Ranga Reddy District Latest News
-
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి
అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని బాటసింగారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ధన ఆంజనేయులు 12వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం దాసరి ప్రతాప్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ధన ఆంజనేయులు ఈ నెల 7న సరూర్నగర్లో నిర్వహించిన జిల్లా స్థాయి లాంగ్జంప్ ఈవెంట్లో సత్తాచాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని చెప్పారు. ఈ సందర్భంగా బాటసింగారం పాలకవర్గం. పాఠశాల ఉపాధ్యాయ హర్షం వ్యక్తం చేస్తూ ఆంజనేయులను అభినందించారు. మైలార్దేవ్పల్లి: కారు చక్రాల కింద పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మైలార్దేవ్పల్లి ఎస్ఐ విశ్వనాథ్రెడ్డి తెలిపిన ప్రకారం.. పల్లెచెరువులో గోబింద్రామ్ కుటుంబం నివాసముంటోంది. అతని కుమారుడు షియంకుమార్(3) బుధవారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీకి చెందిన డ్రైవర్ అరవింద్(30) కారులో వేగంగా వచ్చాడు. బాలుడిపై కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని గురువారం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని మాట్లాడి సర్దిచెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
స్కూల్.. ఫుల్!
తెలంగాణ పబ్లిక్ స్కూల్కు విశేష ఆదరణ ● నో అడ్మిషన్ బోర్డు పెట్టేసిన సిబ్బంది మంచాల: విద్యార్థులు లేక పలు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్న ప్రస్తుత తరుణంలో.. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇందులో చేరడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ ప్రవేశాలు రావడంతో ఉపాధ్యాయులు సైతం చేతులెత్తేశారు. ● మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1,605 మంది చదువుతున్నారు. ● ప్రీ ప్రైమరీ పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పించడానికి నలుగురు ఉపాధ్యాయులు, నలుగురు ఆయాలను నియమించారు. ● ఒకటి నుంచి 5వ తరగతి వరకు 495 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క తరగతిలో 3 సెక్షన్లు, ఒక్క సెక్షన్కు 33 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి చదువు చెప్పడానికి 18 మంది ఉపాధ్యాయులను నియమించారు. ● ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు 960 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క తరగతిలో 4 సెక్షన్లు, ఒక్కో సెక్షన్లో 40 మంది చొప్పున 160 మంది విద్యార్థులున్నారు. వీరికి బోధించేందుకు 28 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ● ప్రస్తుతం మంచాల మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న 37 గ్రామాల నుంచి ఇక్కడికి చదువు కోసం వస్తున్నారు. వీరి రాకపోకల కోసం ఐదు బస్సులు నడిపిస్తున్నారు. ● ఎక్కువ మందిని చేర్చుకోవడం పాఠశాల నిబంధనలకు విరుద్ధమే కాకుండా, నిర్వహణ కష్టంగా మారుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్ద నోఅడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యార్థులను చేర్చుకున్నాం. ప్రస్తుతం 1,605 మందికి పైగా ఉన్నారు. మరింత మందిని తీసుకుంటే బోధన కష్టమవుతుంది. అందుకే నో అడ్మిషన్ బోర్డు పెట్టాం. – జి. గిరిధర్ గౌడ్ (హెడ్ ఆఫ్దీ స్కూల్)నాణ్యమైన, సృజనాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటాం. – జహీర్, ఉపాధ్యాయుడు -
కాంగ్రెస్లో పలువురి చేరిక
ఆమనగల్లు: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో తలకొండపల్లి గ్రామానికి చెందిన ఉప్పనమోని తిరుపతయ్య, పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, ప్రభాకర్రెడ్డి, అంజయ్యగుప్తా, అజీం, వెంకట్రెడ్డి, అజీజ్, కృష్ణ, రవీందర్యాదవ్, రామకృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మన్నగూడ సర్పంచ్.. యాచారం: మండల పరిధిలోని ధర్మన్నగూడ సర్పంచ్ పండుగ పద్మావతి గురువారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామాభివృద్ధి కోసమే తాను బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నట్లు సర్పంచ్ ప్రకటించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, నాయకులు శ్రీశైలం, వెంకటేశ్వర్లు, బాల్రాజ్, అంజయ్య, మల్లేష్, కృష్ణ, చెన్నయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
16న యువ సమ్మేళనం
మంచాల: నగరంలోని కొత్తపేట్లో ఈనెల 16న జరిగే యువ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి రావుల జంగయ్య కోరారు. గురువారం మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక బాధ్యతగా దేశ భక్తితో నడుచుకోవాలన్నారు. యువ సమ్మేళనం నిర్వహణ కోసం నిధుల సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బుగ్గరాములు, గోపాల్, బుచ్చయ్య, యూసుఫ్ అలీ, మల్లేష్, అంజయ్య, వీరేష్, గణేష్, విజయ్, రాజు, గాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
22 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
ఇద్దరు మహిళలపై కేసు షాద్నగర్ రూరల్: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు మహిళలపై కేసు నమోదయింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని లాల్సింగ్ తండాలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఏఓ రాజేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. లాల్సింగ్ తండాకు చెందిన కవిత ఇంట్లో కొందుర్గు మండలం పాత ఆగిర్యాలకు చెందిన రాజేశ్వరి నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు నిల్వ చేసింది. ఈ విత్తనాలు అదే తండాలో విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు 22 కిలోల నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకుని వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించారు. ఇన్చార్జి ఏఓ రాజేందర్రెడ్డి ఫ/ర్యాదు మేరకు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రణయ్ తెలిపారు. యువకుడికి రిమాండ్ కడ్తాల్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కడ్తాల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మూడ చరణ్ ఓ యువతిని కొంత కాలంగా ప్రేమ పేరిట వేధిస్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తి చేస్తున్నాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించసాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారన్నారు. షాబాద్: డ్యాన్స్ నేర్పించేందుకు వెళ్లిన మాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. షాద్నగర్కు చెందిన డాకూరి భాస్కర్ కుమారుడు మధు(19) షాద్నగర్ రాక్ డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ మాస్టర్. రోజు మాదిరిగానే ఈ నెల 10న ఇంట్లో డ్యాన్స్ క్లాస్కు వెళ్తున్నాని చెప్పాడు. అదే రోజు రాత్రి 9 గంటలకు షాబాద్ మండలం మన్మర్రి గ్రామంలో స్నేహితుడు జశ్వంత్ వాళ్ల అక్క కొడుకు తొట్టెల ఫంక్షన్లో ఉన్నానని వీడియో కాల్ చేశాడు. ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు మధుకు ఫోన్ చేశారు. దీంతో మిత్రులు ఫోన్ లేపి ఈతకు వచ్చామని మధుకు ఈత రాక చనిపోయాడని చెప్పారు. తమ కుమారుడికి ఈత వచ్చని జశ్వంత్, అతని స్నేహితులపై తమకు అనుమానం ఉందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రోడ్లపై నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు
మీర్పేట: వర్షాకాలంలో ప్రధాన రహదారులపై నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని బడంగ్పేట సర్కిల్ డీఈ హరిణి తెలిపారు. ఎమ్మెల్యే సబితారెడ్డి ఆదేశాల మేరకు గురువారం 58, 60 డివిజన్లలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాదరి రమేశ్, విజయ్, ట్రాఫిక్, హై డ్రా అధికారులతో కలిసి డీఈ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాలాపూర్ ఎక్స్రోడ్డు, ఆర్సీఐ ప్రధాన రహదారి, విశాల్మార్ట్ పరిసరాలు, చందన చెరువు, ఎస్వైఆర్ కన్వెన్షన్ వద్ద వర్షపునీరు నిలిచే ప్రాంతాలను గుర్తించామన్నారు. వర్షాకాలం దృష్ట్యా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారులపై నీరు నిల్వకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా హైడ్రా, ట్రాఫిక్ శాఖలను సమ న్వయం చేసుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూ స్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్కిల్ ఏఈ సౌమయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, హైడ్రా అధికారి మహ్మద్ జమీల్ ఉన్నారు. -
జంట హత్యల కేసు ప్రధాన నిందితురాలి మృతి
తాండూరు/తాండూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన కరీమాబీ(50) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాండూరులోని రాజీవ్గృహకల్ప కాలనీలో నివాసం ఉండే కరీమాబీ తనకు పరిచయమున్న మహిళల వద్ద అప్పులు తీసుకుంది, డబ్బుల కోసం ఒత్తిడి చేసిన వారిని అంతమొందించేందుకు పథకం వేసింది. ఈక్రమంలో తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబ్బీ(58), బషీరాబాద్ మండలం కాశీంపూర్కు చెందిన అంగన్వాడీ ఆయా అబేదాబేగం(60)లను మొయినాబాద్లోని ఓ ప్రైవేటు ఫాంహౌస్లో హత్య చేసి, అక్కడే పూడ్చిపెట్టింది. ఇందుకు రహ్మాన్, నయీం అనే ఇద్దరు వ్యక్తుల సాయం తీసుకుంది. మహిళల మిస్సింగ్పై విచారణ చేపట్టిన పోలీసులు కాల్డాటా ఆధారంగా నిందితులను పట్టుకుని, విచారించారు. వాష్రూమ్ క్లీనర్ తాగి.. తాండూరులోని సీఐ కార్యాలయంలో గత నెల 17న పోలీసులు కరీమాబీని విచారించారు. ఈ సమయంలో వాష్రూమ్కి వెళ్తానని చెప్పిన ఆమె అక్కడే ఉన్న బాత్రూమ్ క్లీనర్(ఫినాయిల్) తాగింది. వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం నగరానికి తరలించారు. 25 రోజులుగా చికిత్స పొందిన కరీమా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో నిమ్స్ ఆస్పత్రిలో చనిపోయింది. ఆమె మృతదేహానికి తాండూరులో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు బాడీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు.. జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమాబీ ఆత్మహత్యాయత్నం చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ స్నేహ మెహ్ర గత ఆదివారం కానిస్టేబుళ్లు సునీత, బస్వరాజ్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఏం జరిగిందంటే.. తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజీవ్గృహకల్పకు చెందిన కరీమాబీ ఇదే కాలనీకి చెందిన అబ్దుల్ రహ్మాన్తో సహజీవనం చేసేది. వీరిద్దరూ అధిక వడ్డీ ఆశచూపి అమాయక మహిళల వద్ద అప్పులు చేశారు. ఈ సొమ్ముతో జల్సాలు చేస్తూ గడిపారు. వాయిదా ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడి చేయగా, వీరి పక్కనే ఉండే మహబూబ్బీని హత్య చేయాలని పథకం వేశారు. మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్హౌస్కు వస్తే డబ్బులు ఇస్తామని నమ్మించారు. నయీంపాష అనే మరో వ్యక్తితో కలిసి మార్చి 27న ఆమెను హత్యచేశారు. అనంతరం కాశీంపూర్ గ్రామానికి చెందిన అబేదాబేగంను సైతం ఫామ్హౌస్కు రమ్మని మే 5న హతమార్చారు. మృతుల సెల్ఫోన్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పోలీసు వర్గాల్లో ఆందోళన కరీమాబీ మృతి పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఆమెకు మెరుగైన చికిత్స అందేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సొంత ఖర్చులతో కార్పొరేట్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యానికి సైతం వెనకాడలేదని తెలుస్తోంది. కరీమాబీ చనిపోతే తమ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుందనే కారణంతో ఇదంతా చేశారని సమాచారం. కానీ ఆమె మృతితో కథ మొదటికి వచ్చినట్లైంది. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
తుర్కయంజాల్: పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ డిమాండ్ చేశారు. గురువారం రాగన్నగూడలోని ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. 71 మంది కార్మికులు, గతంలో మున్సిపాలిటీలుగా ఉన్న సమయం నుంచి పనిచేస్తున్నారని, జీహెచ్ఎంసీలో విలీనం అయినప్పటి నుంచి వేతనాలు రావడం లేదని వాపోయారు. అనంతరం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.సత్యనారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సాలయ్య, కృష్ణ, రవి, స్వప్న, జయ, దీవెన, జ్యోతి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అబ్దుల్లాపూర్మెట్: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని చెప్పారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ మండల పరిధిలో 400 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పెద్దఅంబర్పేటలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కయంజాల్ జోన్కు 153 మంది, పెద్దఅంబర్పేట్లో 140, అబ్దుల్లాపూర్మెట్ మండలానికి చెందిన 107 మందికి చెక్కులు మంజూరు కాగా రూ.4.46 కోట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీవాణి, పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 180 మందికి చెక్కుల అందజేత కడ్తాల్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో 180 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని అన్నారు. పేదల పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందన్నారు. ఖానాపూర్ శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్గౌడ్, గీత, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నర్సింహ, బీచ్యానాయక్, ప్రభాకర్రెడ్డి, భిక్షపతి, కేశవరెడ్డి, వెంకటేశ్, తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ సుజాత, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్
యాచారం: గృహ నిర్మాణ రంగంలో జీవితాలను వెల్లదీస్తున్న తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తాపీమేసీ్త్రల సంఘం నేతలు పేర్కొన్నారు. మండల పరిధిలోని తాపీమేసీ్త్రలు గురువారం యాచారంలో సమావేశమయ్యారు. సిమెంట్, ఇటుక, రాయి, ఇతర ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా నిర్మాణ రంగంలో కూడా యజమానులు ధరలు పెంచాలన్నారు. తాపీమేసీ్త్రలకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు, రేషన్కార్డులు, ఎలాంటి షరతుల్లేకుండా బ్యాంకుల్లో రుణాలు అందజేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని, జిల్లా స్థాయి అధికారులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కిరణ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘం నేతల నిరసన కడ్తాల్: హక్కుల సాధన కోసం మండల కేంద్రంలో బాలాజీ తాపీమేసీ్త్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తాపీమేసీ్త్రలు మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణదారులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు పెరిగిన సెంట్రింగ్ కూలీల ధరలకు నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా ఇళ్లను నిర్మించే వారు తమ ధరలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రయ్య, శ్రీరాములు, వెంకటేశ్, జంగయ్య, శ్రీను, బాబు, మల్లేశ్, కోటయ్య, మల్లేశ్, కృష్ణ తదితరులు ఉన్నారు. భవన నిర్మాణ పనులు బంద్ ఇబ్రహీంపట్నం: తాపీమేసీ్త్రలకు నిర్దిష్టమైన రేట్లను నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ పనులను బంద్ పెడుతున్నట్లు ఇబ్రహీంపట్నంలోని వరసిద్ధి వినాయక భవన నిర్మాణ కార్మిక సంఘం గురువారం పిలుపునిచ్చింది. ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. తాపీమేసీ్త్రల రేట్లను పెంచాలని ఈనెల 16వ తేదీ వరకు పనులను బంద్ పెడుతున్నట్లు తెలిపారు. సంఘం నిబంధనలు అతిక్రమించి ఎవరైన పనిచేస్తే రూ.20 వేల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆసంఘం అధ్యక్షుడు బాలరాజు, సభ్యులు రఘు, దశరథ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సుస్థిర వ్యవసాయానికి ప్రాధాన్యం
మంచాల: గ్రామాల్లో సుస్థిర వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ అన్నారు. గురువారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బండలేమూర్ గ్రామంలో సుస్థిర వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రోజురోజుకూ ఆహార పదార్థాల కలుషితం అధికమవడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. సాగులో రసాయన ఎరువులు వాడకం తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట, వర్మీ కంపోస్టు, జీవ ఎరువులు వాడాలన్నారు. నేలలో పోషకాలను గుర్తించి తదనుగుణంగా ఎరువులను ఉపయోగించాలన్నారు. విత్తన శుద్ధితో మెరుగైన ప్రయోజనాలు ఉంటాయన్నారు. ప్రధానంగా పర్యావరణం కాపాడుకొని పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు సుధీర్, అకిల, సర్పంచ్ పి.శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి పాండు రంగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇలాకాలో విత్తన దోపిడీ!
● నాలుగు మండలాల్లో విచారణ ● వెలుగు చూసిన వ్యవసాయ శాఖ అక్రమాలు ● నేరుగా రైతులను కలిసిన పంచాయతీ కార్యదర్శులు ● 90శాతం మంది వేరుశనగ విత్తనాలు తీసుకోలేదని వెల్లడి కొడంగల్/బొంరాస్పేట/దౌల్తాబాద్: సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయాధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలను దోచేశారు. బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గురువారం కొడంగల్, దుద్యాల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాల్లో అక్రమాలు జరిగినట్లు బహిర్గతం అయింది. వంద, యాభై శాతం సబ్సిడీపై పంపిణీ చేయాల్సిన విత్తనాలను వ్యవసాయాధికారులు గట్టు చప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాలతో విచారణ చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ జరిగింది. పంచాయతీ కార్యదర్శులు రైతుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. 90 శాతం మందికి పైగా విత్తనాలు తీసుకోలేదని తెలిసింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు రైతుల నుంచి సంతకాలు తీసుకున్నారు. అక్రమాల నేపథ్యంలో దుద్యాల్ ఏఓ, ఇద్దరు ఏఈఓలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దుద్యాల్, రేగడిమైలారం ఏఈఓల దగ్గర ఉన్న రికార్డులను జిల్లా విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బొంరాస్పేట్ మండలం మెట్లకుంట, బుర్రితండా, కాకర్లగండి తండా, బురాన్పూర్, మదన్పల్లి, లోతికుంటతండా, కొత్తూరు, సాలిండాపూర్, వడిచర్ల గ్రామాల్లో జీపీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో విత్తన అక్రమాలపై ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు వివరాలు సేకరించారు. -
పునఃప్రారంభానికి సిద్ధం
ఇబ్రహీంపట్నం రూరల్: వేసవి సెలవుల గడువుకు ముగింపు దగ్గర పడుతోంది. బడులు ప్రారంభం కావాల్సిన సమయం రానే వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఏటా జూన్ 12వ తేదీన విద్యాసంస్థలు పునఃప్రారంభం అవుతాయి. కానీ ఈసారి ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో మూడు రోజులు ఆలస్యంగా బడులు ప్రారంభిస్తున్నారు. 15వ తేదీన బడులు తెరుచుకోనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. 89 శాతం పుస్తకాలు పంపిణీ ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్ సిద్ధం చేయాల్సి ఉంది. గత, నేటి ప్రభుత్వాలు ఇదే విధంగా పనులు చేపడుతున్నాయి. మండలంలో 46 ప్రభుత్వ పాఠశాలలు, మూడు రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. వీటిలో 7,210 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా బడులు తెరుచుకోవడానికి ముందే పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. ఈసారి 42,052 పుస్తకాలు మండల విద్యాధికారి కార్యాలయం నుంచి ఆయా బడులకు చేరవేశారు. 89 శాతం పుస్తకాలు అందించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు నోట్బుక్స్ కూడా 43,000 అందజేశారు. గతంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే వర్క్ బుక్స్ ఇచ్చేది. కానీ ఈ సారి అన్ని తరగతుల విద్యార్థులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అల్పాహారం ఎప్పుడు సీఎం రేవంత్రెడ్డి విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని అల్పాహారం తీసుకొస్తామని చెప్పారు. కానీ నేటికి దానిపై ఉలుకు పలుకు లేదు. అలాగే విద్యార్థి కిట్ పేరుతో 9 రకాల సామగ్రి అందజేస్తామని ప్రకటించారు. ఈ పథకం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రారంభిస్తామని అన్నారు. అందులో భాగంగా యూనిఫాం, బ్యాగు, ష్యూ, టై, బెల్టు, ఐడీ కార్డు, సాక్సులు, ప్లేటుతో పాటు స్టేషనరీ సామగ్రి ఇస్తామని పేర్కొన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరోవైపు ప్రైవేటు బడుల్లో ఫీజుల పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. 15న తెరుచుకోనున్న విద్యాసంస్థలు ఇప్పటికీ పత్తాలేని యూనిఫాంలు బడులకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు నేటికీ అందని విద్యార్థుల కిట్లు స్కూల్ డ్రస్సుల జాడేది? అన్ని బాగానే ఉన్నా యూనిఫాం(ఏకరూప దుస్తులు) విషయంలో స్పష్టత లేదు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం యూనిఫాంలు కుట్టించి సిద్ధం చేసేది. ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున స్కూల్ దుస్తులు అందజేస్తుంది. కానీ ఈసారి సమయం దగ్గర పడుతున్నా కనీసం క్లాత్ కూడా పాఠశాలకు చేరుకోలేదు. కొలతలు తీసుకునేది ఎప్పుడు.. కుట్టేది ఎప్పుడు.. పిల్లలకు ఇచ్చేది ఎప్పుడని వాపోతున్నారు. ముందస్తుగా పంపిణీ చేయకుండా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ ఎండకాలం సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 15న తెరుచుకోనున్నాయి. పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరుగుతున్నా యూనిఫాం విషయంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకాలు చేరవేశాం ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్ప టికే బడులకు పుస్తకాలు చేరవేశాం. అల్పాహారం, స్టూడెంట్ కిట్లు పథకం అమలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి బలోపేతం చేయండి. మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రస్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఉచితంగా ఇస్తాం. – హీర్యానాయక్, ఎంఈఓ, ఇబ్రహీంపట్నం -
ఇళ్ల నిర్మాణాలకు సహకారం
మాడ్గుల: మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురి ఇళ్ల నిర్మాణాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ చేయూతనందించారు. బక్కమ్మ, సుజాత, సంజీవ్ల ఇంటి నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ను వెంకటేశ్ సమకూర్చగా గురువారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు అందించారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్, శ్రీధర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే అజిలాపూర్ గ్రామానికి చెందిన కలకొండ యాదమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీలును ఉప్పల వెంకటేశ్ తరఫున బీఆర్ఎస్ నేతలు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన కాలె రుక్కమ్మ అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.1.50 లక్షల ఎల్ఓసీ చెక్కు మంజూరైంది. గురువారం బాధితురాలికి ఎల్ఓసీ చెక్కును సర్పంచ్ భారతమ్మ అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జ్యోతి ప్రదీప్రెడ్డి, నాయకులు గోపాల్, మహేశ్, చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య, బసవలింగం, మల్లేశ్, రామస్వామి తదితరులు ఉన్నారు. -
పచ్చని పల్లెల్లో మైనింగ్ ప్రక్రియలు చేపడితే పర్యావరణం పాడవడంతో పాటు ప్రజా జీవనానికి ముప్పు వాటిల్లనుందని ఆయా గ్రామాల ప్రజలు తిరగబడుతున్నారు. ముక్తకంఠంతో గనుల తవ్వకం చేపట్టొద్దని ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
మంచాల: మండలంలోని చిత్తాపూర్ రెవెన్యూ పరిధిలో 92 సర్వే నంబర్లో 270 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అందులో 36 మందికి 237 ఎకరాలు ప్రభుత్వం సర్టిఫికెట్లు పంపిణీ చేయగా మరో 33 ఎకరాలు మిగులు భూమి ఉంది. అందులో ఉన్న తొల్చగుట్టను ప్రభుత్వం సేవియర్ మైన్స్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మైనింగ్కు కేటాయించింది. రూ.3 కోట్లతో 15.378 హెక్టార్లలో క్వారీ మైనింగ్ తీసుకునేందుకు అనుమతులు సైతం వచ్చాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులు జారీ చేసింది. బుధవారం ఫ్యూఛర్ సీటీలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మైనింగ్ రద్దుకు పోరాటం ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురైన గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. భూముల రేట్లు పెరిగాయి. తొల్చగుట్టలో మైనింగ్ ఏర్పాటుతో చిత్తాపూర్తో పాటు ఆప్రాంతం అనుసరించి ఉన్న తిప్పాయిగూడ, తాళ్లపల్లి గూడ గ్రామాల ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ మైనింగ్ ఏర్పాటు తమ భూములు రేట్లు పడిపోవడంతో పాటు వ్యవసాయం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా సమావేశాలు ఏర్పాటు చేసి మైనింగ్ రద్దు చేయాలని పోరాటాలకు పిలుపునిచ్చారు. పదేళ్ల క్రితమే చైతన్యం పదేళ్ల క్రితం మండలంలోని ఆరుట్ల రెవెన్యూ పరిధిలోని 1,363 సర్వే నంబర్లో మైనింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. పర్యావణవేత్త దొంతి నర్సింహారెడ్డి, సరస్వతి కవుల తదితరులు ప్రజలను చైతన్యంచేశారు. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఆందోళన చేపట్టి మైనింగ్ను అడ్డుకున్నారు. చిత్తాపూర్లో మైనింగ్ మంట 15.378 హెక్టార్లలో గనుల తవ్వకానికి అనుమతిచ్చిన ప్రభుత్వం రూ.3 కోట్లకు సేవియర్ మైన్స్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయింపు బుధవారం ముఖ్యమంత్రి మీటింగ్ కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న ప్రజలు -
మత్తుపదార్థాలతో జీవితం చిత్తు
శంకర్పల్లి: మాదకద్రవ్యాల వినియోగంతో యువ త బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని మోకిల ఎస్ఐ సురేశ్గౌడ్ అన్నారు. గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. చిరు వ్యాపారుల దుకాణాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. ఇటీవల మత్తు పదార్థాలను యువత పెద్ద మొత్తంలో ఉపయోగిస్తుందని, దీంతో తమ ఆరోగ్యంతో పాటు జీవితం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. మాదక ద్రవ్యాలు కొనే, అమ్మేవారిపై పటిష్ట నిఘా ఉంటుందని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. -
బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు
ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్నాయని పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని మార్కెట్యార్డు ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు ప్రజల ఓట్లను దోచుకుని రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు రాజ్యసభ సీట్లను కాజేసే స్థాయికి దిగజారిందని విమర్శించారు. బీజేపీ పాలనలో ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడం, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను దెబ్బతీయడం పరిపాటిగా మారిందన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక దురదృష్టకర ఘటన అని అభివర్ణించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, పార్టీ మండల అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, నాయకులు కేశవులు, గూడురు శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ -
పూజారికి కేటాయించిన స్థలాన్ని తీసుకోవద్దు
యాచారం: గ్రామ పూజారికి కేటాయించిన గది స్థలంలో మహిళా సంఘం భవనాన్ని నిర్మించొద్దని యాచారం గ్రామ పంచాయతీ ఒకటో వార్డు సభ్యుడు మారోజ్ ప్రదీప్చారి గురువారం మండల పంచాయతీ అధికారి శ్రీలతకు ఫిర్యాదు చేశారు. గ్రామ ఉప సర్పంచ్ మంగతో పాటు మరో ఐదుగురు వార్డు సభ్యులు, వంద మందికి పైగా గ్రామస్తుల సంతకాలతో కూడిన ఫిర్యాదును ఎంపీఓకు అందజేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే పూజారికి కేటాయించిన గదిని కూల్చి మహిళా సంఘం భవనాన్ని నిర్మించాలని చూడడం సరైంది కాదన్నారు. గతంలో పిల్లర్లు వేసిన స్థలంలోనే డ్వాక్రా సంఘం మహిళా భవనం నిర్మిస్తే గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రచారం తుర్కయంజాల్: ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే బడిబాట లక్ష్యమని కోహెడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మీలా విజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో ఆదిబట్ల సర్కిల్ పరిధి సంఘీనగర్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్లి, తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని వివరించారు. కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, క్రమశిక్షణ, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా కో కన్వీనర్గా విష్ణుగౌడ్ అబ్దుల్లాపూర్మెట్: బీజేపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఓబీసీ మోర్చా కో–కన్వీనర్గా మండలంలోని బాటసింగారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు బండిగారి విష్ణుగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విష్ణుగౌడ్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో నియోజకవర్గ ఓబీసీ మోర్చా కో–కన్వీనర్ పదవి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, ఓబీసీలంతా బీజేపీ వైపు మొగ్గు చూపే విధంగా కృషి చేస్తానన్నారు. జ్యూట్ బ్యాగుల పంపిణీ మంచాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ను నిషేధించాలని మండలంలోని రంగాపూర్ సర్పంచ్ బాలకృష్ణ సూచించారు. గురువారం రంగాపూర్ అనుబంధ గ్రామం జలాల్మీయా పల్లెలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు జ్యూట్ బ్యాగులు, యువకులకు టీం షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ను నిషేధించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు అశోక్, మనిత, దివ్య, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు జంగారెడ్డి, బాబయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపరిష్కరించాలని డిమాండ్ తుక్కుగూడ: మంఖాల్ డివిజన్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు కోటకాడి శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మంఖాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలల నుంచి డివిజన్లో సరిపడా నీరు రావడం లేదన్నారు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల నుంచి వేల రూపాయలు ఖర్చు చేసి నీటిని కొనుగోలు చేస్తున్నారన్నారు. నీటి సమస్యపై పలుమార్లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి మంఖాల్లో సరిపడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో శంషాబాద్ జోనల్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. -
రూ.2 వేల కోట్ల భూమి సర్కార్దే..
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 41/12, 41/13, 41/14లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 15 ఎకరాలు సర్కార్వేనని హైకోర్టు తేల్చిచెప్పింది. హక్కులు కోరుతూ ఐటినా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. పిటిషనర్ల చూపిన పట్టా సర్టిఫికెట్లు నకిలీవని, కల్పిత పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములను కాజేసే కుట్ర జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు ఆధారంగా చూపిన 1972, 1973 సంవత్సరాల పట్టా సర్టిఫికెట్లపై రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయ ముద్ర ఉందని..ఆ కార్యాలయం 1978లో మాత్రమే ఏర్పడిందని పేర్కొంది. పిటిషనర్ల హక్కులన్నీ ఈ పట్టాలపైనే ఆధారపడ్డాయని.. అనుమానాస్పదంగా ఉన్న వాటిని నిజమైనవని నిరూపించే బాధ్యత పూర్తిగా వారిపైనే ఉందని వ్యాఖ్యానించింది. కానీ వారు అది నిర్వర్తించలేకపోయినందున నకిలీ పట్టాల ఆధారంగా జరిగిన తదుపరి లావాదేవీలు, రెవెన్యూ ఎంట్రీలు, విక్రయాలు కూడా చట్టబద్ధ హక్కులను సృష్టించలేవని స్పష్టం చేసింది. అక్రమాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీఐడీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణ ముగించింది. కార్యాలయ ముద్ర అనుమానాస్పదం ఖానామెట్లోని 15 ఎకరాల భూమి తమదేనని, అధికారులు దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ హైకోర్టులో ఐటినా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ సైనికులకు కేటాయించిన భూమిని వారి వారసుల నుంచి 2006లో పిటిషనర్ కొనుగోలు చేసింది. పట్టా భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. పిటిషనర్లు ఆధారంగా చూపిన 1972, 1973 సంవత్సరాల పట్టా సర్టిఫికెట్లపై ‘తహసీల్దార్, రాజేంద్రనగర్’ కార్యాలయ ముద్ర ఉందని, కానీ ఆ కార్యాలయం 1978లోనే ఏర్పడిందన్నారు. ఆ సర్టిఫికెట్లు అసలైనవిగా ఉండే అవకాశం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని తేల్చేశారు. తహసీల్దార్ జారీ చేయాల్సిన ఆదేశాలను ‘రికార్డింగ్ ఆఫీసర్’ పేరిట జారీ చేసినట్లు చూపడం అనుమానాస్పదమని, ఆ పత్రాలు కూడా కల్పితమైనవేనని అభిప్రాయపడ్డారు. నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా జరిగిన లావాదేవీలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పిటిషన్ను కొట్టివేస్తూ, పిటిషనర్కు రూ.5 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించారు. ఖానామెట్ భూములపై ఐటినా ప్రాపర్టీస్ పిటిషన్ కొట్టివేత అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సీఐడీ దర్యాప్తునకు ఆదేశం -
ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి మృతి
శంకర్పల్లి: నిర్మాణ కంపెనీలో పని చేస్తు న్న ఓ యువకుడు ప్ర మాదవశాత్తు గుంత లో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అనంతవరం గ్రామానికి చెందిన రాజు, రేణుక దంపతులు. వీరికి ఇద్దరూ కుమారులు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్పల్లి మండలం మోకిలకి వచ్చి నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. వీరి పెద్ద కొడుకు అశోక్(25) స్థానికంగా ఎస్ఎస్ఐ బహుళ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నారు. మధ్యాహ్నం ఆయన పని చేస్తుండగా బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద ఉన్న కుంటలో పడ్డాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మురుగు కాలువలో మృతదేహం లభ్యం పహాడీషరీఫ్: మురుగు కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై దయాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద డ్రైనేజీ మురుగు కాలువలో యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, మృతుడి వయసు 35–40 ఏళ్ల నడుమ ఉంటుందని, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడాన్ని గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మట్టిపోసి.. మూసేసి!
చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలుఓవైపు చెరువులు, కుంటలను కాపాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిని పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయి. శిఖం భూముల్లో మట్టి పోసి చెరువులను మూసివేస్తూ.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. – మొయినాబాద్హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో రియల్ వ్యాపారులు పాగా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో 111 జీవో అమల్లో ఉండటంతో పక్కనే ఉన్న గండిపేట మండలంతో పోలిస్తే భూముల ధరలు సుమారు 10 రెట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో రియల్ వ్యాపారులు ఇక్కడ తక్కువ ధరలో భూములు కొనుగోలు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల సమీపంలో భూములు కొని వాటిని కబ్జా చేస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీతోపాటు మండలంలో సుమారు 48 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెవులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు, పూడ్చివేతలు కొనసాగాయి. కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. శిఖంలో మట్టితో పూడుస్తున్న వైనం ఆనవాళ్లు లేకుండా చేస్తున్న అక్రమార్కులు నోటీసులతో సరిపెడుతున్న అధికారులుపరిశీలించి చర్యలు తీసుకుంటాం అమ్డాపూర్ పటేల్కుంటలో మట్టి పోస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపించి పరిశీలించాం. శిఖంలో మట్టిపోస్తే చర్యలు తీసుకుంటాం. మండలంలోని చెరువులు, కుంటలను పరిశీలించి ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో గుర్తిస్తాం. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
అభివృద్ధిని ధ్వంసం చేయడమే మార్పా?
మొయినాబాద్: మార్పు అంటే అభివృద్ధిని ధ్వంసం చేయడమేనా అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డును మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిమా యత్నగర్ రెవెన్యూలోని ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ ఏర్పాటు చేసిందని తెలిపారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి చెత్తనంతా క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనం, నర్సరీలో వేస్తూ డంపింగ్ యార్డుగా మార్చేశారన్నారు. దుర్వాసన, ఈగలు, దోమలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రోడ్డుపై వెళ్లేవారు ముక్కమూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓవైపు మూసీ ప్రక్షాళన చేపడుతూ గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాల పక్కనే చెత్త డంపింగ్ చేయడం ఏమిటని నిలదీశారు. వర్షం పడితే డంపింగ్ యార్డులోని నీరంతా జలాశయాల్లో చేరుతుందన్నారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలి యదా అంటూ ధ్వజమెత్తారు. మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్తో ఫోన్లో మాట్లాడి నెల రోజుల్లో డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తొ లగించాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ ఆఽ ద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హె చ్చరించారు. ఆమె వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయ కులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రవూఫ్, కౌన్సిలర్ శ్రీధర్, మాజీ సర్పంచ్లు మంజుల, శ్రీహరియాదవ్, మహేందర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
నేను చనిపోతున్నా.. బతకాలని లేదు
భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య పహాడీషరీఫ్: ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అంటూ ఓ వ్యక్తి తన భార్యకు వీడియో కాల్ చేసి, ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన పెరుమాళ్ల నరేష్(37) జీహెచ్ఎంసీలో పనిచేస్తూ తుక్కుగూడలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పదిహేనేళ్ల క్రితం శంషాబాద్కు చెందిన శ్రీలతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో శ్రీలత తన పెద్ద కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తనతో పాటే ఉన్న చిన్న కుమారుడిని నరేష్ ఈనెల 8న భార్య వద్ద వదిలేసి వచ్చాడు. రాత్రి 12:30 గంటలకు శ్రీలతకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అని ఫోన్ కట్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె నరేష్ మేనమామ రవీందర్కు చెప్పి, తుక్కుగూడకు వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మచ్చుకు కొన్ని..
● సురంగల్ రెవెన్యూలోని దర్గ చెరువు సుమారు 15 ఏళ్ల క్రితమే పూర్తిగా కబ్జాకు గురైంది. చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం చెరువు ఆనవాళ్లే లేకుండా పోయాయి. ● పెద్దమంగళారం రెవెన్యూలోని ఎల్లమ్మకుంట శిఖం భూమిలో పదేళ్ల క్రితం వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించారు. ప్రస్తుతం శిఖం భూమిలో చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ● సురంగల్ రెవెన్యూలోని మామిళ్ల కుంట కట్టను తొలగించి ఆనవాళ్లు లేకుండా చేశారు. శిఖంలో మొత్తం ప్లాట్లు చేసి విక్రయించారు. ప్రస్తుతం నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. ● అమ్డాపూర్లోని పటేల్ కుంట శిఖం భూమిలో అక్రమంగా మట్టిపోసి పూడుస్తున్నారు. నాలుగైదు రోజులుగా టిప్పర్ల ద్వారా మట్టి తెచ్చి పూడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ● చిలుకూరు పెద్ద చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. గత ఏడాది భారీ వర్షాలకు పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి శిఖంలో చేపట్టిన నిర్మాణాల్లోకి నీళ్లు వెళ్లాయి. ప్రస్తుతం శిఖంలో మట్టిపోసి ఎత్తు పెంచుతున్నారు. ● పెద్దమంగళారం పెద్ద చెరువు శిఖంలో మట్టిపోసి ఎత్తు పెంచుతున్నారు. ● పెద్దమంగళారం బిజినికుంట శిఖం భూమిలో ప్రీకాస్ట్ గోడలు నిర్మించారు. ● పెద్దమంగళారం ఊరుముందు కుంటలో అక్రమ నిర్మాణాలు జరిగాయి. ● కేతిరెడ్డిపల్లి రెవెన్యూలో ఉన్న కంచిమోనిగూడ కుంటను ఆనవాళ్లు లేకుండా చేసి ప్లాట్లు చేసి విక్రయించారు. అందులో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ● చిలుకూరు అంతప్పచెరువు శిఖంలో ప్రీకాస్ట్వాల్స్, షెడ్లు నిర్మించారు. ● చిలుకూరు పడమటి చెరువులో నుంచి ప్రైవేటు వెంచర్లోకి రోడ్డు వేశారు. ● మేడిపల్లిలోని ఊరుముందు కుంట, కుమ్మరికంట, ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు, షెడ్లు నిర్మించారు. ● కనకమామిడిలోని దమ్మాయి కుంటలో ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించారు. ● బాకారంలోని జంబుల కుంట శిఖంలో ఆక్రమణలు జరుగుతున్నాయి. ● నాగిరెడ్డిగూడలోని అబ్బుకుంట శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చెరువులోనుంచే ప్రైవేటు వ్యక్తులు రోడ్డు వేశారు. ● నజీబ్నగర్లోని సింగారం చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు జరిగాయి. చెరువు అలుగు కింది భాగంలో కాలువకు అడ్డంగా ప్రహరీ నిర్మించారు. దీంతో గతంలో చెరువు కట్ట తెగిపోయింది. ఇటీవలే సుమారు రూ.40 లక్షలు మంజూరు కావడంతో గండిని పూడ్చి మరమ్మతులు చేశారు. అలుగు కిందిభాగంలో నిర్మించిన ప్రహరీ తొలగించకపోవడంతో వర్షాలు పడి చెరువు నిండితే మళ్లీ కట్ట తెగే ప్రమాదం ఉంది. ● కేతిరెడ్డిపల్లిలోని వెంకటమ్మ చెరువు శిఖంలో ఫాంహౌస్లు, భవనాలు నిర్మించారు. ● హిమాయత్నగర్లోని బూరుగుకుంట శిఖంలో మట్టి నింపి నిర్మాణాలు చేపట్టారు. -
అనురూప్రెడ్డికి నివాళి
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలోని సెబాన్ నదిలో ముగ్గురిని కాపాడి, ప్రాణాలు కోల్పోయిన అనురూప్రెడ్డి మృతదేహానికి మంగళవారం భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి రాసిన సంతాప పత్రాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మండలంలోని కవాడిపల్లికి చెందిన కోడూరు రాజేందర్రెడ్డి, దుర్గాభవాని దంపతుల చిన్న కుమారుడు అనురూప్ రెడ్డి మృతదేహం పది రోజుల తర్వాత స్వగ్రామానికి చేరుకొంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రైవేట్ బడుల్లో అధిక ఫీజులు
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పవన్ కల్యాణ్ మొయినాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు పుస్తకా లు, యూనిఫాంలు, ఇతర సామగ్రిని విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పవన్ కల్యాణ్ అన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం మండల వన రుల కేంద్రంలో విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి.. అధిక ఫీజులు వసూ లు చేస్తున్న విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి.. మౌలిక వసతులు కల్పించాలన్నారు. వినతిపత్రం అందజేసినవారిలో సంజయ్, చందు, వినయ్, చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
తనిఖీలతో ప్రమాదాలకు చెక్
విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు మెరుగుపడ్డాయిసాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘వరుస తనిఖీలతో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాల్లో విద్యుత్ ప్రమా దాలు తగ్గాయి. అధికారుల నిషిత పరిశీలనతో కొత్తగా ఏర్పాటు చేసే సంస్థల్లో విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు మెరుగుపడ్డాయి’ అని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఆఫ్ తెలంగాణ కె.నందకుమార్ స్పష్టం చేశారు. సీ ఈఐజీగా బాధ్యతలు స్వీకరించి, ఆగస్టుతో ఏడా ది కాలం పూర్తి కాబోతోంది. ఆయన పనితీరుకు గుర్తింపుగా ప్రభుత్వం పదవీకాలన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలుకరించింది. ఆయన మాటల్లోనే.. ఖర్చుతో పోలిస్తే.. ఆదాయం అధికం గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు, కొత్త కనెక్షన్లకు అనుమతుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఒక్క హెటీ కనెక్షన్ల ద్వారానే రూ.16 కోట్లు, సినిమాహాల్స్ ద్వారా రూ.7 కోట్ల రాబడి వచ్చింది. ఇక పీరియాడికల్ ఇన్స్పెక్షన్ల ద్వారా మరో రూ.3 కోట్లు వచ్చాయి. సీఈఐజీ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.9 కోట్లు ఖర్చవుతోంది. ఈ విభాగానికి చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే అధికం. పారదర్శకతను పెంచాం సీఈఐజీ విభాగంలో పారదర్శకతకు పెద్దపీట వేశాం. 89 మంది ఉద్యోగులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు అంతా కలిసి రోజూవారీ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నాం. ఎవరు ఏ కంపెనీలో తనిఖీలకు వెళ్లారు.. గుర్తించిన లోపాలు వంటి అంశాలను రిజిస్టర్లో రికార్డు చేయిస్తున్నాం. వారంలో నాలుగు రోజుల్లో జిల్లాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. తోటి ఉద్యోగుల పనితీరులోనూ మార్పు తీసుకొచ్చాం. అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. మధ్యవర్తుల ప్రమోయం లేకుండా నిర్దేశిత గడువులోగా ఫైళ్లు క్లియర్ చేయిస్తున్నాం. దరఖాస్తు సహా విద్యుత్ లైన్లలో ఏదైనా షార్ట్ఫాల్ ఉంటే.. ముందే గమనించి, వాటిని సరి చేయిస్తున్నాం. వినియోగదారుల కోసం ఫోన్ నంబర్ 040–23450367 పునరుద్ధరించాం. ప్రమాదాలు నివారిస్తున్నాం హెచ్టీ కనెక్షన్ల కోసం అనుమతులు కోరుతూ ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న లోడుకు తగ్గ ప్రమాణాల మేరకు లైన్లు, కేబుళ్లు, ఏబీ స్విచ్ బోర్డులు, ఎర్తింగ్ సిస్టం, ప్యానల్ బోర్డులు, ఫ్యూజ్ బాక్సులు, డీటీఆర్, బ్రేకర్, కండక్టర్ ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే అనుమతులు జారీ చేస్తున్నాం. క్షేత్రస్థాయి తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిచేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే అనుమతులు జారీ చేస్తున్నాం. ఆయా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో విద్యుత్ ప్రమాణాలను పెంచి, ప్రమాదాలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. వినియోగదారులకు సూచనలు ● ఇళ్లలో విధిగా ఎంసీబీ, ఎసీసీబీ, ఆర్సీసీబీలు వాడటం ద్వారా ఏదైనా ఫాల్ట్ వస్తే వెంటనే ట్రిప్పై సరఫరా నిలిచిపోతుంది. ప్రమాదాన్ని నివారిస్తుంది. ● విద్యుత్ పరికరాలను ఎర్తింగ్ చేయడం ద్వారా షాక్ తగలకుండా నియంత్రిస్తుంది. ● ప్రస్తుతం వంటకు ఎలక్ట్రిక్ స్టవ్ల వాడకం పెరిగింది. స్విచ్లు, సాకేట్లను ఆ మేరకు మార్చుకోవాలి. ● అపార్ట్మెంట్స్లోని ప్యానల్, పంపు గదుల్లో స్నోక్డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు విధిగా వాడాలి. ఇండస్ట్రీస్లో కెపాసిటర్లను తప్పనిసరి వినియోగించాలి. ఆటోమేటిక్ కేపాసిటర్ మరింత సురక్షితం. ● ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్లు ఉన్న ప్రదేశాల్లో అగ్నిమాపక యంత్రాలు ఉండాలి. ● ఏసీలు, గ్రీజర్లు, ఇతర పరికరాలు వాడుకలో లేనప్పుడు స్విచ్ఛాఫ్ చేయాలి. ● బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల వద్ద ప్రాపర్ ఎర్తింగ్ చేయాలి. లిథియం బ్యాటరీలు చాలా ప్రమాదకరం. ఫైర్సేఫ్టీ తప్పనిసరి. ● స్నానాల గదిలో స్విచ్, సాకెట్స్ అమర్చొద్దు. విద్యుత్ పరికరాల వద్ద మండే స్వభావం గల వస్తువులు ఉంచొద్దు. కప్బోర్డుల్లో లైటింగ్ ప్రమాదకరం. పారదర్శకతకు పెద్దపీట ఉద్యోగులతో వాట్సాప్ గ్రూప్ నిర్దేశిత గడువులోపు ఫైళ్లు క్లియర్ కొత్త కనెక్షన్లతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం ‘సాక్షి’తో సీఈఐజీ నందకుమార్ -
సీఎం సభకు భారీగా ఏర్పాట్లు
కందుకూరు: ఫ్యూచర్సిటీలో నిర్మించిన ఎఫ్సీడీఏ భవనం ప్రారంభోత్సవంతో పాటు ఆ సమీపంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ఎఫ్సీడీఏ భవనంలో పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటడం, గడ్డిపరిచే పనులు చేపట్టారు. భవనం వెనుక వైపు ఉన్న ప్రాంతంలో సభ కోసం పెద్దపెద్ద షెడ్లు వేస్తున్నారు. మరోవైపు జనాలు భారీగా సభకు వచ్చేలా కాంగ్రెస్ పెద్దలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఏఫ్సీడీఏ భవనంతో పాటు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అక్రమ నిర్మాణం కూల్చివేత
త్వరలో హద్దులు నిర్ణయించి, ఫెన్సింగ్ వేసేందుకు నిర్ణయం పహాడీషరీఫ్: బాలాపూర్ మండల పరిధిలోని జల్పల్లి గ్రామ బిజాన్గుట్ట ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయమై సాక్షి దినపత్రికలో ‘బిజాన్గుట్టపై అక్రమార్కుల కన్ను’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి ఆదేశానుసారం ఆర్ఐలు జమీల్, సుధాకర్లు జీపీవోలతో కలిసి ఉదయమే బిజాన్గుట్టకు చేరుకున్నారు. అధికారుల రాక విషయం తెలుసుకున్న వ్యక్తులు ప్రొక్లెయినర్ను అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రీ కాస్ట్ వాల్ ప్రహరీని ఈ సందర్భంగా కూల్చివేశారు. త్వరలోనే స్థలానికి హద్దులు నిర్ణయించి, కబ్జా బారిన పడకుండా శాశ్వత ఫెన్సింగ్ నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఈ భూమిలో ఎవరైనా కబ్జాకు పాల్పడినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. -
రేషన్షాపుల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలి
● సివిల్ సప్లయిస్ కార్యాలయం వద్ద ఐద్వా నిరసనపంజగుట్ట: రేషన్షాపుల్లో బియ్యంతోపాటు 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, స్కూల్ ఫీజులు పెరుగుతుండటంతో సామాన్యుల జీవనం భారంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆహార భద్రత, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి బియ్యంతోపాటు, పప్పు, మంచినూనె, మొక్కజొన్నలు రెండు కేజీల చొప్పున, చక్కెర కేజీ, కారం 500 గ్రాములు, పసుపు 250 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, పామాయిల్ లీటర్, కొబ్బరి నూనె 250 గ్రాములు, ఆవాలు, జొన్నలు, పల్లీలు, సబ్బులను రేషన్ షాపుల ద్వారా అందించాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయకార్యదర్శులు కేఎన్ ఆశాలత, కె.నాగలక్ష్మి, పి.శశికళ, వై.వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
ఊరుముందు కుంటను అభివృద్ధి చేస్తాం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం ఊరుముందు కుంటను అభివృద్ధి చేసి, సుందరీకరణ పనులు చేపడతామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కుంటను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డీఈ జిరంజీవులు, కౌన్సిలర్లు మమతారెడ్డి, అరుణ, స్థానికులతో కలిసి అభివృద్ధిపై చర్చించారు. తన సొంత నిధులతో గుర్రపుడెక్కను తొలగిస్తానని చెప్పారు. అనంతరం చందానగర్–కవేలిగూడ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర నాయకులు అంజన్కుమార్గౌడ్, కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణగౌడ్ తదితరులు ఉన్నారు. యాచారం: పీఏసీఎస్లో దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు ఇప్పటికై నా అప్పులు చెల్లించాలని డీసీసీబీ జాయింట్ రిజిస్ట్రార్ మనోజ్కుమార్రెడ్డి సూచించారు. రుణాలు పొంది సకాలంలో చెల్లించని 300 మందికి మంగళవారం ఆయన నోటీసులు జారీ చేశారు. మూడేళ్లుగా యాచారం పీఏసీఎస్లో రుణాలు సక్రమంగా వసూలు కావడం లేదని, దీంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త రైతులు అవకాశం కోల్పోతున్నారని అన్నారు. ఈనెల చివరి లోపు అప్పులతో కూడిన బకాయిలు చెల్లిస్తేనే సరి లేదంటే ఆస్తుల జప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ నాగరాజు, సిబ్బంది ఉన్నారు. చేవెళ్ల: మొయినాబాద్ మండలంలోని కనకమామిడి ఫామ్హౌస్ కేసులో కొడిచెర్ల సాయికుమార్ మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు నరేందర్, జిల్లా కార్యదర్శి శివశంకర్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏసీపీ కిషన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగి 20 రోజులు అవుతున్నా ఈ కేసులో ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు కల్పించుకొని, నిందితులను అరెస్ట్ చేసి బాధితకుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఊరెంట ప్రవీణ్, నరేశ్, ప్రేమ్సాగర్, నగేశ్, రాజు, తదితరులు ఉన్నారు. వెల్జర్లలో విషాదఛాయలు షాద్నగర్: బిడ్డ బంగారు భవిష్యత్తును ఆశించిన తల్లిదండ్రుల ఆశ నెరవేర లేదు. బంగారు భవిష్య త్తు కోసం రెక్కలు ముక్క లు చేసుకొని కొడుకును చదివిస్తే అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో షాద్నగర్ పరిధిలోని వెల్జర్లకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలమణి, కృష్ణయ్యల కుమారుడు కార్తీక్ (26) పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటూ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం తోటి స్నేహితులు గుర్తించి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. తండ్రి కృష్ణయ్య సోమ వారం ఉదయమే కొడుకును హాస్టల్లో విడిచిపెట్టివచ్చాడు. కార్తీక్కు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియరాలేదు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్సిటీ
కందుకూరు: ఫ్యూచర్సిటీని అత్యంత ప్రమాణాలతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. ఫ్యూచర్సిటీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఎఫ్సీడీఏ భవనంతో పాటు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏఐ సిటీతో పాటు డాటా సెంటర్ల వంటివి ఏర్పాటు కానున్నాయన్నారు. ఇక్కడ నెలకొల్పే సంస్థలో పని చేయడానికి నైపుణ్య శిక్షణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఫ్యూచర్సిటీలో నెలకొల్పే ప్రతి సంస్థ కాలుష్యరహితంగానే పని చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగులుతున్నా ఇక్కడి ప్రజల కోసం చేపట్టిన నగర నిర్మాణాన్ని ఆపేదిలేదన్నారు. భవిష్య నగరానికి పునాదులు వేస్తున్నామని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎఫ్సీడీఏ భవనం ప్రారంభోత్సం, అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, టీజీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్రెడ్డి, సరికొండ మల్లేష్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు -
ఆర్టీషీ
వికారాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక ఆక్యుపెన్సీ రేటు భారీగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలు, ట్రాన్స్ జెండర్లకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. జిల్లాలో మూడు డిపోలు(వికారాబాద్, పరిగి, తాండూరు) ఉండగా వీటి పరిధిలో 200 బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 5.68కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.209.33 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో బస్సులో రోజుకు సగటున 300 నుంచి 350 మంది ఉచితంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల్లో 70 శాతానికి పైగా నారీమణులే ఉంటున్నారు. మహాలక్ష్మి పథకంతో.. గడచిన దశాబ్ద కాలంలో ఆర్టీసీ అనేక సంస్కరణలు చేపట్టినా ఆక్యుపెన్సీ పెరిగిన దాఖలాలు లేవు. మహాలక్ష్మి పథకం అమలయ్యాక ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సీ్త్రలతోపాటు పురుషుల సంఖ్య కూడా పెరిగింది. ఇది ఆక్యుపెన్సీ రెండింతలు అవడానికి దోహదం చేసింది. గతంలో 50 నుంచి 60 లోపే నమోదయ్యే ఆక్యుపెన్సీ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే 95 నుంచి 120 శాతానికి చేరింది. స్టాపుల్లో ఆగని బస్సులు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో సిబ్బందికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. బస్సుల్లో నిలుచుకోవడానికి కూడా స్థలం ఉండని పరిస్థితి నెలకొంది. గతంలో చెయ్యెత్తిన చోట బస్సు ఆపేవారు. ఆడిగిన చోట దించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సగం స్టాపుల్లో బస్సులు ఆపకుండానే వెళ్తున్నారు. ఇదిలా ఉండగా మహిళా ప్రయాణికులను కండక్టర్లు, డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారు. వారికి పురుష ప్రయాణికులు గొంతు కలుపుతున్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మహిళలకు కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలనే స్లోగన్ ఇప్పుడు మచ్చుకై నా కనిపించడంలేదు. మహిళల సీట్లలో పురుషులే కూర్చుంటున్నారు. డబ్బులు ఇచ్చి టికెట్ కొంటున్నారంటూ కండక్టర్లు సైతం వారికే సపోర్టు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం బస్సుల్లో వారు ఎదుర్కొంటున్న బాధలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సులన్నీ రద్దీగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ -
తాగునీటి కోసం ట్యాంకు ఎక్కి నిరసన
మీర్పేట: తాగునీటి సదుపాయం కల్పించాలని లెనిన్నగర్ డబుల్ బెడ్రూం వాసులు మంగళవారం ఖాళీ బిందెలతో ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా మంచినీటి సౌకర్యం కల్పించలేదని, కార్పొరేషన్గా ఉన్నప్పుడు జిల్లా, స్థానిక ఎమ్మెల్యే, హౌసింగ్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల ఉన్న ఒక్కగానొక్క బోరు కూడా పాడైపోయిందన్నారు. ఆనుకునే మిషన్ భగీరథ ట్యాంకు ఉన్నప్పటికీ మంచినీరు తాగే భాగ్యం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే మంచినీటి సరఫరాకు సంబంధించి పైపులైన్ పనులు ప్రారంభించి కనెక్షన్ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలారవినాయక్, స్థానిక బీజేపీ అధ్యక్షుడు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, చెవ్వ శ్రవణ్, తిరుపతిరెడ్డి, పూజారి శంకర్, బాలునాయక్ పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన బొల్లు బుచ్చయ్య కుటుంబం తుక్కుగూడ బసవగూడ తండాకు నెల క్రితం వలస వచ్చి కూరగాయల ఫామ్లో పని చేస్తున్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి నిద్రించగా, మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి చూడగా అతని చిన్న కుమార్తె సునీత (21) కనిపించలేదు. పరిసరాల్లో గాలించినా లాభం లేకుండా పోయింది. కుల్కచర్లకు చెందిన రమేష్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేకాట స్థావరాలపై దాడులు కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్పహాడ్లో పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఈ దాడుల్లో రూ.60,800 నగదు, ఏడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు సుడాన్ దేశస్తులకు ఎబోలా నెగెటివ్ గాంధీ ఐసోలేషన్ నుంచి డిశ్చార్జి గాంధీఆస్పత్రి: ఎబోలా వైరస్ అనుమానితులకు నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి వారిని మంగళవారం డిశ్చార్జీ చేశారు. గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఎబోలా స్క్రీనింగ్ పరీక్షల్లో సూడాన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యసేవలు అందించారు. వారి నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించగా, నిర్ధారణ పరీక్షల్లో ఎబోలా నెగెటివ్ వచ్చినట్లు పుణే వైరాలజీ ల్యాబ్ అధికారికంగా ధ్రువీకరించిన సంగతి విధితమే. ఈ నేపధ్యంలో 48 గంటల తర్వాత మరోమారు శాంపిల్స్ సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపగా, రెండోసారీ ఎబోలా నెగెటివ్ రావడంతో సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవాలని, అందుకు అవసరమైన విధానాలు, పద్ధతులు, జాగ్రత్తలు చెప్పి వారిని డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం గాంధీ ఐసోలేషన్ వార్డులో ఎబోలా అనుమానితులెవరూ లేరు. -
భూసార పరీక్షలతో రైతులకు మేలు
మండల వ్యవసాయాధికారి అనురాధారెడ్డి మొయినాబాద్రూరల్: రైతులు భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య పోషక యాజమాన్యం చేపడితేనే సాగు ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని రైతులకు కేత్ బచావో అభియాన్ కార్యక్రమంపై కేవీకే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే నిపుణులు డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ కృష్ణ, సుధీర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మురుగుతో పరేషాన్ !
డ్రైనేజీ నుంచి ఉప్పొంగుతున్న మురుగు ● నివారణ చర్యల్లో తీవ్ర జాప్యంపై ప్రజాగ్రహంమన్సూరాబాద్–ఆటోనగర్ రోడ్డు కేబీఆర్ కన్వెన్షన్ ఎదురుగా కొన్ని రోజులుగా డ్రైనేజీ నుంచి మురుగు పొంగి రోడ్డుపై వరదలా పారుతోంది. సుమారు 15 కాలనీలవాసులు ఈ మురుగు వరదనీటి నుంచి నడవాల్సిన దుస్థితి నెలకొంది. నివారణ చర్యలు తీసుకోవడంలో సీవరేజీ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శైలజాపురి కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన స్పందించి మురుగుకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. – మన్సూరాబాద్ మన్సూరాబాద్–ఆటోనగర్ రోడ్డు కేబీఆర్ కన్వెన్షన్ వద్ద డ్రైనేజీ నుంచి పొంగిపొర్లుతున్న మురుగు -
చెరువులో వ్యర్థాల తొలగింపు
మన్సూరాబాద్: పెద్దచెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్దచెరువు ప్రాంగణం, చెరువులో ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలకు గత మూడు రోజులుగా స్వచ్ఛంద సేవకులు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. చెరువులోని ట్రక్కుల కొద్ది చెత్తను బస్తాల్లో వేసి మరో ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ... రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని చెరువులోని వ్యర్థాలను తొలగించామని, వరదనీటితోనే చెరువును నింపి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముందుకు పోతున్నామన్నారు. వరదకాలువలోకి డ్రైనేజీ మురుగును కలుపుతుండటంతో చెరువులోకి మురుగు నీరు చేరి దుర్వాసన వస్తుందని పేర్కొన్నారు. వరద నీటికి, డ్రైనేజీ మురుగుకు ప్రత్యేకంగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వర్షపు నీరు మాత్రమే చెరువులోకి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు వేమారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాంపల్లి రామేశ్వర్, కవితారెడ్డి, చంద్రశేఖర్రెడ్ది, ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీడీఓ అపర్ణ
గ్రామాల అభివృద్ధే ధ్యేయం షాబాద్: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తోందని ఎంపీడీఓ అపర్ణ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగర్కుంట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాల్లో గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని సూచించారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపైప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, జల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఎస్ఐఆర్పై గ్రామస్తులకు వివరించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాలమాకుల మల్లయ్య, ఉపసర్పంచ్ బుగ్గ రాములు, పంచాయతీ కార్యదర్శి జగదీశ్, వార్డుసభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం
మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం షాద్నగర్: పరిసరాలను పరిశుభ్రతతో వ్యాధులు ధరిచేరవని మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 2, 9, 18, 21, 26, 27 వార్డుల్లో వార్డుసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వర్షాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని చెప్పారు. అదేవిధంగా కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సునీత, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య అ‘పూర్వ’ సమ్మేళనం మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని అమ్డాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005–06లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వారందరూ ఒకచోట చేరి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా సందడి చేశారు.షాద్నగర్రూరల్: ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉపాధి కూలీలతో కలిసి ఆయన ఆర్డీఓ సరితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, అందులో భాగంగానే జీరామ్జీగా పేరు మార్చిందన్నారు. ఉపాధి కూలీలకు ఫొటోల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఫొటో యాప్ను రద్దు చేసి, కూలీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేశ్యాదవ్, మండల అధ్యక్షుడు జంగయ్య, నాయకులు చిన్నచంద్రయ్య, దామోదర్రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుబజార్లో కూరగాయల ధరలు
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్లోని రైతుబజార్లో కూరగాయల ధరలు(కిలో.. రూపాయల్లో).. టమాటా 43, వంకాయ 23, బెండకాయ 37, పచ్చిమిర్చి 40, కాకర 43, బీర 35, కాలిఫ్లవర్ 18, క్యాబేజీ 18, క్యారెట్ 40, దొండ 41, ఆలు 17, ఉల్లిగడ్డ 22, గోకర 33, దోసకాయ 18, సోరకాయ 13, పొట్లకాయ 18, చిక్కుడు 55, చామ 28, బీట్రూట్ 25, కీర 35, ఫ్రెంచ్బీన్స్ 75, క్యాప్సికం 65. బీజేపీ దళిత మోర్చా మండల కార్యవర్గం ఎన్నిక మహేశ్వరం: బీజేపీ దళిత మోర్చా మండల నూతన కార్యవర్గాన్ని పార్టీ మండల అధ్యక్షుడు యాదిశ్ ఆదేశానుసారం దళిత మోర్చా అధ్యక్షుడు గొల్లూరు మాధవ్ సోమవారం ప్రకటించారు. ఉపాధ్యాక్షులుగా జెన్నపల్లి రాజు, గజ్జెల శ్రీనివాస్, బొమ్మనబోయిన జంగయ్య, గట్టగళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా దాసరి సుదర్శన్, రంగుల రవి, కార్యదర్శులుగా ఎర్ర ప్రశాంత్, నత్తి జంగయ్య, బండి మోహన్రాజు, తొంట శివలింగం, కోశాధికారులుగా బండి ప్రవీణ్, జెన్నపల్లి రమేశ్, కార్యవర్గ సభ్యులుగా ఏర్పుల ప్రశాంత్, కల్వకోల్ యాదగిరి, మంత్రి శ్రీకాంత్, కొండని సురేష్, మంద యాదగిరిని నియమించారు. మండలంలోని ప్రతి గ్రామంలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేయాలని, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాలని గొల్లూరు మాధవ్ సూచించారు. మృగశిర కార్తె సందడి కందుకూరు: వానాకాలానికి స్వాగతం పలికే మృగశిర కార్తె రోజు చేపలు ఆరగించడం ఆనవాయితీ. దీంతో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చేపల విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కిలో రూ.200 పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. శాఖాహార ప్రియులు బెల్లం, ఇంగువ తినడంతో పాటు అడవుల్లో, పొలాల్లో దొరికే ఆదొండ కాయలతో ప్రత్యేకంగా కూర చేసుకోవడం ఆనవాయితీ. బహిరంగ సభను విజయవంతం చేయండి కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ఈ నెల 10న సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారని, వాటిని తిప్పికొట్టేలా ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలన్నారు. ఈ ప్రాంత భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీపైనే ఆధారపడి ఉందన్నారు. ఆ రోజు సాయంత్రం సీఎం చేతుల మీదుగా ఎఫ్సీడీఏ భవనం, స్కిల్స్ యూనివర్సిటీ భవనాలను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. వనస్థలిపురం పోస్టాఫీస్లో ఆధార్ సేవలు వనస్థలిపురం: వనస్థలిపురం సర్కిల్ పరిధిలోని పోస్టాఫీసులో ఆధార్ నమోదు కేంద్రాన్ని సబ్ పోస్ట్మాస్టర్ దుర్ాగ్య నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో పోస్టాఫీసులో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ ఆధార్ కేంద్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందన్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారు, పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, జనన తేదీ తదితర వివరాలను సవరించుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన పోస్టల్ సేవలు అందించడానికి పోస్టల్ శాఖ కట్టుబడి ఉందని అన్నారు. ఎంపీ ఈటల రాజేందర్కు అభినందన నాగోలు: ఈటల రాజేందర్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ డివిజన్ల అధ్యక్షులు కలిసి ఆయనకు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బీజేపీ నాగోలు డివిజన్ అధ్యక్షులు పంగా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనను విజయవంతం చేయండి
హుడాకాంప్లెక్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఈ నెల 10న ఎఫ్సీడీఏ భవనం, స్కిల్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపేటలోని ఓ హోటల్లో రామకృష్ణాపురం, ఎన్టీఆర్నగర్, సరూర్నగర్, డాక్టర్స్కాలనీ డివిజన్లముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ మేరకు నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయిని మహేందర్యాదవ్, నాయకులు శంకర్యాదవ్, గణేశ్నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్, దయాకర్రెడ్డి, రామకృష్ణగౌడ్, బొడ్డుపల్లి మహేందర్, యాదవరెడ్డి, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దు బడంగ్పేట్: తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సరికాదని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్లోని వైఏఆర్ గార్డెన్లో మీర్పేట్, నందిహిల్స్, జిల్లెలగూడ, బడంగ్పేట్, నాదర్గుల్, బాలాపూర్ డివిజన్ల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేఎల్ఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ), స్కిల్ యూనివర్సిటీ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విచ్చేసి ప్రారంభిస్తారన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజస్థాయి నమ్మకం కలిగేలా ఫ్యూచర్ సిటీని నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. కాలుష్యం లేని మహానగరంగా మార్చేందుకు గ్రీన్ ఫార్మా, పర్యావరణహితమైన సంస్థలకే అనుమతులు ఇస్తున్నట్లు కేఎల్ఆర్ తెలిపారు. సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్రెడ్డి, అమరేందర్రెడ్డి, బోయపల్లి రాఘవేందర్డ్డి, మార్కెట్ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సుదర్శన్రెడ్డి, సామిడి గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ -
దొంగ ఓట్లు తొలగించాలంటూ వినతి
కందుకూరు: దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గం బీఎల్ఏ–1 అంబోజి శ్రీనివాస్ మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పహాడీషరీఫ్, షహీన్నగర్, జల్పల్లి డివిజన్లలో కుప్పలు తెప్పలుగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. రోహింగ్యాల ఓట్లను సైతం గుర్తించామని, కేవలం 26 బూత్లలోనే 9,960 దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న ఎస్ఐఆర్లో భాగంగా అనుమానాస్పద ఓట్లపై పూర్తిస్థాయిలో బీఎల్ఓల సహకారంతో విచారణ జరిపించి, దొంగ ఓట్లను తొలగించాలని కోరారు. అందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ సాధ మల్లారెడ్డి, నాయకులు ముఖేశ్ముదిరాజ్, రావుల మల్లేశ్ పాల్గొన్నారు. -
ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు పెంపు
ఎంపీడీఓ ప్రవీణ్కుమార్ శంకర్పల్లి: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయని ఎంపీడీఓ ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మండలంలోని కొండకల్లో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. అవసరం ఉన్నా, లేకున్నా నీటి వినియోగం పెరిగిందని, అందుకు అనుగుణంగానే భూగర్భ జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త ఆటోల్లో వేయాలని, ఎల్లప్పుడూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రభుత్వం సూచించిన రోడ్డు భద్రత నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సతీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మోకిల సీఐ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ సీతారాంరెడ్డి, ఎస్ఐ సాయికృష్ణ, ఏపీఓ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
కుసుమ పంట కొనుగోలు సంతోషకరం
కందుకూరు: కుసుమ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం సంతోషకరమని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద కుసుమ పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. రైతులు ఆయనను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. నేదునూరు రైతులు కుసుమ పంట కొనుగోలు సమస్యపై తన వద్దకు రాగా.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతుల సమస్యను గుర్తించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. రైతుల విషయంలో రాజకీయాలు చేయకూడదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తేరటి లక్ష్మణ్ముదిరాజ్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు పల్లె కృష్ణగౌడ్, మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు సోమరాజు వెంకటేశ్, గంగుల కృష్ణారెడ్డి, గంగుల వెంకట్రెడ్డి, సురసాని భూమిరెడ్డి, మైసయ్య, వరుణ్, నర్సింహ, నవీన్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
మొక్కలు నాటడం అందరి బాధ్యత
మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్కుమార్ శంకర్పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్కుమార్, కమిషనర్ యోగేశ్ అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 9, 10వ వార్డుల్లో వార్డుసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి సరఫరా, తడి, పొడి చెత్త సేకరణ, మురుగు నీటి కాలువల శుభ్రత తదితర అంశాలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, గణేశ్, ఆనంద్, వసంత, పీఏసీఎస్ డైరెక్టర్ మహేందర్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్, నాయకులు చంద్రమౌళి పాల్గొన్నారు. -
రోడ్డు నిబంధనలు తప్పనిసరి
నందిగామ సీఐ ప్రసాద్ షాద్నగర్: ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని నందిగామ సీఐ ప్రసాద్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చేగూరులో సర్పంచ్ మంకాల శ్రీశైలం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సైదులు, సీఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కారు నడిపేవారు సీట్బెల్టు, ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమన్నారు. తహసీల్దార్ సైదులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందని, దశలవారీగా పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. -
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణపై సమీక్ష
షాద్నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్నగర్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్కు సంబంధించిన భూసేకరణపై సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ఈఈ దయానంద్, ఎస్ఈ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ, నిర్మాణ పనులు, పరిపాలనా అనుమతుల గురించి అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 19 నుంచి 21 చేపట్టే పనుల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకొన్నారు. జడ్చర్లలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కొందుర్గు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి వరకు కాల్వలు, టన్నెల్ నిర్మాణాలకు మొత్తం 2,919 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు తెలిపారు. భూసేకరణకు సుమారు రూ.350కోట్లు వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా పూర్తి చేసి.. పరిపాలన, ఆర్థిక అనుమతులు ప్రభుత్వం నుంచి పొందేందుకు తగిన చర్యలు చేపట్టాలని, నిర్ణీత గడువులోపు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. -
పర్యావరణ పరిక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరం
నాగోలు: పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నాగోలు–బండ్లగూడ ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై సోమవారం బండ్లగూడ నుంచి నాగోలు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ... బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రకృతి పరిరక్షణ పర్యావరణ అవగాహన లక్ష్యాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. రోజూ నడక అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రకృతిని ప్రేమిద్దాం–పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే సందేశంతో ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పిస్తూ, మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, ఆరోగ్య పరిరక్షణకు నడక ఆవశ్యకతను వివరించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఐకాన్ వాకర్స్ గ్రూప్ అధ్యక్షుడు చెరుకు ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రటరీ రమేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రమేష్, జాయింట్ సెక్రటరీ పెంటారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, సలహాదారులు ప్రతాప్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు చిరంజీవి, ఈశ్వర్ గౌడ్, సీతారాములు పాల్గొన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి -
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
కొత్తూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని సర్పంచ్ ఎర్రొళ్ల జగన్ కోరారు. మండలంలోని పెంజర్ల గ్రామంలో చంద్రమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని సోమవారం ఆయన పలువురితో కలిసి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా చంద్రమ్మకు దుస్తులు అందజేశారు. విడతల వారీగా గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తడి, పొడి చెత్తపై అవగాహన మొయినాబాద్రూరల్: ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా వ్యాధులు ధరిచేరవని సర్పంచ్ పాషా అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మండల పరిధిలోని కుత్బుద్దీన్గూడలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లోని చెత్తను ప్రభుత్వం సూచిస్తున్న విధంగా నాలుగు విధాలుగా వేరుచేసి గ్రామ పంచాయతీ ద్వారా సేకరిస్తున్న చెత్త బండిలో వేయాలని సూచించారు. ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి భూపాల్, పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య, ఉపసర్పంచ్ ఆలూరి రవీందర్, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన క్రికెట్ టోర్నీ షాద్నగర్: నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహించిన చేగూరు జూనియర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో చైన్నె, బెంగుళూరు జట్ల మధ్య పోటీ జరిగింది. ఉత్సంఠ భరితంగా సాగిన పోటీలో బెంగుళూరు జట్టు విజయం సాధించగా.. రూ.10వేల నగదు, రన్నర్ జట్టుకు రూ.5వేల నగదుతో పాటు నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో చేగూరు ఉపసర్పంచ్ శివశంకర్, వెంకమ్మగూడ సర్పంచ్ అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి చేవెళ్ల: పట్టణ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి డిమాండ్ చేశారు. చేవెళ్లలోని ఆర్డీఓ కార్యాలయం ప్రజావాణిలో, విద్యుత్శాఖ కార్యాలయంలో సోమవారం బీజేపీ నాయకులతో కలిసి ఆయన విద్యుత్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విద్యుత్ ఏడీ సాయినాథ్ స్పందిస్తూ వెంటనే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీనిచ్చారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్గారి వైభవ్రెడ్డి, శర్వలింగం, సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. రోడ్డు పనులు ప్రారంభం షాబాద్: మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామ శివారు నుంచి మక్తగూడ శివారు వరకు పంట పొలాల వెంబడి చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం గ్రామస్తులతో కలిసి సర్పంచ్ మంగమ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేందర్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. శంకర్పల్లి: ఎమ్మెల్యే కాలె యాదయ్యను సోమవారం ప్రొద్దటూరు గ్రామస్తులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రొద్దటూరు–మేడిపల్లి, ప్రొద్దటూరు–టంగటూరు గ్రామాలను కలిపే రెండు రోడ్ల నిర్మాణానికి గాను ఎమ్మెల్యే కృషితో రూ. 5.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి, శాలువా కప్పి సన్మానించారు. పనులను సత్వరమే ప్రారంభించి, పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, గ్రామాభివృద్ధికి మున్ముందు ఎమ్మెల్యే ఇలానే సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ బండ లక్ష్మినర్సింహా కోరారు. -
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి పద్మావతి చేవెళ్ల: ప్రజాసమస్యల పరిష్కారం, వార్డుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందని మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇబ్రహీంపల్లి, రామన్నగూడ, దామరగిద్ద వార్డుల్లో కౌన్సిలర్లు పి.మధుసూదన్రెడ్డి, దయాకర్, నర్సింలు ఆధ్వర్యంలో వార్డుసభలు నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా ప్రత్యేకాధికారి పద్మావతి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, ఎస్ఐ శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో వారు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు అందించేలా కృషి చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. అభివృద్ధి పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సమావేశాల్లో కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, ప్రజలు నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
బడంగ్పేట్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఏఐసీసీ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్రెడ్డి అన్నారు. సోమవారం బడంగ్పేట్ సర్కిల్–16లోని నాదర్గుల్ డివిజన్ అల్మాస్గూడ శేషాద్రినగర్కాలనీలో కాలనీ అధ్యక్షుడు సోమయ్యతో కలిసి నాయకులు రాఘవేందర్రెడ్డి, నవారు మల్లారెడ్డి సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీరోడ్ల నిర్మాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్ సహకారంతో జనరల్ ఫండ్ కింద రూ.87 లక్షలు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్తోనే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దిండు శ్రీనివాస్గౌడ్, కాలనీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్గౌడ్, కాలనీవాసులు శంకర్, రాకేష్, శంకర్, లక్ష్మీకాంత్రెడ్డి, జగత్రెడ్డి, మహేష్, వెంకటేష్గుప్త, చంద్ర శేఖర్ తదితరులున్నారు. ఏఐసీసీ కో–ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్రెడ్డి -
మ్యాన్హోల్ కుంగి.. ప్రమాదకరంగా మారి
జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్ నుంచి నందనవనం వెళ్లే ప్రధాన రహదారిపై మ్యాన్హోల్ కుంగి ప్రమాదకరంగా మారింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపై మ్యాన్హోల్ కుంగిపోయి, దగ్గరకు వచ్చేవరకు కనిపించకుండా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదం బారినపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంజినీరింగ్ విభాగం వారు మూతను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రోజుల్లోనే యథాస్థితికి చేరుకుందని తెలిపారు. తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. –మీర్పేట -
ఉపసర్పంచ్లకు ప్రభుత్వ అండ
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసర్పంచ్లకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో మండల ఉపసర్పంచ్ల సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ఉపర్పంచ్లకు గౌరవ వేతనం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సర్పంచ్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. గౌరవ వేతనాల విషయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎర్రోళ్ల అశోక్, అధ్యక్షుడు ప్రకాశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేశ్యాదవ్, కార్యనిర్వాహణ అధ్యక్షుడు సయ్యద్జావెద్, ఉపాధ్యక్షుడు శ్యామ్లాల్, కార్యదర్శులు శివశంకర్, సుమన్గౌడ్, ప్రచార కార్యదర్శి రమేశ్, కోశాధికారి గంగాధర్, ప్రధాన సలహాదారుడు నవీన్రెడ్డి, గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు/కడ్తాల్: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైసిగండి మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్ను ఎమ్మెల్యే పరామర్శించారు. చెక్కుల పంపిణీ అనంతరం కసిరెడ్డి మాట్లాడుతూ.. పేదల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం అనేక నూతన పథకాలు అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని వివరించారు. రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికి అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్గౌడ్, సంధ్యారెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, మహేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
మహాసభలు విజయవంతం చేయండి
ఇబ్రహీంపట్నం: షాద్నగర్లో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ పిలుపునిచ్చారు. స్థానిక పాషా నరహరి స్మారక కేంద్రంలో ఆదివారం ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభను నిర్వహించి, మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్యచరణను ఈ మహాసభల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రెండు పూటల కూలీల హాజరు పద్ధతిని రద్దు చేసి, ఒకేసారి హాజరు తీసుకునే విధానాన్ని తీసుకురావాలన్నారు. ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్లో కోత విధించడం సరైనదికాదన్నారు. కూలీలకు 200 పనిదినాలు కల్పించి రోజుకి రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నిక వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని 17 మందితో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కాకి రమేష్, కార్యదర్శిగా చాతళ్ల జంగయ్య, సహాయ కార్యదర్శులుగా గణేశ్, ఆనంద్, ఉపాధ్యక్షులుగా మమత, ప్రేమలత, కమిటీ సభ్యులుగా దానయ్య, వెంకటేశ్, భార్గవ్, ప్రశాంత్, శ్రీనివాస్, బీరయ్య, భారతమ్మ, ఐలమ్మ తదితరులను నియమించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్ -
సంతోషంతో ఒత్తిడి దూరం
నాడు జలకళ.. నేడు వెలవెల వర్షాకాలంలో వరద పరవళ్లు తొక్కుతూ పంట పొలాలను ముంచెత్తిన ఈసీ వాగు ప్రస్తుతం ఎడారిగా దర్శనమిస్తోంది. మండలంలోని అమ్డాపూర్ సమీపంలో గల ఈసీవాగు పరివాహక ప్రాంతం వెలవెలబోయి కనిపిస్తూ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. – మొయినాబాద్రూరల్ చేవెళ్ల: సంతోషం, ఆనందకరమైన అలవాట్లు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఒత్తిడిని సమర్థవంతంగా దూరం చేస్తాయని మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి యోగ, వ్యాయామాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతోషమే సగం బలం అనే మాట నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి యోగ, వ్యాయమాలు ఎంతో అవసరమన్నారు. దీంతో పాటు క్లీన్ చేవెళ్ల–గ్రీన్ చేవెళ్ల అనే నినాదంతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ రాముగౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్, శైలజ, మనిషా, నాయకులు యాదిరెడ్డి, గోపాల్రెడ్డి, మున్సిపాల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి -
ఎంబీఏ పట్టభద్రులకు వీడ్కోలు
మన్సూరాబాద్: సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పట్టభద్రులు వీడ్కోలు సమావేశం మన్సూరాబాద్లోని ప్రలవి గార్డెన్స్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ జి.నాగయ్య మాట్లాడుతూ... కార్పొరేట్ రంగంలో వస్తున్న మార్పులతో నైతిక నాయకత్వానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. ఎంబీఏ అధిక జీతాలిచ్చే ఉద్యోగాలకు మార్గం మాత్రమే కాదని, నిజాయితీ, నూతన ఆవిష్కరణలు, సామాజిక స్పృహతో వ్యాపారాలను నడిపించే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు అభినందించారు. ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం.కవిత, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
విద్యార్థికి సన్మానం
షాద్నగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో షాద్నగర్ పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీకి చెందిన విద్యార్థిని బడావత్ అఖిల 831వ ర్యాంకు సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అఖిలను ఆదివారం బీజేపీ నాయకులు అందె బాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్యాట అశోక్, నాయకులు వంశీకృష్ణ, రఘునాథ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గం ఎన్నిక యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం 12వ మండల మహాసభ జరిగింది. ఈ సభకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్, అంజయ్యలు హాజరయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు, ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం చేసిన రాజీలేని పోరాటాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇదే మాదిరి ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించారు. అనంతరం మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్ పుష్ప, కావలి జగన్లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా లాజర్, జంగయ్య, సహాయ కార్యదర్శిగా కుమార్, కార్యవర్గ సభ్యులుగా రాములు, జంగయ్య, సత్యనారాయణ, సురేష్, సత్యం, జగన్, ఇంద్రమ్మ, అంజయ్య, శివ, రాములను ఎంపిక చేశారు. ఈ నెల 14న షాద్నగర్లో జరిగే జిల్లా మహా సభలకు యాచారం మండలం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని నిర్ణయించారు. స్వయం ఉపాధి మేలు కడ్తాల్: యువత స్వయం కృషితో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్గుప్తా, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయలను స్థానిక నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతి తదితరులున్నారు. ఆమనగల్లు: స్థానిక ఎస్ఐగా కోటేశ్వర్రావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని మోకిల పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఆయన బదిలీపై ఆమనగల్లుకు వచ్చారు. ఆదివారం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డి, ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. -
రైతుబజార్లో కూరగాయల ధరలు
ఆర్థిక సాయం మన్సూరాబాద్: గాలి దుమారానికి లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధి విరన్నగుట్ట బస్తీకి చెందిన రమేష్ ఇంటిపై పక్కనే నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇంటి రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ యువనేత జక్కిడి రఘువీర్రెడ్డి ఆదివారం ఇంటిని సందర్శించి బాధిత కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. నాయకులు చంద్రారెడ్డి, కేకేఎల్ గౌడ్, నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. రేపు పాస్టర్స్, క్రైస్తవ సంఘాల సమావేశం మలక్పేట: మలక్పేట నియోజకవర్గ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధర్యంలో ఈ నెల 9న పాస్టర్స్, క్రైస్తవ సంఘాల నాయకుల సమావేశం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రోళ్ల మాణిక్యం అబ్రాహాం తెలిపారు. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల ముఖ్య అతిథిగా హజరవుతారని వెల్లడించారు. రాక్ చర్చి సీనియర్ పాస్టర్ బిషప్ తిమోతి కొల్లబత్తుల, బాప్టిస్టు చర్చి సినీయర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ బోడ సాల్మన్ వాఖ్యోపదేశం చేస్తారని తెలిపారు. దిల్సుఖ్నగర్ బాప్టిస్టు చర్చిలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి అందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత చంపాపేట: కాలనీల పరిశుభ్రతలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంఎంసీ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ చిత్రం సురేష్ కోరారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో చంపాపేట డివిజన్ సూర్యానగర్ కాలనీలో గడప గడపకూ వెళ్లి తడి పొడి చెత్తను విఽధిగా వేరు చేసి స్వచ్ఛ ఆటోవాలాలకు అందజేయాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొందరు చెత్తను ఆటోవాలాలకు అందజేయకుండా అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా రహదారులపై డంపింగ్ చేస్తున్నారని తెలిపారు. దీంతో కాలనీవాసులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు కృష్ణారెడ్డి, గౌతమ్రెడ్డి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. కుక్కలు, కోతులతో ఇబ్బంది పడుతున్నారా? లింగోజిగూడ: ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో కాలనీల్లో కుక్కలు, కోతులతో ప్రజలు ఇబ్బంది పడితే వెటర్నరీ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచించారు. నాగోలు, హయత్నగర్ సర్కిల్ అధికారి డాక్టర్ పి.శ్యాంసుందర్ (ఫోన్: 90634 21353), సరూర్నగర్, ఎల్బీనగర్ సర్కిల్ అధికారి డాక్టర్ భుక్యానాయక్ (ఫోన్: 90638 36131)లను సంప్రదించాలని తెలిపారు. -
వార్డు సభలను విజయవంతం చేయండి
షాద్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీలోని 2, 9, 18, 21, 26, 27వ వార్డుల్లో సోమవారం వార్డుసభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. ఉదయం 9 గంటలకు సభలు ప్రారంభమవుతాయని, ఆయా వార్డుల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం షాద్నగర్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రీప్రైమరీ తరగతులు మంజూరైనట్లు ఎంఈఓ మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని వెలిజర్లతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్కాలనీ, క్రిస్టియన్కాలనీ, ఆర్టీసీకాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఇన్స్ట్రక్టర్ ఇంటర్, ఆయాల కోసం 7వ తరగతి అర్హత కలిగి ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ సాయంత్రం వరకు మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మరిన్నీ వివరాలకు 96035 54546 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. చిన్నారి కుటుంబానికి అండగా ఉంటా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో గత నాలుగు నెలల క్రితం మల్లన్న జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, మౌనిక ఆదివారం షాద్నగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండేళ్ల చిన్నారి జాతరలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. చిన్నారి మృతిని కొన్ని పార్టీల నాయకులు రాజకీయం చేశారన్నారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేయకముందే కొందరు నాయకులు రాద్దాంతం చేశారే తప్పా ఎవరూ ఆదుకోలేదన్నారు. తాను అండగా ఉంటానని, తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీనిచ్చారు. డిప్యూటీ ఖాజీగా మహమ్మద్ రఫీఖ్ కేశంపేట: మండల డిప్యూటీ ఖాజీగా చౌలపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్ ఎంపికయ్యారు. ఈ మేరకు షాద్నగర్ ఖాజీ సయ్యద్ ఇఫ్తేఖార్ అలీ చేతుల మీదుగా ఆదివారం ఆయన నియామకపత్రం అందుకొన్నారు. మైనార్టీ వక్ఫ్బోర్డు పరిధిలో పనిచేస్తూ ముస్లింలకు సంబంధించిన వివాహాలు, విడాకుల వ్యవహారాలతో పాటు ధార్మిక వ్యవహారాలను చేపట్టాలని ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ అలీ సూచించారు. ఎస్ఎఫ్సీ సభ్యుడికి సన్మానం కడ్తాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియామకమైన మండల కేంద్రానికి చెందిన ఎండీ ఆసీఫ్ అలీని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్పతినాయక్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యాదయ్య, రాజునాయక్, జహంగీర్అలీ, రమేశ్ తదితరులు ఉన్నారు. మంచాల: సీపీఎం జిల్లా నాయకుడు కర్నాటి శ్రీనివాస్రెడ్డి మాతృమూర్తి(ప్రమీళ) ఇటీవల మృతి చెందడంతో వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. ఆదివారం రంగాపూర్లో ఆమె చిత్రపటం వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి, డీజీ.నర్సింగ్రావు, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, అలాగే కాంగ్రెస్ నేతలు రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, మర్రి నిరంజన్రెడ్డి, రాంరెడ్డి నివాళుల ఆర్పించి శ్రీనివాస్రెడ్డిని ఓదార్చారు. -
నిషేధంపై నిర్లక్ష్యం!
కొత్తూరు: ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం.. భూతాపం పెరగడంతో పాటు పలు విపత్తులకు కారణమయ్యే నాణ్యత లేని పాలిథిన్(ప్లాస్టిక్) ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన నిషేధం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక వ్యాపారులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి తీర్మానం చేసి ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ అధికారుల నిఘా కొరవడడంతో కొందరు వ్యాపారులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. యథేచ్ఛగా వాడకం.. మండల కేంద్రంతో మొదలుకొని అన్ని పంచాయతీలు, అనుబంధ గ్రామాలు, గిరిజన తండాల్లో సైతం నాణ్యత లేని పాలిథిన్ కవర్లు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, అల్పాహారం, కిరాణ, కూరగాయలు, పండ్లు, ఇతర చిరు దుకాణాల్లో వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పాలిథిన్ కవర్లను తయారు చేయడం.. ఉపయోగించడాన్ని గతంలో ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ మండలంలో పాలిథిన్ సంచుల నాణ్యతను గుర్తించే యంత్రాలు లేకపోవడం.. సంబంధిత శాఖ అధికారుల అలసత్వం కారణంగా మండలంలో వ్యాపారులు యథేచ్ఛగా కవర్లు వాడుతున్నారు. మండలంలో రోజుకు సగటున 60 నుంచి 80 కిలోల వరకు పాలిథిన్ సంచుల విక్రయం సాగుతోంది. గ్రామాల్లోని పలు కాలనీల్లో వాడి పడేస్తున్న పాలిథిన్ సంచులను కొందరు ఇళ్ల సమీపంలోనే కాల్చుతున్నారు. దీంతో సమీపంలోని ఇళ్లలోకి విషపూరితమైన పొగ వ్యాపిస్తుండడంతో రోగాల బారినపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అనర్థాలు ఇలా.. పాలిథిన్ సంచులు ఏళ్ల తరబడి భూమిలో కరిగిపోకుండా ఉండడంతో విపరీతమైన భూతాపం పెరుగుతోంది. వర్షాకాలంలో కాల్వల్లో వరద ప్రవాహాన్ని అడ్డుకొని సమస్యలను సృష్టిస్తాయి. నాణ్యత లేని పాలిథిన్ గ్లాసులు, ఇతర ఉత్పత్తుల్లో టీ, వేడి ఆహార పదార్థాలను తినడంతో పలు రకాల వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని జనావాసాల మధ్య కుప్పగా పడేసి కాల్చడంతో విషపూరితమైన వాసన కారణంగా శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. విచ్చలవిడిగా పాలిథిన్ విక్రయాలు అవగాహన కల్పిస్తున్నా మారని తీరు తూతుమంత్రంగా అధికారుల తనిఖీలునిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే వివిధ రకాల వ్యాపారులతో సమావేశం నిర్వహించాం. నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లు, ఇతర ఉత్పత్తులను విక్రయించడం.. వినియోగించకుండా అవగాహన కల్పించాం. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు సైతం విధించాం. తరచూ చేసే తనిఖీల్లో ప్లాస్టిక్ను వినియోగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. – బాలాజీ, మున్సిపల్ కమిషనర్, కొత్తూరు -
ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం
షాబాద్: షాబాద్లో బొడ్రాయి ప్రతిష్ఠాపన 4వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామస్తులు బొడ్రాయి వద్దకు బారులు తీరి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండాల అశోక్, మాజీ సర్పంచులు తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, రవీందర్, వెంకట్యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు జడల లక్ష్మీరాజేందర్గౌడ్, ఉపసర్పంచ్ దండు రాహుల్గుప్తా, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం
మన్సూరాబాద్: వీరన్నగుట్టపై ఉన్న భద్రకాళి రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ యువనేత జక్కిడి రఘువీర్రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్ర అభివృద్ధి పనులపై సమీప కాలనీలవాసులతో కలిసి ఆదివారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ... వీరన్నగుట్ట ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కల్గిన పుణ్యక్షేత్రమని అన్నారు. ఈ క్షేత్రానికి విచ్చేసే భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్షేత్రాన్ని అప్పటి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని పిలిపించి అభివృద్ధికి రూ. 18 కోట్ల నిధులను మంజూరు చేయించామని ఆయన గుర్తుచేశారు. మొదటి విడతగా రూ. 5.5 కోట్లతో గుట్ట చూట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టామన్నారు. వివాదాల కారణంగా కొత జాప్యం జరిగినా ప్రభుత్వం మారడంతో అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. వీరన్నగుట్ట క్షేత్రం కమిటీ సభ్యుల సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి దివ్యమైన క్షేత్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. శివరాత్రి పర్వదినం రోజు రెండు లక్షల మంది భక్తులు వచ్చిన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రం అభివృద్ధికి 3డీ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. డ్రైనేజీ, టాగునీటి వసతి కల్పించిన అనంతరం సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్రెడ్డి, నాయకులు శ్రీధర్గౌడ్, రవీందర్గౌడ్, కొసనం ధనలక్ష్మి, రమేష్గౌడ్, శంకర్రెడ్డి, కేకేఎల్ గౌడ్, నాగభూషణం, సోమనాథ్, యాదగిరిస్వామి, సీతారాం, వెంకన్న, సత్యం, రఘునాథరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి -
చదువుతోనే పేదరికం మాయం
యాచారం: చదువుతోనే పేదరికం మాయమవుతుందని, ఆ దిశగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదవాలని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ సూచించారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన యాచారం మండలం గడ్డమల్లయ్యగూడం గ్రామానికి చెందిన గౌర జాహ్నవి, మంచాల మండల కేంద్రానికి చీర మనస్వినిలను నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. తలా రూ.పది వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం మాయం కావాలన్నా.. ప్రజల్లో గుర్తింపు పొందాలన్నా కేవలం చదువు ఒక్కటే పరిష్కారామన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పుల కోసం అంబేడ్కర్ అడుగు జాడలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ -
10న అధిక ధరలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన
నాగోలు: కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇ.టి నరసింహ తెలిపారు. సీపీఐ నాగోలు డివిజన్ సాయి నగర్ (గుడిసెలు) ప్రాంత జనరల్ బాడీ సమావేశం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కాంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సింహ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల ప్రయోజనాలే లక్ష్యంగా పెట్రో ధరలు పెంచాయన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం అయిందని అన్నారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ... ముందుగా నాగోలు చౌరస్తా నుంచి సీపీఐ కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని సాయినగర్ సీపీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నాగోలు డివిజన్, సాయినగర్ ఏరియా శాఖల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ -
అవసరం లేకున్నా అతిగా కొని..
మొయినాబాద్: మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న అధికారులు.. అవినీతిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని వస్తువులు అవసరం లేకున్నా అతిగా కొనుగోలు చేసి అందులో వాటాలు దండుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఇటీవల అధికారులు సున్నం బస్తాలు కొనుగోలు చేశారు. ఒక్కో గ్రామంలో సుమారు 300ల బస్తాలను వార్డు కార్యాలయాల్లో వేశారు. బ్లీచింగ్ పౌడర్లో కలిపి రోడ్లపక్కన చల్లడానికి వాటని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఏడాది మొత్తానికై నా సుమారు వంద బస్తాలు కూడా వినియోగించే అవకాశం లేదని.. వారు తమ కమీషన్ల కోసం ఎక్కువ కొనుగోలు చేసి వార్డు కార్యాలయాల్లో వృథాగా పడేశారని మున్సిపల్ సిబ్బందే వాపోతున్నారు. సున్నం బస్తాలు సరఫరా చేసే కాంట్రాక్టర్తో మున్సిపాలిటీలోని ఇద్దరు ముగ్గురు అధికారులు కుమ్మకై ్క ఒకేసారి తెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై కొందరు కౌన్సిలర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు లేవని చెప్పే అధికారులు.. అనవసర ఖర్చులు చేసి కమీషన్లు దండుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సున్నం బస్తాల కొనుగోలులో అధికారుల చేతివాటం -
జవహర్నగర్ దోపిడీ ముఠా
20 రోజుల పాటు పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ ● నలుగురి అరెస్ట్కంటోన్మెంట్: జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసును మల్కాజి పోలీసులు ఛేదించారు. నేపాలీ ముఠాకు చెందిన ప్రధాన నిందితులు మీనా, రాజేష్, డేనియల్ చారో, చాంగ్ కిరణ్లను అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ తెలిపిన మేరకు.. కౌకూర్లో నివాసముంటున్న మురళీ మోహన్ నరసిపురం ఇంట్లో మే 11న రాత్రి దోపిడీ జరిగింది. నేపాలీ కార్మికులు మీనా, రాజేష్లు దోపిడీకి పథకం రచించారు. సబీనా అనే మహిళను బాధితుడి ఇంట్లో పనిమనిషిగా చేర్పించారు. మే 11న మీనా పుట్టినరోజు వేడుకల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు వృద్ధ దంపతులను బంధించి మత్తు పదార్థం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం ఇనుప రాడ్లతో బెదిరించి అల్మారాలు పగులగొట్టి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, 3 వేల అమెరికన్ డాలర్లు సహా విలువైన వస్తువులను దోచుకొని పరారయ్యారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మల్కాజ్గిరి పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 255 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించి, బెంగళూరు, ఢిల్లీ, ముంబైతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. నేరం జరిగిన ఐదు రోజుల్లోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం మరో 20 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మీనా, రాజేష్లు గతంలో పలుచోరీ కేసుల్లో నిందితులని వివరించారు. ఇదిలా ఉండగా కమిషనరేట్ పరిధిలో 1,276 మంది నేపాలీ జాతీయులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఫ్యూచర్సిటీకి భూములిచ్చేదిలేదు
కందుకూరు: ఫ్యూచర్సిటీకి భూములు ఇచ్చేదేలేదని మండల పరిధిలోని ముచ్చర్ల రైతులు తీర్మానించారు. శనివారం స్థానిక సర్పంచ్ ఊటుపద్మ, ఉప సర్పంచ్ తేరటిరవి, సీనియర్ నాయకుడు ఊటు మహేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ఫార్మా పేరుతో గత ప్రభుత్వం భూములు తీసుకుందని అన్నారు. మళ్లీ అదనంగా తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చారని, రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టానుసారంగా జీఓ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో 200 మంది రైతులు పట్టా భూములు కోల్పోయే అవకాశం ఉందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే తమకు ఒక్క గుంట భూమి కూడా మిగల్చరా అని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తేరటి లక్ష్మణ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్క మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ ఆర్.రవీందర్, వార్డు సభ్యులు రమేష్, వెంకటేశ్, అశోక్, కృష్ణగౌడ్, చెన్నయ్య, రైతులు శ్రీనివాస్రావు, రాజేందర్రెడ్డి, వెంకటేశ్వర్రావు, శ్రీరాములు, రవి, శ్రీనివాస్, వెంకటేశ్, రాజు, శేఖర్, హరి, నిరంజన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ముచ్చర్ల రైతుల తీర్మానం -
షార్ట్ సర్క్యూట్తో షాపులో మంటలు
మొయినాబాద్: షార్ట్ సర్క్యూట్తో ఓ బట్టల షాపులో మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్లో జరిగింది. స్థానికంగా ఉండే అనురాధ తన ఇంట్లోనే బట్టల షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో అకస్మాత్తుగా మంటలు అంటుకొని భారీగా పొగలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బకెట్లతో నీళ్లు పోశారు. ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చింది. స్థానికులు, ఫైర్ సిబ్బంది కష్టపడి పూర్తిగా మంటలు ఆర్పేశారు. అప్పటికే చాలా బట్టలు కాలిపోయాయి. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితురాలు తెలిపారు. -
ఉక్కపోత నుంచి ఉపశమనం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మృగశిరకు ముందే ఉమ్మడిజిల్లాను తొలకరి పలకరించింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షానికి వాతావరణం చల్లబడింది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5.03 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.43 సెంటీమీటర్లు నమోదైంది. శేరిలింగంపల్లిలో 4.08 సెం.మీ, కందుకూరులో 3.80 సెం.మీ, యాచారం మండలం నల్లవెల్లిలో 3.75 సెం.మీ, కడ్తాల్ మండలం ముద్వీన్లో 3.68 సెం.మీ, కొంగర కలాన్లో 3.38 సెం.మీ, మామిడిపల్లిలో 3.13 సెం.మీ, మణికొండలో 2.72 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ చౌడాపూర్లో 3.68 సెం.మీ, మదన్పల్లెలో 2.80 సెం.మీ, యాలాలలో 2.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ లైన్లపై పడ్డాయి. వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్ప డింది. విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమైన సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు వర్షం ధాన్యం రైతులను నిండా ముంచింది. రాశులపై టార్పాలిన్లు లేకపోవడంతో తడిసి ముద్దయ్యాయి. ఇబ్రహీంపట్నంలో.. ఇబ్రహీంపట్నం: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచింది. కొంగరకలాన్లో 33.8 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 13.8 మి.మీ. మంగల్పల్లి ప్రాంతంలో 0.8 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం తాండూరులో 5.03 సెం.మీ వర్షపాతం మాడ్గులలో 4.43 సెం.మీ నమోదు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం -
పోలీసు కస్టడీకి నేపాలీ గ్యాంగ్
బంజారాహిల్స్: గత నెల 8వ తేదీన ప్రశాసన్నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజరంజన్ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్లోకి అడుగుపెట్టారు. చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్తో పాటు రిసీవర్ దిలీప్లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సునీల్ దిలీప్ -
ఎర్రకుంట వాగు పరిశీలన
● స్పందించిన రెవెన్యూ అధికారులు ● ప్రహరీ నిర్మాణం కోసం తవ్విన పునాది పూడ్చివేత మొయినాబాద్: వాగులు కాలువలను కబ్జాచేస్తే కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని సురంగల్ రెవెన్యూలో ఉన్న ఎర్రకుంట వాగును కబ్జాచేస్తూ ప్రహరీ నిర్మాణానికి చేపట్టిన తవ్వకాలపై ‘వాగులైనా వదలం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శనివారం తహసీల్దార్ గౌతమ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, సర్వేయర్ జలజ, సిబ్బందితో కలిసి ఎర్రకుంట వాగును పరిశీలించారు. ప్రహరీ నిర్మాణంకోసం తవ్వని పునాదిని మట్టిపోసి పూడ్చివేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. వర్షం నీరు ప్రవహించే వాగులు, కాలువలను కబ్జాచేస్తే సహించేది లేదన్నారు. కాలువలు, వాగులు సహజసిద్ధంగా పట్టాభూముల్లో నుంచి ఉన్నా వాటిని వదిలేయాలని చెప్పారు. సర్వేకు దరఖాస్తు చేశాం సురంగల్ ఎర్రకుంట వాగుకు ఆనుకుని ఉన్న సర్వేనంబర్ 332లో 1.01 ఎకరాలు తమ పట్టాభూమి ఉందని.. వర్షాలు పడినప్పుడు వరద వచ్చి తమ పట్టాభూమి కోతకు గురికాకుండా ప్రహరీ నిర్మించడానికి పునాది తీశామని మాజీ సర్పంచ్ భర్త, మాజీ ఉపసర్పంచ్ గడ్డం అంజిరెడ్డి తెలిపారు. తమ భూమిని సర్వే చేసి హద్దులు చూపించాలని తహసీల్దార్కు దరఖాస్తు చేశామని.. సర్వే చేసిన తరువాతే ప్రహరీ నిర్మించుకుంటామన్నారు. అధికారులు త్వరగా సర్వే చేయాలని కోరారు. -
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్, సునీతాదేవి(30) దంపతులు పిల్లలతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం జల్పల్లి శ్రీరామ కాలనీకి వలస వచ్చారు. రోజు మాదిరిగానే కుటుంబం నిద్రించగా 1వ తేదీన ఉదయం నిద్ర లేచి చూడగా సునీత కనిపించలేదు. ఎనిమిది నెలల క్రితం నితిన్ అనే వ్యక్తితో వెళ్లిపోయిన సునీత తిరిగి వచ్చిందని, ఇప్పుడు కూడా అతనితోనే వెళ్లిపోయి ఉంటుందని ఆమె భర్త పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొయినాబాద్లో షూటింగ్ సందడి మొయినాబాద్: మొయినాబాద్ ప్రాంతం షూటింగ్ స్పాట్గా మారింది. నగరానికి చేరువలో ఉండడంతోపాటు ఇక్కడ ఫాంహౌస్లు, దేవాలయాలు ఉండటంతో నిత్యం షూటింగ్ లు జరుగుతున్నాయి. ప్రధానంగా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ షూటింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. శనివారం కనకమామిడిలోని వేంకటేశ్వర దేవాలయం వద్ద ‘రుణానుబంధం’ సీరియల్ షూటింగ్ జరిగింది. ఆలయానికి వెళ్తున్నట్లు, ఆలయ పరిసరా ల్లో తిరుగుతున్న సన్నివేశాలను చిత్రీకరించా రు. సీరియల్ షూటింగ్ను ఆలయానికి వచ్చి న భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
అమ్మమ్మ ఇంటికి వెళ్తూ అతివేగం ఇద్దరి ప్రాణాలను హరించిన ఘటన షాద్నగర్ పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలో జరిగింది.
రైతుల అంగీకారం లేకుండా, కనీస నష్టపరిహారం కూడా చెల్లించకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని స్థానికులు, బాధితులు కొంతకాలంగా నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కారు తీరుపై అంతా గుర్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో అలజడి సృష్టించే అవకాశం ఉందని అనుమానించిన పోలీసులు భూ బాధిత రైతులతో పాటు పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. వీరిలో ఇద్దరు అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఉండటం గమనార్హం. అరెస్టు చేసి, అటు ఇటు తిప్పి.. అరెస్టులను తప్పుబడుతూ కొంతమంది నిరసనకారులు కోహెడలో సీఎం రేవంత్రెడ్డి సహా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి, సీఎంతో పాటు, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి, గంటల తరబడి రోడ్లపై తిప్పుతూ.. చివరకు నాగోల్ పీఎస్కు తరలించారు. పోలీసులు, సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. రైతుల అంగీకారం లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. -
ప్రీకాస్ట్ మాటున గంజాయి సాగు
నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు చేవెళ్ల: సిమెంట్ ప్రీకాస్ట్ పలకల తయారీ కేంద్రంగా నిర్వహిస్తున్న అక్రమ దందా గుప్పుమంది. గుట్టుగా గంజాయి మొక్కలు పెంచుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ కేంద్రంలో హైదరాబాద్ రోడ్డుకు సమీపంలో సిమెంట్ ప్రీకాస్ట్ పలకలు, ఇటుకలు తయారు చేసే కేంద్రంలో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో వారు దాడులు చేశారు. అక్కడ బిహార్కు చెందిన నగరాజిత్ యాదవ్, దిశేసర్ యాదవ్, లాల్బాబు యాదవ్, గణేశ్కుమార్ గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. తహసీల్దార్ కృష్ణయ్య, ఏఓ శంకర్లాల్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. దాదాపు 3.1 కిలోల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని నలుగురుపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త
యాచారం: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో శనివారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చోరీలు జరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బంధువుల ఇళ్లకు, శుభాకార్యాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే వారు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ నందీశ్వర్రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీలత, గ్రామ సర్పంచ్ అచ్చెన మంగ పాల్గొన్నారు. కొందుర్గు: డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం కృషిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని తంగెళ్లపల్లిలో సర్పంచ్ చందన అధ్యక్షతన శనివారం ఏర్పాటుచేసిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటిని అరికట్టే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఆన్లైన్ గేములకు ఆకర్శితులై మోసపోవద్దని సూచించారు. తహసీల్దార్ ఆజంఅలీ భూదార్కార్డులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనువాసు, ఎస్ఐ రవీందర్, ఏఎస్ఐ చత్రినాయక్ పాల్గొన్నారు. ఫ్యూచర్సిటీతో కందుకూరు: ఫ్యూచర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందనుందని మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ఫ్యూచర్సిటీలో నిర్మించిన ఎఫ్సీడీఏ భవనాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ వైపు ఒత్తిడి తగ్గేలా సీఎం రేవంత్రెడ్డి ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు రూపకల్పన చేశారన్నారు. ప్రపంచంలోనే మేటి నగరంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని తెలిపారు. ఇక్కడ అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పించేలా భూములు కేటాయించనున్నట్టు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్సిటీని రద్దు చేస్తామని ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి రాజకీయాలను పక్కనపెట్టి కలిసిరావాలన్నారు. ఈ నెల 10న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎఫ్సీడీఏ, స్కిల్స్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవం జరగునుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణానాయక్, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు సరికొండ మల్లేష్, ఎస్.వెంకట్రాంరెడ్డి, సీనియర్ నాయకులు చిర్ర సాయిలు, సురేందర్, యుగంధర్గౌడ్, మదన్పాల్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వెంకటేష్, భూపాల్రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. పరిగి: పట్టణంలోని కొత్త చెరువు కుంటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన పట్టణ కేంద్రంలోని కొత్తచెరువు కుంట మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త చెరువు కుంటను పరిగి పట్టణంలో మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతానని అన్నారు. గతంలో కొత్త చెరువు కుంట అన్యాక్రాంతమైందని.. ప్రస్తుతం చెరువు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించామన్నారు ఎలాంటి సమస్యలున్నా తన తృష్టికి తేవాలని కోరారు. -
వర్షం కురిసి.. అలా ముగిసి
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్కు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన సాక్షి, రంగారెడ్డి జిల్లా/తుర్కయంజాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం.. ఆందోళనలు.. అరెస్టుల మధ్య ముగిసింది. కోహెడ కేంద్రంగా 239 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,284.32 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మార్కెట్ భవనాలతో పాటు నాలుగు ఎకరాల్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఐదు గంటలకే ఆయన హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, కాలె యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులతో మాట్లాడి, వారి అనుభవాలను విన్నారు. తడిసిన రైతులు.. ఖాళీ కుర్చీలు పండ్లమార్కెట్ శంకుస్థాపనకు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నల్లగొండ, నాగర్కర్నూలు, భువనగిరి జిల్లాల నుంచి సుమారు యాభై వేల మందిని తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు బస్సులను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రైతులు తడిపి ముద్దయ్యారు. శంకుస్థాపన ఆలస్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకే సభాస్థలికి చేరుకున్న రైతులు రాత్రి పొద్దుపోయే వరకు నిరీక్షించాల్సి వచ్చింది. మరికొంతమంది శంకుస్థాపనకు ముందే వెనుదిరిగారు. సభాస్థలి ముందు భాగంలో మూడు బ్లాకులు ఏర్పాటు చేయగా ఒకటి, రెండు బ్లాకుల్లో మాత్రమే జనం కనిపించారు. మూడో బ్లాక్లోని కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సరైన పార్కింగ్ లేకపోవడం, వర్షం కారణంగా వాహనాలు బురదలో ఇరుక్కుపోవడంతో వీటిని తీసేందుకు నానా తంటాలు పడ్డారు. కాగా, మల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శించగా ఎమ్మెల్యే వారిని వారించారు. నిశ్శబ్దంగా కూర్చోవాలని సూచించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఆలస్యంగా కార్యక్రమం సభాస్థలికి రెండు గంటలు లేటుగా వచ్చిన ముఖ్యమంత్రి శంకుస్థాపనకు ముందే వెనుదిరిగిన మెజార్టీ రైతులు మరోవైపు కొనసాగిన ఆందోళనలు.. అరెస్టులు -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ మొయినాబాద్రూరల్: ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కాశీంబౌలిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. సర్పంచ్ మాడి రాజేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దన్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్తో ప్రమాదాలు జరుగుతాయన్నారు. ట్రాఫిక్ నియయాలు పాటించాలని సూచించారు. అనంతరం ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సతీష్, ఎస్సై శివరాణి, వార్డు సభ్యురాలు స్వాతివిజయేందర్రెడ్డి, గ్రామస్తులు భూపాల్రెడ్డి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి
పహాడీషరీఫ్: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్పోర్ట్స్ ఎరీనాలో భాగంగా జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని ఏరోసిటీ మామిడిపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్మించిన పలు నూతన నిర్మాణాలను స్కూల్స్ గ్రూప్స్ చైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, అగ్రికల్చర్, ఎడ్యూకేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాకేష్ చంద్ర అగర్వాల్, కన్హా శాంతి వనం ఓఎస్డీ డాక్టర్ నర్సిరెడ్డితో కలిసి రన్నింగ్ ట్రాక్, మినీ ఫుట్బాల్ కోర్ట్, స్విమ్మిగ్ పూల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో మానసిక పరిపక్వత పెంపొందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు క్రీడారంగంలో రాణించేలా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
యువత క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలి
హుడాకాంప్లెక్స్: యువత క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని క్రీడాప్రాధికార సంస్థ తెలంగాణ ఉప సంచాలకుడు రవీందర్ పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో శనివారం వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతోపాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటారన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ చిన్నారులు, యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం, శారీరక దృఢత్వం, మానసిక వికాసం, జట్టు భావన పెంపొందించడమే లక్ష్యంగా సరూర్నగర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించినట్టు తెలిపారు. జిల్లా యువజన, క్రీడల అధికారి స్వర్ణలత మాట్లాడుతూ.. భవిష్యత్లో మరింతమంది యువత క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కోచ్లు, సిబ్బంది, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ధ్రువపత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ క్రీడా విభాగాల కోచ్లు, సిబ్బంది, క్రీడాభిమానులు పాల్గొన్నారు. -
మృత్యు లోకాలకు
అమ్మమ్మ ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు, యువకుడు మృతి షాద్నగర్రూరల్: అతివేగం ఇద్దరి ప్రాణాలను హరించిన సంఘటన షాద్నగర్ పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫరూఖ్నగర్కు చెందిన పడకంటి జగదీశ్వర్, జయశ్రీ దంపతుల కుమారుడు అఖిల్ కుమార్(19), అక్కడే ఉండే శంకరయ్య, శామలమ్మ దంపతుల కుమారుడు నవదీప్(14) ఇద్దరు స్నేహితులు. శంకరయ్య కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపాల్ గ్రామం నుంచి బతుకుదెరువు నిమిత్తం షాద్నగర్కు వలస వచ్చారు. ఆయన మేసీ్త్ర పనులు నిర్వహిస్తుండగా, శ్యామలమ్మ శంషాబాద్లోని ఆస్పత్రిలోని పని చేస్తూ జగదీశ్వర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అఖిల్కుమార్ తన స్నేహితుడు నవదీప్తో కలిసి బైక్పై అమ్మమ్మ ఊరైన నందిగామ మండలం పిట్టలగూడ గ్రామానికి వెళుతున్నారు. మార్గమధ్యలో లింగారెడ్డిగూడ గ్రామ శివారులో క్రికెట్ మైదానం వద్ద రోడ్డు పైకి వస్తున్న జేసీబీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు రహదారిపై పడిపోయారు. అప్పుడే వెనక నుంచి వేగంగా వస్తున్న ఎంఎస్ఎన్ పరిశ్రమకు చెందిన బస్సు రోడ్డుపై పడిపోయిన నవదీప్, అఖిల్కుమార్ల పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు అఖిల్కుమార్ ఇటీవల షాద్నగర్లో ఇంటర్ పూర్తి చేశారు. నవదీప్ కొందుర్గు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి మరణంతో ఆస్పత్రి ఆవరణలో వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, ట్రాఫిక్ సీఐ శంకరయ్యతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కొడంగల్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పారదర్శకంగా, నాణ్యతగా పనులు చేయించాలన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రూ.110 కోట్ల వ్య యంతో చేపట్టిన ఆలయ పునర్నవీకరణ పనులను పరిశీలించారు. ముందుగా బాలాలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ధర్మకర్తలు స్వాగతం పలికారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు వాస్తు నిపుణులతో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. తిరుమల తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాఢ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి -
ఆడుకునేందుకు వెళ్లిన బాలుడి అదృశ్యం
పహాడీషరీఫ్: ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మయ్య శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన గడుగు వీరమణి, మహదేవ్ దంపతులకు నలుగురు పిల్లలు సంతానం. ఈ నెల 3వ తేదీన ఉదయం వీరమణి పిల్లలను ఇంట్లో వదిలి స్థానికంగానే ఉన్న సింఘానియా కంపెనీలో పనికి వెళ్లింది. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఆమె చిన్న కుమారుడు దీపక్(13) కనిపించలేదు. బయటి ఆడుకునేందుకు వెళ్లాడని పిల్లల ద్వారా తెలుసుకున్న ఆమె స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ విషయమై పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిస్తే పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లోనైనా సమాచారం ఇవ్వాలని తెలిపారు. చైతన్యపురి: వేగంగా వెళుతున్న ఆటో డివైడర్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. చైతన్యపురి ఎస్ఐ ప్రభాకర్ తెలిపిన మేరకు.. బహదూర్పుర మురళినగర్కు చెందిన జయరాజ్యాదవ్(64) కుమారుడు కేశవ్యాదవ్ కలిసి పోచయ్య ఆటోలో చింతల్కుంటకు శుక్రవారం బయలుదేరారు. చైతన్యపురి చౌరస్తా వద్ద ఆటో డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జయరాజ్యాదవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన్సూరాబాద్: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడో ఓ రైతు. జీవన్దాన్ ప్రతినిధులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా గానుగబండ గ్రామానికి చెందిన షేక్ పల్సోనా (45) గత నెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్కు తరలించారు. ఈ నెల 4న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ ప్రతినిధులు మృతుడి భార్య షేక్ సైదాబీతో పాటు కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగహన కల్పించారు. దీంతో రెండు కిడ్నిలు, గుండె, రెండు కార్నియాలను జీవన్ధాన్ ప్రతినిధులు సేకరించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు.. నిమ్స్కు గుండె తరలింపు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ వరకు 16 కిలోమిటర్ల దూరాన్ని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం 20 నిమిషాల్లో గుండెను పంజగుట్టలోని నిమ్స్ హాస్పిటల్కు చేర్చారు. హయత్నగర్: కొహెడ శ్రీచైతన్య రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమటిరెడ్డి దేవేందర్రెడ్డి(17) గురువారం రాత్రి హాస్టల్ గదిలో బెడ్షీట్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన దేవేందర్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరంలో 466 మార్కులు సాధించాడు. అయితే, తనకు ఈ కళాశాలలో చదవడం ఇష్టం లేదని గతంలోనే కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కళాశాల యాజమాన్య వేధింపులే కారణమంటూ ఆందోళనకు దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధిని నీరుగారుస్తున్న కేంద్రం
● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ● మాడ్గులలో ఉపాధి కూలీల కమిటీ ధర్నా మాడ్గుల: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వరంగా మారిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు. మాడ్గుల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉపాధి కూలీల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు అనేక మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. హామీ పథకానికి బడ్జెట్ను పూర్తిగా తగ్గించిందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మతపరమైన విధంగా వీబీజీ–రామ్జీ పేరుతో అమలు చేస్తుందని చెప్పారు. పనులకు వచ్చిన కూలీలను రెండుసార్లు ఫొటో తీయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.800 అందించాలని, సంవత్సరంలో 200 రోజుల పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ విజయలక్ష్మికి అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం మండల శాఖ అధ్యక్షుడు పాషా, నాయకులు సైదమ్మ, శ్రీను, అంజయ్య, నర్సింహ, మైసయ్య, సైదయ్య, కృష్ణయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాన్నా.. అదిగో దొంగలు!
కుల్కచర్ల: తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నారు. కుల్కచర్ల మండలంలో గురువారం చోటుచేసుకున్న ఓ దోపిడీ ఘటన సినిమా దృశ్యాలను తలపించింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పుట్టపహాడ్ గ్రామానికి చెందిన బేతి మొగులయ్య ఉదయాన్నే తన భార్యతో కలిసి ఉపాధిహామీ పనులకు వెళ్లారు. సుమారు 11:30 గంటలకు వీరి ఇంటి తాళం పగులగొట్టిన ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించారు. ఎదురుగా ఉన్న ఆలయ పరిసరాల్లో ఆడుకుంటున్న మొగులయ్య కొడుకు రాహుల్(చింటు) ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించి అమ్మానాన్నా వచ్చారని లోపలికి వెళ్లాడు. అప్పటికే స్టీల్ గల్లా పెట్టెను ధ్వంసం చేసిన దుండగులు అందులోని రూ.60 వేలు, 16 తులాల వెండిని తీసుకున్నారు. లోపలికి వెళ్లిన పన్నెండేళ్ల చింటును కత్తితో బెదిరించడంతో భయపడిన బాలుడు బయటకు పరుగుతీశాడు. హైస్కూల్ వద్ద ఆడుకుంటున్న యువకుల ఫోన్తో తండ్రికి ఫోన్ చేయగా హుటాహుటిన ఇంటికి వచ్చారు. అప్పటికే దుండగులిద్దరూ బైక్పై పారిపోయారు. చోరీ జరిగిందని గుర్తించిన మొగులయ్య, స్థానికులు విషయాన్ని సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు గ్రామ నాయకులకు తెలియజేశారు. అంతా కలిసి సమీపంలోని పలు సీసీ పుటేజీలను సేకరించి, పెన్డ్రైవ్ తీసుకుని కుల్కచర్లలోని పీఎస్కు చేరుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు ఈ పుటేజీలను పరిశీలిస్తుండగా.. స్టేషన్ మెట్లపై కూర్చున్న చింటు.. రోడ్డు మీద బైక్పై వెళ్తున్న ఇద్దరిని గమనించి ‘నాన్నా.. అదిగో దొంగలు.. మనింటికి వచ్చింది వాళ్లే’ అంటూ అరిచాడు. ఈ మాటలు విన్న పోలీస్ వెహికిల్ డ్రైవర్ అంజిరెడ్డి పోలీసులను అప్రమత్తం చేసి బైక్ను వెంటాడారు. ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత, బైక్ను దాటేసి కారును రోడ్డుకు అడ్డంగా నిలిపాడు. అతివేగంగా వచ్చిన దొంగలకు బైక్ కంట్రోల్ కాకపోవడంతో కారును ఢీకొట్టి కిందపడిపోయారు. వీరిలో ఒకరిని అంజిరెడ్డి పట్టుకోగా, మరో దొంగ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. పది నిమిషాలలోపు బైక్లపై అక్కడికి చేరుకున్న పోలీసులు మరో దొంగ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో బైక్ను, దొంగను తీసుకుని పీఎస్కు తరలించారు. పట్టుబడిన వ్యక్తి జడ్చర్లకు చెందినవాడిగా గుర్తించారు. వీరు ప్రయాణించిన బైక్ను కర్నూలులో చోరీ చేసినట్లు తెలిసింది. పారిపోయిన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనింటికి వచ్చింది వాళ్లే.. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించిన బాలుడు బైక్పై పారిపోతుండగావెంటాడిన పోలీసులు ఒకరు చిక్కగా మరొకరు పరారీ -
ప్రైవేట్ బడుల్లో ఫీజు రాయితీ
జర్నలిస్టుల పిల్లలకు వర్తింపజేస్తూ డీఈఓ ఉత్తర్వులు ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీంపాషా ఆధ్వర్యంలో నాయకులు డీఈఓను కలవగా ఉత్తర్వు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా సలీం పాషా మాట్లాడుతూ.. జిల్లాలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లల చదువులకు ఉచిత విద్యనందించాలని కోరగా.. విద్యాధికారులు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం సంతోషమన్నారు. మండలాల్లో పని చేస్తున్న వారికి స్థానిక విద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రవి, కరుణాకర్, భాస్కర్, శ్రీనివాస్, భార్గవ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
రూ.8 లక్షల విద్యుత్ పరికరాల చోరీ
షాద్నగర్: నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామ శివారులో ఉన్న విద్యుత్ ఉప కేంద్రంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ పరికరాలను చోరీ చేశారు. ఉప కేంద్రంలో ఉన్న ఐదు కాపర్ రాడ్లు దొంగిలించినట్లు, వీటి విలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుంది. ఉప కేంద్రం సబ్ ఇంజనీర్ సందీప్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. మొయినాబాద్ రూరల్: ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాకారానికి చెందిన ఈర్లపల్లి లక్ష్మణ్రావు(55) కూలీ పనులు చేస్తుంటాడు. గురువారం పనికి వెళ్లిన లక్ష్మణ్రావు పొలంలోని ట్రాక్టర్ను నడిపేందుకు ప్రయత్నించగా, అదుపుతప్పి కిందపడిపోయాడు. పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని భాస్కర ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య సీతామహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జున్ తెలిపారు. మొయినాబాద్రూరల్: డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మండలంలోని తోల్కట్ట గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే సాంఘిక సంక్షేమ కళాశాల(వికారాబాద్)లో కుందేటి కల్పన(20) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. గురువారం ఆమె తన అక్కను ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పి బయలు దేరింది. శుక్రవారం అయినా సోదరి ఇంటికి రాకపోవడంతో సాధ్యమైన అన్ని చోట్ల వెతికారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. -
చోరీ చేసి.. నంబర్ మార్చి
● ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్ ● ఎనిమిది బైక్లు స్వాధీనం కడ్తాల్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరి కేటుగాళ్లను కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి మండల కేంద్రం సమీపంలోని తలకొండపల్లి కూడలిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, స్కూటీపై అనుమానాస్పదంగా వెళుతున్న ఇద్దరు యువకులను ఆపారు. సరైన ఆధారాలు చూయించలేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా స్కూటీని దొంగతనం చేసినట్లు అంగీకరించారు. ఇందులో భాగంగా వివిధ ఠాణాల పరిధిలో చోరీకి గురైన ఎనిమిది ద్విచక్రవాహనాల కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఆమనగల్లు మండలం చంద్రయాన్పల్లి తండాకు చెందిన చరణ్, తలకొండపల్లి మండలం బోడియాతండాకు చెందిన అనిల్, ఖమ్మం జిల్లాకు చెందిన కిల్లంపల్లి రాజశేఖర్ అలియాస్ శేఖర్ అని తేలింది. సులభంగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశంతో వీరు ముఠాగా ఏర్పడి బైకుల చోరీలకు పాల్పడుతున్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉంచిన వాహనాలను చోరీ చేసి, వాటి నంబర్ ప్లేట్లు మార్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారి అయిన రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించి, వాహనాల రికవరీలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్ టీం ఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ మహేశ్, రాంకోఠి, రఘునాయక్లను సీఐ సైదిరెడ్డి అభినందించారు. -
ప్రైవేట్ బడుల్లో ఫీజు రాయితీ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులో రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు.
ఇబ్రహీంపట్నం: భవిష్యత్ తరాలు బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్య నిపుణుడు కేవై రాంచందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ డా.గున్న రాజేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గోపాల గోశాలలో మొక్కలు నాటారు. మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు సునీల్, మండల విద్యాధికారి హీర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల: ప్రపంచ పర్యావరణ దినత్సోవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రకటించిన పర్యావరణ అవార్డుకు చేవెళ్ల మోడల్ స్కూల్ ఎంపికై ంది. నగరంలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో స్కూల్ ఉపాధ్యాయుడు దండ బాణీ మంత్రి కొండా సురేఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్లో మూడు అవార్డులకు ఎంపిక కాగా అందులో చేవెళ్ల మోడల్ స్కూల్ ఒకటి కావడం విశేషం. అవార్డు వచ్చిన సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నపు రెడ్డి మాట్లాడుతూ.. గ్రౌండ్ చుట్టూ నాటిన మొక్కలతో పరుచుకున్న పచ్చదనం, ప్రశాంతవాతవరణం అవార్డుకు ఎంపికయ్యేలా చేశాయన్నారు. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. -
సంతోషంగా ఉంది
మా గ్రామాన్ని కూడా ఎఫ్సీడీఏలో కలపాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేశాం. అధికారులు తీర్మాన పత్రం అడగడంతో వెంటనే ఏకగ్రీవ తీర్మానం చేసి అందజేశాం. ఫ్యూచర్సిటీలో కలపాలని చూడడం సంతోషంగా ఉంది. – కొర్ర అరవింద్నాయక్, సర్పంచ్, మంతన్గౌరెల్లి మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, కేసీతండాలను ఫ్యూచర్సిటీలో కలపాలని పంచాయతీ పాలకవర్గాల నుంచి ఏకగ్రీవ తీర్మానాలు అడిగింది వాస్తవమే. కలెక్టర్ ఆదేశాల మేరకు తీర్మాన పత్రాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం. – రాధారాణి, ఎంపీడీఓ, యాచారం -
‘ఫ్యూచర్’లోకి ఆ మూడు గ్రామాలు!
యాచారం: ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)లోకి యాచారం మండలంలోని మరో మూడు గ్రామాలను సైతం విలీనం చేసేందుకు సర్కార్ దృష్టి సారించింది. జిల్లాలోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్సిటీ నిర్మించడానికి నిర్ణయించడం తెలిసిందే. అత్యధికంగా యాచారం మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలను ఎఫ్సీడీఏలోకి తీసుకున్న సర్కార్ రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న మంతన్గౌరెల్లి, కేసీతండా జీపీతో పాటు యాచారం–మంచాల మండలాల సరిహద్దులోని మొండిగౌరెల్లి గ్రామాన్ని విస్మరించింది. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ గ్రామాలను కూడా ఫ్యూచర్సిటీలో విలీనం చేయాలని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏకగ్రీవ తీర్మానాలు ఇవ్వాలని ఆదేశాలు యాచారం మండలంలో మొత్తం 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలోనే 17 గ్రామాలను ఎఫ్సీడీఏలోకి తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో టీజీఐఐసీ ద్వారా రూ.50 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నారు. ఎఫ్సీడీఏలోకి తీసుకోని మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, కేసీతండాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సర్కార్ తాజాగా ఆ మూడు గ్రామాలను కూడా ఎఫ్సీడీఏలో విలీనం చేయాలని నిర్ణయించింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆయా పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఎంపీడీఓకు అందజేశారు. మండలమంతా ఎఫ్సీడీఏలోకి.. మూడు గ్రామాలతో యాచారం మండలంలోని 20 రెవెన్యూ గ్రామాలతో పాటు మరో 20 అనుబంధ గ్రామాలు ఎఫ్సీడీఏలో చేరినట్లు అయింది. ఎఫ్సీడీఏ పరిధిలోకి ఆమనగల్లు మండలం నుంచి రెండు గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలం నుంచి 8, కడ్తాల్ మండలం నుంచి 8, కందుకూరు మండలం నుంచి 18, మహేశ్వరం మండలం నుంచి రెండు, మంచాల మండలం నుంచి మూడు, యాచారం మండలం నుంచి 17 గ్రామాలను తీసుకున్నారు. తాజాగా మూడు గ్రామాలను ఎఫ్సీడీఏలో విలీనం చేయడానికి సర్కార్ నిర్ణయించడంతో మొత్తం గ్రామాల సంఖ్య 59కి చేరనుంది. ఎఫ్సీడీఏలోకి యాచారం మండలం మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, కేసీతండా విలీనానికి ఏకగ్రీవ తీర్మానాలు ఇవ్వాలని కలెక్టర్ నుంచి జీపీలకు ఆదేశాలు తీర్మానాలు చేసి ఎంపీడీఓకు అందజేసిన పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు -
ఎఫ్సీడీఏ భవనం పరిశీలన
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో నిర్మించిన ఎఫ్సీ డీఏ భవనాన్ని శుక్రవారం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకీరెడ్డి పరిశీలించారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవం కానుంది. అందులో భాగంగా వారు ఆ భవనంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన బందోబస్తు తదితరాల గురించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వారి వెంట గ్రీన్ ఫార్మా సీఐ సత్యనారాయణ, కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. షాద్నగర్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అదనపు జిల్లా జడ్జి స్వాతిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం షాద్నగర్ కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అందరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ రోజువారీ జీవితంలో అంతర్భాగం కావాలన్నారు. గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మానవ ఆరోగ్యాన్ని, వన్యప్రాణులను కాపాడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాహితి, జడ్జి ప్రవీణ్కుమార్, ఫారెస్టు అధికారి మహ్మద్ అజీజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, న్యాయవాదులు సబియా సుల్తానా, తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్రూరల్: గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆహార పదార్థాల సరఫరాకోసం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూరగాయలు, చికెట్, మటన్, కోడిగుడ్లు, కిరాణా సామగ్రి సరఫరాదారుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. టెండర్ ఫాం ధర రూ.20వేలు ఉంటుందని, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) రూ.30వేలు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈఎండీలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఉంటుందని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు ఈనెల 13 చివరి తేదీ కాగా, 15న మధ్యాహ్నం 2.30 గంటలకు టెండర్లు తెరవనున్నట్టు చెప్పారు. టెండర్ పరిధిలో టీజీటీడబ్ల్యూఆర్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల షాద్నగర్, టీజీటీడబ్ల్యూఆర్జే బాలుర కళాశాల ఇబ్రహీంపట్నం, టీజీటీడబ్ల్యూఆర్జే బాలుర కళాశాల కొత్తూరు, ఐఐటీ స్టడీ సెంటర్ మహేశ్వరం, టీజీటీడబ్ల్యూఆర్ సీఓఈ (పీవీటీజీ–జీ) హయత్నగర్, మినీ గురుకులం రంగాపూర్ విద్యాసంస్థలు వస్తాయని తెలిపారు. పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఎల్బీ నగర్ న్యాయస్థానం శుక్రవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన బాలికపై కర్నాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర (35) 2023 ఫిబ్రవరి 13న లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన ఎల్బీ నగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
‘సమగ్ర సవరణ’ పక్కాగా నిర్వహించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు వివరాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. హేతుబద్ధీకరించిన ముసాయిదా ఓటరు జాబితాను జూలై 31న ప్రచురించనున్నట్లు చెప్పారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి, సెప్టెంబర్ 28లోపు వాటిని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అన్నారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బూత్స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని, ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉన్నవారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మరణించిన వ్యక్తుల పేర్లు తుది జాబితాలో ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన బీఎల్ఓలపై చర్యలు తప్పవన్నారు. చిరునామా మార్పుల వివరాల సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఇంటింటి గణన సందర్భంగా ఫారం –6 డిక్లరేషన్ ఫారం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1950, ఓటరు పోర్టల్, ఈసీఐనెట్ యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు సరిత, జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
క్యారెట్ సాగుపై రైతులకు అవగాహన
షాబాద్: క్యారెట్ సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత శ్రీకృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని లక్ష్మరావుగూడలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్, ఉద్యాన శాఖ క్రిడా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్యారెట్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యారెట్ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన భూసిద్ధం, అనువైన రకాల ఎంపిక, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి పారుదల నిర్వహణ, కలుపు నియంత్రణ శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. వర్షాధార పరిస్థితుల్లో నల్లరేగడి నేలల్లో క్యారెట్ సాగు చేసే రైతులు నీటి నిల్వ లేకుండా డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. హార్టికల్చర్ అధికారి కీర్తి కృష్ణ మాట్లాడుతూ.. ఉద్యానశాఖ ద్వారా రైతులకు అందుతున్న సేవలు, పథకాలు, సాంకేతిక సూచనలు చేశారు. సరైన మొక్కల మధ్య దూరం, సమగ్ర చీడపీడల నివారణ చర్యలను రైతులకు వివరించారు. సేవా స్ఫూర్తి పౌండేషన్ ప్రాజెక్డ్ మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్య పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, శాసీ్త్రయ సాగు పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. -
చివరి రోజు జోరు
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026తుర్కయంజాల్: కొహెడ సర్వే నంబర్ 167 బై 1లో శనివారం నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరిశీలించనున్నట్లు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు. మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు ఈసారి ముందుగానే వచ్చాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే స్కూళ్లకు చేరుతున్నాయి. మండలంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకోసం ఇప్పటికే మండల వనరుల కేంద్రానికి చేరాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకోసం మొత్తం 21,497 పాఠ్యపుస్తకాలు, 31,165 నోట్ పుస్తకాలు వచ్చినట్టు మండల విద్యాధికారి మల్లయ్య తెలిపారు. మరో ఏడు టైటిల్స్ రావాల్సి ఉందన్నారు. గురువారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వాటిని పంపిణీ చేశారు. అనంతగిరి: క్రీడలతో శారీరక దృఢత్వం తోపాటు స్నేహభావం పెరుగుతుందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్లోని బ్లాక్ గ్రౌండ్లో వీడీఎఫ్ఏ ఆధ్వర్యంలో స్పీకర్ కప్ పోటీలు నిర్వహించారు. విజేత జట్లకు బహమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటమలు సహజమన్నారు. ఓటమి గెలుపుకు నాంది అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మలక్పేట: మూసారంబాగ్ డౌన్ స్ట్రీమ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులు వేగిరం చేసి, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆదేశించారు. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి మొత్తం 85 స్పాన్లు ఉండగా వాటికి గర్డర్లు నిర్మించామని, 79 స్పాన్లకు డెక్స్లాబ్ పూర్తయిందని, అప్ ర్యాంప్, డౌన్ర్యాంప్ పనులు ఏక కాలంలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: సాధారణంగా ఇబ్రహీంపట్నం సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో రోజుకు సగటున 60 నుంచి 80 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటా యి. గురువారం ఏకంగా 130 ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇక ఎల్బీనగర్ ఎస్ఆర్ఓలో రోజుకు 40 నుంచి 50 ఆస్తులు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. తాజాగా 80కిపైగా స్లాట్లు బుక్కయ్యాయి. ఇక మూసాపేటలోని జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసు సహా హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, చంపాపేట్, మహేశ్వరం, శంషాబాద్, గండిపేట్ సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం సవరించిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమ ల్లోకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఔటర్ అవతల ఉన్న మండల కేంద్రాల్లో 50 శాతం, లోపల ఉన్న మున్సిపల్ కేంద్రాలు సహా శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట్, నార్సింగి, కొండాపూర్, మదాపూర్, సహా ఔటర్కు అటు ఇటుగా ఉన్న వాణిజ్య స్థలాలు, కొత్తగా అందుబా టులోకి రాబోతున్న గ్రీన్ఫీల్డ్ రోడ్ల వెంట వంద శాతం పెరిగే అవకాశం ఉంది. పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత 2021లో భూముల మార్కెట్ విలువను 20 శాతం పెంచుతూ అప్పటి ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2022లో 33 శాతం పెంచింది. తాజాగా స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాలు, వాణిజ్యపరమైన డిమాండ్ను బట్టి 40 నుంచి 50 శాతం పెంచింది. మరికొన్ని చోట్ల ఏకంగా వందశాతం పెరిగే అవకాశం ఉంది. నిజానికి ఓఆర్ఆర్ లోపల 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా జిల్లాలో నెలకు సగటున 21 నుంచి 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.360 కోట్ల ఆదాయం సమకూరుతుంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, స్టాంప్డ్యూటీ చార్జీలు రెట్టింపు కానుండడంతో ఇప్పటికే భూ విక్రయదారులు, బిల్డర్లతో ఆస్తుల అగ్రిమెంట్ చేసుకున్న కొనుగోలుదారులు ఆఖరి రోజైన గురువారం రిజిస్ట్రేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఆయా ఆఫీసులు ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు, క్రయవిక్రయదారులతో కిక్కిరిసిపోయాయి. పరిమితికి మించి స్లాట్లు బుక్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది రాత్రి పొద్దు పోయే వరకు ఆఫీసుల్లోనే ఉండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఎక్కడ ఎంతంటే.. ● తుక్కుగూడ, మంకాల్లో 70 శాతం పెంచినట్లు తెలిసింది. ఇక్కడ ఎకరం విలువ రూ.78,40,000 ఉండగా, తాజాగా రూ.1,33,28,000 పెంచినట్లు సమాచారం. వాణిజ్యస్థలం గజం ధర రూ.10,500 నుంచి 18,400 పెరిగే అవకాశం ఉంది. ● కోకాపేటలో ప్రస్తుతం ఎకరం ధర రూ.7 కోట్లు ఉండగా, దాన్ని రూ.10 కోట్లకు పెంచినట్లు తెలిసింది. ● కందుకూరులో ఎకరం ధర రూ.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.3 కోట్లకు పెంచినట్లు సమాచారం. ● యాచారంలో ఎకరం ధర రూ.50 లక్షలలోపు ఉండేలా నిర్ణయం తీసుకుంది. ● ఇబ్రహీంపట్నం గ్రామీణ ప్రాంతంలో ఎకరం ధర రూ.15 లక్షలు ఉండగా, దాన్ని రూ.60 లక్షలకు పెంచినట్లు తెలిసింది. ● మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్సాగర్లో ఎకరం రూ.82.50 లక్షలు ఉండగా, దీన్ని డబుల్ చేసినట్లు సమాచారం. ● ఓఆర్ఆర్కు అవతల ఎకరం రూ.10 లక్షలుగా నిర్ణయించారు. ● ఓఆర్ఆర్కు లోపల అపార్ట్మెంట్లలో చదరపు అడుగు కనిష్టంగా రూ.3,600 చేశారు. ● శంకర్పల్లిలో రూ.2,500 నుంచి రూ.5,500 వరకు పెంచినట్లు తెలిసింది. ● చేవెళ్ల ప్రాంతంలో భూముల విలువ ప్రస్తుతం రూ.7.5లక్షలు, రూ.16.50 లక్షలు, రూ.42 లక్షలుగా ఉంది. ఇది ఆయా ప్రాంతాల వారీగా దాదాపు రెట్టింపు కానుంది. ప్లాట్ల విలువ రూ.2,100 ఉన్నది రూ.4వేల నుంచి రూ.5వేల మధ్యలో పెరగనుంది. పట్టణ కేంద్రాల్లో రూ.7,100 ఉన్నది రూ.10 వేల నుంచి రూ.11వేల మధ్య పెరగనుంది.నూతన ఆర్డీవోగా శ్రీనివాస్రెడ్డి ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కలెక్టరేట్లోని ఎస్డీసీ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్రెడ్డి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. మూడేళ్లపాటు అనంతరెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు. భూముల మార్కెట్ విలువ సవరణ ప్రభావం రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూకట్టిన క్రయవిక్రయదారులు అంచనాలకు మించి రిజిస్ట్రేషన్లు కిక్కిరిసిపోయిన ఎస్ఆర్ఓ కేంద్రాలు పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి.. -
కుర్మిద్దలో గ్రామసభ బహిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు గురువారం యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో జరిగాయి. యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో సర్పంచ్ శ్రీవిద్య ఆధ్వర్యంలో జరిగిన సభలో ఫార్మా రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయం చేసుకుంటుంటే అధికారులు విద్యుత్ ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ట్రాన్స్కో, రెవెన్యూ అధికారులు స్పందించాలని పట్టుబట్టారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వం నిర్వహించే సభలు తమకు అవసరం లేదని, సమస్య తీర్చే వరకు సభ వాయిదా వేయాలని సర్పంచ్ సైతం భీష్మించారు. గ్రీన్ఫార్మా సీఐ సత్యనారాయణ జోక్యం చేసుకున్నా రైతులు వినలేదు. దీంతో చేసేదేమి లేక వాయిదా వేశారు. గున్గల్ గ్రామంలో ప్రత్యేకాధికారి మాధవరావు, సర్పంచ్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఇబ్రహీంపట్నంలో ప్రశాంతం ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి, నాగన్పల్లి, ఉప్పరిగూడ, పోచారం, కప్పపహాడ్, ఎల్మినేడు, తులేకలాన్ గ్రామాల్లో సభలు ప్రశాంతంగా జరిగాయి. అధికారులు, సర్పంచ్లు పాల్గొని గ్రామ అభివృద్ధిపై మాట్లాడారు. పొలాలకు విద్యుత్ కట్ చేశారని నిలదీత -
ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటేనే పథకాలు
మొయినాబాద్రూరల్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండలంలోని చిన్నమంగళారంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన రైతు రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. రైతులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, పెట్టుబడి సహాయం రిజిస్ట్రీ ఉంటేనే అందుతాయని తెలిపారు. వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు సకాలంలో అందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదై ఉండాలన్నారు. గ్రామాల్లో ఇంకా నమోదు చేసుకోని రైతులను గుర్తించి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కిషన్రావు, తహసీల్దార్ గౌతమ్కుమార్, ఎంపీడీవో హిమబిందు, మండల వ్యవసాయాధికారి అనురాధారెడ్డి, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ తలారి లక్ష్మిబాలయ్య, ఉపసర్పంచ్ అంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి -
నర్సింగ్ స్కూల్ హాస్టల్లో అగ్నిప్రమాదం
మొయినాబాద్: షార్ట్ సర్క్యూట్తో నర్సింగ్ స్కూల్ హాస్టల్లో మంటలు అంటుకుని ఫర్నిచర్ కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మున్సిపల్ కేంద్రంలోని కరున నర్సింగ్ స్కూల్ హాస్టల్ భవనంలో గురువారం ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో హాస్టల్ భవనంలో ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. మంటలు ఎగిసి పడుతుండడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పైపులతో నీళ్లు పట్టి మంటలు ఆర్పారు. అప్పటికే ప్యానల్ బోర్డు గదిలో ఉన్న ఫర్నిచర్తోపాటు ఇతర సామాగ్రి కాలిపోయాయి. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం యాలాల: ఈతకు వెళ్లి గల్లంతు అయిన వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బస్తాపూర్కు చెందిన రహమత్(28)తో పాటు పాత తాండూరు వాసి మోయిజొద్దీన్లు బుధవారం సాయంత్రం కోకట్ కాగ్నా నదిలో ఈతకు వెళ్లి, మునిగిన సంగతి విధితమే. అందులో మోయిజోద్దిన్ మృతదేహం అదే రోజు లభ్యం కాగా.. రహమత్ ఆచూకీ లేకుండా పోయింది. ఎస్ఐ విఠల్రెడ్డి, తాండూరు అగ్ని మాపక సిబ్బంది బుధవారం చీకటి పడేంతవరకు నదిలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా.. గురువారం తెల్లవారుజాము నుంచి మరలా గాలింపు చేపట్టగా.. రహమత్ మృతదేహం లభ్యమైంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శిక్షణ, ఉపాధిని వినియోగించుకోండి కుల్కచర్ల: నిరుద్యోగ గిరిజన యువతకు ప్రభుత్వం ఇచ్చే శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో యువతకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణ, ఉద్యోగాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, గిరిజన వసతిగృహ ప్రత్యేకాధికారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ‘సర్’పై ప్రత్యేక దృష్టి తాండూరు: ఓటరు జాబితా ముమ్మర సవరణ(సర్) కార్యక్రమం ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ సర్ కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లడారు. ఓటరు జాబితా సవరణలో అర్హులైన ఓటర్లు, పార్టీ మద్దతు దారుల ఓట్లకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పట్టణంలోని తులసీ గార్డెన్లో ఈ నెల 7న ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అధ్యక్షతన 269 మంది బీఎల్ఏలతో సమావేశం జరగనుందని పేర్కొన్నారు. సవరణలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. పార్టీ నేతల దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, పార్టీ నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్లు ఉన్నారు. -
లారీని ఢీ కొన్న బైక్
ఒకరి మృతి, మరొకరికి గాయాలు షాద్నగర్రూరల్: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన కార్తీక్(19) తన స్నేహితుడు శ్రీనాథ్ను షాద్నగర్లో వదిలిపెట్టేందుకు బైక్పై వెళుతున్నారు. లింగారెడ్డిగూడ శివారులో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోకుండా లారీని రోడ్డుపై నిలిపారు. రాత్రి సమయం కావడంతో ముందు లారీ నిలిపిన విషయాన్ని గమనించకపోవడంతో బైక్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కార్తీక్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుశీల తెలిపారు. ఏఎంసీ సూపర్వైజర్గా నవనీత బషీరాబాద్: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) సూపర్వైజర్గా నవనీత గురువారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమెను.. అధికారులు బషీరాబాద్కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ.. అక్రమ మార్కెటింగ్ను అరికట్టేందుకు కాశీంపూర్ సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ కార్యదర్శి సిద్దమ్మ, సిబ్బంది శివ తదితరులు పాల్గొన్నారు. -
ఆకు కూరలు.. అధిక లాభాలు
● సేంద్రియ విధానంలో పంటల సాగు ఆరోగ్యకరం ● కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ కందుకూరు: సేంద్రియ పంటల కొనుగోలుకు వినియోగదారులు అధికంగా ఆసక్తి చూపుతుంటారు. ఖర్చు ఎక్కువైనా అందుబాటులో ఉంటే కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఆర్గానిక్ విధానంలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర సాగు చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ సూచిస్తున్నారు. ఇందులో సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. నేలలు.. చౌడు నేలలు మినహా అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. ఇసుకతో కూడిన ఎర్ర నేలలు అధిక దిగుబడినిస్తాయి. అధిక దిగుబడులకు ఉదజని సూచిక 7.0 ఉన్న నేలలు అనుకూలం. బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి. విత్తన మోతాదు ● పాలకూర ఎకరాకు 10– 12 కిలోలు ● గోంగూర 6 కిలోలు ● మెంతికూర 8– 10 కిలోలు సాగు విధానం.. ● చిన్నచిన్న మడులు కట్టి విత్తనాలను నేరుగా వెదజల్లి విత్తుకోవాలి. ● ఏడాది పొడవునా ఎప్పుడైనా వీటిని సాగు చేయొచ్చు. ● నవంబర్– డిసెంబర్ నెలల్లో విత్తుకుంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. నీటి యాజమాన్యం... ● విత్తిన వెంటనే ఒక తడి ఇవ్వాలి. ● విత్తిన 3 రోజులకు రెండో తడి అందించాలి. ● ఆతర్వాత భూమిలో తేమశాతాన్ని బట్టి వారం నుంచి పదిరోజులకు ఒక తడి పెట్టాలి. ఎరువుల యాజమాన్యం ● ఎకరాకు 2,500 కిలోల నాడెప్ కంపోస్టు వేయాలి. ● 125 కిలోల ఘన జీవామృతం వేస్తూ విత్తనాన్ని నాటాలి. సస్యరక్షణ.. ● రసం పీల్చే పురుగులు ఆకుల నుంచి మరియు లేత కాండం నుంచి రసం పీల్చడం వలన ఆకులు ముడుచుకునిపోయి పసుపు రంగుకు మారతాయి. ఆకులు నాణ్యత కోల్పోతాయి. ● ఒక్కోసారి ఆకులపై నల్లటి మసి ఏర్పడుతుంది. ● నివారణకు తప్పనిసరి పరిస్థితుల్లో వేప సంబంధిత మందులు (వేప కషాయం, నీమాస్త్రం, వేప నూనె మొదలైనవి) మాత్రమే పంటకాలంలో 1– 2 సార్లు పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఆతర్వాత 3, 4 రోజలలో ఆకులను కోసుకోవచ్చు. ● గొంగళి పురుగులను చేతితో ఏరివేసి నాశనం చేయడం చాలా మంచిది. తెగుళ్లు ● తెగులు సమస్య ఎక్కువగా ఉన్న భూముల్లో పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. ● బీజామృతంతో తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. ● 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి, మాగిన పశువుల ఎరువు 90 కిలోలు, 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మగ్గిన తర్వాత ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ● ఇలా చేయడంతో నేల ద్వారా ఆశించే తెగుళ్లను అరికట్టవచ్చును. ● పుల్లటి మజ్జిగ మరియు ఇంగువ ద్రావణం 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పంటపై పిచికారీ చేసి ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు నివారించవచ్చు. ● పదిహేరు రోజులకు ఒకసారి పంటపై జీవామృతం పిచికారీ చేసి, నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు. -
నేటినుంచి పెరిగిన ధరల ప్రకారమే..
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో తక్కువలో తక్కువ 20 శాతం, ఎక్కువలో ఎక్కువ 50 నుంచి 70 శాతం పెరిగినట్టు సబ్ రిజిస్ట్రార్ రాంభూపాల్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం మార్కెట్ విలువ సవరించిందన్నారు. సరూర్నగర్ పరిధిలో గతంలో కొన్ని ప్రాంతాల్లో గజం రూ.21,000 ఉండేదని సవరించిన తర్వాత రూ.31,500 నుంచి రూ.40,100 పెరిగిందని తెలిపారు. కమర్షియల్ ధరలో కూడా మార్పులు జరిగాయన్నారు. గతంలో రూ.50,100 ఉన్న గజనం ధర సవరించిన తర్వాత రూ.56,100 నుంచి రూ. 75,200కు పెరిగిందన్నారు. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ఫీటు విలువ రూ.4వేల నుంచి రూ.4,500కు, రూ.5వేలు ఉన్న ప్రాంతాల్లో రూ.5,500కు పెరిగిందని వివరించారు. శుక్రవారం నుంచి పెరిగిన ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, కొనుగోలుదారులు సహకరించాలని ఆయన సూచించారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● 61 కేసుల్లో నిందితుడు ● వికారాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ● తుపాకీ, బంగారం స్వాధీనం అనంతగిరి: కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ, 61 కేసుల్లో నిందితుడైన వికాస్సింగ్ను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ స్నేహమెహ్ర వివరాలు వెల్లడించారు. వికారా బాద్ మున్సిపల్ పరిధిలోని మణికంఠనగర్ కాలనీలో మే1 న రాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లో దూరిన ఓ దొంగ తులంన్నర బంగారు ఆభరణాలు, రూ.2.10లక్షలు దోచుకెళ్లాడు. కేసు నమో దు చేసిన పోలీసులు డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్రాయ్, వికారాబాద్ సీఐ రఘుకుమార్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీ కెమెరాలు, ఘటనాస్థలంలో సేకరించిన ఆధారాలను పరిశీలించి నిందితుడు వికాస్సింగ్ అలియాస్ తేజాసింగ్గా గుర్తించారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటున్న వికాస్సింగ్ పైకి కూలీ పనులు చేస్తున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లలో రాత్రి వేళ దొంగ తనాలకు పాల్పడేవాడు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు వికారాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా విప్పాడు. బాల్యంలోనే చోరీల బాట పదహారేళ్ల వయసులో నేర జీవితాన్ని ప్రారంభించిన ఇతనిపై సంగారెడ్డి, బొల్లారం పరిసరాల పరిధిలో 34 కేసులున్నాయి. జైలు శిక్ష అనుభవించిన వికాస్సింగ్ 2024 జూన్ 26న విడుదలయ్యాడు. ప్రవర్తణలో మార్పు రాకపోవడంతో వికారాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో 27 సార్లు చోరీ లకు పాల్పడి 157 తులాల బంగారం, 256 తులాల వెండి, రూ.8,22,500 నగదును దోచుకెళ్లాడు. ఈ సొమ్ముతో జల్సాలు చేయడమే కాకుండా హెల్పింగ్ హ్యాండ్ అనే ఎన్జీఓ పేరుతో తన స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులను చైన్నె, గోవా, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూర్, రాజస్థాన్, డెహ్రాడూన్ల విహార యాత్రలకు పంపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా సామాజిక రక్షణ వలయం ఏర్పరచుకున్నాడు. వారి ప్రోద్బలంతోనే.. చోరీ చేసిన ఆభరణాలను తన స్వగ్రామ పరిసరా ల్లోని కుర్వర్, గంజేరికి చెందిన శ్యామ్ మోహన్, సూరజ్ మోహన్, అశోక్ సోని, వికాస్ అగ్రహారి అనే బంగారం వ్యాపారులకు అమ్మేవాడు. ఇతనితో మంచి సంపాదన ఉందని భావించిన సదరు వ్యాపారులు బాల్యంలోనే వికాస్సింగ్కు డబ్బులిచ్చి దొంగతనాలకు ప్రోత్సహించారు. స్థానికంగా చోరీలు చేస్తే పోలీసులతో ఇబ్బంది తలెత్తుతోందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్లమని ఉసిగొల్పారు. తలా రూ.10 వేలు ఇచ్చి ఓ తుపాకీ (2ఎంఎం పిస్టల్) కొనుగోలు చేయమని సూచించారు. ఇప్పటి వరకు ఇతనిపై 61 కేసులు నమోదయ్యాయి. నిందితుడి నుంచి తులంనర బంగారం, తుపాకీ స్వాధీ నం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఇతన్ని పట్టుకున్న పోలీసు బృందాన్ని అభినందించారు. -
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులను గుర్తించండి
జర్నలిస్ట్ ఫోరం జిల్లా సహాయ కార్యదర్శి వెంకన్న అబ్దుల్లాపూర్మెట్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభు త్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్) రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి పల్లె వెంకన్న కోరారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2009–2014 జూన్ 2 వరకు ఎల్బీనగర్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సమష్టి పోరాటలు చేశామన్నారు. ఓ పక్కన జేఏసీ కింద ఉద్యోగులు, న్యాయవాదులు, ఆర్టీసీ, ప్రజాసంఘలతో కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ పోరు సాగించామన్నారు. రాష్ట్రం వచ్చే వరకు జరిగిన పోరాటాల్లో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారన్నారు. ప్రస్తుతం సర్కారు అర్హులైన ఉద్యమ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డు లు జారీ చేయాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ఉద్యమ జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మద్యం దుకాణంలో చోరీ కొడంగల్ రూరల్: వైన్షాపులో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగ ఎల్లమ్మ వైన్ షాపును నిర్వాహకులు బుధవారం రాత్రి ఎప్పటిలాగే మూసివేశారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు దుకాణం వెనుకభాగం నుంచి చొరబడి అందిన కాడికి అపహరించారు. గురువారం ఉదయం దుకాణం తెరచిన నిర్వాహకులు.. సామగ్రి చిందరవందరగా పడుండటాన్ని గమనించి చోరీ జరిగిందని, రూ.50 వేల నగదుతో పాటు, రూ.10 వేల విలువ చేసే మద్యం సీసాలను అపహరించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు సమాచారం ఇవ్వగా.. క్లూస్ టీం వచ్చి పరిసరాలను పరిశీలించింది. వివరాలు సేకరించారు. నిర్వాహకుడు రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ యాదయ్య తెలిపారు. -
ఇంకుడుగుంతలతో భూగర్భ జలాల పెంపు
అబ్దుల్లాపూర్మెట్: వచ్చే వర్షాకాలంలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఆర్డీఓ శ్రీలత సూచించారు. మండలంలోని కవాడిపల్లిలో గురువారం సర్పంచ్ కొలన్ ప్రసన్నరవీందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఎంపీడీఓ శ్రీవాణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. గ్రామాల్లో తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలంలో తాగునీటి పరిశుభ్రత, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, గ్రామస్తులు పాల్గొన్నారు. డీఆర్డీఓ శ్రీలత -
అన్నదాత ఆగం!
బషీరాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి వెళ్లిన రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఓ వైపు తూకాల్లో, మరో వైపు తాలు, తేమ పేరిట బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తుండగా మరో వైపు హమాలీ ఛార్జీల పేరుతో పెనుభారం మోపుతున్నారు. బషీరాబాద్ మండలంలో ఐకేపీ, సొసైటీ కింద కాశీంపూర్, దామర్చెడ్, నవల్గా, నావంద్గీ, మైల్వార్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 51,154 బస్తాల ధాన్యం సేకరించారు. ఈ బస్తాకు తరుగు పేరిట అదనంగా మూడు కిలోలు తూకం వేయడంతో మరో 1,534 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు నష్టపోయారు. బస్తాకు 40 కిలోల లెక్కన 2,046 టన్నుల వరి ధాన్యం ఐదు కేంద్రాల నుంచి ఇప్పటికే మిల్లులకు తరలించారు. ఈ ధాన్యం తూకం వేయడానికి హమాలీ ఖర్చుల కింద క్వింటాలుకు రూ.35 చొప్పున రూ.7.17లక్షలు వసూలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఇలా.. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన తర్వాత అన్ని పనులను హమాలీలే చూసుకుంటారు. లోడింగ్ మొదలు కొని తూకాలు వేమడం, బస్తాలు కుట్టి లారీల్లో తరలించడం వీరి బాధ్యత. ఇందుకు ప్రభుత్వం రూ.క్వింటాలుకు రూ.20 చెల్లిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.5 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతుల లోడింగ్, అన్లోడింగ్, తూకాలు వేయడం వంటి పనులకు క్వింటాలుకు రూ.32 నుంచి 35 వరకు వసూలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. క్వింటాలుకు రూ.35 చొప్పున వడ్డన రైతుల నుంచి ఇప్పటికే రూ.7.17 లక్షలు వసూలు చార్జీలకు రశీదులు ఇవ్వని నిర్వాహకులు పట్టించుకోని అధికార యంత్రాంగం -
మాట నిలబెట్టుకున్న.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉదారత చాటారు.
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి ఇబ్రహీంపట్నం: ఫార్మర్ రిజిస్ట్రీని రైతులు తప్పక చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం కర్ణంగూడలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్కు యాప్ అనుసంధానం చేసినందున రైతులు తప్పనిసరిగా భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకోవాలని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో నీటి కాలుష్యం, దోమల వ్యాప్తి, అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా కార్యక్రమంలో ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా సహకరించాలన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదాలు అరికట్టేందుకు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్, సర్పంచ్ తిరుమలరెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖాధికారి సురేష్ పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుందాం
కందుకూరు: పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుందామని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక సర్పంచ్ సరికొండ పాండు, ఎంపీడీఓ సరిత ఆధ్వర్యంలో కందుకూరులో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. చెత్తను వేరు చేసి అందించే బాధ్యతను మహిళలు తీసుకోవాలని అన్నారు. ఆ విషయంలో అందరినీ చైతన్యం చేసేలా మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రాబోయే వర్షాకాలంలో నీరు నిల్వకుండా చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సౌడపు మమతవెంకటేశ్గౌడ్, ఎస్ఐ పరమేష్, పంచాయతీ కార్యదర్శి సురేందర్, మండల వైద్యాధికారి డాక్టర్ హుమేరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి -
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
బేడ బుడగ జంగం సంఘానికి స్థలం విరాళం షాద్నగర్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత ప్లాటును ఓ సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉదారతను చాటారు. గురువారం పట్టణంలోని ఎస్సీ బేడ బుడగ జంగం సంఘానికి ఎమ్మెల్యే చేగూరు రోడ్డులోని విశ్వసాయి వెంచర్లో తనకున్న 120 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజు పత్రాలను సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూ.లక్షలు విలువ చేసే సొంత ప్లాటును సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉదారతను చాటిన ఎమ్మెల్యేకు సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్, సభ్యులు ముత్యాలు, ఊషయ్య, యాదయ్య, పెంటయ్య, నర్సింలు, జంగయ్య, బాలకృష్ణ, అంజయ్య, పెంటయ్య, యాదయ్య, రామస్వామి, స్వామి, మేగలయ్య, దశరథ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
వాగులైనా వదలం!
మొయినాబాద్: ప్రభుత్వ భూములు, కాల్వలు, చెరువులు ఎక్కడుంటే అక్రమార్కుల చూపు అక్కడ వాలిపోతోంది. కొంతమంది పాలకులు, అధికారులతో కుమ్మకై ్క దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సురంగల్ శివారు నుంచి ఎర్రకుంట వాగు ఉంది. కనకమామిడి, సురంగల్, అమ్డాపూర్, నజీబ్నగర్ రెవెన్యూల్లోని వర్షం నీరంతా ఎర్రకుంట వాగు ద్వారా ప్రవహించి ఈసీ వాగులో కలుస్తుంది. సురంగల్ రెవెన్యూలోని సర్వేనంబర్ 332, 282లో ఉన్న పలువురు ప్రైవేటు వ్యక్తుల భూమి ఎర్రకుంట వాగు సమీపం వరకు ఉంటుంది. వీటిని కొనుగోలు చేసిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాగును సైతం ఆక్రమిస్తున్నారు. వాగు మధ్య నుంచి పునాది తీసి గోడ నిర్మిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి, మరో నాయకుడి అండదండలతోనే వీరు వాగును కబ్జా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తోలుకట్టలో.. మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలో గుండ్లవాగు కాల్వ ఉంది. దీనికి ఆనుకుని సర్వేనంబర్ 191లో ప్రైవేటు భూమి ఉంది. నగరానికి చెందిన ఓ వ్యాపారి దీన్ని కొనుగోలు చేసి వాగు కాల్వను పూర్తిగా ఆక్రమించాడు. ఎవరి అనుమతి లేకుండానే కాలువలో నుంచి పైపులు వేసి పైనుంచి మట్టితో పూడ్చివేసి ప్రహరీ నిర్మించాడు. ఈతతంగం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలం మొదలైతే కాల్వలోకి వెళ్లాల్సిన వరదనీరు పంట పొలాల్లోకి చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు స్పందించి కాల్వలను కబ్జా చెర నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. తోలుకట్టలో గుండ్లవాగును పూడ్చి ప్రహరీ నిర్మాణం పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటాం సురంగల్ ఎర్రకుంట వాగులో ప్రహరీ గోడ నిర్మిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తోలుకట్ట గుండ్లవాగు కాల్వను పూడ్చినట్లు తెలిసింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పంపించి పరిశీలించాం. కాల్వలో వేసిన పైపులను తొలగించి పూడ్చినవారిపై చర్యలు తీసుకుంటాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
తిమ్మాపూర్కు ట్రైనీ ఐఈఎస్ అధికారులు
కందుకూరు: ఎన్ఐఆర్డీలో శిక్షణ పొందుతున్న 2025 సంవత్సరానికి చెందిన ఇండియన్ ఎకనామిక్ సర్వీస్(ఐఈఎస్) బ్యాచ్ ట్రైనీలు బుధవారం మండల పరిధిలోని తిమ్మాపూర్లో పర్యటించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ రకాల కార్యక్రమాలను గురించి పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సర్పంచ్ అంజమ్మను అడిగితెలుసుకున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ఉపాధిహామీలో నిర్మించిన పాంపండ్స్తో పాటు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న యూనిట్లను పరిశీలించారు. సంఘంలో మహిళలు చేరి ఎలా లబ్ధిపొందుతున్నారో అడిగితెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఉప సర్పంచ్ సన్నిళ్ల సంధ్య, ఏపీఓ రవీందర్రెడ్డి, ఏపీఎం సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
ఉద్యోగరీత్యా బదిలీలు సహజం
మొయినాబాద్రూరల్: ఉద్యోగరీత్యా అధికారులకు బదిలీలు సహజమని ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ మహేందర్ముదిరాజ్ అన్నారు. కేతిరెడ్డిపల్లి క్టస్టర్ విస్తీర్ణ అధికారి ఎ.కుమార్ స్థానంలో శ్రీనివాస్, మొయినాబాద్ క్లస్టర్ ఎన్.సునీల్ కుమార్ స్థానంలో ఇ.వీణ బుధవారం మొయినాబాద్ రైతు వేదికలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన, కొత్తగా వచ్చిన అధికారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మ హేందర్ముదిరాజ్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు రైతులకు వ్యవసాయ సంబంధిత సలహాలు, ప్రభుత్వ పథకాలు, విత్తనాలు, ఎరువులు, పంటలన నిర్వహణ తదితర విషయాల్లో సహకరించాలని సూచించారు. రైతుల సౌకర్యార్ధం గతంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ నంబర్లు యధావిధిగా ఉంటాయని మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన సేవలు, సాంకేతిక సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి, నా యకులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ మహేందర్ముదిరాజ్ -
సదానందంగౌడ్కు జాజుల సన్మనం
కడ్తాల్: తలకొండపల్లి మండలం చెన్నంపల్లికి చెందిన సామాజిక విద్యావేత్త అయిల్ సదానందంగౌడ్కు యునైటైడ్ అమెరికన్ వర్సిటీ నిర్వాహకులు ఇటీవల చైన్నెలోని భారతీయ విద్యాభవన్లో గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేశారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సదానందంగౌడ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, ఉస్మానియా వర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, బీఈడీ, సెట్ ప్రథమ శ్రేణి పట్టాను పొందారు. విద్యారంగంలో 26 ఏళ్లుగా అధ్యాపకుడిగా పనిచేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవలకు గుర్తింపుగా యునైటైడ్ అమెరికన్ వర్సిటీ నిర్వాహకులు సదానందంగౌడ్కు డాక్టరేట్ పురస్కారం అందజేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అవార్డు గ్రహీత సదానందంగౌడ్ను అభినందించి సన్మానించారు. భవిష్యత్లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బాలరాజు, వెంకటేశ్ పాల్గొన్నారు. శంకర్పల్లి: మిల్క్ బ్రెడ్ ప్యాకెట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో బాధితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్ పరిధిలోని జన్వాడలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన కుమ్మరి అశోక్, అంబిక దంపతులు కొన్నేళ్ల క్రితం జన్వాడకు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరి మూడేళ్ల కుమారుడు పవన్ కోసం గ్రామంలోని ఓ కిరాణ దుకాణంలో గోల్డెన్ బైట్ కంపెనీ పేరుతో ఉన్న బ్రెడ్ ప్యాకెట్ను తీసుకెళ్లారు. బుధవారం ఉదయం పాలలో బ్రెడ్ వేసి బాబుకు తీనిపించాలని చూస్తుండగా, చనిపోయిన బల్లి కనిపించడంతో తల్లి ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఈ విషయమై దుకాణ యజమానిని నిలదీయడంతో ఆయన కంపెనీ డిస్ట్రిబ్యూటర్కు సమాచారం అందించారు. బల్లిని గమనించకపోతే పరిస్థితి ఎలా ఉండేదోనని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 13 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం మొయినాబాద్: జేబీఐటీ కళాశాల సమీపంలో నిషేధిత మాదకద్రవ్యాలు(డ్రగ్స్) విక్రయిస్తున్న ఇద్దరు యువకులను బుధవారం మొయినాబాద్ పోలీసులు రిమాండ్కు తరలించారు. వివరాలు.. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన బీచ్మోర్ దల్బీర్ సింగ్, సయ్యాద్ ఖాదర్బాషా మంగళవారం రాత్రి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూలో ఉన్న జేబీఐటీ కళాశాల వద్ద ఉన్న టీ టైమ్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మొయినాబాద్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల విలవ చేసే 13 గ్రామాల ఎండీఎంఏ నిషేధిత మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. రాజేంద్రనగర్ : పావురాన్ని కాపాడబోయిన ఎన్ఐఆర్డీ రీసెర్చ్ అధికారి రెండో అంతస్తునుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్ఐఆర్డీలో రీసెర్చ్ అధికారిగా పనిచేస్తున్న బాలరాజ్ (54) నివాసముంటున్న భవనం రెండో అంతస్తులో ఈ నెల 1న ఓ పావురం చిక్కుకుంది. దానిని కాపాడేందుకు బాలరాజ్ పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే హైదర్గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. -
రైతులకు పశుగ్రాస విత్తనాల పంపిణీ
షాబాద్: రైతులకు పశుగ్రాస విత్తనాల పంపిణీ చేసినట్లు శాస్త్రవేత్త, క్రీడా కేవీకే డాక్టర్ సుధీర్, బసేరా డైరెక్టర్ డాక్టర్ అంజు తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రము(ఆర్ఎఫ్ఎస్)హైదరాబాద్ క్రీడా కేవీకే, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశుగ్రాస విత్తనాల ఎంపిక, పాల పశువుల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక పాల ఉత్తత్తి, మాంస ఉత్పత్తి పెరుగుదలకు నాణ్యమైన పశుగ్రాసం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. పాల పశు సంరక్షణ విధానాలు, శాసీ్త్రయ డెయిరీ నిర్వహణ, గొర్రెల పెంపకంలో పాటించాల్సిన ఉత్తమ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. 40 మంది రైతులకు ముల్గి పశుగ్రాస కట్టింగ్స్, అధిక దిగుబడి ఇచ్చే సీఓఓఫ్ఎస్–29 మల్టీకట్, మల్టీ ఇయన్ జొన్న పశుగ్రాస విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ గొల్లపల్లి రత్నాకర్, సర్పంచ్ సబితాగోవర్ధన్రెడ్డి, ఉపసర్పంచ్ మాణిక్యం, కేవీకే శాస్త్రవేత్తలు దిలీప్ రామకృష్ణ, గొర్రెల కాపరులు, రైతులు తదితరులు ఉన్నారు. -
స్కూటీ అపహరణ
ఇబ్రహీంపట్నం: స్కూటీ అపహరణకు గురైన ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిఽధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో నివాసముండే గగనమోని సత్యనారాయణ తన ఇంటి ఎదుట స్కూటీని మంగళవారం రాత్రి పార్కు చేశాడు. బుధవారం ఉదయం చూసేవరకు వాహనం కలినిపించలేదు. దీంతో బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మరో బైక్ స్థానిక బస్టాండ్ వద్ద అపహరణకు గురైనట్లు సమాచారం. ఆటోలు దొంగకు రిమాండ్ మొయినాబాద్: ఆటోలు చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. వివరాలు.. నగరంలోని చందానగర్ పాపిరెడ్డినగర్ కాలనీకి చెందిన వడ్డె వెంకటేశ్ ఆటో డ్రైవర్. గత నెల 27న మొయినాబాద్లోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఓ ఆటో, అజీజ్నగర్ సమీపంలో మరో ఆటోను చోరీ చేశాడు. పోలీసులు బుధవారం సురంగల్ బైపాస్లో వాహనాల తనిఖీలు చేస్తుండగా వెంకటేశ్ ఆటోలో ప్రయాణిస్తున్నాడు. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా రెండు ఆటోలతో పాటు సదాశివపేటలో ఓ బైక్ సైతం చోరీ చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడు గతంలో ఆటో, ఇంటి దొంగతనం, పొక్సో కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. షాద్నగర్: గ్రేడ్–1 శాఖా గ్రంథాలయ నూతన లైబ్రేరియన్గా వెంకటయ్య బదిలీపై షాద్నగర్కు వచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటయ్యను గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్కబాల్రాజ్, వీరేశ్, ప్రధాన కార్యదర్శి క్యూసెట్ శ్రీనివాస్, జూపల్లి చంద్రశేఖర్, కత్తి చంద్రశేఖరప్ప తదితరులు పాల్గొన్నారు. -
జాబ్ మేళా విజయవంతం
షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఈ మేళాలో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన 165 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొని వంద మంది విద్యార్థులను శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. మూన్రే కళాశాలలో.. రాయికల్ శివారులోని మూన్ రే కళాశాలలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. దేశంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్ధ దివీస్ ల్యాబొరెటరీస్ నిర్వహించిన నియామక ప్రక్రియలో కళాశాలకు చెందిన 23 మంది బిఫార్మసీ విద్యార్థులు ఎంపికై నట్లు వారికి రూ.3.20లక్షల వార్షిక వేతనంతో కూడిన ప్యాకేజీతో ఉద్యోగాలు పొందినట్లు కళాశాల చైర్మన్ పర్వత్రెడ్డి తెలిపారు. శిక్షణకు వంద మంది విద్యార్థులు -
మెడికల్ కాలేజీ
తరలింపు సరికాదు● కళాశాలతో పాటు 400 పడకల ఆస్పత్రి కందుకూరు మండలంలోనే నిర్మించాలి ● మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కందుకూరు: రద్దు చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణాలను కందుకూరు మండలంలోనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రిని కేటాయించి శంకుస్థాపన చేశారని.. ప్రజా ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్ మెడికల్ కళాశాలను రద్దు చేసి ఎల్బీనగర్కు తరలించడం సరికాదన్నారు. ఫ్యూచర్సిటీ అని చెప్పుకుంటూ పబ్బంగడుపుతున్న ప్రభుత్వం 400 పడకల ఆస్ప త్రి నిర్మాణం ఎందుకు చేపట్టడంలేదని సమాధానం చెప్పాలన్నారు. పేదలు అనారోగ్యం బారిన పడితే ఎంతో దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే హైదరాబాద్ తరలించే లోపు క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి నిర్మిస్తే శ్రీశైలం రహదారి, సాగర్ రహదారి మధ్య ప్రాంతంతో పాటు మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తి ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. రద్దు చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణాలను వెంటనే కందుకూరు మండలంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. లేదంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ముదిరాజ్, జి.లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీట్ లీక్ బాధ్యత కేంద్రానిదే
కడ్తాల్: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్ డిమాండ్ చేశారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్తున్న యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్, రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి ఖాలేధ్, రోషిణి జైస్వాల్కు కడ్తాల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల పాటు కష్టపడి చదివిన విద్యార్థులు పేపర్ లీకేజీ ఘటనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో నీట్ పరీక్ష గుణపాఠంతోనూ కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ యువత, విద్యార్థులకు అన్యాయం జరిగితే యూత్ కాంగ్రెస్ సహించదని హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజల నుంచి దోచుకుని అదానీ, అంబానీలకు కట్టపెడుతున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను తగ్గించకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం మైసిగండి మైస మ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యే క పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్, నాయకులు షాబుద్దీన్, బోసు రవి, భానుకిరణ్, శ్రీకాంత్, ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్ -
బైక్ను ఢీకొట్టిన కారు
ఇద్దరు వలస కార్మికుల దుర్మరణం షాద్నగర్: పరిశ్రమలో విధులు ముగించుకొని ఇంటికి వెలుతున్న ఇద్దరు వలస కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన నందిగామ మండల శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన రోషన్ కుమార్ (24) కొత్తూరులో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంకజ్ (19) నందిగామలో నివాసం ఉంటూ నందిగామ శివారులోని ఎస్ఎన్ పాలీప్యాక్ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తుఉన్నారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో గాయత్రీ మిల్స్ ప్లాంట్ వద్ద బైపాస్ సర్వీస్ రోడ్డులో ఎదురుగా వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు కార్మికులు ఎగిరి చెట్లపొదల్లో పడిపోయారు. బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిశ్రమ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారును ఘటనా స్థలిలోనే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. -
వినతిపత్రం అందించాం
కొనుగోలు చేసిన పంటలను తరలించేందుకు వాహనాలను కేటాయించాలని అదనపు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఒకే ట్రాన్స్పోర్టును కేటాయించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేర్వేరు ట్రాన్స్పోర్టులకు కేటయించాలి. – శ్రీధర్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేశంపేట కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుందని మక్కలను విక్రయించేందుకు వచ్చాం. నాలుగు రోజులుగా కొనుగోలు చేపట్టక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి. – యుగంధర్, కేశంపేట -
బది‘లీల’పై కలెక్టర్ సీరియస్!
వైద్యారోగ్యశాఖలో బదిలీలపై సమగ్ర విచారణకు ఆదేశం సాక్షి, రంగారెడ్డిజిల్లా: వైద్యారోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) కిరణ్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి తుది నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులపై రెండు రోజుల క్రితం ‘సాక్షి’జిల్లా ఎడిషన్లో ‘స్థాన చలనం లేదు’శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనంపై జిల్లా అదనపు కలెక్టర్ దృష్టి సారించారు. నర్సింగ్ కాలేజీ విద్యార్థుల అడ్మిషన్ల ఫైళ్లు తొక్కి పెట్టడంపై సీరియస్ అయ్యారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా ఆదేశించినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 92 మంది ఖైదీలకు క్షమాభిక్షపై విడుదల చేసింది. ఇందులో చింతపట్లకు చెందిన ఇద్దరు ఖైదీలు ఇంటికి చేరుకున్నారు. యాచారం మండలం చింతపట్లకు చెందిన కొండ మహిపాల్రెడ్డిని హత్య చేసిన కేసులు అదే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, శేఖర్ రెడ్డి చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవించి ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షలో విడుదలై స్వగ్రామానికి చేరుకున్నారు. బుధవారం వారు యాచారం పోలీసులను కలవడంతో ప్రశాంతంగా జీవితాలను గడపాలని సూచించారు. ● అధికారుల పనితీరు మార్చుకోవాలి ● అదనపు కలెక్టర్ కిరణ్మయి చేవెళ్ల: ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అధికారులు అందుబాటు లో ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మండల పరిధిలోని ముడిమ్యాలలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు అదనపు కలెక్టర్ కిరణ్మయి, డీపీఓ సురేశ్మోహన్, డీఆర్డీఏ అదన పు పీడీ సుభాషిణి, చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలో చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం పల్లె ప్రకృతివనం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీలను సందర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పై అధికారులు స్పందించాలన్నారు. పలుశాఖ ల అధికారుల తీరుపై ఫిర్యాదులు ఉన్నాయని వాటిని సరిచేసుకోవాలన్నారు. అధికారులు, సి బ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇళ్లు లేని పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల తహసీల్దార్ బి.కృష్ణయ్య, ఎంపీడీఓ బన్సీలాల్, సర్పంచ్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఉప సర్పంచ్ జంగారెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అదనపు కోర్టు భవనానికి వినతి
ఆమనగల్లు: పట్టణంలో నూతనంగా అదనపు కోర్టు భవనం నిర్మించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్ను ఆమనగల్లు బార్ అసోసి యేషన్ సభ్యులు కోరారు. బుధవారం హైదరాబాద్ లోని జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్ను ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించారు. ఆమనగల్లులో కోర్టు భవనం నిర్మించాలని, సీనియర్ కోర్టు ను షాద్నగర్ నుంచి మహేశ్వరం మండల కేంద్రానికి తరలించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శేఖర్, గ్రంథాలయ కార్యదర్శి గణేశ్గౌడ్, క్రీడా కార్యదర్శి సంతోశ్కుమార్ పాల్గొన్నారు. -
మహనీయుల ఆశయ సాధనకు బస్సుయాత్ర
నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి ఆమనగల్లు: మహానీయుల చరి త్ర, త్యాగాలు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. మైసిగండిలో ప్రారంభించిన మహనీయుల జ్ఞాన చైతన్య బస్సు యా త్ర బుధవారం ఆమనగల్లుకు చే రుకుంది. ఈ యాత్రకు స్వాగతం పలికిన ఆయన మాట్లాడుతూ.. మహానీయుల జీవితగాధలు ప్రతీ ఒక్కరు తెలుసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. దేశంలో అనగారిన వర్గాల అభివృద్ధి కోసం, సమాజంలో మార్పుకోసం కృషి చేసిన మహానీయులు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. మహానీయుల జీవిత చరిత్ర, రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకత, ఓటు విలువ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బస్సు యాత్ర చేపట్టినట్లు వివరించారు. నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గంలోని 46 మండలాలు, వెయ్యి గ్రామాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్ననే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. బుధవారం ఎంపీ రవి కడ్తాలలో ఆర్టీసీ బస్సులో ఎక్కి ఆమనగల్లు వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల ప్రాధాన్యతకు పెద్దపీట వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పూర్తి వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మండల అధ్యక్షుడు జగన్, మండ్లి రాములు, నాయకులు మల్లయ్య, ఫరీద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్ పోనీయం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా 33కేవీ, 11 కేవీ లైన్లపై ప్రత్యేక దృష్టి సారించాం. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలను సైతం తట్టుకుని నిలబడే విధంగా లైన్లను తీర్చిదిద్దుతున్నాం. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మ ల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే చేపట్టాం. అధిక లోడు సమస్యతో ఇబ్బంది పడుతున్న సబ్స్టేషన్లు, ఫీడర్లు, డీటీఆర్లను గుర్తించి, వాటి స్థానంలో అదనపు సామర్థ్యంతో కూడిన పీటీఆర్లు, డీటీఆర్లను ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా మరో 75 సబ్స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. రాబోయే రోజుల్లో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిన్న ఫీడర్లు, సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కారానికి క్షేత్ర స్థాయి సిబ్బంది చేసిన కృషిని ఆయన వివరించారు. మెటీరియల్ కొరత లేకుండా చూస్తాం కొత్తలైన్లు, కనెక్షన్ల జారీకి అవసరమైన మెటీరియల్ను డిస్కం సమకూర్చుతుంది. మెజార్టీ ఇంజనీర్లు అవసరం లేకపోయినా..ముందస్తు జాగ్రత్తల పేరుతో డిపార్ట్మెంట్ పనుల పేరుతో స్టోర్స్ నుంచి మెటీరియల్ డ్రా చేసి, ఆ తర్వాత దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. విద్యుత్ స్టోర్స్ నుంచి డ్రా చేసిన మెటీరియల్కు, క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్న మెటీరియల్కు పొంతన ఉండటం లేదు. ఇకపై విద్యుత్ స్టోర్స్పై పక్కా నిఘా పెట్టనున్నాం. అంచనాలు రూపొందించిన తర్వాతే సెక్షన్ల వారీగా మెటీరియల్ మంజూరు చేయాలని నిర్ణయించాం. పక్కాగా ఆడిట్ నిర్వహించబోతున్నాం. తద్వారా మెటీరియల్ కొరత లేకుండా చూడబోతున్నాం. అండర్గ్రౌండ్ కేబుళ్ల కొరత ను నివారించేందుకు ఇప్పటికే ఆయా వెండర్ కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాం. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నాంస్టోర్స్లో మీటర్లు లేవనే సమస్యే లేదు. బర్ట్న్, స్ట్రకప్ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్నాంఎవరైనా మీటర్లు లేవని చెప్పితే.. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. పదిమీటర్ల ఎత్తు దాటితే ఓసీ చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో చేపట్టే నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్ల జారీ విషయంలో ఆంక్షలు విధించాం. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈఆర్సీ నిబంధనల మేరకు ఎలాంటి వివాదం లేని గ్రామకంఠం భూముల్లోని నిర్మాణాలు సహా నోటరీ డాక్యుమెంట్ దరఖాస్తులకు సైతం కనెక్షన్లు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పది మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మస్ట్ చేశాం. అంతకు లోపు ఉన్న భవనాలకు ఎలాంటి ఓసీలు అవసరం లేదు. ఎస్టిమేషన్ల విధానంలోనూ మార్పులు తీసుకొచ్చాం. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న లోడు ఆధారంగా ఫిక్స్డ్ ఛార్జీలు నిర్ణయించాం. అంచనాల రూపకల్పనలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. టర్న్కీ విధానంలోనూ పలు మార్పులు తీసుకొచ్చాం. కేటాయించిన పనులు పూర్తి చేసిన తర్వాత సదరు కాంట్రాక్టర్కు మరో పని అప్పగించాలని నిర్ణయించాం. అర్ధరాత్రి కూడా అప్రమత్తంగా ఉంటున్నాం. మంగళవారం అర్ధరాత్రి తర్వాత అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మేడ్చల్ జోన్లో 91 ఫీడర్లు, రంగారెడ్డి జోన్లో 47 ఫీడర్లు, మెట్రోజోన్ పరిధిలో 14 ఫీడర్ల పరిధిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కేవలం అరగంట వ్యవధిలోనే మెజార్టీ ఫీడర్ల పరిధిలో సరఫరాను పునరుద్ధరించాం. ఈ సమయంలో వాట్సాప్, ట్విట్టర్, యాప్, వెబ్సైట్, ఫేస్బుక్, 1912 కాల్ సెంటర్, వాట్సాప్ చాట్బోట్ల నుంచి ఎలక్ట్రిసిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు బంజారాహిల్స్ సర్కిల్ నుంచి 448, హైదరాబాద్ సెంట్రల్ జోన్ నుంచి 1,055, హైదరాబాద్ సౌత్ సర్కిల్ నుంచి 846, సికింద్రాబాద్ సర్కిల్ నుంచి 1,107, సైబర్సిటీ సర్కిల్ నుంచి 1,233, రాజేంద్రనగర్ సర్కిల్ నుంచి 1,275, సరూర్నగర్ సర్కిల్ నుంచి 235, హబ్సీగూడ సర్కిల్ నుంచి 525, మేడ్చల్ సర్కిల్ నుంచి 1370 ఫిర్యాదులు అందాయి. సెంట్రల్ బ్రేక్డౌన్ విభాగంలోని క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. ఐదు నిమిషాల నుంచి అరగంట వ్యవధిలోనే మెజార్టీ ఫీడర్ల పరిధిలోని సరఫరాను పునరుద్ధరించింది. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. రాబోయే వర్షాకాలంలో ఎంతటి విపత్తులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ఇంజనీర్లు సిద్ధంగా ఉన్నారు. 33 కేవీ, 11 కేవీ లైన్స్పై ప్రత్యేక దృష్టి కొత్తగా 75 సబ్స్టేషన్లు స్టోర్ నుంచి డ్రా చేసిన విద్యుత్ పరికరాలపై పక్కా ఆడిట్ నిబంధనల మేరకే నోటరీ దరఖాస్తులకు విద్యుత్ కనెక్షన్లు డిస్కం సీఎండీ జితేష్ వి పాటిల్ -
అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య
కందుకూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లేమూరుకు చెందిన పల్లె బాబయ్య, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు భానుతేజ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈనెల 26న వ్యవసాయ పొలంలో ఉన్న భానుతేజను ఏదో విషయంలో అతని పెద్దనాన్న మందలించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన భానుతేజ ఈనెల 29న ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం రాత్రి సమయంలో లేమూరు గ్రామానికి చెందిన బండి యాదయ్యకు చెందిన వ్యవసాయ భూమిలోని చెట్టుకు కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడు భానుతేజగా గుర్తించారు. బుధవారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
గుట్కాల విక్రేతపై కేసు
చేవెళ్ల: నిషేధిత గుట్కాలు, పాన్మసాలా, టొబాకో ఉత్పత్తులు నిల్వ చేసిన దుకాణంపై పోలీసులు దాడి చేసి యజమానిపై కేసు నమోదు చేశారు. అక్రమ నిల్వలను సీజ్ చేశారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన ప్రకారం.. మండలకేంద్రంలోని బాలాజీ జనరల్ స్టోర్లో గుజరాతి ఎల్లప్ప నిషేధిత గుట్కా, పాన్మసాల, టొబాకో ఉత్పత్తులు నిల్వచేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ సంతోష్రెడ్డి సిబ్బందితో కలిసి బాలాజీ జనరల్ స్టోర్పై దాడులు చేశారు. ఈదాడుల్లో స్టోర్లో పెద్ద మొత్తంలో నిషేధిత పాన్మసాలాలు, గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. వాటిని సీజ్చేసి ఎల్లప్పపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఎస్ఐ సంతోష్రెడ్డి, సిబ్బంది వెంకటయ్య, ఆనంద్ను ప్రత్యేకంగా అభినందించారు. -
పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా విజయ్కుమార్
ఇబ్రహీంపట్నం: పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కొంకణి విజయ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం శాఖ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన విజయ్కుమార్కు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్బంగా విజయ్కుమార్ మాట్లాడుతూ.. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్గా జగన్ మొయినాబాద్: టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర వైస్ చైర్మన్గా రంగారెడ్డి జిల్లాకు చెందిన రాచమల్ల జగన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ సమక్షంలో టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతులమీదుగా నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని.. రాష్ట్రంలో పార్టీ విస్తరకు కృషి చేస్తానన్నారు. -
నా పుట్టిన రోజున.. 3 మొక్కలు
● ఆస్తుల కంటే స్వచ్ఛమైన గాలి, నీరే నిజమైన వారసత్వం ● ప్రకృతి.. భగవంతుడి గొప్ప వరం: స్పీకర్ ప్రసాద్కుమార్ సనత్నగర్: ఆస్తుల కంటే స్వచ్ఛమైన గాలి, పచ్చటి వాతావరణం, పరిశుభ్రమైన నీరే నిజమైన వారసత్వమని, భావితరాలకు రూ.కోట్ల ఆస్తులను కాకుండా వీటిని అందిద్దామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్), సెస్ సంయుక్తంగా ‘సుస్థిర పర్యావరణం’ అనే అంశంపై బేగంపేట సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సుకు స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘జూన్ 4 నా పుట్టిన రోజు. నేను మూడు మొక్కలు నాటుతా. భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం ప్రకృతి. మనం దానిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కాలుష్యం, అడవుల నరికివేత, నీటి వనరుల క్షీణతతో భావి తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే ప్రకృతి సంపదను రక్షించడం, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం, నీటి వనరులను కాపాడడాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. ఇంటి వద్ద, గ్రామంలో, పట్టణంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను అందరూ స్వీకరించాలి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే మానవాళి మనుగడకే ముప్పు. పచ్చదనం పెంపొందించడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి వృథాను అరికట్టడం ద్వారా ప్రకృతి సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి’’ అని స్పీకర్ అన్నారు. -
లారీల కొరత.. రైతన్న వెత
● మొక్కజొన్న విక్రయాలకు ఇబ్బందులు ● కొనుగోలు కేంద్రాల వద్ద నిలిచిన ట్రాక్టర్లు కేశంపేట: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో ప్రభుత్వ మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన పంటలను గోదాంలకు తరలించేందుకు జిల్లా స్థాయిలో ట్రాన్స్పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లారీలు రాక ఇబ్బందులు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం (మొక్కజొన్న) గోదాంకు తరలించేందుకు లారీలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లోనే నిల్వ ఉండటంతో కొత్తగా రైతులు తెచ్చిన పంటలను అధికారులు కోనుగోలు చేయడం లేదు. కురుస్తున్న వర్షాలకు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ట్రాన్స్పోర్టు సౌకర్యం కల్పించాల్సి ఉంది. నాలుగు రోజులు క్రితం ధాన్యం విక్రయించేందుకు రైతులు ట్రాక్టర్లలో తీసుకువచ్చారు. నాటి నుంచి కొనుగోళ్లు చేపట్టక వాహనం టైర్లలో గాలి దిగిపోయింది. మరో 50 ట్రాక్టర్ల మక్కలు 29 గ్రామాల పరిధిలో ఇప్పటివరకు 645 మంది రైతుల నుంచి 80,557 బ్యాగుల(50కేజీలు) ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 64,616 బ్యాగుల మక్కలను ట్రాన్స్పోర్టు ద్వారా తరలించారు. ఇంకా 15,941 బ్యాగుల ధాన్యం నిల్వలు రోడ్డుపైన ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద సుమారుగా పది ట్రాక్టర్లు, కేశంపేటలో 40 ట్రాక్టర్ల వరకు మక్కలను అమ్మేందుకు రైతులు వచ్చారు. పంట నిల్వ చేసేందుకు అవసరమైన గోదాంలు లేక కోనుగోలు చేసిన ధాన్యం భద్రపరిచేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కూరగాయల ధరలు
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్లోని రైతు బజార్లో కూరగాయల ధరలు (కిలో.. రూపాయల్లో).. టమాట 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 40, కాకర 45, బీర 35, కాలిఫ్లవర్ 18, క్యాబేజీ 18, క్యారెట్ 39, దొండ 23, ఆలు 17, ఉల్లిగడ్డ 20, గోకర 28, దోసకాయ 18, సోరకాయ 13, పొట్లకాయ 18, చిక్కుడు 55, చామ 28, బీట్రూట్ 25, కీర 40, ఫ్రెంచ్బీన్స్ 65, క్యాప్సికం 55. తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దర్శనానికి మంగళవారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఆలయం ప్రాంగణంలో సామూహిక శ్రీ సత్యానారాయణ స్వామి వత్రాలు చేశారు. నాగ దేవతకు పుట్టలో పాలు పోశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ మోహన్రావు, పాలక మండలి సభ్యులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. కందుకూరు: ఐకేపీ వీఓఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 16 రోజులుగా చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు వీఓఏలు ప్రకటించారు. ఈమేరకు వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలు ఎం.సరస్వతి ఆధ్వర్యంలో మంగళవారం ఏపీఎం సత్యనారాయణకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు పత్రం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి సీతక్క ఇచ్చిన హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించామన్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా పని చేసే వరకు ఆన్లైన్ పనులు, పుస్తకాల ఆడిట్ చేయించమన్నారు. కార్యక్రమంలో వీఓఏలు పాల్గొన్నారు. కందుకూరు: విద్యార్థుల కోసం ఉత్తమ వేసవి శిబిరం నిర్వహించినందుకుగాను మండలంలోని నేదునూరు పరిధిలోని మోడల్ స్కూల్కు ప్రశంసాపత్రం లభించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ విష్ణుప్రియకు ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. వేసవి శిబిరం విజయవంతంగా నిర్వహించేలా మమ్మల్ని ప్రోత్సహించిన అప్పటి డీఈఓ సుశీంధర్రావు, ఎంఈఓ నర్సింహ, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్శర్మ, సర్పంచ్ స్వాతిరామకృష్ణారెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం మొయినాబాద్రూరల్: తెలంగాణ ఏర్పాటులో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నటికీ మరచిపోదని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చాకలిగూడలో ఉద్యమంలో మహేశ్ తెలంగాణ ఏర్పడదని ఆలోచనతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన భార్య రజితకు 2014లోనే ప్రభుత్వం అటెండర్ ఉద్యోగం కల్పించిదన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రజితను మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్రెడ్డి సన్మానించారు. -
పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం
కందుకూరు: కొనుగోలు కేంద్రంలోనే తమ పంటను విక్రయించి రైతులు లబ్ధి పొందాలని పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఆధ్వర్యంలో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోనే తమ పంటలను విక్రయించుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాళ్లకు రూ.7,721 చొప్పున కొనుగోలు చేస్తున్నామన్నారు. అందరి సహకారంతో పొద్దుతిరుగుడు కొనుగోలు చేయడానికి అనుమతులు వచ్చాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్.శేఖర్రెడ్డి, ఎన్.నర్సింహ, జి.పర్వతాలు, కె.యశోధ, టి.జగదీశ్వర్రెడ్డి, ఎస్.పాండురంగారెడ్డి, పి.ఆనంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్రెడ్డి, సీనియర్ నాయకులు జి.లక్ష్మీనర్సింహారెడ్డి, మన్నే జయేందర్ముదిరాజ్, కె.రామకృష్ణారెడ్డి, జి.ప్రభాకర్రెడ్డి, టి.ఇందిరదేవేందర్, దామోదర్గౌడ్, శేఖర్గుప్తా, పరంజ్యోతి, జయమ్మరాజు, డి.జంగయ్య, డి.గణేష్, ఎన్.అంజిరెడ్డి, రామకృష్ణ, సంజీవరెడ్డి, వెంకటేష్, ప్రతాప్రెడ్డి, వెంకట్రెడ్డి, సీఈఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకుంటున్న సీఎం
● మహేశ్వరానికి రూపాయి ఇవ్వడం లేదు ● ఎమ్మెల్యే సబితారెడ్డి మహేశ్వరం: సీఎం రేవంత్రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంపై కక్ష గట్టి ఒక్క రూపాయి ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ మంజురు చేసిన మెడికల్ కాలేజ్, 400 పడకల ఆస్పత్రి, మెట్రోలైన్లను సీఎం రేవంత్రెడ్డి రద్దు చేశారన్నారు. పేదల భూములను లాక్కోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ అర్హులకు సంక్షేమ పథకాలు రైతు బీమా, రైతు బంధు, డబుల్ బెడ్ రూమ్స్, దళిత బంధు, కేసీఆర్ కిట్స్ పలు సంక్షేమ పథకాలు అందించారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కండువా కప్పుకొన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఉత్త మాటలు చెప్పి మభ్యపెడుతున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా రైతులను గోస పెడుతున్నారన్నారు. ఉద్యమకారుల ఆవేదన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు చిలకమర్రి నర్సింహ, దిద్దెల అశోక్లు సభావేధికపైన సబితారెడ్డి ముందే ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తమకు పదవులు ఇవ్వకుండా, వారి సంక్షేమానికి ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా అవమానపరిచారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు నర్సింహ, పీఏసీఎఎస్ చైర్మన్ పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, సర్పంచ్ మునగపాటి నవీన్, నాయకులు అంబయ్యయాదవ్, చంద్రయ్య, సుధాకర్రెడ్డి, సమీర్, రాఘవేందర్రెడ్డి, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
లైబ్రరీలో సమస్యలు పరిష్కరించండి
బడంగ్పేట్: జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు సరిపడా వసతులు కల్పించాలని మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలుగంటి మధుసూదన్రెడ్డిని కలిసి విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రంథాలయ ప్రాంగణంలో డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు. వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయాలని, అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. చైర్మన్ మధుసూధన్రెడ్డి స్పందిస్తూ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందచేసిన వారిలో నవతెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్ణగంటి రంజిత్కుమార్, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ హైదరాబాద్ నగర కార్యదర్శి కొల్లూరు భీమేష్, విద్యార్థులు కృష్ణ, నరేష్ తదితరులున్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం షాబాద్: గ్రామంలోని సమస్యలకు ఒక్కొక్కటిగా గుర్తించి వాటికి చర్యలు తీసుకుంటానని మండలంలోని కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో రూ.రెండు లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భరత్, వార్డు సభ్యులు మహేందర్, నవీన్, యాదయ్య,శేఖర్, గ్రామస్తులున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం చేవెళ్ల: మండలంలోని ఆలూరు సబ్స్టేషన్ పరిధిలోని అన్ని ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు. ఆలూరు, మీర్జాగూడ, ఖానాపూర్, అర్గానో ఆలూరు, అర్బన్ ఫీడర్ల పరిధిలో ఉన్న రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. కార్మికులకు సన్మానం మొయినాబాద్రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందితేనే సమ్మిళిత ప్రగతి సాధ్యమని మండలంలోని కేతిరెడ్డిపల్లి సర్పంచ్ గోడుగు యాదయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పంచాయతీ కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సన్మానించి వారికి నెల రోజుల సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
మహేశ్వరం: మండల సర్పంచ్ల సంఘం నూతన అధ్యక్షుడిగా ఉప్పుగడ్డ తండా గ్రామ సర్పంచ్ నేనావత్ రాజు నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల పరిధిలోని ఘట్టుపల్లి గ్రామంలో ఓ రిసార్ట్లో పలు గ్రామాల సర్పంచ్లతో కలిసి సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా రాజునాయక్, ఉపాధ్యక్షుడిగా వినోద్నాయక్, ప్రధాన కార్యదర్శులుగా మల్లేష్ ముదిరాజ్, దార నర్సింహలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ.. సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం తాను రాజకీయాలకు అతీతంగా పని చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా తాను సర్పంచ్ల సంక్షేమం కోసం పని చేస్తామన్నారు. తనను అన్ని రాజకీయ పార్టీలకు చెందిన 16 మంది గ్రామ సర్పంచ్లు ఎన్నుకున్నారన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా రాజునాయక్ -
భారతి సిమెంట్తో నిర్మాణం వేగం
మీర్పేట: భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని సంస్థ టెక్నికల్ ఇంజినీర్ మహ్మద్ సాహెర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం మీర్పేట ఆర్ఎన్రెడ్డినగర్లోని శ్రీ లక్ష్మీ స్టీల్ ట్రేడర్స్ డీలర్స్ షాపులో తాపీ మేసీ్త్రలతో జరిగిన సమావేశానికి సాహెర్ హాజరై మాట్లాడారు. సిమెంటు వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ తెలంగాణలో అందిస్తుందని వివరించారు. అల్ట్రాఫాస్ట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జీలు, రహదారులకు సరైన ఎంపికని అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజినీర్లు సైట్ వద్దకే వచ్చి ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తారన్నారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ రూ.20 అదనంగా ఉంటుందన్నారు. డీలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతి సిమెంట్ నాణ్యతతో పాటు నిర్మాణ సమయంలో సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందని తెలిపారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు. సంస్థ టెక్నికల్ ఇంజినీర్ మహ్మద్ సాహెర్ -
వేసవి శిబిరం ముగింపు సంబరాలు
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిలోధిని కాశిరెడ్డిగూడ గ్రామంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సంబరాలను మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, వ్యక్తిత్వవికాసం, క్రీడలు, సృజనాత్మకత తదితర అంశాలతో పాటు కరాటేలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి డ్యాగశంకర్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారికి కావాల్సిన వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు వేసవి శిబిరాన్ని నిర్వహించామన్నారు. విద్యార్థికి పుస్తకం చదవడం, రాయడం రావాలన్నారు. ప్రతిభ కనబరిచి విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రామలింగంగౌడ్, మాజీ సర్పంచ్ దీనాశంకర్యాదవ్, ఉపసర్పంచ్ శ్రీశైలంయాదవ్, పంచాయతీ క్యాదర్శి రాఘవేంద్ర, వార్డు సభ్యులు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ పాటించలేదంటూ ధర్నా
కొందుర్గు: ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి సర్పంచ్కు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రేగడిచిల్కమర్రి గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి సర్పంచ్ శ్వేతకు సమాచారం ఇవ్వకుండా గ్రామ ప్రథమ పౌరురాలిని అవమానించారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్వేత, మాజీ వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, నాయకులు రామకృష్ణ, రవీందర్ రెడ్డి, శ్రీనివాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహాల ప్రవేశం అధికారికంగా చేపట్టిందేమి కాదని, ఇంటి యజమాని తమపై అభిమానంతో పిలిస్తే వెళ్లామని అన్నారు. అయినప్పటికీ సర్పంచ్ను పిలిచారని.. ఆమె గ్రామంలో లేరని తెలియడంతో ఉప సర్పంచ్ నరేందర్తో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం చేశామన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, జితేందర్ రెడ్డి, జహంగీర్, కృష్ణయ్య, శ్రీనివాస్ రెడ్డి, రామయ్యగౌడ్ పాల్గొన్నారు. -
చిన్నారులకు పలకల పంపిణీ
చేవెళ్ల: అంగన్వాడీ ద్వారా ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్ మనీషాఅనంత్రెడ్డి అన్నారు. అంగన్వాడీ–4లో మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిల్లలకు బట్టలు, పలకలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, గర్భిణులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భారతి, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పరేడ్లో చేవెళ్ల ఫైర్ పైటర్ చేవెళ్ల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పరేడ్లో చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం ఫైర్ పైటర్ ఉప్పరి గోపాల్కు అవకాశం లభించింది. మంగళవారం సిక్రింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ఆర్ముడ్ ఫోర్స్ నిర్వహించిన పరేడ్లో గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం అధికారి రవీందర్రెడ్డి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి అవకాశాలు రావడం సంతోషకరమన్నారు. -
సమ్మర్ క్యాంపు నిర్వహణకు పురస్కారం
కొత్తూరు: ఇటీవల పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ జిల్లాలోనే ఆదర్శవంతమైందిగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాఠశాల హెచ్ఎం అంగూర్నాయక్కు కలెక్టర్ నారాయణరెడ్డి, ఐటీ శాఖమంత్రి శ్రీధర్బాబు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. క్యాంపులో భాగంగా పర్యావరణ పరిరక్షణ–ప్రజల బాధ్యతపై చేపట్టిన అంశాన్ని అధికారులు గుర్తించినట్లు హెచ్ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు భగవంతు, రవికుమార్, రాజు, నవనీత, తదితరులు పాల్గొన్నారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
షాబాద్: గ్రామంలోని సమస్యలకు ఒక్కొక్కటిగా గుర్తించి వాటికి చర్యలు తీసుకుంటానని మండలంలోని కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో రూ.రెండు లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భరత్, వార్డు సభ్యులు మహేందర్, నవీన్, యాదయ్య,శేఖర్, గ్రామస్తులున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం చేవెళ్ల: మండలంలోని ఆలూరు సబ్స్టేషన్ పరిధిలోని అన్ని ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు. ఆలూరు, మీర్జాగూడ, ఖానాపూర్, అర్గానో ఆలూరు, అర్బన్ ఫీడర్ల పరిధిలో ఉన్న రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. మహనీయుల సేవలు చిరస్మరణీయం షాబాద్: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, వారు చేసిన సేవలు చిరస్మరణీయమని మండలంలోని సంకెపల్లిగూడ సర్పంచ్ కుమ్మరి లావణ్య చెన్నయ్య పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం మేరా గావ్, మేరీ జిమ్మేదారి స్వచ్ఛగామ్, సురక్షిత్ జలవాయి–2026 కార్యక్రమంలో భాగంగా తడి చెత్త ద్వారా ఎరువు తయారీ కేంద్రం వద్ద సర్పంచ్ కుమ్మరి లావణ్యతో పాటు ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమ్మరి చెన్నయ్య గ్రామస్తులు సెల్ఫీలు దిగారు. అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం మొయినాబాద్రూరల్: తెలంగాణ ఏర్పాటులో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నటికీ మరచిపోదని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చాకలిగూడలో ఉద్యమంలో మహేశ్ తెలంగాణ ఏర్పడదని ఆలోచనతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన భార్య రజితకు 2014లోనే ప్రభుత్వం అటెండర్ ఉద్యోగం కల్పించిదన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రజితను మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్రెడ్డి సన్మానించారు. పంచాయతీ కార్మికులకు సన్మానం మొయినాబాద్రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందితేనే సమ్మిళిత ప్రగతి సాధ్యమని మండలంలోని కేతిరెడ్డిపల్లి సర్పంచ్ గోడుగు యాదయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పంచాయతీ కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సన్మానించి వారికి నెల రోజుల సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు అనితరెడ్డి, కార్యదర్శి తారాబాయి, వార్డు సభ్యుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మొయినాబాద్రూరల్: మండలంలో బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది స్థానంలో ఇతరులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఎంపీడీఓ హిమబిందు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఎనిమిది మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారని అందులో ఐదుగురు మొయినాబాద్ మండలానికి వెళ్లారన్నారు. కాశీంబౌలిలో పని చేసిన శివకుమార్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో శంషాబాద్ మండలం మదనపల్లి తండా నుంచి శ్రీకాంత్, నాగిరెడ్డిగూడ యాదయ్య స్థానంలో ప్రవీణ్కల్యాణ్, కుతుబుద్దీన్గూడ స్వప్న స్థానంలో ఎల్లయ్య వచ్చారన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
షాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల సొంతింటి కల సాకారమవుతుందని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్ పేర్కొన్నారు. మంగళవారం మండల మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో కుమ్మరి శోభ, కేశపల్లి చంద్రకళ, అమృత, జంగయ్య, సయ్యద్ ఇక్రం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదోడి సొంత ఇంటి కల సాకారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాంరెడ్డి, సర్పంచ్ పామెన నర్సింలు, ఉపసర్పంచ్ నేరట్ల సావిత్రి, నాయకులు శ్రీను, రవీందర్నాయక్, భార్గవరామ్, రాజుగౌడ్, యాదయ్య, రాజు, మహేందర్, వార్డు సభ్యులు తదితరులున్నారు. -
ప్రజల సహకారం బాగుంది
శంకర్పల్లి: మండల ఎంపీడీఓగా పని చేసిన తనకు శంకర్పల్లి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో సహకరించారని ఇటీవల ఉద్యోగోన్నతిపై బదిలీ అయినా జనగామ జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకయ్య అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేశానని, దానికి తోడ్పాటునందించిన ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఇతర సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యకు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరిరాజు, పలు గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చేవెళ్ల: పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం మండలంలోని 38 మంది లబ్ధిదారులకు వచ్చిన కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సహకారం అందిస్తూ ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ, మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేపు రైతులకు గ్రామసభ షాద్నగర్: మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్లాట్లు, ఇళ్లు కోల్పోయే వారికి నష్టపరిహారంపై చర్చించేందుకు ఈ నెల 3న మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11.30లకు గ్రామసభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీఓ సరిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చటాన్పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 180 నుంచి 183 వరకు, అదేవిధంగా 674, 675, 695, 696, 697లలో 15,653 చదరపు గజాలు ఎల్సీ నంబర్ 27 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. ప్లాట్లు, ఇళ్లు కోల్పోయే వారు హాజరై సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి ఏఓ ప్రభుదాస్ చేవెళ్ల: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ఏఓ ప్రభుదాస్ తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయని ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 7, పెన్షన్లపై 5, డబుల్ బెడ్రూం కోసం ఒకటి, సివిల్ సప్లైపై ఒక ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు అందించిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థికి సన్మానం షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని దేవునిబండతండాకు చెందిన బాదావత్ అఖిత ఐఐటీ ఆలిండియా స్థాయిలో 831 ర్యాంకు సాధించి సత్తాచాటింది. ఈ మేరకు సోమవారం గ్రామ సర్పంచ్ శ్రీను విద్యార్థిని అభినందిస్తూ.. పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని గంట్లవెళ్లి ప్రభుత్వ పాఠశాల, మొగిలిగిద్ద కస్తూర్బా గాంధీ విద్యాలయం(కేజీబీవీ)లో చదువుకున్న అఖిల ఐఐటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచడం అభినందనీయమన్నారు. -
డంప్యార్డుకు వ్యతిరేకంగా చైతన్యయాత్ర
కొత్తూరు: డంప్యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ప్రజా చైతన్యయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని వైఎంతండా, చింతగట్టు, పులిచర్లకుంటతండాల్లో జానపద కళాకారులు డంప్యార్డు ఏర్పాటు చేస్తే కలిగే అనర్థాలపై పాటలు, నృత్యాల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించారు. ఒక్కసారి బీజం పడితే చెట్టు వృక్షమైన మాదిరిగా డంపింగ్యార్డులో చెత్త కొండలుగా పేరుకుపోతుందన్నారు. చెత్త నిల్వ కారణంగా పరిసర ప్రాంతాలు వాతావరణ, పొగ, నీటి కాలుష్యంతో ప్రజలు, జీవరాశులు అనేక రోగాల బారిన పడతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంప్యార్డు ఏర్పాటును అడ్డుకుంటామని జేఏసీ సభ్యులు స్పస్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు అంబటి ప్రభాకర్, ఎల్లారం శేఖర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
షాద్నగర్రూరల్: నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని హజిపల్లి, మొండోనిరాయితండా, చించోడ్ గ్రామాలతో పాటుగా పట్టణంలోని 12, 15 వార్డులలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్లను ప్రాంభించి, అబ్ధిదారులకు వస్త్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోందని, దీంతో పేదల కుటుంబాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు నిర్మించి వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేను సన్మానించి, స్వీట్లు తినిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్, కమిషనర్ సునీత, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
ముందస్తు అరెస్టులు సరికాదు
మొయినాబాద్రూరల్: రాష్ట్రంలో సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసం నగరంలో చేపట్టిన ధర్నాకు వెళ్లనీయకుండా ముందస్తుగా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ సర్పంచ్ స్వప్నఅంజయ్యగౌడ్ అన్నా రు. సోమవారం మండల పరిధిలోని నక్కలపల్లిలో ఆయనను మొయినాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ద్వారా అభివృద్ధి పనులు చేసినా.. వాటికి ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బిల్లుల కోసం నగరంలో నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్నందుకు పోలీసులు హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారుషాద్నగర్ ఎంవీఐగా స్వప్న షాద్నగర్: మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వాసును సంగారెడ్డి కార్యాలయానికి బదిలీ చేస్తూ సోమవారం ఉన్నతాధికారులు ఉత్వర్తులు జారీ చేశారు. ఆయన స్థానంలో నల్గొండ ఎంవీఐగా పనిచేసిన స్వప్న ఇక్కడికి రానున్నారు. రెండేళ్ల కాలం పాటు షాద్నగర్ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహించిన వాసు అందరి మన్ననలు పొందారు. శంకర్పల్లి ఎంపీడీఓగా ప్రవీణ్కుమార్ శంకర్పల్లి: శంకర్పల్లి మండల ఎంపీడీఓగా ప్రవీణ్కుమార్ సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన జిల్లేడు చౌదరిగూడెం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ పనిచేసిన వెంకయ్య పదోన్నతిపై వేరే జిల్లాకి బదిలీపై వెళ్లారు. ప్రజాప్రతినిధులు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ మండలాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీడీఓ స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలను గ్రామ కంఠంలో కలపాలని వినతి కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలను గ్రామ కంఠంలో కలపాలని కోరుతూ సర్పంచ్ మంజుల సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 83, 96లలో 1983లో ఇందిరమ్మ ఇళ్ల కోసం డాక్యుమెంట్ 8/1983 ద్వారా 3.46 గుంటల భూమిని రైతులు వెంకట్రెడ్డి, సీతారాంరెడ్డి విక్రయించారని సర్పంచ్ తెలిపారు. అప్పటి నుంచి అక్కడ ఇళ్లు నిర్మించుకున్నా నేటికీ భూ భారతిలో రైతుల పేర్లు వస్తున్నాయని ఆమె తెలిపారు. భూభారతిలో రైతుల పేర్లను తొలగించి, గ్రామకంఠంగా మార్చాలని ఆమె వినతిపత్రంలో కోరారు. -
అక్రమ మైనింగ్ను ఆపాలని ఫిర్యాదు
మొయినాబాద్: నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ మైనింగ్ను ఆపాలని మండల పరిధిలోని కనకమామిడి గ్రామస్తులు చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సోమవారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వారు ఏఓ ప్రభుదాస్కు ఫిర్యాదు అందజేశారు. కనకమామిడి రెవెన్యూలోని సర్వే నంబర్ 51/1, 510లో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా సర్వే నంబర్లలోని గుట్టలను రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తవ్వి మట్టిని తరలిస్తున్నారని వివరించారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న మెగా సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మైనింగ్ చేస్తోందని తెలిపారు. వెంటనే అడ్డుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తా
షాద్నగర్/కొత్తూరు: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితా ల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. కొత్తూరు పట్టణానికి చెందిన పాత్లావత్ గౌతమ్ ఎస్టీ కేటగిరీరిలో 73వ ర్యాంకు సాధించాడు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమైనట్లు విద్యార్థి తెలిపాడు. షాద్నగర్ పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీకి చెందిన బడావత్ అఖిల 831వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు. కమ్మదనం గురుకుల కళాశాల విద్యార్థులు సభావత్ పూజ 2197వ ర్యాంకు, మేక పోతుల ఆదిలక్ష్మి 4388వ ర్యాంకు, కల్లా దీపిక 4657వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ శారద చెప్పా రు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు. -
ఫరూఖ్నగర్ ఎంపీడీఓగా శ్రీకాంత్
షాద్నగర్: ఫరూఖ్నగర్ మండల పరిషత్ అధికారిగా పని చేస్తున్న బన్సీలాల్ను చేవెళ్లకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్వర్తులు జారీ చేశారు. ఆయన స్థానంలో తలకొండపల్లి ఎంపీడీఓ శ్రీకాంత్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన ఎంపీడీఓకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. చేవెళ్ల ఎంపీడీఓగా బన్సీలాల్ చేవెళ్ల: చేవెళ్ల ఎంపీడీఓగా పనిచేసిన హిమబిందును మొయినాబాద్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఫరూఖ్నగర్ మండల ఎంపీడీఓ బన్సీలాల్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పామెన సర్పంచ్ పామెన రాములు, గ్రామస్తులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మొయినాబాద్ ఎంపీడీఓగా హిమబిందు మొయినాబాద్రూరల్: మొయినాబాద్ మండల ఎంపీడీఓగా బిరుదు హిమబిందు సోమవారం బాధ్యతలు చేపట్టారు. చేవెళ్ల మండల ఎంపీడీఓగా పనిచేసిన ఆమె ప్రభుత్వం నిర్వహించిన బదిలీలలో ఇక్కడికి రాగా.. ఇక్కడ ఎంపీడీఓగా 15 రోజులుగా పనిచేసిన వెంకటేశ్వర్రెడ్డి యథావిధిగా ఎంపీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు.


