్లాలని సీఐ వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ11ఎస్0823, ఏపీ09బీఏ3645, ఏపీ13జీ8807 నంబర్లు ఉన్న వాహనాలకు సంబంధించిన యజమానులు వాహ న రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ)తో పాటు ఆధార్కార్డు జిరాక్స్ తీసుకొచ్చి సమర్పించి బైక్లు తీసుకెళ్లాలన్నారు. సంబంఽధిత వాహన యజమానులు వీలైనంత త్వరగా ఠాణాలో సంప్రదించాలని లేదంటే వాహనాలను నిబంధనల ప్రకారం వేలం వేస్తామన్నారు. వ్యక్తికి జైలు శిక్ష బంట్వారం: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ విమల తెలిపారు. కోట్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన బంటు రమేష్.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ బంట్వారం తనిఖీలో పట్టుబడ్డారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, సోమవారం కోర్టులో హాజరు పర్చగా.. వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. -
అరచేతిలో అశ్లీలం!
ఇంటర్నెట్లో రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్సైట్లు సాక్షి, సిటీబ్యూరో: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో నర్సును హత్య చేసి, ఆమె మృతదేహంపై అత్యాచారం చేసిన మానవమృగం ఎండీ సనావుల్లా ఫోన్ నిండా అశ్లీల వీడియోలే ఉన్నాయి. ఈ ‘హత్యా’చారానికి వాటి ప్రభావమూ తీవ్రంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. కేవలం ఇలాంటి వాళ్లే కాదు... మైనర్లు కూడా పెడదోవ పట్టడం వెనుక పోర్న్ వెబ్సైట్ల ప్రభావం ఎక్కువగానే ఉంటోందని పోలీసులు చెప్తున్నారు. ఇంటర్నెట్లో ఉన్న వీటి సర్వర్లు విదేశాల్లో ఉండటంతో చర్యలకు ఆస్కారం ఉండట్లేదని చెప్తున్నారు. నిఘా సంస్థలు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీని పరిగణించినంత తీవ్రంగా ఇతర అశ్లీలతను పరిగణించట్లేదు. ‘చేతుల్లోకి’ రావడంతో తేలికై ంది కొన్నేళ్ల క్రితం అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు ఉండేవి. ఆ తర్వాత వీడియో క్యాసెట్ల రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూడటానికి ఆస్కారం ఉండేది. కంప్యూటర్, ల్యాప్టాప్ల వాడకం పెరిగిన తర్వాత నెట్కేఫ్లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం మొదలైంది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అదే జరిగితే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. అయితే స్మార్ట్ఫోన్ యుగం ప్రారంభమైన తర్వాత ఈ పోర్న్ సైట్లన్నీ వాటి నుంచే చూసేందుకు అవకాశం చిక్కింది. ఈ కారణంగానే అనేక మంది యువత పోర్నోగ్రఫీకి బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు అదుపుతప్పి జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. సర్వర్లు ఇక్కడ లేకపోవడంతో ఈ పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. అయితే తెలివిమీరిన వీటి నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు ఏర్పాటు చేసి మరో సైట్ ప్రారంభిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు అందే వరకు యథేచ్ఛగా ఇంటర్నెట్లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. ఈ కారణంగానే వరుసగా ఫిర్యాదులు వచ్చిన వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. ఆ చర్యలు మిగిలిన వాటిపై లేవు ప్రస్తుతం చైల్డ్ పోర్నోగ్రఫీని మాత్రమే తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధమూ కొనసాగుతోంది. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో సాగుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డన్ర్ (ఎన్సీఎంఈసీ) పని చేస్తోంది. అలాంటి చర్యలు వీటికీ అవసరం.. ఆయా సైబర్ స్పేస్, సోషల్ మీడియాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా..తక్షణం గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వారి వినియోగించిన ఐపీ అడ్రస్లను గుర్తిస్తుంది. ఈ సమాచారం స్థానిక పోలీసులకు ఇచ్చి నిందితులను అరెస్టు చేయిస్తుంది. చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉన్న మాదిరిగానే ఇతర అశ్లీల అంశాలపైనా చర్యలు అవసరమన్నది నిపుణుల మాట. పోర్న్సైట్స్ను ఎవరు సెర్చ్ చేసినా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దీనిపైనా సుమోటో కేసుల్ని నమోదు చేయాలని ఐటీ యాక్ట్లోని సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాటి సర్వర్లు ఇతర దేశాల్లో ఉండటంతో ఇక్కట్లు వీటి ప్రభావంతో పెడదారి పడుతున్న యువత తుక్కుగూడ నిందితుడి ఫోన్ నిండా ఆ వీడియోలే అఘాయిత్యాలు చోటు చేసుకోవడానికి ఇదీ కారణమే ప్రస్తుతం చైల్డ్ పోర్నోగ్రఫీపై మాత్రమే ప్రత్యేక నిఘా -
ప్రభుత్వ భూముల వేలం ఆపండి
హుడాకాంప్లెక్స్: ప్రభుత్వ భూముల వేలం ఆపాలని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొత్తపేటలోని పాతకోర్టు స్థలం (హెచ్ఎండీఏ స్థలం) ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, కార్యదర్శి కేకే, ఉపాధ్యక్షుడు జిట్టా ఆయిల్రెడ్డి, కొమ్ము అంజి, భాస్కర్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి కేవీగౌడ్, ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బాలస్వామి, హైదరాబాద్ రీజినల్ ఇన్చార్జి వరంగల్ రమేశ్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి వడ్డెర రఘుపతి, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ఎంఎస్ యాదవ్, స్పోక్స్ పర్సన్ చిత్తలూరు వేణుగౌడ్, దివ్యాంగుల విభాగం కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం ఒకవైపు సర్కార్ భూములను వేలం వేస్తూనే మరోవైపు ప్రజలపై అప్పుల భారం వేస్తోందని ఆరోపించారు. కొత్తపేటలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయకుండా ఆ స్థలంలో మహాత్మ పూలే భవనం నిర్మించాలని, అందులో లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, ఆడిటోరియం వంటివి నిర్మించి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించాలని సూచించారు. కోర్టు స్థలం వేలం ఆపకపోతే ప్రజాసంఘాలు, అఖిలపక్ష నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయబండి పాండురంగాచారి, మండల డానియల్, స్థానిక ఉద్యమకారులు పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు -
ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
మొయినాబాద్: నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీలోని గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, వీజేఐటీ కళాశాల, చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు అరగంట ముందుగానే ఆయా సెంటర్లకు చేరుకున్నారు. గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో 120 మందికి గాను 119 మంది, చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 120 మందికి 118, వీజేఐటీ కళాశాలలో 100 మందికి 96 మంది హాజరయ్యారు. ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చేవెళ్ల డీసీపీ యోగేష్గౌతమ్, ఏసీపీ కిషన్, ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్, ట్రాఫిక్ సిబ్బంది చర్యలు చేపట్టారు. -
పరిహారం.. ఆగ్రహం
షాద్నగర్: భూ పరిహారంలో వివక్షపై రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు సంబంధించి సేకరించే భూముల విషయంలో అన్యాయానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రేడియల్ రోడ్డుకు అధిక మొత్తంలో చెల్లిస్తూ.. తమ భూములు మాత్రం తక్కువ ధరకు కొనాలని ప్రభుత్వం భావిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేడియల్ రోడ్డుకు ఇలా.. షాద్నగర్, పరిగి నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు గాను ఆయా గ్రామాల్లో భూసేకరణ వేగవంతం చేశారు. రైతులకు ఒక్కో ఎకరానికి ప్రభుత్వం రూ.40లక్షల చొప్పున చెల్లించింది. దీంతో రైతులు సంతోషంగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదు. తక్కువ ఇస్తే అంగీకరించేది లేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సేకరణకు చర్యలు చేపట్టింది. సుమారు 300 ఎకరాలకు పైగా భూమిని ఇక్కడి రైతుల నుంచి సేకరిస్తున్నారు. పరిహారం విషయంలో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం సేకరించే భూములకు ఏవిధంగా పరిహారం ఇస్తుందో అదేవిధంగా తమకూ చెల్లించాలని భూములు కోల్పోయే రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఆశించిన పరిహారం ఇచ్చేంత వరకు సర్వే చేయనిచ్చేది లేదని స్పష్టం చేశారు. మరి ప్రభుత్వం వీరికి ఏవిధంగా నచ్చజెబుతుందో, ఏ మేరకు పరిహారం చెల్లిస్తుందో వేచి చూడాలి. సేకరించే భూమి వివరాలు .. ● ప్యాకేజీ 19 కింద మహబూబ్నగర్జిల్లా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి షాద్నగర్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు 32 కిలోమీటర్ల కాల్వను నిర్మించనున్నారు. సొరంగాలు, బహిరంగ కాల్వల కోసం 1,355 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ● ప్యాకేజీ 20 కింద పంప్ హౌస్ నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా పద్మారంలో 52 ఎకరాలు సేకరిస్తారు. ● ప్యాకేజీ 21 కింద రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం 1,512 ఎకరాలు సేకరించనున్నారు. ఇందులో వికారాబాద్ జిల్లా పరిగి మండలం సైదుపల్లిలో 903, కుల్కచర్ల మండలం అల్లాపూర్లో 343, రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలం పద్మారంలో 266 ఎకరాలు సేకరించనున్నారు. రేడియల్ రింగ్ రోడ్డు నిర్మాణం ఇలా రాజధాని శివారులోని బుద్వేల్ వద్ద ప్రారంభమై శంషాబాద్, షాబాద్, షాద్నగర్ పరిఽధిలోని కొందుర్గు మండలం చుక్కమెట్, ముట్పూరు, లాలాపేట్, ఉమ్మెంత్యాల, లచ్చంపేట గ్రామాల మీదుగా రేడియల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఎకరాకు రూ.40 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని ఆబాజీగూడ, చిట్యాల, గూడూరు, సైదుపల్లి, మీదుగా కొడంగల్ వరకు నిర్మించనున్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు భూ సేకరణ పరిహారం విషయంలో కరువైన స్పష్టత రేడియల్ రోడ్డుకు ఎకరానికి రూ.40లక్షలు తమకూ అంతే ఇవ్వాలంటున్న రైతులు వివక్ష చూపిస్తే అంగీకరించేదిలేదని స్పష్టీకరణ ఎకరాకు చెల్లించే నష్టపరిహారం : రూ.12 లక్షలు సేకరించనున్న మొత్తం భూమి : 2,919 ఎకరాలు అంచనా వేసిన పరిహారం మొత్తం : రూ.350.84కోట్లు రిజర్వాయర్ నీటి సామర్థ్యం : 2.9 టీఎంసీలు రిజర్వాయర్ పూర్తయితే నీరందించే భూ విస్తీర్ణం : సుమారు 4 లక్షల ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో మాకున్న పొలంలో 9 ఎకరాలు పోతోంది. ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించాలి. రీజినల్ రోడ్డు కోసం సేకరించే భూములకు ఏవిధంగా ఇస్తున్నారో అదేవిధంగా మాకూ ఇవ్వాలి. – మొగిలిగిద్ద మల్లమ్మ, పద్మారం, జిల్లేడు చౌదరిగూడ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రిజర్వాయర్ నిర్మాణంలో మా విలువైన భూములు కోల్పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించాలి. – నారాయణగౌడ్, పద్మారం, జిల్లేడు చౌదరిగూడ -
ఇందిరమ్మ ఇళ్లకు లక్కీడ్రా
నాగోలు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఆదివారం నాగోలు బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ కార్యాలయంలో నిర్వహించారు. అర్హులైన దరఖాస్తుదారుల్లో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్లాట్లను కేటాయించే ప్రక్రియను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ హౌసింగ్ బోర్డు సౌత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాబురావు, హౌసింగ్ బోర్డు జనరల్ మేనేజర్ మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. డ్రాలో తమ పేరు వస్తుందా.. సొంతింటి కల నెరవేరుతుందా అని దరఖాస్తుదారులు ఉత్కంఠగా ఎదురుచూశారు. బండ్లగూడలోని హౌసింగ్ బోర్డ్లో ఏర్పాటు చేస్తున్న టవర్స్లో ప్లాట్ల కేటాయింపునకు మొత్తం 752 మంది దరఖాస్తు చేసుకోగా.. లక్కీడ్రా ద్వారా 480 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఎస్సీ కేటగిరీకి 67 ప్లాట్లు, ఎస్టీలకు 24, బీసీలకు 77, దివ్యాంగులకు 24 ప్లాట్లు కేటాయించారు. ఇతర కేటగిరీలకు 240 కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఎంపికై న లబ్ధిదారులు ప్లాట్ కోసం రూ.6 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తమకు ప్లాట్ దక్కడంతో ఎంపికై న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 480 మందికి ప్లాట్ల కేటాయింపు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. తాళ్లపల్లి కరుణాకర్ (38) అనే వ్యక్తి నాలుగేళ్లుగా రావిర్యాల సమీపంలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్లో పని చేస్తున్నాడు. రోజులాగే శనివారం ఉదయం బైక్పై డ్యూటీకి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తూ తుక్కుగూడ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఉన్న ఏషియన్ పెయింట్స్ దగ్గర నిలిపి ఉన్న బొలేరా వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కరుణాకర్ తలకు బలమైన గాయం కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భార్య దీపిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంబరు మార్చి.. ఏమార్చి తిరుగుతూ.. వాహనం పట్టివేత శంషాబాద్: ఈఎంఐలు, పెండింగ్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబరు మార్చి.. పోలీసులను ఏ మార్చి తిరుగుతున్న ఓ వాహనాన్ని ఆర్జీఐ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ ట్రాఫిక్ సీఐ ప్రమోద్కుమార్ తెలిపిన మేరకు.. ఆదివారం సాయంత్రం ఆర్జీఐఏ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టు ట్రంపెట్ బ్రిడ్జీ ఇండియానా బేకరి వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా వాహనం కనిపించింది. పరిశీలించగా ట్యాక్సీగా రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ట్యాక్సీ నంబరు తొలగించి తిరుగుతున్న కారణంగా డ్రైవర్ రమేష్ తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో గేదె మృతి
యాలాల: విద్యుదాఘాతంతో ఓ గేదె మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని బెన్నూరులో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గాళ్ల కృష్ణయ్య గేదె మేత మేస్తూ కంచెలేని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగేది కాదని.. గేదె విలువ రూ.లక్ష ఉంటుందని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. బొంరెడ్డిపల్లిలో.. కుల్కచర్ల: మండల పరిధిలోని బొంరెడ్డిపల్లిలో విద్యుదాఘాతంతో మృత్యువాతపడింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని రాములు గేదె మేత మేస్తుండగా విద్యుత్ వైర్ తగిలి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. గేదె విలువు సూమారు రూ.80వేలు ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పహాడీషరీఫ్: చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించి మూడు రోజుల క్రితం చెరువులో పడి ఉంటాడని భావిస్తున్నారు. 30–40 ఏళ్ల వయసు ఉంటుందని, అతని చొక్కాను షాద్నగర్లో కుట్టించినట్లు టైలర్ మార్క్ ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మట్టి తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం కేశంపేట: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామ శివారు నుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ సిబ్బంది కిరణ్కుమార్, శివుడు మట్టిలోడ్తో వెళ్తున్న టిప్పర్లను గుర్తించారు. వాటిని ఆపి అనుమతులు ఉన్నాయా అని డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించి టిప్పర్లను శనివారం రాత్రి స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. పెట్రోలింగ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్లతో పాటు వాహన యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. తల్లి మృతితో మనస్తాపం.. వ్యక్తి ఆత్మహత్య అల్వాల్: తల్లి మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మిడిదొడ్డి అశారాణి (30) , అమె భర్త జగనాథ్ (33) ఓ కిమో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి జగన్నాథ్ బయిటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. భోజనం చేయాలని భార్య కోరగా తాను చేస్తానని చెప్పాడు. కొంత సమయం తర్వాత అశారాణి భర్తను చూసేందుకు వెళ్లాగా బెడ్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని కినిపించాడు. వెంటనే సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ నెల 16న జగనాథ్ తల్లి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తల్లి మృతితో తీవ్ర మనస్తాపానికి గురై డిప్రెషన్లో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చుని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
ఫిలింనగర్లో భారీ అగ్ని ప్రమాదం
ఆరు కార్లు దగ్ధం.. 15 మందిని సురక్షితంగా తరలింపుఫిలింనగర్: ఫిలింనగర్లోని జర్నలిస్ట్కాలనీ హుడా ఎన్క్లేవ్లో ఉన్న వంశీరామ్స్ జ్యోతి డ్వెల్లింగ్ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టిల్ట్ ఫ్లోర్తో పాటు ఐదు అంతస్తులుగా ఉన్న ఈ నివాస భవనంలోని స్టిల్ట్ ఫ్లోర్లో పార్క్ చేసి ఉన్న ఆరు కార్లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. పంజగుట్ట ఎంటీపీ, అన్నపూర్ణ వాటర్ బౌజర్, జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అపార్ట్మెంట్లో ఉన్న 15 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. -
రిటైర్డు బ్యాంకు ఉద్యోగి డిజిటల్ అరెస్టు
మలక్పేట: మలక్పేట సమతా రెసిడెన్సీలో నివసిస్తున్న రిటైర్డ్ ఎస్బీఐ సీనియర్ క్లర్క్ వెంకటపురం సాయినాథ్ దయాకర్ (71)ను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగించి రూ.64 లక్షలు కాజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ముంబైలో క్రెడిట్ కార్డుపై రూ.1,06,669 బకాయి ఉందంటూ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులమని ఫోన్ చేయడంతో ఈ మోసం మొదలైంది. ఆ కార్డు తనది కాదని బాధితుడు తెలపడంతో, కొద్దిసేపటికి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా రవికుమార్ అనే వ్యక్తి ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. పహల్గామ్ దాడి కేసు, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల కేసుల్లో ఆయన పేరు ఉందని బెదిరించారు. అమెరికాలో ఉన్న మనవడు, నాచారం నుంచి పంజాగుట్టకు వెళ్లే కుమార్తె వివరాలు చెప్పి కుటుంబంపై నిఘా ఉందని, సహకరించకపోతే మనవడిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని భయపెట్టారు.సీబీఐ అధికారి ప్రదీప్సింగ్తో సహా పలువురు అధికారులుగా వీడియో కాల్స్లో మాట్లాడి, నకిలీ ఎఫ్ఐఆర్ కాపీలు, ఆర్బీఐ లేఖలు పంపారు. నిరంతరం మానసిక ఒత్తిడికి గురిచేస్తూ ఏప్రిల్ 10న రూ.2 లక్షలు, ఆ తర్వాత రూ.8 లక్షలు ఇలా విడతలవారీగా డబ్బులు బదిలీ చేయించుకున్నారు. నగదు సరిపోకపోవడంతో పెన్షన్, గోల్డ్ లోన్లు తీసుకోమని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా నారపల్లిలోని కోట్లు విలువ చేసే ఆస్తిని ఆగస్టు 19న రూ.75 లక్షలకు అమ్మేలా తీవ్రంగా వేధించారు. నాలుగు నెలల పాటు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ బెదిరింపులకు పాల్పడగా, భయంతో ఆయన మొత్తం రూ.64 లక్షలు బదిలీ చేశారు. ఇటీవల మాల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఇలాంటి డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసంపై వచ్చిన వార్తా కథనం చూసి తాను మోసపోయానని బాధితుడు గ్రహించారు. వెంటనే కొడుకు, కూతురితో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రమైన కేసులు పెడతామని నాలుగు నెలలపాటు వేధింపులు ఆస్తులు అమ్మి రూ.64 లక్షలు చెల్లించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు -
గృహ ప్రవేశానికి వెళ్తుండగా ప్రమాదం
బొంరాస్పేట: ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ బాలవెంకటరమణ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని జానకంపల్లికి చెందిన దూగు చంద్రమ్మ(58) భర్త, కొడుకు చనిపోవడంతో దత్తత తీసుకున్న కుమారిడి వద్ద జీవనం సాగిస్తోంది. ఉదయం దుద్యాల మండలం లగచర్లలో బంధువుల గృహప్రవేశానికి బయలుదేరింది. ఈ క్రమంలో తుంకిమెట్ల జాతీయరహదారి 163పై రోడ్డుదాటుతుండగా హన్వాడ గ్రామానికి చెందిన ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టడంతో ఆమె పడిపోయింది. స్థానికులు ఆమెను కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉపసర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు బంధువులు అంత్యక్రియలు చేశారు. ద్విచక్రవాహనదారుడిని అదుపులోకి తీసుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి -
తెలంగాణపై ఎగిరేది కాషాయ జెండానే..
తాండూరు టౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై ఎగిరేది బీజేపీ జెండాయేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖామంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేశ్కుమార్ ప్రమాణస్వీకారోత్స వానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ఆరాటపడుతోందని ఆరోపించారు. ఒకప్పుడు మిగులు నిధుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ప్రస్తుతం రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పార్టీలేనన్నారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని రాహుల్గాంధీ గొంతు చించుకుంటున్నారని.. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడం, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్తో పాక్ వెన్నువిరవడం, సబ్సిడీ ఎరువులు ఇచ్చి రైతులను ఆదుకోవడం, త్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళల ఆదరాభిమానాలు పొందడం, ప్రతీ పేదోడికి రేషన్ బియ్యం ఇవ్వడం వంటి మంచి పనులు చేసినందుకు మోదీ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. బోఫోర్స్, బొగ్గు వంటి పలు కుంభకోణాల్లో మునిగి తేలిన కాంగ్రెస్.. ఎలాంటి అవినీతి మరక లేని మోదీని రాజీనామా చేయమనడం హాస్యాస్పదమన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతోందన్నారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, నేషనల్ హైవేల నిర్మాణం వంటివి శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. టెట్ నుంచి మినహాయింపునకు వినతి 2010 సంవత్సరం కంటే ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నుంచి మినహా యింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం సభ్యులు (తపస్) కేంద్రమంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు టెట్ను అర్హతగా నిర్ణయించారని.. అంతకు ముందే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి వర్తించదన్నారు. వారికి టెట్ నుంచి మినహాయిస్తూ ఉద్యోగ భద్రత, సీనియారిటీ, పదోన్నతులు, వేతన, పెన్షన్ ఇతర సేవా ప్రయోజనాలను పరిరక్షించాలని అన్నారు. న్యాయం చేయాలని తపస్ జిల్లా శాఖ సభ్యులు కోరారు. కాంగ్రెస్ది కమీషన్.. బీఆర్ఎస్ దోపిడీ పాలన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి -
నర్సు మృతి కేసులో పురోగతి
● యువతిపై అత్యాచారం చేసి హత్య? ● నిందితుడు బీహార్వాసి పహాడీషరీఫ్: రెండు రోజుల క్రితం తుక్కుగూడలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నర్సు కేసులో పురోగతి లభించింది. యువతిని అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలివీ.. ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం చౌదరిగూడెం గ్రామానికి చెందిన వూకే బ్రహ్మయ్య కుమార్తె శిరీష (21) ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ప్రైమ్కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా విధుల్లో చేరింది. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఆవరణలోని తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు కూడా నిద్ర లేవకపోవడం, ఫోన్లో స్పందించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది కిటికీ తెరిచి చూడగా మృతి చెంది కనిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు ఆధారంగా అత్యాచారం, హత్య కేసుగా మార్చారు. ఆదివారం యువతి మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేశారు. నిత్యం యువతి కదలికలపై కన్నేసి.. ఆస్పత్రిని ఆనుకొని ఉన్న కార్ల మెకానిక్ షోరూంలో బీహార్కు చెందిన మహ్మద్ సనుహుల్లా(34) పని చేస్తున్నాడు. షోరూంలో పనిచేసే తోటి కార్మికులు సాయంత్రం వెళ్లిపోగా, ఇతడు మాత్రం అందులోనే నిద్రించేవాడు. ఆస్పత్రిలో నర్సులుగా పనిచేస్తున్న యువతులు నిత్యం ఏ సమయానికి గదిలోకి వస్తారు.. ఎవరెవరు ఉంటారనే విషయమై చాలా రోజులుగా గమనిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి శిరీష నిద్రించాక చడీ చప్పుడు కాకుండా గది వద్దకు చేరుకొని గ్రిల్స్ లేకుండా ఉన్న కిటికీని సునాయసంగా తొలగించి లోనికి ప్రవేశించాడు. యువతిపై లైంగిక దాడికి పాల్పడుతున్న క్రమంలో ఆమె కేకలు వేసి ప్రతిఘటించడంతో బయటికి వినిపించకుండా గొంతు నులిమి హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అఫ్జల్గంజ్: నర్సు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించిన విషయం తెలుసుకుని బీజేపీ నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. నిందితుడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇన్స్పెక్టర్ మోహన్రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా సొంతూరుకు తరలించారు. -
అభివృద్ధికి గండి!
కమీషన్ల కక్కుర్తి.. అర్ధాంతరంగా నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు వికారాబాద్: ఆర్భాటంగా ప్రారంభమైన రోడ్ల అభివృద్ధి పనులు ఆరు నెలలకే ఆగిపోయాయి. విమర్శలు.. పేపర్లలో వార్తలు ప్రచురించిన సమయంలో పనులు ప్రారంభించినట్టు చేస్తున్న కాంట్రాక్టర్లు ఆ వెంటనే నిలిపేస్తున్నారు. జాతీయ స్థాయి ప్రమాణాలతో టెండర్లు దక్కించుకుని పనులు నిలిపివేయడంతో అనుమానాలకు తావిస్తోంది. ఏడాది క్రితం వికారాబాద్–పరిగి, పరిగి–షాద్నగర్, గడిసింగాపూర్–రెడ్డిపల్లి, వికారాబాద్–తాండూరు రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఇందులో వికారాబాద్–పరిగికి రూ.వంద కోట్లతో నాలుగు వరుసలు, పరిగి–షాద్నగర్ రోడ్డు సైతం లాల్పహాడ్ వరకు మొదటి విడతలో రూ. వంద కోట్లతో నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. పరిగి మండలం గడిసింగాపూర్ నుంచి గండీడ్ మండలం రెడ్డిపల్లి వరకు సైతం రూ.వంద కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నారు. ముందుగా పరిగి–వికారాబాద్, పరిగి–షాద్నగర్ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించి మూడు నెలల పాటు పనులు పరుగెత్తించారు. గడిచిన ఆరు నెలలుగా నిలిపి వేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్లు పలువురు ప్రయాణికులను బలి తీసుకోగా అనేక మందిని క్షతగాత్రులను చేసింది. ‘మెగా’ కమీషన్లే కారణమంటూ ప్రచారం కొడంగల్ నియోజకవర్గంలో శరవేగంగా కొనసాగుతున్న పనులు వికారాబాద్, పరిగి నియోకవర్గాల్లో నెమ్మదించాయి. పలుచోట్ల పూర్తిగా నిలిచిపోయాయి. ఒకచోట పెద్ద వంతెన మాత్రమే పనులు జరుగుతుండగా రోడ్ల పనులు నిలిచిపోయాయి. అప్పుడప్పుడు రెండు టిప్పర్ల కంకర పోయడం, ఓ టిప్పర్ను తిప్పుతూ పనులు చేపడుతున్నట్లు చేస్తున్నారే తప్ప ఎక్కడా ముందుకు సాగడంలేదు. రూ.వందల కోట్లతో టెండర్లు దక్కించుకున్న మెగా సంస్థ సబ్ కాంట్రాక్టు ఇచ్చి పనులు చేపడుతున్నట్టు సమాచారం. జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ కాంట్రాక్టర్కు నేతల మధ్య తలెత్తన వివాదాల కారణంగా పనులు నిలిచిపోయాయనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్ దగ్గర పెద్దమొత్తంలో కమీషన్ డిమాండ్ చేయడం వల్లే పనులు నిలిపేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పనులు నిలిచిపోయినా నేతలు నోరు మెదపకపోవటం, పనులను పర్యవేక్షించకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు నిబందనలు పాటించడం లేదు. బ్రిడ్జిలు నిర్మించే చోట సూచిక బోర్డుల ఏర్పాటు సక్రమంగా ఉండడం లేదు. రాత్రి సమయాల్లో ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు రేడియం స్టిక్కర్లు వేయడం లేదు. డైవర్షన్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దుమ్ము లేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. పరిగి–షాద్నగర్ మార్గంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గుంతలో పడి ఓ ద్విచక్రవాహనదారుడు, యాలాల మండల పరిధిలో మరో ద్విచక్రవాహనదారుడు మృతి చెందారు. పరిగి–వికారాబాద్ రోడ్డు సైతం ఇటీవల ఓ ప్రయాణికుడిని బలితీసుకుంది. కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల అండతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా వారిని ఏమి చేయలేక అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. నాణ్యత విషయంలో నోరు మెదపని ప్రజాప్రతినిధులు ప్రజల ప్రాణాల విషయంలోనైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న రహదారులు నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లు అనుమానాలకు తావిస్తున్న నేతల మౌనం -
వెంకట క్రాంతి కిరణ్కు గిడుగు జాతీయ పురస్కారం
చేవెళ్ల: అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని చేవెళ్ల ఐసీడీఎస్ సీడీపీఓ హెప్సిబా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 31 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని కోరారు. ఖాళీల వివరాలు, అర్హతలు, నియమ నిబంధనలు, పూర్తి వివరాలకు మహిళా శిశుసంక్షేమశా అధికార వెబ్సైట్ https://wdcw.tg.nic.in ను సందర్శించాలని సూచించారు. మూడు పోస్టుల భర్తీకి.. అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని కవాడిపల్లి అంగన్వాడీ సెంటర్ –1, 2తో పాటు తారమతిపేటలోని అంగన్వాడీ సెంటర్ –2లో ఉన్న మూడు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్నగర్ సీడీపీఓ వినీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. కుల్కచర్ల: మాలలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాలలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 31న సెక్రటేరియేట్ ముట్టడించేందుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా పరిధిలోని మాలమహానాడు కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. -
నేటితో ఆఖరు
సాక్షి, సిటీబ్యూరో: వంటగ్యాస్, రేషన్ పొందేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ఈ–కేవైసీ, మూడు నెలల రేషన్ ఒకేసారి డ్రా, చేయూత పింఛన్కు ఆన్లైన్లో దరఖాస్తుల నమోదుకు సోమవారంతో గడువు ముగియనుంది. మహా నగరంలో వేలాది పేద కుటుంబాలు ఇంకా ఈ ప్రక్రియలను పూర్తి చేయలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. గడువు తేదీ దాటిపోతే రేషన్ బియ్యం, గ్యాస్ సిలిండర్ నిలిచిపోతాయోనని లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు. కొన్ని రోజులుగా రేషన్ షాపులు, మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ప్రక్రియ మాత్రం వందశాతం పూర్తి కాని పరిస్థితి నెలకొంది. మొరాయిస్తున్న సర్వర్లు ఒకేసారి ఆన్లైన్ ద్వారా ఈ– కేవైసీ వివరా లను నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరుగుతోంది. మీ–సేవ కేంద్రాలు, రేషన్, ఇంటర్నెట్ కేఫ్లలో ‘సర్వర్ డౌన్’ సమాధానం వస్తోంది. వేలిముద్రలు (బయోమెట్రిక్) పడకపోవడం, ఆధార్తో మొబైల్ నంబర్ లింక్ కాకపోవడం, కంటిపాప (ఐరిస్) స్కాన్ సరిగా జరగకపోవడం వంటి సాంకే తిక లోపాలు పెరుగుతున్నాయి. గంటల తరబడి వరుసలో వేచి చూసిన తర్వాత ఒక్కసారిగా నెట్వర్క్ నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. మూడు నెలల సరుకులకు స్టాక్ కొరత ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఒకేసారి రేషన్ బియ్యం పంపిణీకి స్టాక్ కొరత వెంటాడుతోంది. వచ్చిన స్టాక్ వచ్చినట్లే ఖాళీ అవుతుండటంతో దుకాణాలు మూతపడుతున్నాయి. ఒకవైపు ఈ–కేవైసీ నమోదు పూర్తి చేయాల్సిన ఒత్తిడి, మరోవైపు కడుపు నింపే బియ్యం కోటా తీసుకోవాలనే తొందర రెంటి మధ్య పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో లబ్ధిదారు వేలిముద్ర నమోదు చేయడానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. చేయూత తిప్పలు కొత్త చేయూత సామాజిక పింఛన్ల కోసం ఆన్్లైన్ నమోదు ప్రక్రియ సమస్యగా మారింది. అప్లోడింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతో మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు చేతులెత్తేస్తున్నారు. ఆధార్ కార్డుల్లో పేరు, వయసు, చిరునామా సరిపోలక అర్హులైన పేదలకు కూడా పోర్టల్ అంగీకరించడం లేదు. క్షేత్రస్థాయిలో అస్తవ్యస్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గడువు పెంచాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్, రేషన్ కేవైసీ, సరుకుల పంపిణీ, చేయూత దరఖాస్తులకు ముగియనున్న గడువు ఆన్లైన్ సేవల్లో సాంకేతిక సమస్యలు గడువు పొడిగించాలని లబ్ధిదారుల డిమాండ్ -
చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
మీర్పేట: చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ హెచ్చరించారు. మీర్పేట పోలీస్స్టేషన్ పరిధి లెనిన్నగర్లో శనివారం సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు గృహ వినియోగ సిలిండర్లు, రూ.4వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, 2.7 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు రౌడీషీటర్లు, ముగ్గురు అనుమానితులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. అసాంఘీక కార్యక్రమాలు, నేరాలు నివారించడమే కార్డన్ సెర్చ్ ఉద్దేశమని తెలిపారు. తనిఖీల్లో మీర్పేట, బాలాపూర్ ఇన్స్పెక్టర్లు శోభన్, సుధాకర్, డీఐ మట్టం రాజు, రమణ, అబ్ధుల్ అయ్యుం, నితిన్రెడ్డి, ఉమామహేశ్వరి, హరీష్, మల్లయ్య పాల్గొన్నారు. -
అభివృద్ధికి ఎంపీ లాడ్స్ నిధులు
చేవెళ్ల: నియోజవర్గ అభివృద్ధికి ఎంపీ లాడ్స్ నిధులు ప్రాధాన్యతా క్రమంలో వినియోగిస్తున్నట్టు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ 12వ వార్డు రామన్నగూడతోపాటు ఆలూరు, నాంచేరి గ్రామాల్లో రూ.40 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ.1.37 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించినట్టు తెలిపారు. వీటితో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మున్సిపల్ చైర్పర్సన్ సమత, కౌన్సిలర్లు, సర్పంచ్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ఉండి.. బీఆర్ఎస్పై పొగడ్తలా..?
● షాబాద్ రైతువేదికలో ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం ● ప్రసంగాన్ని అడ్డుకున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్, గుడిమల్కాపూర్ ఏఎంసీ చైర్మన్ షాబాద్: షాబాద్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వంలో రైతు వేదికల వద్ద ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని మధుసూదన్రెడ్డి చెప్పగా.. మీరు అలా మాట్లాడటం తప్పు.. గత ప్రభుత్వంలో కూడా రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులంతా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో కందిపంట సాగుపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వంలోనే క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించారని.. 5వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించినట్లు తెలిపారు. రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేశామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే వేదికపై పక్కనే ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, గుడిమల్కాపూర్ ఏంఎసీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ లేచి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో రైతువేదికల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదని, సబ్సిడీలు ఇవ్వలేదని.. మీరు గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో చేసిన పనులు చెబుతాను.. ఈ ప్రభు త్వం చేస్తున్న పనులను వివరిస్తాను.. మీరు కూ ర్చోండి అంటూ సమాధానం చెప్పారు. నేను 13 ఏళ్లుగా ఉన్నాను. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది నేనే. గత ప్రభుత్వంలో పనులు కాలేదని, రైతులకు ఏమి ఇవ్వలేదని, అవగాహన సదస్సులు పెట్టలేద ని మాట్లాడటం తప్పు అన్నారు. గత ప్రభు త్వంలో రైతువేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించారని, రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చారనే విష యాలు అధికారులకు తెలియదాఅని ప్రశ్నించారు. సస్యరక్షణ చర్యలు పాటించాలి కందిసాగులో రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుజాత పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోపి రైతువేదికలో మిషన్ ఆత్మనిర్భర్ పల్సెస్ (ఎంఏఎన్పీ) పథకంలో ద్వారా రైతులకు కంది పంట క్లస్టర్ ఆధారిత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కంది పంటలో విత్తన శుద్ది, సమగ్రపోషక యాజమాన్యం కలుపు నివారణ, పురుగు, తెగుళ్ల సమగ్ర యాజమాన్య పద్ధతులు వంటి అంశాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో సర్ధార్నగర్ ఏఎంసీ చైర్మన్ పీసరి సురేందర్రెడ్డి, జిల్లా వ్యవసాయ కార్యాలయం టెక్నికల్ ఏడీఏ పద్మజ, శాస్త్రవేత్త, దిలీప్, ఏఓ విజయచంద్ర, సర్పంచ్ అశోక్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, రైతులు, తదితరులున్నారు. -
అధికారులు సమన్వయంతో సాగాలి
కొత్తూరు: గ్రామాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పించడానికి ఆయా శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండల పరిధిలోని పెంజర్ల పంచాయతీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు. ఖాళీ ప్రాంతాలు, ఇళ్ల మధ్య చెత్త పారబోయొద్దని, ఇళ్ల నుంచే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. అంగన్వాడీకేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. నర్సరీల్లో మొక్కల పెంపకం, సంరక్షణను సక్రమంగా చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రోళ్ల జగన్, ఎంపీడీవో అరుంధతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


