breaking news
Ranga Reddy District Latest News
-
పాముకాటుకు రైతు మృతి
దౌల్తాబాద్: పాముకాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజాషా(60) ఉదయం తన సొంత పొలంలో గడ్డి కోస్తున్నారు. ఈ క్రమంలో చేతికి పాము కాటు వేసింది. వెంటనే గమనించి ఇంటికి వచ్చారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరంలోకి పాకడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ వేణుకుమార్ తెలిపారు. -
మందులు ఉన్నాయి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు బాధితులు వెంటనే సమీప సర్కారు దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. రైతులు పొలాలకు వెళ్లేటప్పడు తగిన జాగ్రత్తలు పాటించాలి. – సుధాకర్లాల్, జిల్లా వైద్యాధికారి విష సర్పాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వెంటనే సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపొందించడం ద్వారా విషసర్పాలు, తేళ్ల కాటుతో జరిగే మరణాలను గణనీయంగా తగ్గించే ఆస్కారం ఉంది. – రజిత, మండల వైద్యాధికారి, దోమ -
చిన్నారులకు అండగా ప్రభుత్వం
మంత్రి దామోదర్ రాజనర్సింహ మల్లాపూర్: మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ (సాధన ఫౌండేషన్)కు చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులు, సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు, ప్రత్యేక విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను రూపొందించే దిశగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సాధన దివ్యాంగుల వ్యవస్థాపకురాలు పడమటి సురేఖారెడ్డి, కార్యదర్శి మధుసూదన్రెడ్డి తదితరులున్నారు. పంజగుట్ట: కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అమ్మవారికి సమర్పించేందుకు వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పీర్జాదిగూడకు చెందిన నిర్మల కార్తీక్ వివాహం ఆగస్టు 16న జరగనుంది. దీంతో ఆయన తండ్రి భాస్కర్ (50) జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. సోమాజిగూడలోని ప్రణవ భవనం సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్ ద్వారా యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తలకు తీవ్ర గాయం, రక్తస్రావం కారణంగా భాస్కర్ మృతి చెందారు. కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్రాసిటీ కేసు నమోదు కుషాయిగూడ: ఓ మహిళా జర్నలిస్టును అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. నాచారం ఇందిరానగర్ కాలనీకి చెందిన వాణి అనే జర్నలిస్టు ఈ నెల 16న కుషాయిగూడలోని మురళీకృష్ణ మిల్క్ పార్లర్లో పన్నీరు కొనుగోలు చేసింది. తాను కొనుగోలు చేసిన పన్నీరు నాసిరకంగా ఉండడంతో పార్లర్ యజమానిని ప్రశ్నించింది. దీంతో యజమాని సీసీఎస్ అధ్యక్షుడు చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాలని వాణికి ఇచ్చాడు. ఫోన్ మాట్లాడిన పద్మారెడ్డి అసభ్యంగా మట్లాడాడని దళిత మహిళ అని తెలిసి కూడా దూషించడాని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. ఎండోక్రైన్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలి లక్డీకాపూల్: ఎండోక్రైన్ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే జీవన నాణ్యతతో పాటు ఆయుర్దాయం కూడా మెరుగుపడుతుందని తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ బిపిన్ సేథి తెలిపారు. నగరంలోని హోటల్ మారిగోల్డ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ 7వ వార్షిక సదస్సు ఆదివారం ముగిసింది. ఎండోక్రైనాలజిస్టులు, వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్న ఈ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ వార్షిక సదస్సుల ద్వారా ఆ లోటును భర్తీ చేయాలన్నదే తమ ప్రయత్నమన్నారు.సదస్సు నిర్వహణ కార్యదర్శి, నిమ్స్ డాక్టర్ బియాట్రిస్ ఆన్ మాట్లాడుతూ.. డయాబెటిస్, ఊబకాయం, థైరాయిడ్, జీవక్రియ (మెటబాలిక్) సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులకు నిరంతర వైద్య విద్య అత్యంత అవసరమన్నారు. -
అదుపుతప్పి కారు బోల్తా
నలుగురికి గాయాలు తాండూరు రూరల్: అతివేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ఈ సంఘటన పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తాండూరు పట్టణం ఇంద్రానగర్కు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ నుంచి తాండూరుకు వస్తున్నారు. మార్గమధ్యలో పెద్దేముల్ మండలం కందనెల్లి శివారు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు గమనించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. తర్వాత పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షత్రగాత్రుల్లో ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ విషయమై పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్వర్థన్ను వివరణ కోరగా.. కారు బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదన్నారు. -
విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి
మొయినాబాద్రూరల్: విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. మేడిపల్లి గ్రామానికి చెందిన చాకలి బాబయ్య, బాబు తండ్రీకొడుకులు. వారి వద్ద ఉన్న గేదెలను గడ్డి మేపేందుకు ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని శివాలయం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. గడ్డి మేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు బాధితులను ఓదార్చారు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.రెండున్నర లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
పాముల కాలం.. జర పైలం
దోమ: వానాకాలంలో విష సర్పాలు, తేళ్ల సంచారం ఎక్కువ. పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాము, తేలు కాటుకు గురైనప్పుడు నాటు వైద్యం కాకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని చెబుతున్నారు. ఆందోళనకు గురైతే గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 33 మంది పాముకాటు బారిన పడి మృతి చెందారు. మరో 692 మందికి ఏఆర్వీ వ్యాక్సిన్ ఇచ్చారు. నాటు వైద్యం వద్దు వేసవిలో ముళ్ల పొదలు, రాళ్ల మధ్యలో దాగి ఉన్న పాములు, తేళ్లు వర్షాలు కురవడంతో బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా పొలాలు, గడ్డి, రాళ్ల కుప్పల వద్ద ఎక్కువగా కనిపిస్తుంటాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు వాటి కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. పాము కాటు వేసిన వెంటనే బాధితుడిని ప్రశాంతంగా ఉంచి సమీప ఆస్పత్రికి తరలించాలి. భయపడితే గుండె వేగంగా కొట్టుకోవడంతో విషం శరీరమంతా త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాయాన్ని బ్లేడ్తో కోయడం, విషాన్ని నోటితో పీల్చడం వంటి చర్యలు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. చేతికి ఉంగరాలు, గడియారాలు, బిగుతైన దుస్తులు ఉంటే వెంటనే తొలగించాలి. ఆ తేళ్లు ప్రమాదకరం పంట పొలాల్లో ఎక్కువగా ప్రమాదకర తేళ్లు బయటకు వస్తుంటాయి. నల్ల తేలు కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి, వాపు, మంట కలుగుతుంది. ఎరుపు తేలు కాటు గుండె, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పసుపు రాతి తేళ్లు, చెక్క దిమ్మెల కింద ఎక్కువగా కనిపిస్తాయి. వీటి కాటు కూడా నిర్లక్ష్యం చేయరాదు. తేలు కుట్టిన శరీర భాగాలను సబ్బుతో శుభ్రంగా కడిగి ఐస్ప్యాక్ ఉంచాలి. కుట్టిన భాగాన్ని ఎక్కువగా కదపకుండా ఉంచి వెంటనే వైద్యులను సంప్రదించాలి. వర్షా కాలంలో విషసర్పాలు, తేళ్ల బెడద కాటేస్తే ప్రథమ చికిత్స తప్పనిసరి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 33 మంది మృతి -
అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందజేత
షాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన చేసిన సేవలు మరువలేనివని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, మంత్రి అట్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య వారి చేతుల మీదుగా అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్రీయ అధ్యక్షుడు గౌతమ్ మల్లేశ్, డాక్టర్ రాజు, మణీ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. 899 మంది‘నిషా’చరులకు చెక్ సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్లో ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. గత వారాంతమైన శుక్ర, శనివారాల్లో హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాలు తనిఖీలు చేపట్టగా... 899 మంది డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో చేపట్టారు. వీరిలో హైదరాబాద్ పరిధిలో చిక్కిన వాళ్లు 572 మంది కాగా... సైబరాబాద్ పరిధిలో పట్టుబడిన వాళ్లు 327 మంది ఉన్నారు. ఈ ‘నిషా’చరుల్లో 730 మంది ద్విచక్ర, 56 మంది త్రిచక్ర, 109 మంది తేలికపాటి, మిగిలిన వాళ్లు ఇతర వాహనాల చోదకులు ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో చిక్కింది 572 మంది సైబరాబాద్ పరిధిలో పట్టుబడిన వాళ్లు 327 మంది -
‘సర్’ను వేగవంతంగా పూర్తిచేయాలి
చేవెళ్ల: సర్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, చేవెళ్ల పార్లమెంట్ సర్ ఇన్చార్జి జగదీశ్ అన్నారు. పట్టణంలోని అట్లాస్ ఫంక్షన్హాల్లో ఆదివారం నియోజకవర్గ స్థాయిలోని పార్టీ బీఎల్ఏ(బూత్ స్థాయి ఏజెంట్ల) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగదీశ్తో పాటు నియోజకవర్గ సర్ ఇన్చార్జి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్లో పార్టీ తరఫున బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సర్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీఎల్ఏల పనితీరు శూన్యంగా ఉందని, ఈ కారణంగా నియోజకవర్గం సీ–కేటగిరిలో ఉందన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. ఇప్పటికై నా బూత్స్థాయిలో ఉన్న ఓటర్లును కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. వెంటనే బీఎల్ఏలతో మండలాల వారీగా సమావేశం నిర్వహించి, ప్రతి బీఎల్ఏ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సమతారెడ్డి, మార్కెట్ చైర్మన్ పెంటయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, ఐదు మండలాల అధ్యక్షులు, మూడు మున్సిపాలిటీల అధ్యక్షులు, గిరిధర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పెంటారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రమౌళి, వెంకట్రెడ్డి, నాయకులు జన్ధార్రెడ్డి, బల్వంత్రెడ్డి, ఆగిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రభాకర్, గోపాల్రెడ్డి, వీరేందర్రెడ్డి, ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, సర్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి జగదీశ్ -
మోయలేని భారం
విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు ప్రైవేట్ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువ నోట్బుక్స్ ఇవ్వకూడదు. ప్రాజెక్టు బుక్స్, టెక్ట్స్ బుక్స్ పాఠశాలలోనే ఉంచుకునేలా యజమాన్యాలు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలను ఇబ్బందులకు గురి చేయకూడదు. – వెంకట్స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్ దౌల్తాబాద్: బడికి వెళ్లే చిన్నారులు రోజురోజుకూ స్కూల్ బ్యాగుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో అధిక సంఖ్యలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, గైడ్లు, ప్రాజెక్ట్ ఫైళ్లు, డ్రాయింగ్, స్క్రాప్ బుక్స్ వంటి వాటిని తప్పనిసరి చేయడంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, బూట్లు తదితర వస్తువులు కూడా బ్యాగు బరువును మరింత పెంచుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు పిల్లల బాధను చూసి స్వయంగా బ్యాగులు మోసి పాఠశాల వరకు తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఆందోళనకరం మండలంలోని 33 గ్రామపంచాయతీల పరిధిలో 50 పాఠశాలలు ఉండగా, వాటిలో 6 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. గతంలో కొన్ని సబ్జెక్టుల పుస్తకాలు, ఒక రఫ్ బుక్తో సరిపెట్టే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక నోట్బుక్తో పాటు గైడ్లు, ప్రాజెక్ట్ వర్క్, రికార్డులు, డైరీలు వంటి పుస్తకాలు తీసుకు రావాల్సి వస్తోంది. దీంతో 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 6 నుంచి 12 కిలోల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులు 12 నుంచి 18 కిలోల వరకు బరువున్న బ్యాగులను నిత్యం మోస్తున్నారు. కొన్ని పాఠశాల బస్సులు గేట్ వరకు మాత్రమే వెళ్లడంతో, అక్కడి నుంచి బ్యాగులు మోసుకుంటూ నడవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి కారణంగా చిన్నారుల్లో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలుకాని మార్గదర్శకాలు విద్యార్థులపై బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర విద్యాశాఖ 2017లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం 1, 2 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు 1.5 కిలోలు, 3 నుంచి 5వ తరగతుల వారికి 3 కిలోలు, 6, 7 తరగతుల వారికి 4 కిలోలు, 8 నుంచి 10వ తరగతుల వారికి 5 కిలోలు మించకూడదని స్పష్టం చేసింది. అయితే ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా సొంత సిలబస్ పేరుతో అదనపు పుస్తకాలను విద్యార్థులపై మోపుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో బ్యాగుల బరువుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. బడి పిల్లలపై బ్యాగు బండ విద్యార్థులపై పెరుగుతున్న పుస్తకాల మోత ప్రైవేట్ పాఠశాలలో మరింత బరువు తిప్పలు పడుతున్న చిన్నారులు -
దళారులపై చర్యలకు వినతి
ఆమనగల్లు: స్థానిక కూరగాయల మార్కెట్లో రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా మార్కెట్లో మోండా పేరుతో కొంతమంది దళారులు రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేయడంతో పాటు తరుగు, కమీషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వీరికి గతంలోనే మార్కెట్ కమిటీ నుంచి నోటీసులు అందజేశారని తెలిపారు. క్వారీ పనులు నిలిపివేయాలి.. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలోని సర్వే నంబర్ 302, 304లో కొనసాగుతున్న క్వారీ పనులను ఆపేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపతంర అందజేశారు. క్రషర్తో విపరీతమైన దుమ్ము, శబ్ద కాలుష్యం వెలువడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు తరుగు, కమీషన్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపణ -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ చందర్సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దండుమైలారం గ్రామానికి చెందిన ఎడ్ల అనిల్కుమార్(23) ఇంట్లోనే అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు తెలిపారు. మగపిల్లలు లేనికారణంగా అనిల్ను చిన్నప్పుడే అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకుని, తండ్రి భిక్షపతి అతన్ని పెంచారు. పోలీస్ సెలెక్షన్స్కు సిద్ధమవుతుండగా ఇటీవల కాలు బెనికి సర్జరీ అయిందని చెప్పారు. హఠాత్తుగా అనిల్ మృతిచెందడం, మెడ వద్ద చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చలానాలు తప్పించుకునేందుకు కారుకు ఫేక్ నెంబర్ యజమానిపై చీటింగ్ కేసు గచ్చిబౌలి: చలానాలు తప్పించుకునేందుకు ఫేక్ నెంబర్తో పట్టుబడ్డ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన మేరకు.. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన కారుకు ట్రాఫిక్ పోలీసులు డాక్యుమెంట్లు పరిశీలించగా చేయగా నెంబరు (టీఎస్08జైవె1202) ఫేక్ నెంబర్గా గుర్తించారు. ఛాసిస్ నెంబర్ ఆధారంగా ఒరిజినల్ నెంబర్ టీఎస్11ఈజడ్3815గా గుర్తించారు. పాతబస్తీకి చెందిన ఇర్ఫాన్ ఈ నెల 18న నానక్రాంగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్లో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. కౌన్సిలింగ్ అనంతరం కోర్టు ద్వారా కారును విడుదల చేసుకునేందుకు గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్కు వచ్చాడు. కారు నెంబర్ను పరిశీలించగా చేయడంతో ఫేక్ అని తేలింది. చలానాలు తప్పించుకునేందుకు ఫేక్ నెంబర్ వాడినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. -
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరి
కందుకూరు: ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థి తులను ఎదుర్కోవాలంటే ప్రతి ఇంటికీ తప్పనిసరి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండల పరిధిలోని కొత్తూర్లో సర్పంచ్ మండల కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జలసిరి కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల్లో పంట కుంటలు నిర్మించుకోవాలని అన్నారు. గ్రామానికి ఒక ఊట కుంట, బోరు బావుల రీచార్జీ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వాటితో వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలు కాపాడుకోవచ్చని, భూగర్భ జలాల మట్టం పడిపోకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఇన్చార్జి ఎంపీఓ శ్రీధర్, టీఏ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి జానకీరామ్, ఉప సర్పంచ్ రవికుమార్రెడ్డి, ఏఈఓ స్వాతి, ఐకేబీసీసీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మాతృమరణాలపై దృష్టి పెట్టాలి సాక్షి, రంగారెడ్డిజిల్లా: మాతృ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. మరణాలకు దారి తీసిన పరిస్థితులపై అధ్యయనం చేసి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సోమవారం జిల్లాలో నమోదైన మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రసవానికి ముందు.. తర్వాత అందే వైద్యసేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ.. మాతృ మరణాల నివారణకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ప్రతి మాతృ మరణంపై జిల్లా స్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గర్భిణుల క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత నివారణ, సంస్థాగత ప్రసవాల ప్రోత్సాహం, అధిక ప్రమాద గర్భిణుల నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మాతృ మరణానికి సంబంధించిన కేసులను విడివిడిగా సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రామింగ్ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ఫ్యూచర్ సిటీ జాయింట్ కమిషనర్ చందనాదీప్తి ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదాల నివారణకు శాసీ్త్రయ విధానంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఫ్యూచర్ సిటీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(అడ్మిన్ అండ్ ట్రాఫిక్) జి.చందనా దీప్తి ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆమె సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది విధి నిర్వహణ, వ్యక్తిగత క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణను పరిశీలించారు. ముగ్గురు ట్రాఫిక్ సిబ్బంది ప్రశంసిస్తూ రివార్డులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) శివమ్ ఉపాధ్యాయ, మహేశ్వరం డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఎస్హెచ్ఓ జితేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: కుక్కను తప్పించబోయి రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. బ్రహ్మణపల్లి రాజీవ్గృహకల్పలో నివాసం ఉండే బానావత్ అమర్సింగ్ ఆటో నడుపుకుంటూ జీవణం సాగించేవాడు. ఈ నెల 23న ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. బ్రహ్మణపల్లి క్రాస్రోడ్డు వద్దకు రాగానే అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో తప్పించబోయాడు. ఆటోను ఎడమవైపు తిప్పడంతో కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో వివిధ అస్పత్రుల్లో చికిత్సపొందాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో అమర్సింగ్( 47) మృతి చెందినట్లు తెలిపారు. -
రెండు చోట్ల ఓటు నేరం
● ఎక్కడైనా ఒకే చోట నమోదు చేయించుకోవాలి ● బషీరాబాద్ తహసీల్దార్ షాహేదాబేగం బషీరాబాద్: ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టరిత్యా నేరమని, ప్రతి అర్హుడైన ఓటరు తన సాధారణ నివాసం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని బషీరాబాద్ తహసీల్దార్ షాహేదా బేగం సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అధికారులు, బీఎల్వోలు అప్రమత్తంగా పనిచేసి, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి నమోదులను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. బషీరాబాద్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ సంత్కుమార్తో కలిసి బీఎల్ఓలు, వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఏఎస్డీలతో కలిపి ఇప్పటివరకు 95.11 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి, వందశాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అలాగే ఏఎస్డీ(అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాంటి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా ధ్రువీకరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ప్రజలు కూడా సహకరించాలని, అర్హులైన ప్రతిఒక్కరూ తమ వివరాలను సరిచూసుకుని అవసరమైతే అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించాలన్నారు. అధికారులు, బీఎల్వోలు సమన్వయంతో మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
హామీలు అమలు చేయాలి
చేవెళ్ల: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. చేవెళ్ల మీదుగా సోమవారం వెళ్తున్న ఆయన కాసేపు ఆగి స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చేవెళ్ల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. యువతను మోసం చేసి ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రశ్నించే వారిని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ ఎం. విజయ్భాస్కర్రెడ్డి, నాయకులు విజయ్ ఆర్యక్షత్రియ, పి.ప్రభాకర్, దూత మల్లేశ్, శ్రీనివాస్రెడ్డి, యాదయ్య, ఆనంద్, నరేందర్రెడ్డి, శంకర్, సత్యం, అనంత్రెడ్డి, చందు, మాణిక్యరెడ్డి, శ్రీధర్రెడ్డి, భాస్కర్రెడ్డి, కృష్ణ, రాంప్రసాద్, బాలు తదితరులు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య
మర్రిగూడ(చింతపల్లి): ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ఖాజానవాబ్ (45) చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలోని వీటీ నగర్లో గల ది రెయిన్బో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ (కరస్పాండెంట్)గా వ్యవహరిస్తున్నాడు. ఆయన గతంలో నారాయణపేట జిల్లా కోస్గిలో పాఠశాల నడిపి నష్టపోయాడు. దీంతో అప్పులు అధికం కావడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాఠశాలలోని గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య షబానా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎడాపెడా కోతలు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురిటి నొప్పుల భారం భరించాల్సి వస్తుందనే భయం.. శుభ ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే ఆకాంక్ష.. సహజప్రసవంతో పోలిస్తే సిజేరియన్ ద్వారా ఎక్కువఫీజు వస్తుందనే ఆస్పత్రుల ఆశ వెరసి.. అమ్మకు కడుపు కోత మిగుల్చుతున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. లేబర్ రూమ్లో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుందని, నొప్పుల బాధను భరించలేరని చెప్పి పలువురు వైద్యులు సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో సహజ ప్రసవాల కంటే సిజేరియన్లే ఎక్కువ నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మెజారిటీ నమోదు సిజేరియన్లే.. జిల్లాలో 2024–25లో 51,362 ప్రసవాలు జరగ్గా వీటిలో 30 వేలకుపైగా సిజేరియన్లే. 2025–26లో 51,159 ప్రసవాలు నమోదైతే.. ఇందులో 35 వేలకుపైగా సిజేరియన్లే కావడం విశేషం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న సిజేరియన్లతో పోలిస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్నవి కాబోయే తల్లులను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. తాము బిడ్డకు జన్మనిచ్చామనే సంతోషం కంటే వైద్యులు తమ కడుపుపై పెట్టిన కత్తిగాట్లు మిగిల్చిన గాయాలే ఎక్కువ బాధపెడుతున్నట్లు పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆస్పత్రికి చేరుకోక ముందే అంబులెన్సుల్లో కొంత మంది ప్రసవిస్తుంటే.. మరికొంత మంది ఇప్పటికీ ఇంట్లోనే ప్రసవిస్తున్నారు. అధిక రక్తస్రావంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరి చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం తగ్గిపోతున్న సహజ ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు ఇలా.. సంవత్సరం సహజ సిజేరియన్లు 2020–21 6,031 13,362 2021–22 5,361 13,941 2022–23 5,094 13,052 2023–24 4,706 11,815 2024–25 5,944 12,292 2025–26 6,571 14,306 నిబంధనలు మీరితే చర్యలు ప్రసవాలపై దంపతులు, వారి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. శుభ ముహూర్తాలు వంటి వాటిని పక్కన పెట్టి నెలలు పూర్తిగా నిండిన తర్వాతే సహజ ప్రసవం ద్వారా పిల్లలకు జన్మనివ్వాలి. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రులపై చర్యలు తప్పవు. – డాక్టర్ స్వర్ణకుమారి, జిల్లా వైద్యాధికారి -
సైబర్ నేరాలపై దృష్టి పెట్టండి
షాద్నగర్: సైబర్ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఫ్యూచర్సిటీ కమిషనర్ తరుణ్జోషి సూచించారు. నందిగామ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణను క్రమబద్ధంగా నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు దోచేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పోలీసు అధికారులు విస్తృతంగా పర్యటించి ప్రజలను సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్య పరచాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ–సాక్షి వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తులో కచ్చితత్వాన్ని మెరుగుపర్చాలన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, ప్రజా సమస్యల పై తక్షణం స్పందించాలన్నారు. అనంతరం కన్హాశాంతి వనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో షాద్నగర్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికాభివృద్ధికి పాటుపడదాం
మహేశ్వరం: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు ప్లాస్టిక్ పార్కు, శ్రీనగర్ ఈ–సీటీ పారిశ్రామిక పార్కులోని పలు పరిశ్రమలను సోమవారం ఆయన సందర్శించారు. మాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్లను పరిశీలించి కంపెనీ ప్రతినిధులు, టీజీఐఐసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, శంషాబాద్ టీజీఐఐసీ జోనల్ మేనేజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుని, వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు శాఖల వారీగా స్పందించి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 136 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల అధికారులు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. సంచార పశు వైద్యశాలను వినియోగించుకోవాలి కందుకూరు: సంచార పశు వైద్యశాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని 1962 అంబులెన్స్ కార్యనిర్వహణ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జాన్ సాహెబ్ సూచించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పశువులకు అందించిన చికిత్సలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో వివిధ జబ్బులతో ఉన్న పశువులను ఆస్పత్రులకు తరలించలేని స్థితిలో ఉంటే ఒక్క ఫోన్ కాల్తో 1962 అంబులెన్స్ సిబ్బంది అక్కడికే వచ్చి వైద్యం అందిస్తారన్నారు. కార్యక్రమంలో అంబులెన్స్ జిల్లా కార్యనిర్వాహక అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సరూర్నగర్ సర్కిల్లో విద్యుత్ వ్యవస్థ బలోపేతం సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రజలకు నాణ్యమైన, ని రంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో టీజీఎస్పీడీసీఎల్ సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ తుర్కయంజాల్ సబ్స్టేషన్ లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ (పీటీఆర్)–1 సామ ర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచింది. సామర్థ్య పెంపు పనులను విజయవంతంగా పూర్తి చేసి సోమవారం సాయంత్రం పవర్ ట్రాన్స్ఫార్మర్ను విజయవంతంగా ఛార్జ్ చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ సామర్థ్య పెంపు చేపట్టారు. దీంతో సబ్స్టేషన్పై లోడ్ ఒత్తిడి తగ్గడంతో పాటు పీక్ డిమాండ్ సమయాల్లో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. ఈ సామర్థ్య పెంపుతో తుర్కయంజాల్ గ్రామం, బ్రాహ్మణపల్లి, ఖమ్మగూడం, శోభానగర్, రాగన్నగూడ ప్రాంతాల్లోని సుమారు 10,000 మంది విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఆయా ప్రాంతాల్లో మెరుగైన ఓల్టేజ్తో పాటు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అప్గ్రేడేషన్ దోహదపడుతుంది. సరూర్నగర్ ఎస్ఈ లక్ష్మీనారా యణ, ఇబ్రహీం పట్నం డీఈ నరేష్ కుమార్, లైన్స్ విభాగం డీఈ వేణుగోపాల్, ప్రొటక్షన్ విభాగం డీఈ హైమనందతో పాటు ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీకి అనువైన భవనం చూడండి సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం మెడికల్ కాలేజీ కోసం అనువైన భవనాన్ని పరిశీలించాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాలేజీ ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలోని ఓ అసంపూర్తి అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వైద్య విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై సోమవారం ‘సాక్షి’లో ‘కాలేజీ.. ఏ క్యాజీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి డీఎంఈ స్పందించారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, అనువైన భవనాన్ని ఎంపిక చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ను వెంటనే ప్రారంభించాలి
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను చేవెళ్లలో వెంటనే ప్రారంభించాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ పురన్దాస్కు బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పాఠశాల ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎందుకు ప్రారంభించలేకపోయారో అధికార పార్టీ నాయకులు చెప్పాలన్నారు. మంజూరు చేసిన పాఠశాలను సైతం ఏర్పాటు చేసేందుకు ఇన్నాళ్లుగా కాలయాపన చేయటం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చేవెళ్లకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి బీజేపీ పెద్దఎత్తున ందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణగౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి అశోక్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు తదితరులు ఉన్నారు. ఎంఈఓకు బీజేపీ నాయకుల వినతి -
మద్యం మత్తులో వీరంగం
చేవెళ్ల: పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ మద్యం మత్తులో ఆదివారం రాత్రి పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో హంగామా చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడాడు. రాత్రి తన స్నేహితుడికి ప్రమాదం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిబ్బంది వచ్చి చికిత్స ప్రారంభిస్తుండగానే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఫ్రీ అని ప్రచారం చేసూకుంటూ.. డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. తాను అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్నని, తనకే ఇక్కడ న్యాయం జరగడం లేదని వీడియో తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పిలిపించి విచారించారు. తాను ఓ దావత్కు వెళ్లానని, తన స్నేహితుడు ఆస్పత్రిలో ఉండటంతో అక్కడికి వెళ్లి మద్యం మత్తులో వైద్యులు, సిబ్బందిపై అమర్యాదగా మాట్లాడానని అంగీకరించారు. తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణ చెబుతున్నానని, తనకు ఎవరిపైనా దురుద్దేశం లేదని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేశారు. ఆసుపత్రిలో కౌన్సిలర్ హ ంగామా క్షమాపణ చెబుతూ కృష్ణానాయక్ మైకం వదిలిన తర్వాత క్షమాపణ చర్చనీయాంశమైన కౌన్సిలర్ వ్యవహారం -
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు
యాచారం: శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా కఠినంగా వ్యహరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. యాచారం పీఎస్ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, రోడ్డు నిబంధనలు అమలు చేసే తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిత్యం వాహనాల తనిఖీ చేపట్టాలని, హెల్మెట్ లేకుండా బైక్లు నడిపే వారికి జరిమానాలు విధించాలని అన్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. భూసేకరణ చేపట్టే గ్రామాల్లో అధికారులను సమన్వయం చేసుకుని రైతులతో శాంతియుతంగా మాట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐలు మధు, ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం డీసీపీ నారాయణరెడ్డి సాగర్ హైవే గునుగల్ గేట్ వద్ద ప్రజలతో మాట్లాడారు. సైబర్ నేరాలు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సేవలు ఎలా పొందాలి, కొత్త వ్యక్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తలను వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. -
షాద్నగర్ చౌరస్తా విస్తరణ షురూ
షాద్నగర్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న షాద్నగర్ చౌరస్తా విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆర్డీఓ సరిత, ఏసీపీ లక్ష్మీనారా యణ, మున్సిపల్ కమిషనర్ సునీత, తహసీల్దార్ నాగయ్య, సీఐ సీతారాం ఆధ్వర్యంలో సోమవారం విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పరిగిరోడ్డులో ఉన్న పోచమ్మ దేవా లయం నుంచి చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల ర్యాంపులు, కట్టడాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను ముందే తొలగించారు. ఏళ్లుగా నిరీక్షణ సుమారు 20 ఏళ్ల నుంచి షాద్నగర్ చౌరస్తాను విస్తరించాలనే డిమాండ్ ఉంది. చౌరస్తాలో తరచూ ట్రా ఫిక్ సమస్యలు ఎదురు కావడంతోపాటు ప్రమా దాల బారినపడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.రోడ్డు విస్తరించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగింది. పట్టణానికి చెందిన ఆర్.ఎన్.రాము అనే యువకుడు ఏడాది కాలంగా రోడ్డు విస్తరించాలని ఒంటరి పోరాటం చేస్తున్నాడు. షాద్నగర్ చౌరస్తా విస్తరించండి అంటూ టీషర్టుపై రాసుకొని నిత్యం ధరిస్తున్నాడు. ధర్నా, ఆందోళనలు, సంతకాల సేకరణ చేపట్టాడు. మున్సిపల్ ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సు లో చాలామంది రోడ్డు విస్తరించాలని పేపర్పై రాసి వేశారు. ఈ క్రమంలో చౌరస్తా విస్తరణ చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఇటీవల ఆర్డీఓ సరిత మున్సిపల్ కార్యాలయంలో సమావేశమై అందరి అభిప్రాయాలు సేకరించారు. దీంతో ఎట్టకేలకు విస్తరణ పనులు మొదలయ్యాయి. -
ఆ చట్టం శక్తివంతమైన ఆయుధం
మీర్పేట: సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం, సమాచార కమిషన్, ప్రజాసంఘాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్ అన్నారు. బాలాపూర్ చౌరస్తాలోని కార్యాలయంలో సోమవారం కమిటీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. ప్రజలకు సమాచారం వేగంగా, పారదర్శకంగా అందే విధంగా వ్యవస్థలో అవసరమైన మార్పులు తేవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రతి గ్రామానికి సమాచార హక్కు ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, కార్యదర్శి తోట శ్రీనివాస్, సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి ఎర్త్సెంటర్లో సోమవారం కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో విద్యాధికారులు, ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా దేశంలో, ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పర్యావరణ సామాజిక పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రపంచం ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో విద్యాధికారులు, ఉపాధ్యాయులు పర్యావరణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పాలసీ నిపుణుడు నర్సింహారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి, విద్యావేత్త ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పర్యావరణ శాస్త్రవేత్తలు సాయిభాస్కర్రెడ్డి, ఉమామహేశ్వర్రెడ్డి, వైఈఎల్పీ స్టేట్ కో ఆర్డినేటర్ యానాల వెంకట్రెడ్డి, సుస్థిర పుడమి ఎడిటర్ రమేశ్రావు, సీజీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అదుపు తప్పి లారీ బోల్తా
డ్రైవర్కు గాయాలు యాలాల: వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్కు ప్రాణాపాయం తప్పింది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గేటు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటుక లోడ్ ఖాళీ చేసిన ఓ లారీ తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళ్తుండగా మలుపు వద్ద బోల్తా పడింది. లారీ అద్దాలను పగలగొట్టిన స్థానికులు అందులో ఇరుక్కుపోయిన డ్రైవర్ నవీన్ను బయటకు తీసి తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తా పడిన ప్రదేశంలో పొలాల వద్ద పనిచేస్తున్న కూలీలు భోజనం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో వీరు కూర్చున్న ప్రదేశానికి సమీపంలోనే లారీ బోల్తా పడటంతో భయాందోళనకు గురయ్యారు. యాలాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యంత్రంలో నలిగి కార్మికుడి మృతి
షాద్నగర్: ఫరూక్నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని ఓ పరిశ్రమలో వలస కార్మికుడు ప్ర మాదం బారిన పడి మృతిచెందాడు. ఆదివారం రాత్రి 7గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా కంపెనీ నిర్వాహకులు విషయాన్ని బయటకు రానీయలేదు. బతుకుదెరువు కోసం వచ్చి.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజయ భద్ర (21)కు ఏడాదిన్నర క్రితం నూనిసింగ్తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ మూడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం షాద్నగర్కు వచ్చి, ఎలికట్ట శివారులోని చెట్టినాడ్ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఇటీవల సొంతూరుకు వెళ్లిన భద్ర.. డెలివరీ నిమిత్తం భార్యను అక్కడే వదిలేసి ఎలికట్టకు వచ్చాడు. పది రోజుల క్రితం పాప పుట్టిందని తెలియడంతో మరో రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. కేసు నమోదు.. కార్మికుడు భద్ర కంపెనీలో టైల్స్ పౌడర్ తయారు చేసే యంత్రం వద్ద పనిచేస్తాడు. ప్రమాదవశాత్తు యంత్రంలో పడిపోయిన భద్ర అందులోనే నలిగి చనిపోయాడు. మృతదేహాన్ని వెలికి తీసి మార్చురీకి తరలించారు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న మృతుడి పెద్దనాన్న కొడుకు దూమ బదరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిజయ భద్ర (ఫైల్)పది రోజుల బిడ్డతో నూనీ అనాథలైన తల్లీబిడ్డ.. భద్ర రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్న నూనీ తన బిడ్డను ఎప్పుడెప్పుడు అతనికి చూపిస్తానా అనే ఆత్రుతతో గడుపుతోంది. ఇంతలోనే పిడుగులాంటి వార్త ఆమె బతుకును దుర్భరం చేసింది. భద్ర ఇకలేడని, ప్రాణాలతో రాడని తెలియడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. పరిశ్రమ నిర్లక్ష్యం కారణంగానే భద్ర మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలికట్ట శివారులోని పరిశ్రమలో ప్రమాదం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికుల డిమాండ్ -
‘ఆ నాయకుడి తీరు సిగ్గుచేటు’
చేవెళ్ల: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. చేవెళ్లలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ అర్ధరాత్రి మద్యం తాగి, పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో హల్చల్ చేయడమే కాకుండా తానే స్వయంగా వీడియో తీసుకుంటూ వైద్యులు, యాజమాన్యాన్ని దూషించాడన్నారు. అంతటితో ఆగకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్ననే అహంకారంతోనే ఆయన ఇలా ప్రవర్తించాడని మండిపడ్డారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసి క్షేమాపణ చెబితే సరిపోదని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు పి.ప్రభాకర్, కె. ఆనంద్, విజయ్భాస్కర్రెడ్డి, డీఎం.చందు, అనంత్రెడ్డి, మల్లారెడ్డి, దండు సత్తి, భాస్కర్రెడ్డి, దూత మల్లేశ్, శ్రీధర్రెడ్డి, కుర్వ మల్లేశ్, క్రిష్ణ, నరేందర్రెడ్డి, బాలు, శంకరయ్య, రాంప్రసాద్, మానిక్యరెడ్డి తదితరులు ఉన్నారు. -
వరి తగ్గించండి..ఆరుతడి పెంచండి
షాద్నగర్రూరల్: రైతులు వరి పంటను తగ్గించి వర్షాభావ పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల రైతువేదికలో సోమవారం విత్తనమేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం అనుకున్న స్థాయిలో ఉండదనే విషయాన్ని రైతులు గ్రహించాలని తెలిపారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరిని తగ్గించుకొని ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించి తగిన పంటలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. ఎల్నినోను ఎదుర్కొనేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసి నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని పేర్కొన్నారు. ఫాం పాండ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీని అందజేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం కంది, మొక్కజొన్న అంతర పంటలుగా సాగు చేసిన రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్లు బాబునాయక్, అనురాధ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్అలీఖాన్ బాబర్, డైరెక్టర్లు సురేష్గౌడ్, వెంకట్రెడ్డి, భరత్, జిల్లా వ్యవసాయాధికారి సుజాత, ఏడీఏ రమాదేవి, ఏఓ నిషాంత్కుమార్, ఉద్యానశాఖ అధికారి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: తాటి చెట్లు నరికి గీత వృత్తికి దూరం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నాయకుడు గుండ్ల దానయ్యగౌడ్, కార్యదర్శి భాస్కర్గౌడ్ డిమాండ్ చేశారు. పోల్కంపల్లిలో తాటి చెట్లు నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ గుండ్ల కొండల్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంటి స్థలాలు చూపించండి.. యాచారం మండలంలోని చింతుల్లలో ఇచ్చిన సర్టిఫికెట్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలను చూపించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబరు 327లో ఐదెకరాల స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు. అప్పటి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే నర్సింహ వీటిని పంపిణీ చేసినా, ఇప్పటికీ పొజిషన్ చూపించలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్కు విజయ్, సామర్తి జగన్, వినోద్కుమార్, నర్సింహ, కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట గీత కార్మికుల ధర్నా -
కార్మికుల హక్కులను కాపాడుకుందాం
షాబాద్: తుక్కుగూడలో ఆగస్టు 2న జరిగే ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం మహాసభలకు సంబంధించి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చి న తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతభత్యాలు పెంచక పోవడంతో బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ మండలంలో నూతన పారిశ్రామిక వాడలు వస్తున్నాయని, వాటిలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాట్యుటీ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జైల్ భరోను జయప్రదం చేయండి
తుర్కయంజాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు డి.కిషన్ పిలుపునిచ్చారు. రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన కొన్ని రోజులుగా కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్ భరోలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎ. భాస్కర్ రెడ్డి, లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు కె.అరుణ్ కుమార్, నాయకులు ఐ.భాస్కర్, కె.వెంకటకృష్ణ, శ్రీనివాసులు, అండాలు తదితరులు పాల్గొన్నారు. తుక్కుగూడ: ఆషాఢ మాసం సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రజా భవన్లో ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. ఇందులో రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ఘటం పాల్గొంది. ఈ ఘటానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీగడ కాశీనాథ్ ప్రజా భవన్లో అమ్మవారి ఘటాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్: భారత అంతరిక్ష రంగంలో మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ అయిన విక్రమ్ –1 విజయయాత్రలో షాద్నగర్కు చెందిన యువ శాస్త్రవేత్త నిఖిల్ మద్దూరి కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఆయన షాద్నగర్ విచ్చేసిన సందర్భంగా జాతీయ బీసీ సేన నాయకులు ఘనంగా సత్కరించారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన బృందంలో యువ శాస్త్రవేత్త నిఖిల్ ఉండటం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్, నాయకులు ప్రకాష్, ప్యాట జయ, శ్రీకాంత్, గిరిబాబు, సింగారం శ్రీనివాస్, భువనచంద్ర తదితరులు ఉన్నారు. ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. పోటీలను మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్లో 32 టీమ్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతిని దేవునిపడకల్, రెండో బహుమతిని పడకల్, మూడో బహుమతిని పాపిరెడ్డిగూడ, నాలుగో బహుమతిని ఆకుతోటపల్లి టీమ్ గెలుచుకున్నాయి. విజేతలకు సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్ పులిజాల మహేశ్, స్థానిక నాయకులు కుమ్మరి శంకర్, శంకర్ నాయక్, రవి, తిరుపతి పాల్గొన్నారు. -
చెత్తశుద్ధితో సిరుల పంట
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంతో పాటు ఇతర పట్టణాల్లోనూ చెత్త నిర్వహణ పెను సవాల్గా మారుతోంది. దశాబ్దాల క్రితం నాటి డంపింగ్ యార్డులు నిండిపోతున్నాయి. కొత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఇది ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. ఈ క్రమంలోనే చెత్త నుంచి సిరులు కురిపించే నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతోంది. వంటింటి వ్యర్థాల నుంచి విద్యుత్తు, బయోకంపోస్ట్ ఎరువు, బయో సీఎన్జీ తయారీ కేంద్రాల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో 20 వేల టన్నుల కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తికి మార్గం సుగమం కానుందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా 12 ప్లాంట్లు.. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో అత్యధిక భాగం గ్రేటర్ పరిధిలోనే ఉంటోంది. రోజుకు సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ఇందులో 1,587 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, 31 టన్నులు బయోమెడి కల్ వ్యర్థాలు, సుమారు 80 శాతం తడి చెత్త ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సీబీజీ ఉత్పత్తి ప్లాంట్ నడుస్తోంది. రోజుకు 5 టన్నుల వరకు సీబీజీ ఉత్పత్తి అవుతోంది. ఇందులో రెండు టన్నులకు పైగా భాగ్యనగర్ గ్యాస్ ఏజన్సీకి విక్రయిస్తుండగా.. అక్కడి నుంచి గృహావసరాలకు సరఫరా చేస్తు న్నారు. మిగతాది నగరంలో చెత్త సేకరించే వాహనాలకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇది విజయ వంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 12ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన సంస్థలు సీబీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. సీబీజీతో రూ.218 కోట్ల ఆదాయం రాష్ట్రంలో కొత్తగా మరో 12 సీబీజీ యూనిట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలు దరఖాస్తు చేసుకున్నా యని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 20 వేల టన్నుల కంప్రెస్డ్ బయో గ్యాస్ అందుబాటులోకి రానుందని అంచనా. ప్రస్తుతం సీఎన్జీ కేజీ రూ.109 ఉంది. అంటే చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తితో సుమారు రూ.218 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఇది అందుబాటులోకి వస్తే నిత్యం వాహన రంగాన్ని వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా సీబీజీని వినియోగించుకోవచ్చు. ఫలితంగా మెరుగైన మైలేజీతో పాటు, నగరంలో వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుందని పీసీబీ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉన్న 48 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లతో చెత్త సమస్య తీరుతుందని, కొత్త స్థలాలను వెతకాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ అంచనా. వ్యర్థాల నుంచి బయో సీఎన్జీ తయారీకి ముందుకొస్తున్న సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరల మోతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రాష్ట్రంలో 12 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లకు అనుమతులు ఏటా 20 వేల టన్నుల సీబీజీ ఉత్పత్తి సామర్థ్యం గ్రేటర్ పరిధిలో నిత్యం 12 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి -
ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పోస్టర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం: ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పేరుతో ముద్రించిన వాల్ పోస్టర్ను బీజేవైఎం నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బూర అభినయ్గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వనవాడ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను బకాయి పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ఫీజుల బకాయి – బీజేపీ లడాయి కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.కార్తీక్గౌడ్, కంబాలపల్లి శశిధర్రెడ్డి, శాంతి, వినయ్, భారత్, బీరప్ప, వంగ సంజీవరెడ్డి, విశాల్, సాయితేజ, సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులు కల్పించాలి
చేవెళ్ల: లేబర్ అడ్డాల వద్ద ఉండే కార్మికులకోసం మౌలిక వసతులు కల్పించాలని ఏఐటీయుసీ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి అన్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగ కార్మికుల నాలుగో మహాసభలను మండల అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో రూ.కోట్ల నిధులు ఉన్నాయని, వాటిని కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు. కార్మికుంతా లేబర్ కార్డులు తీసుకొని సంక్షేమ ఫలాలు పొందాలన్నారు. లేబర్ అడ్డాల వద్ద మొబైల్ టాయిలెట్లు, రూ.ఐదుకు భోజనం వసతులు కల్పించాలన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత కార్మిక వర్గంపై దాడులు పెరిగాయని ఆరోపించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని అన్నారు. వికసిత్ భారత్ అంటే ధరల మీద ధరలు పెంచడమేనా అని ప్రశ్నించారు. కార్మికులంతా సంఘటితంగా హక్కులకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు మక్బుల్, శ్రీను, ఆంజనేయులు, నర్సింలు, యాదయ్య, లక్ష్మి, లీన, లలితమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీ.. ఏ క్యాజీ!
పాముల కాలం.. వానాకాలంలో విష సర్పాల సంచారం ఎక్కువ. పొలాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.సాక్షి, రంగారెడ్డిజిల్లా: నాణ్యమైన వైద్య విద్య సంగతేమో కానీ.. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేపోతున్నారు మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులు. వైద్య విద్య ఇక్కడ మిథ్యలా మారింది. నగరానికి సమీపంలో ఉందని, మౌలిక సదుపాయాలకు కొదవ ఉండదని భావించి.. అడ్మిషన్ పొందిన మెజార్టీ విద్యార్థులు ఆ తర్వాత తాము ఇక్కడెందుకు వచ్చిపడ్డామా అని ఆందోళనకు గురవుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ కాలేజీని అనుబంధ ఆస్పత్రి సమీపంలోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం కాలేజీ సందర్శనకు వచ్చిన అదనపు కలెక్టర్ కిరణ్మయికి విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఇదే అంశంపై మొరపెట్టుకున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ భవనాన్ని చూసి ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్దె భవనం.. అరకొర సదుపాయాలు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం జిల్లాకు మహేశ్వరం మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. మీర్ఖాన్పేటలో ఏర్పాటు చేయాలని భావించి ఆ మేరకు అక్కడ స్థలాన్ని కేటాయించింది. 2023లో శంకుస్థాపన చేసింది. తీరా ప్రభుత్వం మారిపోవడంతో కాలేజీ.. ఎంపిక ప్రదేశం కూడా మారింది. సొంత క్యాంపస్ సహా కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వ కాలేజీ కావడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. 2024లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. 50 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఈ కాలేజీలో ఇప్పటికే రెండు బ్యాచ్లు కొనసాగుతున్నాయి. 2026–27లో మూడో బ్యాచ్ అడుగుపెట్టబోతోంది. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో అధికారులు మంగళ్పల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.16 లక్షలు చెల్లిస్తున్నారు. విశాలమైన క్యాంపస్ సహా ఐదు అంతస్తుల భవనం ఉన్నట్లు ఎంసీఐకి చూపించారు. తీరా అడ్మిషన్లు పూర్తై..తరగతులు మొదలైన తర్వాత అసలు విషయం బయటపడింది. భవన యాజమాన్యం, అప్పటి అధికారులు కుమ్మకై ్క మార్కెట్లో లేని అద్దె నిర్ణయించారు. అద్దె పెంపు విషయంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఆర్థికశాఖ నుంచి కాలేజీకి షోకాజ్ నోటీసులు అందినట్లు తెలిసింది. ఈనెల 31తో భవనం అద్దె గడువు ముగియనుంది. అద్దెను 20 శాతం పెంచాల్సిందిగా భవన యజమాని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఐదంతస్తుల ఈ భవనంలో రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తరగతి గదుల కిటికీలకు గ్లాసులు లేవు. చిన్నపాటి వర్షానికే గదుల్లోకి నీరు చేరుతోంది. చలిగాలులకు విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, కాలేజీకి కరెంట్ కనెక్షన్, ఫ్యాకల్టీ గదుల్లో ఫ్యాన్లు లేవు. అయినా నెలకు రూ.ఐదు లక్షల వరకు కరెంట్ బిల్లుల చెల్లింపునకు కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం 60 శాతం మంది విద్యార్థులకు అదే క్యాంపస్లో వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇరుకై న ప్రైవేటు హాస్టల్ గదుల్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉండాల్సి వస్తోంది. అంతేకాదు కాలేజీకి అనుబంధంగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేశారు. నిబంధనల మేరకు పది కిలోమీటర్లలోపే ఆస్పత్రి ఉండాలి. ఇక్కడ మాత్రం 18 కిలోమీటర్ల దూరం ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుబంధ ఆస్పత్రిలో పని చేసి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసు రూమ్లో ఉండాల్సి వస్తోంది. ఇటు నుంచి అటు..అటు నుంచి ఇటు రాకపోకలకే రెండు గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ రద్దీలో కాలేజీ నుంచి ఆస్పత్రికి వచ్చి వెళ్లడం విద్యార్థులకు ప్రహసనంగా మారింది. దీనిపై కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అద్దె భవనంలో మహేశ్వరం మెడికల్ కళాశాల కనీస మౌలిక సదుపాయాలు కరువు అయినప్పటికీ భవనానికి నెలకు రూ.16 లక్షల అద్దె కాలేజీ ఒకచోట.. అనుబంధ ఆస్పత్రి మరోచోట అటు, ఇటు తిరగలేక విద్యార్థుల అవస్థలు ఎంసీఐ నిబంధనలు బేఖాతర్ -
అవకాశాలు ఓపెన్
● చదువు మధ్యలో ఆపేసిన వారికి వరం ● ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు ● వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు కేశంపేట: అనివార్య కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన యువతీయువకులకు ఓపెన్ స్కూల్ వరంగా మారింది. ఓపెన్లో విద్యలో చదువు కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరినవారిలో ఎందరో ఉన్నారు. చదువుకోవాలనే ఆశ ఉన్నా పాఠశాలలకు వెళ్లలేని వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యను అందిస్తోంది. పనులు చేసుకుంటూనే సెలవు దినాల్లో ఓపెన్ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, కొన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలన్నా పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. దీంతో చాలామంది ఓపెన్ విద్య వైపు ఆసక్తి కనబురుస్తున్నారు. ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ద్వారా అపరాధ రుసుంతో ఆగస్టు 29 వరకు అడ్మిషన్లు స్వీకరించనుంది. జిల్లావ్యాప్తంగా 68 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 68 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పహాడీషరీఫ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, హఫీజ్పేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ మీడియంలో అడ్మిషన్లు పొంది చదువుకునేందుకు సైతం అవకాశం ఉంది. వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో.. వికారాబాద్ జిల్లాలో 25 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు, మేడ్చల్ జిల్లాలో 34 సెంటర్లు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం రూ.లక్షల్లో నిధులు వెచ్చిస్తూ తోడ్పాటు అందిస్తోంది. అడ్మిషన్లు ఇలా.. ● చదువు మధ్యలో ఆపేసినవారు, గృహిణులు, వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు ఓపెన్ విద్యలో అడ్మిషన్లు పొందొచ్చు. ● ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సమర్పించాలి. ● అడ్మిషన్లు పొందిన వారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ● మరింత సమాచారం కోసం www.telanganaopenschool.org వెబ్సైట్లో సంప్రదించాలి. పదో తరగతి ప్రవేశాలకు.. ● ఆగస్టు 31 నాటికి 14 ఏళ్ల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● గతంలో రెగ్యులర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు ఓపెన్లో రెండు సజ్జెక్టుల మార్కులను బదలాయించుకోవచ్చు. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు రూ.1,150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,250 చెల్లించాలి. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యా పుస్తకాలు అందిస్తుంది. ● అడ్మిషన్ తీసుకున్న ఐదేళ్ల వరకు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు.. ● పదో తరగతి పాసై, ఒక్క ఏడాది గ్యాప్ ఉంటేనే అర్హులు. ● ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలకు రూ.1,500 స్కూల్ ఫీజు ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,850 చెల్లించాలి. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యాపుస్తకాలు అందిస్తుంది. అవసరమైన పత్రాలు ● ఇటీవల తీసిన పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు ● ఇంటర్మీడియెట్ చదివేవారికి ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్ ● పుట్టిన తేదీ సర్టిఫికెట్ . ఆగస్టు వరకు అవకాశం పదో తరగతి, ఇంటర్మీడియెట్లో ఆగస్టు 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ పొందొచ్చు. ప్రభుత్వం నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలలో చదివే విద్యార్థుల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వివరాలు, మహిళా సంఘాల నుంచి నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తున్నారు. పదో తరగతి వరకు చదవలేని వారు, చదువు మధ్యలో ఆపిన వారు, చదవడం, రాయడం వచ్చిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేర్పించేందుకు ప్రతి మండలంలో అధికారులు అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశాం. చదువు మధ్యలో ఆపివేసిన వారు, చదువుపై ఇష్టం ఉన్నవారు కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. – సత్యనారాయణ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కోఆర్డినేటర్ -
సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం
కొత్తూరు: సోషల్మీడియా వినియోగంపై విద్యార్థులు నియంత్రణ పాటించాలని షాద్నగర్ డీసీపీ శిరీష సూచించారు. పట్టణంలోని కేజీబీవీ హాస్టల్, కొత్తూరు పోలీస్స్టేషన్ను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో చదువుకున్న వారికే అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని గ్రహించి చదువుపై దృష్టి సారించాలని అన్నారు. క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా అతి వినియోగంతో చెడు వ్యసనాలకు బానిసలుగా మారే అవకాశం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో వచ్చే సమస్యలను వివరించారు. సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం స్టేషన్లో ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కేసుల ఛేదనలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ నర్సయ్య, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
మెడికల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు
ఇబ్రహీంపట్నం రూరల్: మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. మంగళ్పల్లిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కళాశాలను శనివారం ఆమె తనిఖీ చేశారు. భవనంలో వసతులు, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖారున కళాశాల అగ్రిమెంట్ ముగుస్తున్నందున ఇదే కళాశాలలో కొనసాగించాలా లేక నగరంలోని వనస్థలిపురం సమీపంలో ఇతర వేరే భవనాలు చూడాలా అని చర్చించారు. సొంత భవనం నిర్మాణం జరిగే వరకు సర్దుబాటు కాక తప్పదన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి -
భవనం.. శిథిలం
ఆమనగల్లు: పట్టణంలోని బస్టాండ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 91 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 6 నుంచి 10 వరకు తరగతులు కొనసాగుతుండగా 9 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో తరగతులు నిర్వహిస్తుండడం.. సౌకర్యాలు లేకపోవడంతో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. వర్షాకాలంలో పైకప్పు లీకేజీ అవుతూ తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. భవనం శిథిలం కావడంతో పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. రెండేళ్లక్రితం పైకప్పు పెచ్చులూడి ఓ విద్యార్థి గాయపడ్డాడు. దాతల సహకారంతో పాఠశాల ఆవరణలో రేకుల షెడ్డు నిర్మించి కొన్ని తరగతులు నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నా సరైన నిర్వహణ లేదు. రోజు విడిచి రోజు నల్లా రావడంతో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. వర్షం వస్తే గదుల్లోకి నీరు ప్రస్తుత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులూడుతున్నాయి. వర్షం వస్తే గదుల్లోకి నీరు చేరుతోంది. నూతన భవనం నిర్మించాలి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి. – వైష్ణవి, పదో తరగతి విద్యార్థిని -
నెర్రెలు బారి.. శిథిలంగా మారి
షాద్నగర్రూరల్: పట్టణంలోని అంబేడ్కర్కానీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యనభ్యసిస్తున్నారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గోడలు పూర్తిగా నాని నెర్రెలు విడుస్తున్నాయి. వర్షపు నీరు లోపలికి వస్తుండటంతో పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గోడలు ఎప్పుడు కూలుతాయోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారాయి. పాఠశాల పక్కనే ఉన్న ప్రభుత్వ వసతిగృహం శిథిలావస్థకు చేరడంతో మూతపడింది. చెట్లు పెరిగి, చెత్తచెదారం చేరడంతో పాఠశాల ఆవరణలోకి విషపురుగులు వస్తున్నాయి. పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. -
అ= అధ్వానం ఆ=ఆగమాగం
సమస్యల ఏలుబడి! కందుకూరు: కందుకూరు బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. సరిపడా గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో మొత్తం 110 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో ఆరు గదులు ఉండగా అందులో ఆఫీస్, స్టాఫ్, ల్యాబ్ కోసం ఓక్కో గదిని కేటాయించారు. మిగతా మూడు గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో మన ఊరు –మన బడి పథకం కింద రెండు గదుల నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పిల్లర్ల వరకే నిర్మాణం పూర్తి చేయగా, ఆ లోపు ప్రభుత్వం మారడంతో నిధులు విడుదల కాక వదిలేశాడు. దాని పక్కనే అంత కంటే ముందే బాలుర, బాలికల పాఠశాలలకు కలిపి సైన్స్ ల్యాబ్ నిర్మాణం పక్కపక్కనే చేపట్టారు. అది కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది. పెచ్చులూడిన భవనం పైకప్పు -
వరండాలోనే విద్యా బోధన
ఇబ్రహీంపట్నం: పాత బస్టాండ్ సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదు గదుల్లో ఒకటి ప్రధానోపాధ్యాయుడి కార్యాలయ గది, మరొకటి సైన్స్ ల్యాబ్కు ఉపయోగిస్తున్నారు. 200 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఎనిమిది తరగతులకు మూడు గదులు మాత్రమే ఉన్నాయి. వరండాలో రెండు క్లాసులు, దాత సహకారంతో వేసిన రేకుల షెడ్లో మరో రెండు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆట స్థలం లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు. శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు, వంటగది అవసరానికి సరిపడడం లేదు. ఇళ్ల నుంచే విద్యార్థులు తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఆరు, ఏడు తరగతులకు నలుగురు టీచర్లు కావాల్సి ఉండగా ఇద్దరే పనిచేస్తున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గదుల కొరత ఉంది. 120 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఆరుబయట విద్యాబోధన, మధ్యాహ్న భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. వంట గదినే ఒక పార్టుగా చేసి తరగతి గది నిర్వహిస్తున్నారు. సౌకర్యాలు లేక అవస్థలు విద్యార్థులు కూర్చునేందుకు సరిపడా గదులు లేవు. ఆటలాడేందుకు స్థలం లేదు. అవసరాలకు తగ్గట్టు మూత్రాశాలలు, మరుగుదొడ్లు లేవు. విద్యాబోధన బాగున్నప్పటికీ సరైస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నాం. – జె.తరుణి, ఐదో తరగతి విద్యార్థిని -
అంతిమ నివాళి
షాబాద్: ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిల తల్లి పట్నం రుక్కమ్మ అంత్యక్రియలను ఆమె స్వగ్రామమైన గొల్లూరుగూడలో శనివారం పూర్తిచేశారు. మాజీ మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్, బైరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్కుమార్రెడ్డి, దామోదర్రెడ్డి, ఏవీఎన్రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, వీర్లపల్లి శంకర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, మహేశ్రెడ్డి, మెతుకు ఆనంద్, కేఎస్ రత్నం, జైపాల్యాదవ్, కేఎల్లార్, ప్రతాప్రెడ్డి, అల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, సుధీర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగేందర్గౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, నాయకులు కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి తదితరులు రుక్కమ్మ మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
కబ్జా భూమిని రీ సర్వే చేయించండి
యాచారం: సర్వేనంబర్ 127లో అసైన్డ్ రైతుల కబ్జా భూమిని రీ సర్వే చేయించాలని, కబ్జాలోని రైతులకు పరిహారం చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మొండిగౌరెల్లి రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సర్పంచ్ కోలన్ రమాదేవి ఆధ్వర్యంలో 127 సర్వేనంబర్తోపాటు 19, 68 సర్వేనంబర్ల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టాదారు, పాసుపుస్తకాల్లో కంటే తక్కువ ఎకరాలకు పరిహారం అందజేసేలా జాబితా ప్రకటించారని పేర్కొన్నారు. రీ సర్వే చేయించాలని తహసిల్దార్ను కోరితే సమాధానం ఇవ్వకపోగా వెళ్లిపొండని దురుసుగా మాట్లాడారని మండిపడ్డారు. కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. వ్యక్తిగత పని మీద వచ్చిన రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులతో మాట్లాడినా వినిపించుకోలేదు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు కల్పించుకుని వారిని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. సర్వేనంబర్ 127ను రీ సర్వే చేయిస్తానని, కబ్జా రైతులకు పరిహారం చెల్లింపై త్వరలో కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశం ఏర్పాటు చేయిస్తానని ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా -
పోరాటం ఆపొద్దు
ఇబ్రహీంపట్నం: దండుమైలారంలో ఓ దొర కబంధహస్తాల్లో ఉన్న గ్రామకంఠం భూమిని దక్కించుకునేంత వరకు పోరాటం ఆపొద్దని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. గ్రామకంఠం భూమి సాధన కోసం సర్పంచ్ ఈదులకంటి నరేష్గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షను శనివారం ఆయన ప్రారంభించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదెకరాల భూమి ఎవరిదో తేలేవరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అన్నారు. పది ఎకరాలు సాధిస్తే 700 మంది పేదలకు 70 గజాల చొప్పున ఇంటి స్థలం దక్కుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూస్వామి చెరలో ఉన్న భూమిని విడిపించి, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజ్కమల్, రాష్ట్ర కమిటీ సభ్యుడు తులసిగారి రవీందర్, ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి,రాకేష్, పీఏసీఎస్ చైర్మన్ ఎం.అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బడి.. పెచ్చులూడి
కడ్తాల్: మండల పరిధిలోని రావిచేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలో 6 నుంచి 10 తరగతులు కొనసాగుతు న్నాయి. మొత్తం 121 మంది వరకు బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. 6,7 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు రేకులకు రంధ్రాలు పడి వర్షానికి ఉరుస్తోంది. ఎప్పుడు ఏం అవుతుందోనని విద్యార్థులు భయంగా గడుపుతున్నారు. ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన భవనం సైతం పెచ్చూలూడి పడుతోంది. పలు తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలలో గతంలో నిర్మించిన మూత్రశాలలు అసంపూర్తిగా వదిలివేయడంతో ఆరుబయటకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు పాఠశాల ఆవరణలో నాలుగు రేకులతో తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశారు. -
పోరాటం ఆపొద్దు గ్రామకంఠం భూమిని దక్కించుకునే దాకా పోరాటం ఆపొద్దని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ పిలుపునిచ్చారు.
ఇబ్రహీంపట్నం రూరల్: మంగళ్పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 78 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉండగా, ఇటీవలే మరో ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్ మీద పంపించారు. అటెండర్, స్వీపర్ అసలే లేరు. నాలుగు సబ్జెక్టులకు ముగ్గురు టీచర్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తరగతి గదులు మూడు మాత్రమే ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడిపోతున్నాయి. విద్యార్థులకు ఆరుబయటే పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. కిచెన్ షెడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరి వర్షం పడితే కురుస్తోంది. చేవెళ్ల: చేవెళ్లలోని ప్రాథమిక బాలికల పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులులేవు. ఐదు గదుల్లో ఒకటి ఆఫీస్ రూమ్ మిగిలిన నాలుగింటిలో నాలుగు తరగతుల గదులకు పోగా ప్రీప్రైమరీ, ఒకటో తరగతులకు గదులు లేక వరండాలోనే పాఠాలు చెబుతున్నారు. సరిపడా గదులు లేక ఆఫీస్ రూమ్నే స్టోర్రూమ్గా వాడుతున్నారు. విద్యార్థులకోసం వచ్చిన కంప్యూటర్లు ఆఫీస్ రూమ్లోనే పడి ఉన్నాయి. చేవెళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరి తరగతి గదులు పెచ్చులూడిపోతున్నాయి. ప్రమాదకరంగా మారిన భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాములు తిరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.కొత్తూరు: మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 160 మంది విద్యార్థులు చదువుతుండగా మూడు గదులు మాత్రమే ఉన్నాయి. ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఇద్దరు డిప్యూటేషన్పై ఉన్నారు. పాఠశాల పక్కనే రైలు పట్టాలు ఉండడంతో చుట్టు ప్రహరీ లేక ప్రమాదభరితంగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేవు. ఖాజీగూడతండాలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఒకే తరగతి గదిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రెండు చోట్ల క్రీడామైదానాలు లేక ఆటలకు దూరంగా ఉంటున్నారు. -
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు జిల్లాలోని మూడు చోట్ల పంజా విసిరారు. కేశంపేట మండలం సంతాపూర్, కడ్తాల్ మండలం మక్తమాధారం సమీపంలో ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు పుస్తెల తాళ్లు లాక్కెళ్లారు. కందుకూరు మండలం సాయిరెడ్డిగూడెంలో బాధిత మహిళ అప్రమత్తతతో చోరీ తప్పింది. కేశంపేట: మనవరాలితో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఈ ఘటన శనివారం ఉదయం సంతాపూర్లో కలకలం రేపింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సోమరాజు బాలమ్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇటీవల పనులకు వెళ్లిన డబ్బులు తెచ్చుకునేందుకు తన మనవరాలు భవాని (15)తో కలిసి ఇంటి నుంచి గ్రామంలోకి వెళ్తుండగా.. శ్మశానవాటిక సమీపంలోకి చేరుకోగానే నంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు బాలమ్మ ముందు వాహనం నిలిపారు. వెనక కూర్చున్న వ్యక్తి కొల్లాపూర్ ఎలా వెళ్లాలి..? అని అడుగుతూనే.. రెప్పపాటులో బాలమ్మ మెడలోని బంగారు పుస్తెలతాడును లాగేశాడు. ఊహించని ఈపరిణామంతో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు పెద్దగా అరవడంతో దుండగులు మక్తమాధారం వైపు పారిపోయారు. నిందితులిద్దరూ నలుపురంగు మాస్కులు ధరించారని, వీరి వయస్సు సుమారు 40 సంవత్సరాల లోపు ఉంటుందని బాలమ్మ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ రాజ్కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ గ్రామానికి వెళ్లి, బాధితురాలితో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. సాయిరెడ్డిగూడెంలో.. యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు మండల పరిధిలోని సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిందం మంజుల శనివారం ఉదయం కాలినడకన ఇంటి నుంచి పొలానికి వెళ్తోంది. మార్గమధ్యలో మోటార్ సైకిల్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మంజుల మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించడానికి ప్రయత్నించగా, వెంటనే అప్రమత్తమైన మంజుల గట్టిగా కేకలు వేసింది. ఈ సమయంలో రోడ్డు పైనుంచి ఆటో రావడం, సమీపంలోని రైతులు రావడాన్ని గమనించిన దుండగుడు ముచ్చర్ల వైపు పారిపోయాడు. ఈ ఘటనలతో గ్రామీణ మహిళలు, పొలాల వద్దకు వెళ్తున్న కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రెండు చోట్ల మహిళల మెడలోంచి పుస్తెల తాళ్ల చోరీ మరోచోట దోపిడీకి యత్నించి విఫలం రోడ్డుపై వెళ్తున్న మహిళలే లక్ష్యంగా దాడులు ఆందోళనలో గ్రామీణ ప్రజలు -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
ఆమనగల్లు: సైబర్ నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకిరెడ్డి అన్నారు. పట్టణంలోని పోలీసు స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, రికార్డులు, దర్యాప్తు పురోగతి, విజిబుల్ పోలీసింగ్, స్టేషన్ నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రేవ్ కేసుల ఛేదనకు ప్రాధాన్యత ఇవ్వాలని, విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ప్రాణాలుపోతున్నా పట్టించుకోరా..
● చిన్నారి సహస్ర మృతిపై విద్యార్థి సంఘాల ఆందోళన ● విద్యాశాఖ, రవాణా శాఖ అధికారుల పనితీరుపై విమర్శలు కొందుర్గు: కాసులకు కక్కుర్తి పడుతున్న పలు ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు విద్యార్థులను తరలించేందుకు కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తున్నాయి. అరకొర వేతనాలు ఇస్తూ వచ్చీరాని డ్రైవర్లకు స్టీరింగ్ అప్పగిస్తున్నాయి. ఫిట్నెస్ లేని వాహనాలను నడపడంతో పాటు కనీసం హెల్పర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అమాయక చిన్నారులు గాయాలపాలవడంతో పాటు పలు సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతలోనే దారుణం.. కాస్లాబాద్ గ్రామానికి చెందిన మనీష, కృష్ణయ్య దంపతుల నాలుగేళ్ల కూతురు సహస్ర శుక్రవారం పాఠశాల బస్కింద పడి చనిపోయిన ఘటన బాధిత తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. ఇరవై రోజుల క్రితమే చిన్నారిని జిల్లేడ్చౌదరిగూడలోని అభ్యాస్ విద్యాపీఠంలో చేర్పించారు. ఉదయం సహస్రను స్కూల్కు పంపించిన అనంతరం తల్లిదండ్రులు పనులకు వెళ్తారు. మరో కూతురును కృష్ణయ్య తల్లి చూసుకుంటుంది. సాయంత్రం బస్సు వద్దకు వెళ్లి సహస్రను ఇంటికి తీసుకువస్తుంది. శుక్రవారం సహస్ర కోసం వేచిచూస్తుండగా చిన్నపాప నీళ్లు కావాలని ఏడ్వడంతో అప్పటివరకూ వేచి ఉన్న నాయనమ్మ అప్పుడే ఇంటికి వెళ్లింది. ఆమె తిరిగివచ్చేలోపే దారుణం జరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లేడ్చౌదరిగూడలో ఆందోళన నిర్వహించారు. కాలం చెల్లిన బస్సే.. అభ్యాస్ విద్యా పీఠంలో 1నుంచి 8వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిని వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చేందుకు మూడు బస్సు లను వినియోగిస్తున్నారు. ఇందులో ఓ బస్సును ఇటీవలే కొనుగోలు చేశారని ఎంవీఐ స్వప్న తెలిపారు. మిగిలిన రెండు బస్సుల కాలపరిమితి ముగిసి ఉండవచ్చన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు కాలం చెల్లినదేనని ధ్రువీకరించారు. -
తోటికూలీలతో వెళ్తుండగా..
కడ్తాల్: తోటి కూలీలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. మక్తమాధారం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.. సీఐ సైదిరెడ్డి, బాధితురాలి కథనం ప్రకారం.. న్యామతాపూర్ గ్రామానికి చెందిన జాల మణెమ్మ తోటి మహిళా కూలీలతో కలిసి పనికోసం మక్తమాధారం వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో షాద్నగర్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు మాస్క్ ధరించిన దుండగులు మణెమ్మ మెడలోంచి పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. నంబర్ లేని బైక్పై వచ్చిన ముసుగు దొంగల చర్యతో మిగిలిన మహిళలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అంతా అరుస్తుండగానే మక్తమాధారం వైపు పారిపోయారు. సమాచారం అందుకున్న సీఐ సైదిరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి, వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
మాల్ జీపీని సందర్శించిన డీపీఓ
యాచారం: మండల పరిధిలోని మాల్ పంచాయతీని శనివారం జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ సందర్శించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పంచాయతీ అధికారి సాధన, మండల పంచాయతీ అధికారి శ్రీలత, పంచాయతీ రాజ్ ఏఈఈ సూర్యవంశీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ సుభాష్తో కలిసి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఆత్మనిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డు కింద వచ్చిన రూ. కోటి నిధులు ఏ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారో ఆరా తీశారు. పలు అభివృద్ధి పనుల నాణ్యత, కొలతలు, రికార్డుల పరిశీలన చేశారు. నిధుల ఖర్చు, రికార్డుల్లో తేడాలు ఉండడం గమనించారు. పూర్తి స్థాయి పరిశీలన కోసం రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నర్సింహ షాద్నగర్: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ గ్రామానికి చెందిన విఠ్యాల నర్సింహ ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎస్సీ మోర్చా కమిటీలు ఏర్పాటు చేసి, అందరినీ సంఘటితం చేస్తానని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించండి శంకర్పల్లి: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ సూచించారు. మోకిల పోలీస్ స్టేషన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. స్టేషన్కి వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తనిఖీల సమయంలో సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు సురేశ్, సాయికృష్ణ తదితరులు ఉన్నారు. షాబాద్: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా అదనపు న్యాయమూర్తి బి. శ్రీనివాసులు పేర్కొన్నారు. మండల పరిధిలోని చందనవెల్లిలో సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి ఆధ్వర్యంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాలు, వాటి ద్వారా జరిగే న్యాయం గురించి వివరించారు. క్షణికావేశాలకు వెళ్లి అనర్థాలు కొని తెచ్చుకోవద్దని, కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలని సూచించారు. సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కె.దశరథ రామయ్య వివిధ చట్టాల గురించి క్షుణ్ణంగా వివరించారు. పలువురు న్యాయవాదులు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ నర్సింహారావు, ఉపసర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ అల్లర్ల వెనుక విదేశీ కుట్ర
● కాక్రోచ్ జనతా పార్టీకి నక్సలైట్ల అండ ● దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాహుల్ ప్రయత్నం ● రేవంత్రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుషాద్నగర్: దేశంలో అశాంతిని సృష్టించి, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ శక్తులు కుట్రలు పన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. షాద్నగర్ శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. కొంతమంది సినిమా వాళ్లు, ఆటగాళ్లు, నక్సలైట్లు కలిసి దేశంలో అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీతో ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. గతంలో హైదరాబాద్లో ఈపార్టీ నిర్వహించిన సమావేశానికి నక్సలైట్లు హాజరయ్యారని తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలో కాంగ్రెస్ నాయకులు సైతం ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ అనేక ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, అప్పుడు కేంద్ర మంత్రులు ఎవరైనా రాజీనామా చేశారా.. అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాహుల్గాంధీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని, విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రాజకీయ డ్రామాలు సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ ఒక్కటేనని, వీదిద్దరూ కలిసి రాష్ట్రంలో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని రాంచందర్రావు దుయ్యబట్టారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ఎంఐఎంకు మద్దతు తెలిపాయన్నారు. దేశంలో ఏం జరిగినా రేవంత్రెడ్డి, కేటీఆర్లు ఒక్కటై ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు ఆందోళనలు చేస్తుంటారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో గ్రూప్– 1, ఇంటర్ పేపర్లు లీకయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, యూనివర్సిటీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ అన్ని స్థానాలను క్లీన్స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్గౌడ్, నాయకులు బూర నర్సయ్య గౌడ్, బొక్కా నర్సింహారెడ్డి, రఘునాథ్రావు, అంజన్కుమార్ యాదవ్, శ్రీవర్ధన్రెడ్డి, అందెబాబయ్య, కక్కునూరి వెంకటేశ్గుప్తా, డాక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు
మొయినాబాద్: పెండింగ్ కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దని.. వేగవంతంగా దర్యాప్తు చేసి నాణ్యతతో పూర్తి చేయాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. మొయినాబాద్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణ, కార్యాచరణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సీసీటీఎన్ఎస్, ఈ–సాక్షి వ్యవస్థల వినియోగం, మాదకద్రవ్యాల నివారణ తదితర అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్ను సందర్శించి రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్గౌతం, ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి, డీఐ ఉపేందర్ తదితరులు ఉన్నారు. ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి -
నిర్లక్ష్యం చేయొద్దు
ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ఓటు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే అత్యంత కీలకమైన ప్రక్రియ ఎన్నికలు. అలాంటి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే అర్హుడైన ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా కొత్త ఓటర్లను నమోదు చేయడమే కాకుండా, ఓటరు జాబితాను కచ్చితమైందిగా, పారదర్శకమైందిగా, తప్పులు లేనిదిగా రూపొందించడం కూడా ముఖ్యం. మరో పది రోజుల్లో గడువు ముగియబోతోంది. ప్రతి ఒక్కరూ తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్వోకు అందజేయాలి. నిర్దేశించిన గడువులోగా ఫారాలు సమర్పించని పక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సంబంధిత ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే ప్రమాదం ఉంది. ఒక్కసారి పేరు తొలగిస్తే, తరువాత మళ్లీ నమోదు చేసుకోవడానికి అదనపు ప్రక్రియ అనుసరించాల్సి రావచ్చు. అప్పటివరకు జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడొచ్చు. విలువైన హక్కును నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్యూమరేషన్ ఫారం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, కుటుంబ బాధ్యత కూడా. ప్రతి ఒక్కరూ స్పందిస్తేనే జిల్లాలో వందశాతం లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది. – నారాయణరెడ్డి, కలెక్టర్ -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
షాద్నగర్రూరల్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం డీఎం కరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటే టీజేఎంయూ బలపరిచిన నాయకులను గెలిపించాలని అన్నారు. గతంలో రెండు సార్లు టీఎంయూ గెలిచినా కార్మికులకు ఆశించిన ప్రయోజనాలు అందలేదన్నారు. పనిభారం, కిలోమీటర్ల పెంపుతో ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కార్మికుల కష్టాలను పట్టించుకోని నాయకులు ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపఽథ్యంలో మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఆర్డీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే లక్ష్యసాధనకోసం పని చేస్తున్న టీజేఎంయూకు మద్దతివ్వాలని కోరారు. అనంతరం సంఘం డిపో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ డిపో గౌరవ అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాస్యాదవ్, అధ్యక్షుడిగా నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేందర్గౌడ్, వైస్ ప్రెసిడెంట్గా శేఖరయ్య, కార్యదర్శిగా శ్రీధర్రావు, ప్రచారకార్యదర్శిగా నర్సింహ, కోశాధికారిగా రవి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనయ్య, ప్రధానకార్యదర్శి హన్మంత్, కార్యదర్శులు రాజు, ఆర్ఎన్ రావు, రీజినల్ కార్యదర్శి నాగేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు -
విద్యుత్ రాగి తీగల చోరీ
మహేశ్వరం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, పాండు రంగారెడ్డి వ్యవసాయ పొలంలో ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని సుమారు 60 కిలోల రాగి తీగలను దుండగులు గురువారం అర్ధరాత్రి దొంగిలించారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలను ఎత్తుకెళ్లిన ఆనవాళ్లను గమనించి పోలీసులు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రిజర్వేషన్డే సభ కరపత్రాల ఆవిష్కరణ
ఆమనగల్లు: రిజర్వేషన్ల పరిరక్షణకు బహుజనులంతా ఏకం కావాలని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డా.బొల్లు మహేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞన కేంద్రంలో ఈనెల 26న రిజర్వేషన్డే సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం రిజర్వేషన్డే సభ కరపత్రాలను వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో బీసీ కులాల విముక్తి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, దళిత, క్రైస్తవుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని చెప్పారు. సభకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్ భీమపాక ముఖ్య అతిథిగా, సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ప్రత్యేక ఆహ్వానితులుగా, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ తదితరులు హాజరవుతారని వివరించారు. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణుచారి, బీఎస్పీ నాయకుడు వెంకటయ్య, వివిధ సంఘాల నాయకులు శ్రీనివాస్, సాగర్, రాజేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. షాబాద్: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సోదరుల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ (95) శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె 7.45 గంటలకు చనిపోయారు. శనివారం మధ్యాహ్నం వీరి స్వగ్రామమైన షాబాద్ మండలం గొల్లూరుగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షాద్నగర్: ఎంతో కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న షాద్నగర్ చౌరస్తా విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ సరిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 27 నుంచి ఆక్రమణ తొలగింపు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, ఆర్ఆండ్బీ, ట్రాన్స్కో, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
మంచాల: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరగాయల జంగారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం అడుగుజాడలోనే నడుస్తుందన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదల గురించి ఆలోచించే స్థితిలో ఈ ప్రభుత్వాలు లేవని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. అదానీ, అంబానీల ఆస్తులు ఊహించనిస్థాయిలో పెరగడం వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. నెల రోజుల వ్యవధిలోనే రూ.8 పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఘనత కేంద్రానికే దక్కుతుందన్నారు. ఆగస్టు 10న రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగే జైల్భరో కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జంగయ్య, నాయకులు కృష్ణ, యాదయ్య, జంగయ్య, జానీ, జంగారెడ్డి, మల్లేష్, పాండు, విజయ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి -
పోలీస్ అధికారులుబాధ్యతల స్వీకరణ
నూతన ఎస్ఐ కోటేశ్వర్రావుబాధ్యతలు స్వీకరిస్తున్న సీఐ నరేందర్రెడ్డి చేవెళ్ల: చేవెళ్ల నూతన సీఐగా నరేందర్రెడ్డి, ఎస్ఐగా కోటేశ్వర్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వారికి ఠాణా సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ సీఐగా పనిచేసి బదిలీ అయిన భూపాల్ శ్రీధర్ నూతన సీఐకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం సిబ్బంది సీఐ భూపాల్ శ్రీధర్ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. చేవెళ్ల ఠాణాలో మూడేళ్లు సీఐగా పనిచేసిన ఆయన సిబ్బందితో పాటు స్థానిక ప్రజల్లో మంచి అధికారిగా ముద్ర వేసుకున్నారు. దీంతో ఆయన బదిలీ విషయం తెలుసుకుని ఘనంగా సన్మానించారు. షాబాద్ సీఐగా లక్ష్మీరెడ్డి షాబాద్: షాబాద్ నూతన సీఐగా డీకే లక్ష్మీరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కాంతారెడ్డికి ఆరు హత్య కేసులో చార్జ్ మెమో ఇచ్చి బదిలీ చేశారు. -
ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు
కొందుర్గు: కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపుల్లో ఉన్న డీఏపీ, కాంప్లెక్స్, యూరియా బస్తాల నిల్వలు, రైతులకు అందజేసిన బస్తాల వివరాలకు సంబందించిన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ పొందుపరచాలని సూచించారు. రైతు ఆన్లైన్ నమోదు నమోదు లేకుండా ఒక్క బస్తా తేడా ఉండకూడదన్నారు. విజిలెన్స్ అధికారుల వెంట ఏఓ రాజేందర్ రెడ్డి ఉన్నారు. శంకర్పల్లి: వారసత్వంగా వచ్చిన తమ భూమిని కొంత మంది వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు విజయానంద్గుప్తా గురువారం రాత్రి మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. జన్వాడలోని సర్వే నంబర్ 146లో 4.13 ఎకరాల భూమిని 1991లో తమ తాతలు కొనుగోలు చేశారని, అప్పటి నుంచి తామే కబ్జాలో ఉన్నామని తెలిపారు. గురువారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రహరీని కూల్చి, అక్రమంగా తన స్థలంలో కంటైనర్ని వేశారని తెలిపారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని మోకిల ఎస్ఐ సురేశ్ తెలిపారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చేవెళ్ల: దివంగత కొండా వెంకట రంగారెడ్డి సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. శుక్రవారం కేవీ రంగారెడ్డి వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, శ్రీశైలంయాదవ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి అశోక్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, తెలుగు శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు బి.చంద్రశేఖర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, గణేశ్, జయసింహారెడ్డి, అక్షయ్, రాఘవేంద్రచారి, వెంకట్, తదితరులు ఉన్నారు. దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులకు చెరువు ఒడ్డున కనిపించింది. 15 రోజుల క్రితం ఇదే చెరువులో మొదటి సారి కంటపడింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. త్వరలో మొసలిని పట్టుకుంటామని, అప్పటి వరకు ఎవరూ చెరువు పరిసరాల్లోకి.. చేపల వేటకు వెళ్లరాదని ఫారెస్టు అధికారులు సూచించారు. -
రీ సర్వేతోనే భూ సమస్యలకు పరిష్కారం
కొందుర్గు: ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా వ్యవసాయ భూముల గట్టు పంచాయితీ ఉందని, ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే రీ సర్వే ఒక్కటే మార్గమని భూములు కొలతల జిల్లా అధికారి రాంరెడ్డి స్పష్టం చేశారు. రీ సర్వేకు ప్రయోగాత్మకంగా ఎంపికై న జిల్లేడ్ చౌదరిగూడ మండలం తూంపల్లిలో శుక్రవారం తహసీల్దార్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. రీ సర్వేలో భాగంగా మొదట ప్రభుత్వ భూములు, చెరువులు, గ్రామకంఠం, నక్షబాటలను గుర్తించి ప్రత్యేక నంబర్లు కేటాయిస్తారని తెలిపారు. ప్రస్తుతం రైతులు ఎక్కడైతే కాస్తులో ఉన్నారో పహానీల ప్రకారం అక్కడే హద్దులు నిర్ణయించి సర్వే నంబర్లు గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా అభ్యంతరాలుంటే రైతులు ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. రీ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. అనంతరం తూంపల్లి నుంచి షాద్నగర్–పరిగి రహదారికి వెళ్లే నక్షబాటను కొందరు కబ్జాచేశారని, నక్షబాటను విడిపించి రైతులకు, గ్రామస్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని పలువురు గ్రామస్తులు సర్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్రయ్య, ఉపసర్పంచ్ వసంత తదితరులు పాల్గొన్నారు. భూముల కొలతల జిల్లా అధికారి రాంరెడ్డి -
రైతుల ఖాతాల్లో పరిహారం జమ
షాద్నగర్: రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందజేసిన నష్ట పరిహారాన్ని శుక్రవారం షాద్నగర్ ఆర్డీఓ సరిత రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొందుర్గు మండల పరిధిలోని చుక్కమేట్, జిల్లేడు చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి గ్రామాల్లో సుమారు 40 ఎకరాల భూమిని రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులకు రూ.10 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆర్డీఓ తెలిపారు. శంకర్పల్లి: నేరాల నియంత్రణ కోసమే తనిఖీలు చేపడుతున్నట్లు చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. మోకిల ఠాణా పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ ఫేజ్–2లో చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 52 బైక్లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం తనిఖీలు చేపట్టామని, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూర్లోని ప్రభుత్వ సర్వే నంబర్ 44తో పాటు ఇంజాపూర్లోని సర్వే నంబర్ 66లోని భూములపై శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఏడీ సమక్షంలో నిర్వహించిన ఈ సర్వే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. భూముల కబ్జాలను సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. సర్వే కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీనివాస్, బీపీఓ బసవరాజు తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్: పాడి రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేయనున్నట్లు విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కవిత తెలిపారు. పట్టణంలోని విజయ డెయిరీ కార్యాలయంలో శుక్రవారం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడి రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు యూనియన్ బ్యాంక్ సహకారంతో రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. పశువుల కొనుగోలు, పాడి పరిశ్రమ అభివృద్ధికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాల ధరను పెంచాలని పలువురు పాడి రైతులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మేనేజర్ భారతలక్ష్మి, కొందుర్గు ఇన్చార్జి హరిబాబు, పాడి రైతుల సొసైటీల అధ్యక్షులు శేఖర్రెడ్డి, వెంకట్, నర్సింహారెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
పది కిలోల గంజాయి పట్టివేత
● బాలుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు తాండూరు టౌన్: పక్కా సమాచారంతో తాండూరు పట్టణ పోలీసులు శుక్రవారం ఓ బాలుని వద్ద 10కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తాండూరుకు వచ్చారు. అప్పటికే మాటు వేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని బ్యాగ్ను తనిఖీ చేశారు. అందులో 10 కిలోల గంజాయి లభ్యమైంది. బాలున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తనిఖీల్లో పట్టణ ఎస్ఐ నుమాన్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. -
పేదలకు మెరుగైన వైద్యం అందాలి
చేవెళ్ల: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సౌకర్యాలను పరిశీలించి వైద్యుల పనితీరుపై అక్కడ ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. సేవలు మరింత మెరుగుపర్చాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం చేవెళ్లలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. సౌకర్యాలు, వంట గది, విద్యార్థులకు అందిస్తున్న మెనూ పరిశీలించారు. భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎంఈఓ పురన్దాస్కు సూచించారు. అక్కడి నుంచి మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న సర్ కార్యక్రమం డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ బి.యాదగిరిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒటరు ఎన్యూమరేషన్ ఫారం అందించేలా చూడాలని, ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి అర్హులైనవారి ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, ఆస్పత్రి వైద్యులు లక్ష్మీకాంత్రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్మయి -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
ఎంఈఓ లక్ష్మణ్నాయక్ షాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షాబాద్ ఎంఈఓ లక్ష్మణ్నాయక్ అన్నారు. శుక్రవారం నగరానికి చెందిన ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు పాఠశాలల ఆవరణలను హరితవనాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగరగూడ, షాబాద్, హైతాబాద్ పాఠశాలలకు మొక్క లు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల్లో ప్రకృతిపై ప్రేమను పెంపొందించేందుకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ... విద్యతో పాటు పచ్చదనం, పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవన విధానాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలను భవిష్యత్లోనూ కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు వసంత, కృష్ణయ్య, ప్రవీణ్, బాల్రాజ్, సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ మేనేజర్ ధనుంజయ్, విద్యార్థులు తదితరులున్నారు. -
సగమేసర్!
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026జిల్లాలో ఆశించిన దానికంటే తక్కువ మ్యాపింగ్ నమోదవుతుండటంపై ఇటు ఎన్నికల అధికారుల్లోనే కాదు అటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల్లోనూ అలజడి మొదలైంది. మెజార్టీ ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల మ్యాపింగ్పై దృష్టిపెట్టాల్సిందిగా ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లకు రాష్ట్ర, జిల్లా ఎన్నికల కమిషన్ పదేపదే సూచిస్తోంది. ఈ మేరకు వారికి శిక్షణ కూడా ఇచ్చింది. బీజేపీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ పార్టీ ఓటు బ్యాంకు అనుకున్న ప్రతి ఒక్క ఓటును డిజిటలైజేషన్ చేయిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కొంత వరకు ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. పది రోజుల పాటు అన్ని పనులు మానుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఎమ్మెల్సీలకు సూచించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీ ఏజెంట్లు పెద్దగా శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. అర్బన్లో భారీగా తగ్గనున్న ఓట్లు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 21,34,632 మంది ఓట్లు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. మరో 13,34,277 ఓట్ల ప్రక్రియ పెండింగ్లో ఉంది. 2,30,834 మంది ఓటర్లు ఇప్పటి వరకు తమ ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి బీఎల్ఓలకు ఇవ్వలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 83.84 శాతం పూర్తయింది. ఎల్బీనగర్లో అత్యల్పంగా 45.95 శాతం మాత్రమే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఉన్న మెజార్టీ ఓటర్లు సొంతూళ్లపై మక్కువ చూపుతుండటమే ఇందుకు కారణమని సమాచారం. గతంలో రెండు చోట్ల ఓటు వేశారు. ప్రస్తుతం ఏదో ఒక చోట మాత్రమే ఓటు హక్కు పొందే అవకాశం ఉండటంతో మెజార్టీ ఓటర్లు సొంతూళ్లను ఎంచుకుంటున్నారు. ఎల్బీనగర్ సహా శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ వంటి అర్బన్ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. మహేశ్వరంలో అత్యధికంగా 45,821 మంది, రాజేంద్రనగర్లో 30,676, శేరిలింగంపల్లిలో 32,083, చేవెళ్లలో 31,466, ఇబ్రహీంపట్నంలో 27,150, ఎల్బీనగర్లో 31,764 మంది తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో మందకొడిగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మెజార్టీ ఓటర్లకు ఇప్పటికీ చేరని ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న వారు తిరిగివ్వడంలోనూ తాత్సారం ఇప్పటి వరకు 57.70 శాతం డిజిటలైజేషన్ పూర్తి మిగిలింది పది రోజులు మాత్రమే.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) గడువు మరో పది రోజుల్లో ముగియనుంది. మెజార్టీ ఓటర్లకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు చేరకపోగా తీసుకున్న వారు తిరిగి వాటిని బీఎల్ఓలకు అందజేయడంలో అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ఇప్పటి వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ 57.70 శాతం మించలేదు. – సాక్షి, రంగారెడ్డి జిల్లా -
పట్టుబడిన వాహనాల వేలం
ఆమనగల్లు: పట్టణంలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను శుక్రవారం వేలం వేయగా రూ.1.22 లక్షల ఆదాయం లభించిందని జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లో వేలం నిర్వహించారు. ఎకై ్సజ్ సీఐ బద్యానాద్చౌహాన్ నేతృత్వంలో వేలం నిర్వహించగా రూ.1.22 లక్షలకు వాహనాలను విక్రయించారు. అనంతరం వివిధ కేసులలో పట్టుబడిన 88.7 లీటర్ల నాటుసారా, 3,283 కిలోల నల్లబెల్లం, 348 కిలోల నవసాగ్రం, 4.1 లీటర్ల మద్యం, 5.2 లీటర్ల బీర్లను స్థానిక సురసముద్రం చెరువు వద్ద ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్ఐ శ్రీనివాస్గౌడ్, కృష్ణప్రసాద్, అరుణ్కుమార్, స్వప్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సు కిందపడి చిన్నారి దుర్మరణం
కొందుర్గు: స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందిన ఘటన జిల్లేడ్చౌదరిగూడ మండలం కాస్లాబాద్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనీష, కృష్ణయ్య దంపతుల కూతురు సహస్ర(4) చౌదరిగూడలోని అభ్యాస్ విద్యాపీఠంలో యూకేజీ చదువుతోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు చిన్నారిని స్కూల్ బస్సులో పాఠశాలకు పంపించి, పనులకు వెళ్లారు. సాయంత్రం కాస్లాబాద్కు చేరుకున్న బస్సులో నుంచి అందరితోపాటు సహస్ర కిందికి దిగింది. బస్సును రివర్స్ తీసే క్రమంలో చక్రాల కింద పడిపోయింది. గమనించిన స్థానికులు షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే సహస్ర చనిపోయిందని స్థానికులు తెలిపారు. కాగా, డ్రైవర్కు లైసెన్స్ లేదని, బస్సుకు ఫిట్నెస్ లేదని తెలుస్తోంది. -
సభా నిర్వహణ దక్కలేదనే ఆరోపణలు
షాద్నగర్రూరల్: అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో నిర్వహణ దక్కలేదనే అక్కసుతో ఆరోపణలు చేయడం సరికాదని టీజేఏసీ చైర్మన్ జనార్దన్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన టీజేఏసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మారకార్థం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో స్తూపాన్ని నిర్మించి ఆవిష్కరణ చేశారు. దీనికి జేఏసీ నాయకులు రేయింబవళ్లు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఆవిష్కరణ సభా నిర్వహణ ఇవ్వలేదనే అక్కసుతో టీచర్ టీజేఏసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి టీజేఏసీ చైర్మన్పై సమైక్యవాది అని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నానరు. ఉద్యమ సమయంలో టీజేఏసీ సన్నాహాక సమావేశాన్ని ప్రస్తుత టీజేఏసీ చైర్మన్ ఇంట్లోనే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. శ్రీధర్రెడ్డి ఆరోపణలను టీజేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో టీజేఏసీ నాయకులు వెంకటయ్య, శివారెడ్డి, నర్సింలుగౌడ్, కృష్ణయ్య, సత్యం, లక్ష్మీదేవమ్మ, కృష్ణ, బాలయ్య, రాములు, అర్జున్కుమార్, తావుర్యా, బాల్రాజ్, తిరుమలయ్య, రాము, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
భూ బాధితులకు ప్లాట్ల కేటాయింపు
షాబాద్: హెచ్ఎండీఏ వెంచర్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసే దిశగా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ పేర్కొన్నారు. శుక్రవారం షాబాద్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 311లో 290 ఎకరాల భూమి కుమ్మరిగూడ, షాబాద్, సంకేపల్లిగూడ, బోనగిరిపల్లి గ్రామల రైతులకు ఎకరాకు 750 గజాల ప్లాటు చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు లక్కీ డ్రా పద్ధతిలో కేటాయింపు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐ విజయ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య, సర్పంచులు అశోక్, శ్రీశైలం, లావణ్యచెన్నయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చెన్నయ్య, రైతులు పాల్గొన్నారు. -
రేపు ఎంఎంసీలో ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’
సాక్షి, సిటీబ్యూరో: ఇళ్లలో పూజల అనంతరం పాతబడిన లేదా విరిగిపోయిన దేవతా పటాలు, విగ్రహాలు, తదితర సామగ్రిని చెత్తలో లేదా బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా, వాటిని గౌరవప్రదంగా శాస్త్రోక్త పద్ధతిలో నిర్వహణ చేసే ప్రాజెక్ట్ ఉద్వాసన కార్యక్ర మాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లోనూ శనివారం ప్రారంభించను న్నారు. జీహెచ్ఎంసీ, సీఎంసీల్లో ఈ కార్యక్ర మాన్ని ఇప్పటికే చేపట్టడం తెలిసిందే. ఎంఎంసీలో మొదటి విడత కార్యక్రమాన్ని ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి. వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శంషాబాద్: ప్రయాణికులకు మరింత మెరుగైన సౌలభ్యం కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రీమియం ఎయిర్పోర్టు ట్యాక్సీ సేవలను జీహెచ్ఐఏఎల్ ప్రారంభించింది. ప్రయాణికులకు ఏడాది పొడవునా 24 గంటలూ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి. సుమారు 200 ట్యాక్సీలను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. అరైవల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లతో పాటు మొబైల్ యాప్, బుకింగ్ కియోస్క్ల ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. కేవలం ఎయిర్పోర్టు నుంచి ఆయా ప్రాంతాలకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ట్యాక్సీల కారణంగా మెరుగైన ప్రయాణం సాధ్యమవు తుందని జీహెచ్ఐఏఎల్ సీఈఓ కదీర్ కరవన్ పేర్కొన్నారు. ఎంఎంసీ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో గాలి నాణ్యతను మెరుగుపరచి, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ స్వచ్ఛవాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) అమలుపై కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ టి. వినయ్కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య తీవ్రత ఎక్కు వగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, శాసీ్త్రయ పద్ధతుల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, ట్రాన్స్పోర్ట్ ఎస్ఈ శ్రీనివాస్ రావు, అర్బన్ బయోడైవర్సిటీ డైరెక్టర్ సునంద, ముఖ్య ఆర్థిక సలహాదారు వెంకటేశ్వరరావు, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
కోటి ఆశల ‘కోట్పల్లి’
ధారూరు: కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు కావడంతో అలుగు, కుడి, ఎడమ, బేబి కెనాల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులో పూడిక పేరుకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. కాలువలు దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. సంవత్సరాల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో ఆయకట్టు ఆరుతడి పంటలకే పరిమితమైంది. ప్రాజెక్టు కింద మొత్తం 9,200 ఎకరాల ఆయకట్టు ఉండగా కేవలం 4,500 ఎకరాలకే సాగునీరు అందే పరిస్థితికి చేరింది. అనేక మార్లు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది. రైతుల ఆందోళనలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రత్యేక చొరవతో ఇటీవల ప్రాజెక్టు ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.86.30 కోట్లు మంజూరు చేసింది. నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభం కాగా 50శాతం మేర పూర్తయ్యాయి. ఆయకట్టు ఇలా.. ప్రాజెక్టు కుడి కాలువ 24కిలో మీటర్లు ఉండగా 7,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువ 11 కిలోమీటర్లు.. 1,640 ఎకరాల ఆయకట్టు, బేబి కెనాల్ 1.6 కిలోమీటర్లు.. 360 ఎకరాల ఆయకట్టు ఉంది. అలుగు, కాలువలు దెబ్బతినడంతో సగం ఆయకట్టుకే సాగునీరు అందుతోంది. చివరి ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లాకే తలమానికం కోట్పల్లి ప్రాజెక్టును 1967 సెప్టెంబర్ మాసంలో 1,784 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. ఈ ప్రాజెక్టు సాగునీటి వనరే కాకుండా పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ధారూరు మండలంలోని ఐదు గ్రామాలకు, పెద్దేముల్ మండలంలోని 18 గ్రామాలకు సాగునీరు అందిస్తోంది. నాణ్యతకు తిలోదకాలు కాలువల నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. ఇసుక స్థానంలో డస్ట్ వాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా త్వరగా కాలువలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలువలను గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ప్రస్తుతం వాటిని తొలగించి నిర్మాణాలు చేస్తున్నారు. తొలగించిన రాళ్లను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని విక్రయిస్తే ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదా యం వస్తుందని రైతులు అంటున్నారు. నాణ్యత పాటించాలి స్పీకర్ ప్రసాద్కుమార్ ప్ర త్యేక చొరవతో ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.86.30 కోట్లు మంజూరయ్యాయి. పనులు నాణ్యతగా ఉండాలి. ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. సీసీ పనుల్లో వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయాలి. – వరద మల్లికార్జున్, రైతు, నాగసమందర్ -
అనుమానాస్పదస్థితిలో వృద్ధుడి మృతి
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ వృద్ధుడి (సుమారు 70 ఏళ్లు) మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడిని మంచాల మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పూర్యా నాయక్గా గుర్తించారు. అక్కడున్న సీసీ పుటేజీలను పరిశీలించగా వృద్ధుడిని ఓ యువకుడు కాళ్లతో తంతున్నట్లు నమోదైంది. ఆ యువకుడి కారణంగానే వృద్ధుడు మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. చేవెళ్ల డివిజన్ డీఎల్పీఓ సతీశ్రెడ్డి షాబాద్: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుగా వాడుకోవాలని చేవెళ్ల డివిజన్ డీఎల్పీఓ సతీశ్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండేవిధంగా చూసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పని దినాలను 125కు పెంచినట్లు గుర్తుచేశారు. తక్కువ నీటితో సాగయ్య పంటలను మాత్రమే సాగు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అపర్ణ, వ్యవసాయశాఖ అధికారి దండెం విజయంద్ర, ఎంపీఓ నర్సయ్య, ఏపీఓ వీరాసింగ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
భూగర్భ జలాల పెంపునకే జలసిరి
షాద్నగర్రూరల్: కురిసిన ప్రతీ వర్షపు చుక్కను ఒడిసిపట్టుకొని, నీటి సమస్యను ఎదుర్కొందామని డీపీఓ సురేష్మోహన్ పిలుపునిచ్చారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీఓ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎల్నినో వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీపీఓ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో నీటి మట్టం తగ్గిపోతోందని, భూగర్భ జలాలను పెంచుకునేందుకు ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతీ పంచాయతీ 200 ఇంకుడు గుంతలు, పొలాల్లో రైతులు నీటి కుంటలు, వర్షపు నీరు వృథా పోకుండా ఊట కుంటలను నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వీబీజీరాం పథకం ద్వారా ఈ పనులను అక్టోబర్ వరకు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్లు, అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. అనంతరం జలసిరి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో తహసీల్దార్ నాగయ్య, పీఆర్ ఏఈ గోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఏపీఓ అరుణ, ఏపీఎం జంగయ్య, ఉద్యనశాఖ అధికారి హిమబిందు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీపీఓ సురేష్మోహన్ -
నీ భర్తకు నగ్న ఫొటోలు చూపిస్తా
మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు పోచారం: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ (34)కు హెడ్ సెక్యూరిటీ గార్డు బి.రమేష్తో పరిచయం ఏర్పడి సన్నిహతంగా మెలిగారు. ఈ క్రమంలో ఆమెకు తెలికుండా తీసిన నగ్న ఫొటోలను రమేష్ ఆమెకే చూపించాడు. ఈ విషయం గురించి భర్తకు చెబితే తన కుటుంబ జీవితమే నాశనమవుతుందని భయపడి చెప్పలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రమేష్ బాధితురాలికి ఫోన్ చేసి బెదిరించి తనకు సహకరించకపోతే రహస్య ఫొటోలను భర్తకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గురువారం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. మైలార్దేవ్పల్లి: అత్త, భర్త వేధింపుల కారణంగా ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన మేరకు.. బండ్లగూడ ఆదర్శనగర్ బస్తీలో మహిపాల్, శ్రీదేవి (25)ని దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కొంతకాలంగా శ్రీదేవిని భర్త మహిపాల్, అత్త లక్ష్మిలు వేధిస్తున్నారు. మనస్తాపానికి గురైన శ్రీదేవి గురువారం మధ్యాహ్నం ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఐ రాఘవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న శ్రీదేవి తల్లి ఆశమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కార్పొరేట్కు దీటుగా గురుకులాలు
హుడాకాంప్లెక్స్: కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకులాలను ప్రభుత్వం తీర్చిదిద్దిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో గురువారం యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్, అమెనిటీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరైన మంత్రి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. వీఎం హోంలో చదివే క్రీడాకారులు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని అభినందించారు. నీట్లో సరూర్నగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీ విద్యార్థులు సత్తా చాటి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్సీడీడీ కార్యదర్శి విజయేందిర బోయి, వీఎం హోం సెక్రటరీ సల్మాభాను, రోడ్లు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్, పార్టీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, హోం ప్రిన్సిపాల్ చల్లా నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ -
హెల్మెట్ తప్పనిసరి
మొయినాబాద్: రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాలపాలవడంతోపాటు ప్రాణాలు కోల్పోతున్నారని ఫ్యూచర్సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ పాత గేటు వద్ద గురువారం ద్విచక్రవాహనదారులకు హెల్మెట్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనం నడిపే రైడర్తోపాటు వెనుక కూర్చున్నవారు సైతం తప్పనిసరి ఐఎస్ఐ ప్రమాణాలు ఉన్న నాణ్యమైన హెల్మెట్లు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతాయని.. వేగ నియంత్రణ పాటించాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్, కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్ -
వడివడిగా గ్రీన్ఫీల్డ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ నుంచి ఆర్ఆర్ఆర్ను అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ దాదాపు పూర్తయింది. ఎత్తుపల్లాల చదును, అండర్పాస్లు, వంతెనల నిర్మాణ పనులు మొదలయ్యాయి. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎత్తయిన కొండలు, గుట్టలను తొలగించే పని మొదలైంది. 41.50 కిలోమీటర్ల దూరం 100 మీటర్ల విస్తీర్ణంలో 6 లేన్ల రహదారి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొత్తం వెయ్యి ఎకరాలు సేకరించారు. దీనిలో 87.66 హెక్టార్ల అటవీ భూమి కూడా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.4,030 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. రావిర్యాల ఎగ్జిట్ –13 నుంచి మీర్ఖాన్పేట, అటు నుంచి ఆకుతోటపల్లి వరకు 19.20 కిలో మీటర్లు ఫేజ్–1 కింద రూ.1,665 కోట్ల అంచనా వ్యయంతో పనులను చేస్తున్నారు. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ పనులను దక్కించుకుంది. ఇక మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు వరకు 22.30 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులను ఫేజ్–2 కింద చేపడుతున్నారు. రూ.2,365 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ పనులను ఎల్అండ్టీ దక్కించుకుంది. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతుల నష్టపరిహారాన్ని అదాలత్లో జమ చేశారు. ఎలాంటి వివాదం లేని చోట రోడ్డు విస్తరణ, కల్వర్టులు, వంతెనలు, అండర్పాస్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే భూ సేకరణ శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. కొత్వాల్గూడ, అమ్మపల్లి, నర్కూడ, సుల్తాన్పూర్, మల్కారం, కాచారం, రాయన్నగూడ, రామాంజాపూర్, సోలిపేట, హైతాబాద్, పెద్దవీడు, దామర్లపల్లి, మానపల్లి, నాగర్కుంట, బోన్గిరిపల్లి, కొమరబండ, ఉబ్బకుంట, కంకల్, మాచన్పల్లి, పరిగి, మాదారం, రాకంచర్ల మీదుగా త్రిబుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మెజార్టీ రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మార్కెట్ ధరకు మించి నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో కొంతమంది రైతులు భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. మరికొంత మంది మొండికేస్తుండటంతో వారి నష్టపరిహారాన్ని కోర్టులో జమ చేసి, భూ సేకరణ పనులు మొదలుపెట్టారు. శరవేగంగారేడియల్ రోడ్డు పనులు మొదటి విడతలో ర్యావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు సెకండ్ ఫేజ్లో మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి వరకు పనులు బుద్వెల్ నుంచి కొడంగల్ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు వేగంగా భూసేకరణ -
వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలి
సాక్షి, సిటీబ్యూరో: కళాశాల స్థాయిలో విద్యతో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం బంజారాహిల్స్లో ‘ఒయాసిస్ ఫెర్టిలిటీ’ ఏర్పాటు చేసిన జననీ డైలాగ్స్– 2026 ప్యానల్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ వైద్యారోగ్య శాఖలో నేను పనిచేశాను. ఫెర్టిలిటీ సమస్యలపై నాకు అవగాహన ఉంది. లైఫ్ స్టైల్ మార్పులు, ఆహారపు అలవాట్లు ప్రభావం చూపిస్తున్నాయి. ఫెర్టిలిటీ సమస్యలు ఎదురైనపుడు ఐవీఎఫ్, ఇతర అధునాతన పద్ధతుల వైపు చూస్తున్నారు.. పిల్లలు కళాశాల విద్యార్థిగా ఉన్నపుడే తల్లిదండ్రులు ఐఐటీ, మెడికల్ సీటు కోసం ఆరాటపడుతున్నారు. శారీరక వ్యాయామం గురించి పట్టించుకోవడం లేదు. దక్షిణ భారతంలో ఇంటర్ విద్యార్థులు 17 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. శారీరక వ్యాయామానికి సమయం ఇవ్వడంలేదు. ఇది దీర్ఘకాలంలో దుష్ప్రభావాలను చూపిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి డా.ఎన్ సుమలత, ఒయాసిస్ ఫెర్టిలిటీ కో– ఫౌండర్ జి.కిరణ్, డైరెక్టర్లు హరిప్రసాద్, దుర్గారావు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కుల్కచర్ల: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్గా గ్రామానికి చెందిన కోట్ల మైపాల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణాస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాంబండ ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బాల నర్సయ్య, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో, చౌడాపూర్లో రైతు వేదికలో ఆయా మండలాల అధికారులు, సర్పంచులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్లు పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ అశోక్కుమార్, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ రామ్మోహన్శర్మ, కాంగ్రెస్ పార్టీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, చౌడాపూర్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం రూరల్: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం బొంగ్లూర్లోని ప్రమిద గార్డెన్లో యువ చైతన్య వేదిక, శక్తి నైపుణ్యం పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్కు బానిసలు కావొద్దని సూచించారు. యువతను ప్రోత్సహించడానికి ఎంఆర్ఆర్ ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు. మాదక ద్రవ్యాలను రూపుమాపడానికి పోలీసులకు సహకరించాలని కోరారు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో యువత ఎక్కువగా మృత్యువాతపడుతున్నారని తెలిపారు. తప్పకుండా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కుమారుడు అభిషేక్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీలు కేపీవీ రాజు, ప్రదీప్కుమార్రెడ్డి, సీఐలు రమేష్, మహేందర్రెడ్డి, నందీశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు గురునాథ్రెడ్డి, చిలుక మధుసూదన్రెడ్డి, నాయకులు పైళ్ల శ్రీనివాస్రెడ్డి, కరుణాకర్రెడ్డి, పట్నం శివశంకర్, భరత్రెడ్డి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
ఘనంగా పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవం
శంకర్పల్లి: మండల పరిధిలోని ప్రొద్దటూరులో గల ప్రగతి రిసార్ట్స్లో నగరంలోని విజయనగర్కాలనీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1975– 76 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకొన్నారు. 50 ఏళ్ల తర్వాత వారందరూ ఒకచోట చేరి చిన్ననాటి మధుర స్మృతులను గుర్తుచేసుకొన్నారు. రోజంతా ఆటాపాటలతో సరదాగా గడిపారు. రమాదేవి రచించిన శ్రీస్మృతి పథంశ్రీ, శివప్రసాద్ రచించిన శ్రీమన బడి.. తీయటి జ్ఞాపకాల అమ్మ ఒడిశ్రీ అనే రచనలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము 65 ఏళ్ల వయస్సులో ఉన్నామని, ఇలా 50 ఏళ్ల తర్వాత 10వ తరగతి స్నేహితులంతా కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకుగాను గత ఆరు నెలలుగా కష్టపడినట్లు వారు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించుకునేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. -
మరకత శివాలయం అద్భుతం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం వినోబానగర్లోని 3వ బెటాలియన్ టీజీఎస్పీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరు వంట మనుషులు, ఒక ధోబీ, ఒక క్షౌ రవృతిదారుడి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్హత, ఆధార్ కార్డుతో ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుభవం, పనితీరును బట్టి ఈనెల 29న జరిగే కమిటీ సమావేశంలో భర్తీ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. వివరాలకు 87126 57324 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ ఇబ్రహీంపట్నం రూరల్: విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెండింగ్ ఫీజులు, ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు విడుదల చేయాలని గురువారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. స్కాలర్షిప్పులు, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. లేదంటే రాజీలేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సామిడి వంశీ వర్థన్రెడ్డి, అరుణ్కుమార్గౌడ్, ఆకాష్, వినోద్, పార్వతి, భాను, ఆందోజు, నిఖిల్, చందు, క్రిష్, మధు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలమా.. ఫలహారమా?
బోనాల ఉత్సవ ఏర్పాట్లకు రూ.26 కోట్లు మంజూరు ● జీహెచ్ఎంసీలో 444 చోట్ల పనులు ● రాజేంద్రనగర్కే రూ.8.79 కోట్లు ● సక్రమంగా వినియోగించాలంటున్న నగర వాసులు సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగర సంస్కృతికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెత్తకుండా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధమైంది. ఆరు జోన్లలో వివిధ సర్కిళ్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.26 కోట్లు కేటాయిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 444 అత్యవసర పనులను గుర్తించి నిధులు మంజూరు చేశారు. జోన్ల వారీగా ఇలా.. కేటాయింపుల్లో రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లకు సింహభాగం నిధులు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 160 పనుల కోసం రూ.8.79 కోట్లు కేటాయించారు. ఇందులో ముఖ్యంగా జంగమ్మెట్ సర్కిల్లో 96 పనులకు రూ.5.63 కోట్లు ఖర్చు చేయనున్నారు. చార్మినార్ జోన్లో 137 పనులకు రూ.8.65 కోట్లు మంజూరయ్యాయి. చార్మినార్ సర్కిల్లోనే రూ.3.98 కోట్లతో పనులు చేపట్టనున్నారు. గోల్కొండ జోన్లో 89 పనులకు రూ.5.95 కోట్లు, గోల్కొండ సర్కిల్లో రూ.2.54 కోట్లతో 27 పనులు చేపట్టనున్నారు. ఉజ్జయినీ మహంకాళి బోనాలకు కేంద్రమైన సికింద్రాబాద్ పరిధి లో 32 పనులకు రూ.1.35 కోట్లు మంజూరు చేశారు. శంషాబాద్ జోన్లో 20 పనులకు రూ.93.40 లక్షలు కేటాయించారు. ఖైరతాబాద్ ఈ జోన్లో కేవలం 6 పనులను మాత్రమే గుర్తించి అత్యల్పంగా రూ.30.55 లక్షలు మంజూరు చేశారు. ఇందులో జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్గూడ సర్కిళ్లలో పనులేవీ ప్రతిపాదించలేదు. బిల్లులకు చిల్లు.. బోనాల ఏర్పాట్లకు నిధుల మంజూరు హర్షణీయమే.. కానీ.. ఈ సారైనా పనులు సక్రమంగా చేస్తారా? లేక గతంలో మాదిరిగానే బిల్లులతోనే ఫలహారంలా పంచుకుంటారా? అని నగర వాసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనుభవాలను పరిశీలిస్తే.. బోనాల ఉత్సవాల వేళ జీహెచ్ఎంసీ చేసే ఖర్చులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగం పనులు కూడా పూర్తి చేయకుండానే, ఉత్సవాలు ముగిసిన వెంటనే ‘పపనులు పూర్తయ్యాయి’ అంటూ దొంగ బిల్లులు సృష్టించి ఖజానాను గుల్ల చేయడం పరిపాటిగా మారింది. చాలా ప్రాంతాల్లో పాత రంగులపైనే మళ్లీ నాసిరకం సున్నాలు చల్లడం, గుంతల రోడ్లకు మొక్కుబడిగా మట్టి కొట్టడం మినహా శాశ్వత పనులు చేసిన దాఖలాలు లేవు. కొన్ని పనులు కేవలం కాగితాల్లోనే ఉంటాయి. విచిత్రమేమిటంటే, బోనాలు ముగిశాక పనులు ప్రారంభించినట్లు పేర్కొనడం. ఈసారి కూడా అదే తంతు కొనసాగనుందా? లేక ఉన్నతాధికారులు నిఘా ఉంచి దుబారాను అడ్డుకుంటారా? అనేది వేచి చూడాలి. జీహెచ్ఎంసీ పారదర్శకంగా వ్యవహరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు ప్రజలు. -
బలవంతపు భూసేకరణ చేయబోం
● అవసరమైతే మరిన్నిసార్లు చర్చిస్తాం ● ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుయాచారం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయబోదని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల ఫార్మాసిటీ భూబాధిత రైతులతో జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి సమావేశమై వారి సమస్యలను విన్నారు. రైతులు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసి, టీజీఐఐసీ పేరుతో భూ రికార్డులు మార్చి పరిహారాన్ని అథారిటీలో జమ చేసిందని ఆరోపించారు. భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.80 లక్షల పరిహారం ఇవ్వాలని, భూములు ఇవ్వని అన్నదాతల రికార్డులను తిరిగి వారి పేర్లపై నమోదు చేయాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి.. రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అవసరమైతే మరిన్ని సమావేశాలు నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందజేయాలని కలెక్టర్ని ఆదేశించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా భూబాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు వెంకట్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్పై దాడి, అరెస్టు దుర్మార్గం ఇబ్రహీంపట్నం రూరల్: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. జంతర్మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలో పోలీసుల చేసిన లాఠీఛార్జ్ను నిరసిస్తూ మండలంలోని చర్లపటేల్గూడ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో బుధవారం ఛాట్రోన్కి గూంజ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. 12 ఏళ్ల కాలంలో దాదాపు 152 పేపర్లు లీకేజీ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 7.50 కోట్ల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే క్యాన్సిల్ అయ్యాయన్నారు. ఇందుకు కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ వినియోగించడంపై హోంమంత్రి అమిత్షా స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి, వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలీద్, నాయకులు సికిందర్రెడ్డి, నాగేందర్రెడ్డి, గుర్రం శ్యామ్ చరణ్రెడ్డి, పాలడుగు నాగార్జున, గౌస్పాషా, గురునాథ్రెడ్డి, చిలుక మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవకాశం వచ్చింది
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026కొడంగల్/దుద్యాల/బొంరాస్పేట: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈప్రాంతానికి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. గత పాలకులు వివక్షతోనే కొడంగల్ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసం వద్ద నిర్వహించిన సర్ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. పదవులు, నిధులు, సంక్షేమం తదితర అన్ని అంశాల్లో కొడంగల్ వెనకబడింది. నన్ను గెలిపించిన మీకోసం నిత్యం 18గంటలు పనిచేస్తున్నా.. ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది.. చేసుకుందాం అన్నారు. ఓటు లేకపోతే శవంతో సమానం ఓటు లేని పౌరుడు శవంతో సమానం. సుశిక్షితులైన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం. ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రతీ పేదవాడికి అండగా నిలవాలి. ఇంటింటికీ, గల్లీగల్లీకి తిరిగి ప్రక్రియను పూర్తిచేయాలి. మనకు వచ్చే ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల పప్పులు ఉడకనీయొద్దు. ఓటర్ నమోదు ఇలా.. కొడంగల్లో నియోజకవర్గంలో మొత్తం 2,51,255 మంది ఓటర్లున్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,96, 620 మంది మాత్రమే సర్ పత్రాలు సమర్పించారు. మిగిలిన 54,635 మంది ఫారాలు ఇవ్వలేదు. 78 శాతం నమోదు పూర్తయింది. కోస్గి మండలంలో 9,864 మంది, కొడంగల్లో 8,260, మద్దూరులో 8,421,దుద్యాలలో 5,460,గుండుమాల్లో 4,070, కొత్తపల్లిలో 3,630, దౌల్తాబాద్లో 9,300, బొంరాస్పేటలో 5,930 మంది ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్తివారి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, డీసీసీ అధ్యక్షు డు ధారాసింగ్, మండల అధ్యక్షులు నర్సింలుగౌడ్, ఆవుటి శేఖర్, కౌన్సిలర్ కృష్ణంరాజు, నాయకులు నయీమ్, వెంకట్రాములుగౌడ్ పాల్గొన్నారు. నెమ్మదిగా సాగుతున్నాయనే.. హకీంపేట్ శివారులో చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయనే సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి దుద్యాల పర్యటనకు నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి 11గంటల వరకూ ఇక్కడే ఉండి పనులను పరిశీలించడంతో పాటు సీఎం హోదాలో సుమారు ఐదు గంటల పాటు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని లేదంటే చర్యలు తప్పవని అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. తాగునీరు, సాగునీరుతో పాటు రోడ్లు, పంచాయతీ భవనాలు నిర్మించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వర్షంతో ఇబ్బంది పడ్డారు. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డిగత పాలకుల వివక్షతోనేఅన్నిఅంశాల్లో వెనకబడ్డాం -
నాయకుల ముందస్తు అరెస్ట్
సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో మండలంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కొంత మందిని అరెస్టు చేయగా మరి కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. వీరిలో ఎంఐఎం తాలూకా అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్, సీపీఐ నాయకులు ఇందనూర్ బషీర్, మైమూద్, శ్యాంసుందర్, సురేష్గౌడ్, మూతుల రాజు, శ్రీనివాస్, మల్లప్ప, రహీం, వెంకటప్ప, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్ ఉన్నారు. దుద్యాల్ మండలం లగచర్ల గ్రామానికి చెందిన బొగమోని సురేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన ముగిసిన తర్వాత వీరందరినీ వదిలి పెట్టారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
మీర్పేట: నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంలో న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని, అలాగే ఈ అంశంపై నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతో పాటు ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బుధవారం జిల్లెలగూడ అంబేడ్కర్ విగ్రహం వద్ద నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మూతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయం కోరిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని, అభివృద్ధి విషయంలో విఫలమైందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి శేఖర్రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు బాల్రెడ్డి, శ్రీశైలం, సురేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు దశరథ్, రాంచందర్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
ఫైళ్లను తొక్కిపెట్టొద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఉద్దేశ పూర్వకంగా అర్జీలను తొక్కిపెట్టే ఇంజనీర్లపై వేటు తప్పదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, ప్రతీ ఇంజనీరు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం మింట్కాంపౌండ్ కార్పొరేట్ ఆఫీసు నుంచి 21 సర్కిళ్ల పరిధిలోని ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, బిల్లింగ్, నెట్వర్క్ బలోపేతం, భద్రతా చర్యలు, పెండింగ్ పనులు, కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, కొత్త లైన్ల ఏర్పాటుకు అంచనాల తయారీలో జాప్యం, నెట్వర్క్ మ్యాపింగ్, మోడల్ సబ్స్టేషన్లు తదితర అంశాలపై సమీక్షించారు. అంగన్వాడీలు, ఇతర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే వసూలు చేయాలన్నారు. 33కేవీ, 11 కేవీ లైన్లు, డీటీఆర్లు, స్ట్రక్చర్ కోడ్ మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న వాణిజ్య కేటగిరీలకు వెంటనే కనెక్షన్లు జారీ చేయాలని, కొత్త విద్యుత్ కనెక్షన్లు, అంచనాలు, వర్క్ ఆర్డర్లు, సాంకేతిక అనుమతులు, పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. బకాయిల వసూళ్లతో పాటు విద్యుత్ చోరీ, అనధికార కనెక్షన్లు, నిబంధనలకు విరుద్ధంగా బహుళ మీటర్ల వినియోగాన్ని గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ కనెక్షన్ల నమోదులో క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మోడల్ సబ్స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించి, అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ప్రతీ పనికి స్పష్టమైన లక్ష్యాలు, గడువు నిర్ణయించి అమలు చేయాలని, ఆగస్టు 10న జరిగే సమీక్ష నాటికి అన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు శివాజీ, పి.కృష్ణారెడ్డి, ఎన్.నరసింహులు, చక్రపాణి, సీఈలు, సీజీఎంలు ఉన్నారు. -
రౌడీషీటర్ హత్య కేసులో ముగ్గురి రిమాండ్
మీర్పేట: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బావమరిది అర్ఫాజ్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనంకు చెందిన మొహమ్మద్ అర్ఫాజ్ చెల్లెలు సభా ఫాతీమా, సోదరుడు సల్మాన్ను గతంలో సూరి హత్య చేశాడు. దీంతో అప్పటి నుంచి పగ, ప్రతీకారం పెంచుకున్న అర్ఫాజ్ అవకాశం కోసం ఎదురుచూశాడు. సూరి జైలు నుంచి వచ్చిన తరువాత కూడా అనుమానం రాకుండా అర్ఫాజ్ మంచిగా ఉన్నట్లు నటించాడు. ఈ క్రమంలో సోమవారం సూరి రెండో భార్య సోదరుడి జన్మదిన వేడుకలకు వస్తున్నట్లు తెలుసుకున్నాడు. వేడుకకు హాజరై కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. తన చెల్లెలు, అన్నను హత్య చేసినందుకు ప్రతీకారంగానే బావ సూరిపై కక్ష పెంచుకుని హతమార్చినట్లు అర్ఫాజ్ విచారణలో అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. వృత్తిరీత్యా పంక్చర్ షాపులో పనిచేసే ప్రధాన నిందితుడు అర్ఫాజ్(22)తో పాటు హత్యకు సహకరించిన నందనవనంకు చెందిన సుహిద్రమణి స్వామి(19), జంగిలొళ్ల నాని(19)లను రిమాండ్ చేశామని వివరించారు. మొయినాబాద్: విద్యార్థులు తమ జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని వాయిస్ 4 సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూష భరద్వాజ్ అన్నారు. మండలంలోని తోలుకట్టలో ఉన్న చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాలలో గత 10 రోజులుగా జరిగిన శ్రీహర్ వాయిస్శ్రీ శిబిరంలో భాగంగా శ్రీపరిచయ్శ్రీ పేరుతో విద్యార్థినులకు యుక్త వయసు, రుతుస్రావం, శరీర మార్పులు, పరిశుభ్రత, భావోద్వేగాలు, భద్రత, హక్కులపై అవగాహన కల్పించారు. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. హర్ వాయిస్ కార్యక్రమంలో భాగంగా పరిచయ్, దిశ, సఖి ఫర్ లీడర్షిప్ అనే మూడు అంశాలపై కౌమార దశ బాలికలకు అవగాహన కల్పిస్తామన్నారు. కౌమార దశ బాలికల్లో సురక్షితమైన వాతావరాణాన్ని కల్పించి, రుతుస్రావ ఆరోగ్యం, పరిశుభ్రతపై ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ఈ శిబిరం దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాలతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు...సొత్తు స్వాధీనం రాంగోపాల్పేట్: పనిచేసే సంస్థకు కన్నం వేసి 1.28 కేజీల బంగారు ఆభరణాలను కాజేసిన ఇద్దరు నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం టాస్క్ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్లో బంగారు, వజ్రాభరణాల తయారీ చేసే గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీ బ్రాంచ్ కొనసాగుతోంది. మూడేళ్లుగా బీదర్కు చెందిన సోన్కాంబ్లే హరీష్ (29) సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. నగరంలోని నగల దకాణాల వద్దకు వెళ్లి బంగారు ఆభరణాల నమూనాలు చూపించి ఆర్డర్లు తీసుకుని వస్తుంటాడు. అలాగే ఆర్డర్ చేసిన ఆభరణాలను తిరిగి షాపులకు అందించి చెక్కులు సేకరించి కార్యాలయంలో సమర్పిస్తుంటాడు. బంగారు ఆభరణాలను కార్యాలయంలో ఉండే లాకర్లో ఉంచేవాడు. హరీష్కు ఇటీవల వివాహం కావడం, వచ్చే జీతం సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సంస్థలోని బంగారు ఆభరణాలు దొంగిలించాలని పథకం వేశాడు. ఇదే విషయాన్ని హైటెక్ సిటీలోని పీడబ్లూసీ ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్గా పనిచేసే తన సోదరుడు ఆకాష్కు తెలిపాడు. ఇద్దరూ కలిసి ఈనెల 17వ తేదీన విద్యుత్ను, సీసీ టీవీలను నిలిపివేసి బాత్రూమ్ గ్రిల్ తొలగించి ఆభరణాలు దొంగిలించారు.ఆ ఆభరణాలన్నీ హరీష్.. ఆకాష్కు అందించాడు. నేరం చేసిన తర్వాత కూడా హరీష్ ఎలాంటి భయం లేకుండా కార్యాలయానికి వచ్చాడు. అయితే పోలీసులకు మొదట ఎలాంటి అనుమానం రాకున్నా సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకోగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను మంగళ్హాట్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి 1.28 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగం
● ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి మొయినాబాద్: పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. చేవెళ్ల జోన్ నెలవారీ నేర సమీక్ష సమావేశం బుధవారం మొయినాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో, మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ వంటి అత్యంత సున్నితమైన కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. గ్రేవ్ అన్డిటెక్టెడ్ కేసులను సాంకేతిక ఆధారాలు, సీసీటీపీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాల సహాయంతో ఛేదించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, సైబర్ కేటుగాళ్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. పెండింగ్ చార్జ్షీట్లను నిర్దేశిత గడువులోగా కోర్టులకు దాఖలు చేసి కేసుల పురోగతిని వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్గౌతమ్, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సాయిక్ జహంగీర్, చేవెళ్ల ఏసీపీ కిషన్, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ వెంకటేశం, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ జేమ్స్బాబు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వీరబాబు, జోన్ పరిధిలోని పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
హయత్నగర్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు ఖాళీల్లో బీబీఏ–2, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–3, సంస్కృతం–1, స్టాటిస్టిక్స్–1 ఖాళీలు ఉన్నాయని, సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) మార్కులతో పీజీ పొందిన వారు అర్హులని ఆయన వివరించారు. దరఖాస్తులను ఈ నెల 25 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సమర్పించాలని సూచించారు. మొయినాబాద్: అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడంలో జాప్యం చేయొద్దని ఈఎంఆర్ఐ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహిద్ అన్నారు. మొయినాబాద్లోని 108 అంబులెన్స్ వాహన సేవలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్లోని పరికరాలు, మందులు, రికార్డులు పరిశీలించారు. సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108కు కాల్ వస్తే వెంటనే స్పందించి వాహనంతో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తగిన చికిత్స అందించి, దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలన్నారు. స్థానికంగా మంచి సేవలు అందిస్తున్నారని 108 సిబ్బంది శ్రీకాంత్, రాజేష్, జిల్లా మేనేజర్ రాజాబాబును అభినందించారు. డీఈఓ వెంకటేశ్వర్లు మహేశ్వరం: విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ఆధునిక బోధన పద్ధతులను అనుసరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని మెహబ్బత్నగర్ గ్రామ సమీపంలో ఉన్న భాష్యం బ్లూమ్స్ స్కూల్లో ఎస్జీటీలకు నిర్వహించిన మూడు రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రెగ్యులర్ తరగతి బోధనకు ఆటంకం కలగకుండా, అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుచుకోవాలన్నారు. ఆటలు, పాటలు చురుకై న కార్యకాలపాల ద్వారా ఆహ్లాదంగా బోధించే పద్ధతులను అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ కస్నానాయక్, రిసోర్స్ పర్సన్ ఆనంద్కుమార్, సీపీ నాయుడు, పి.మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కందుకూరు: రైతులు భూసేకరణకు సహకరించాలని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి కోరారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ రెవెన్యూలో సర్వే నంబర్ 38లో 350.30 ఎకరాలు, సర్వే నంబర్ 162లో 217 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ ద్వారా సేకరించడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 88 ఎకరాలు మినహా మిగతా రైతులు అందరూ అంగీకార పత్రాలను అందించారు. ఆ రైతులతో బుధవారం తహసీల్దార్ గోపాల్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడారు. భూములు ఇవ్వడానికి అంగీకరించే రైతులకు ఎకరాకు రూ.82 లక్షలతో పాటు అదనంగా ఒక ప్లాటు చొప్పున పరిహారం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ జానకీరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, తిమ్మాపూర్, జబ్బార్గూడ సర్పంచ్లు గానుగపేట అంజమ్మ, ఎం.సతీష్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
ఎల్లమ్మ రథోత్సవం
బంగారు బోనంపాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం సమర్పించారు. ఉదయం ఆలయానికి తీసుకుని వచ్చిన బోనంకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ స్వాగతం పలికారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాల్లో చివరి ఘట్టమైన రథోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. పురవీధుల్లో సంప్రదాయ నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు..మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య రథయాత్ర కన్నులపండువగా సాగింది. – అమీర్పేట/చార్మినార్ -
యువకుడి అదృశ్యం
యాచారం: కూలీ పనికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన వి.శివాజీ ఈ నెల 15న ఇంట్లో నుంచి కడ్తాల్కు సెంట్రింగ్ పనికి వెళ్తున్నానని, వాళ్ల అమ్మ సువర్ణకు చెప్పి వెళ్లాడు. నాలుగు రోజులైన ఇంటికి తిరిగి రాకపోవడం, వివిధ గ్రామాల్లో బంధువులు, స్నేహితుల వద్ద ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆరా తీసిన జాడలేదు. దీంతో బుధవారం గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ● విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు ● వెంకటాపూర్ ఉన్నత పాఠశాలలో ఘటన మొయినాబాద్: హోంవర్క్ చేయలేదనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని చితకబాదాడు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. హిందీ పండిత్గా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ దాడిలో 7వ తరగతి బాలిక చేతులు కమిలిపోయాయి. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీయగా, వారిపై ఎదురుదాడికి దిగాడు. సదరు టీచర్ గతేడాది ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో షీటీం పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పట్లో ఇతని వ్యవహారంపై డీఈఓకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మరో బాలికను చితకబాది వివాదంలో చిక్కుకున్నారు. ఇతని తీరుతో కొందరు విద్యార్థులు పాఠశాలకు రావడానికే భయపడుతున్నారని, స్కూల్కు మానేస్తున్నారని సమాచారం. -
జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి కృషి
షాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు కనీస సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, కార్పొరేట్ వైద్యం అందేలా ఉచిత హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని, కుటుంబాలకు భరోసా కల్పించే గ్రూప్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా) సౌకర్యాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, జిల్లా సంయుక్త కార్యదర్శులు సత్యనారాయణ, సూర్యనారాయణ, రమేష్, ఈసీ సభ్యుడు ఇలియాజ్ షరీఫ్, చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్య, సభ్యులు రాంచంద్రయ్య, రమేశ్యాదవ్, గోవర్ధన్రెడ్డి, కరుణాకర్చారి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక టీయూడబ్ల్యూజే షాబాద్ మండల నూతన అధ్యక్షుడిగా రవీందర్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్, గౌరవ అధ్యక్షుడిగా రాంచంద్రయ్య, ఉపాధ్యక్షులుగా నర్సింలు, శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీలుగా నరేందర్, లక్ష్మణ్, శివరాజ్గౌడ్, కోశాధికారి పూర్ణచందర్ గుప్తా, ఈసీ మెంబర్లుగా అనిల్, రాజేష్, మధు, రాజేందర్, రవి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి -
బీసీల సమస్యలపై నిరంతర పోరాటం
షాబాద్: బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకుడు పల్నాటి యాదయ్య పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో హక్కుల సాధన సమితి నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జీవో నంబర్ 9ని అమలుపరచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర విడనాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం చేవెళ్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కమిటీలు ఏర్పాటు చేశారు. బీసీ హక్కుల సాధన సమితి షాబాద్ మండల కమిటీ అధ్యక్షుడిగా పాలమాకుల ఆనందం, ప్రధాన కార్యదర్శిగా నర్సింలు, ఉపాధ్యక్షుడిగా తెలుగు శేఖర్, సహాయ కార్యదర్శి రుక్కయ్య, కోశాధికారిగా నాగరాజుతో పాటు 13 మంది తో కమిటీ ఏర్పాటు చేశారు. చేవెళ్ల మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పాపయ్య, మొయినాబాద్ మండల అధ్యక్షుడిగా ఉప్పరి సురేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, శంకర్పల్లి మండల అధ్యక్షుడిగా మంగలి నర్సింహా, ప్రధాన కార్యదర్శిగా వడ్ల బ్రహ్మాచారి తదితరులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, చేవెళ్ల మండల కార్యదర్శి సత్తిరెడ్డి, మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీనివాస్, శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్, అంజయ్య, మాక్బుల్, మంజుల తదితరులు ఉన్నారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకుడు యాదయ్య -
అస్తిత్వం కోల్పోతాం.. డంప్యార్డు వద్దు
కొత్తూరు: సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటు చేస్తే ఆస్తులు, అస్తిత్వంతో పాటు సర్వస్వం కోల్పోతామని బాధితులు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం డంప్యార్డుతో కలిగే అనర్థాలపై జేఏసీ నేతలు కలెక్టర్ కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ధర్నా విరమణ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కలెక్టర్ సుమారు గంట పాటు చర్చించారు. డంప్యార్డు ప్రతిపాదిత స్థలం రైలు, రోడ్డు, విమానాశ్రయాలకు సమీపంలో ఉందన్నారు. ఎన్నో బహుళజాతి పరిశ్రమలు, పవిత్రమైన జేపీదర్గా, అనంతపద్మనాభస్వామి ఆలయం, గురుకుల పాఠశాల కొనసాగుతున్నాయని వివరించారు. సీఎం మానసపుత్రిక అయిన ఫ్యూచర్సిటీ అతి సమీపంలో ఉందన్నారు. జనాభా, అభివృద్ధి పరంగా దూసుకెళ్తున్న ప్రాంతంలో డంప్యార్డు ఏర్పాటు చేస్తే వీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ.. బాధితులు పేర్కొన్న అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్యాంసుందర్రెడ్డి, నాయకులు ప్రభాకర్, శేఖర్రెడ్డి, సుదర్శన్గౌడ్, రవికుమార్గుప్తా, జంగయ్య, బాల్రాజు, శంకర్నాయక్, సర్పంచులు బాసునాయక్, గోవింద్నాయక్, ఎర్రొళ్ల జగన్, సుమిత్రమల్లారెడ్డి, విష్ణుశాంతినాయక్ తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రంలోని ప్రధాన అంశాలు ● స్టోన్క్రషర్ బ్లాస్టింగ్లతో ప్రకంపనలకు భూమి పొరలు వదులుగా ఉన్నాయి. డంప్యార్డు ఏర్పాటు చేస్తే వాటి వ్యర్థాలు భూపొరల్లోకి సులువుగా ఇంకి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. ● హైదరాబాద్ జంట జలాశయాలకు ఈ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం ఉండటంతో నీటి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందన్నారు. ● జాతీయ రహదారిపై ఇప్పటికే ట్రాఫిక్ రద్దీ ఉన్న నేపథ్యంలో చెత్త వాహనాల రాకపోకలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయని తెలిపారు. ● డంప్యార్డు నిర్వహణలో లోపాలు ఉంటే ఈగలు, దోమలు, ఇతర కీటకాలు పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ● ముఖ్యంగా విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో విమానాలు కింది నుంచి వెళ్లే క్రమంలో గద్దలు, ఇతర పక్షులు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ● ఇక్కడ కొనసాగుతున్న పీఅండ్జీ, నాట్కో, మైక్రోసాఫ్ట్ ఇతర పరిశ్రమలపై ప్రతికూల పరిస్థితులు ఉంటాయన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించిన సిద్ధాపూర్ బాధితులు -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టబోతున్నాం. సకాలంలో విధులకు హాజరు కాని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులు, ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నాం.’ అని జిల్లా అదనపు(స్థానిక సంస్థలు) కలెక్టర్ డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి స్పష్టం చేశారు. ఇటీవల బాన్సువాడ(కామారెడ్డి) నుంచి జిల్లా అదనపు కలెక్టర్గా బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తొలిసారి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. స్వతహాగా వైద్యురాలిగా పని చేసిన అనుభవం ఉన్నందున విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సీజనల్పై అవగాహన కల్పిస్తాం వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపం తలెత్తే ప్రమాదం ఉంది. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను రోజుల తరబడి ఎత్తకపోవడం, ఇంటి చుట్టూ మురుగు నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు వ్యాపిస్తుంటాయి. వీటి కట్టడికి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. కలుషిత ఆహారం, నీరుతో అనేక మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటారు. టైఫాయిడ్, చికున్గున్యా, డెంగీ, మలేరియా జ్వరాలతో బాధపడే నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపడతాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది చాలా వరకు ఉదయం 11 తర్వాత వచ్చి మధ్యాహ్నం రెండు గంటలకే ఇంటి ముఖం పడుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. ఆలస్యంగా వచ్చి, నిర్ధేశిత సమయానికి ముందే వెళ్లి పోతున్న వైద్య సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నాం. వసతి గృహాలపై ప్రత్యేక నిఘా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు ఉచిత పాఠ్యాపుస్తకాలు, నోట్బుక్స్ అందజేశాం. నెలాఖరులోగా రెండు జతల బట్టలు కూడా అందజేస్తాం. ప్రభుత్వం పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. పాఠశాలలు, వసతి గృహాలపై పర్యవేక్షణ మరింత కఠినతరం చేస్తాం. అవసరమైతే వారంలో ఒకటి రెండు వసతి గృహాల్లో స్వయంగా తనిఖీ చేస్తా. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, కోడిగుడ్లు, పండ్లు, పాలు, ఇతర నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలిస్తాం. చాలా మంది ఉపాధ్యాయులు పోస్టింగ్ పొందిన చోట పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని ప్రక్షాళన చేస్తాం. వైద్యుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ వేళకు పాఠశాలకు చేరని టీచర్లపై వేటు తప్పదు గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా చర్యలు ‘సాక్షి’తో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయిఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ జిల్లాలో కొంత మందకొండిగా సాగుతున్న మాట నిజమే. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో పోలిస్తే, జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. బూత్స్థాయి అధికారులు(బీఎల్ఓ)లు ఇప్పటికే ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. అయితే ఇచ్చిన ఫారాలు తిరిగి బీఎల్ఓలకు చేరడం లేదు. మెజార్టీ ఓటర్లు రెండు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నారు. ప్రస్తుత సర్ ప్రక్రియతో సొంతూరుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు అర్బన్ ఏరియాలో ఇతర ప్రాంతాల్లో వలస వచ్చిన వారు తరచూ ఇళ్లు మారుతుండటం, ఫోన్ నంబర్లు కూడా పని చేయకపోవడం ట్రాకింగ్కు ఇబ్బంది అవుతుంది. డిజిటలైజేషన్ ఇప్పటికే 50 శాతం పూర్తైంది. ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే.. ఇబ్రహీంపట్నం, షాద్నగర్ ఈ విషయంలో కొంత వెనుకబడి ఉన్నాయి. బీఎల్ఓలను అప్రమత్తం చేసి నిర్ధేశిత గడువులోగా డిజిటలైజేషన్కు కృషి చేస్తున్నాం. -
కబ్జా రైతుల కన్నీరు
యాచారం: ఫార్మాసిటీ భూముల్లో కబ్జాలో ఉన్న రైతులకు పరిహారం చెల్లింపు కలగానే మిగులుతోంది. మూడేళ్లుగా బాధిత రైతులు రెవెన్యూ, టీజీఐఐసీ శాఖల అధికారుల చుట్టు చెప్పులరిగేలా ప్రదిక్షణ చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీకి 7,500 ఎకరాల వరకు పట్టా, అసైన్డ్ భూములను సేకరించారు. భూసేకరణ మొదట్లో అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.8 లక్షలు, కబ్జాలో ఉన్న రైతులకు రూ.7.70 లక్షల పరిహారం అందజేశారు. ఆయా గ్రామాల్లో 200 మందికి పైగా రైతులు 300 ఎకరాలకు పైగా కబ్జాలో ఉన్నారు. పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు కబ్జాలోని రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. నమ్మించి మోసం ఆరు నెలల క్రితం ఫార్మాసిటీకి సేకరించిన భూముల చుట్టూ హద్దులు, ఫెన్సింగ్ వేసే పనులను పూర్తి చేశారు. ఆ సమయంలో కబ్జాలో ఉన్న రైతులు పనులను అడ్డుకోగా అప్పటి ఆర్డీఓ అనంత్రెడ్డి, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం తహసీల్దార్ అయ్యప్ప, గ్రీన్ ఫార్మాసిటీ అప్పటి సీఐ లిక్కి కృష్ణంరాజు పరిహారం అందజేస్తామని రైతులకు నచ్చజెప్పారు. నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో దాదాపు 250 ఎకరాల్లో కబ్జాలోని రైతులకు పరిహారం అందజేయాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ నారాయణరెడ్డి కబ్జా రైతులకు పరిహారం చెల్లింపునకు హైలెవల్ కమిటీ వేసినట్లు ప్రచారం జరిగింది. కానీ నేటికి కార్యరూపం దాల్చలేదు. కబ్జాలోని రైతులు మాత్రం పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కబ్జాలోని రైతులకు కొరవడిన స్పష్టత మొండిగౌరెల్లిలో పారిశ్రామిక పార్క్ల కోసం అధికారులు తాజాగా భూసేకరణ చేపడుతున్నారు. భూసేకరణ చేపట్టే 19, 68, 127 సర్వే నంబర్లలో కబ్జాలో ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారు. అసైన్డ్ పట్టా భూములకు ఎకరాకు రూ.30 లక్షల పరిహారం అందజేస్తామని హామీలిచ్చారు. రైతు సమావేశాల్లో కబ్జా రైతులకు సైతం పరిహారం అందజేస్తామని ప్రకటిస్తున్నారే తప్ప స్పష్టత ఇవ్వడం లేదు. గ్రామంలోని రైతులు ఐక్యంగా లేకపోవడం కూడ అధికారులకు అవకాశంగా మారింది. కొందరు రైతులు భూములు తీసుకోవాలని.. మరి కొందరు పరిహారం చెల్లించిన తర్వాతే ఫెన్సింగ్ వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేతల్లోనూ సమష్టి నిర్ణయాలు లేక కబ్జాలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. హద్దులు, ఫెన్సింగ్ వేసే సమయంలో పరిహారం ఇస్తామని ప్రకటన నేడు మొహం చాటేస్తున్న అధికారులు నాలుగు గ్రామాల్లో 200 మందికి పైగా కబ్జా రైతులు పరిహారం కోసం పడిగాపులు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
అబ్దుల్లాపూర్మెట్: నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్బీనగర్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నల్గొండ వే బ్రిడ్జి దగ్గర రెండు కార్లలో నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ముఠాను పట్టుకుని విచారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ముచ్చుపాల్ సుధాకర్ రావు, చెన్నం హనుమంతరావు, దేవరశెట్టి పరుశ రాములు, ముప్పూరు పరమేశ్వరరావు, పూరేటి అప్పారావు, మోజాల ఆంజనేయులు ముఠాగా ఏర్పడ్డారు. తెలంగాణలోని పత్తి రైతులకు ఈ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ కిలోకు సుమారు రూ.2,500 చొప్పున విక్రయించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 400 కిలోలు (13 గోనె సంచుల్లో) నకిలీ పత్తి విత్తనాలు, రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏ–1 సుధాకర్రావుపై చండూరు పీఎస్లో, చెన్నం హనుమంతరావుపై చండూరు, అఫ్జల్గంజ్ ఠాణా పరిధిలో ఇప్పటికే నకిలీ విత్తనాల కేసులున్నాయని పోలీసులు చెప్పారు. నకిలీ విత్తనాల మూలం, అక్రమ సరఫరా గొలుసులో పాల్గొన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. రైతులకు పోలీసుల హెచ్చరిక అనుమతి లేని, నకిలీ పత్తి విత్తనాలను ఉపయోగించడంతో మొలక శాతం తగ్గడంతో పాటు పంట పూర్తిగా పాడవుతుందని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ సూచించారు. మల్కాజిగిరి పోలీసులు నకిలీ విత్తనాల తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి, వాటి సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. నకిలీ విత్తనాల విక్రయం లేదా రవాణాకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం తెలిసినవారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. ఆంధ్రా నుంచి పత్తి విత్తనాలు తీసుకువచ్చి తెలంగాణలో విక్రయించేందుకు యత్నం పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ వద్ద ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ. 10లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం -
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
మీర్పేట: పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రూ.50 వేల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం మీర్పేటకు వచ్చి నివాసముంటోంది. 2024లో ఇదే ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కిషన్నాయక్ చౌహాన్ (44) ఆ కుటుంబంలోని బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో పాటు కిడ్నాప్ చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మీర్పేట పోలీసులు కిషన్నాయక్పై కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి తీర్పు వెలువరించారు. -
ఓడల్లో ఉద్యోగాలంటూ ఎగిరిపోదామని!
● ఏప్రిల్ 4న హరియాణా, యూపీ పంజాబ్లకు చెందిన ఆర్యన్, ముకేశ్ కుమార్, రూప్ సింగ్ జెడ్డా మీదుగా లండన్ వెళ్లేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారు. ● మే 2న పంజాబ్లోని కపూర్తల జిల్లా భగవాన్పూర్ గ్రామానికి చెందిన రైతు జషన్ప్రీత్ సింగ్ యూకేలోని మాంచెస్టర్కు వెళ్తూ దొరికిపోయాడు. ● మే 9న గుజరాత్కు చెందిన పంకజ్, రాజస్థాన్కు చెందిన హరికిషన్ భాయ్ భిక్కుభాయ్ టాండెల్ రియాద్ మీదుగా టర్కీకి వెళ్లాలని యత్నించారు. ● మే 19న రాజస్థాన్కు చెందిన లమోరియా శివ్రాజ్ విజయేంద్ర రాస్ అల్ ఖైమాకు వెళ్లే ప్రయత్నంలో చిక్కారు. ● జూన్ 8న ఉత్తరప్రదేశ్కు చెందిన దీపక్ చౌదరి, హరియాణాకు చెందిన అంజలి యూకేలోని మస్కట్ మీదుగా లండన్ వెళ్లే యత్నంలో పట్టుబడ్డారు. సాక్షి, సిటీబ్యూరో: విదేశాలకు వెళ్లాలనుకునేవారితో ఒప్పందాలు చేసుకుని, నకిలీ సీఫేరర్ సర్టిఫికెట్లు తయారు చేసి, దేశం దాటించేలా పథకం వేస్తూ కొన్ని వ్యవస్థీకృత ముఠాలు పని చేస్తున్నాయా..? అంటే ఔననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. మూడు నెలల్లో నకిలీ సీఫేరర్ సర్టిఫికెట్లతో లండన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లడానికి ప్రయత్నించిన తొమ్మిది మందిని శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఈ దందాపై ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్)కు బదిలీ చేశారు. ఈ వ్యవహారాల వెనుక వ్యవస్థీకత ముఠా ఉందని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా దేశాల్లో డిమాండ్ ఉండటంతో... సముద్రంలో ప్రయాణించే వాణిజ్యనౌకలు, కార్గో షిప్లు, ఆయిల్ ట్యాంకర్లు, క్రూయిజ్ షిప్లు, ఆఫ్షోర్ నౌకలు వంటి వాటిలో పనిచేసే ఉద్యోగి. వీరిలో కెప్టెన్, డెక్ అధికారులు, మైరెన్ ఇంజినీర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, డెక్ సిబ్బంది, కుక్లను సీపేరర్ అంటారు. ఆయా దేశాల్లో ఈ పోస్టులకు చాలా డిమాండ్ ఉంది. సీఫేరర్ ఉద్యోగం చేయాలంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్(డీజీ షిప్పింగ్) గుర్తింపు పొందిన శిక్షణా సంస్థల్లో కోర్సులు పూర్తి చేయాలి. అనంతరం స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్, సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్టీసీడబ్ల్యూ) సర్టిఫికెట్లు, కంటిన్యూయస్ డిశ్చార్జ్ సర్టిఫికెట్(సీడీసీ) వంటి అధికారిక పత్రాలు పొందాలి. ఆ ప్రయోజనాల కోసమే... ఇటీవల కొందరు దళారులు నకిలీ సీఫేరర్ సర్టిఫికెట్లు తయారు చేసి యువతను విదేశాలకు పంపుతున్నట్లుగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని దేశాల్లో నౌకా సిబ్బందికి ఇచ్చే క్రూ వీసా లేదా సీమెన్ ట్రాన్సిట్ సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి ముఠాల సహకారంతో విదేశాలకు వెళ్లినవారు అక్కడే అక్రమంగా స్థిరపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్, షిప్పింగ్ కంపెనీలు, విదేశీ పోర్ట్ అధికారులు డీజీ షిప్పింగ్ రికార్డులు, సర్టిఫికెట్ నంబర్లు, శిక్షణ సంస్థ వివరాలను డిజిటల్గా పరిశీలిస్తున్నారు. మూడు నెలల్లో శంషాబాద్ ఎయిర్పోర్టులో 9 మంది అరెస్టు సిటీ సీసీఎస్కు కేసుల బదిలీ ఈ వ్యవహారంపై దర్యాప్తు అధికారుల ప్రత్యేక దృష్టి -
ప్రభుత్వ భూమిని కాపాడండి
ఇబ్రహీంపట్నం రూరల్: అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూర్ రెవెన్యూలోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని, నిషేధిత జాబితాలో చేర్చాలని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునగనూర్ పరిధిలోని సర్వే నంబర్ 44లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యిందని ఆరోపించారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీఎల్ఏ గుర్తించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్యాక్రాంతంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై అధికారులు తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ శారదాదేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బోసుపల్లి ప్రతాప్, నారాయణయాదవ్, కొత్త రామ్రెడ్డి, బచ్చిగళ్ల రమేష్, కొండ్రు పురుషోత్తం, యూసుఫ్రెడ్డి, నోముల కార్తీక్రెడ్డి, మల్లెల ప్రేమ్సాయి, కొలను రవీందర్రెడ్డి, నందగిరి సురేష్, గుండ కృష్ణరామ్రెడ్డి, ఎల్మినేటి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
ప్రతీ బొట్టును ఒడిసి పట్టాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మిషన్ భగీరఽథ మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అడుగు లోతులో వేసిన పైపులైన్లు అప్పుడే పగిలిపోయాయి. లీకేజీలతో కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. ఈ నీటిని తాగిన ప్రజలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు’ అని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణ కోసం చేప ట్టాల్సిన చర్యలపై మంగళవారం కొంగరకలాన్లోని కలెక్టరేట్ భవన సముదాయంలో మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, తాండూరు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, వీర్లపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. కరువును ఎదుర్కొనేందుకు శాఖల వారీగా రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు. మంచినీరు రావడం లేదు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం పైపులైన్ల ద్వారా మంచినీరు సరఫరా కావడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి అధికారులు తప్పుడు సమా చారం ఇస్తున్నారని అన్నారు. తరచూ కరెంట్ పోతోంది గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డిరంగారెడ్డి అన్నారు. సాంకేతిక లోపాలను ఎందుకు సరి చేయడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గుక్కెడు నీళ్లవ్వకపోతే ఎలా.. మండలి చీఫ్విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వలేకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని నిలదీశారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, ప్రజల మధ్యకు వెళ్లలేని పరిస్థితి తలెత్తిందన్నారు. అవగాహన కల్పించాలి జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా ప్రత్యేకాధికారి వికాస్రాజ్ సూచించారు. ఇంటికో ఇంకుడు గుంత వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి మాట్లాడుతూ.. భూగర్భ జలాలు రోజురోజుకూ లోతుకు పడిపోతున్నాయని తెలిపారు. ట్యాంకర్ల కోసం బుకింగ్స్ పెరిగినట్టు చెప్పారు. ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయపంటలు మేలు ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి కంటే కంది, మొక్కజొన్న, పెసర, అలసంద, ఆముదం వంటి పంటలు వేసుకోవడం ఉత్తమమని శాస్త్రవేత్త టి.రాజేశ్వర్రెడ్డి తెలిపారు. స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, అవసరమైతే వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని సరఫరా చేయాలని అన్నారు. ఒకవైపు నీటి వృథాతో కలిగే నష్టాలను వివరిస్తూనే.. మరోవైపు భూగర్భ జలాలను పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలన్నారు. కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకోవాలని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడిని సమర్థంగా ఎదుర్కొందాం భూగర్భ జలాలను పరిరక్షించుకుందాం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి ఎల్నినోపై ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం హాజరైన స్పీకర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు -
ఎల్లమ్మ కల్యాణం.. ఎల్లెడలా ఆనందం
అమీర్పేట: భక్తుల కోర్కెలు తీర్చే బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. భక్తజన సందో హంతో ఆలయ పరిసరాలు పసుపుమయంగా మారాయి. పూజల అనంతరం సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపైకి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉదయం 11.51 గంటలకు ఉత్తర నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తంలో ఎల్లమ్మ కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పుస్తె, మెట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎం సతీమణి గీతారెడ్డి, కూతురు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. వేడుకల్లో మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, ఈఓ వినోద్రెడ్డి, ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, జోగిని శ్యామల పాల్గొన్నారు. -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలం కేటాయింపు
షాద్నగర్రూరల్: ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం షాద్నగర్, ఫరూఖ్నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయిచింది. ఫరూఖ్నగర్ తహసీల్దార్ నాగయ్య మంగళవారం పట్టణంలోని పాతజాతీయ రహదారి పక్కన ఉన్న పాత కోర్టు స్థలాన్ని పరిశీలించారు. సర్వే నంబర్ 178లోని 35 గుంటల భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు హద్దులు ఏర్పాటు చేసి సబ్ రిజిస్ట్రార్లు వికాస్రెడ్డి, శేషగిరికి అప్పగించారు. -
పర్మిషన్ లేకుండా క్రషర్ నిర్వహణ
కేశంపేట: మైనింగ్ శాఖ అనుమతులు వచ్చే వరకు క్రషర్ పనులు చేపట్టవద్దని ఆర్ఐ చెన్నకేశవ ఆర్కాన్ మినరల్స్ క్రషర్ నిర్వాహకులను హెచ్చరించారు. వివరాలు.. వేములనర్వ గ్రామంలోని ఆర్కాన్ మినరల్స్ క్రషర్ మిషన్ లీజు పర్మిషన్ అనుమతి గడువు ముగిసిన నిర్వహకులు రాళ్లను తవ్వి కంకర తయారు చేస్తున్నట్టు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తహసీల్దార్ రాజేందర్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ఐ చెన్నకేశవ మంగళవారం క్రషర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్రాలను పరిశీలించి గడువు ముగిసినట్లు గుర్తించారు. గడువు పొడగింపునకు ప్రభుత్వానికి చలానా చెల్లించామని నిర్వాహకులు తెలిపారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతి వచ్చే వరకు అన్ని పనులు నిలిపివేయాలని హెచ్చచరించారు. కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ను నిలిపి కంకరను అన్లోడ్ చేయించారు. ఆర్ఐ వెంట జీపీఓ రాజేశ్వరి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పనులు నిలిపివేయించిన రెవెన్యూ అధికారులు -
హామీ ఇచ్చి మాట తప్పారు
హద్దులు, ఫెన్సింగ్ వేసే సమయంలో అధికారులు కబ్జాలో ఉన్న ఎకరంన్నర భూమికి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. బీడు భూమిలో రూ.లక్షలు ఖర్చు చేసి షెడ్లు, బోర్లు, పొలాన్ని అభివృద్ధి చేసుకున్న. పరిహారం అందజేస్తామని చెప్పి ఇవ్వకుండానే చదును పనులు చేపడుతున్నారు. – కె.అంజయ్య, కబ్జా రైతు, నక్కర్తమేడిపల్లి సర్వే నంబరు 39లో 1.12 ఎకరా భూమిలో కబ్జాలో ఉన్నా. నేనున్న కబ్జాపై వేరే రైతుకు పరిహారం అందజేశామని అధికారులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి చుట్టూ తిరిగా. పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇవ్వకుండానే చదును పనులు చేస్తామంటున్నారు. – గోపలి అంజయ్య, కబ్జా రైతు, కుర్మిద్ద ఫార్మాసిటీకి భూములు సేకరించిన గ్రామాల్లో కొంత మంది కబ్జా రైతులకు పరిహారం విషయమై నా దృష్టికి వచ్చింది. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. ఆర్డీఓగా కొత్తగా వచ్చినందున గతంలోని అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకుంటా. మొండిగౌరెల్లితో పాటు కబ్జా రైతులందరికీ న్యాయం చేస్తాం. – శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ ఇబ్రహీంపట్నం -
దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట
మొయినాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న ఓంశాంతి నిలయంలో ఆదివారం కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఏ మాత్రం గుర్తించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కడుపున పెట్టుకుని చూసుకుంటోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, దివ్యాంగుల విభాగం నాయకులు నర్సింహాచారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లి: చెందిప్పలో వెలసిన బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ఆదివారం కర్ణాటక హంపీ పీఠాధిపతి శంకరాచార్య విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యారణ్య భారతి స్వామి శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషే కం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకుపచ్చ ఆకారంలో వెలసిన మరకత శివుడికి ఎంతో మహిమ ఉందన్నారు. ఈ లింగాన్ని దర్శించుకుంటే ఆర్థికాభివృద్ధి, ఆధ్యాత్మి క శక్తి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లికార్జున్, ఆలయ కమిటీ చైర్మన్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారిపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీఓ రాష్ట్ర, జిల్లా నాయకత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం నాయకులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం రాష్ట్ర నాయకుడు జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు ఊటు యశ్వంత్ మాట్లాడుతూ.. కిందిస్థాయి వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లను డీఎంహెచ్ఓ వేధిస్తున్నారని మంత్రికి విన్నవించారు. స్పందించిన మంత్రి సమగ్ర విచారణ జరపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీఓ కార్యదర్శి శ్రీనివాస రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాలకు 80 బస్సులుసాక్షి, సిటీబ్యూరో: బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాల సందర్భంగా ఈ నెల 21, 22 తేదీల్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్, ఈసీఐఎల్, దిల్సుఖ్నగర్, కాచిగూడ, మియాపూర్, మల్కాజిగిరి, హయత్నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ఆలయం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్ నగర్ మీదుగా బస్సులను నడపనున్నారు. మరింత సమాచారం కోసం ప్రయాణికులు 99592 26160కు ఫోన్ చేయొచ్చు. -
పనులు బోలెడు.. జీతం మూరెడు!
కేశంపేట: పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మల్టీపర్పస్ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. పరిశుభ్రత నిర్వహణ.. చెత్త సేకరణ.. డ్రైనేజీలు శుభ్రపరచడం.. తాగునీటి సరఫరా పర్యవేక్షణ.. మొక్కల సంరక్షణ.. ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్యానికి వెన్నెముకగా నిలుస్తున్న పంచాయతీ కార్మికులకు పెరుగుతున్న పనిభారానికి సమానంగా జీతాలు మాత్రం పెరగడం లేదు. చాలీచాలని వేతనాలు మల్టీపర్పస్ వర్కర్లకు ప్రభుత్వం నెలకు రూ.9,500 వేతనం అందిస్తోంది. కొన్ని గ్రామాల్లో కేటాయించి న ఒకటే పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు పని చేస్తూ వచ్చే జీతం పంచుకుంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, పిల్లల విద్య, వైద్యం, నిత్యావసర వస్తువుల ఖర్చులు భరించడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలు విధుల్లోనే.. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికు లకు సమయపాలన లేకుండా పోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ, వాన, చలి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. వీధుల పరిశుభ్రత, చెత్త తరలింపు, మురికి కాలువలను శుభ్రం చేయడం, దోమల నివారణ చర్యలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సాధారణ విధులకు మించి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజువారీ పనులతో పాటు ప్రత్యేక దినోత్సవాలు, గ్రామసభలు, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు, స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సేవలకు గుర్తింపేది? మల్టీపర్పస్ వర్కర్లకు రోజురోజుకూ బాధ్యతలు పెరుగుతున్నా జీతాలు పెరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సేవలకు తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థికభద్రత లేవని వాపోతున్నారు. అసెంబ్లీలో ప్రకటించినా.. పంచాయతీ కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.9,500 వేతనం రూ.16వేలకు పెంచుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. అయినా నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం లేవు. కార్మిక చట్టాల ప్రకారం పనికి తగిన వేతనం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు పరిశుభ్రతలో పంచాయతీ కార్మికుల కీలకపాత్ర పెరుగుతున్న పని భారం.. అందని కనీస వేతనం కుటుంబ పోషణ కష్టం అవుతోందని ఆందోళన హామీలు అమలు చేసి, ఆదుకోవాలని విజ్ఞప్తి కేశంపేట: పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ను కార్మికులుగా గుర్తించి, రూ.26వేల చొప్పున కనీస వేతనం అందించాలని పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ వర్కర్స్ జిల్లా 3వ మహాసభకు ఆయనతో పాటు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు. మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీపీ కార్మికులకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకొనే వారికి కార్మికుల సమస్యలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రూ.10లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, బూట్లు, చేతులకు గ్లౌజులు, నూనె, సబ్బులు అందించాలన్నారు. వారాంతపు సెలవులతో పాటు పండుగ దినాల్లో వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్నారు. వెంటనే గుర్తింపుకార్డులు అందించాలని, ప్రస్తుత జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు, తెలంగాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనపల్లి జైపాల్రెడ్డి, జీపీ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆగిరాల రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమరుల ఆశయ సాధనకు కృషి
ఆలయాల భూములకు .. దేవాలయ ప్రాంగణాలు, మాన్యాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు.షాద్నగర్: తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల వీరుల ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఉద్యమ సాధనలో భాగంగా ఎంతో మంది అమరులయ్యారని అన్నారు. అమరుల త్యాగాల పునాదుల మీద ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచం గుర్తించిందన్నారు. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాటానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు షాద్నగర్లో 20 ఎకరాల భూమిని త్వరలో కేటాయిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు శంకరమ్మ, మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్రెడ్డి, బీష్వ కిష్టయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్యాంసుందర్రెడ్డి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మహనీయుల విగ్రహాలు ఆవిష్కణ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ అబ్దుల్ కలాం, బూర్గుల రామకృష్ణారావు, గద్దర్ విగ్రహాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. డంప్యార్డు రద్దుకు వినతి సిద్ధాపూర్లో డంప్యార్డు నిర్మాణం కోసం విడుదలైన జీఓ 641ను వెంటనే రద్దు చేయాలని జేఏసీ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించారు. చైర్మన్ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్రెడ్డి, సర్పంచ్ బాసునాయక్, రవికుమార్గుప్తా తదితరులు వినతిపత్రం అందజేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు -
అసైన్డ్ కబ్జా రైతుల జాబితా ప్రకటన
యాచారం: మొండిగౌరెల్లి గ్రామంలో అసైన్డ్ సర్వేనంబర్ 127లోని కబ్జా రైతుల పేర్లతో కూడిన మొదటి జాబితాను ఆదివారం రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ఈ సర్వే నంబర్లో మొత్తం 122.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అందులో 108 ఎకరాలకే అసైన్డ్ చేశారు. 77 మంది రైతులు 95.12 ఎకరాల్లో అసైన్డ్ పట్టాలు కలిగి ఉన్నారని, అందులో 70.09 ఎకరాల్లోనే సాగులో ఉన్నట్లు గుర్తించారు. 26.30 ఎకరాల అసైన్డ్ భూమి వివాదంతో పాటు కొంతమంది రైతులు పట్టాలు కలిగి ఉంటే, అదే భూమిలో మరొకరు కబ్జాలో ఉన్నట్లు నిర్ధారించారు. మరికొందరి రైతుల పేర్ల మీద పట్టాలు కాలేదని ప్రకటించారు. ఏ సమస్య లేని 77 మంది రైతులకు చెందిన 70.09 ఎకరాలకు ముందస్తుగా రెండు, మూడు రోజుల్లో అవార్డు ప్రకటించి ఎకరాకు రూ.30 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా, పట్టాదారు పాసుపుస్తకాల్లో కంటే తక్కువగా ఎకరాలను జాబితాలో ప్రకటించిన రైతులు రీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘ఓపీఎస్’ను పునరుద్ధరించాలి
కొడంగల్ రూరల్: సీపీఎస్ను రద్దు చేసి పాతపెన్షన్ (ఓపీఎస్) విధానాన్ని పునరుద్ధరించాని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ), జన జాగరణ యాత్ర రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఆది వారం ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి పట్టణంలోని ఎంఆర్సీ భవనం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కడా కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22 ఏళ్లుగా సీపీఎస్ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందిపరిచిన విధంగా ఓపీఎస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ అనంతరం జీవితానికి పాత పెన్షనే భరోసా ఇస్తుందన్నారు. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ.. వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి స్వయంగా అందజేసి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా నని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ ఈయూ జన జాగరణ యాత్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు పట్నం రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఆయూబ్, శ్రీనివాస్, పవన్, మల్లికార్జున్, రవూఫ్, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ -
స్వదేశానికి తీసుకెళ్లండి
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ పహాడీషరీఫ్ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్ వెళ్లిన మహిళ షబ్నంబేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఒమన్లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్ ద్వారా ఒమన్ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్లోని ఇండియన్ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్ నా పాస్పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో కేంద్రం
హుడాకాంప్లెక్స్: పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు ధ్వజమెత్తారు. సంఘం సరూర్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలు, దోపిడీదారులకు అనుకూలంగా అనేక కార్మిక వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చిందని విమర్శించారు. బీడీ, చేనేత పరిశ్రమలపై జీఎస్టీ విధించి ఆ పరిశ్రమలు పనిచేయకుండా చేసి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం, ప్రైవేటు పరం చేయడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఏఐటీయూసీ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్ మాట్లాడుతూ.. అదానీ, అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు చేసి పరిశ్రమలను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారగోని ప్రవీణ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జీఎస్టీ లాంటి తప్పుడు విధానాల మూలంగా దేశంలో సుమారు 5లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని, అనేకమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్రెడ్డి, సరూర్నగర్ మండల కార్యదర్శి బాతరాజు నర్సింహ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యార క్రాంతికుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మారగోని ప్రవీణ్గౌడ్, అధ్యక్ష, కార్యదర్శులుగా రఘుమోహన్రెడ్డి, నరేష్, కోశాధికారిగా భిక్షపతి, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాస్, సీహెచ్ యాదయ్యగౌడ్, సెక్రటరీగా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
దేశాభివృద్ధిలో గిరిజనుల పాత్ర కీలకం
షాద్నగర్: దేశాభివృద్ధిలో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ఆదివారం ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్స్ సొసైటీ వార్షిక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భారతదేశ నాగరికత ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. తరతరాలుగా గిరిజనులు అడవులు, నదులు, పర్వతాలు, జీవ వైవిధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం స్థిరత్వం, వాతావరణ మార్పుల గురించి చర్చిస్తోందని అన్నారు. స్థిరమైన జీవనశైలికి అసలైన అర్థం గిరిజన సమాజ జీవన శైలిలో దాగి ఉందన్నారు. గిరిజన సంప్రదాయాలు దేశ నాగరికత, సాంస్కృతిక వారసత్వంతో ముడివేసుకొని ఉన్నాయని చెప్పారు. విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా, పారిశ్రామికవేత్తలుగా, వైద్యులుగా, క్రీడాకారులుగా, కళాకారులు, ప్రభుత్వ ఉద్యోగులుగా గిరిజనులు రాణిస్తుండడం అభినందనీయమన్నారు. వారు ఎక్కడ నివసిస్తున్నా రాజ్యాంగ బద్ధమైన హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. 12 ఏళ్లుగా ప్రధాని మోదీ గిరిజన సాధికారత, వారి వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించిందన్నారు. హైదరాబాద్లో రూ.25కోట్లతో రాంజీ గోండ్ ట్రైబల్ మ్యూజియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ములుగులో రూ.900కోట్లతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని వివరించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి -
ప్రజా వ్యతిరేకంగా మోదీ పాలన
కందుకూరు: కేంద్రంలో మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానా లను నిస్సిగ్గుగా అమలు చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్ విమర్శించారు. మండల కేంద్రంలో ఆదివారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. పని గంటల విధానాన్ని 12 గంటలకు మార్చి కార్మికుల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. రైతు నల్ల చట్టాల పేరుతో పూర్తిగా అదానీకి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇస్తూ రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంఎస్పీని అమలు చేయకుండా రైతుల అభివృద్ధి పేరుతో ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తూ రైతును నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. డిస్కంల పేరుతో స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ఆలోచన విరమించికోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెంచారన్నారు. మోదీ పాలనను నిరసిస్తూ ఆగస్టు 10న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగే జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేసేలా భారీగా శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.చంద్రమోహన్, రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దుబ్బాక రాంచందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, బుద్దీరపు శ్రీనివాస్, అంకగళ్ల కుమార్, ఆర్.శేఖర్, కె.భాస్కర్, పి.అంజయ్య, జె.రుద్రకుమార్, కె.సురేష్, వంగూరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి -
ఆలయ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు చర్చనీయాంశంగా మారాయి. ఆదాయ వృద్ధి కోసం చేట్టిన ఈ నిర్మాణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాండూరు: దేవాలయ ప్రాంగణాలు, మాన్యాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. గతంలో పచ్చని చెట్లు, ఆధ్యాత్మిక వాతావరణంతో వెల్లివిరిసిన ఈ ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం బస్వన్న కట్ట ప్రాంతంలో పూర్తయిన షాపింగ్ కాంప్లెక్స్, రెండేళ్ల క్రితం భావిగి భద్రేశ్వరాలయ ప్రాంగణంలో చేపట్టిన కాంప్లెక్స్ నిర్మాణాల్లో దుకాణాల ఏర్పాటు చేసుకునేందుకు స్థానికుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు నుంచి స్టే రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం పోట్లి మహరాజ్ ఆలయ ప్రాంగణంలోని చెట్లు, ఇళ్ల నిర్మాణాలను కూల్చి వ్యాపారుల నుంచి ఒక్కో దుకాణానికి రూ.పది లక్షల చొప్పున వసూళ్లు చేపట్టి నిర్మణాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన అధికారులే ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు స్టేతో పనులకు బ్రేక్ భావిగి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల సమయంలో బాలాజీ మందిర్ ఎదుట ఖాళీ స్థలంలో పశువుల సంత నిర్వహించేవారు. 2017లో ఆలయాధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ స్థలంలో 20 దుకాణాలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కాగా పట్టణానికి చెందిన కల్వ శంకర్ కుటుంబ సభ్యులు తమ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారంటూ కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో స్టే వచ్చింది. దుకాణాలు అప్పగించకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న కాంప్లెక్స్ పనులు అడ్డుకోవాలని ఆరు నెలల క్రితం వీరశైవ సమాజం ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ నిర్మాణాలను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దుకాణాల కోసం డబ్బులు చెల్లించిన 46 మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆలయాల భూములకు వ్యాపార గోపురంవివాదాస్పదంగా షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మాణాలు నిలిపివేయాలంటూ కోర్టు స్టే దుకాణాలు కేటాయించేందుకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఆందోళనలో బాధితులు రెండెకరాల్లో పొట్లీ మహరాజ్ ఆలయ ప్రాంగణం విస్తరించి ఉంది. గతంలో పాఠశాల భవనం నిర్మించారు. రెండు నెలల క్రితం ఆలయ ప్రాగణంలోని చెట్లు, పేద కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను కూల్చేసి 26 దుకాణాల ఏర్పాటుకు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇక్కడ ఒక్కో దుకాణం కోసం రూ.పది లక్షల నుంచి రూ.15లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆలయంలో నిర్మిస్తున్న దుకాణాలు వ్యాపారుల చేతికి అందుతాయా.. లేదంటే న్యాయపరమైన చిక్కులతో నిలిచిపోతాయా అనే ఉత్కంఠ నెలకొంది. -
బైక్ను ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్
శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్(లారీ) యూటర్న్ చేస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిని బలంగా ఢీ కొట్టింది. తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మామిడి చెట్టుని ఢీకొట్టి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మండలంలోని కొల్లూరు గేటు వద్ద చోటు చేసుకుంది. మోకిల ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జన్వాడకి చెందిన వడ్ల బ్రహ్మాచారి(45) ఆదివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనుల నిమిత్తం తన ద్విచక్రవాహనంపై నగరం వైపు వెళ్తున్నాడు. అయితే కొల్లూరు గేటు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ అతివేగం, అజాగ్రత్తగా వచ్చి బైక్ని బలంగా ఢీ కొట్టి కొద్దిదూరం లాక్కెళ్లింది. తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మామిడి చెట్టుని ఢీకొట్టి ఆగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంకర్ కింద ఉన్న బ్రహ్మాచారిని బయటకు తీసి, అంబులెన్సులో నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తర్వాత మూడు క్రేన్ల సాయంతో వాటర్ ట్యాంకర్ని పక్కకు తీశారు. ప్రమాదం జరగ్గానే ట్యాంకర్ డ్రైవర్ పరారీ అయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు -
బంజారాహిల్స్లో భారీ చోరీ.. కిలో బంగారం మాయం
బంజారాహిల్స్: ఓ ప్రైవేటు సంస్థ కార్యాలయంలో భద్రపరిచిన కిలో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఈడెన్ గార్డెన్లో ఉన్న గురుకృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో డైమండ్ ఫిక్సింగ్ కోసం సంస్థ లాకర్లో భద్రపరిచిన 1028.59 గ్రాముల బరువు ఉన్న 14 బంగారు ఆభరణాలు (7 నెక్లెస్లు, 7 జతల చెవిపోగులు) కనిపించలేదు. కార్యాలయంలో వాష్రూమ్ కిటికీ ధ్వంసమైనట్లు గుర్తించడంతో దుండగులు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గుజరాత్ సూరత్కు చెందిన వ్యాపారి ప్రీతేష్రమణి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ‘సర్’ పాట్లు అందరికీ తెలిసిందే. బీఎల్వోలు సరిగా ఫారాలు పంపిణీ చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నవారు ఎందరో. ఈ నేపథ్యంలో ఒక్క ఓటు కోసం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఏఈఆర్వో) ఒకరు 10 కిలోమీటర్లు వెళ్లి.. ఓటరు నివాసం వద్ద ఎన్యూమరేషన్ ఫారం అందించారు. చింతల్ సర్కిల్ పరిధిలో ఒక ఓటరు నివాసం బీఎల్వో పోలింగ్ స్టేషన్ పరిధికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో ఆ ఒక్క ఓటూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఏఈఆర్వోగా ఉన్న అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (చింతల్ సర్కిల్–54) కె.ప్రవీణ్ కుమార్ తానే వెళ్లి ఇలా ఫారం అందజేశారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
ఆమనగల్లు: అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు కలిసి మండలంలోని మేడిగడ్డతండాలో పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తండాలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారని స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, ఆమనగల్లు ఎస్ఐ కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ఇందులో 107.90 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డతండాకు చెందిన నేనావతన్ మణిపాల్ ప్రజల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ గోదాములో అప్పగించి ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. హయత్నగర్: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనె తండా గ్రామానికి చెందిన మంజుల(25) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం శుక్రవారం రాత్రి హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత శనివారం వార్డుకు షిఫ్ట్ చేశారు. సాయంత్రం కడుపునొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. మంజుల మృతికి ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. మృతురాలి తల్లి కొర్రా లక్ష్మీభాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మరకత శివాలయంలో ప్రసన్నకుమార్ రెడ్డి పూజలు
శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్ప మరకత శివాలయాన్ని శనివారం ఏపీ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కుమార్యాదవ్ మాజీ మంత్రికి శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ.. పురాతన మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రశాంత్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నీట్లో అక్కాచెల్లెళ్ల అరుదైన ఘనత కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్–2026లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన కమ్మరి రమేశ్చారి, అనిత దంపతులకు కుమార్తెలు వైష్ణవి, రక్షిత. యాచారం మండలం కడ్తాల్ గురుకుల పాఠశాల, కళాశాలలో వారిద్దరిని ఇంటర్మీడియట్ వరకు చదివించారు. వారు నీట్లో మొదటి ప్రయత్నంలో విఫలం చెందారు. తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇరువురికి హైదరాబాద్లో కోచింగ్ ఇప్పించారు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో అక్కాచెల్లెళ్లు 514 మార్కులను సాధించారు. -
అర్హులైన రైతులకు న్యాయం చేస్తాం
యాచారం: మండలంలోని మొండిగౌరెల్లిలో చేపట్టే భూసేకరణకు ఒకే దఫా అర్హుల జాబితాతో కూడిన అవార్డుల ప్రకటన జారీ చేయాలని అసైన్డ్ రైతులు తేల్చి చెప్పారు. శనివారం 19, 68, 127 సర్వే నంబర్లల్లో అసైన్డ్ భూమి సేకరణపై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కోలన్ రమాదేవి అధ్యక్షతన రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న తమకు పరిహారం అందజేయాలన్నారు. భూసేకరణ చేసే రైతులకు ఏ సర్వే నంబరులో ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తారో తెలపాలన్నారు. నకిలీలను గుర్తించి వారి పేర్లను కూడా ప్రకటించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. అసైన్డ్ భూసేకరణ వేగవంతం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, అందుకు రైతులు సహకరించాలని కోరారు. అసైన్డ్ భూములను భవ్యస్కీం కింద అప్పగించడానికి సర్కార్ నిర్ణయించినట్లు తెలిపారు. కబ్జా రైతులకు పరిహారం చెల్లింపులపై ఉన్నతాధికారుల పరిధిలో ఉంటుందన్నారు. నిజమైన రైతులకు న్యాయం చేస్తామని, ఆందోళన అవసరమే లేదన్నారు. విడతల వారీగా అవార్డుల ప్రకటిస్తామని తెలిపారు. ఒకేసారి జారీ చేయడం సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అయ్యప్ప, ఉప సర్పంచ్ బడే కుమార్, వార్డు సభ్యులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి -
ట్రైలర్ లారీని ఓవర్టేక్ చేయబోయి..
అదుపుతప్పిన డీసీఎం కొత్తూరు: వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఓ డీసీఎం ట్రైలర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన క్రారం.. కొత్తూరు నుంచి శంషాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ డీసీఎం ముందు వెళ్తున్న ట్రైలర్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. అదే సయమంలో వెనుక నుంచి వస్తున్న కారు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదు. కాగా ప్రమాదం కారణంగా వాహనాలు రోడ్లపై నిలిచి రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 52 బైక్లు స్వాధీనం కందనూలు: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన దొంగల ముఠా పట్టుకున్న పోలీసులు రిమాండ్ తరలించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత పోలీస్స్టేషన్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మాట్లాడుతూ.. బైక్ల చోరీ ఘటనలో నిందితులు పిట్టల చరణ్కుమార్, జంగం యాదయ్య, చింతకాయల కృష్ణంరాజును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన సూత్రధారి అయిన సంతోష్నాయక్ ఇప్పటికే మరో కేసులో అరైస్టె మహబూబ్నగర్ జైలులో ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం 52 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 25 ఏళ్ల వయసు ఉన్న యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి.. ఈజీ మనీ కోసం హ్యాండిల్ లాక్ వేయకుండా ఇళ్ల ముందు, రోడ్ల పక్కన పార్క్ చేసిన బైకులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారని విచారణలో బయటపడిందన్నారు. మహబూబ్నగర్లో 20, సైబరాబాద్లో 14, హైదరాబాద్లో 4, వనపర్తిలో 3, షాద్నగర్ ఫ్యూచర్ సిటీలో 1, యాదాద్రి జిల్లాలతో 3 బైకులతో పాటు నాగర్కర్నూల్, బిజినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీకి గురైన బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోచుకున్న వాహనాలను బిజినేపల్లి మండలంలోని ఆయా గ్రామాల రైతులు, సామాన్యులకు తక్కువ ధరకు విక్రయించినట్లు పేర్కొన్నారు. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన 26 మంది పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమానులు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ వేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్, శంషుద్దీన్, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
దండం పెడతాం.. డంప్ వద్దు
కొత్తూరు: రాష్ట్ర ప్రభుత్వానికి దండం పెడతాం.. కానీ మండలంలోని సిద్ధాపూర్లో డంప్యార్డును రద్దు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. డంప్యార్డును రద్దు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇన్ముల్నర్వలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు శేఖర్రెడ్డి, సురేందర్, దేవేందర్, నవీన్చారితో పాటు పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అంతేకాకుండా గ్రామాలు, తండాల్లో పలువురిని హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. తాము ప్రభుత్వ విధానాలను, అభివృద్ధిని అడ్డుకోవడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా తమ ఉనికి, స్థానికత, ఆస్తులు, ఆరోగ్యం కోసం ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. డంప్యార్డు ఏర్పాటు చేస్తే వచ్చే కాలుష్యం కారణంగా 50 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని వివరించారు. వెంటనే జీవో నంబర్ 641ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కేసులు పెట్టాలని లేదు: డీసీపీ డంప్యార్డు రద్దు కోసం రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్న ప్రజలపై లాఠీచార్జి, కేసులు నమోదు చేయాలని పోలీసులకు లేదని డీసీపీ శిరీష స్పష్టం చేశారు. చట్ట పరిధిలో ఉన్నంత వరకు మాత్రమే తాము గౌరవిస్తామని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోక తప్పదన్నారు. ఇన్ముల్నర్వలో ప్రజలు చేపట్టిన ధర్నా ప్రాంతంలోనే ఆమె కలెక్టర్తో మాట్లాడగా పది మందిని కార్యాలయానికి రావడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం జేఏసీ, స్థానికులతో ఈ నెల 21న మంగళవారం రోజున కలెక్టర్ నారాయణరెడ్డి తన కార్యాలయంలో చర్చించనున్నట్లు ప్రజలకు తెలిపారు. దీంతో కలెక్టరేట్ ముట్టడి తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు శ్యాంసుందర్రెడ్డి, ప్రభాకర్, శేఖర్రెడ్డి, సురేందర్, సిరాజ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు -
మృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని మహిళా మృతదేహం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో శనివారం లభ్యమైంది. స్థానిక ఎస్ఐ చందర్సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. చెరువులో సమారు 50 నుంచి 55 సంవత్సరాల వయసు గల మహిళా మృతదేహం ఉప్పరిగూడ(చేపలు పట్టే ప్రాంతం) వైపు కొట్టుకొచ్చింది. మృతదేహం ఉబ్బిపోయి ఉందని, ఆమె ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ 8712662361కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. యాచారం: తన భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఓ మహిళా రైతు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డికి మొరపెట్టుకుంది. వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన దిప్తీ అనే వైద్యురాలు మండల పరిధిలోని నస్దిక్సింగారం గ్రామంలో సర్వేనంబరు 245లో ఎకరా 12 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. పట్టా అమలు కోసం మీ సేవల్లో దరఖాస్తు చేసుకుంది. కానీ కలెక్టర్ కార్యాలయం వద్ద రిజక్ట్ అయింది. దీంతో శనివారం యాచారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆర్డీఓను కలిసి తన భూ సమస్యను తెలియజేసింది. వెంటనే స్పందించిన ఆర్డీఓ పూర్తి వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్పల్లి: రోడ్డు పక్కన మేత మేస్తున్న ఎద్దు ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందగా.. రైతుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలోని పర్వేద గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు అనంతయ్య తెలిపిన ప్రకారం.. ఉదయం కాడెడ్లను తాళ్లతో పట్టుకుని మేపుతూ పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తగిలిన ఓ ఎద్దు వెంటనే కిందపడిపోయింది. తాడు వదిలేయడంతో ప్రాణాపాయం తప్పిందన్నాడు. అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరాడు. -
అక్రమాలకు బాట
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రానికే ఫ్రూట్ హబ్గా నిలిచిన బాటసింగారం మార్కెట్లో లైసెన్స్డ్ వ్యాపారుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. దిగుమతి పండ్ల పేరుతో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల వ్యాపారులు మార్కెట్ లైసెన్స్ లేకుండానే దుకాణాలు పెట్టి విక్రయిస్తున్నారు. అధికారులకు ముడుపులు ముట్టజెప్పి నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీ ‘నింజకార్ట్’ ఉద్యోగులు సైతం ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడం అక్రమాలకు అద్దంపడుతోంది. యథేచ్ఛగా వ్యాపారం మార్కెటింగ్ చట్టాల ప్రకారం మార్కెట్లో పండ్లు విక్రయించాలంటే మార్కెట్ కమిటీ నుంచి లెసెన్స్ తీసుకుని ఉండాలి. రోజువారీ క్రయవిక్రయాలపై తక్పట్టీలు జమచేసి అందుకనుగుణంగా ఫీజు చెల్లించాలి. కానీ బాటసింగారం మార్కెట్లో స్థానికేతరులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అమెరికా ఆపిల్, ఆస్ట్రేలియా ఆరెంజ్, ఈజిప్ట్ ద్రాక్ష వంటి విదేశీ ఫలాలను నేరుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక కమీషన్ ఏజెంట్లు ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. నష్టపోతున్న కమీషన్ ఏజెంట్లు లక్షలు వెచ్చించి లైసెన్స్ తీసుకుని, ప్రభుత్వానికి ఫీజులు కడుతూ వ్యాపారం చేస్తున్న స్థానిక కమీషన్ ఏజెంట్లు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లైసెన్స్ లేని వారు తక్కువ రేటుకు అమ్మి మార్కెట్ ఆదాయానికి గండికొడ్డుతున్నారు. అక్రమార్కులు అధికారులకు ముడుపులు చెల్లిస్తూ తమ వ్యాపారాన్ని కుదేలు చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలకు డిమాండ్ అక్రమ వ్యాపారస్తుల కారణంగా ప్రభుత్వానికి ప్రతీ రోజు రూ.లక్షల్లో నష్టం చేకూరుతోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి జోక్యం చేసుకుని విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లెసెన్స్డ్ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది, కొందరు అధికారుల ప్రమేయం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మార్కెట్ ఫీజు చెల్లించకుండా వ్యాపారం బాటసింగారం మార్కెట్లో నష్టపోతున్న లైసెన్స్డ్ వ్యాపారులు లైసెన్స్ లేకుండా స్థానికేతరులు మార్కెట్లో పండ్ల విక్రయాలు చేపట్టడం చట్ట విరుద్ధం. సమస్య మాదృష్టికి రాలేదు. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ విక్రయించే వారి దుకాణాలు వెంటనే తొలగిస్తాం. వ్యాపారానికి లైసెన్స్ తప్పనిసరి. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవు. – ఎల్.శ్రీనివాస్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, బాటసింగారం -
ఉత్తమ సేవలకు అవార్డు
మంచాల: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ఏఎన్ఎం ఎం.జంగమ్మకు అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి అవార్డు ప్రదానం చేశారు. శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవంలో కుటుంబ నియంత్రణ, లింగసమానత్వం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ ఉత్తమ సేవలు అందించిన ఏన్ఎంలు, ఆశవర్కర్లకు అవార్డులు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఆరుట్ల పీహెచ్ఎస్ పరిధి బోడకొండ, ఎల్లమ్మ తండా గ్రామాల్లో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తించిన ఎం.జంగమ్మ ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు ఆమెకు జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జంగమ్మ మాట్లాడుతూ.. 24 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నానని ప్రభుత్వం ఇప్పటికై నా తమ సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, అధికారులు షీబాహయత్, డాక్టర్ రాధిక, పాపారావు, రాకేశ్, జ్యోతిబాయి, మంజుల, శ్రీనివాస్, డాక్టర్ పల్లవి, సూపర్వైజర్ రజిత తదితరులు పాల్గొన్నారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి స్వాతిరెడ్డి షాద్నగర్: రాజీ మార్గమే రాజమార్గమని అదనపు జిల్లా సెషన్స్ జడ్జి స్వాతిరెడ్డి అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. అనంతరం జడ్జి స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలకు, కొట్లాటలకు ప్రజలు ఠాణాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కొత్త రవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మాల్యాల సాహితి, న్యాయవాదులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పార్లమెంట్ అధ్యక్షుడు ప్రకాశ్ మంచాల: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పార్లమెంట్ అధ్యక్షుడు డి.ప్రకాశ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మానసిక దివ్యాంగుల సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన తల్లిదండ్రుల అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు, దివ్యాంగులకు అండగా నిలవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు లత, ఐకేపీ సీసీ లాల్ సింగ్, సిబ్బంది సురక్షిత, కవిత, సంతోష తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి మహేశ్వరం: మండల పరిధిలోని రావిర్యాల ఫ్యాబ్సిటీలో భూములు కోల్పోయిన రైతులకు కందుకూరు మండలం లేమూర్లో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం తయారు చేసిన ప్లాట్లు ఇవ్వడానికి టీజీఐఐసీ అంగీకరించిందని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐఐసీ ఎండీ ఆదేశాల మేరకు శంషాబాద్ జోనల్ మేనేజర్ ఆర్డీఓ కార్యాలయానికి లేఖ రాశారని చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. -
ఉద్యమం ఉధృతం చేస్తాం
శంకర్పల్లి: రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడడం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. శనివారం బహదూర్గూడ వద్ద రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా.. ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి శంకర్పల్లి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 1,500 గజాల భూమి లేదా మరో చోట అంతే మొత్తంలో కోల్పోయిన భూమిని కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు శంకర్పల్లి ఠాణాకి రావడంతో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, శంకర్పల్లి పట్టణాధ్యక్షుడు దయాకర్రెడ్డి, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ -
దేశానికే రోల్ మోడల్గా టీపీఎస్
మంచాల: ప్రభుత్వ పాఠశాలలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ పనిచేస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజార్దుదీన్ అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్)ను శనివారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, గ్రౌండ్, కిచెన్, గ్రంథాలయాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో టీపీఎస్లో అత్యాధునిక విద్యావాతావరణం, క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. టీపీఎస్ దేశానికే రోల్మోడల్గా నిలవనుందని తెలిపారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటప్రసాద్, ఎంపీడీఓ వసంత లక్ష్మి, ఎంఈఓ రాందాస్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాములు, టీపీఎస్ హెచ్ఎం గిరిధర్గౌడ్, గ్రామ పాలకవర్గం, విద్యా కమిటీ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణు వర్ధన్రెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాస్, చంద్రయ్య, మాసయ్య, ఎల్లేశ్, జంగయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలకు చేరాలి ప్రతిఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ -
మట్టి సంరక్షణ చర్యలు చేపట్టాలి
జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుజాత ఇబ్రహీంపట్నం రూరల్: రైతులు మట్టి సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత సూచించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వర్షాల అస్థిరత, మధ్యలో ఏర్పడుతున్న పొడి దశలు, తేమ లోపాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు నేల తేమను కాపాడుకోవడం, మట్టి కోతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పొలాన్ని అవసరానికి మించి దున్నకుండా తక్కువ దున్నకం లేదా సున్నా దున్నకం పద్ధతులను అనుసరించాలన్నారు. పంట అవశేషాలు, గడ్డి, ఆకులు వంటి వాటితో మల్చింగ్ చేసి నేలలో తేమ నిల్వ ఉండేలా చూడలన్నారు. పొలాల్లో ఫీల్డ్ బండ్లు, కాంటూర్ బండింగ్, కాంటూర్ ట్రెంచెస్ ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ చేయాలన్నారు. చిన్న చెక్డ్యామ్స్ గుంతలు, ఫామ్ పాండ్స్ ద్వారా వర్షపు నీటిని సేకరించి అవసరమైనప్పుడు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని వివరించారు. వాలు భూముల్లో కాంటూర్ సాగు పాటించి మట్టి కొట్టుకుపోకుండా చూడాలన్నారు. పొలం అంచుల్లో గడ్డి, చెట్లు లేదా పొదలతో జీవ బండ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. భూపార పరిరక్షణ, సేంద్రియ ఎరువులు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు వినియోగించి నేల సారవంతాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పారు. మట్టి పరీక్ష ఆధారంగా మాత్రమే ఎరువులు వాడి భూసార సమతుల్యతను కాపాడాలన్నారు. పంట మార్పిడి పాటించి నేలలో పోషక లోపం రాకుండా జాగ్రత్త పడాలన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటి అవసరమున్న తక్కువ వ్యవధి కలిగిన పంటలు రకాలను ఎంచుకోవాలి. ఇందుకు రైతులు సమీప వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి భూమి స్వభావం, నీటి లభ్యత, పంట పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక సలహాలు పొందాలని సూచించారు. -
‘భూ భారతి’ బాగుంది
● కితాబిచ్చిన మహారాష్ట్ర తహసీల్దార్ల బృందం ● శంకర్పల్లి తహసీల్ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శంకర్పల్లి: రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ స్థానంలో ప్రవేశపెట్టిన భూ భారతి విధానంపై అధ్యయనం చేసేందుకు శనివారం మహారాష్ట్రకు చెందిన తహసీల్దార్ల బృందం శంకర్పల్లిలో పర్యటించింది. భోపాల్కు చెందిన 35 మంది తహసీల్దార్ బృందానికి శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి, చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యల శాశ్వత పరిష్కారం, డిజిటల్ టైటిల్స్ సులువుగా సేవలు అందిచే పద్దతులను వారికి వివరించారు. రిజిస్ట్రేషన్ అనంతరం వెంటనే భూమి బదిలీ అవుతున్న విధానాలను చెప్పారు. పోర్టల్లో సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ల బృందం భూ భారతి పోర్టల్ అద్భుతంగా ఉందని తమ రాష్ట్రంలోనూ ఈ తరహా పోర్టల్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. -
కరాటేలో గిన్నిస్ రికార్డు
శంకర్పల్లి: షోటోకాన్ కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన మండలంలోని రావులపల్లి కలాన్కి చెందిన మహ్మద్ రహీమ్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురువారం పీసీసీ అధ్యక్షుడు, కరాటే–డో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిశాడు. గత ఏప్రిల్ 26న గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గచ్చిబౌలిలో మాస్టర్స్ ఆఫ్ జపాన్ షోటోకాన్ కరాటే పోటీలు నిర్వహించారు. ఇందులో మహ్మద్ రహీమ్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఫలితాలు అదే నెలలోనే ప్రకటించినప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఫలితాలకు సంబంధించిన వీడియోలను ఇంగ్లాండ్లో ఉన్న ఉన్నతాధికారులకు చూపించారు. వారు గురువారం అధికారికంగా ధ్రువీకరణ పత్రం, మెడల్ పంపించారు. ఈ క్రమంలో రహీమ్ మహేశ్కుమార్ గౌడ్ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. -
లగచర్లను స్ఫూర్తిగా తీసుకోండి
కొత్తూరు: అరెస్టులు, కేసులకు భయపడకుండా లగచర్ల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. డంప్యార్డును వ్యతిరేకిస్తూ సిద్ధాపూర్లో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైలు, రోడ్డు, విమానమార్గాలకు అనువుగా ఉన్న సిద్ధాపూర్లో ఐటీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలేతప్ప డంప్యార్డు కాదన్నారు. ప్రభుత్వం ఈ విషయమై మరోసారి ఆలోచించాలని కోరారు. లేని పక్షంలో లగచర్ల తరహా పోరాటాలకు సిద్ధమవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికై నా పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవ తీసుకోవాలన్నారు. ఆయన వెంట తాము సీఎంను కలిసి సమస్యలు వివరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఐక్య కార్యచరణ కమిటీ ఏర్పాటు చేసి జీవో 641 రద్దు చేసే వరకు ఆందోళనలు చేపట్టాలని, తమ పూర్తి మద్దుతు ఉంటుందని ఎంపీ ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు అందె బాబయ్య, శ్రీవర్థన్రెడ్డి, ఎమ్మె సత్యనారాయణ, అంబటి ప్రభాకర్, ఎల్లారం శేఖర్రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు. హక్కులను కాలరాయడమే.. సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటు చేయడం ప్రజల హక్కులను కాలరాయడమేనని పౌరహక్కుల సంఘం నేతలు విమర్శించారు. పంటలు పండని, ఎవరికీ ఇబ్బంది లేనిచోట ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు, రైతులకు నష్టం చేసే విధంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున తాము కోర్టులు, ఇతర మార్గాల్లో డంప్యార్డు ఏర్పాటును అడ్డుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు నారాయణరావు, తిరుమలయ్య, మిట్టునాయక్, రాంబాల్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మకు కసరత్తు
వికారాబాద్: త్వరలో జిల్లాకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్న నేపథ్యంలో అధికారులు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొదటి విడతలో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించని వాటిని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 2,500 ఇళ్ల చొప్పున కొత్తగా మంజూరు కానున్నట్లు సమాచారం. అయితే స్థలాలు ఉన్న వారికే కేటాయించే అవకాశం ఉండటంతో స్థలం లేని పేదల ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మొదటి విడత ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. కలెక్టర్ దీపక్ తివారి ప్రత్యేక చొరవ తీసుకుని నిరంతర సమీక్షలు చేస్తున్నారు. ఆరు నెలలుగా పనులను పరుగులు పెట్టిస్తున్నారు. హౌసింగ్ శాఖలో ఇంజనీర్ల కొరత కారణంగా కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఇంజనీర్లను ఎంపిక చేసి వారి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన వారంలోపే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. చివరి బిల్లు మాత్రం కాస్త ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. మున్సిపల్ కేంద్రాల్లో త్వరిత గతిన బిల్లులు మంజూరవుతున్నట్లు సమాచారం. ఆయా దశల్లో ఉన్న ఇళ్లు మొదటి విడతలో 12,628 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అనుమతి పత్రాలు అందజేశారు. 9,093 ఇళ్లకు మార్కింగ్ కూడా ఇచ్చారు. ఇందులో 1,732 ఇళ్లు పునాది వరకు పూర్తి కాగా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున విడుదల చేశారు. మరో 939 ఇళ్లు శ్లాబ్ వరకు, మరో 3,256 ఇళ్లు రూప్ కాస్ట్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. వీరికి రూ.4 లక్షల చొప్పున చెల్లించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,840 మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా 249 మందికి రూ.5 లక్షల చొప్పున ఫైనల్ బిల్లు చెల్లించారు. మిగిలిన వారికి చెల్లించాల్సి ఉంది. ఆయా దశలను బట్టి 9,093 ఇళ్లకు రూ.189.43 కోట్లు విడుదల చేశారు. 3,535 మంది ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. వాటిని రద్దు చేసి రెండో విడతలో కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. స్వల్ప మార్పులతో.. మొదటి విడతలో ఎదురైన ఇబ్బందులనుదృష్టిలో ఉంచుకొని అధికారులు రెండో విడతలో స్వల్ప మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇళ్లు ఉండి పైకప్పు దెబ్బతిన్న వాటికి పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కో నియోజకవర్గంలో 500 ఇళ్లను గుర్తించి పైకప్పు మాత్రమే నిర్మించుకునే వారికి రూ.2 లక్షల చొప్పున బిల్లులు చెల్లించాలని భావిస్తున్నారు. మొదటి విడతలో 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ వరకు ఇల్లు నిర్మించుకోవాలనే నిబంధన ఉండేది. దీన్ని 750 ఎస్ఎఫ్టీ వరకు సడలించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తమకు కూడా అవకాశం కల్పించాలని స్థలాలు లేని పేదలు కోరుతున్నారు. త్వరలో రెండో విడత ఇళ్లు మొదటి విడతలో ఇలా.. జిల్లాకు కేటాయించిన ఇళ్లు 12,628 పూర్తయిన ఇళ్లు 1,840 ఆయా దశల్లో ఉన్నవి 9,093 ఇంకా ప్రారంభం కానివి 3,535 లబ్ధిదారులకు చెల్లించిన మొత్తం రూ.189.43 కోట్లు -
పాడి పరిశ్రమను వదలొద్దు
షాబాద్: పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసరావు రైతులకు సూచించారు. మండల పరిధిలోని కుమ్మరిగూడను గురువారం సందర్శించిన ఆయన పాడి పశువులు, పాకలు, పశుగ్రాసాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని, పాడి పరిశ్రమను వదలొద్దని రైతులకు సూచించారు. సబ్సిడీపై దాణా ఇచ్చే విషయమై ఉన్నతాధికారులకు లేఖ రాస్తానని చెప్పారు. వర్షాకాలంలో పశువులకు వచ్చే రోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన షాబాద్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, మందుల స్టాకు రిజిస్టర్ను పరిశీలించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరికి గాయాలు
కొత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ దివ్యాంగుడైన యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరేష్(27) జేపీదర్గా సమీపంలోని నిత్యం భిక్షాటన చేస్తూ కాలినడకన ఇన్ముల్నర్వలోని ఇంటికి చేరుకుంటాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడ్ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు బాధితుడి అన్న రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్: తాగిన మైకంలో గొడవపడి తలపై కర్రతో కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లాకు చెందిన బేరి నరసింహులు గత 6 నెలలుగా కొంపల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కింద ఉంటూ అడ్డా కూలీగా పని చేస్తున్నాడు.ఇతనితో పాటు కన్నా అనే వ్యక్తి కూడా ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒకే చోట నిద్రపోతూ.. ఉదయం కూలి పనులకు వెళ్లి వచ్చేవారు. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. నరసింహులు తలపై, కాళ్ల పైన కర్రతో కన్నా కొట్టి తీవ్రంగా గాయపరచడంతో అతడు కింద పడిపోయాడు. అతని పక్కనే తాగిన మైకంలో ఉన్న కన్నా సైతం నిద్రపోయి తెల్లవారుజామున పరారయ్యాడని పోలీసులు తెలిపారు. మృతుని జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా చనిపోయిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన నరసింహులు అని తేలింది. ఈ మేరకు ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ చొరవతో రక్షించిన అధికారులు సిటీ కోర్టులు: దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ అందించిన సమాచారంతో అధికారులు కోట శ్రీనివాస్ అనే కార్మికుడిని హఫీజ్పేట్ ప్రేమ్నగర్ నిర్మాణ స్థలం నుండి రక్షించారు. వివరాలు.. కుటుంబ అవసరాల కోసం రూ.1.60 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న శ్రీనివాస్ను కృష్ణ, రాము అనే కాంట్రాక్టర్లు గత నాలుగేళ్లుగా బంధీగా ఉంచి, రోజుకు కేవలం రూ.100 ఇస్తూ ఉదయం నుండి రాత్రి వరకు బలవంతంగా పని చేయించేవారు. తిరస్కరిస్తే దాడులకు పాల్పడేవారు. అతని భార్యతో కూడా వేరే చోట పని చేయించి, ఆమె జీతాన్ని ఈ అప్పు వడ్డీ కింద జమ కట్టేవారు. ఇటీవల శ్రీనివాస్ను స్వగ్రామానికి పంపి, అతని భార్యను నెలరోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ కర్ణ కుమార్, కార్యదర్శి అనూష ఆదేశాల మేరకు రెవెన్యూ, లేబర్, కార్మిక శాఖల అధికారులు దాడి చేసి భార్యాభర్తలిద్దరినీ సురక్షితంగా రక్షించారు. సనత్నగర్: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని బేగంపేట, ప్రకాశ్నగర్లలో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి నిర్మాణ, కూల్చివేతల(సీఅండ్డీ) వ్యర్థాలు అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గురువారం ఇంజినీరింగ్, అర్బన్ బయోడైవర్సిటీ విభాగాల అధికారులు, రామ్కీ, ఈపీటీఆర్ఐ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రహదారి పక్కన అక్రమంగా పారబోసిన నిర్మాణ వ్యర్థాలను గుర్తించిన కమిషనర్ సంబంధిత ఆస్తి యజమానిని, బిల్డర్ను ప్రశ్నించారు. అధీకృత సంస్థకు బదులుగా అనధికార వాహనాలను వినియోగించినట్లు తేలడంతో వెంటనే అధికారులు, మౌలాలి–అమ్ముగూడ ప్రాంతంలో అనధికారికంగా డంప్ చేస్తున్నట్లు గుర్తించారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
బషీరాబాద్: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బాబునాయక్ తండా లో గురువారం చోటు చేసుకుంది.పోలీసు లు,స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు జెర్పుల రాములు నాయక్(51) ఉదయం పొలంలో బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంతో ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తగిలి పడిపోయాడు. గమనించి న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాములు నాయక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య సుశీలబాయి, కుమారులు బాబు, నితిన్, కుమార్తె భూమిక ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరు జిల్లాఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
సౌకర్యాలు లేక రోగులకు ఇబ్బంది
ఇబ్రహీంపట్నం: తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు, సిబ్బందికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజాతంత్ర మహిళా సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి భవనాన్ని కూల్చివేసి తాత్కాలికంగా మున్సిపల్ కార్యాలయ పాత భవనంలో కొనసాగుతున్న ఆస్పత్రి పనితీరును ఆ సంఘం నేతలు గురువారం సర్వే చేశారు. ఆరుగురు డాక్టర్లుతో 19 మంది వైద్య సిబ్బంది ఉన్న పేషెంట్లకు సరైన వైద్యం అందించడం ఇబ్బందికరంగా మారిందన్నారు. అత్యవసర కేసులు వస్తే నగరానికి రెఫర్ చేస్తుండటంతో పేదలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. సరైన సౌకర్యాలు కల్పించాలని, నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ సర్వేలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయమ్మతోపాటు ఉన్నిసా బేగం, భూదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సర్వే -
తాటి చెట్టు.. అంతరించేట్టు
ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లిలో ఇటీవల ఓ వ్యక్తి రాత్రికి రాత్రే ఏకంగా 23 తాటి చెట్లను కూల్చి వేశాడు. అందులో పండుతాడు నుంచి రోజుకు 8 లీటర్ల కల్లు పారే చెట్లు పది వరకు ఉండడంతో గీత కార్మికులు కంట తడి పెట్టారు. ఆదిభట్ల మున్సిపాలిటీ సర్కిల్ కొంగరకలాన్లో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 57 తాటిచెట్లు నరకడానికి అనమతులు పొందింది. ఆ చెట్లను కూల్చడానికి ప్రయత్నిస్తుండగా గురువారం స్థానిక గీత కార్మికులు అడ్డు కోవడంతోఎనిమిది వరకు చెట్లు కూల్చి ఆపివేశారు. భూముల ధరలు పెరగడంతో.. రాత్రికి రాత్రే నేలమట్టం గీత వృత్తిపై రియల్ పడగ ఇష్టానుసారంగా వృక్షాల నరికివేత సొసైటీలకు తెలియకుండానే జరుగుతున్న తతంగం కల్లు పారే చెట్లను సైతం వదలని వైనం లబోదిబోమంటున్న కార్మికులు -
శాంతిభద్రతల్లో రాజీపడొద్దు
యాచారం: సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్సిటీ భద్రత మనపైనే ఉందని, శాంతి భద్ర తల నిర్వహణలో రాజీపడొద్దని మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి సూచించారు.కుర్మిద్దలో ఉన్న హై దరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణాను గురువారం ఆ యన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీ లించి, రిజిస్టర్లు, కేసుల దర్యాప్తు పురోగతి,పెండింగ్ కేసుల స్థితి, శాంతిభద్రతల నిర్వహణ, బీట్ వ్య వస్థ, నేర నియంత్రణ చర్యలుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తరచూ ఈ ప్రాంతంలో సీఎం రేవంత్రెడ్డితో సహా మంత్రులు,ఉన్న తాధికారుల పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంత రం సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి స మస్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు సునీల్కుమార్, సైదులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రికి ఆహ్వానం
షాద్నగర్: నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ఆగస్టు 7, 8 తేదీల్లో పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గురువారం న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయానికి పాలమూరు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, అనుబంధ కళాశాలల సంఘం అధ్యక్షుడు శ్రీవర్ధన్రెడ్డి వెళ్లి కలిశారు. సదస్సుకు హాజరు కావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి యాచారం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సర్కార్ దృష్టి సారించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ అన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా గురువా రం మొండిగౌరెల్లి, నల్లవెల్లి, మాల్, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు, పెండింగ్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. పీఆర్సీ తక్షణమే ప్రకటించాలని, పదోన్నతులు, బదిలీలను వెంటనే చేపట్టాలని, సీపీఎస్ను రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తు పాండురంగారెడ్డి, నాయకులు చారి, నరేందర్రెడ్డి, లక్పతి, బాలకృష్ణ, లింగం తదితరులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ తనిఖీ కేశంపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న 108 అంబులెన్స్ను జిల్లా క్వాలిటీ ఆడిటర్ కిశోర్, ఎమర్జెన్సీ ఎగ్జి క్యూటివ్ రాజబాబు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలో నిల్వ ఉన్న మందుల గడువు తేదీ, సామగ్రిని పరిశీలించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఈఎంటీ సురేష్, పైలెట్ దీపక్ పాల్గొన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు కందుకూరు: తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంవారిని మరింత ఇబ్బందులకు గురిచేసేలా నిర్ణ యాలు తీసుకుంటోందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూరియా సహా ఎరువుల ఉచిత రవాణా సౌకర్యాన్ని నిలిపివేయడం ద్వారా రైతులపై సుమారు రూ.250 కోట్ల అదనపు భారం మోపుతోందన్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, విద్యుత్ సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. పండించిన పంటకు బోనస్ ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వం, కనీసం వ్యవసాయానికి అవసరమైన ఎరువులను కూడా అందించకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా నాయకుడు జిట్టా రాజేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఉన్నారు. -
‘వికసిత్ భారత్’ పోస్టర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: వికసిత్ భారత్ ఆశయ సాధనకు యువత దోహదపడాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ‘మై భారత్–వికసిత్ భారత్ యువజన నమోదు’ అవగాహన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యువత మైభారత్ పోర్టల్లో చురుగ్గా నమోదు చేసుకోవాలని, స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వం, దేశ నిర్మాణం కోసం అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా యువత నమోదు, భాగస్వామ్యాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడమే ప్రచార లక్ష్యమని తెలిపారు. అర్హులైన యువతకు అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థలు, యువజన సంఘాలు, వలంటీర్లను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఆయాలకు నియామకపత్రాలు సామాజిక సేవే లక్ష్యంగా అంగన్వాడీ సిబ్బంది పని చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. గురువారం కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వుల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ హెల్పర్లకు అంగన్వ్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించారు. అనంతరం ఎనిమిది మంది అంగన్వాడీ ఆయాలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలో ఖాళీ అవుతున్న అంగన్వాడీ టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
వచ్చింది రాసేసి.. తోచింది ఇచ్చేసి!
మొయినాబాద్: సాధారణంగా ఆర్ఎంపీ డాక్టర్లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటంది. నిబంధనల ప్రకారం ఎలాంటి సూదిమందులు, సైలెన్లు పెట్టడానికి వీల్లేదు. వచ్చిన రోగులకు ప్రథమ చికిత్స అందించి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు రెఫర్ చేయాలి. కానీ మొయినాబాద్లోని ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఏకంగా ఆస్పత్రినే నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. దీనిపై ఇటీవల స్థానికులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసి సదరు క్లినిక్ను సీజ్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెడ్లు వేసి.. సిబ్బందిని నియమించుకుని మున్సిపల్ కేంద్రంలో శ్యామ్ క్లినిక్ పేరుతో ఓ ఆర్ఎంపీ వైద్యుడు క్లినిక్ నడుపుతున్నాడు. ఆయన భా ర్య కూడా అందులో డాక్టరే. మరో నలుగురు సిబ్బందిని పెట్టుకుని క్లినిక్ పేరుతో ఆస్పత్రినే నడు పుతున్నారు. సుమారు పది బెడ్లు వేసి వచ్చినవారికి సూది మందులతోపాటు సైలెన్లు ఎక్కిస్తున్నారు. క్లినిక్కు అనుబంధంగా మెడికల్ షాపు సైతం నడు పుతున్నారు.నిత్యం వందల మంది రోగులువస్తుండడంతో వైద్య పరీక్షలు, సూదిమందులు, సైలె న్లు అంటూ వారి నుంచి రూ.వేలల్లో గుంజుతున్నారు. వికటిస్తున్న వైద్యం పదేళ్లకు పైగా నడుస్తున్న ఈ క్లినిక్లో చాలా మందికి వైద్యం వికటించింది. ఇటీవల కనకమామిడికి చెందిన ఓ మహిళ వైద్యం కోసం రాగా చాలా రకాల పరీక్షలు చేశారు. సూది మందులు, సైలెన్లు ఎక్కించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ 20 రోజుల పాటు చికిత్స పొందుతూ చివరికి మరణించింది. ఆరు నెలల క్రితం కాళ్లనొప్పులతో వచ్చిన వ్యక్తికి క్లినిక్లో ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇతర ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నా తగ్గకపోవడంతో కాలును తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో.. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీ డాక్టర్పై ఇటీవల స్థానికులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు క్లినిక్ను తనిఖీ చేసి సూదిమందులు, సైలెన్లు, బెడ్లు ఉండటాన్ని గుర్తించారు. క్లినిక్ బోర్డుపై ఎంబీబీఎస్ డాక్టర్ల పేర్లు రాసి ఉండటంతో తీవ్రంగా పరిగణించిన ఈ నెల 7న క్లినిక్ను సీజ్ చేశారు. అదేరోజు రాత్రి ఆర్ఎంపీ వైద్యుడు ఫుల్లుగా మద్యం తాగి బస్తీవాసులు, స్థానికులను బండబూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. దీనిపైనా స్థానికులు మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నయీమొద్దీన్ తెలిపారు. చాలా క్లినిక్లలో ఇదే తీరు మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లినిక్ల పేరుతో ఆర్ఎంపీ డాక్టర్లు జోరుగా ఆస్పత్రులు నడుపుతున్నారు. ఇష్టానుసారంగా సూది మందులు, సైలెన్లు ఎక్కిస్తూ అమాయక ప్రజల నుంచి వేల రూపాయల ఫీజులు గుంజుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్ఎంపీల అరకొర వైద్యం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు మొయినాబాద్లో ఆర్ఎంపీ వైద్యుడు నడుపుతున్న క్లినిక్పై ఫిర్యాదులు వచ్చా యి. వైద్యాధికారులను పంపించి తనిఖీ చేయించాం. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించి సీజ్ చేశాం. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేయిస్తాం. ఆర్ఎంపీ వైద్యులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – స్వర్ణకుమారి, జిల్లా వైద్యాధికారి -
నీరీక్షిస్తున్నారు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో 5.06 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. వీటిలో 1.62 లక్షల ఎకరాల్లో వరి, 1.94 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా. ఈ ఏడాది ఇప్పటి వరకు సగం భూమిలో కూడా పంటలు వేయలేదు. ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ ఉందని, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణశాఖ పదేపదే చెబుతున్నప్పటికీ.. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. రైతుల దృష్టిని ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించలేకపోయారు. ఆన్లైన్లో పంట వివరాల నమోదు, ఫెర్టిలైజర్స్ బుకింగ్స్కే పరిమితమవుతున్నారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి గ్రామానికి ఒక రైతు వేదికను ఏర్పాటు చేసినా.. అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, షాద్నగర్, కేశంపేట తదితర మండలాల్లో పంటలు వాడిపోయి కన్పిస్తున్నాయి. పాతాళానికి చేరిన గంగమ్మ మెజార్టీ మండలాలు కాంక్రీట్ జంగిల్గా మారా యి.వర్షపు చినుకు కురిసినా భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి లేదు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగం అధికమైంది. భూమిలోకి ఇంకే నీటి శాతంతో పోలిస్తే మోటార్ల ద్వారా బయటికి తోడేస్తున్న జలాలే అధికం. ఫలితంగా భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. మే నెలతో పోలిస్తే జూన్లో మరింత లోతుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరూర్నగర్లో అత్య ధికంగా 29.72 మీటర్ల లోతుకు,అబ్దుల్లాపూర్ మెట్ 19.29 మీటర్లు, శంకర్పల్లి 16.88 మీటర్లు, కడ్తాల్ 15.51 మీటర్లు, చౌదరిగూడెం 15.18 మీటర్లు, షాబాద్ 13.75 మీటర్లు, ఇబ్రహీంపట్నం 13.63 మీటర్లు, చేవెళ్ల, తలకొండపల్లి 13.26 మీటర్లు, మహేశ్వరంలో 12.77 మీటర్ల లోతుకు పడిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే మెజార్టీ బోర్లు పని చేయడం లేదు. దీంతో ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉస్మాన్సాగర్, హియాయత్సాగర్ ఎగువన ఉన్న మూసీ, ఈసీ వాగుల సమీపంలోని వ్యవసాయ భూముల్లోనే కాదు దిగు వన ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీగా బోర్లు వేసి నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎదురుచూస్తున్నాం ఏడు ఎకరాల్లో రూ.70 వేల పెట్టుబడితో కందిపంట సాగుచేశాను. వర్షాలు లేకపోవడంతో పంట ఎండిపోయే దశలో ఉంది. సాగు చేసినా చేతికి వస్తుందనే నమ్మకం లేదు. వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం. – సుజాత, రైతు, చింతలపల్లి, ఆమనగల్లు ముఖం చాటేసిన వరుణుడు కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. మృగశిర, ఆరుద్ర కార్తెలు దాటినా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. తొలకరికి వేసిన పంటలు నీరు లేక వాడిపోతున్నాయి. ఏపుగా పెరిగి, గూడ, పూత దశకు చేరుకోవాల్సిన పత్తి మొక్కలు ఇప్పటికీ నేల చూపులు చూస్తున్నాయి. మృగశిర రోజు నారు పోసిన కొంతమంది రైతులు.. నీరు లేకపోవడంతో ఇప్పటికీ పొలాలు దున్నలేదు. -
యువ సంగ్రామానికి తరలిరండి
హుడాకాంప్లెక్స్: నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఏర్పాట్లలో భాగంగా బుధవారం సభా వేదిక నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మాజీ మంత్రులు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితారెడ్డి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన వేదిక నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించి సంబంధిత కమిటీలకు పలు సూచనలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేసి, నిరుద్యోగ యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లుశంకర్పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దూరదృష్టి ఉన్న నాయకుడని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కితాబిచ్చారు. బుధవారం ఆమె కేటీఆర్ ఆధ్వర్యంలో జన్వాడలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. కేసీఆర్ను తిట్టడమే తప్ప పాలన చేతకావడం లేదని విమర్శించారు. రెండున్నరేళ్లలో 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్కు తరలినట్లు చెప్పారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చేతులమీదుగా పాఠశాల భవనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నట్లు తెలిసిందని వారికి అదే రోజు సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శంకర్పల్లి మండల, పట్టణాధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఎంఈఓ రవీందర్ రావు, నాయకులు రాజు నాయక్, వెంకటేశ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రులు సబితారెడ్డి, తలసాని -
బతుకుల్లో.. కరెంట్ చీకట్లు!
గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇంట్లో వెలుగులు నింపాల్సిన కరెంట్.. కార్మికులు, అమాయక ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే ఇంటి ముందు చెట్ల కొమ్మల మధ్యన వేలాడుతున్న వైర్లు తెగిపడుతున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఫీడర్ ట్రిప్పై సరఫరా వెంటనే నిలిచిపోవాలి. కానీ సబ్స్టేషన్లలో తలెత్తిన నిర్వహణ లోపాల కారణంగా తీగలు తెగిపడిన తర్వాత కూడా కండక్టర్లో విద్యుత్ ప్రసరణ కొనసాగుతోంది. ఈ విషయం తెలియని అమాయ క ప్రజలు వాటిని తాకి విద్యుదాఘాతానికి గురవుతున్నారు. ఓవర్హెడ్ లైన్లు తెగిపడిన వెంటనే సర్క్యూట్ బ్రేకై .. రిప్లై ప్రొటక్షన్ తెరుచుకుని క్షణాల్లోనే ఫీడర్ ట్రిప్పై సరఫరా నిలిచిపోతుంది. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న ఘటనల్లో రిప్లై ప్రొటక్షన్ ఎందుకు పని చేయలేదనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫలితంగా ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం 19 నెలల వ్యవధిలో 25 మంది విద్యుదాఘాతంతో మృత్యువాతపడగా, ఆరుగురు మంచానికే పరిమితమయ్యారు. ఇక మేత కోసం వెళ్లిన 177 పశువులు విద్యుత్షాక్కు గురయ్యాయి. ఈ ప్రమాదాలకు క్షేత్రస్థాయిలోని ఏఈ, ఏడీఈ, డీఈలదే బాధ్యత. కానీ యాజమాన్యం ఇప్పటి వరకు ఏ ఒక్క ఇంజనీర్పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా పేరుతో ప్రతీ మూడు నెలలకోసారి లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్ల నుంచి ఆయిల్ లీకేజీల నియంత్రణ, వేలాడుతున్న కండక్టర్ను సరిచేయడం, దెబ్బతిన్న కండెన్సర్లు, ఏబీ స్విచ్లు, ఫ్యూజ్బాక్స్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయిన్పటికీ సరఫరా వ్యవస్థ మెరుగుపడకపోగా.. అనేక మంది మృత్యువాతకు కారణమవుతోంది. టెండర్ దశ దాటని యూజీ కేబుల్ పనులు ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటం, స్తంభాలు విరిగిపోవడం, డీటీఆర్లు నేల కూలుతున్నాయి. విపత్తుల సమయంలో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం ప్రమాదకరంగా మారిన ఓవర్హెడ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను వేయాలని నిర్ణయించింది. ఏడాది క్రితం సెక్షన్ల వారీగా వివరాలు సేకరించి, ఆ మేరకు అంచనాలు రూపొందించింది. ఓవర్ హెడ్లైన్లు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే రూ.14 వేల కోట్లకుపైగా అవసరం ఉంటుందని అంచనా వేసింది. మొదటి విడదతలో కోర్సిటీలో పనులు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు రూ.4 వేల కోట్ల అంచనాలతో పనులను ప్రతిపాదించింది. కాగా ఇప్పటికీ ఆయా పనులు టెండర్ దశకూడా దాటలేదు. విద్యుత్ ప్రమాదాలు ఆగడం లేదు. మచ్చుకు కొన్ని ప్రమాదాలు ● జార్ఖండ్కు చెందిన చాంపే లేహేంగే(32) బతుకుదెరువుకోసం మొయినాబాద్ మండలం కనకమామిడికి చేరుకున్నాడు. శంకర్పల్లి మండలం మోకిలాతండలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మార్చే పని కోసం వెళ్లాడు. కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాడు. దీంతో ఆయన భార్య, 12 ఏళ్ల కొడుకు అనాథలయ్యారు. ● షాబాద్ మండల కేంద్రం ఎస్సీ హాస్టల్ వెనుక భాగంలోని ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఇటీవల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈదురుగాలులకు తెగిపడిన వైర్లను సరిచేసే పనులను లైన్మెన్ సాజిద్ చేయాల్సి ఉంది. కానీ సంస్థతో ఎలాంటి సంబంధం లేని 17 ఏళ్ల సాయితేజ్ను కరెంట్ స్తంభాన్ని ఎక్కించాడు. మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై స్తంభంపైనే విగత జీవిగా మారాడు. ● సరూర్నగర్ సర్కిల్ పరిధిలో లైన్ ఇన్స్పెక్టర్ ఎస్.భరత్(51) ఇటీవల లైన్మెన్ రాందాసును వెంట తీసుకుని పిగ్లీపూర్లోని సిటీ మీటర్ సర్వీసు రీడింగ్ తీసేందుకు వెళ్లారు. ఆర్–ఫేజ్ హెచ్జీ ఫ్యూజ్ వైరు ఆస్ట్రక్చర్ తాకడంతో ఏబీస్విచ్ ఆపరేటింగ్ పైపునకు విద్యుత్ ప్రవహించింది. విధి నిర్వహణలో భాగంగా వీరిద్దరూ 11 కేవీలైనుకు సంబంధించిన ఏబీస్విచ్ను ఓపెన్ చేసేందుకు యత్నించగా భరత్ విద్యుత్షాక్కు గురై.. అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన లైన్మెన్ రాందాసు చికిత్స పొందుతున్నాడు. చేతికి గ్లౌజులు వేసుకోక పోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఈ రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని మిగిల్చింది. షాబాద్లో విద్యుత్ స్తంభంపై విగతజీవిగా వేలాడుతున్న 17 ఏళ్ల బాలుడు సాయితేజ(ఫైల్) మృత్యుపాశాలుగా మారుతున్న విద్యుత్ లైన్లు ప్రమాదాల కారణంగా 19 నెలల్లో 25 మంది మృతి ఆరుగురికి గాయాలు.. 177 పశువులు మృత్యువాతసర్కిల్ మృతులు క్షతగాత్రులు మూగజీవాలు సైబర్సిటీ 03 0 63 రాజేంద్రనగర్ 10 0 44 సరూర్నగర్ 04 2 04 వికారాబాద్ 08 4 66


