breaking news
Ranga Reddy District Latest News
-
అధికారిక ముద్ర!
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025అక్రమాలకు.. సాక్షి, రంగారెడ్డిజిల్లా: లింకు డాక్యుమెంట్ నంబర్ లేకపోయినా.. ఇరువురి మధ్య ఆర్థికపరమైన లింకు కలిస్తే చాలు.. ఎలాంటి స్థలానికై నా ఇట్టే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్, సబ్ రిజిస్ట్రా ర్లు అక్రమార్కులతో చేతులు కలుపుతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. విలువైన స్థలాల ఆక్రమణలకు, ఘర్షణలకు కారణమవుతున్నారు. అక్రమ లే అవుట్కు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా గండిపేట ఎస్ఆర్ఓ అధికారిక ముద్ర వేస్తే.. ఎలాంటి నిర్మాణాలు లేని ఖాళీ ప్లాట్లకు ఎల్బీనగర్ మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. లింకు డాక్యుమెంట్ నంబర్ లేని ప్లాట్లకు ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ కానీ ఖాళీ స్థలాలకు తాండూరు ఎస్ఆర్ఓ తేదీలు ఏమార్చి రెండు వందలకుపైగా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదమైంది. అదే గండిపేట రహస్యం సికిందర్గూడలోని పది ఎకరాల భూమిపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక రికార్డుల్లో ఆ భూములపై డీఏజీపీఏ (డెవలప్మెంట్ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఉన్నప్పటికీ తప్పుడు సమాచారంతో దాన్ని రద్దు చేసి, రాత్రికిరాత్రే నాలా కన్వర్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఓ తెల్లకాగితంపై లే అవుట్, అందులోని ఖాళీ ప్లాట్లకు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ఇంటి నంబర్లు జారీ చేయడం, తర్వాత వారు టీఎస్ బీపాస్కు దరఖాస్తు చేయడం, ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంటి నిర్మాణానికి జారీ చేసిన తాత్కాలిక అనుమతుల ఆధారంగా ఏకంగా 23 ప్లాట్లకు గండిపేట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. మున్సిపల్ కార్పొరేషన్, రిజిస్ట్రేషన్ అధికారులు కలిసి అక్రమ లే అవుట్కు అధికారిక ముద్ర వేశారు. అప్పటికే జీపీఏ చేసుకున్న నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో విషయం బయటపడింది. అవకాశంగా లొసుగులు సరూర్నగర్ మండలం కర్మన్ఘాట్ రెవెన్యూ సర్వే నంబర్ 60లోని భూమిని 45 ఏళ్ల క్రితమే అప్పటి పంచాయతీ అనుమతితో లే అవుట్ చేశారు. యజమానులు ఆయా ప్లాట్లన్నీ అమ్మేశారు. అప్పట్లో డాక్యుమెంట్లను ఆన్లైన్లో నమోదు చేసే వ్యవస్థ లేకపోవడం, ప్రస్తుతం ఆయా ప్లాట్ల వివరాలు ఆన్లైన్లో కన్పించక పోవడాన్ని ఓ ముఠా అవకాశంగా తీసుకుంది. తొలుత పాతస్టాంపు పేపర్లపై నోటరీ డాక్యుమెంట్ సృష్టించింది. తర్వాత ఆస్తికి వ్యాల్యూయేషన్ చేయించింది. ఎల్బీనగర్ మున్సిపల్ అధికారులకు డబ్బుల ఎర వేసి ఎలాంటి నిర్మాణాలు లేని ఖాళీ స్థలానికి ఇంటి నంబరు సహా ఆస్తిపన్ను చెల్లింపు రసీదులను సంపాదించింది. పూర్వ లింకుడాక్యుమెంట్ నంబర్, ఈసీ కూడా లేని ఖాళీ ప్లాట్కు ఎల్బీనగర్ సబ్రిజిస్ట్రార్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో అంతు చిక్కడం లేదు. రూ.2 కోట్లకుపైగా విలువ చేసే ఖాళీ స్థలాన్ని ఇటీవలే ఓ ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాల ఆధారంగానే తాను రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందని, తర్వాత స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుతో డాక్యుమెంట్ను బ్లాక్లిస్టులో పెట్టడం జరిగిందని ప్రస్తుత ఎస్ఆర్ఓ చెబుతుండటం విశేషం. ఈ ఒక్క లే అవుట్లోనే ఈ తరహా ప్లాట్లు మరో 20 వరకు ఉన్నట్లు సమాచారం. స్కానింగ్ చేయకపోవడంతో.. అనధికారిక లే అవుట్లో ఎల్ఆర్ఎస్ లేని ఖాళీ ప్లాట్లకు తాండూరు సబ్ రిజిస్ట్రార్ అధికారులు అధికారిక ముద్ర వేశారు. నిబంధనల ప్రకారం 2020 ఆగస్టు 26 నాటికి వేసిన లే అవుట్లోని ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లే అవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రర్ అయిఉన్నప్పుడే మిగతావి కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు కల్పించింది. ఈ ఉత్తర్వులను అవకాశంగా తీసుకుని కటాఫ్ తేదీ తర్వాత వేసిన లే అవుట్లోని ప్లాట్లను కటాఫ్ తేదీలోని ప్లాట్లుగా చూపించి 25 శాతం రాయి తీతో ఆరు రోజుల్లోనే రెండు వందలకుపైగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్లు స్కానింగ్ చేయకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మండలం నానక్రాంగూడ నాలా కన్వర్షన్ లేని 37,061 గజాల స్థలానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదమైంది. న్యూస్రీల్లేని ఉద్యోగి పేరున.. నార్సింగి మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 300 నుంచి 303 వరకు, 306 నుంచి 311 వరకు, 313 నుంచి 315లోని భూమిలో గతంలోనే మార్వటౌన్ షిప్–బి లే అవుట్ చేశారు. అందులోని 617 గజాల ఖళీ పార్కు స్థలాన్ని గతంలోనే పూర్వ పంచాయతీ పేరున మార్ట్గేజ్ చేశారు. రూ.6 కోట్ల విలువ చేసే ఈ ఖాళీ స్థలంపై ఓ ముఠా కన్నేసింది. పంచాయతీ పేరున మార్ట్గేజ్ చేసిన ప్లాట్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రస్తుత మున్సిపాలిటీ పేరున డాక్యుమెంట్ సృష్టించి, రిజిస్ట్రేషన్కు యత్నించింది. ప్రస్తుత ఎస్ఆర్ఓ గుర్తించి, సంబంధిత మున్సిపల్ అధికారికి సమాచారం ఇవ్వగా విషయం బయటికి వచ్చింది. మున్సిపాలిటీలో లేని ఉద్యోగి పేరున ఫేక్ మార్టిగేజ్ రిలీజ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తేలింది. -
పరిశీలిస్తాం.. పరిష్కరిస్తాం
శంకర్పల్లి: మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎ.యోగేశ్ తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణవాసులు పారిశుద్ధ్యం, అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్లు, వీధి కుక్కలు, ఆక్రమణలు వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఓపిగ్గా విని, నమోదు చేసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్న: శంకర్పల్లిలో పంచాయతీగా ఉన్నప్పుడు నిర్మించిన దుకాణాలకు కాలం ముగిసినప్పటికీ రీ టెండర్లు వేయడం లేదు. మున్సిపాలిటీకి ఏటా కోట్లలో నష్టం వస్తోంది. – దయాకర్రెడ్డి (బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు), మహేందర్రెడ్డి (శంకర్పల్లి) కమిషనర్: దుకాణాల రీటెండర్ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం. కలెక్టర్ వేసిన కమిటీ రిపోర్టు ఆధారంగా ముందుకు వెళ్తాం. వీలైనంత త్వరగా రీటెండర్ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రశ్న: సింగాపురంలో శ్మశానవాటిక లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. పలు కాలనీల్లో తాగునీటి సమస్య ఉంది. – వెంకట్రాంరెడ్డి, శశిధర్రెడ్డి (సింగాపురం) జవాబు: శ్మశానవాటిక కోసం స్థల అన్వేషణ చేస్తున్నాం. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నాం. త్వరలో స్థల సేకరణ చేసి, నిర్మిస్తాం. పాడైన బోర్లను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయిస్తాం. ప్రశ్న: ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు, చెత్తా, చెదారం పెరిగిపోయాయి. పాములు, దోమల బెడద ఎక్కువైంది. కొన్నిచోట్ల రోడ్లు పాడై వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. – మహమ్మద్ యూనస్ (బ్లూ ఉడ్ వెంచర్, శంకర్పల్లి) జవాబు: పారిశుద్ధ్య కార్మికులు, డోజర్లతో చెత్తను వెంటనే శుభ్రం చేయిస్తాం. రోడ్లు పాడైన చోట తాత్కాలికంగా మొరం వేసి బాగు చేస్తాం. ప్రశ్న: ఫత్తేపూర్ రైల్వే బ్రిడ్జి నుంచి శంకర్పల్లి చౌరస్తా వరకు రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. పెద్ద ఎత్తున గుంతలు ఉండడంతో రాత్రి వేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. – శ్రీకాంత్రెడ్డి, మహేశ్ (రావులపల్లి) జవాబు: ఈ విషయమై ఇప్పటికే ఆర్అండ్బీ, పోలీసులతో కలిసి పరిశీలించాం. ఆర్అండ్బీ ఈఈతో మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తాం. ప్రశ్న: ఆదర్శ్నగర్ కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్లు, తాగునీరు, గుంతల్లో మొరం వేయడం వంటి సమస్యలు ఉన్నాయి. – రాంచందర్, రాములు, మాణిక్, అంజనేయులు (ఆదర్శ్నగర్ కాలనీ) జవాబు: అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తాం. సిబ్బందిని పంపి రోడ్లపై గుంతల్ని పూడ్చి వేయిస్తాం. ప్రశ్న: పిచ్చి మొక్కలు విపరీతంగా ఉండడంతో దోమల బెడద ఎక్కువైంది. పిల్లలు ఆడుకోడానికి సరైన పార్కులు లేవు. కొంత మంది ఇంట్లో సెప్టిక్ ట్యాంకు నిర్మించుకోకుండా.. డ్రైనేజీలోకి వదిలేస్తున్నారు. – శ్రీనివాస్, రఘుపాల్రెడ్డి, రవీందర్, ఫణి రాజ్ (శ్రీరాంనగర్ కాలనీ) జవాబు: కాలనీలో పార్కు కోసం రూ.17 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. అక్రమ నిర్మాణాలు, సెప్టిక్ ట్యాంకుల గురించి సిబ్బందిని పంపి విచారణ చేస్తాం. ఇష్టారీతిన చెత్త, చెదారం వేసే వాళ్లకు జరిమానా వేసేందుకు సిద్ధం అవుతున్నాం. ప్రశ్న: మణిగార్డెన్ ఎదురుగా ఉన్న కాలనీలో 30 ఇళ్లకుపైగా ఉన్నప్పటికీ నీటి కనెక్షన్ లేదు. ఉన్న బోరును కూడా మరమ్మతులకు గురైన ప్రతీసారి మేమే సొంతంగా బాగు చేయించుకుంటున్నాం. అంతర్గత మురుగునీటి సమస్య సైతం ఉంది. – మాణిక్యప్రభు, వెంకటేశ్వరరావు, వీరేశం, లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి (9వ వార్డు, మణిగార్డెన్ ఎదురుగా) జవాబు: అమృత్ 2.0 కింద పట్టణంలో ఆరు తాగునీటి ట్యాంకులను నిర్మిస్తున్నాం. వాటి ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. పాడైనా బోర్లకు వెంటనే మరమ్మతులు చేయిస్తాం. ప్రశ్న: గీతా మందిర్ ప్రాంతంలో ఆరు నెలలుగా వీధిదీపాలు వెలగడం లేదు. రాత్రి వేళ ఇంటి నుంచి బయటికి రావడానికి ఇబ్బంది అవుతోంది. – దామోదర్, రమేశ్, సందీప్, విజయ్ (గీతా మందిర్) జవాబు: సిబ్బందిని పంపి వెంటనే అవసరమున్న చోట వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తాం. ప్రశ్న: పోలీస్ క్వార్టర్స్కి సమీపంలో కొత్త సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కొంత మంది ప్రభుత్వ స్థలాన్ని అక్రమిస్తున్నారు. – గోవర్థన్, నర్సింగ్రావు (15వ వార్డు) జవాబు: ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను పంపి సమస్యను పరిష్కరిస్తాం. ప్రశ్న: మున్సిపల్ పార్కులో పిచ్చి మొక్కలు పెరిగాయి, సెంట్రల్ లైటింగ్ సిస్టం పాడైంది. – సంపత్, రవీందర్రెడ్డి (గాయత్రీ నగర్) జవాబు: సిబ్బందిని పంపి, వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. వీలైనంత త్వరగా చర్యలు శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్ ఫోన్ఇన్ కార్యక్రమానికి స్పందన -
భూ సమస్యలు సత్వరం పరిష్కరించండి
యాచారం: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. యాచారం తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆన్లైన్లో నమోదు చేసిన భూ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు తిరస్కరించారో కూడా దరఖాస్తు దారులకు తెలియజేయాలని సూచించారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన లబ్ధిదారులకే లాటరీల్లో ప్లాట్లు, రిజిస్ట్రేషన్లు చేసేలా చూడాలన్నా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా, నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాలు కురిసిన వెంటనే విరివిగా మొక్కలు నాటేలా సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప, మండల పంచాయతీ అధికారి శ్రీలత, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య పాల్గొన్నారు. బాల కార్మికులకు విముక్తి శంకర్పల్లి: ఆపరేషన్ స్మైల్లో భాగంగా శుక్రవారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మోకిల, జన్వాడ గ్రామాల పరిఽధిలోని రెండు కన్స్ట్రక్షన్ కంపెనీల్లో పని చేస్తున్న ఆరుగురు బాల కార్మికులను పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని ఠాణాకి తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. రెండు కంపెనీలపై కేసు నమోదు చేశారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా.వెంకటేశ్వర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో స్టాఫ్ రిజిస్టర్, మందుల స్టాకును ఆయన పరిశీలించారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రస్తుత సీజన్లో గ్రామాల్లో ప్రబలే వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇవ్వాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డా.మంజులాదేవి, డా.నాగరాజు, డా.మైమునాబేగం, డా.జయశ్రీ, సిబ్బంది తిరుపతిరెడ్డి, చంద్రశేఖర్, సునీత, వేణు, ఏసుమణి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్కందుకూరు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు మండలంలోని కొత్తగూడ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవిని.. పారిశుద్ధ్యం, ట్రాక్టర్ నిర్వహణ, తడి పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి పంచాయతీ కార్యదర్శి డి.అనితను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డీపీఓ సురేష్మోహన్ సస్పెండ్ చేశారు. నేడు నియామక పత్రాలు సాక్షి, సిటీబ్యూరో: రోజ్గార్ మేళా కింద ఎంపికై న కేంద్ర ప్రభుత్వ నూతన ఉద్యోగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం నియామక పత్రాలను అందజేయనున్నారు. సికింద్రాబాద్ బోయిగూడలోని రైల్ కళారంగ్లో నిర్వహించనున్న రోజ్గార్మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక లేఖలు అందజేస్తారు. -
నాలుగో రోజు 4,170 మంది
కందుకూరు: మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూలోని ఏటీసీ సెంటర్లో నిర్వహిస్తున్న లాటరీ ద్వారా ఫార్మా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నాలుగో రోజు 4,170 మంది లబ్ధిదారులకు ప్లాట్లను డ్రా తీసినట్లు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తెలిపారు. అందులో 2,062 మంది హాజరు కాగా 1,572 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవడానికి గైర్హాజరైన వారు ఫారం 32ఏ, ఆధార్, పాన్కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోలతో రావాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, నాయిబ్ తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్ -
విద్యావ్యవస్థలో మార్పులు అవసరం
ఇబ్రహీంపట్నం: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. ఇందులో పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లలందరూ ఒకే చోట చదివిన రోజే నవ శకానికి అడుగులు పడుతాయని ఆకాంక్షించారు. సామాజిక బాధ్యతలో భాగంగా కెఫిన్ టెక్నాలజీ కార్పొరేట్ సంస్థ రూ.1.10 కోట్లు వెచ్చించి సంకల్ప్ పేరుతో ఇబ్రహీంపట్నంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆధునీకరించింది. నూతన వసతుల ప్రారంభోత్సవానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి హాజరైన ఆమె మాట్లాడుతూ.. కులమతాలు, పేద, ధనిక తారతమ్యం లేని విద్యాలయాల రూపకల్పన కోసం ప్రధాని, ముఖ్యమంత్రికి ప్రతీ ఇంటినుంచి ఒక లేఖ రాయాలని పిలుపునిచ్చారు. అమ్మాయిల చదువుతోనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థినులకు సూచించారు. స్వల్పకాలిక ఆనందాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని, అవసరం మేరకే సోషల్ మీడియాను వినియో గించాలని తెలిపారు. ప్రైవేటు హాస్టళ్లతో పోలిస్తే ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, బాగా చదవాలని కోరారు. పాశ్చాత్య ధోరణులను, విష సంస్కృతిని విడనాడాలన్నారు. ఆడ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలని, వారి వివరాలు బయటపెట్టకుండా తానే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహిళా కమిషన్కు వస్తున్న అధిక ఫిర్యా దులు లివింగ్ రిలేషన్షిప్లకు సంబంధించినవేనని తెలిపారు. వసతుల కల్పనకు కృషిచేసిన కేఫిన్ సంస్థను అభినందించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ, కెఫిన్ టెక్ సంస్థ హెచ్ఆర్ సుజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డి, వైస్ చైర్మన్ కరుణాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భూపతిగాల్ల మహిపాల్, డీటీడీఓ రమాదేవి, డీఈఓ సుశీందర్రావు, డీఆర్డీఏ పీడీ శ్రీలత, సీఐ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద -
అభివృద్ధి ఘనత మాదే
మాడ్గుల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకుంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయానికి సోపానాలుగా నిలుస్తాయని అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయనతోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. కల్వకుర్తి ఎమెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి మండల కేంద్రంలో రూ.12.70 కోట్లతో నిర్మించే 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆమనగల్లు మండలం కోనాపూర్ నుంచి మాడ్గుల వరకు రూ.45 కోట్లతో చేపట్టే, మాడ్గుల నుంచి అందుగులకు రూ.30 కోట్లతో నిర్మించే బీటీ డబుల్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 220 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపీణి చేశారు. అనంతరం ఆమనగల్లు మార్కెట్ మాజీ చైర్మన్ బట్టు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని చెప్పారు. ట్రిపుల్ ఆర్, ఐటీ పరిశ్రమలు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో రాబోయే రోజుల్లో మాడ్గులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా సాగుతున్న మాదిగల వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూసి బిల్లుకు అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే సంకల్పమని, ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో అధోగతి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని చెప్పారు. బీసీ కులగణన చేపట్టడంతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు మాడ్గుల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు -
తరగతులు ఐదు.. గది ఒక్కటి
మొయినాబాద్రూరల్: ‘ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధిస్తున్నాం. చిన్నారులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మీ పిల్లల భవిష్య త్తు మాది’అని ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాధికారులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. బడీడు పిల్లలను, ప్రైవేటు బడి బాటలో ఉన్నవారిని సైతం సర్కారు బడుల్లో చేర్పించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంత వరకు బాగనే ఉన్నా.. పాఠశాలల ప్రారంభం అనంతరం సర్కారు బడుల్లో తిష్టవేసిన సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా యి. తరగతి గదులు, సౌకర్యాల కొరత, ఉపాధ్యా యుల లేమితో చిన్నారుల విద్యాభ్యాసం ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు మొయినాబాద్మండలం అప్పారెడ్డిగూడ పాఠశాలే నిదర్శనం. రోడ్డు పక్కన చెట్ల కింద.. మండల పరిధి అప్పారెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలలో 1– 5వ తరగతులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య 50కి పైగానే ఉంది. ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు భోదిస్తున్నారు. గత సంవత్సరంలో చిన్నారు సంఖ్య 38 ఉండగా.. ఈ ఏడాది అది స్వల్పంగా పెరిగింది. పాఠశాలకు మొత్తం ఒకే తరగతి ఉండటంతో ఐదు తరగతుల విద్యార్థులు బోధించడం కష్టంగా మారింది. దీంతో క్లాస్ రూమ్లో 1,2 తరగతులు, వరండాలో రెండు తరగతులు, రోడ్డు పక్కన చెట్ల కింద 5వ తరగతి వారికి పాఠాలు చెబుతున్నారు. బోధన విషయంలో ఉపాధ్యాయులు కృషి బాగానే ఉన్నా.. అదనపు గదులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరిన్ని గదులు నిర్మిస్తే నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని టీచర్లు పేర్కొంటున్నారు. రోడ్డు పక్కనేవిద్యార్థులకు బోధన పట్టించుకోని విద్యాధికారులు సర్కారు బడులఅభివృద్ధిపై ప్రశ్నిస్తున్న గ్రామస్తులు అదనపు గదులునిర్మించాలంటూ డిమాండ్ -
పోగొట్టుకున్న నగదు బ్యాగు అప్పగింత
కందుకూరు: పోగొట్టుకున్న నగదు సంచిని పోలీసులు బాధితులకు అప్పగించారు. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ విఠాయిపల్లికి చెందిన ఎంకే విష్ణువర్ధన్ వద్ద పని చేసే సురేష్.. గురువారం సాయంత్రం మండల పరిధి జైత్వారం సమీపంలోని రాంరెడ్డి ఫౌల్ట్రీ ఫాంనకు వచ్చాడు. అక్కడ నుంచి రూ.4,01,400(నాలుగు లక్షల పద్నాలుగు వందల రూపాయలు)లను బ్యాగులో పెట్టుకుని బైక్పై తిరిగి విఠాయిపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో కొత్తగూడ శ్రీ నిఖేతన్ స్కూల్ వద్ద డబ్బుల బ్యాగు పడిపోయింది. కొద్దిసేపటికి కిందపడ్డ ఆ బ్యాగ్ను గుర్తించిన ఆ స్కూల్ అడ్మిన్ రోజ.. ఆ నగదు సంచిని భద్రపరిచారు. పోగొట్టుకున్న వారు ఎవరైనా వస్తే ఇద్దామని వేచి ఉన్నారు. బ్యాగ్ పడిపోయిన విషయాన్ని బాధితుడు సురేష్.. తన యజమానికి చెప్పాడు. ఆయన అక్కడి కౌన్సిలర్ సుజాత సహాయంతో కందుకూరు పీఎస్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ సీతారామ్, ఎస్ఐ సైదులు ఆ మార్గంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయాలని కానిస్టేబుల్ కృష్ణ, హోంగార్డు రమేష్ను ఆదేశించారు. దీంతో వారు జైత్వారం నుంచి కెమెరాలను పరిశీలన చేసుకుంటూ.. కొత్తగూడ వైపునకు వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొత్తగూడ పరిధి శ్రీ నిఖేతన్ హైస్కూల్ వద్ద కెమెరాల తనిఖీకి వచ్చిన పోలీసులకు.. ఆ పాఠశాల ఇన్చార్జి మధుసూదన్రెడ్డి నగదు బ్యాగు భద్రపరిచిన విషయం చెప్పారు. అనంతరం పోలీసుల సమక్షంలో.. పాఠశాల నిర్వాహకులు నగదు బ్యాగ్ను బాధితులకు అప్పగించారు. -
గొలుసు దొంగ రిమాండ్
మీర్పేట: చైన్ స్నాచర్ను మీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. మీర్పేటవందనపురి కాలనీకి చెందిన చెవుల సంధ్య ఈ నెల 9న మధ్యాహ్నం సరుకుల కోసం సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా.. నాగర్కర్నూలు జిల్లా బిచినేపల్లి మండలానికి చెందిన సెంట్రింగ్ పనిచేసే కందనూలు మల్లేశ్(28) ఇల్లు అద్దెకు కావాలని ఆమెను వెంబడించాడు. సదరు మహిళ ఇంట్లోకి వెళ్లగా.. మరలా వచ్చి ఏదైనా పని ఇప్పించాలని అడిగి, ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, ద్విచక్ర వాహనాన్ని స్వాఽధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. యువకుడు అదృశ్యం పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు గ్రామానికి చెందిన నర్సింహ కుమారుడు పాతకోట యాదగిరి(35) తుక్కుగూడలోని మారుతీ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న రోజు మాదిరిగానే విధులకు వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అతనికోసం తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సదరు వ్యక్తి బామ్మర్ది జగన్ గురువారం ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వివరాల తెలిసిన వారు ఠాణాలో కానీ.. 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఇంజినీరింగ్లో మహేశ్కు డాక్టరేట్
మొయినాబాద్రూరల్: ఇంజినీరింగ్లో పరిశోధన చేసిన ఎనుముల మహేశ్కు డాక్టరేట్ లభించింది. ఇంజినీరింగ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆర్టిలిజేన్స్ ఇంటలిజెన్స్లో పరిశోధనకు గాను రాజస్థాన్ ఆజ్మిర్లోని భగవత్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టాను అందుకున్నాడు. ఈ పరిశోధనకు 2021లో మహేశ్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి పెటెంట్ పొందారు. పరిశోధన ఫలితాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించిన నేపథ్యంలో వాటి ఆధారంగా డాక్టరేట్ దక్కింది. పట్టాను భగవత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.కె.శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు మహేశ్ను అభినందించారు. -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య షాబాద్: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని నాగర్కుంట గ్రామానికి చెందిన పాలమాకుల ఆనందంకు రూ.1 లక్ష 48 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మక్దూం భనన్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో చెక్కు మంజూరు అయిందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నర్వతాలు, మండల కార్యదర్శి శ్రీశైలం తదితరులు ఉన్నారు. నిర్మాణ దారుడిపైకేసు నమోదు ఇబ్రహీంపట్నం రూరల్: బాలకతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఎంపీపటేల్గూడ సమీపంలో అనిల్ కన్స్ట్రక్షన్ యజమాని, భవన నిర్మాణ రంగంలో జార్ఖండ్కు చెందిన 16 ఏళ్ల బాలికతో పనిచేయిస్తుండగా.. బాలికకు విముక్తి కల్పించారు. అనంతరం యజమానిపై కేసు నమోదు చేశారు. హ్యుందాయ్ డిజిటల్ ఫ్లోట్ వ్యాన్లు ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో: భారతదేశంలో మొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్, అతిపెద్ద ఎగుమతిదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇటీవల గ్రామీణ అవుట్లెట్లలో డిజిటల్ ఫ్లోట్ కార్యకలాపాలను ప్రారంభించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో లోతైన, గణనీయమైన వ్యాప్తి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిజిటల్ ఫ్లోట్ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. హ్యుందాయ్ హ్యాచ్బ్యాక్ ఎస్యూబీ ఎక్స్టర్, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్ వినియోగదారుల ఇంటి వద్దకు నేరుగా రవాణా చేస్తారు. కార్యక్రమాన్ని హ్యుందాయ్ మోటా ర్ ఇండియా లిమిటెడ్ ఆర్ఎస్హెచ్ రామ్కుమార్ జి, ఆర్పిఎస్హెచ్ మనోజ్ బాథం, హైదరాబాద్ నుంచి డిజిటల్ ఫ్లోట్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రయాణించనున్నాయని వారు తెలిపారు. హైటెన్షన్ టవర్ ఎక్కి యువకుడి హల్చల్ గచ్చిబౌలి: మతిస్థిమితం లేని ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగ్నంగా తిరుగుతున్న ఓ యువకుడు శుక్రవారం ఉదయం రాఘవేంద్ర కాలనీలో రోడ్డులో హైటెన్షన్ టవర్ ఎక్కాడు. దీనిని గుర్తించిన వాహనదారులు, స్థానికులు అతడిని కిందికు దిగాలని కేకలు వేసినా వినకుండా టవర్ చివరి వరకు ఎక్కాడు. దీంతో వారు డయల్ 100కు సమాచారం అందించడంతో గచ్చిబౌలి పెట్రోల్ మొబైల్ సిబ్బంది అక్కడికి చేరుకుని కిందకు దిగాలని అతడికి నచ్చజెప్పారు. దాదాపు గంట సేపటి తర్వాత అతను కిందకు దిగిరావడంతో దుస్తులు వేయించి పీఎస్కు తీసుకెళ్లారు. అతడిని రాజరాజేశ్వరీనగర్లో నివాసం ఉంటున్న ఆకాష్ ఆర్కంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విద్యార్థుల అభివృద్ధికి సదస్సు దోహదం
షాద్నగర్రూరల్: విద్యార్థుల అభివృద్ధికి జాతీయ సదస్సులు దోహదపడతాయని మూన్రే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కుమార్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం రాయికల్ శివారులోని మూన్రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్(ఎంఐపీఎస్) కళాశాలలో ఈ నెల 16, 17న మిప్స్కాన్–2025 జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. శుక్రవారం కళాశాలలో సంస్థ అధ్యక్షుడు పర్వత్రెడ్డి అధ్యక్షతన సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ.. జాతీయసదస్సుల ద్వారా విద్యార్థులకు పరిశోధన,నైపుణ్యం, పరిశ్రమలలో అనుసంధానంతదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఈ మిప్స్కాన్ జాతీయ సదస్సుకుదేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులు పాల్గొంటుండటంతో ఒక గొప్ప శాసీ్త్రయ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్, అభివృద్ధికి ఇలాంటి సదస్సులు ఎంతగానోదోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, విద్యా ప్రయాణానికి మైలురాయిగా మలుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కుమార్ -
పోలింగ్ సరళిపై అవగాహన
బడంగ్పేట్: బాలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం నేషనల్ ట్రైనింగ్ అండ్ ఆర్గనైజేషన్ పోగ్రాం, బూత్ లెవల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కుందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి హాజరై బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. పోలింగ్ రోజుకు ముందు పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఓటరు సమాచారం స్లిప్పులను వేరే వారికి ఇవ్వకుండా చూడాలని కోరారు. 1961 ఎన్నికల నిర్వహణ నియమాలు వివరిస్తూ బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో తహసీల్దార్ ఇందిరాదేవి, బడంగ్పేట కార్పొరేషన్ మేనేజర్ నాగేశ్వర్రావు, డిప్యూటీ తహసీల్దార్ మణిపాల్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేడు శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్తో ‘ఫోన్ ఇన్’
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025సమస్యలు వింటున్నమున్సిపల్ కమిషనర్ వెంకటేశం శంకర్పల్లి: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ ఎ.యోగేశ్తో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.చేవెళ్ల: అందరికీ అందుబాటులో ఉంటూ.. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. మున్సిపాలిటీని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటేశం అన్నారు. మున్సిపల్ పరిధిలో సమస్యలు.. పరిష్కార మార్గాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. వాటిని సావధానంగా ఆలకించిన ఆయన వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్న: మల్కాపూర్ వార్డుకు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. నీటి సమస్య ఉంది. చెత్త సేకరణ సక్రమంగా చేయడం లేదు. – గోపాల్రెడ్డి, వెంకటేశ్, మాణిక్యరెడ్డి (మల్కాపూర్) కమిషనర్: పారిశుద్ధ్య, నీటి సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తా. రోడ్డు సమస్యకు సంబంధించి నిధులు వచ్చిన వెంటనే పరిష్కారం అవుతుంది. ప్రశ్న: మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ సమస్యలు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇబ్బంది ఏర్పడుతోంది. టెంపుల్ కమాన్ వద్ద ఎప్పుడూ వర్షపు నీరు నిలువ ఉంటోంది. వచ్చిపోయే వారికి ఇబ్బందిగా మారింది. ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలో తెలియజేస్తే బాగుంటుంది. – బురాన్ ప్రభాకర్ (హౌసింగ్బోర్డు కాలనీ) జవాబు: ఆయా సమస్యలపై తక్షణమే చర్యలు చేపడతాం. మీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. మున్సిపల్ పరిధిలోని అధికారుల వివరాలను ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా చూస్తాం. ప్రశ్న: ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఆన్లైన్లో డబ్బులు చెల్లించాం. దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్ఓసీ వచ్చింది. ఎఫ్టీఎల్ అని డ్యాక్యుమెంట్ పెండింగ్ అంటూ సమస్యలు వస్తున్నాయి. – మంగలి నర్సింలు, రంగారెడ్డి (దేవునిఎర్రవల్లి), జనార్దన్రెడ్డి (పలుగుట్ట), ఎం.డీ.ఇబ్రహీం (కిష్టారెడ్డినగర్), శ్రీనివాస్రెడ్డి (ఇంద్రారెడ్డినగర్) జవాబు: టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పైనుంచి క్లియర్ చేయాల్సి ఉంది. మా పరిధిలో ఉన్నవాటిని పెండింగ్లో లేకుండా చూస్తున్నాం. టౌన్ ప్లానింగ్ అధికారి ద్వారా సమస్యలు పరిష్కరించేలా చూస్తాం. ప్రశ్న: వీధిలైట్లు వెలగడం లేదు. చెత్త సేకరణ సిబ్బంది రావడం లేదు. డ్రైనేజీ తరచూ జామ్ అవుతున్నా పట్టించుకోవడం లేదు. సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఉన్నాయి. – సుశాంత్, వై.శ్రీనివాస్, ఎండీ నసీర్ఖాన్ (రంగారెడ్డి కాలనీ) జవాబు: సిబ్బందిని పంపించి సమస్యలను పరిశీలిస్తాం. త్వరలోనే వాటిని పరిష్కరిస్తాం. ప్రశ్న: నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. జాబితాలో పేరు వచ్చింది కానీ ప్రొసీడింగ్ ఇవ్వలేదు. ఇల్లు కట్టుకోవచ్చా. – ఎండీ చాన్పాషా (ఇబ్రహీంపల్లి) జవాబు: ఇల్లు మంజూరైతే తప్పకుండా ప్రొసీడింగ్ వచ్చి ఉండాలి. ఎందుకు రాలేదో తెలుసుకుంటాను. మీరు కూడా మరోసారి చెక్ చేసుకోండి. రాకపోతే తప్పకుండా ఇప్పిస్తాం. ప్రశ్న: మా వార్డులో వీధి లైట్లు వెలగడం లేదు. ఇనుప స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. గేట్ నుంచి రోడ్డు గుంతలమయంగా మారింది. రాత్రిళ్లు ప్రయాణం ఇబ్బందిగా ఉంది. – రజినీకాంత్ (దామరగిద్ద) జవాబు: మీ వార్డులో ఇటీవలే పర్యటించాను. సమస్యలు దృష్టికి వచ్చాయి. ఇనుప స్తంభాలు తొలగించే చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు మరమ్మతులపై సంబంధిత అధికారులకు నివేదిస్తాం. ప్రశ్న: మా వార్డులో వీధి లైట్లు వెలగడం లేదు. సీసీ రోడ్లు లేవు. – రాంచందర్, గీత (గ్రీన్ సిటీ) జవాబు: సమస్యలు నోట్ చేసుకున్నాం. పరిశీలించి చర్యలు చేపడతాం. ప్రశ్న: మెయిన్రోడ్డుపై డ్రైనేజీ లేక ఇబ్బందులు ఉన్నాయి. లేబర్ గుడిసెలు వేసుకొని కాలనీలను అపరిశుభ్రం చేస్తున్నారు. – కృష్ణ, రాజు (వీరభద్రకాలనీ) జవాబు: సమస్యలు ఉన్న కాలనీల్లో పర్యటించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. ప్రశ్న: డ్రైనేజీ సమస్య ఎక్కువైంది. నిత్యం లీకవుతోంది. – సత్యనారాయణ, అమీర్ (భగత్సింగ్కాలనీ) జవాబు: పరిశీలన చేసి పరిష్కరిస్తాం. ప్రశ్న: వార్డులో రోడ్డు సమస్య ఉంది. తాగునీరు రావడం లేదు. జంగంగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో చెత్త డంపింగ్ చేస్తుండడంతో నీళ్లు కలుషితం అవుతున్నాయి. – చంద్రశేఖర్రెడ్డి, సురేందర్రెడ్డి (పలుగుట్ట) జవాబు: రోడ్డు సమస్యను సంబంధిత అధికారులకు నివేదిస్తాం. డంపింగ్ యార్డు కోసం స్థల అన్వేషణ చేస్తున్నాం. ప్రశ్న: వారం రోజులుగా కరెంట్ సమస్యతో నీళ్లు రావడం లేదు. వీధి లైట్లు వెలగడం లేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. – మాల్లారెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్ (పామెన) జవాబు: వార్డులో తప్పకుండా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తాం. కరెంట్ సమస్యపై విద్యుత్ అధికారులకు సమాచారం ఇస్తాం. ప్రశ్న: కుక్కల బెడద, కోతుల బెడద ఎక్కువ అవుతోంది. – రవీందర్ (హౌసింగ్ బోర్డు కాలనీ) జవాబు: మున్సిపల్ పరిధిలో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా గుర్తించి ఏం చేయాలో నిర్ణయిస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఫోన్ చేయాల్సిన నంబర్: 73311 27776, 96764 84485ప్రజల సమస్యలను నమోదు చేసుకుంటున్న సిబ్బందిన్యూస్రీల్ -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు శంకర్పల్లి: ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరికి గా యాలైన సంఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు స్నేహితులు రావత్(25), సమేహ(25) కలిసి గురువారం ఉదయం తమ ద్విచక్రవాహనంపై ఉద్యోగ రీ త్యా మోమిన్పేట్ వైపు వెళ్తున్నారు. అయితే మండలంలోని లక్ష్మారెడ్డిగూడ గేట్ వద్ద వికారాబాద్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో రావత్, సమేహకి బలమైన గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రావత్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో ఆవు మృతి షాబాద్: విద్యుదాఘాతంతో ఓ పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేసారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి రవీందర్ తన పాడి ఆవును పొలంలో మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద వైర్ తగిలి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రోజుకు 12 లీటర్ల పాలు ఇచ్చే పాడి ఆవు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం అందజేయాలని కోరారు. రైల్వే పట్టాల పక్కన మృతదేహం లభ్యం కొత్తూరు: రైల్వే పట్టాల పక్కన ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధి తిమ్మాపూర్ రైల్వేస్టేషన్సమీపంలో గురువారం వెలుగు చూసింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేష్ తెలిపిన వివరాల మేరకు.. రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన ఓ మృతదేహం పడి ఉందనే సమాచారంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. దాదాపు రెండు రోజుల క్రితం కదులుతున్న రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి కిందపడి మృతిచెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. జడ్సీ లాగిన్ ఓపెన్ చేసేందుకు యత్నం విధుల నుంచి ఆపరేటర్ తొలగింపు గచ్చిబౌలి: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్లో సెక్షన్ రైటర్గా ఉన్న అభిలాష్ కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాత్రి అతను శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్లో కమిషనర్ హేమంత్ బోర్ఖాడే లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. జ డ్సీ ఫోన్కు ఓటీపీ వెళ్లడంతో అప్రమత్తమైన ఆయన అంతర్గత విచారణ చేపట్టగా అభిలాష్కు చెందిన ఐడీగా నుంచి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. అభిలాష్పై చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్ శ్యామ్ కుమార్ జోనల్ కమిషనర్కు లేఖ రాశారు. దీంతో జోనల్ కమిషనర్ సంబంధిత ఏజెన్సీకి అతడిని సరెండర్ చేశారు. జోనల్ కమిషనర్ లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. అవినీతికి కేరాఫ్గా మారిన టైన్ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ సిబ్బంది తరచూ అధికారుల లాగిన్లను వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ వలలో మహిళా పీఎస్ ఎస్ఐ గచ్చిబౌలి: ఓ కేసులో పేరు తొలగించేందుకు డబ్బులు తీసుకుంటూ గచ్చిబౌలి ఉమెన్ పీఎస్ ఎస్ఐ వేణుగోపాల్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తతో పాటు అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు పక్షాలను పిలిచి మాట్లాడారు. గృహహింస కేసులో తల్లి పేరును తొలగించేందుకు ఎస్ఐ వేణు గోపాల్ రూ.25 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు మహిళ భర్త ఏసీబీ అధికారులను అశ్రయించారు. గురువారం మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వేణుగోపాల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసిన పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. -
రైతులను గుర్తించని ప్రభుత్వం
ఇబ్రహీంపట్నం: రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వారికి గుర్తింపు కార్డుల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం వ్యవసాయ కార్యాలయం వద్ద గురువారం రైతులు, బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతుల గుర్తింపు కార్డుల నమోదు పక్రియను ప్రారంభించి రెండున్నర నెలలు గడుస్తున్నా.. రాష్ట్రంలో పది శాతం నమోదును ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో మీ సేవా, తదితర కేంద్రాల్లో రైతుల గుర్తింపు కార్డుల నమోదు చేస్తుంటే, ఇక్కడ పట్టించుకునే నాథుడే కరువైయ్యాడని పేర్కొన్నారు. కేవలం వ్యవసాయ విస్తరణాధికారికి మాత్రమే ఆన్లైన్ లాగిన్ ఇవ్వడంతో సగటున రోజుకు 40 మందికి మించి నమోదు చేయలేకపోతున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డులు లేకుంటే రైతుభరోసా, రైతుబీమా, పీఎం కిసాన్ లాంటి పథకాలు నిలిచిపోతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో రైతు గుర్తింపు నమోదుకు అవకావం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిలుకల బుగ్గరాములు, నిట్టు జగదీష్, సుధాకర్రెడ్డి, నర్సింహ్మారెడ్డి, మైసయ్య, మహేందర్, గోపాల్,శంకరయ్య, చంద్రశేఖర్, శ్రీశైలం , శ్రీనివాస్లు పాల్గొన్నారు. గుర్తింపు కార్డుల జారీలో తీవ్రజాప్యం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి -
వైభవంగా గురుపూర్ణిమ మహోత్సవం
కందుకూరు: గురువు సూచించిన మార్గంలో నడిస్తే భగవంతుడి కృప త్వరగా ప్రాప్తిస్తుందని బ్రహ్మశ్రీ గురూజీ అనిల్కుమార్జోషి అన్నారు. మండలంలో ని పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనా కేంద్రంలో గురువారం గురు పూర్ణిమ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి నిఖిలేశ్వరానంద విగ్రహానికి అభిషేకం, పాదుకా పూజలు చేశారు. అనంతరం గురూజీకి తులాభారం వేశారు. గురూజీ సాధకులతో ప్రత్యేకంగా సాధనలు చేయించి గురు పూర్ణిమ విశిష్టతను వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
లారీ, కారు ఢీ ఇద్దరి దుర్మరణం
కొత్తూరు: లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మాజీ సర్పంచ్తో పాటు అతని బంధువు చనిపోయిన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం, దిలావర్గూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరిగి చంద్రశేఖర్రెడ్డి (45), అతని బంధువు నందిగామ మండలం, దేవుని మామిడిపల్లికి చెందిన ఎర్రగుంట చంద్రశేఖర్రెడ్డి ఇంటికి వచ్చాడు. అనంతరం రాత్రి కారులో నందిగామ నుంచి కొత్తూరు రైల్వే బ్రిడ్జిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారావు తెలిపారు. మాజీ మంత్రి నివాళి..మహేశ్వరం: చంద్రశేఖర్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు దిలావర్గూడకు చేరుకున్నారు. మృతుడికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, సుభాన్పూర్ మాజీ సర్పంచ్ గుత్తి పద్మ పాండు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహగౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుల్లో దిలావర్గూడ మాజీ సర్పంచ్, అతని బంధువు కొత్తూరు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం -
మీడియా స్వేచ్ఛను అడ్డుకోవద్దు
షాద్నగర్రూరల్: ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్ హాలులో టీడబ్ల్యూజేఎఫ్ తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్గౌడ్, నరేశ్, నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజాస్వమ్యంలో మీడియా స్వేచ్ఛ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. నాటి స్వాతంత్య్ర ఉద్యమంతో పాటుగా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్తంభంగా గుర్తించడంతో పాటుగా పూర్తి స్వేచ్ఛను కల్పించాయన్నారు. గత ప్రభుత్వం మీడియా విలువలకు తిలోధకాలను ఇస్తూ పాత్రికేయుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. సమాజంలో జరుగుతున్న నిజాలను రాస్తే కొందరు నాయకులు జీర్ణించుకోలేక హత్యలు, దాడులు చేయడం, కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాతికేయులు అసత్యాలను కాకుండా నిజాలను నిర్భయంగా రాయాలని, అప్పుడే వారికి సమాజం అండగా నిలబడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సింలు మాట్లాడుతూ.. గతంలో పత్రికకు ఎంతో విలువ ఉండేదని, వచ్చిన వార్తలకు స్పందించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునే వారమన్నారు. ఇప్పుడు పత్రికలలో వార్తలు రాస్తే దాడులు, కేసులు, బెదిరింపులకు పాల్పడే సంస్కృతి పెరిగిందని, ఇది సరికాదని హితవు పలికారు. జర్నలిస్టులు తమ స్వేచ్ఛను సక్రమంగా వినియోగించుకోవాలని, దుర్వినియోగం చేయొద్దని సూచించారు. సమావేశంలో నేతలు రఘునాయక్, చెంది తిరుపతిరెడ్డి, కొంకళ్ల చెన్నయ్య, ఎండీ.ఇబ్రహీం, శ్రీనునాయక్, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, అందె బాబయ్య, చెంది మహేందర్రెడ్డి, కక్కునూరి వెంకటేశ్గుప్తా, ప్రశాంత్, రాజా వరప్రసాద్, రాజు, నర్సింహ, బీసీసేన నాయకులు చంద్రశేఖరప్ప, జక్కుల జలజ, జయశ్రీకాంత్, భాగ్యలక్ష్మి, స్రవంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర ఎంతో కీలకం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
జనాభా.. గబగబా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉద్యోగ, ఉపాధి నిమిత్తం జిల్లాకు వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జనాభాతో పాటే నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి. పల్లెలు, పట్టణాలకు తేడా లేకుండా పోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు, 11,92,081 మంది మహిళలు ఉన్నారు. ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్, భారీ పరిశ్రమలతో 13 ఏళ్ల వ్యవధిలోనే జిల్లా జనాభా డబుల్ (48 లక్షలు) అయ్యింది. భారీగా పెరిగిన వలసలు 2023 నవంబర్లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 35,23,219 చేరుకుంది. వీరిలో 18,23,165 మంది పురుషులు ఉండగా, 16,99,600 మంది మహిళలు, 454 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. వీరు కాకుండా 18 ఏళ్లలోపు వారు మరో 12.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు ఉన్నా యి. మొత్తం జనాభాలో 18 ఏళ్లలోపు వారు 12.50 లక్షల మంది ఉండగా, ఆ తర్వాతి వయ స్కులు 35 లక్షల మందికిపైగా ఉండటం గమనార్హం. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఆరోగ్య ఖర్చులు, పిల్లల చదువులకు భారీగా ఖర్చవుతుండటంతో మెజార్టీ యువత ఒకరు లేదా ఇద్దరితోనే సరిపెట్టుకుంటున్నప్పటికీ.. వలసల కారణంగా జనాభా అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. 2011లో 5,63,565 నివా సాలు ఉండగా, 2025 నాటికి గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఆధారంగా 13,22,646 చేరింది. మరోవైపు ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో ఇంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది ఉండగా, ప్రస్తుతం సగటున ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే ఉంటున్నారు. వయసుల వారీగా పరిశీలిస్తే.. ● ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారు 92,540 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న వారు 6,37,940 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్ల వయసు ఉన్న వారు 10,73,733 మంది, 40 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్న వారు 7,77,548 మంది ఉన్నారు. 50 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు 4,77,325 మంది ఉండగా, 60 నుంచి 69 ఏళ్ల వారు 2,81,235 మంది ఉన్నారు. 70 నుంచి 79 ఏళ్ల వయసు వారు 1,38,324 మంది, 80 ఏళ్లు పైబడిన వారు 43,775 మంది ఉండ డం గమనార్హం. ● వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏటా సగటున 42 వేల ప్రసవాలు జరుగుతున్నట్లు అంచనా. వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరగడం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తుండటం, అనేక ఆస్పత్రులు అందుబాటులోకి రావడంతో సగటు మనిషి ఆయుఃప్రమాణం భారీగా పెరిగింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు 4.63 లక్షల మందికిపైగా ఉండడం విశేషం. ● వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం డేటా ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలు సుమారు రెండున్నర లక్షల మంది ఉన్నట్లు అంచనా. ● విద్యాశాఖ లెక్కల ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్లలోపు వారు 7.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. 15 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న వారు (ఇంటర్మీడియెట్/డిగ్రీ కోర్సులు చదువుతున్నవారు) రెండున్నర నుంచి మూడు లక్షల మంది ఉన్నట్లు అంచనా. జిల్లాలో శరవేగంగా పెరుగుతున్న ప్రజలు ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం భారీగా రాక ఆ తర్వాత ఇక్కడే స్థిర నివాసం 2011తో పోలిస్తే 2025లో రెండింతలు నేడు ప్రపంచ జనాభా దినోత్సవం -
యువకుడి అదృశ్యం
పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కేశగోని హరి ప్రసాద్(27) తుక్కుగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు డ్యూటీకీ వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన హరిప్రసాద్ సాయంత్రమైనా రాలేదు. అతడు ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై అతని తండ్రి స్వామి గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. -
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
శంకర్పల్లి: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని పిల్లిగుండ్ల గ్రామ శివారులో యూత్ కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు మహిపాల్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేయగా.. నాగేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను గడపగడపకూ చేరేలా చూడాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ ఇన్చార్జి పామెన భీంభరత్లతో సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు సాగాలని కోరారు. యూత్ కాంగ్రెస్లో ఎవరికై నా సమస్యలు ఉంటే, జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అరవింద్, అసెంబ్లీ ఇన్చార్జి వసీం, మండల అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్రెడ్డి, నాయకులు సంజయ్, దయాగౌడ్, నర్సింహారెడ్డి, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి -
ప్రభుత్వానిది భూ దందా
మొయినాబాద్: భూ దందా చేయడానికే ప్రభుత్వం పేదల భూములు గుంజుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ధర్నా చేస్తున్న రైతులకు గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోశాలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి పేదలు సాగుచేసుకునే భూములే దొరికాయా..? ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి.. వాటిలో ఏర్పాటు చేస్తే ఏమవుతుంది అని ప్రశ్నించారు. కోకాపేటలో ఉన్న గోశాలను ఎనికేపల్లికి తరలించి అక్కడి భూములను ప్రభుత్వం అమ్మడానికి చూస్తోందన్నారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను వదిలిపెట్టొద్దని.. రైతుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వల్లి ప్రభాకర్రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా క్యాదర్శి మోర నర్సింహారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, నియోజకవర్గం కన్వీనర్ వెంకటేశ్గౌడ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు క్యామ పద్మనాభం, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్ -
కొనసాగుతున్న ప్లాట్ల కేటాయింపు
కందుకూరు: ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో లాట రీ ద్వారా చేపట్టిన ప్లాట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నాలుగో రోజు కొనసాగింది. కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, అనంత్రెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 242 గజాలు, 302 గజాలకు సంబంధించిన ప్లాట్లను లాటరీ ద్వారా రైతులకు కేటాయించారు. శుక్రవారం అన్ని గ్రామాలకు సంబంధించి 363 గజాలు, 423 గజాలు, 484 గజాలు, 544 గజాలు పొందినవారికి ప్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. లాటరీ ప్రక్రియను పరిశీలించిన సీపీ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను గురువారం రాచకొండ సీపీ సుధీర్బాబు పరిశీలించారు. ప్లాట్ల పంపిణీ, బందోబస్తును పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి అధికారులను ఆరా తీశారు. శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. -
ఆడిట్ బృందం ఆకస్మిక తనిఖీలు
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధిలో గురువారం డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆడిటర్ మహ్మద్ ఖాజా బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు వార్డుల్లో చేపడుతున్న రోడ్ల శుభ్రత, వాటర్ ట్యాంకులు, డివైడర్లపై మొక్కలు, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల నిర్వహణ, వంటశాలలు, మరుగుదొడ్లు, కంపోస్ట్ యార్డ్ల నిర్వహణ, తడి, పొడి చెత్తను వేరుచేయడం, వనమహోత్సవంలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశా రు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలపై నిర్వహించిన స్వచ్ఛత పోటీల్లో గెలిచిన వారికి మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సురేష్ పాల్గొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణల తొలగింపు హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం కొహెడలోని తాళ్లకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను గురువారం ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 883, 886లలో విస్తరించి ఉన్న చెరువు ఎఫ్టీఎల్లో రెండు ప్లాట్లలో ప్రహరీలు నిర్మించారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్ ఏఈ వంశీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి జేసీబీ సాయంతో వాటిని కూల్చివేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినా, కాలువలను పూడ్చివేసినా చర్యలు తప్పవని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఎంఈఓ ఆఫీసుకు తాళం వేసి ఆందోళన ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాలయానికి కార్మికులు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. ఏడాదిగా బిల్లులు, గౌరవ వేతనం చెల్లించడం లేదని అన్నారు. గుడ్లు, రాగి జావ పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది తప్ప అందుకు తగ్గ నిధులు మంజూరు చేయడంలేదన్నారు. అప్పులు చేసి గుడ్లు తీసుకొచ్చి పెడుతున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ఎంఈఓ, ఎస్టీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగతున్నా మోక్షం కలగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్ఐ నాగరాజు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి తాళం తీయించారు. ఎస్ఎఫ్ఐ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ్, కార్మికులు పాల్గొన్నారు. -
టీఎన్జీవీఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక
కేశంపేట: తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ (టీఎన్జీవీఏ) జిల్లా ఎన్నికలు హైదరాబాద్ సీతరాంబాగ్లోని సంఘం రాష్ట్ర భవనంలో జరిగాయి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బింగి సురేష్ అధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 96 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా రాజీవ్ పైలెట్, కార్యదర్శిగా భరత్చారి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఆనంద్, కోశాధికారిగా శివకుమార్ గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజీవ్ పైలెట్ మాట్లాడుతూ.. వెటర్నరీలో నాన్ గెజిటెడ్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి అభిషేక్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రతన్, ట్రెజరీ సుధాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో.. రూట్ ఎటో!
డీలర్ల అక్రమార్జన కోసమే 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ పర్మిట్లు సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరంలో ఆటోపర్మిట్ల దోపిడీ పర్వం మొదలైంది. వారం రోజులుగా ఆటోరిక్షాల షోరూంలలో డ్రైవర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు (ఫస్ట్ టూ ఫస్ట్ కమ్) పద్ధతిలో జరుగుతున్న ఈ నమోదు వల్ల డ్రైవర్లు షోరూమ్లకు పరుగులు తీస్తున్నారు. కేవలం డ్రైవర్ల వివరాలను నమోదు చేసేందుకే సుమారు రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటో రిక్షాల ధరలను బహిరంగంగా ప్రకటించకుండా డ్రైవర్లను నమోదు చేసుకోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఔటర్రింగ్ రోడ్డు వరకు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించాలంటూనే మరోవైపు ఏకంగా 20 వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతులను ఇవ్వడంలో ఆంతర్యమేమిటని పలు ఆటోసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ అంశంపై ఆటో సంఘాల నాయకులు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈవీలకు ప్రోత్సాహం ఏమైనట్టో..? నగరంలోని ఆటోల స్థానంలో ఔటర్ వరకు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలోనే ప్రకటించారు. కేంద్రం రూపొందించిన ఈవీ పాలసీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ ఆటోలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఒకవైపు ఈవీ పాలసీ కొనసాగుతుండగా కొత్తగా 65 వేల ఆటో పర్మిట్లకు అనుమతులను ఇవ్వడంలో మతలబు ఏంటని ఆటో సంఘాలు, పర్యావరణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం ఈవీల ముసుగులో 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలను విక్రయించేందుకే ప్రభుత్వం ఈ పర్మిట్లను విడుదల చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎడాపెడా డ్రైవర్లను నమోదు చేసుకొన్న అనంతరం కొత్త ఆటోలకు కృత్రిమ కొరతను సృష్టించి భారీ ఎత్తున ధరలు పెంచేందుకు కొందరు డీలర్లు, ఫైనాన్షియర్లు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆటో సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. పాతవాటికి రిట్రోఫిట్మెంట్ ఎందుకు? అక్రమార్కులకు కొమ్ముకాసే విధంగా ఉన్న కొత్త పర్మిట్ల విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. ఒకవైపు ఈవీ పాలసీ కొనసాగుతుండగా కొత్తగా 20 వేల ఈవీలతో పాటు మరో 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు అనుమతులను ఇచ్చారు. ఇవి కాకుండా 25 వేల పాత ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు రిట్రోఫిట్మెంట్ అనుమతులను ఇచ్చారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తూ విడుదల చేసిన ఆటోరిక్షా పర్మిట్ల పందేరంలో సామాన్య, నిరుపేద డ్రైవర్లే మరోసారి సమిధలుగా మారనున్నారు. నమోదైన చోట కొనేందుకేనా... ఆటోడ్రైవర్లు తెలంగాణలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చునని ఆర్టీఏ విధివిధానాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు షోరూమ్లలో రవాణాశాఖ లాగిన్ సౌకర్యం కల్పించారు. షోరూమ్ల వద్ద నుంచి వచ్చే డ్రైవర్ల వివరాల ఆధారంగా ఆర్టీఏ అధికారులు పర్మిట్లను విడుదల చేస్తారు.ఈ పర్మిట్లపైన సదరు డ్రైవర్ కొత్త ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. కానీ తమ వద్ద ఆటోను కొనుగోలు చేసే డ్రైవర్ల వివరాలను మాత్రమే షోరూమ్లలో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ముందస్తుగా రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఇలా గుట్టుగా అక్రమాలు చోటుచేసుకుంటుండగా రవాణా అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఔటర్ వరకు ఈవీలంటూనే ఎల్పీజీకి అనుమతులు పాత ఆటోలకు ఈవీ రిట్రోఫిట్మెంట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆటో సంఘాలు అడ్డగోలుగా ఇచ్చిన ఆటో పర్మిట్లలో అన్నీ లొసుగులే -
నేడు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్తో ‘ఫోన్ ఇన్’
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 20258లోuచేవెళ్ల: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: పశువైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పశువుల నిష్పత్తి మేరకు మందులు సరఫరా చేయకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రైతులు తమ పశువులను తీసుకుని ప్రైవేటు క్లినిక్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సాధారణంగా పశువులు, గొర్రెలకు వైరస్, బ్యాక్టీరియా కారణంగా (కౌఫాక్స్, నీలినాలుక, గాలికుంటు, క్షయ, ఆంథ్రాక్స్, బ్లాక్ క్వార్టర్ (బ్లాక్ లెగ్), జోన్స్ డిసీజ్, ఫౌల్ టైఫాయిడ్, మాస్టిన్, బ్రూ సిల్లోసిస్(బాంగ్స్వ్యాధి, ఫుట్ రాట్) వంటి వ్యా ధులు వస్తుంటాయి. సీజన్ల వారీగా వచ్చే జబ్బు లను ముందే గుర్తించి, వ్యాధి నిరోధక టీకా వేయించాల్సి ఉంటుంది. నట్టల నివారణ మందును తా గించాల్సి ఉంది. కానీ మూడేళ్లుగా నట్టల నివారణ మందు సరఫరా కావడం లేదు. గొర్రెలు, మేకల రైతులే వాటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పది నెలలుగా నిలిచిన సరఫరా పశు వైద్యుడు అందుబాటులో ఉన్న పశువైద్యశాలకు రూ.60 వేల విలువ చేసే 69 రకాల మందులు, అదే పూర్తిస్థాయి వైద్యుడు లేని ఒక్కో సబ్ సెంటర్కు రూ.40 వేల విలువ చేసే మందులు ప్రతీ మూడు మాసాలకోసారి సరఫరా చేయాల్సి ఉంది. చివరిసారిగా 2024 సెప్టెంబర్లో మందులు సరఫరా చేశారు. దీంతో సబ్సెంటర్లకు పంపిణీ చేయాల్సిన మందులను పశువైద్యుడు పని చేస్తున్న చోటే వినియోగిస్తున్నారు. అది కూడా వచ్చిన పశువులకు సగం సగం మందులతోనే సరిపెడుతున్నారు. పెన్సిలిన్, యాంటిబయాటిక్స్, పశువులకు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన సర్జికల్ స్పిరిట్ కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 87 సబ్సెంటర్లు ఉండగా, వీటిలో ఏ ఒక్క చోట మందులు లేవంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మృత్యువాత పడుతున్న దూడలు సాధారణంగా పశువుల్లో సీజన్తో సంబంధం లేకుండా ‘లంపీస్కిన్’వ్యాధి (ముద్ద చర్మవ్యాధి) సోకుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి నియంత్రణకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్రత్యామ్నాయం లేక మేకలకు వాడే ‘గోట్ఫాక్స్’వ్యాక్సిన్నే పశువులకు ఇస్తున్నారు. ఇది ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాప్తి చెందుతుంది. తెల్లజాతి ఆవుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. శరీరమంతా కురుపులు, నల్లని మచ్చలతో కన్పిస్తుంది. ఈ సమయంలో జ్వరం అధికంగా ఉంటుంది. వ్యాధి ముదిరితే పశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఆవులకు వ్యాక్సిన్ వేయడం వల్ల అవి ప్రమాదం నుంచి బయటపడుతున్నాయి. కానీ వాటికి పుట్టిన దూడలు మాత్రం చనిపోతున్నాయి. నట్టల నివారణకు మందు కరువే మూడేళ్లుగా నట్టల నివారణ మందు సరఫరా కావడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న జీవాలను కాపాడుకునేందుకు రైతులు ప్రైవేటుగా మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గొర్రెలు, మేకలకు గతంలో ఏటా నాలుగు సార్లు నట్టల నివారణ మందులు సరఫరా చేసేది. మూడేళ్లుగా సరఫరా నిలిచిపోయింది. సీజన్కు ముందు వ్యాక్సిన్ వేసి, నట్టల మందు తాగిస్తే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాక్సిన్ వేసినా.. నట్టల మందు తాగించకపోవడంతో జీవాలు జబ్బుబారిన పడుతుంటాయి. ఆవులు, దూడలకు టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ గొర్రెల, మేకలకు ఇవ్వడం లేదు. మార్కెట్లో లీటరు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫోన్ చేయాల్సిన నంబర్: 73311 13243, 98665 07624న్యూస్రీల్వేధిస్తున్న వైద్యనిపుణుల కొరత మూగజీవాలకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం జిల్లాలో నాలుగు ఏరియా వెటర్నరీ, 46 ప్రాథమిక పశు వైద్యశాలలు, ఐదు మొబైల్ క్లినిక్స్ సహా మరో 87 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కొత్తూరు, కనకమామిడి (వైద్యులు లివ్లో వెళ్లగా), మేకగూడ, ఆరుట్ల, కందుకూరు వైద్యులు (ఇన్సర్వీసు పీజీకి వెళ్లారు). పాల్మాకుల, ఇర్విన్లో వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమీప సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు సేవలు అందిస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్లకు ఇటీవల పదోన్నతులు కల్పించడంతో ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం మెజార్టీ కేంద్రాల్లో వైద్యులకు సహాయకులు లేరు. అటెండర్లు లేని చోట వైద్యులే ఆ పని కూడా చేయాల్సిన దుస్థితి. సిబ్బంది కొరతతో నిర్దేశిత సమయంలో వ్యాక్సిన్లు వేయలేని పరిస్థితి. -
నిద్రలోనే మృత్యు ఒడికి
మొయినాబాద్: తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని, కుర్చీలో కునుకు తీసిన ఓ వ్యక్తి నిద్రలోనే మరణించాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం వట్టినాగులపల్లికి చెందిన గోలియా శ్యామ్ సుందర్సింగ్(55) నాగిరెడ్డిగూడ రెవెన్యూలోని సుజాత స్కూల్లో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని కుర్చీలో నిద్రపోయాడు. కొంత సేపటి తర్వాత తోటి ఉద్యోగులు నిద్రలేపే ప్రయత్నం చేయగా లేవలేదు. వెంటనే భాస్కర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కదులుతున్న కారు నుంచి మంటలు కేశంపేట: కదులుతున్న వాహనంలో మంటలు వ్యాపించి ఓ కారు దగ్ధమైంది. ఈ ఘటన బుధవారం మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫరూఖ్నగర్ మండలం గంట్లవెళ్లికి చెందిన మిద్దె కృష్ణయ్య తన షిఫ్ట్ డిజైర్ కారులో పాపిరెడ్డిగూడ శివారు నుంచి వెంచర్ రోడ్డ్డులో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కృష్ణయ్య వెంటనే కారు నుంచి దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో షాద్నగర్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలార్పేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో బోనాలు రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో బుధవారం బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలోని అమ్మవారి దేవాలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. -
విద్యారంగ సమస్యలపై పోరాటం
షాద్నగర్రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ సంఘం తెలంగాణ ప్రాంత సహ సంఘటన మంత్రి విష్ణు అన్నారు. బుధవారం ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విశ్వభారతి జూనియర్ కళాశాలలో ఏబీవీపీ నగర కార్యదర్శి నవీన్నాయక్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విష్ణు భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. దేశంకోసం, ధర్మంకోసం పని చేసే ఏకై క విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు. దేశంలో భారతీయత, జాతీయ భావజాలం కలిగిన అతిపెద్ద విద్యార్థి సంఘంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సందీప్, వంశీ, నవీన్, రాకేశ్, అభి, సాయి, యశ్వంత్, పవన్, రామ్చరణ్, నందకోమల్, అమరేందర్రెడ్డి, రాకేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ● ఏబీవీపీ తెలంగాణ ప్రాంతసహ సంఘటన మంత్రి విష్ణు -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
● కార్మికుల సమస్యల పరిష్కారంలోకేంద్రం విఫలం ● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు షాద్నగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, టీడబ్ల్యూజేఎఫ్, రైతుసంఘం, అంగన్వాడీ, ఏఎన్ఎంలు, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్, జీపీ వర్కర్లు, ప్రజాసంఘాలు సమ్మెకు పూర్తి మద్ధతు తెలిపాయి. సమ్మెలో భాగంగా ఎంపీడీఓ కార్యా లయం నుంచి రైల్వేస్టేషన్, మెయిన్రోడ్డు, ముఖ్యకూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్మికవర్గం సమరశీల పోరాటాలద్వారా వందేళ్లలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను వెల్లదీస్తున్న కార్మికులకు కనీస వేతనం కింద రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమప్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఖాజాపాష, రాఘవేందర్గౌడ్, రమేష్కుమార్, నర్సింహారెడ్డి, నరేశ్, సీనయ్య, వెంకట య్య, నాయకులు రాజు, శ్రీనునాయక్, నర్సింలు గౌడ్, సాయిబాబు, ఈశ్వర్నాయక్, జయమ్మ, మల్లేశ్, జైపాల్రెడ్డి, గణేశ్, మల్లేశ్, సత్యం, కోటేశ్వర్రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేసిన భార్య
మైలార్దేవ్పల్లి: నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తుండడంతో భర్తను భార్య హతమార్చిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..వట్టేపల్లి సైఫ్ కాలనీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సైఫ్ (30), ఫరీదా సుల్తానాలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఫరీదా ప్రతిరోజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. మద్యానికి బానిసైన మహమ్మద్ సైఫ్ ప్రతి రోజు భార్యను వేధిస్తున్నాడు. బుధవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి వేధించగా..ఫరీదా కోపంతో బండరాయితో తలపై మోదడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని సుల్తానాను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం ● కేశంపేట పీఎస్లో ఫిర్యాదు ●కేసు నమోదు చేసిన పోలీసులు కేశంపేట: కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని లేమామిడి శివారులో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండల పరిధిలోని డోకూరుకు చెందిన అర్కే శివలింగానికి కుర్మిద్దకు చెందిన దీపిక (25)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంజయ్కుమార్ (07), కీర్తన (05) సంతానం. శివలింగం ఉపాధి నిమిత్తం లేమామిడి శివారులోని వెంకో రీసెర్చ్ బ్రీడింగ్ ఫాంలో ఎనిమిది నెలల క్రితం పనికి కుదిరాడు. కుటుంబంతో కలిసి ఇక్కడే ఓ గదిలో జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా గత మంగళవారం ఉదయం దీపిక గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్ మాట్లాడుతున్నట్లు గుర్తించిన శివలింగం ఆమెను మందలించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన దీపిక తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్తున్నట్లు పొరుగువారికి చెప్పింది. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వచ్చిన శివలింగానికి భార్యాపిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారిని ఆరా తీశాడు. దీపిక పుట్టింటికి ఫోన్ చేసి అడగగా అక్కడికి రాలేదని చెప్పారు. బంధువులతో పాటు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం ఇద్దరు వ్యక్తులకు రిమాండ్ హయత్నగర్: ఇద్దరు వ్యక్తల నుంచి కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ షాపూర్నగర్కు చెందిన అన్నపూరి వెంకటేశ్, ఇబ్రహీంపట్నం అలిమియాకుంటకు చెందిన మహ్మద్ షోయబ్ పెద్దఅంబర్పేట్ ప్రాంతంలో గంజాయిని క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులు పెద్దఅంబర్పేట్లోని కేవీకే వాటర్ వాషింగ్ సెంటర్పై దాడి చేసి, గంజాయిని విక్రయిస్తున్న వెంకటేశ్ను, కొనేందుకు వచ్చిన మహ్మద్ వాజిద్ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని విక్రయించేందుకు వచ్చిన మహ్మద్ షోయబ్, కొనేందుకు వచ్చిన మహ్మద్ మస్తాన్వలి తప్పించుకున్నారు. వెంకటేశ్పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి కిలోన్నర ఎండు గంజాయి, బైకు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బదిలీల తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలి ఆమనగల్లు: ఉపాధ్యాయుల బదిలీ తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరిధర్గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం నగరంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ను కలిసి వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయుల బదిలీల తర్వాత ప్రమోషన్లు ఇస్తేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు రమేశ్గౌడ్ పాల్గొన్నారు. -
ఆక్రమణలను తొలగిస్తాం
తుర్కయంజాల్: ఆక్రమణలను తొలగించి మాసబ్ చెరువు నాలాను పునరుద్ధరిస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తుర్కయంజాల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇప్పుడే నాలా ఆక్రమణలు తొలగిస్తే భవిష్యత్ ఇబ్బందులు తలెత్తవన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాఽథ్ మాట్లాడుతూ.. ఇరిగేషన్, రెవెన్యూ, శాటిలైట్ మ్యాప్లను పరిశీలించి నాలా వెడల్పును శాసీ్త్రయంగా నిర్ధారించుకున్న తరువాత పూడీకతీత పనులను చేపడుతామన్నారు. ఇప్పటికే తుర్కయంజాల్–ఇంజాపూర్ దిలావర్ఖాన్ చెరువు, పెద్ద అంబర్పేటలోని ఈదుల చెరువు వరకు ఉన్న ఏడున్నర కిలోమీటర్ల నాలాను డ్రోన్ సాయంతో పరిశీలించామని చెప్పారు. ఈ సర్వేలో పలు చోట్ల నాలా వెడల్పు, మరికొన్ని చోట్ల లోతు తగ్గినట్లు గుర్తించామని వెల్లడించారు. మాసబ్ చెరువు నాలా పూడీకతీత పనులను ఒక మోడల్గా ఎంచుకుని చేపడుతామని, నివాస ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి, ఏఈ వంశీ, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి మాసబ్చెరువు నాలా పరిశీలన -
ఫార్మాప్లాట్లు
2,200 ఎకరాలు సర్కార్ స్వాధీనంలోనే! ● అథారిటీలో పరిహారం తీసుకోండి.. లేదంటే కొట్లాడి మరింత పెంచుకోండి ● ప్లాట్ల లాటరీల లిస్టులో 700 మంది రైతులు పేర్లు ● ఆందోళన చెందుతున్న కర్షకులు యాచారం: గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు సేకరించిన భూములకు కాంగ్రెస్ సర్కార్ ఈ నెల 7 నుంచి లాటరీ విధానంలో ప్లాట్ల పట్టాలిస్తోంది. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన 700 మందికి పైగా రైతులు తమ పట్టాభూమి ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో అధికారులు 2,200 ఎకరాల పట్టా భూమికి అవార్డులు పాస్ చేసి పరిహారాన్ని అథారిటీలో జమచేశారు. భూ రికార్డులను టీజీఐఐసీ పేరిట మార్చేశారు. రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో రైతుల పేరిట భూ రికార్డులు మార్చి రైతు భరోసా, బ్యాంకు రుణాలు, రుణమాఫీ వర్తింప చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రైతులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎల్ఏ, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం ప్లాట్లు కేటాయిస్తున్నామని రైతులు లాటరీలో పాల్గొనాలని అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో లిస్ట్లు ఏర్పాటు చేశారు. ఇది చూసిన రైతులు తమ ప్రమేయం లేకుండానే భూ రికార్డులు మార్చి తమ పట్టాభూములు గుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు. పరిహారం పెంపునకు ఓకే నిబంధనల ప్రకారం నాలుగు గ్రామాల్లోని 2,200 ఎకరాల పట్టాభూములు టీజీఐఐసీ ఆధీనంలోనే ఉన్నాయి. రైతులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రికార్డులు మార్చడం కుదరదు. పరిహారం పెంచే అవకాశం మాత్రమే ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులు అనుకూలంగా ఉంటే వారితో సంప్రదింపులు జరిపి ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.50లక్షల లోపు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందుకు రైతులు నిరాకరించడంతో పాటు అధికారులు సైతం తమ వైఖరి మార్చుకోవడం లేదు. లిస్ట్లో 150 మంది పేర్లు అథారిటీలో పరిహారాన్ని జమ చేసిన రైతులకు ఎకరాకు 121 గజాల చొప్పున ఫార్మా ప్లాట్లు కేటాయించారు. 700 మందికి పైగా రైతులకు భూరికార్డుల్లో ఉన్న ఎకరాలను బట్టి ఫార్మా ప్లాట్లను కేటాయించి లాటరీ లిస్టుల్లో పేర్లను ప్రకటిస్తున్నారు. రైతులు మాత్రం మేము భూములే ఇవ్వలేదు.. ప్లాట్లు మాకెందుకని తిరస్కరిస్తున్నారు. అధికారులు ఈ నెల 7వ తేదీ నుంచి రైతుల పేర్లను ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించి లాటరీలో పాల్గొనాలని మీకు కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్లాట్లను తీసుకోకపోతే భవిష్యత్లో ఇబ్బందులొస్తాయని అధికారులు చెబుతున్నారు. ఫార్మాకు మేము పట్టా భూములు ఇవ్వలేదు, మాకు ప్లాట్లు వద్దని, లాటరీ లిస్టుల్లో తమ పేర్లు తొలగించాలంటూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. కుర్మిద్ద అనుబంధ గిరిజన తండాలైన మర్లకుంట, మంగలిగడ్డ, పోతుబండ తండాలకు చెందిన 150 మంది రైతులకు చెందిన 200 ఎకరాల పట్టా భూమికి మొత్తం లాటరీ లిస్టుల్లో పేర్లొచ్చాయి. -
విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కమిటీ సభ్యులు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరిలో 90 శాతం విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలకు దూరంగా నివాసం ఉంటున్నారని, ప్రతీ ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి బడికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలయ్య ముదిరాజ్, రాజు ముదిరాజ్, భవాని శేఖర్, రవీందర్ పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ -
సమోసాలో బల్లి!
మొయినాబాద్: స్వీట్ షాపులో సమోసాలు తిన్నవారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. సమోసాలో బల్లి దర్శనమివ్వడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గేటు వద్ద కలకలం రేపింది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కుమార్ తన కూతురు సంజనతో కలిసి బుధవారం మొయినాబాద్లో కూరగాయలు విక్రయించడానికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూ మార్గ మధ్యలో తోలుకట్ట గేటు వద్ద స్వీట్ షాపులో సమోసాలు తీసుకుని, తింటుండగా అందులో బల్లి కనిపించింది. అప్పటికే రెండు సమోసాలు తిన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అంతనలోనే సంజన వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్వీట్ హౌస్ ఓనర్ షాపు మూసివేసి పారిపోయాడు. ఈ విషయమైన బాధితులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కుక్కల దాడిలో 21 గొర్రెలు మృతి
● కేశంపేట మండలం చౌలపల్లిలో ఘటన ● బాధితుడికి రూ.2 లక్షల నష్టం కేశంపేట: కుక్కల దాడిలో 21 గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చౌలపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలిగపల్లి కృష్ణయ్య గొర్రెల పెంపకంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలంలోని దొడ్లో జీవాలను తోలాడు. మంగళవారం రాత్రి కుక్కలు మూకుమ్మడిగా మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 21 జీవాలు చనిపోగా పలు తీవ్రంగా గాయపడ్డాయని బాధితుడు తెలిపాడు. సుమారు రూ.2 లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య చౌలపల్లిలోని రైతు పొలానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షురాలు రొల్లు రాధిక, నాయకులు పసుపుల ప్రశాంత్, రఘురాంగౌడ్, కృష్ణయ్య, రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
శంకర్పల్లి: ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా బూత్ లెవల్ అధికారులకు ఫారం 6,7,8లకు సంబంధించి ప్యూరిఫికేషన్, అప్లికేషన్ను ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్గా జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు వ్యవహరించగా, బాలాజీ, ఆశీర్వాదం, షేక్ మహ్మద్ రోషన్లు మాస్టర్ ట్రైనర్లుగా ఉన్నారు. వారు మాట్లాడుతూ.. శంకర్పల్లి మండలం, పట్టణంలో మొత్తం ఆరుగురు సూపర్వైజర్లు, 69 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో బీఎల్ఓల పాత్ర కీలకమని, వారికిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని, వివరాలను అందులో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్, డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ -
ఆ స్థలాన్ని వదులుకునేది లేదు
ఉప్పల్ క్రికెట్ స్టేడియం గేట్ల వద్ద ప్రైవేట్ సంస్థ ప్రహరీ నిర్మాణం● స్టేడియం గేట్లకు గోడలు అడ్డుగా ఉన్నాయని తొలగింపు ● ఘటనా స్థలానికి చేరుకున్న వీహెచ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ● సదరు భూమిని కాపాడుకుంటామన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ● నాటకీయ పరిణామాల మధ్య ప్రహరీ కూల్చివేతలు ఉప్పల్: నగరలోని ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్రికెట్ స్టేడియం వద్ద ఓ ప్రైవేట్ సంస్థ ప్రహరీ నిర్మించి గేట్లు మూసివేశారన్న సమాచారంతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఉప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డితో కలిసి ఉదయమే తన అనుచరులతో స్టేడియం ఆవరణలోకి వచ్చారు. ఉప్పల్ ఐలా అధికారులకు సమాచారం ఇచ్చారు. నిర్మించిన ప్రహరీని వెంటనే తొలగించాలని చెప్పడంతో ఐలా మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గేట్లకు అడ్డుగా ఉన్న ప్రహరీని తొలగించారు. ఈసందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ఉప్పల్లో క్రికెట్ స్టేడియం ఏర్పాటుతోనే ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందని, స్థలాన్ని పోనివ్వమన్నారు. ప్రహరీని పూర్తిగా తొలగించే వరకు ఆయన అక్కడే బైఠాయించారు. స్వయంగా జేసీబీని తెప్పించి ప్రహరీని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేయించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ఐలా ఆధ్వర్యంలో పూర్తిగా తొలగించడంతో వీహెచ్ అక్కడినుంచి అనుచరులతో కలిసి వెళ్లిపోయారు. కాగా.. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సదరు స్థలం ఐలా అధీనంలోనే ఉందని, ఎలాంటి సంస్థకు అప్పగించ లేదన్నారు. అందుకే కూల్చివేశాం.. ఉప్పల్ ఐలా కమిషనర్ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. సదరు స్థలం కోర్టు వివాదంలో ఉందన్నారు. ప్రస్తుతం అది ఐలా అధీనంలోనే ఉందని తెలిపారు. ప్రహరీ, స్టేడియం గేట్ల ముందు నిర్మించిన వాటికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతోనే కూల్చివేస్తున్నామన్నారు. ఎందుకీ స్థల వివాదం? ఉప్పల్ ప్రధాన రహదారిపై కొంత పారిశ్రామికవాడ స్థలం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇతరులతో పాటు పెంగ్విన్ టెక్స్టైల్స్కు కలిపి 46 ఎకరాల స్థలాన్ని కేటాయించిది. అందులో కొన్నాళ్లు పరిశ్రమ నడిపించిన సంస్థ లాకౌట్ చేసి వెళ్లిపోయింది. పరిశ్రమ నెలకొల్పే సమయంలో బ్యాంక్ నుంచి రుణాలు పొందింది. లాకౌట్ కారణంగా రుణం ఇచ్చిన బ్యాంకు సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో నుంచి 16 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వ చొరవతో ఏపీఐఐసీ ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించింది. స్టేడియం నిర్మాణ సమయంలోనే అదనంగా 7 ఎకరాల 20 గుంటల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టింది. కాగా.. అది కూడా వివాదం కావడంతో పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుని రెగ్యులరైజ్ చేయించినట్లు సమాచారం. మిగిలిన 22.5 ఎకరాల స్థలాన్ని ఓ ప్రైవేట్ సంస్థ వేలం ద్వారా దక్కించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. -
ఆర్టీసీ బస్సు నుంచి దింపివేత.. అంబులెన్స్ వచ్చేలోపు మృత్యువాత
కేశంపేట: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్న వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆర్టీసీ సిబ్బంది బస్సులో నుంచి దింపేశారు. ఆతర్వాత కొద్ది నిమిషాలకే బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేశంపేటకు చెందిన నారని అనసూయమ్మ (64)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. భర్త రాములు మూడేళ్ల క్రితం, పెద్ద కూతురు ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందారు. ప్రస్తుతం అనసూయమ్మ కేశంపేటలోనే కుమారుడి వద్ద ఉంటోంది. ఇటీవల ఆరోగ్యం బాగో లేకపోవడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పదిహేను రోజులుగా దగ్గు, దమ్ము అధికం కావడంతో మూడుసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోసారి హైదరాబాద్ వెళ్లేందుకు అనసూయను తీసుకుని ఆమె కొడుకు, కోడలు మంగళవారం కేశంపేటలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు కొత్తూర్ వద్దకు రాగానే అనసూయనకు దమ్ము ఎక్కువైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది ముగ్గురినీ కిందకు దింపేశారు. బాధితులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ వచ్చే సరికే అనసూయ మృతిచెందారు. -
నిబంధనలు పాటించని క్లినిక్ల సీజ్
షాబాద్: వచ్చిరాని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్లినిక్లను సీజ్ చేశారు. అర్హత లేకున్న నిర్వహిస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షాబాద్లో నిర్వహిస్తున్న క్లినిక్లపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని తనిఖీ చేసేందుకు వెళ్లగా, అప్పటికే వారు మూసివేసి వెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం క్లినిక్లను సీజ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లినిక్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు. కఠిన చర్యలు తప్పవు డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు -
ఒడిశా టు హైదరాబాద్
శంకర్పల్లి: హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను మంగళవారం మోకిల పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ మోకిల పీఎస్లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన స్నేహితులు దాశరథి ప్రధాన్(26), సిబానాహక్(21), నీలుమండల్(21), సాగర్సాస్మల్(25) సులభంగా డబ్బు సంపాదించి, జల్సాలకు అలవాటు పడ్డారు. ఇందులో భాగంగా తక్కువ ధరకు ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి, నగరంలోని కార్మిక ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈక్రమంలో ఒడిశాలోని ప్రదీప్ అనే వ్యక్తి వద్ద రూ.16 వేలకు 38 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దీన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో కొల్లూర్ గేట్ సమీపంలోని బృందావనం గార్డెన్స్ వద్ద దాడి చేశారు. వీరి నుంచి 38కిలోల గంజాయి, 5ఫోన్లు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మోకిల సీఐ వీరబాబు, ఎస్ఓటీ సీఐ అంజయ్య, ఎస్ఐ కోటేశ్వరరావు, సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు 38 కిలోల గంజాయి స్వాధీనం నిందితులకు రిమాండ్ -
రైతులకు పట్టాలివ్వండి
మంచాల: రాచకొండ రెవెన్యూ పరిధిలో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాదగోని జంగయ్యగౌడ్, మేఘావత్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సంస్థాన్ నారాయణపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాచకొండ రెవెన్యూ పరిధిలోని 273 సర్వే నంబర్లోని వందలాది ఎకరాల భూములను మంచాల మండలం పటేల్చెరువు తండాకు చెందిన గిరిజనులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి చట్టాన్ని తీసుకురావడంతో వీరికి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదన్నారు. గతంలోని పాత పట్టా పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు కూడా పొందారని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వీరికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో బాధిత రైతులకు న్యా యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కావలి బుగ్గరాములు, రైతులు రవినాయక్, జూలనాయక్, నరేందర్నాయ క్, మోతీరాంనాయక్, శ్రీధర్నాయక్ పాల్గొన్నారు. -
డెలివరీ బాయ్పై దాడి
జగద్గిరిగుట్ట: డెలివరీ బాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవమ్మ బస్తీకి చెందిన శ్రీకాంత్ జియో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి పనులు ముగించుకు ఐడీపీఎల్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళుతుండగా పాపిరెడ్డి నగర్ ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వ్యక్తు లు అతడి బైకును అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరగడంతో వారు దీంతో శ్రీకాంత్పై ముక్కుముడిగా దాడి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన శ్రీకాంత్ను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెక్యూరిటీ గార్డు దారుణ హత్య గచ్చిబౌలి: నిర్మాణంలో ఉన్న భవనంలో సెక్యూరిటీ గార్డు దారుణ హత్యకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి బిల్డింగ్స్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి సర్వే నెంబర్ 90/1లో ఓఆర్ఆర్ సర్కిల్లో నిర్మాణంలో ఉన్న మయూరి బిల్డింగ్లో మైక్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలక్ట్రికల్ పనులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బేస్మెంట్ 3లో ఎలక్ట్రికల్ సామగ్రి స్టోర్ రూమ్ ఏర్పాటు చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన దాసరి రాజు(59) అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీకి వచ్చిన అతను మంగవారం ఉదయంరక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించిన స్టోర్ ఇన్చార్జి అనిల్ డయల్ 100కు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇనుప రాడ్డుతో రాజు తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. సమీపంలోని సీసీ పుటేజీలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వె వెళ్లినట్లుగా గుర్తించారు. ఆటోలో వెళ్లిన అనుమానితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
నందిగామ: ప్రభుత్వం తనకిచ్చిన స్థలంలో వేసు కున్న గుడిసెను తొలగించడంతో పాటు స్థలాన్ని కబ్జా చేస్తున్న వారికి వత్తాసు పలుకుతున్న పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని మోత్కులగూడ మాజీ సర్పంచ్ వానరాసి ఎల్లమ్మ మంగళవారం మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన కాపీని విలేకరులకు అందజేశారు. తాము ఇంటి వద్ద లేని సమయంలో గ్రామానికి చెందిన జెట్ట శంకరయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తన ప్లాటులోకి ప్రవేశించి, ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోశారని తెలిపారు. విషయం తెలియడంతో తాను అక్కడికి వెళ్లగా స్థానికుల సమక్షంలోనే దూషించారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు. అనంతరం గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఎంపీడీఓ సుమతి కబ్జాదారులతో కుమ్మకై ఎలాంటి విచారణ చేపట్టకుండా, కనీసం పట్టా సర్టిఫికెట్లు కూడా పరిశీలించకుండానే తనను ప్లాటులోకి వెళ్లనీయలేదన్నారు. ఎంపీడీఓ ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శి గత నెల 27న పది మంది పోలీసులతో వచ్చి తన ప్లాటులో ఉన్న గుడిసెను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్లాటుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని, ముప్పై ఏళ్లుగా కబ్జాలో ఉన్నానని చెప్పినా కూడా వినిపించుకోలేని పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. -
సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ఇబ్రహీంపట్నం: దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నం మండలంలో బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లేశ్, స్వప్న, వీరేశం, దుర్గయ్య, వెంకటయ్య, ఆర్టీసీ డిపో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు నర్సింహ, జంగయ్య, దిలీప్ పాల్గొన్నారు. కల్లు కాంపౌండ్లో బాలిక కిడ్నాప్ శంషాబాద్: కల్లుకాంపౌండ్ వద్ద ఓ చిన్నారిని మచ్చిక చేసుకున్న గుర్తు తెలియని మహిళ బాలికను కిడ్నాప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్జీఐ ఎస్ఐ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్నగర్ జిల్లా, మిడ్చిల్ మండలం, కంచన్పల్లి గ్రామానికి చెందిన లక్షమ్మ తన కుమార్తెలు కీర్తన (6) అర్చన్ (3)తో పాటు తమ మావతో కలిసి ఈ నెల 1న శంషాబాద్ కల్లు కంపౌండ్కు వచ్చింది. కల్లు తాగుతున్న క్రమంలో ఎదురుగా కూర్చున్న గుర్తు తెలియని మహిళ లక్షమ్మ కుమార్తె కీర్తనను దగ్గరకు తీసుకుని మాటలు కలపడంతో పాటు కల్లు తాగించింది. అనంతరం కంపౌండ్ బయట తినడానికి ఏమైనా ఇప్పిస్తానని తల్లికి చెప్పి చిన్నారిని తీసుకుని బయటికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో లక్ష్మమ్మ పరిసర ప్రాంతాల్లో గాలించింది. గ్రామానికి వెళ్లిపోయిన అనంతరం వారి కుటుంబసభ్యుల సూచన మేరకు మంగళవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మధ్యవయస్సురాలైన ఓ మహిళ కీర్తనను వెంటబెట్టుకుని వెళ్లిన ట్లు గుర్తించారు. మూడు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. థ్యాంక్యూ..సీఎం సార్.. పారదర్శకంగా పదోన్నతులు, పోస్టింగ్లపై హర్షం సాక్షి, సిటీబ్యూరో: త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని, పారదర్శకంగా పోస్టింగ్లు ఇవ్వడం పట్ల వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.కిరణ్ బొల్లేపాక, కార్యదర్శి మాదాల కిరణ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహలకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దంగా ఎన్నడూ పోస్టింగ్లు, పదోన్నతులు ఇంత పారదర్శకంగా జరిగినట్లు చూడలేదన్నారు. ప్రొఫెసర్ల పదోన్నతులను పరిగణలోకి తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం లభించిందని వారు పేర్కొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించండి
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయంలో మంగళవారం ఎంఈఓ పాండుకు పీడీఎస్యూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. సర్కారు బడులను బలోపేతం చేయకుండా విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అనిల్, సాయి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ -
తారు.. బేజారు
యాచారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్సిటీ నిర్మాణంతో యాచారం, కందుకూరు మండలాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని భావించిన స్థానికులకు నిరాశ తప్పడం లేదు. రహదారులు నిర్మించక పోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీకి భూసేకరణలో భాగంగా యాచారం–కందుకూర్ మండలాల మధ్యలో ఉన్న చిన్న రోడ్డును విస్తరించాలని సంకల్పించారు. ఈ రహదారిని వంద అడుగులకు విస్తరిస్తే ఫార్మాసిటీకి మార్గం సులువుతుందని అభిప్రాయం. అప్పట్లో 25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.వంద కోట్లకు పైగా నిధులను టీజీఐఐసీ నుంచి మంజూరు చేశారు. కందుకూరు నుంచి మీరాఖాన్పేట గ్రామం సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ అయింది. కానీ మండల పరిధిలోని నస్దిక్సింగారం, నందివనపర్తి, మొగుళ్లవంపు నుంచి యాచారానికి రహదారి పనులు ముందుకు కదలడం లేదు. దుమ్ము, ధూళితో నరకం మీరాఖాన్పేట గ్రామం సరిహద్దు నుంచి నస్దిక్సింగారం వరకు వంద అడుగుల రోడ్డు విస్తరణ కోసం గత నాలుగేళ్ల కింద పనులు ప్రారంభించారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి, రోడ్డుపై మట్టి పోశారు. కానీ పనుల్లో కదలిక లోపించింది. యాచారం–కందుకూర్ మండలాల సరిహద్దు కలిపే ఈ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఫ్యూచర్సిటీ నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలో భాగంగా తరచూ రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీస్ ఉన్నతాధికారులు ఈ రోడ్డు నుంచే నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, నానక్నగర్ గ్రామాల్లో పర్యటిస్తారు. రోడ్డుపై పోసిన మట్టి ఎండలకు దుమ్ము లేస్తుంది. బైక్లపై వెళ్లే ప్రయాణికులకు కళ్లు, నోట్లోకి పోయి శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. రోడ్డు విస్తరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కందుకూరు మండలంలో చకచక రహదారి పనులు జరిగితే ఇక్కడ మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో పెంచాలని కోరుతున్నారు. ఐదేళ్లయినా గ్రహణంవీడని ఫార్మాసిటీ రోడ్డు కందుకూరులో కళకళ యాచారంలో వెలవెల అవస్థలు పడుతున్న వాహనదారులు -
ఫ్యూచర్సిటీతో మహర్దశ
యాచారం: ఫ్యూచర్సిటీతో యాచారానికి మహర్దశ పట్టనుందని, కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వనగరం వైపే ప్రపంచ చూపు ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నస్దిక్సింగారం, అయ్యవారిగూడెం, యాచారం గ్రామాల్లో మంగళవారం ఆయన రూ. రెండున్నర కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ ఫార్మాసిటీ నిర్మించి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తే, సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యూచర్సిటీ నిర్మించి ప్రపంచస్థాయి గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నా రని అన్నారు. అర్హులైన రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, అందులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఈసీ శేఖర్గౌడ్, బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, యాచారం మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీలు రాంరెడ్డి, శ్రీనువాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
పరిహారం కోసం పట్టు
నిబంధనలు పాటించని.. వచ్చీరాని వైద్యంతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.8లోuమొయినాబాద్: గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం పట్టుబట్టి కూర్చున్నారు. రాత్రి, పగలు అక్కడే తింటూ, అక్కడే ఉంటున్నారు. గోశాల పనులకు సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య భూమిపూజ చేయడం తెలిసిందే. దీనిపై నిరసన వ్యక్తం చేసిన రైతులు రాత్రంతా అక్కడే భోజనాలు చేసి మంటలు పెట్టుకుని కాపలా కాస్తూ అక్కడే నిద్రపోయారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడి నుంచి కదలలేదు. పరిహారం తేల్చే వరకు పనులు జరగనివ్వమని భీష్మించుకు కూర్చు న్నారు. మరోవైపు పోలీస్ పహారా కొనసాగుతోంది. స్థానిక పోలీసులతోపాటు స్పెషల్ బెటాలియన్ పోలీసులు గస్తీ కాస్తున్నారు. కాగా, భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు 300 గజాల చొప్పున పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు రావాలని రైతులను పిలిచినా వారి నుంచి స్పందన రావడంలేదని తెలుస్తోంది. రాత్రి, పగలు అక్కడే భోజనం, నిద్ర భీష్మించుకు కూర్చున్న ఎనికేపల్లి రైతులు -
వడివడిగా కొహెడ!
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 20258లోuరేపు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్తో ‘ఫోన్ ఇన్’ చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దేశంలోనే అతి పెద్ద మార్కెట్ ● ఇంటిగ్రేటెడ్ నిర్మాణానికి అడుగులు ● భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు ● డీపీఆర్ సిద్ధం చేసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ● త్వరలో సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభం -
ఉపాధి హామీ పనుల పరిశీలన
ఇబ్రహీంపట్నం: జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల అధికారులు మంగళవారం మండలంలోని నెర్రపల్లి, దండుమైలారం గ్రామాలను సందర్శించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అఽధికారులు అభినేంద్రకుమార్, స్వాగత్ దాస్, ఎన్ఐసీ అధికారి అమిత్కుమార్, ఎన్ఐఆర్డీ అధికారులు ప్రసాద్, మోహిత్, వెస్లీ టీం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పోగ్రాం అధికారులు మురళి, సందీప్, అబేద్ఖాన్, రాజశేఖర్, జిల్లా గ్రామీణాభి వృద్ధి శాఖ నుంచి అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి, ప్రాజెక్ట్ డైరెక్టర్ చరణ్ గౌతమ్లతో కూడిన బృందం ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఆ ర్డీఓ అఽధికారులు శ్వేత, సంధ్య, పరుశురాం, ఎంపీడీవో యెల్లంకి జంగయ్యగౌడ్, ఎంపీఓ రఘురాం, పంచాయతీ కార్యదర్శులు వీణా, శివకుమార్, ఏపీఓ తిరుపతిచారి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై కొరడా
మొయినాబాద్: అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూ సర్వేనంబర్ 180లో రెండు చోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. రోడ్డు పక్కనే ఓ పౌల్ట్రీఫాంలో కొంత ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. మరోచోట వెంచర్లో కొంత ప్రభుత్వ భూమిని కలుపుకొని ప్రహారీ నిర్మించారు. గోశాలకోసం ప్రతిపాదించిన సర్వేనంబర్ 180లోని 99.14 ఎకారల భూమిని ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. దీంతో మంగళవారం తహసీల్దార్ గౌతమ్కుమార్, ఆర్ఐ రాజేష్, సర్వేయర్ జలజ, రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో అక్కడికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హద్దులు ఏర్పాటు చేసి బోర్డులు పాతారు. అనంతరం తహసీల్దార్ గౌతమ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల జోలికొస్తే ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని అన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ అధికారులు రవీందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శోభాయాత్ర
కందుకూరు: గురు పూర్ణిమ మహోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుంచి పాదయాత్ర, సైకిల్ యాత్రగా తరలివచ్చిన సాధకులతో బ్రహ్మశ్రీ గురూజీ అనిల్కుమార్జోషి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రం నుంచి పులిమామిడిలోని శ్రీనిఖిల్ చేతనా కేంద్రం వరకు చేపట్టిన రథయాత్ర, పల్లకీ సేవ శోభాయమానంగా కొనసాగింది. రథంపై పరమ పూజ్య సద్గురు స్వామి నిఖిలేశ్వరానంద విగ్రహాన్ని కొలువుదీర్చిన గురూజీ శోభాయాత్రను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు, నృత్యాల నడుమ సాధకులు పెద్ద ఎత్తున పాల్గొని పల్లకీ సేవ, రథంతో పాటు నిఖిల్ చేతనా కేంద్రం వరకు పాదయాత్ర చేపట్టారు. కందుకూరు చౌరస్తా నుంచి ప్రారంభించి కొత్తగూడ, జైత్వారం, పులిమామిడి గ్రామాల మీదుగా యాత్ర కొనసాగగా భక్తులు నీరాజనాలు పలికారు. ఆశ్రమానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గురూజీ ప్రవచనాలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ఆశీర్వాదాలు అందించారు. బుధ, గురువారాల్లో శ్రీనిఖిల్ చేతనా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి
బడంగ్పేట్: బాలాపూర్ మండలంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ.. బాలాపూ ర్లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలు ఏళ్ల తరబడి తిష్టవేశారని అన్నారు. తనపై రెక్కీ సైతం నిర్వహించారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ప్రగతి పథంలో మహిళా సంఘాలు చేవెళ్ల: ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మహిళా సంఘాలు ఎంతో ప్రగతి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని సెర్ప్ జిల్లా అధికారి నర్సింహ, ఏపీఎం శోభారాణి అన్నారు. మండలకేంద్రంలోని మహిళా శక్తి భవనంలో మంగళవారం మహిళా శక్తి సంబరాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం విద్యార్థుల యూనిఫామ్ కుట్టు కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలకు చైర్మన్లుగా ఏర్పాటు, పౌల్ట్రీ, డెయిరీ, పాడి పరిశ్రమ, ఎంటర్ప్రైజెస్, సోలార్యూనిట్లు, ఆర్టీసీ బస్సులు, గోదాంలు, పెట్రోల్బంక్లు తదితర వాటిని కేటాయిస్తోందని తెలిపారు. సంఘాలను బలోపేతం చేసుకునేందుకు మహిళలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు భారతి, మండల సీసీలు, సమాఖ్య సభ్యులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రేపు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం చార్మినార్: ఆషాఢమాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. సప్త మాతృకలకు సప్త బంగారు బోనంలో భాగంగా ఇప్పటికే మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి, రెండో బోనాన్ని విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి.. మూడో బోనాన్ని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, నాలుగో బోనాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించారు. అయిదో బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారికి సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. -
త్వరలోనే పనులు ప్రారంభం
కొహెడలో అత్యాధునిక మార్కెట్ నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశంలోని పలు మార్కెట్లపై అధ్యయనం చేసిన అధికారులు రూ.2,904 కోట్ల అంచనాతో డీపీఆర్ సిద్ధం చేశారు. ఇప్పటికే సేకరించిన రూ.314 కోట్లు మార్కెటింగ్ శాఖ అకౌంట్లో ఉన్నాయి. నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాం. మార్కెట్ నిర్మాణానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. త్వరలోనే ఆయన చేతుల మీదుగా పనులు ప్రారంభమవుతాయి. – చిలుక మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, గడ్డిన్నారం ● -
రెండోరోజు ప్లాట్ల కేటాయింపు
కందుకూరు: ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో ఏర్పాటు చేసిన టీజీఐఐసీ లేఅవుట్లోని ఏటీసీ సెంటర్లో మంగళవారం రెండో రోజు లాటరీ ద్వారా ప్లాట్ల పంపిణీ కొనసాగింది. కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, అనంత్రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి లాటరీ ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించారు. 121 గజాలు సర్టిఫికెట్లు పొందిన లబ్ధిదారులకు పంపిణీ నిర్వహించారు. మొత్తం 1,051 మంది ఉండగా 718 మంది డ్రాలో పాల్గొన్నారని, 333 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాగా బుధవారం 181 గజాల లబ్ధిదారులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించనున్నట్లు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల వరకు లబ్ధిదారులు లేఅవుట్లోకి చేరుకోవాలని సూచించారు. -
అక్రమ నిర్మాణం.. సక్రమ నంబర్లు
కొత్తూరు: చట్టాల్లోని లొసుగలతో కొందరు రియల్ వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. యథేచ్ఛగా అక్రమంగా భారీ భవనాలు, పరిశ్రమలు నిర్మిస్తూ కోట్లాది రూపాయాలు కొల్లగొడుతున్నారు. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అరికట్టాల్సిన అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. తీరా నిర్మాణాలు పూర్తయిన తరువాత సక్రమమని పేర్కొంటూ.. ఇంటి నంబర్లు కేటాయిస్తూ.. పరోక్షంగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. అధికారుల కళ్లెదుటే.. కొత్తూరు మున్సిపాలిటీలో నివాస గృహాల నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్లలో ఇటీవల కొందరు షెడ్లను నిర్మించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అన్ని అనుమతులు పొందాలి. లేదంటే మున్సిపల్ సిబ్బంది సదరు నిర్మాణాలకు నోటీసు జారీ చేసి, పనులను నిలిపివేస్తారు. కాగా దీనికి భిన్నంగా పురపాలికలో అధికారుల కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు భారీగా వెలుస్తున్నాయి. ముడుపులు, పెద్దల ఒత్తిళ్ల కారణంగా అక్రమ నిర్మాణాల పట్ల అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తీరా నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇంటి నంబర్లు కేటాయిస్తు, పరోక్షంగా వారికే సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నగరం నుంచి శివార్లకు హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భాగంగా పట్టణం సమీపంలో కొనసాగుతున్న కాలుష్య కారక పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు నగర శివారులోని కొత్తూరు, నందిగామ, షాద్నగర్ ప్రాంతాల్లో రెండు నుంచి పదెకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తూ.. కర్మాగారాలను నెలకొల్పుతున్నారు. మోసాలు.. రకాలు ● కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారు.. కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను సాగుయేతర భూమిగా మార్చుకోవాలి. అందుకు ప్రభుత్వం నిర్ణయించిన పన్ను చెల్లించాలి. కానీ సదరు యజమానులు.. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. పదెకరాల స్థలానికి కేవలం రెండుమూడు ఎకరాలను మాత్రమే వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటున్నారు. ● పరిశ్రమల ఏర్పాటుకు హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీతో పాటు అన్ని శాఖల నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ మాత్రం కేవలం బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందేందుకు వీలుగా ఉన్న అనుమతులను పొందుతున్నారు. ● పరిశ్రమల నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను పంచాయతీకి అందజేయాలి. దాని ఆధారంగా ఏటా పన్నులు వసూలు చేస్తారు. కానీ నిర్వాహకులు మాత్రం పూర్తిస్థాయి పత్రాలను ఇవ్వడం లేదు. దీంతో పన్నులు తక్కువగా వసూలు అయ్యే అవకాశం ఉంది. ● అప్పటికే కొనసాగుతున్న పరిశ్రమల్లో తదుపరి అవసరాల కోసం కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అనుమతి తీసుకునేందుకు వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ● షాద్నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు.. తాము టీఎస్ ఐపాస్లో దరఖాస్తు చేసుకున్నాం. అన్ని అనుమతులు ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ.. గేటు బయట పరిశ్రమల పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు. అనుమతుల్లేకుండావెలుస్తున్న కట్టడాలు కొలువుదీరుతున్న పరిశ్రమలు ప్రభుత్వ ఆదాయానికి గండి అక్రమార్కులకు అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగం! చర్యలు తప్పవు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఆర్థికంగా నష్టపోవద్దు. విచారణలో అక్రమం అని తేలితే చర్యలు తప్పవు. ఇప్పటికే పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేశాం. గడువులోగా స్పందించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా నిర్మించిన వాటికి నంబర్లు కేటాయించిసప్పటికీ.. అధిక పన్నులు వసూలు చేస్తాం. – బాలాజీ, మున్సిపల్ కమిషనర్, కొత్తూరు చిన్నవారిపైనే పెత్తనం ప్రభుత్వ అనుమతులు లేకుండా చిన్న షెడ్డును నిర్మించిన వారిపై చర్యలు తీసుకునే అధికారులు.. ఏకంగా పరిశ్రమలను నెలకొలిపి, అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్తూరు మున్సిపాలిటీ, మండలంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న గోదాములు, పరిశ్రమలు, ఇప్పటికే కొనసాగుతున్న వాటి వివరాలు అధికారులకు తెలుసు. అయినా.. వాటిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని విమర్శిస్తున్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కేశంపేట: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఫెడరేషన్ మండల అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో మండల పరిధి పాపిరెడ్డిగూడ, వేములనర్వ, కేశంపేట, కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాలలు, పాపిరెడ్డిగూడ, వేములనర్వ, కేశంపేట, సంతపూర్ గ్రామాల్లోని ఎంపీపీఎస్ పాఠశాలలో సమాఖ్య సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ఫెడరేషన్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. టీచర్ల సర్దుబాటును ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. బదిలీలతో పాటు పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం తదితర సమస్యలు పేర్కొంటూ.. మండల విద్యాధికారి చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు వినీత్, కోశాధికారి చిన్నరావు, విజయ్, అరుణ్, రవికుమార్, కేశంపేట క్లస్టర్ ప్రధానోపాధ్యాయురాలు విద్యావతి తదితరులు పాల్గొన్నారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ -
విద్యార్థుల ఆకలి కేకలు!
● మైల్వార్ ప్రాథమిక పాఠశాలలోఅందని మధ్యాహ్న భోజనం ● ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని నిర్వాహకుల నిరసన ● పస్తులతో అవస్థలు పడిన150 మంది చిన్నారులు బషీరాబాద్: మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. మండల పరిధిలోని మైల్వార్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5 తరగతుల వరకు 150 మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు భువనేశ్వరీ, ప్రమీళ, సంగీత వీరికి నిత్యం మిడ్ డేమీల్స్ వండిపెట్టేవారు. సోమవారం మధ్యా హ్నం లంచ్ బెల్ కొట్టగానే విద్యార్థులు రోజూ మాదిరిగానే ప్లేట్లు పట్టుకుని బయటకు వచ్చారు. ఈ సమయంలో.. ‘బిల్లులు రావడం లేదని ఏజెన్సీ వాళ్లు వంట చేయలేదు. మీరంతా ఇళ్లకు వెళ్లి తిని రావాలి’ అని ఉపాధ్యాయులు చెప్పారు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న చిన్నారులు ఇళ్లకు పరుగులు తీశారు. కొంతమంది భోజనం చేసి రాగా, ఇళ్లకు తాళాలు వేసి పొలం పనులకు వెళ్లిన వారి పిల్లలు కడుపు మంటతోనే తిరిగొచ్చారు. సాయంత్రం వరకూ ఆకలితోనే అలమటించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. వంట వండటం లేదని ముందే చెబితే తాము టిఫిన్లు కట్టి పంపించే వాళ్లమని హెచ్ఎం వెంకటప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని తాను ఎంఈఓకు చెప్పగా ఏజెన్సీ వాళ్లకు నచ్చజెప్పాలని సూచించారని, నిర్వాహకులు మాత్రం వినలేదని తెలిపారు. -
మద్యం దుకాణంలో చోరీ
చేవెళ్ల: మద్యం దుకాణానికి దొంగలు కన్నం వేశారు. రూ.4.38 లక్షలకు అపహరించారు. ఈ సంఘటన షాబాద్ చౌరస్తా సమీపంలోని వైన్షాపులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నర్సింహ వైన్షాపులో నంద్యాల రాజేందర్రెడ్డి క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం షాపు మూసే సమయానికి రూ.3లక్షల 8వేలు, పక్కనే కూల్పాయింట్ నిర్వహించే శ్రీశైలం ఇచ్చిన అద్దె రూ.1.30 లక్షలు మొత్తం రూ.4లక్షల 38వేలను రాత్రి షాపులో పెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం దుకాణానికి వచ్చి చూసే సరికి.. వేనుకభాగంలో గోడకు రంధ్రం చేసి ఉంది. అనుమానం వచ్చి షాపులోని డ్రాను చూడగా అందులోని డబ్బులు కనిపించలేదు. దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తరువాత ముగ్గురు వ్యక్తులు.. మాస్కులు ధరించి షాపు లో చొరబడి నగదు కాజేసినట్లు రికార్డు అయింది.వెంటనే యజమానికి సమాచారం చేరవేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాపు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. యువకుడి ఆత్మహత్య విజయనగర్కాలనీ: యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘట న సోమవారం ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..మహ్మద్ తౌఫిక్ తన కుటుంబంతో కలిసి ఆసిఫ్నగర్ సాబేర్నగర్లో నివసిస్తూ వంట పని చేస్తాడు. ఇతని కుమారుడు మహ్మద్ దావూద్(20) గుడిమల్కాపూర్ పూ లమార్కెట్లో పనిచేస్తాడు. సోమ వారం మధ్యాహ్నం 2 గంటలకు తన బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసు కున్నాడు. కుటుంబసభ్యులు స్థాని కులు సహాయంతో కిందికి దించి ప రీక్షించగా అప్పటికే అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఆసిఫ్నగర్ పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నందిగామ: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మహబూబ్నగర్ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మండల పరిధి చేగూరులో పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్ ఆధ్వర్యంలో సోమవారం పీఏసీఎస్ భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథిలుగా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.50 లక్షల వ్యయంతో గోదాంలను నిర్మించామని తెలిపారు. పీఏసీఎస్ల ద్వారా రైతులకు కావాల్సిన రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం పావలా వడ్డీకే పంట రుణాలు ఇస్తున్నామన్నారు. తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించాలని, కనీసం రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. లేదంటే రూపాయి పావలా వడ్డీ చెల్లించాల్సి వస్తుందనివివరించారు. వీటితో పాటు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో చైర్మన్ గొర్లపల్లి అశోక్, వైస్ చైర్మన్ పద్మారావు, డైరెక్టర్లు నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగ నర్సింహ యాదవ్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, నాయకులు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, కావలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి -
ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
షాబాద్: టీజీడబ్ల్యూఆర్ఎస్ (బాలికల) ఆమనగల్లు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ వినోల సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీటీ తెలుగు, పీజీటీ ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, జేఎల్ బోటనీ, జేఎల్ ఫిజిక్స్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 8న (మంగళవారం) డెమో క్లాసులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సర్టిఫికెట్లు ఒక సెట్ జిరాక్స్ తీసుకొని పీఆర్ఆర్ కళాశాల షాబాద్లో హాజరు కావాలని పేర్కొన్నారు. వివరాలకు 79950 10617 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టొద్దని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న ప్రజల నుంచి రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 29, ఇతర శాఖలకు సంబంధించి 33, మొత్తం 62 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇబ్రహీంపట్నం రూరల్ : తెలంగాణ అత్యంత వెనకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ (టీజీఎంబీసీడీసీ) హైదరాబాద్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాఫ్ట్ స్కిల్, పర్సనాలిటీ డెవల్మెంట్, రెవెన్యూ బిల్డింగ్, కమ్యూనికేషన్ పౌండేషన్, మాక్ ఇంటర్వ్యూ, సెల్ప్కాన్ఫిడెన్స్, బిల్డింగ్, మెంటల్ వెల్బింగ్పై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. 21 నుంచి 30 ఏళ్ల వయసు ఉండి, ఏదైనా డీగ్రీ పాసైన వారు అర్హులని చెప్పారు. ఈ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలన్నారు. 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ కార్యాలయంలోని ఎంబీసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఆధార్కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో రావాలని సూచించారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటాంషాద్నగర్రూరల్: అణగారిన వర్గాల ప్రజలకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని రాష్ట్ర ప్రధాన క్యాదర్శి రాగల్ల ఉపేందర్ అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దండోరా జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాగల్ల ఉపేందర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకోసం మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమం ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి భూషణ్, నాయకులు ప్రవీణ్, సురేష్, లింగం, వెంకటేశ్, యాదయ్య, దర్శన్, జంగయ్య, సుదర్శన్, సత్యం, దశరథ్, శివ, రాజు, మహేందర్, కృష్ణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెను జయప్రదం చేయండి
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం ఇబ్రహీంపట్నం: దేశవ్యాప్తంగా బుధవారం జరిగే సమ్మెలో కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం సోమవారం ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 లేబర్ చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్లతో కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతూ ఉద్యోగ భద్రతకు విఘాతం కలుగుతుందన్నారు. 8 గంటల పనిదినాలను 12 గంటలకు పెంచడం సరికాదన్నారు. కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉపాధి కూలీలకు 200 రోజులకు పని దినాలు పెంచి రూ.600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ప్రజా సంఘాల నాయకులు పగడాల యాదయ్య, చంద్రమోహన్, మధుసూదన్రెడ్డి, కందుకూరి జగన్, సుమలత, కవిత, ప్రకాష్కారత్, శంకర్, పి.జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎనికేపల్లిలో ఉద్రిక్తత
● గోశాల పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య భూమిపూజ ● పరిహారం తేల్చకుండా ఎలా చేస్తారని చుట్టుముట్టిన రైతులు ● పనులు చేపట్టేందుకు వెళ్లిన జేసీబీని అడ్డుకున్న వైనం ● లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. ఇద్దరికి స్వల్ప గాయాలు మొయినాబాద్: గోశాలకు కేటాయించిన ఎనికేపల్లి భూముల వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం 7.30 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్కుమార్ భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. గోశాల ఏర్పాటుకోసం భూమి పూజ చేశారు. అంతలోనే రైతులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. పరిహారం విషయం తేల్చకుండా పనులు ఎలా మొదలు పెడతారని నిలదీశారు. పరిస్థితి చేజారి పోతుందని గమనించిన పోలీసులు వలయంగా ఏర్పడి ఎమ్మెల్యేను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. తప్పుదోవ పట్టించారు అధికారులు, పోలీసులు తమను తప్పుదోవ పట్టించారని రైతులు ఆరోపించారు. ఉదయం 8.30 గంటలకు ఎమ్మెల్యే వచ్చి తమతో మాట్లాడతారని అధికారులు సమాచారం ఇచ్చారని, కానీ 7.30 గంటలకే వచ్చి భూమి పూజ చేశారన్నారు. గ్రామం నుంచి భూముల వద్దకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే భూమి పూజ పూర్తయిన తరువాత పంపారన్నారు. లాఠీ ఝులిపించిన పోలీసులు ఎమ్మెల్యే యాదయ్య వెళ్లిపోయిన తరువాత రైతులు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో భూములను చదును చేసేందుకు జేసీబీ అక్కడికి రాగా రైతులంతా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలు ఝులిపించారు. లాఠీ దెబ్బలకు ఓ మహిళ చెయ్యికి గాయాలుకాగా, మరొకరికి వీపులో వాతలు వచ్చాయి. రైతులు రాత్రి వరకు అక్కడే బైఠాయించారు. ఖాళీ భూములు ఇవ్వాలి ప్రభుత్వం ఏర్పాటు చేసే గోశాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్రత్నం అన్నారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. మండలంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, రైతులు సాగుచేసుకొనే భూములను తీసుకోవడం సరికాదన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సీఎం రేవంత్రెడ్డిని ఈ నెల 13న కలసి మాట్లాడటానికి సమయం తీసుకున్నారని.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని తహసీల్దార్ గౌతమ్కుమార్కు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, సీనియర్ నాయకులు భీమేందర్రెడ్డి, వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మా రైతులకు ప్లాట్లు
● లాటరీ ద్వారా కేటాయింపు షురూ ● మొదటి రోజు 60 గజాలలబ్ధిదారులకు.. ● ప్రక్రియను ప్రారంభించిన కలెక్టర్ కందుకూరు: వంద శాతం హక్కులతో పారదర్శకంగా ప్రభుత్వం ఫార్మా రైతులకు ప్లాట్లను అందజేస్తోందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో సోమ వారం కందుకూరు, యాచారం మండలాలకు చెందిన భూ నిర్వాసితులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. మొదటి రోజు 60 గజాల లబ్ధిదారులు 670 మందికి ప్లాట్లు కేటాయించారు. అక్కడే చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ఏర్పాటు చేసిన లేఅవుట్లో ప్రభుత్వమే అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామన్నారు. ఈ ప్రాంతం నుంచి భవిష్యత్లో రేడియల్ రోడ్డు నిర్మాణం జరగనుందని చెప్పారు. రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే సబితారెడ్డి లాటరీ ప్రారంభానికి కంటే ముందే స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. తొందరపడి ఎవరూ ప్లాట్లు విక్రయించొద్దని, భవిష్యత్లో మంచి లాభం వస్తుందని సూచించారు. అంతకుముందు అక్కడ జరుగుతున్న ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు సంకల్పించిందని, దీంతో ఈ ప్రాంతం నాశనమయ్యేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉండేలా ఫ్యూఛర్సిటీని ప్రకటించారన్నారు. రైతుల భూముల విలువలు మరింత పెరుగుతాయని, భవిష్యత్లో గజం ధర రూ.లక్ష పలుకుతుందన్నారు. 320 అడుగుల రహదారి రానుందన్నారు. పర్యవేక్షించిన అధికారులు మొదటి రోజు కుర్మిద్ద, మేడిపల్లి, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, నానక్నగర్, పంజగూడ, తాటిపర్తి రెవెన్యూ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 60 గజాల చొప్పున ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు. కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు ఎఫ్సీఏడీఏ కమిషనర్ శశాంక, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, అనంత్రెడ్డి, డీపీఓ సురేష్మోహన్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్కుమార్, డీసీపీ సునీతరెడ్డి తదితరులు లాటరీ ప్రక్రియను పర్యవేక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు గోపాల్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. నేడు 121 గజాల ప్లాట్ల కేటాయింపు ఫార్మాసిటీ రైతులకు 121 గజాల ప్లాట్ల కేటా యింపు మంగళవారం ఉంటుందని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీర్ఖాన్పేట రెవెన్యూలోని లేఅవుట్లోని ఏటీసీ సెంటర్లో ఉదయం 8 గంటల నుంచి లాటరీ ద్వారా ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కుర్మిద్ద, మేడిపల్లి, మీర్ఖాన్పేట, బేగరికంచె గ్రామాల రైతులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు.. ము చ్చర్ల, సాయిరెడ్డిగూడ, సార్లరావులపల్లి, ఆకులమైలారం, అన్నోజిగూడ, తాడిపర్తి, నానక్నగర్ గ్రామాల రైతులకు మధ్యాహ్నం నుంచి సా యంత్రం పూర్తయ్యే వరకు కొనసాగుతుందని తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
మంచాల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఎ.భుజంగరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43.02 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, వారిలో 24.85 లక్షల మంది చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికీ వారికి పింఛన్ మంజూరు కాలేదన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేయాలని, దివ్యాంగుల కార్పొరేషన్ను బలోపేతం చేయాలని, ప్రతి జిల్లాకు టీసీపీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను సవరణ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాతినిథ్యం కల్పించే విధంగా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ఆమోదింప చేయాలన్నారు. తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే కొనసాగుతోందని గుర్తు చేశారు. తెలంగాణలోనూ అమలు చేయాలని, దివ్యాంగుల హక్కులను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి జెర్కొని రాజు, నాయకులు బాలరాజు, మల్లయ్య, గ్యార బాష, యాదమ్మ, దశరథ, దానయ్య, అలివేలు, సత్తయ్య, పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
అబ్దుల్లాపూర్మెట్: ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి 40 నెలలుగా అద్దె చెల్లించలేదంటూ సదరు యజమాని భవనానికి తాళం వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 17 సంవత్సరాలుగా ఓ ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. 40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో విసుగు చెందిన యజమాని పిట్టల రాజుముదిరాజ్ సోమవారం ఉదయం ఆఫీసుకు తాళాలు వేశారు. తనకు రావాల్సిన అద్దె చెల్లించిన తర్వాతే తీస్తానని తేల్చిచెప్పారు. బ్యాంకు రు ణం తీసుకుని, భవనం నిర్మించానని, ఏళ్ల తరబడి అద్దె చెల్లించకపోతే ఈఎంఐలు ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె చెల్లింపు విఽషయంలో ప్రతీసారి అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఆఫీసు పని వేళల్లో సుమారు గంటన్నర పాటు తాళం వేయడంతో ఇటు అధికారులు, అటు ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. స్పందించిన స్థానిక సబ్ రిజిస్ట్రార్ సునీతారాణి పదిహేను రోజుల్లో డబ్బులు చెల్లించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాన ని హామీ ఇవ్వడంతో యజమాని కార్యాలయ తాళాలు తీశారు. తాళాలు వేశారన్న సమాచారం తెలుసుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు భవన యజమానిని స్టేషన్కు తరలించి, కొద్ది సేపటి తర్వాత వదిలేశారు. -
న్యాయం చేయాలని అర్ధనగ్న ప్రదర్శన
అక్రమంగా భూమిని బదలాయించారని ఆరోపణ అబ్దుల్లాపూర్మెట్: కోర్టు ఉత్తర్వులు వచ్చినా తనకు న్యాయం జరగలేదని ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట హల్చల్ చేశారు. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసిన ఘటన అబ్దుల్లాపూర్మెట్లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. నగరంలోని సైదాబాద్లో నివాసముంటున్న గిరిధర్రెడ్డికి మండల పరిధిలోని తట్టి అన్నారంలో ఉన్న భూమి విషయంలో కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అధికారి తనకు ఎలాంటి నోటీసులు లేకుండా భూమిని అక్రమంగా ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. తట్టిఅన్నారం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 109, 110లలో 6 ఎకరాల భూమి ఉందని, సంవత్సరాల నుంచి ఎదురు చూసినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని గిరిధర్రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. -
మత్తుకు బానిసలు కావొద్దు
కొడంగల్: తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. శుక్రవారం కొడంగల్లో సీఐ కార్యాలయానికి, కొడంగల్, దుద్యాల్, బొంరాస్పేట పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి, గంజాయి చాక్లెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు తెస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. వ్యసనాలకు గురికావడం వల్ల కుటుంబాలు చెల్లాచెదురవుతాయని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. బొంరాస్పేటలో పోలీస్స్టేషన్ నూతన భవన నిర్మాణానికి రూ.2.96 కోట్లు, దుద్యాల్ పోలీస్స్టేషన్కు రూ.3 కోట్లు, కొడంగల్ సీఐ కార్యాలయానికి రూ.85 లక్షలు,కొడంగల్ పోలీస్ స్టేషన్కు రూ.2.96 కోట్లు కేటాయించారు. అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మిస్తామని డీజీపీ తెలిపారు. భవనాలను త్వరగా నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీసులు డీజీపీకి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఐజీ తాీప్సీర్ ఎగ్బాల్, ఎస్పీ నారాయణరెడ్డి, హౌసింగ్ ఐజీ రమేష్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, తహసీల్దార్ విజయ్కుమార్, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ డీజీపీ జితేందర్ -
ప్రార్థనా మందిరాలతో ప్రశాంతత
మొయినాబాద్రూరల్: ప్రార్థనా మందిరాలు మానవుడికి మనశ్శాంతిని కలిగిస్తాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కొంపల్లి అనంతరెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో నూతనంగా నిర్మించిన మెథడిస్ట్ చర్చి ప్రార్థనలను బిషప్ ఏ.సిమోయిన్ నిర్వహించగా ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, రత్నం, అనంతరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో పాటు మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భాస్కర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్, ఎస్టీఎఫ్ అధ్యక్షుడు పోచయ్య, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవియాదవ్, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇన్చార్జి భీంభరత్, నాయకులు శేఖర్, శ్యామ్రావు తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య ఇబ్రహీంపట్నం రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతిచెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ సోమయ్య కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన రంగబాబు(40) తన భార్య, కుమారుడితో కలిసి తుర్కయంజాల్లోని లక్ష్మీ గార్డెన్లో నివాసం ఉండేవాడు. గత కొద్ది రోజులుగా ఏ పనీ చేయకుండా ఉంటున్న రంగబాబు మద్యం, కల్లుకు బానిసయ్యాడు. శుక్రవారం ఉదయాన్నే భార్య ఎప్పటిలాగే ఇళ్లల్లో పనిచేసేందుకు వెళ్లగా, కుమారుడు ఇంట్లో లేడు. పనిముగించుకున్న అనంతరం ఉదయం 10:30 గంటలకు భార్య ఇంటికి చేరుకోగా రంగబాబు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిదపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి దుర్మరణం ఇబ్రహీంపట్నం: ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోల్కంపల్లికి చెందిన గుండ్ల జంగయ్య (56) కల్లు గీసేందుకు తాటి చెట్టి ఎక్కి, మోకు జారి పోవడంతో కింద పడ్డాడు. తలతో పాటు శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ సర్దార్నగర్కు చెందిన రెడ్డిగళ్ల రత్నం కుమార్తె లక్ష్మీ ప్రసన్న(22) విద్యార్థి. గత జూన్ 30వ తేదీన ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన ప్రసన్న తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా జాడ తెలియలేదు. యాచారం ప్రాంతానికి చెందిన అంకని సాయికుమార్ తీసుకెళ్లి ఉంటాడని ఆమె తల్లి రాజ్యలక్ష్మి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో సమాచారం ఇవ్వాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. లారీ, కారు ఢీ ఐదుగురికి గాయాలు కొత్తూరు: లారీ–కారు ఢీకొని ఐదుగురు గాయపడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ కూడలిలోని హెచ్ఐఎల్ పరిశ్రమ ఎదురుగా శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల మేరకు.. షాద్నగర్ పట్టణానికి చెందిన అవినాష్గౌడ్, శ్రావణి, వినయ్, నవీన్గౌడ్, కారు డ్రైవర్ శివకృష్ణలతో కలిసి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్న సంస్థకు బయలు దేరారు. మార్గమధ్యలో తిమ్మాపూర్ శివారు హెచ్ఐఎల్ పరిశ్రమ ఎదురుగా రోడ్డుపై నిలిపిన లారీను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. ముగ్గురు సైబర్ నేరగాళ్లకు అరదండాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నమోదైన వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు భారీ లాభాలు వచ్చే ట్రేడింగ్ అంటూ నమ్మించారు. ఆపై ఆయన నుంచి రూ.67.60 లక్షలు కాజేసి మోసం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారులు ఈ మొత్తంలో కొంత గుజరాత్కు చెందిన హార్థిక్ కుమార్ పేరుతో ఉన్న ఖాతాలోకి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన బృందం అతడిని అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇతగాడు స్క్రాప్ వ్యాపారి దేవ్రాజ్ భాయ్ కోరడంతో తన పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలు అందించినట్లు వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా జరిగే లావాదేవీలపై కమీషన్ పొందుతున్నాడని తేలింది. దీంతో పోలీసులు దేవ్రాజ్ను అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే రకమైన మరో మోసంలో నగరవాసి నుంచి రూ.6.16 లక్షలు కాజేసిన కేసులో అకౌంట్ హోల్డర్గా ఉన్న ఉత్తరాఖండ్ వాసి మనీష్ కుమార్ శర్మనూ పోలీసులు పట్టుకున్నారు. -
బీసీల అభివృద్ధికి సమష్టి కృషి
షాబాద్: బీసీలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా మధు, ఉపాధ్యక్షుడిగా పోచయ్య, ప్రధాన కార్యదర్శిగా సుభాన్, సభ్యులుగా కృష్ణ, జనార్దన్, రమేశ్ ఎన్నుకొని నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. దేశ జనాభాలో 50 నుంచి 60 శాతం వరకు బీసీలు ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారన్నారు. ఆధిపత్య వర్గాలతోనే బీసీలు అన్ని రంగాల్లో వెనుక బడుతున్నారని ఆరోపించారు. ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. బీసీలకు అన్ని విధాలా అన్యాయం జరుగుతుందని, హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దీనికోసం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బీసీసేన మండల అధ్యక్షుడు దయాకర్చారి, యూత్ అధ్యక్షుడు అజయ్కుమార్, ఉపాధ్యక్షుడు మాణిక్యం, నాయకులు స్వామి, బాల్రాజ్, గణేష్, మల్లేష్, కృష్ణ, కుమార్, ప్రభాకర్, యాదిగిరి, గోపాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలి కేశంపేట: మహిళలు రాజకీయాల్లో రాణించాలని బీసీ సేన జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీనివాస్యాదవ్ సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం బీసీసేన మహిళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా మండల కమిటీని ఎంపిక చేశారు. అనంతరం శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. బీసీలు రాజకీయాల్లో వచ్చి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. బీసీలందరూ ఏకమై రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి బీసీ నినాదంతో ముందుకువెళ్లాలని సూచించారు. మండల కమిటీ అధ్యక్షురాలిగా వనమ్మ, ఉపాధ్యక్షులుగా శ్రీలత, కవిత, ప్రధాన కార్యదర్శులుగా అనూష, మాధవి, కార్యదర్శులుగా అశ్విని, భవాని, కోశాధికారిగా ధనరేఖలను ఎన్నుకొని నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, వెంకటేష్, నియోజకవర్గ అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, సభ్యులు లింగమ్మ, యాదమ్మ, పుణ్యవతి, నాగమణి, సుచరిత, పరమేశ్వరి, కృష్ణమ్మ, రేణుక, అఖిల తదితరులు పాల్గొన్నారు.బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
షాద్నగర్రూరల్: అగ్ని ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు షాద్నగర్ పట్టణ సీఐ విజయ్కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్స్టేషన్లో ఫంక్షన్ హాల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, లాడ్జీ, హోటల్స్, హాస్టల్స్ యజమానులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాల నివారణకు అందరూ తగిన విధంగా కృషి చేయాలని సూచించారు. వ్యాపారులు తప్పనిసరిగా మున్సిపల్, అగ్నిమాపక శాఖ అనుమతులు విధిగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ట్రేడ్ లైసెన్సు, రెంటల్ డీడ్, లీజ్ అగ్రిమెంట్, వైద్య, ఆరోగ్య శాఖ, ఎన్ఓసీ, పోలీస్ శాఖల నుంచి విధిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అధికంగా వచ్చే వ్యాపార కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నారు. సమావేశంలో ఎస్ఐలు శరత్కుమార్, సుశీల, ప్రణయ్, నరేందర్, శ్రీకాంత్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. సీఐ విజయ్కుమార్ -
థానేలో ఎస్కేప్.. సిటీలో అరెస్టు!
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని థానే కేంద్రంగా సాగిన అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లో కీలక నిందితుడు మహ్మద్ రహీమ్ షేక్ అలియాస్ ఫర్హాన్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కాడు. గత నెల 25 నుంచి పరారీలో ఉండి, బహ్రేన్ పారిపోయే ప్రయత్నాల్లో ఉన్న ఇతగాడిని మాన్పడా పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఫర్హాన్ నేతృత్వంలో ఏర్పడిన గ్యాంగ్ థానే కేంద్రంగా పని చేసింది. మాదకద్రవ్యమైన మెఫెడ్రోన్ను మహారాష్ట్రలోని వివిధ నగరాలు, పట్టణాల్లోని పెడ్లర్స్కు సరఫరా చేసింది. కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాపై గత నెల్లో థానేలో ఉన్న మాన్పడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ ముఠా వ్యవహారాలపై కన్నేసి ఉంచిన అధికారులు గత నెల 25న అక్కడి ఖోనీ ప్రాంతంలో దాడి చేశారు. ఓ మహిళ సహా ఐదుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.12 కోట్ల విలువైన 1.93 కేజీల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ విచారణలోనే ఫర్హాన్ పేరు వెలుగులోకి వచ్చింది. డ్రగ్ అతడి ద్వారానే తమకు అందుతుందని, విక్రయించగా వచ్చిన సొమ్ములో తమ కమీషన్ పోను మిగిలింది అతడికే అప్పగిస్తామని గ్యాంగ్ మెంబర్స్ బయటపెట్టారు. దీంతో ఫర్హాన్ కోసం పోలీసుల వేట ముమ్మరమైంది. తన ముఠా పోలీసులకు చిక్కిన విషయం తెలుసుకున్న ఫర్హాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విదేశీ లింకులు ఉన్న ఇతగాడు దేశం దాటి వెళ్లేపోయే అవకాశం ఉందని అనుమానించిన థానే పోలీసులు దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల వద్దా కన్నేసి ఉంచారు. ఫర్హాన్ పాస్పోర్ట్ నెంబర్ ఆధారంగా అతడిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహ్రేన్ వెళ్లిపోవడానికి ఫర్హాన్ ప్రయత్నించాడు. ఈ విషయంపై ఉప్పందుకున్న థానే పోలీసులు నగరానికి చేరుకుని ఎయిర్పోర్టు మార్గాల్లో నిఘా ఉంచారు. ఓ వాహనంలో విమానాశ్రయం వైపు వస్తున్న ఫర్హాన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని అరెస్టు చేసిన థానే పోలీసులు అక్కడకు తరలించి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. మహారాష్ట్రలోని అనేక నగరాలకు డ్రగ్ సరఫరా ప్రధాన సూత్రధారిగా ఉన్న మహ్మద్ రహీమ్ నగరం మీదుగా విదేశాలకు పారిపోయే యత్నం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అరెస్టు -
అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు సౌకర్యం
షాద్నగర్రూరల్: గురు పౌర్ణమిని పురస్కరించుకొని తమిళనాడులోని అరుణాచ ల క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని డీఎం ఉష అన్నారు. డిపో కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. అరుణాచల క్షేత్రంలో ఈనెల 10న గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నెల 8న రాత్రి 7 గంటలకు షాద్నగర్ నుంచి బయలుదేరి 9న ఉద యం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటుందని, దర్శనం అనంతరం అక్కడి నుంచి బయ లుదేరి సాయంత్రం 4 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్కు చేరుకుంటుందన్నారు. అక్క డి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి అరుణాచల క్షేత్రానికి చేరుకుంటుందని వివరించా రు. 10న గిరిప్రదక్షిణ పూర్తయిన తరువాత సా యంత్రం 4 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 11న ఉదయం 5గంటలకు షాద్నగర్ డి పోకు చేరుకుంటుందని పేర్కొన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ. 3,600, పిల్లలకు రూ.2,400 నిర్ణయించడం జరిగిందన్నారు. టికెట్ బుకింగ్ కోసం 94409 19113, 9490021433, 91826 45281, 99592 26287 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. -
సర్ధార్నగర్ను సందర్శించిన తమిళనాడు బృందం
షాబాద్: మండలంలోని సర్ధార్నగర్ గ్రామాన్ని తమిళనాడు బృందం గురువారం సందర్శించింది. గ్రామ పరిపాలన, పౌరసేవలు, వివిధ పథకాల అమలు బాగుందని కితాబిచ్చింది. ఎంసీఆర్హెచ్ఆర్డీ ద్వారా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన కేంద్ర) శిక్షణ బృందం అనిల్కుమార్, వెంకటరమణ తమిళనాడు సర్పంచులు, బ్లాక్ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల బృందంతో కలిసి గ్రామంలో సౌకర్యాలు, వనరులు, అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. పంచాయతీ భవనం, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనాలను సందర్శించి బాగున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రేపటినుంచి వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు షాద్నగర్రూరల్: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈ నెల 5,6 తేదీల్లో నిర్వహించనున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 9వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దులజంగయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలు, ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించనున్నట్టు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుందని వివరించారు. ఈ మహాసభలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్యతో పాటు రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారని చెప్పారు. మార్కెట్ సిబ్బంది నిరసన ఇబ్రహీంపట్నం: మహబూబ్నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్పై ఆ కమిటీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ సిబ్బంది భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వైస్ చైర్మన్ను పదవి నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ అనుమతులు అదుర్స్ సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలో ‘రియల్’ పరుగు ఊపందుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు భవనాలు, అపార్ట్మెంట్లు, హైరైజ్ బిల్డింగ్లు, లే అవుట్ తదితర నిర్మాణ రంగానికి సంబంధించి 922 అనుమతులను (ప్రొసీడింగ్స్)ను ఇచ్చినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వీటిపై ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.519 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు అందజేసిన అనుమతుల కంటే ఈ ఏడాది జూన్వరకు నిర్మాణరంగ అనుమతులు పెరిగాయి. గత సంవత్సరం జూన్ నాటికి 388 అనుమతులు మాత్రమే అందజేయడం గమనార్హం. మొత్తంగా 2024లో హెచ్ఎండీఏ 878 అనుమతులను అందజేసింది. వీటిపై రూ.395.13 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు 2023లో 1,361 అనుమతులను ఇచ్చారు. రూ.563.32 కోట్ల ఆదాయం లభించింది. నిర్మాణరంగంలో ఎలాంటి స్తబ్దత లేదని, గత రెండేళ్లుగా పరుగులు పెడుతూనే ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 922 ప్రొసీడింగ్స్ ఇవ్వగా డిసెంబర్ నాటికి రెట్టింప య్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అనుమతుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సకాలంలో అందజేస్తున్నట్లు చెప్పారు. బిల్డ్నౌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. -
అస్తవ్యస్తంగా నిర్వహణ
శంకర్పల్లి: మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలో నిత్యం 12టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఎక్కడా తడి, పొడిగా వేరు చేయడం లేదు. మున్సిపాలిటీకి చెత్తను డంప్ చేయడానికి సరైన డంపింగ్ యార్డు లేదు. ఉన్నా దాంట్లో ఇష్టం వచ్చినట్టు చెత్త పడేయడం, గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి వేసి వెళ్లడంతో నిరంతరం పొగలు వస్తూనే ఉంటాయి. సమీపంలోని కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేస్తే ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లి, పొగలను చల్లార్చుతున్నారు. ఇప్పటికై నా డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కూరగాయల వ్యర్థాల ద్వారా నెలకి పది టన్నుల కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. మిగతా చెత్తను సైతం ఎరువుగా మార్చాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఫార్మా వద్దు.. ఫ్యూచర్ వద్దు
యాచారం: ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే.. ఫ్యూచర్సిటీ పేరుతో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా అదే పంథా అనుసరిస్తోందని ఆయా గ్రామాల రైతులు విమర్శించారు. శ్రీఫార్మాసిటీ వద్దు.. ఫ్యూచర్సిటీ అసలే వద్దుశ్రీ అని నినదించారు. టీజీఐఐసీ పేరు మీద మార్చిన పట్టా భూముల రికార్డులను రైతుల పేరిట మార్చాలని.. భూసేకరణ నిలిపేయాలని.. అర్హులైన అసైన్డ్, కబ్జాలో ఉన్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కుర్మిద్ద నుంచి తాడిపర్తి, నానక్నగర్, నక్కర్తమేడిపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. నక్కర్తమేడిపల్లిలోని ఫార్మాసిటీ వ్యతిరేక స్థూపం వద్ద నల్లా జెండాలు కట్టి సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగేళ్లుగా టీజీఐఐసీ పేరు మీదున్న భూ రికార్డులు రైతుల పేర్లపై నమోదు కాకపోవడంతో రైతుభరోసా, బ్యాంకు రుణాలు, అత్యవసర సమయాల్లో క్రయవిక్రయాలు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా అధికారుల్లో చలనం లేదన్నారు. ఫ్యూచర్సిటీ పేరుతో మళ్లీ భూములు కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ పీపుల్స్ జేఏసీ జాయింట్ కన్వీనర్ కన్నెగంటి రవి, మానవ హక్కుల వేదిక నుంచి విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు, హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్, కుర్మిద్ద, తాడిపర్తి, నానక్నగర్ మాజీ సర్పంచులు, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాధిత రైతుల ఆందోళన పాలకుల తీరుకు నిరసనగా పాదయాత్ర సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు -
యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం పనులు షురూ
కందుకూరు: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా నేదునూరు పరిధిలోని మోడ ల్ స్కూల్లో గురువారం పనులు ప్రారంభించారు. వర్షపు నీరు ఇంకేలా పిట్ తవ్వకంతో పాటు ఔషధ మొక్కల పెంపకం కోసం స్థలాన్ని జేసీబీ యంత్రంతో సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విష్ణుప్రియ మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడంతో వర్షం నీరు ఇంకి భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడుతుందన్నారు. ఔషధ మొక్కల పెంపకం చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వాళ్లు ఇళ్ల వద్ద పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పుష్పలత, గురురాజారెడ్డి, సీజీఆర్ సంస్థ కోఆర్డినేటర్ రజనీకాంత్, ఎర్త్ లీడర్స్ హానిప్రియ, మధీహ, విజయదుర్గ, తేజస్విని, తరుణి, మాధవి, శ్రీకర్, హాసిని పాల్గొన్నారు. -
బాలికలను వేధిస్తే జైలుకే
తాండూరు రూరల్: పాఠశాలలు, కళాశాలల వద్ద బాలికలను వేధిస్తే జైలుకు పంపిస్తామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాల్యం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. బాలికలను వేధిస్తే పోక్సో చట్టం కింద జైలుకు పంపిస్తామన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ విఠల్రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● ఘన స్వాగతం మహేశ్వరం: మండల కేంద్రంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తయారీ పరిశ్రమను ప్రారంభించడానికి గురువారం విచ్చేసిన సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలు, గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు జంగారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కోరుపోలు రఘుమారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సబావత్ కృష్ణ నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నందిగామ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని, ఉన్నతాధికారుల సూచనలు, సలహాల ప్రకారం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని డివిజినల్ లెవల్ పంచాయతీ అధికారి సాధన అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్–2025, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్, ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, సిటీజన్ సర్వీస్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాల వివరాలను ఆయా శాఖల అధికారులు సోమవారం లోగా అందజేయాలన్నారు. వన మహోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. కాగా తమకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదని ఉపాధి హామీ టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు సమావేశాన్ని బహిష్కరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ యెల్లంకి జంగయ్యగౌడ్, ఎంపీఓ రఘు, మండల వ్యవసాయాధికారిణి విద్యాధరి, మండల విద్యాధికారి హీర్యానాయక్, వైద్యాధికారులు మంజుల, సరిత, ఎస్ఐ నాగరాజు, మండల పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ ఏఈలు ఉస్మాన్, రజిత, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. -
క్రిష్ ఇన్ హోటల్ కిచెన్లో అగ్ని ప్రమాదం
అమీర్పేట: ఎస్ఆర్నగర్ క్రిష్ హోటల్లో ఆగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.దీంతో అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిరు. వివరాల్లోకి వెళితే..ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఐదు అంతస్తుల భవనంలో క్రిష్ హోటల్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో కాఫీ డే పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.క్రిష్ హోటల్ కిచెన్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దట్టమైన పొగలు రావడంతో హోటల్లో పనిచేసే నలుగురు సిబ్బందితో పాటు ఇద్దరు కస్టమర్లు కిందకు దిగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వారు భవనం పైకి ఎక్కి ఆర్థనాదాలు చేశారు. మరో యువకుడు హోటల్ కిటికీ పగులగొట్టి కిందకు దూకేందుకు యత్నించగా చేతికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఆర్నగర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సనత్నగర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. అప్పటికే అక్కడికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భవనంపై చిక్కుకున్న సిబ్బంది, కస్టమర్లను సురక్షితంగా కిందకు దింపారు. పొగ పీల్చుకుని ఇబ్బంది పడుతునకన ఓ మహిళకు ఆక్సీజన్ అందజేసి వెంటనే 108 ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి తెలిపారు. -
విద్యుదాఘాతంతో గేదెల మృతి
మొయినాబాద్: విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్నగర్కు చెందిన గుంటి పోచయ్య గేదెల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వాటిని మేత మేయడానికి వదిలాడు. హిమాయత్నగర్ రెవెన్యూలో తెగి పడిన విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో కరెంటు షాక్తో రెండు గేదెలు మృతి చెందాయి. రాత్రయినా గేదెలు రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. గురువారం ఉదయం గేదెల కళేబరాలు కనిపించాయి. బాధితుడు మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని.. నష్టపోయిన తమను ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. సకాలంలో రక్తం అందక బాలింత మృతి మలక్పేట: సకాలంలో రక్తం అందక బాలింత మృతి చెందిన సంఘటన మలక్పేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..అక్బర్బాగ్కు చెందిన సురేష్ భార్య నెమలిక(21) ప్రసవం నిమిత్తం మంగళవారం మలక్పేట ఏరియా ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు తీవ్రరక్త స్రావం కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో, ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ లేనందున ఆమెను కోఠి మెటర్నిటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సకాలంలో వైద్యం అందనందునే నెమలిక మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు గురువారం ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వందల కాన్పులు జరిగే ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నా రు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
గుట్టలుగా చెత్త
మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం● పోగైన చెత్తను పొగబెట్టి.. షాద్నగర్: మున్సిపల్ పరిధిలో ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్న చెత్తనంతా ఊరు చివరన పడేస్తున్నారు. పోగైన చెత్తను కాల్చేస్తుండటంతో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. సుమారు 20వేల ఇళ్లు ఉన్నాయి. పట్టణంలో సుమారు లక్షకు పైగా జనాభా నివాసం ఉంటోంది. ప్రతి రోజు మున్సిపల్ సిబ్బంది సుమారు 33 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో సుమారు 400 కిలోల వరకు కూరగాయల వ్యర్థాలు ఉంటున్నాయి. ఆరు ట్రాక్టర్లు, 28 ఆటోలను ఉపయోగిస్తూ ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు సుమారు 102 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సోలీపూర్ శివారులో డంపు మున్సిపాలిటీ రోజుకురోజుకూ విస్తరిస్తోంది. పట్టణంలో సేకరించిన చెత్తను ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో పారబోస్తున్నారు. తరచూ చెత్తను కాల్చివేయడం ద్వారా పొగ గ్రామం మొత్తం వ్యాపిస్తోంది. చెత్తలో ఉన్న మాంసం వ్యర్థాల కోసం ఈ ప్రాంతంలో కుక్కలు విపరీతంగా సంచరిస్తున్నాయి. దోమలు, ఈగలు వ్యాప్తి చెందడంతో డంపింగ్ యార్డును తరలించాలని గ్రామస్తులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ● జాతీయ రహదారి పక్కనే.. మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై డంపింగ్ కంపు పెరిగింది. మున్సిపల్ పరిధిలోని చెత్తను హిమాయత్నగర్ రెవెన్యూలో జాతీయ రహదారి పక్కనే డంప్ చేస్తున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదాలు, ప్రయాణికులు, స్థానికులు దుర్వాసన, ఈగలు, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో 9 పంచాయతీలు విలీనమయ్యాయి. పంచాయతీలుగా ఉన్నప్పుడు అన్ని గ్రామాలకు డంపింగ్ యార్డులు వేర్వేరుగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం మున్సిపాలిటీ ఏర్పాటైంది. పంచాయతీగా ఉన్నప్పటి నుంచి మొయినాబాద్కు డంపింగ్యార్డు లేదు. అప్పట్లో సురంగల్ రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో డంప్ చేసేవారు. అక్కడి నుంచి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తుండడంతో మున్సిపల్ కేంద్రంలోని చెత్తను ప్రస్తుతం హిమాయత్నగర్ రెవెన్యూలో జాతీయ రహదారి పక్కన పడేస్తున్నారు. మొయినాబాద్లోనే నిత్యం సుమారు 10–12 ట్రాక్టర్ల చెత్త వెలువడుతోంది. మొయినాబాద్, హిమాయత్నగర్ నుంచి వెలువడే చెత్తనంతా ఒకేచోట వేస్తుండం.. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మరోవైపు మున్సిపాలిటీలోని ఏడు గ్రామాల్లో ఎక్కడి డంపింగ్ యార్డులు అక్కడే ఉన్నాయి. స్థలంకోసం అన్వేషణ చేవెళ్ల: కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో సరైన డంపింగ్ యార్డుకోసం స్థల అన్వేషణ జరుగుతోంది. పంచాయతీగా ఉన్న సమయంలో ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి అక్కడే డంపింగ్ చేశారు. మున్సిపాలిటీగా ఏర్పాటైన తరువాత 12 గ్రామాలకు సరిపడా డంపింగ్యార్డు ఒకేచోట ఏర్పాటుకు స్థలం కావాల్సి ఉంది. అనువైన స్థలం అందుబాటులోకి వచ్చాక చెత్త సేకరణతో కంపోస్ట్ ఎరువు తయారు చేయడంతో పాటు తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వేయనున్నారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్న చెత్తను అందుబాటులో ఉన్న డంపింగ్ యార్డుల్లో వేస్తున్నారు. డంపింగ్ యార్డులు రోడ్ల పక్కన నివాసాలకు దగ్గరలో ఉండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీలను చెత్త సమస్య వెంటాడుతోంది. డంపింగ్ యార్డులు లేకపోవడంతో సేకరించిన చెత్తనంతా పురపాలికల శివార్లలో డంప్ చేస్తున్నారు. దీంతో కుప్పలుగా పేరుకుపోతోంది. ఈగలు, దోమలు వ్యాప్తి చెందడంతో పాటు చెత్తను తరచూ తగులబెడుతుండడంతో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. చెత్తతో రోగాలపాలవుతున్నామని, పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. సరైన డంపిగ్ యార్డులు కరువు శివార్లలో పడవేత.. కాల్చివేత అసౌకర్యానికి గురవుతున్న స్థానికులు -
కారు ఇంజన్లో మంటలు
మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పక్కన భారత్ పెట్రోల్ పంపులో పెను ప్రమాదం తప్పింది. కారులో పెట్రోల్ పోయించుకుని వెళ్తుండగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన సుదర్శన్ తన క్విడ్ కారులో షాద్నగర్ నుంచి వచ్చి మైలార్దేవ్పల్లిలోని భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకున్నాడు. తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెట్రోల్ పంపు సిబ్బంది ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు. ఫ్రిడ్జ్ పేలి గృహోపకరణాలు దగ్ధం అమీర్పేట: ఫ్రిడ్జ్ పేలి ఇంట్లోని వస్తువులు కాలిపోయిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సనత్నగర్ రాజరాజేశ్వరీనగర్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన రవి భార్య, కుమారుడితో కలిసి రాజరాజేశ్వరి నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం భార్యా, భర్తలు నీళ్లు తెచ్చేందుకు కిందకు వెళ్లగా మూడో అంతస్తులోని వారి ఇంట్లో ఫ్రిడ్జ్లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో పేలిపోయింది. మంటలు ఇంట్లో ఉన్న సామగ్రికి వ్యాపించడంతో కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక ఫ్రిడ్జి కంప్రెషర్ పేలి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉందని ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపారు. బీటెక్ విద్యార్థి ఆత్యహత్య సికింద్రాబాద్: మానసిక సమస్యలతో బాధపడతున్న బీటెక్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఘట్కేసర్–బీబీనగర్ రైల్వేస్టేషన్ల చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ పండరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా, బెల్లెపల్లికి చెందిన చీర సాయిప్రకాశ్ (22) నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్న అతను బుధవారం రాత్రి చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం కాచిగూడ: గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ, కృష్ణానగర్ నాలాలో గుర్తుతెలియని వ్యక్తి (45) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
అనంతగిరి: సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి.. సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తున్నారని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్లోని ఆయన నివాసంలో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం హైదరాబాద్లో జరగనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశానికి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సీఎం రేవంత్రెడ్డి సమర్థవంతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. ఖర్గే సమావేశం చరిత్రలో నిలిచిపోనుందన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, డీసీసీబీ డైరక్టర్ కిషన్నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్చైర్మన్ రమేష్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు అనంత్రెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, రాంచంద్రారెడ్డి, వాహిద్మియా, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం ఖర్గే సమావేశాన్ని విజయవంతం చేద్దాం స్పీకర్ ప్రసాద్కుమార్ -
వాహనాల తనిఖీలు
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం కుర్మిద్ద–మీర్ఖాన్పేట గ్రామాల మధ్యన రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. సీఐ లిక్కి కృష్ణంరాజు రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. కార్లు, ఇతర వాహనాల్లో ఏం తరలిస్తున్నారో పరిశీలించారు. వాహనాలు నడిపే వారు, ఆర్సీ, లైసెన్స్లు కలిగి ఉండాలని సూచించారు. అతి వేగంతో ప్రమాదాలకు గురి కావద్దని చెప్పారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ తేజంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
గాడితప్పిన పల్లెపాలన
షాబాద్: ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయి. పంచాయతీల్లో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటు పడుతుంది. గతేడాది జనవరి 31తో గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించలేని స్థితిలో పంచాయతీలున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో పాటు సరైన నిర్వహణ లేక పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల పరిస్థితి అధ్వానంగా మారింది. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 526 గ్రామ పంచాయతీలున్నాయి. 16 నెలల క్రితం గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తున్నది. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ అంతంతా మాత్రంగానే ఉండడంతో పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. వనమహోత్సవం, ఉపాధిహామీ, పల్లెప్రగతి, ఇంటి పన్నుల వసూలు, పారిశుద్ధ్యం తదితర పనులతో పంచాయతీ కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో చెత్త సేకరణ ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. ఒక్కో గ్రామ పంచాయతీలో వివిధ పనులు చేపట్టడానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే గ్రామాల్లో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో నిధులు లేక అభివృద్ధికి నోచుకోని గ్రామాలు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు పనిభారంతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీ కార్యదర్శులు పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల పరిస్థితి అధ్వానం పారిశుద్ధ్య నిర్వహణ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ఉండేలా పంచాయతీ కార్యదర్శులతో ప్రతీవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాం. పెండింగ్ బిల్లులు ఉన్నప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణలో జాప్యం లేకుండా చూస్తున్నాం. – అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్ -
సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా
యాచారం: గ్రామాల్లో సీసీ కెమెరాలుంటే 24 గంటల పాటు పోలీస్ బందోబస్తు ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని నస్దిక్సింగారంలో దాతల సహకారంతో వివిధ చోట్ల బిగించిన పది సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలుంటే ఎంతో రక్షణ ఉంటుందన్నారు. గ్రామాల్లోని యువత, రాజకీయ వేత్తలు, ఉద్యోగులు సమష్టిగా కలిసి సీసీ కెమెరాల బిగింపు కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు, గ్రామస్తులు పాండురంగారెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీశైలం, గాలయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న అభ్యుదయ్ డే సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) ఆధ్వర్యంలో జరిగిన మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అభ్యుదయ్ డే బుధవారం ముగిసింది. గత 18న ప్రారంభించిన ఈ కార్యక్రమం పలు ఉపయుక్తమైన వర్క్షాప్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రజెంటేషన్స్తో విద్యార్థులను ఆకట్టుకుంది. టీసీఎస్ సంస్థ హెడ్ చల్లా నాగ్, ఎలికో హెల్త్కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వనితా దట్ల, స్మార్ట్ ఫార్మా 360 సీఈఓ సహ వ్యవస్థాపకురాలు సాకేత, న్యాయవాది మోబాష్షీర్ సర్వర్, కెనడాలోని డల్హౌసీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్టీఫెన్ మెచౌలన్ తదితర దేశ విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలి జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ మహేశ్వరం: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మెహబ్బత్నగర్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, ప్రాథమిక పాఠశాల, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా డీపీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా తగు చొరవ చూపాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి మైథిలి ఉన్నారు. -
సెట్టింగ్తో సెటిల్మెంట్!
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం అవన్నీ అటకెక్కిపోయాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్ 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అప్పట్లో రాచకొండ లేకపోవడంతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ అధ్యక్షుడిగా, ఐజీ స్థాయి అధికారులైన అదనపు కమిషనర్ (సమన్వయం), అదనపు కమిషనర్ (నేరాలు) సభ్యులుగా, సైబరాబాద్ కమిషరేట్ విషయానికి వస్తే అధ్యక్షుడిగా పోలీసు కమిషనరే ఉన్నప్పటికీ సభ్యులుగా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, క్రైమ్ డీసీపీ వీటిని ఏర్పాటు చేశారు. ఆపై ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లకు (ఎస్ఓపీ) రూపమిచ్చి వెబ్సైట్లలో పొందుపరిచారు. కాలక్రమంలో ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్మెంట్లు కొనసాగుతున్నాయి. ● ‘పోలీసుస్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి. వీటిని సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా మార్చారు. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు’ ● రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసుస్టేషన్లో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. ● పీఎస్లే కేంద్రంగా పంచాయితీలు ● ఫలితాలివ్వని ఎస్ఓపీలు, మానిటరింగ్ కమిటీలు ● హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి తెరపైకి -
పెద్దచెరువులో మట్టి తవ్వకాలు!
మీర్పేట: పెద్దచెరువు (ఐల్యాండ్)లో నిబంధనలకు విరుద్ధంగా బుధవారం ఉదయం మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులను వివరణ కోరగా.. మాకేం సంబంధం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చెరువు కట్టపై మొక్కలు నాటేందుకు.. కొద్దిగా మట్టి తీసుకెళ్తున్నామని అక్కడే ఉన్న కాంట్రాక్టర్ తెలిపారు. వాస్తవానికి బయటనుంచి మట్టి తీసుకురావాల్సి ఉన్నా.. చెరువు స్థలంలో తవ్వకాలు చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలా తవ్విన గుంతల్లో నీళ్లు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చెరువు స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను ధ్వంసం చేసి జేసీబీ, ట్రాక్టర్లతో లోనికి వెళ్లారని ఆరోపించారు. -
స్కూల్ పిల్లలకు తప్పిన ముప్పు
మొయినాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన నాగిరెడ్డిగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్లోని ఓ కార్పొరేట్ స్కూల్ బస్సు బాకారం నుంచి పిల్లలను ఎక్కించుకుని నాగిరెడ్డిగూడ వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఒకవైపు చక్రాలు పంటపొలంలోకి దూసుకెళ్లడంతో బస్సు ఆగిపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే రోడ్డు కిందికి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు మండిపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. స్కూల్ బస్సులు వరుస ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో వీటి ఫిట్నెస్పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలి
కొత్తూరు: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ విభాగం జిల్లా అధ్యక్షుడు రమావత్ సక్రునాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పలువురు కార్మికులతో కలిసి కొత్తూరు మున్సిపల్ కమిషనర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. అంతేకాకుండా కార్మికులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాకుండా, ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే పనులు చేయించాలన్నారు. కార్మికులకు సబ్బులు, నూనె, చీపుర్లు, గ్లౌస్లు, మాస్కులు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వారంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సంజీవకుమార్, జంగయ్య, రోజ, దేవమ్మ, అంజమ్మ, మంజుల, సుజాత, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు సక్రునాయక్ -
నిధుల దుర్వినియోగంపై ఆగ్రహం
షాద్నగర్రూరల్: పట్టణంలోని పద్మావతీకాలనీలో ఉన్న పోస్టాఫీస్లో నిధుల దుర్వినియోగంపై బుధవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోస్టల్ శాఖకు సంబంధించిన రూ.19 లక్షల నిధులు ఖాతాలో జమ చేయకుండా స్థానిక పోస్టల్ ఉద్యోగి దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై అధికారులు కదిలారు. వనపర్తి పోస్టల్ ఆఫీస్ సూపరింటెండెంట్ భూమన్న, అధికారులు సైదానాయక్, గోపీనాథ్, సుజన్ నాయక్, రవికుమార్లు షాద్నగర్కు విచ్చేసి కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఇందులో పోస్టల్శాఖకు సంబంధించిన రూ.19లక్షల డబ్బులు లేకపోవడంతో స్థానిక అధికారి ఉమామహేశ్వర్పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఎక్కడ ఉన్నాయని స్థానిక అధికారిని ప్రశ్నించడంతో డబ్బులు ఇంటి వద్ద ఉన్నాయని చెప్పారు. దీంతో రెండు రోజుల్లో డబ్బులు మొత్తం ఖాతాలో జమ చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోస్టాఫీస్లో తనిఖీ చేసిన అధికారులు -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు
హయత్నగర్: కేంద్ర ప్రభుత్వ కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుకు నిరసనగా ఈ నెల 9న తలపెట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు అబ్దుల్లాపూర్మెట్ మండల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం కుంట్లూరులోని రావినారాయణరెడ్డి కాలనీలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్, అప్రెంటీస్, థర్డ్ పార్టీ ట్రైనీలుగా పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు హరిసింగ్నాయక్, నాయకులు లక్ష్మణ్, నర్సింహ, ప్రసాద్, నవనీత తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రవీంద్రాచారి -
భారతి సిమెంట్కు తిరుగు లేదు
అనంతగిరి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ను తెలంగాణలో ప్రవేశపెట్టిందని, సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్లోని ఓంసాయి ట్రేడర్స్ డీలర్ షాప్లో తాపీ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి ఈ సిమెంట్ సరైన ఎంపిక అని తెలిపారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం అందజేస్తామని, స్లాబ్, కాంక్రీట్ వేసే సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడుతారని స్పష్టంచేశారు. మార్కెట్లో దొరికే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ ధర బ్యాగుకు 20 రూపాయలు అధికంగా ఉంటుందన్నారు. అనంతరం 60 మంది తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి, డీలర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా బాండ్ల అందజేత -
‘ముసురు’తున్న వ్యాధుల ముప్పు!
నిధుల దుర్వినియోగం.. షాద్నగర్ పోస్టాఫీస్లో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 8లోuసాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుకుంటున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా పలువురు దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వనస్థలిపురం, కొండాపూర్ సహా జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సాధారణ ఓపీల్లో కన్పించే రోగుల్లో 40 శాతం మంది(పెద్దలు, చిన్నారులు)జ్వరపీడితులే. ఇవి సాధారణంగా కన్పించే లక్షణాలే అయినా.. అప్రమత్తత అవసరం’అని మహేశ్వరం మెడికల్ కళాశాల అనుబంధ(వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ స్పష్టం చేశారు. ఏమాత్రం అలసత్వం వహించినా.. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరక తప్పదని హెచ్చరించారు. బుధవారం ఆయన సీజనల్ వ్యాధులపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు అవసరమైన మందులను అందజేస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్వాలిఫైడ్ వైద్యుడితో చికిత్సలు చేయించుకోవడం ఉత్తమం’అని చెప్పారు. వైరస్ వ్యాప్తికి అనుకూలం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి, గాల్లో తేమశాతం పెరగడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. శరీరం ఈ మార్పులకు అలవాటు పడేందుకు కొంతసమయం పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్లూ కారక వైరస్లు సులభంగా వ్యాపిస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురవుతుంటారు. ఈ లక్షణాలతో కన్పించే పిల్లలను బడికి పంపకపోవడం ఉత్తమం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం వంటి స్వీయ జాగ్రత్తలతో సీజనల్ వ్యాధులు దరి చేరకుండా చూసుకోవచ్చు. పొంచి ఉన్న డెంగీ ముప్పు చిరుజల్లులకు ఇంట్లోని పూల కుండీలు, ఇంటిపై ఖాళీ డబ్బాలు, మూతల్లేని ట్యాంకుల్లో వర్షపు నీరు నిల్వ ఉంటుంది. దీంతో డెంగీ కారక దోమలు పగటిపూట పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తుంటాయి. విపరీతమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న బాధితుల్లో ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా పడిపోతోంది. ప్లేట్లెట్స్ సంఖ్య భారీగా పడిపోవడంచికిత్సలో జాప్యం కారణంగా ఒక్కోసారి ప్రాణాల మీదికొస్తుంది. మస్కిటో కాయిల్స్, మస్కిటో మ్యాట్, కిటికీలకు జాలీలను ఏర్పాటు చేసుకోవడం, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం, దోమ తెరలను వాడటం వంటి స్వీయ జాగ్రత్తలతో డెంగీని దరిచేరనీయకుండా చూసుకోవచ్చు. బయటి ఆహారం వద్దు ప్రస్తుతం చెరువుల్లోకి వచ్చే నీటివరదతో పాటే బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా శుద్ధి చేయని ఈ నీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కలుషిత నీటిని తాగడంతో వాంతులు, విరేచనాల బారిన పడుతుంటారు. వీధుల్లోని చిరుతిళ్లు, పానీపూరి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకొవద్దు. తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమం. కాచి చల్లార్చిన నీటిని సేవించడం, సి విటమిన్ లభించే పండ్లను తీసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని మహేశ్వరం మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిగా కేటాయించారు. ఇక్కడ 11 విభాగాల్లో 17 మంది ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రోగుల నిష్పత్తి మేరకు స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లను నియమించారు. గతంలో ఔట్ పేషెంట్ విభాగంలో రోజుకు సగటున 250–300 మంది వస్తే.. ప్రస్తుతం 800 మందికిపైగా వస్తున్నారు. 220 పడకలు, మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ విభాగాలున్నాయి. ఎంత మంది వచ్చినా మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు పొందొచ్చు. వైద్య సేవల్లో ఏ చిన్న సమస్య ఎదురైనా స్వయంగా వచ్చి సూపరింటెండెంట్ను కలువచ్చు. చాపకింది నీరులా విస్తరిస్తున్న డెంగీ, డయేరియా, వైరల్ జ్వరాలు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల క్యూ స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష : మహేశ్వరం మెడికల్ కళాశాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్నాలుగు నెలల ఓపీ వివరాలు మాసం ఓపీ మార్చి 16,130 ఏప్రిల్ 12,645 మే 22,716 జూన్ 22,668 -
తీరని దాహం
మున్సిపాలిటీల్లో తాగునీటి కటకట ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక ఇక్కట్లు ● శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్న మున్సిపల్ వాసులుట్యాంకర్లే ఆధారం చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీలో 12 గ్రామాలు విలీనమయ్యాయి. ఇక్కడ మిషన్ భగీరథ నీరే ప్రధాన వనరు. నీటి సరఫరాలో ఆటంకాలు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి పోవడంతో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. గతంలో ఉన్న బోరుబావులకు మోటార్లు బిగించి అవసరమైన సమయాల్లో నీరు వదలాలని మున్సిపల్ వాసులు కోరుతున్నారు. వేసవిలో ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు మోటార్ల ఏర్పాటుకు కృషి చేస్తామంటున్నారు. -
రైతులకు అండగా కాంగ్రెస్
శంకర్పల్లి: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు కంది విత్తన సంచులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు నాలుగు కిలోల కంది విత్తన సంచులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతును రాజు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని అన్నారు. రైతులు నిత్యం వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తూ.. ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల వ్యవసాయాధికారి చైతన్య మాట్లాడుతూ.. శంకర్పల్లి మండలానికి ప్రస్తుతం 16 క్వింటాళ్ల కందులు వచ్చాయని, నాలుగు క్లస్టర్స్కి నాలుగు క్వింటాళ్ల చొప్పు న అందిస్తామన్నారు రైతులు సంబంధిత పత్రా లు అందజేసి, అక్కడే కందులను తీసుకోవాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిరాజు, నాయకులు ప్రవీణ్, రాంరెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రమౌలి తదితరులు పాల్గొన్నారు. -
తెల్లచందనం స్మగ్లర్ల అరెస్ట్
చేవెళ్ల: పుష్ప సినిమా తరహాలో.. అక్రమంగా తరలిస్తున్న టన్ను (1,000 కిలోల) తెల్లచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ వెల్లడించారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చేవెళ్ల పోలీసులతో కలిసి మంగళవారం మండలంలోని బస్తేపూర్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎంహెచ్ 25 ఏజే 3689 నంబరు కలిగిన డీసీఎం వ్యాన్ను తనిఖీ చేశారు. వ్యాన్ బాడీ మొత్తం ఖాళీగా ఉండగా.. డ్రైవర్తో పాటు అందులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు డ్రైవర్ వెనక భాగంలో ప్రత్యేకంగా ఓ చిన్నపాటి అరను తయారు చేయించినట్లు గమనించారు. దీన్ని తెరిపించి చూడగా ప్లాస్టిక్ బ్యాగులలో చిన్నచిన్న ముక్కలుగా ఉన్న తెల్లచందనం (శ్రీగంధం) చెక్కలను గుర్తించారు. ఫారెస్ట్ అధికారులను పిలిపించి నిర్ధారించుకున్న అనంతరం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి కిలోల బరువున్న గంధం చెక్కల విలువ రూ.35 లక్షలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా జాత్ తహసీల్ ఉంట్వాడీ గ్రామం నుంచి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం నాగరగూడలోని ఆంధ్ర పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి వీటిని తరలిస్తున్నారు. పట్టుబడిన ముగ్గురిలో తెల్లచందనం సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన విజయ్ హన్మంత్ మానే, డీసీఎం డ్రైవర్ అబ్దుల్ అజీజ్, ఫ్యాక్టరీ సూపర్వైజర్ సోహెబ్ ఉన్నారు. అనుమతులు లేకుండా తెల్లచందనం కొనుగోలు చేసి, తీసుకువస్తున్న ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్లా కున్హి, కంపెనీ మేనేజర్ సాదిక్పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. సదరు ఐదుగురు వ్యక్తులపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన ముగ్గురు గతంలో ఒకే పర్ఫ్యూమ్ కంపెనీలో పనిచేశారని పోలీసులు వెల్లడించారు. కొనుగోలు చేసిన తెల్లచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారని తెలిపారు. డీసీఎంతో పాటు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో చేవెళ్ల సీఐ భూపాల్శ్రీధర్, మాదాపూర్ ఎస్ఓటీ సీఐ సంజయ్కుమార్, ఫారెస్ట్ అధికారి రవికుమార్, ఎస్ఐలు వనం శిరీష, ఎస్ఓటీ ఎస్ఐలు సతీష్, బారాజ్ ఉన్నారు. అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కిలోల శ్రీగంధం చెక్కలు స్వాధీనం ఐదుగురిపై కేసు నమోదు, పరారీలో ఇద్దరు పట్టుబడిన సరుకు విలువ రూ.35 లక్షలు వివరాలు వెల్లడించిన చేవెళ్ల ఏసీపీ కిషన్ -
పైప్లైన్లు, ఎయిర్వాల్వ్ లీకేజీలు
తుక్కుగూడ: మున్సిపల్ పరిధిలోని తాగునీటి సమస్య వేధిస్తుంది. ఔటర్ రింగు రోడ్డు లోపల భాగం తుక్కుగూడ, రావిర్యాల, సర్ధార్నగర్, దేవేందర్నగర్ కాలనీలకు హెచ్ఎండబ్ల్యూస్ ఆధ్వర్యంలో, ఔటర్ ఆవలి భాగంలో ఉన్న మంఖాల్, ఇమూమ్గూడ గ్రామాలకు మిషన్ భగీరథ ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరుగుతుంది. ఈ రెండు శాఖల నీటి సరఫరా అవసరం మేరకు పంపిణీకాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పైపులైన్లు, ఎయిర్వాల్వ్ లీకేజీల కారంగా నీరు వృథా అవుతుంది. దీంతో ప్రజలు వీధుల్లో ఉన్న బోర్లను ఆశ్రయిస్తున్నారు. -
రాజ్యాంగ రక్షణకే కాంగ్రెస్ పోరాటం
చేవెళ్ల: రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్ పోరాడుతోందని.. ఈ నెల 4వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న జైబాపు, జై భీం, జై సంవిధాన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, చేవెళ్ల పార్టమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బొంతు రామ్మోహన్, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయుకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుక్రవారం నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విదివిధానాలపై వివరిస్తారని చెప్పారు. గ్రామ స్థాయి నాయకులతో సమ్మేళనం తుక్కుగూడ: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న నిర్వహించనున్న కాంగ్రెస్ గ్రామస్థాయి నాయకుల సమ్మేళనం విజవయంతం చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ ముఖ్యనాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. రేపు నిర్వహించనున్న సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గ్రామస్థాయి నాయుకులకు పార్టీబలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారని వివరించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్, టీపీసీసీ ఉపాధ్యాక్షుడు బొంతు రామ్మోహన్, నాయకులు దేప భాస్కర్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయాలి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బొంతు రామ్మోహన్,నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి -
నేడు అధికారులకు ప్రత్యేక శిక్షణ
ఆమనగల్లు: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో గురువారం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కుసుమ మాధురి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరవాలని కోరారు. డాక్టర్ సరితకు ‘వైద్య శిరోమణి’ షాద్నగర్: షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సరితను వైద్య శిరోమణి అవార్డు వరించింది. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి బుధవారం నగరంలోని రవీంద్రభారతిలో నవకళా వేదిక ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు. కోవిడ్ సమయంలో జిల్లా ఆస్పత్రితో పాటు కిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు వైద్యం అందించిన డాక్టర్ సరితను వైద్య శిరోమణి అవార్డుకు ఎంపిక చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా ఆమెకు అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సుందరం, దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. షాద్నగర్కు మాజీ మంత్రి షాద్నగర్: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న మైనార్టీ నేత అంజద్ ఘోరి నివాసానికి బుధవారం మాజీ హోంమంత్రి మహమూద్ అలీ విచ్చేశారు. ఇటీవల అంజద్గోరి కుమారుడి వివాహం జరిగిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ముస్లిం మైనార్టీ నాయకులు మహమూద్ అలీని ఘనంగా సన్మానించారు. యూజీడీ నిర్మాణానికి వినతి షాద్నగర్: భగత్సింగ్ కాలనీలో డ్రైనేజీ నిర్మించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కోరారు. ఈ మేరకు బుధవారం వారు క్యాంపు కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. రామకృష్ణ థియేటర్, కటిక కేరి, పద్మావతీ కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు భగత్సింగ్ కాలనీ మీదుగా వెలుతోందని.. వర్షాలు కురిస్తే డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి మురుగు వస్తుందన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ కౌన్సిలర్ సరిత, యాదగిరి యాదవ్, కాలనీ వాసులు వెంకటేశ్ యాదవ్, రోమియో రమేశ్, మహేందర్, శ్రీనివాస్, నర్సింలు తదితరులు ఉన్నారు. జాతీయ సదస్సుకు కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ కొత్తూరు: హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ పట్టణంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సుకు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ డోలి రవీందర్కు ఆహ్వానం అందింది. బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ ప్రజాస్వామ్యం, దేశనిర్మాణంలో పట్టణ, స్థానిక సంస్థల పాత్ర’అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు, పట్టణాలు, స్థానిక సంస్థల చైర్మన్లు పాల్గొంటారని చెప్పారు. ఈ మేరకు తమకు మున్సిపల్ పరిపాలన విభాగం నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. -
● ‘భగీరథ’ కష్టాలు
మొయినాబాద్: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి తాగునీటి సరఫరా చేస్తున్నా నీటి కష్టాలు మాత్రం తప్పడంలేదు. అక్కడక్కడ మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలి లీకేజీ అయ్యి నీరు వృథాగా పారుతోంది. మున్సిపల్ కేంద్రంలోని లక్ష్మీగణపతినగర్ కాలనీ, భరద్వజ్ కాలనీ, ముస్తాఫాహిల్ కాలనీలకు నీటి సరఫరా సరిగా అందడంలేదు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాకపోవడంతో బోర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నా అవి కూడా సరిపోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ముర్తూజగూ డకు వెళ్లే భగీరథ పైప్లైన్ పగలడంతో గ్రామానికి నీళ్లు అందడం లేదు. బోర్లద్వారా నీటిసరఫరా చేస్తున్నారు. అజీజ్నగర్ హరిజనవాడలో మిషన్భగీరథ నీళ్లు ట్యాంకులోకి ఎక్కడంలేదు. హిమాయత్నగర్, మొయినాబాద్, అజీజ్నగర్లో తరచూ మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలి నీళ్లు లీకవుతున్నాయి. -
నిధులున్నా.. పనులు సున్నా
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలో కొన్ని కాలనీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. మున్సిపల్ పరిధిలో దాదాపు 20 వేల జనాభా ఉండగా ప్రతిరోజు 25 లక్షల లీటర్ల నీరు అవసర పడుతుంది. మిషన్భగీరథ పథకం ద్వారా ప్రతిరోజూ 20 లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. మిగతా నీటిని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బోర్లద్వారా ప్రజలకు అందిస్తున్నారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీ వాసులు మిషన్ భగీరథ నీరు సరఫరాకు ఏళ్ల నుంచి విన్నవిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో నల్లా కనెక్షన్ లేక సొంత బోర్ల నీటినే వాడుకుంటున్నారు. పట్టణంలో నూతన పైప్లైన్ నిర్మాణం, తాగునీటి కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.32 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు స్పందించి అన్ని కాలనీలకు నీరు అందించాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ నీరు అందించాలి ఆమనగల్లు పట్టణంలోని విద్యానగర్ కాలనీకి మిషన్ భగీరథ నీరు అందించాలి. మిషన్భగీరథ నీరు అందించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఏళ్ల నుంచి కోరుతున్నాం. ఇంతవరకు అందించలేదు. కాలనీలో ఉన్న బోర్లద్వారానే నీటిని వాడుకుంటున్నాం. – పాషా, విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు -
ఖర్చుకు వెనుకాడొద్దు
నిధులు మంజూరు బాధ్యత నాది ● కలెక్టర్ నారాయణరెడ్డి ● వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోఆకస్మిక తనిఖీ ● సమస్యలు వివరించిన మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి వైద్య సిబ్బంది సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘కోవిడ్ సమయంలో ఆస్పత్రి భవనంపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డు పైకప్పు లీకేజీ అవుతోంది. సిటీ స్కాన్ మంజూరైనప్పటికీ.. స్థలాభావ సమస్యతో ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. టెక్నీషియన్లు అందుబాటులో లేరు. రక్తనిధి కేంద్రం లేకపోవడంతో రక్తస్త్రావంతో బాధపడుతున్న రోగులకు సత్వర సేవలు అందించలేకపోతున్నాం. వైద్యుల నిష్పత్తి మేరకు గదులు లేకపోవడంతో ఔట్ పేషంట్ విభాగానికి వచ్చే రోగులకు సేవలు అందించలేని పరిస్థితి తలెత్తుతోంది’అంటూ మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి (వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి) వైద్య సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వైద్యులు, సిబ్బంది చెప్పిన అంశాలను కలెక్టర్ సావధానంగా ఆలకించారు. ‘ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించే బాధ్యత నాదీ.. అయితే ఆస్పత్రికి ఆపదలో వచ్చిన నిరుపేద రోగులకు సత్వర, మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత మీదే’అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీ.. వైద్యసేవలపై ఆరా మంగళవారం వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్, ఇన్ పేషంట్ విభాగాలు సహా ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలు చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది రోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 100 నుంచి 200 పెంచారు కానీ..అనువైన స్థలం లేక అదనపు పడకలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు స్పష్టం చేయగా, ఆస్పత్రి భవనం పై అంతస్తులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డుకు తక్షణమే రిపేర్లు చేసి, రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు ఎంత ఖర్చైనా వెనుకాడొద్దన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీటీస్కాన్ పెట్టండి.. టెక్నీషియన్లను తీసుకోండి మెడికల్ కాలేజీ నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ిసీటీస్కాన్ ఏర్పాటు చేయాల్సి ఉందని, 2024లోనే సీటీస్కాన్ మంజూరైందని, ఆస్పత్రిలో అనువైన స్థలం లేక ఏర్పాటు చేయలేకపోయినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆస్పత్రి ఆవరణలోని ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ డిస్పెన్సరీలను పక్కనే ఉన్న వార్డు ఆఫీసుకు తరలించి, ఆ ఖాళీ ప్రదేశంలో సీటీస్కాన్ ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. రక్తనిధి కేంద్రం ఏర్పాటు సహా అవసరమైన టెక్నీషియన్లను ఔట్సోర్సింగ్ ప్రతిపాదికను నియమించుకోవాలని ఆదేశించారు. రోగులకు సేవలు అందించే విషయంలో రాజీపడొద్దన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యలోపం, తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, అదనపు డీఎండీ డాక్టర్ వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, వైస్ ప్రిన్సిపాల్ తఖీయుద్దీన్, ఆర్ఎంఓలు జయమాల, రాజ్కుమార్, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చీఫ్ ఇంజనీర్ దేవేందర్, ఈఈ అజీజ్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తదితరులు ఉన్నారు. -
రెండు ఆలయాల్లో చోరీ
ఇబ్రహీంపట్నం: డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో రెండు ఆలయాల్లో విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని పోల్కంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామంలోని రామాలయంలో సీతారామలక్ష్మణ స్వాముల వారి పంచలోహ విగ్రహాలు, గంగాదేవి ఆలయంలో పెద్దమ్మ తల్లి, గంగాదేవి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రామాలయంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశిలీంచగా ఓ దొంగ విగ్రహాన్ని సంచిలో పెట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనుమానితులు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం.పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు -
ఎల్లమ్మ కల్యాణం.. ఉప్పొంగిన భక్తిభావం
అమీర్పేట: డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు.. ఎల్లమ్మ నామస్మరణలు మార్మోగాయి. ఆలయ పుర వీధులు పసుపుమయంగా మారాయి. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉదయం 4 గంటలకు అభిషేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కల్యాణ వేదికపైకి తీసుకువచ్చారు. ఉత్తరా నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న సుముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య 11.51 గంటలకు కల్యాణం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నామని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కల్యాణాన్ని తిలకించిన ప్రముఖులు.. అమ్మవారి కల్యాణ మహోత్సవానికి పలువురు ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, మల్లారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ దాసరి హరిచందన, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీజీ సౌమ్య మిశ్రా, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, అమీర్పేట కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, ఈఓ మహేందర్ గౌడ్, చైర్మన్ సాయిబాబా గౌడ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, జోగిని శ్యామల, కోట నీలిమ, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు రాజేంద్రనగర్: అదృశ్యమై యువకుడు హిమాయత్సాగర్లో శవమై తేలిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హిమాయత్సాగర్కు చెందిన ముఖేశ్ (35) జూలాయిగా తిరుగుతున్నాడు. గతంలో వివాహం జరిగినా అతను మద్యానికి బానిస కావడం, చిల్లర దొంగతనం చేస్తుండటంతో భార్య అతడి నుంచి దూరంగా ఉంటోంది. గత నెలలో అతను కిస్మత్పూర్ ప్రాంతంలోని ఓ ఆన్లైన్ క్యాష్ సెంటర్ నుంచి నగదు తీసుకుని పరారయ్యాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ముఖేశ్ మంగళవారం హిమాయత్సాగర్లో శవమై తేలాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహేశ్వరంలో ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్’
మహేశ్వరం: మండల పరిధిలోని కేసీ తండా ఎలక్ట్రానిక్ పార్కులో మరో భారీ పరిశ్రమ రూపుదిద్దుకుంది. సుమారు రూ.750 కోట్ల నిధులతో 3.7 ఎకరాల విస్తీర్ణంలో 2.3లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తయారీ పరిశ్రమ ఆవిష్కరణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు యాజమాన్యం యోచిస్తోంది. ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 700 మంది స్థానికులకు ఉపాధి ఇక్కడ పూర్తి స్థాయి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, డిజైనింగ్ స్టూడియో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యూనిట్లో ఆటోమేటెడ్ గిడ్డంగి సౌకర్యం ఉంది. కంపెనీలో 33 శాతం గ్రీనరీని ఏర్పాటు చేశారు. ఏడాదికి సుమారు పది టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలు తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్ సొంతం. ఇటలీ, అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన పరిశ్రమ నిపుణుల సహకారంతో సీఎన్సీ యంత్రాలు, తాజా సాంకేతికతో కూడిన గొలుసు తయారీ, లేజర్ కట్ యంత్రాలున్నాయి. సుమారు 700 మంది స్థానికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. 2022లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఈ కంపెనీకి శంకుస్థాపన చేఽశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 14 కంపెనీలున్నాయి. దేశంలో ఎనిమిది చోట్ల మలబార్ పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తదితరులు హాజరుకానున్నారు. రూ.750 కోట్ల పెట్టుబడితో అతి పెద్ద ఆభరణాల తయారీ పరిశ్రమ రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
విద్యతోనే అంతరాలు లేని సమాజం
మంచాల: విద్య సమాజాభివృద్ధికి తోడ్పాటునిచ్చేలా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న పనులు, బోధన తీరు, ఉపాధ్యాయుల కృషిని తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ప్రజల మధ్య అంతరాలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, ఉపాధ్యక్షురాలు మంగ, సభ్యులు నాగమణి, ధనమూర్తి, జగన్నాథ్ ఆరుట్ల ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, సుప్రియ, మోహన్ గౌడ్, పేరెంట్స్ కమిటీ సభ్యులు భాస్కర్, రాజు, ఎం.డీ.జానీ పాష, జంగయ్య, జంగయ్య, మల్లేశ్, పార్వతి, జ్యోతి, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, కిషన్ చౌహాన్, శ్రీకాంత్, జహీర్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి -
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
హయత్నగర్: గాలి వానకు విద్యుత్ తీగలు తెగిపడి రెండు గేదెలు మృతి చెందిన సంఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూరులో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. టెలిఫోన్ కాలనీలో తొర్రూరుకు చెందిన మేకం నాగయ్య తన రెండు గేదెలను కట్టేసి ఉంచాడు. మంగళవారం సాయంత్రం వచ్చిన గాలి వానకు దగ్గరలోని విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఒక గేదె తీగలకు తాకి షాక్కు గురై కిందపడింది. అది చూసిన మరో గేదె దాని దగ్గరకు వచ్చింది. దీంతో రెండు షాక్తో మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షలు నష్ట పోయినట్లు రైతు లబోదిబోమంటున్నాడు. -
సిగ్గుపడాల్సింది పోయి దాడులు చేస్తారా
షాద్నగర్ రూరల్: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు సిగ్గు పడాల్సిందిపోయి దాడులు చేస్తామని మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన కన్హశాంతి వనంకు వెళ్తున్న ఆయనకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారు ఎవరైనా ప్రభుత్వం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనంతరం ఆయన జూనియర్ కళశాల భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కళశాల నిర్మాణం ఓ మహత్తర కార్యక్రమని ఎమ్మెల్యే గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్నారని శభాష్ శంకర్ అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీఖాన్బాబర్, నాయకులు తిరుపతిరెడ్డి, రఘునాయక్, ఎండీ.ఇబ్రహీం, కృష్ణారెడ్డి, బస్వం, మోహన్, ముబారక్అలీ, మురళీమోహన్, సీతారాం, అశోక్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు -
● నిర్వహణ లోపం.. వెలగని వీధి దీపం
ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీలో 4,313 వీధి దీపాలు ఉండగా సెంట్రల్ లైటింగ్ 650, హైమాస్ట్ లైట్లు 20 ఉన్నాయి. నిర్వహణ లోపంతో తరచూ వీధిలైట్లకు అంతరాయం కలుగుతోంది. శ్రీ ఇందు కళాశాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రధాన రహదారిపై అమర్చిన సెంట్రల్ లైటింగ్ పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడు లైట్లు వస్తాయో, పోతాయో తెలియని పరిస్థితి. తరచూ లైట్లు, వైర్లు ఖాళీపోయి, చెడిపోతుండటంతో రాత్రివెళ ఆ రహదారిలో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ యార్డు వెనుక ఉన్న పలు కాలనీలతోపాటు కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో విద్యుత్ స్తంభాలు లేక వీధిలైట్లను అమర్చడం లేదు. ఆయా కాలనీల్లో రాత్రి వేళ అంధకారం అలముకుంటోంది. -
● ఏడేళ్లయినా రోడ్లే లేవు.. లైట్లే వెలగవు
శంకర్పల్లి: మున్సిపాలిటీ ఏర్పడి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా పట్టణంలోని కొన్ని కాలనీలకు సరైన రోడ్లు లేవు. వర్షాకాలంలో స్థానికులు పడే బాధ వర్ణణాతీతం. ఇప్పటికే పలువురు కమిషనర్లకు విన్నవించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రూ. 4కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో సింగాపురం, రిత్విక్ వెంచర్, చిన్న శంకర్పల్లి, సాయినగర్ కాలనీ, ఫత్తేపూర్లో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. బుల్కాపూర్, కొత్తగా ఏర్పాటైన బ్లూవుడ్స్ కాలనీ, రెడ్డి కాలనీ, మైనార్టీ కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, ఎస్ఎం గార్డెన్స్ ప్రాంతాల్లో మరిన్ని రోడ్లు వేయాల్సి ఉంది. మున్సిపల్ పరిధిలో చాలావరకు వీధి లైట్లు వెలగడం లేదు. శంకర్పల్లి చౌరస్తా నుంచి బుల్కాపూర్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, ఫత్తేపూర్ రైల్వే బ్రిడ్జిపై వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ యోగేశ్ని వివరణ కోరగా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
ముగ్గురు బాలకార్మికులకు విముక్తి
ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ ప్రైవేటు పరిశ్రమల్లో పని చేస్తున్న ముగ్గురు బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. ఆపరేషన్ ముస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. తుర్కయంజాల్ సమీపంలోని పలు పరిశ్రమల్లో పని చేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని హోంకు తరలించారు. యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి తుర్కయంజాల్: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ పిలుపునిచ్చారు. తుర్కయంజాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు రమేష్, బాల నరసింహ, అనిత, శోభ, సునీత, హేమలత తదితరులు పాల్గొన్నారు. యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు ఎంపిక కడ్తాల్: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎంపికై ంది. ఈ మేరకు మంగళవారం సీజీఆర్ సంస్థ కోఆర్డినేటర్ రజనీకాంత్ పాఠశాలను సందర్శించి బేస్లైన్ సర్వే నిర్వహించారు. పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలను హెచ్ఎం జంగయ్యను అడిగి నమోదు చేసుకున్నారు. పాఠశాలలో హార్వెస్టింగ్ పిట్, కంపోస్ట్ పిట్, డిక్లేర్ నో ప్లాస్టిక్ జోన్, డిక్లరేషన్ ఆఫ్ మథర్ ట్రీ, కిచెన్ గార్డెన్, సాయిల్ అండ్ సీడ్ మ్యూజియం, మెడిసినల్ గార్డెన్, రెన్యూవల్ ఎనర్జీ సోలార్, ప్లాంటేషన్, ప్రిపరేషన్ ఆఫ్ విలేజ్ జియోగ్రఫీ, మ్యాపు అండ్ రిపోర్టు, ప్లాంటేషన్ వంటి కార్యక్రమాల నిర్వహణకు తోడ్పడుతున్నందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రం తీరుతోనే తెలంగాణకు అన్యాయం షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో అధిక శాతం తెలంగాణ నుంచి వెళ్తున్నాయని, బడ్జెట్లో మాత్రం మొండిచెయ్యి చూపిస్తోందని విమర్శించారు. మెట్రో, ఆర్ఆర్ఆర్, మూసీనదీ ప్రక్షాళన, తదితర అభివృద్ధి పనులకు సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈనెల 4న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ విచ్చేస్తున్నారని, ఇందులో భాగంగా గ్రామస్థాయి నేతలతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చల్లా శ్రీకాంత్రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్రెడ్డి, వీరేశం, రాజు, నర్సింలు, సుదర్శన్గౌడ్, బాల్రాజుగౌడ్, ఇబ్రహీం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని రక్షించుకుంటాం
● కార్మికులను గుండెల్లో పెట్టుకుంటాం ● మంత్రి పొన్నం ప్రభాకర్ హయత్నగర్: ఆర్టీసీని రక్షించుకుంటామని, సంస్థను లాభాల్లోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని మునుగనూరులో మంగళవారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదవాడికి రవాణా సౌకర్యం కల్పించేది ఆర్టీసీ బస్సు మాత్రమేనని అలాంటి బస్సులను నడిపి సేవలు అందిస్తున్న కార్మికులను గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బస్సులు కొంటున్నామని, పీఆర్సీ ఇచ్చామని, కారుణ్య నియమకాలు చేపట్టామని, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఆర్టీసీ పురోగమిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పును మిగిల్చిన గత ప్రభుత్వం ఆర్టీసీని దివాలా తీయించిందని విమర్శించారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారికి అండగా ఉంటామన్నారు. రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు విశ్రాంత కార్మికుల భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
● మట్టిరోడ్లే దిక్కు.. పట్టని వీధి దీపాలు
షాద్నగర్: పట్టణంలో నూతనంగా ఏర్పడిన పలు కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్నా సీసీ రోడ్లు లేకపోవడంతో యజమానులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న మట్టిరోడ్లు వర్షాలకు దెబ్బతిని గుంతలు తేలడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. శివారులో ఉన్న చాలా కాలనీల్లో వీధిదీపాలు సరిగా లేక రాత్రి సమయాల్లో అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. రాత్రిళ్లు మహిళలు ఒంటరిగా బయటికి రావడానికి జంకుతున్నారు. వీధిదీ పాల నిర్వహణ ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీ వారికి మున్సిపా లిటీ లక్షల్లో బాకీ ఉండటంతో పట్టించుకోవడం లేదు. -
ఖర్చుకు వెనుకాడొద్దు ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించే బాధ్యత తనదని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 20258లోuఅంతర్గత రోడ్లు అధ్వానం మొయినాబాద్: మున్సిపల్ పరిధిలో అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. మున్సిపల్ కేంద్రంలోని స్టార్ కాలనీ, ముస్తఫా హిల్స్ కాలనీ, భరద్వజ్ కాలనీ, సహారా కాలనీ, విజయనగర్ కాలనీల్లో అంతర్గత రోడ్లు సరిగా లేవు. మురుగునీరు రోడ్లపై పారడంతో గుంతలమయంగా మారి నడవలేని పరిస్థితి నెలకొంది. చిన్నషాపూర్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్నగర్, హిమాయత్నగర్, సురంగల్ గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు అంతర్గత రోడ్లు సైతం దెబ్బతిన్నాయి. వర్షాలు పడినప్పుడు రోడ్డుపై గుంతల్లో వర్షం నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. స్థానిక ప్రజలతోపాటు ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వీధిదీపాల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. కొన్నిచోట్ల గతంలో ఏర్పాటు చేసిన వీధిదీపాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని చెడిపోయాయి. వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ కొన్నేళ్లుగా వెలగడంలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రి సమయంలో అంధకారం నెలకొంటోంది. న్యూస్రీల్ -
మహేశ్వరంలో ‘మలబార్’ మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండా ఎలక్ట్రానిక్ పార్కులో మరో భారీ పరిశ్రమ రూపుదిద్దుకుంది.
8లోuఖర్గే సభను విజయవంతం చేయాలి జిల్లా నేతలతో పీసీసీ చీఫ్ భేటీ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎల్బీ స్టేడియం వేదికగా ఈ నెల 4న నిర్వహించ తలపెట్టిన కార్యక్రమంలో ‘గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీ’ సభ్యులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారని, ఆ మేరకు జిల్లా కేడర్ సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి మంగళవారం ఆయన జిల్లా ముఖ్య నేతలతో గాంధీభవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు పాల్గొనే ఈ బహిరంగ సభను జిల్లా కేడర్ సీరియస్గా తీసుకోవాలని, భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి కేడర్ను సభకు భారీగా తరలించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజ్య సభ సభ్యుడు అనిల్కుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, చైర్మన్ ఫహీం ఖురేషి, చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, చేవెళ్ల పార్టీ ఇన్చార్జి భీం భరత్, పీసీసీ ఉపాధ్యక్షుడు వేణు గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, తదితరులు పాల్గొన్నారు. కీలకమైన ఈ సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన సోదరుడు మల్రెడ్డి రాంరెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు కేశంపేట: తక్కువ నీటి సాంధ్రతతో అధిక దిగుబడులు వచ్చే ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ సూచించారు. మండల పరిధిలోని వేములనర్వ శివారులో సాగవుతున్న ఆయిల్పామ్ను మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, రైతులు పండించిన పంటను ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మండల పరిధిలోని అల్వాల రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో రైతులకు శాస్త్రవేతలు సలహాలు, సూచనలు చేశారు. రైతు గుర్తింపు కార్డుల నమోదుపై ఏఈఓలతో రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఓ శిరీష, హెచ్ఓ హిమబిందు, ఎఈఓలు వినయ్, రాజేశ్వరి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేష్రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలు
● తలకొండపల్లి తహసీల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ దాడులు ● లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, అటెండర్ ఆమనగల్లు: ఏసీబీ అధికారులు నిత్యం దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అవినీతి అధికారులు మాత్రం లంచం తీసుకోవడం మానడం లేదు. మంగళవారం ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ తహసీల్దార్, అటెండర్ ఏసీబీకి పట్టుపడ్డారు. వివరాలు.. తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన ఓ రైతు తన తల్లిపేరిట ఉన్న 22 గుంటల భూమిని తనతోపాటు తన సోదరుల పేరిట మార్చాలని తహసీల్దార్ను ఆశ్రయించాడు. ఇందుకు అక్కడి అధికారులు రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రైతు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రూ.10 వేలు ఇస్తుండగా తహసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. టపాసులు కాల్చి రైతుల సంబురాలు తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఏ చిన్నపని కావాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే అని పలువురు ఆరోపించారు. తహసీల్దార్ నాగార్జున లంచటం తీసుకుంటూ అధికారులకు చిక్కడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. -
4, 5 తేదీల్లో కేవీపీఎస్ శిక్షణ తరగతులు
తుర్కయంజాల్: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 4, 5 తేదీల్లో పురపాలక సంఘం పరిధి ఎన్ఎస్ఆర్ నగర్లో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోడ సామేల్, మస్కు ప్రకాష్ తెలిపారు. రాగన్నగూడలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించా రు.శిక్షణ తరగతులకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జె. ఆశీర్వాదం, యాదగిరి, జంగయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి షాద్నగర్రూరల్: అనుమతులు లేకుండా కొనసాగుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్చౌహాన్ డిమాండ్ చేశారు. పట్టణంలోని నారాయణ పాఠశాలవద్ద సోమవారం ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణ, శ్రీచైతన్యవంటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనీస వసతులను కల్పించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్, నోట్బుక్స్, యూనిఫాం విక్రయిస్తూ తల్లిదండ్రుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నాని ఆరోపించారు. విద్యను వ్యా పారంగా మారుస్తున్న విద్యా సంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయిచౌహాన్, విజయ్కుమార్, గణేశ్, వంశీ పాల్గొన్నారు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి మొయినాబాద్: ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమనేత దేశమొళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మున్సిపల్ కేంద్రంలో ఉద్యమకారులు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమకారులను మరవద్దనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకు లు కుమ్మరి రమేష్, భిక్షపతి, మధు, అవినాష్, ముకుందరెడ్డి, బన్సీలాల్, రత్నం, కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయం సందర్శన శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మాసూత్ర మరకత శివాలయా న్ని సోమవారం సినీ నటుడు బాలాజీ దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందని, సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఆల య చైర్మన్ గోపాల్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్రాజు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● త్వరలోనే సీఎం చేతులమీదుగా కొహెడ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్మెట్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో సోమవారం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు త్వరలో చేపట్టబోయే కొహెడ మార్కెట్ నిర్మాణ ప్రాజెక్టు పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో కోహెడలో నిర్మించబోయే ఆసియాలో అతిపెద్ద మార్కెట్ నిర్మాణానికి త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుందని పేర్కొన్నారు. కోహెడ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు లభించడంతో పాటు రైతులు, వ్యాపారులు, ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందన్నారు. మార్కెట్కి వచ్చే ప్రతి రైతుకు న్యాయం చేసేలా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. అధిక కమీషన్లు వసూలు చేసే మార్కెట్ వ్యాపారులను బ్లాక్ లిస్టులో పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు పాలకవర్గంతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి మహ్మద్ రియాజ్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, వైస్ చైర్మన్ భాస్కర్చారి, డైరెక్టర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
చెత్త.. మురుగు
అస్తవ్యస్తంగా మున్సిపాలిటీలుపహాడీషరీఫ్: పెద్ద ఎత్తున మురికివాడలు కలిగిన జల్పల్లి మున్సిపాలిటీలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. చాలా బస్తీల్లో పైప్లైన్లు లేకపోవడంతో ప్రజలు రింగ్లు వేసుకు న్నారు. వ్యర్థజలాలు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో కొన్ని బస్తీల్లో ఇళ్ల మధ్య పారుతున్నాయి. స్థానికులను అనారోగ్యం పాల్జేస్తున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగి 28 వార్డులతో కూడిన ఈ మున్సిపాలిటీలో ప్రైవేట్ ఆటోల ద్వారా రోజు విడిచి రోజు చెత్తను సేకరిస్తున్నారు. జల్పల్లి చెరువు పరిసరాల్లో కాటేదాన్కు సంబంధించిన కంపెనీల నిర్వాహకులు వ్యర్థాలను తీసుకొచ్చి రాత్రి పూట పడేసి పోతున్నారు. ప్రధాన నిత్యం శుభ్రం చేస్తున్నా అంతర్గత బస్తీల్లో మాత్రం మూడు నాలుగు రోజులకోసారి ఊడుస్తున్నారు. లోపించిన పారిశుద్ధ్యం కంపుకొడుతున్న కాలనీలు రోగాల బారిన స్థానికులు మున్సిపాలిటీలను పారిశుద్ధ్య సమస్య పట్టి పీడిస్తోంది. రోడ్లపక్కన చెత్త కుప్పలుగాపేరుకుపోయి కాలనీలు కంపు కొడుతున్నాయి. నిత్యం వీధులను శుభ్రం చేయాల్సి ఉండగా సిబ్బంది కొరతతో వారం పది రోజులకోసారి ఊడుస్తున్నారు. ఇంటింటికీ జరగాల్సిన చెత్త సేకరణ సైతం సరిగా జరగడం లేదు. దీంతో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పడేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపైనే, ఇళ్ల మధ్య నుంచే మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షాకాలం కావడంతో ఈగలు, దోమలు వ్యాపించి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూకు సంబంధించి 32, ఇతర శాఖలకు సంబంధించి 41, మొత్తం 73 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.జగన్ డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 2న నిధులు మంజూరు చేస్తామని ప్రకటించి వాయిదా వేయడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పెంచి అర్హులైన వారందరికీ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అలంపల్లి జంగయ్య, గజ్జెల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ● అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ -
సిబ్బంది లేక ఇబ్బంది
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. జనాభాకు అను గుణంగా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారిని నిత్యం శుభ్రం చేస్తున్నా కాలనీల్లో మాత్రం వారం పది రోజులకు ఒకసారి అంతర్గత రోడ్లను శుభ్రం చేస్తున్నారు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో సరైన కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిలుస్తోంది. ఏళ్లక్రితం నిర్మించిన మురుగు కాలువలు దెబ్బతినడంతో నీరు సాఫీ గా వెళ్లకుండా రోడ్లపైకి చేరుతోందని స్థానికులు తెలపారు. ఇంకా ఏడు కిలోమీటర్ల దూరం మురుగు కాలువలు నిర్మించాల్సిఉందని అధికారులు చెబుతున్నారు. -
రోడ్లపై మురుగు.. రోడ్ల పక్కనే చెత్త
మొయినాబాద్: మున్సిపల్ కేంద్రంతోపాటు పలు కాలనీలు,గ్రామాల్లో రో డ్ల పక్కనే చెత్తాచెదారం పేరుకుపోయింది. కాలువలు సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే పారుతోంది.ఉన్న వాటిని సైతం సరిగా శుభ్రం చేయకపోవడంతో ఈగలు, దోమలు చేరుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని సహారా కాలనీ, స్టార్ కాలనీ, భరద్వజ్ కాలనీ, ముస్తఫా కాలనీ, విజయన గర్ కాలనీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగు కాలు వలు చెత్తాచెదారంతో నిండిపోయాయి.చిలుకూరు, పెద్దమంగళారం,అజీజ్నగర్, హిమాయత్నగర్,ఎనికేపల్లి,ముర్తూజగూడ,సురంగల్ గ్రామాల్లోనూ మురుగుకాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది.స్పెషల్ డ్రైవ్ పేరుతో చెత్తాచెదారం తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. -
మెడికల్ కౌన్సిల్ దాడులు
● అనుమతులు లేని ఆస్పత్రులపై కొరడా ● తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. విద్యార్హతలు అసలే లేవు. అయినా వైద్యులుగా చలామణి అవు తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కొరడా ఝులిపించారు. సోమవారం షాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్యుల బృందం ఏడు క్లినిక్లపై కేసులు నమోదు చేసింది. ఓం సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శ్రావణ్ ఫస్ట్ఎయిడ్ సెంటర్, మధు శ్రీ క్లినిక్, ముస్తాఫా క్లినిక్, మాస్టర్ క్లినిక్, శ్రీ సాయితిని, జంజం క్లినిక్లకు అనుమతులు లేవని గుర్తించింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.మహేశ్కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జంజం క్లినిక్లో వందల సంఖ్యలో డైకోఫెన్స్ సోడియం ఇంజక్షన్లు, కాల్షియం గ్లూకోనేట్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు గుర్తించినట్టు తెలిపారు. కనీస అర్హత లేకుండా అల్లోపతి దవాఖానా నిర్వహిస్తున్నారని అన్నారు. రోగంతో సంబంధం లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మాత్రలను అధిక మోతాదులో ఇస్తున్నారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేసినట్లైతే ఎన్ఎంసీ చట్టం 34, 35 ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తామని వెల్లడించారు. మెడికల్ స్టోర్స్లో క్వాలిఫైడ్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్లు లేకుండా యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్, ఇతర షెడ్యూల్ డ్రగ్స్ విక్రయిస్తునట్టు గుర్తించామని తెలిపారు. సంబంధిత రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లపై డ్రగ్ కంట్రోల్ అథారిటీతో పాటు ఫార్మసీ కౌన్సిల్కి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కొందుర్గు: ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి సురేశ్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’దినపత్రికలో ‘కొరత చూపి..రైతులను దోచేసి..’అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించి కొందుర్గు రైతువేదికలో ఎరువులు, విత్తనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, రైతులకు విధిగా రసీదులు ఇవ్వాలని సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ సందర్బంగా పలువురు డీలర్లు మాట్లాడుతూ.. తమకు హోల్సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకన్నా అధికంగా ఎరువులను విక్రయిస్తున్నారని, దీనికితోడు రవాణా, హమాలి ఖర్చులు అధికమవుతున్నాయని వాపోయారు. ఎరువులు అమ్మడం వల్ల నష్టాలపాలవుతున్నామని వాపోయారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు మల్లారెడ్డి, శంకర్ రెడ్డి, యాదయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేతాజీ పొదుపు సంఘానికి ఉత్తమ అవార్డు
మహేశ్వరం: సమాఖ్య పొదుపు సంఘంలో సభ్యులకు సక్రమంగా రుణాలు అందజేసి.. సకాలంలో వసూలు చేసినందుకు మన్సాన్పల్లి గ్రామానికి చెందిన నేతాజీ పొదుపు సంఘానికి ఉత్తమ అవార్డు వరించింది. సోమవారం శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకూలలో నిర్వహించిన అభ్యుదయ సమాఖ్య 13వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. తమ సంఘంలో 700 మంది సభ్యులకు గాను రూ.2.70 కోట్లు జమయ్యాయని చెప్పారు. వరుసగా నాల్గోసారి అవార్డు రావడం ఆనందంగా ఉందని సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యుదయ సమాఖ్యా అధ్యక్షుడు నర్సింహ నేతాజీ పొదుపు సంఘం సభ్యులకు జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సమఖ్యా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ చారి, అభ్యుదయ సహాయ సహకార సంఘాల సమాఖ్యా పర్యవేక్షణ అధికారి బాల్రాజ్ గౌడ్, మన్సాన్పల్లి నేతాజీ పొదుపు సంఘం అధ్యక్షుడు దయానంద్ గౌడ్, ఉపాధ్యాక్షుడు శ్రీధర్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్చారి, సహాయ కార్యదర్శి కుమార్ యాదవ్, కోశాధికారి మల్లేశ్ ముదిరాజ్, పాలకవర్గ సభ్యులు పాండయ్య, శ్రీధర్ చారి, ఎండి.హాజీ, వెంకటేశ్ గౌడ్, రాజేశ్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, శేఖర్ పలువురు సభ్యులు పాల్గొన్నారు. వరుసగా నాలుగోసారి కైవసం చేసుకున్న మన్సాన్పల్లి సమాఖ్య సంఘం -
సేకరణ లేక.. రోడ్ల పక్కన చేరిక
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లపక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి కనిపిస్తోంది. ఇళ్ల ముందుకు చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రాకపోవడంతో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పడేస్తున్నారు. చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణ కేంద్రంలోని పలు కాలనీల నుంచి వెళ్లే అండర్గ్రౌండ్ డైనేజీ కాలువ ప్రధాన రోడ్డు పక్కనే ఓపెన్గా ఉంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో ఇంకా పాలకవర్గం కొలువుదీరలేదు. అధికారులే ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే అంగడిబజార్, హౌసింగ్ బోర్డు, మల్కాపూర్ తదితర చోట్ల డ్రైనేజీ సమస్యలు గుర్తించిపరిష్కరించామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
అబ్దుల్లాపూర్మెట్: రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హయత్నగర్లోని తొర్రూర్ క్రాస్ రోడ్డులో నివాసముండే దారమల్ల అశోక్ (27) ఆదివారం సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్లోని జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి వచ్చాడు. రాత్రి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రామోజీ ఫిల్మ్సిటీ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అశోక్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురికీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కార్మికుడి బలవన్మరణం పహాడీషరీఫ్: ఉరేసుకుని ఓ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ఎల్.వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. యూపీ రాష్ట్రానికి చెందిన రాంబోలి కుమారుడు పంకజ్(25) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి బోరబండలో నివాసం ఉంటున్నాడు. తుక్కుగూడ సర్దార్నగర్లో మార్బుల్స్ బండల పాలిష్ చేసేందుకు గుత్తేదారు వద్దకు వచ్చాడు. ఉదయం 11 గంటల సమయంలో సమీపంలో ఓపెన్గా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి వేప చెట్టుకు టవల్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. అయ్యప్ప స్వామి సన్నిధానంలో విగ్రహాల చోరీ ఇబ్రహీంపట్నం: అయ్యప్పస్వామి సన్నిధానంలో పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన ఘటన మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చందర్ సింగ్ తెలిపిన ప్రకారం.. దండుమైలారం శివారులో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధానం డోర్ గడియను పగులగొట్టి లోనికి దూరిన గుర్తు తెలియని దుండగులు ఒక వెండి, ఐదు పంచలోహ విగ్రహాలు, గ్యాస్ సిలిండర్, వంట సామగ్రిని ఎత్తుకెళ్లారన్నారు. వాటి విలువ సుమారు రూ.1.20 లక్షల మేర ఉంటుందన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
18 లీటర్ల సారా పట్టివేత
ఆటో సీజ్, ఒకరి అరెస్టు ఆమనగల్లు: పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 18 లీటర్ల నాటుసార సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ తెలిపిన ప్రకారం.. వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండా నుంచి మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి నాటుసారా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సీఐ బద్యానాద్ చౌహాన్ ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. పోచమ్మగడ్డ తండా నుంచి కలకొండకు ప్రయాణిస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో తొమ్మిది ప్లాస్టిక్ బాటిల్స్లో 18 లీటర్ల సారా పట్టుబడింది. సారా, ఆటోను సీజ్ చేసి సారా తరలిస్తున్న పాండును అరెస్టు చేశారు. ఈ తనిఖీలో ఎకై ్సజ్ ఎస్ఐ అరుణ్కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, శ్రీను, బాబు, ఆమని, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. గంజాయి ముఠా గుట్టురట్టు ● ముగ్గురు నిందితులకు రిమాండ్ ● పది కిలోల గంజాయి స్వాధీనం శంకర్పల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను సోమవారం రిమాండ్కు తరలించారు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శంకర్గౌడ(27), శ్రీధర్ పరిడా(19), మిని నాహక్(34) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా వీరు తమ రాష్ట్రం నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తీసుకువచ్చి లేబర్ ఏరియాల్లో విక్రయిస్తున్నారు. మిని నాహక్ అనే మహిళ తీసుకువచ్చిన గంజాయిని సోమవారం ముగ్గురు కలిసి శంకర్పల్లి మండలం ఇంద్రారెడ్డినగర్ మీదుగా హైదరాబాద్ వైపు తరలిస్తుండగా రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు, మోకిల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. బీఆర్ఎస్ నాయకులకు బెయిల్ ● రూ.20 వేలతో రెండు పూచీకత్తులు అందజేయాలి ● నాంపల్లి 17వ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశంసిటీ కోర్టులు : మహా న్యూస్ ఛానెల్ కార్యాలయంపై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకులకు సోమవారం నాంపల్లిలోని 17వ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కక్కరూ రూ. 20వేలతో రెండు పూచీకత్తులు అందజేయాలని షరతులు విధించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సదరు న్యూస్ ఛానెల్లో తప్పుడు వార్తలు ప్రచురించారని, అసత్యపు ఆరోపణలతో కేటీఆర్ పరువుకు భంగం కలిగేలా మహా న్యూస్ యాజమాన్యం వ్యవహరించిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం మహా న్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు, కార్యాలయం ముందున్న కార్ల అద్దాలను ధ్వంసం చేశారని పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి తరుఫున బీఆర్ఎస్ లీగల్సెల్ న్యాయవాదులు సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో వారికి రూ.20 వేలతో రెండు పూచీకత్తులు, వ్యక్తిగత బాండ్లను కోర్టులో అందజేయాలని సూచించించిన నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
నేడు బాధ్యతల స్వీకరణ
కందుకూరు: లయన్స్ క్లబ్ 320ఏ జిల్లా గవర్నర్గా మండల కేంద్రంలోని భూలక్ష్మీ ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ జి.మహేంద్రకుమార్రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. సామాజిక స్పృహ, సేవాతత్పరత కలిగిన ఆయన గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ, స్వచ్ఛంద సంస్థ అయిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో చేరారు. 2007–08 కందుకూరు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం జిల్లా గవర్నర్ స్థాయికి చేరుకున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించి సంస్థ అభివృద్ధికి పెద్దన్న పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన సంస్థ జిల్లా గవర్నర్గా ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 90 క్లబ్లతో పాటు వికారాబాద్, పాత మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలతో పాటు నైజాం ప్రాంతంలోని కల్యాణ కర్ణాటక, రాయచూరు, సేడం, గుల్బర్గా, యాదగిరి తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని 40 క్లబ్ల వరకు జిల్లా గవర్నర్ పరిధిలో కార్యక్రమాలు కొనసాగించాలి. ఆయా క్లబ్లలో దాదాపుగా 3,500 మందికి పైగా సభ్యులు ఆయన ఆధ్వర్యంలో పని చేయనున్నారు. ఇది గురుతర బాధ్యత ఈ సందర్భంగా డాక్టర్ మహేంద్రకుమార్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా గవర్నర్గా పని చేయడం ఒక గురుతరమైన బాధ్యత అన్నారు. ఈ స్థాయికి రావడానికి నా సమయం చాలా వెచ్చించాల్సి వచ్చిందన్నారు. తన ముందున్న మార్గదర్శకుల అంచనాలను అందుకోవాలని, సేవలలో గ్లోబల్ లీడర్గా తన జిల్లాను నిలబెట్టాలనేదే ఆశయమన్నారు. తనకు సహకరించిన కందుకూరు, ఆమనగల్లు క్లబ్ సభ్యులతో పాటు జిల్లా పరిధిలోని సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. హెలెన్ కెల్లర్ సేవా వారోత్సవాలు తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా జూలై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హెలెన్ కెల్లర్ సేవా వారోత్సవాలు ప్రతి ఒక్క క్లబ్ నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇందులో ప్రతి రోజు కంటి వైద్య శిబిరాలు, అవసరమైనవారికి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, డయాబెటిక్ నిర్ధారణ శిబిరాలు, ఉచితంగా స్టేషనరీ అందించడం, వైద్య శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. లయన్స్ క్లబ్ 320ఏ జిల్లా గవర్నర్గా మహేంద్రకుమార్రెడ్డి -
సాగునీరందించడంలో విఫలం
● పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్ షాద్నగర్రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు అందించడంలో, కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్ ఆరోపించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరుకు సాగునీరు– కాలుష్య పరిశ్రమలపై 5వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల సాధన పోరాటం తొలుత కల్వకుర్తి లిఫ్టు, షాద్నగర్ లిఫ్టులాగా మొదలైందని, 15 ఏళ్ల ఆందోళన తరువాత 2013లో జీవోలను సాధించుకోగలిగామని అన్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చి తప్పు చేసిందని, 2015లో పనులను ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని నమ్మించి ప్రతిపాదనలో లేని డిండిని తగిలించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకోసం సాధించుకున్న పీఆర్ఎల్ఐ నీటిని ఏదుల నుంచి అక్రమంగా నల్లగొండకు తరలించుపోతున్నారని ఆరోపించారు. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల ఆటగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ నిర్వహించే సదస్సుకు విద్యావంతులు, విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక జిల్లా కో కన్వీనర్ నర్సింలు, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, పౌరహక్కుల సంఘం నాయకుడు తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’.. లబ్ధిదారులకు ట్రబుల్!
మంచాల: అనధికారికంగా డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వచ్చిన లబ్ధిదారులపై కేసులు నమోదు చేశామని మంచాల సీఐ మధు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని లింగంపల్లి గేట్ వద్ద గత ప్రభుత్వం 96 డబుల్ ఇళ్లను నిర్మించింది. వాటిలో మంచాల, నోముల, లింగంపల్లి గ్రామాలకు 30 చొప్పున లాటరీ పద్దతిలో 90మంది లబ్ధిదారులను గుర్తించారు. మరో ఐదు ఇళ్లు గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చెన్నారెడ్డిగూడ గ్రామస్తులకు కేటాయించగా.. మరొకటి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతుకు కేటాయించారు. మరో 20 మందిపై కేసు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు ప్రకటించినప్పటికీ అధికారికంగా ప్రొసీండింగ్లు ఇవ్వలేదు. ఇంతలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. నాటి నుంచి మూడు, నాలుగు దఫాలు తమకు ఇళ్ల ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారులు అధికారులను కోరారు. తహసీల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నెల 28న ఎమ్మెల్యే పర్యటనలో తమకు ఇళ్లు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఇదేమీ పట్టించుకోనివారు ఈ నెల 29న ఇళ్లలోకి వచ్చారు. అనధికారికంగా ఇళ్లలోకి రావొద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. తాజాగా సోమవారం ఆర్ఆండ్బీ ఏఈ వినోద్ డబుల్ ఇళ్ల పనులు పూర్తవ్వకుండానే ఇళ్లలోకి వచ్చారని మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ మధు, ఏఎస్ఐ సతీశ్, పోలీసు సిబ్బంది డబుల్ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ సూచనలు పాటించకుంటే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో 60 మందిలో 40 మంది అక్కడ నుంచి వెనుదిరిగారు. మరో 20 మందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ వివరించారు. ఇళ్ల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు సీఐ సూచనమేరకు ఖాళీ చేసిన 40 మంది -
పరిశ్రమల్లో భద్రతా చర్యలు తప్పనిసరి
● డీఆర్ఓ సంగీతసాక్షి, రంగారెడ్డిజిల్లా: పరిశ్రమల్లో నిబంధనల మేర కు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవె న్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం పరిశ్రమలు, అగ్నిమాపక, పోలీసు శాఖలతో పాటు జిల్లాలోని పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో మౌలిక సదుపాయాలు, ఫైర్ సేఫ్టీ, మెడికల్ అండ్ హెల్త్ ఎంతో ముఖ్యమని అన్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ ఉందో లేదో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేయ డంతో పాటు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించారు. ఇందులో స్థానికంగా ఉండే ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఇన్చార్జి అధికారి యాదయ్య, జిల్లా అగ్నిమాప శాఖ అధికారి మురళీ మనోహర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
యువకుడి అదృశ్యం
ఏడాది గడిచినా దొరకని ఆచూకీ పహాడీషరీఫ్: తాగిన మైకంలో ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. న్యూ బాబానగర్కు చెందిన షేక్ షా వలీ పెద్ద కుమారుడు మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(28) స్క్రాప్ సేకరిస్తుంటాడు. గతేడాది నవంబర్ 24వ తేదీన తాగిన మైకంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. తిరిగి ఎంతకి రాకపోవడంతో డిసెంబర్ 1వ తేదీన ఇమ్రాన్ తల్లి జాహెదా నాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి ఆచూకీ లభించడలేదు. ఇతని ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్ పోలీస్స్టేషన్లో గాని 87126 62366 నంబర్లో సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. -
హస్తం.. నిర్వేదం!
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఎమ్మెల్యేలు మొదలు చోటా మోటా లీడర్ల వరకు అంతా నారాజ్లో ఉన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశించారు. పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో వారంతా నైరాశ్యంలోకి వెళ్లారు. అధినాయకుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారు కూడా ఏమీ చేయలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశించారు. ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన ఇటీవల అలకపాన్పు ఎక్కడం, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించడంతో పీసీసీ చీఫ్ సహా ఇతర నేతలు బుజ్జగించారు. తాత్కాలికంగా శాంతించినప్పటికీ పదవి దక్కలేదనే అసంతృప్తి మాత్రం వెంటాడుతోంది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. డీసీసీ పీఠంపై సీనియర్ల కన్ను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన డీసీసీని గాలికొదిలేశారు. నియోజకవర్గాల్లో ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే వెళ్లి రావడం మినహా పార్టీ పటిష్టత కోసం తీసుకుంటున్న చర్యలు కూడా ఏమీ లేవు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత దేపభాస్కర్రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గానికి చెం దిన గౌరీసతీష్, భీంభరత్ మరికొంత మంది నేతలు ఈ పీఠాన్ని ఆశించారు. ఆ మేరకు వారు ముఖ్యనేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇప్పటికీ వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. పుట్టిముంచనున్న సమన్వయ లేమి ఉమ్మడి ఏపీలోనూ జిల్లా నేతలకు సముచిత స్థానం లభించేది. ఇటు మంత్రి వర్గంలోనే కాదు అటు పార్టీలోనూ జిల్లా నేతలు కీలకంగా వ్యవహరించేవారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జిల్లా నేతలను పూర్తిగా విస్మరించింది. ఒకరిద్దరు తమ అనుచరులకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం మినహా ముఖ్య పదవులేవీ కేటాయించలేదు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ లీడర్లకు బీఆర్ఎస్ నుంచి కొత్తగా చేరిన నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ వర్గం ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్కు ఫిర్యాదు చేసింది. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రస్తుత డీసీసీ చీఫ్ కూడా వారిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆయా మండలాలు, గ్రామాల్లో పార్టీ రెండుగా చీలిపోయి కన్పిస్తోంది. అంతర్గత విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పుట్టిముంచే ప్రమాదం లేకపోలేదు. ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల దాకా.. పదవులు ఆశించి భంగపడిన నేతలు డీసీసీ పీఠంపై పలువురి గురి ఆశావహుల ఎదురుచూపులు సంస్థాగత కమిటీల్లోనైనా సముచిత స్థానం దక్కేనా?సామాజిక న్యాయం దక్కేనా..? ఇప్పటి వరకు పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. నామినేటెడ్ పదవుల్లోనూ వారే కీలకంగా ఉన్నారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంస్థాగత పదవుల్లోనూ 42 శాతం రిజర్వేషన్ పాటించి తీరాలని ఆదేశిస్తున్నా జిల్లాలో ఇప్పటి వరకు ఈ సూత్రం అమలు కాలేదు. కనీసం గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీల్లోనైనా ఇతర నేతలకు సముచిత స్థానం దక్కుతుందో లేదో తేలిపోనుంది. జూలై 4లోగా సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూలై మొదటి వారంలో రాష్ట్రానికి రానున్నారు. గ్రామ, మండల, బ్లాకు, జిల్లా, రాష్ట్ర కమిటీల ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న సామాన్య ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్యకర్తలు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులకు గుర్తింపు లభిస్తుందా అనేది వేచిచూడాలి. -
యువత వ్యసనాల బారిన పడొద్దు
యాచారం: యువత చెడు అలవాట్లకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సూచించారు. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో ఆదివారం సాయంత్రం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు నిబంధనలు, ఘర్షణల వల్ల జీవితాల నాశనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతనేనని, అలాంటి వారు వ్యసనాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గొప్ప లక్ష్యంతో యువత ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. సమావేశంలో రాచకొండ సీఐ జోసఫ్, ఎస్ఐ తేజంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు -
క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
షాబాద్: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం ఏఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చైర్మన్ ఎలుగంటి అభిరామ్రెడ్డి నిర్వహిస్తున్న ఎస్పీఎస్–3 క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రాంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడాపాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక స్పోర్ట్స్ టీచర్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అన్ని మండలాల్లో ఉన్న స్టేడియాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. క్రీడాపోటీలతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ముడిమ్యాల, పెద్ద మంగళారం సహకార సంఘాల చైర్మన్లు ప్రతాప్రెడ్డి, చంద్రారెడ్డి, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
కనకదుర్గమ్మకు జోడు బోనాలు
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో పాతబస్తీలోని వివిధ దేవాలయాలకు చెందిన ప్రతినిధుల బృందంతో పాటు అక్కన్న మాదన్న దేవాలయం కమిటీ సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. జోగిని శ్యామల వెండి బోనం ఎత్తారు. ఈసారి బంగారు బోనాన్ని కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ సతీమణి సంగీత ఎత్తుకున్నారు. ఈసారి విజయవాడ కనక దుర్గమ్మకు బంగారు, వెండి పాత్రల్లో జోడు బోనాలు సమర్పించారు. -
తేలేదెప్పుడో..?
మొయినాబాద్: ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎటూ తేలడంలేదు. పరిహారం విషయంలో అటు అధికారులు, ఇటు రైతులు పట్టు వీడడంలేదు. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులు రైతులతో చర్చలు జరిపారు. పరిహారం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో నెల రోజులుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమి ఎనికేపల్లి సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాలు 1954 నుంచి రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమిగానే నమోదవుతూ వస్తోంది. 1954లో ఈ భూమిని దళితులు సాగుచేసుకోవడానికి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కొన్నేళ్ల పాటు రైతుల పేరు కబ్జా కాలంలో వచ్చాయి తప్ప అసైనీలుగా పేర్కొనలేదు. రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా సర్కారు భూమిగా కొనసాగుతూ వచ్చింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు డైబ్బె ఏళ్లుగా ఇక్కడ సాగుచేసుకుంటున్నారు. ఈ భూములను ప్రభుత్వం ఇటీవల గోశాల ఏర్పాటుకు కేటాయించింది. విషయం తెలిసిన గ్రామస్తులు నెల రోజుల నుంచి ఆందోళన మొదలు పెట్టారు. ఈ భూములనే నమ్ముకుని జీవిస్తున్నామని, తమకే అసైన్డ్ చేయాలని డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు సైతం భూములను పరిశీలించి రైతులకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. చర్చలు విఫలం భూములు సాగుచేసుకుంటున్న రైతులతో రెవెన్యూ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ పరిహారం విషయంపై వారితో చర్చించారు. ఎకరాకు వెయ్యి గజాల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 200 గజాల చొప్పున ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. మూడుసార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఎమ్మెల్యేపై భారం వేసిన రైతులు పరిహారం విషయంలో రైతులు ఎమ్మెల్యే కాలె యాదయ్యపై భారం వేశారు. పలుమార్లు ఆయనను కలిసి ప్రభుత్వంతో చర్చించి మంచి పరిహారం ఇప్పించాలని కోరారు. రైతులను తీసు కుని కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పరిహారం విషయంపై చర్చించారు. ఎకరాకు 800 గజాలు పరిహారంగా ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా 250 గజాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీసం ఎకరాకు 400 గజాలైనా ఇవ్వాలని ఎమ్మె ల్యే కోరారు. ఈ విషయమై శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి చర్చించారు. ఎకరాకు 350 గజాల స్థలం ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిహారంపై కొందరు రైతులు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. రెండు సార్లు సర్వే చేయకుండానే.. గోశాలకు కేటాయించిన భూములను సర్వే చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెండుసార్లు వచ్చారు. పరిహారం విషయం తేలకపోవడంతో సర్వే చేయకుండానే వెనుదిరిగారు. మరోవైపు ఎనికేపల్లి భూముల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. కొత్త వ్యక్తులు, రైతులను అటువైపు రాకుండా కాపలా కాస్తున్నారు. కొలిక్కిరాని ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎన్నిసార్లు చర్చలు జరిగినా తేలని పరిహారం రెండుసార్లు సర్వే చేయకుండానే వెనుదిరిగిన అధికారులు కొనసాగుతున్న పోలీస్ పహారా ప్రభుత్వమే ఆదుకోవాలి సాగుచేసుకుంటున్న భూములు తీసుకుంటే మా బతుకులు ఆగమైతయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఎంత పరిహారం ఇస్తామన్న విషయం అధికారులు సరిగా చెప్పడంలేదు. ఎమ్మెల్యేపైనే భారం పెట్టాం. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. – అనుసూయ, మహిళా రైతు, ఎనికేపల్లి మా బతుకులు ఏం కావాలి తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు గోశాలకు ఇస్తే మా బతుకులు ఏం కావాలి. 1954 నుంచి 1998 వరకు పహణీల్లో మా పేర్లు వచ్చాయి. తరువాత సర్కారు భూమి అని వచ్చింది. మోకిలలో ఇచ్చినట్లు ఎకరాకు 750 గజాల చొప్పున పరిహారం ఇస్తే మంచిది. – న్యాలట మహిపాల్, రైతు, ఎనికేపల్లి -
తెలంగాణ సాహిత్యాన్ని కాపాడుకోవాలి
చేవెళ్ల: మన కవుల సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకుడు దోరవేటి చెన్నయ్య, అధ్యక్షుడు తూర్పు మల్లారెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ మహాకవుల జయంతిని ఘనంగా నిర్వహించుకుని, భావితరాలకు అందించాలన్నారు. అనంతరం సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వారు ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల క్యాలెండర్ను రూపొందించుకున్నట్లు తెలిపారు. జూలై 27న వికారాబాద్లో దాశరథి, సి.నారాయణరెడ్డిల జయంతి, చేవెళ్లలో కాళోజీ జయంతి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా శాఖల వారీగా ఉగాది కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం నుంచి అనంత ప్రతినిధులుగా ఘనపురం పరమేశ్వర్, పాపిరెడ్డిలను ఎన్నుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కడియాల మధుసూదన్, అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కమలేశ్, కార్యదర్శి శ్రీనివాస్, హనుమంత్, సభ్యులు ఆశీర్వాదం, నర్సయ్య, ప్రసాద్, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక సభ్యులు -
ఘనం.. రెండో బోనం
గోల్కొండ కోటకు వెల్లువలా భక్తులు గోల్కొండ: గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆదివారం 2వ బోనం పూజ ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కోటలోని నగినాబాగ్, రాణీమహల్ తదితర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. మహిళలు నాగదేవత పుట్టకు పూజలు నిర్వహించారు. అనంతరం తలలపై అందంగా అలంకరించిన బోనం కుండలతో కోటపైకి అమ్మవారి దర్శనానికి బయల్దేరి వెళ్లారు. గోల్కొండ ఫతే దర్వాజా నుంచి భక్తులు తొట్టెలతో ఊరేగింపుగా వచ్చారు. కోట చౌరస్తా శివసత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వసంత, బోనాల ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
పనికి వెళ్లడం లేదని..
తల్లి మందలించడంతో కొడుకు అదృశ్యం పహాడీషరీఫ్: పనికి వెళ్లడం లేదని తల్లి మందలించడంతో కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి వాదే ముస్తఫా బస్తీకి చెందిన షేక్ సమియుద్దీన్ షరీఫ్ కుమారుడు అకేఫుద్దీన్ షరీఫ్(21) ప్రైవేట్గా పని చేస్తుంటాడు. కొన్ని రోజులుగా పనికి పోకపోవడంతో తల్లి ఫర్హానా బేగం ఈ నెల 19వ తేదీన ఉదయం మందలించింది. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 21న తిరిగి తల్లి ఫోన్కు కాల్ చేసిన షరీఫ్ ‘నేను పనికి వెళ్లడం లేదని నన్ను తిడుతున్నారు.. నేను ఎక్కడికై నా వెళ్లిపోతాను’ అంటూ కట్ చేశాడు. ఎంతకి అందుబాటులోకి రాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై యువకుడి తల్లి ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇతడి ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. శిథిలావస్థకు చెరువు తూము దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఉన్న తూము లీకేజీ కావడంతో చెరువులో ఉన్న నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం నిండుకుంది. చెరువు తూము లీకేజీ కావడంతో నీరు వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు. తూము నుంచి నీరు బయటకు పోకుండా ఉపయోగించే ఇనుప రాడ్డు పూర్తిగా లోపలికి పడిపోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. చెరువు తూము లీకేజీ అవుతున్నా ఇప్పటివరకు ఏ అధికారి కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తూముకు మరమ్మతులు చేయాలని వ్యవసాయదారులు కోరుతున్నారు. -
చైతన్యంతోనే సమస్యలకు పరిష్కారం
ఇబ్రహీంపట్నం: రాజకీయంగా చైతన్యవంతులై ఎదిగితేనే సమస్యలను పరిష్కరం అవుతాయని.. ఆ లక్ష్యం దిశగా ముందుకుసాగాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పురి శేఖర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. సగరులు నివసిస్తున్న గ్రామాల్లో కుల గురువైన శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాయకత్వ పటిమతో సగరులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మార్క సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శ్రీకాంత్, నాయకులు నాగేశ్వర్, నవీన్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి విహరిస్తే కఠిన చర్యలు
మీర్పేట: వేడుకలు, ఇతర కారణాలతో అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్పేట పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు యువతను హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి తరువాత స్టేషన్ పరిధి నందనవనం, ఆర్ఎన్రెడ్డినగర్, భూపేష్గుప్తానగర్లలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న 122 మంది యువకులను గుర్తించారు. జన్మదిన వేడుకల పేరుతో కాలనీ కూడళ్లు, ప్రధాన రహదారులపైకి రావడం, అదే విధంగా రాత్రంతా బాక్స్ టైపు క్రికెట్ ఆడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఇన్స్పెక్టర్ సూచించారు. ఏ కారణం లేకున్నా యువత రోడ్లపై ద్విచక్ర వాహనాలను విచ్చలవిడిగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు గొడవలకు కారణమవుతాయని అవగాహన కల్పించారు. ఆపరేషన్ చబుత్రలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గౌరునాయుడు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దు మీర్పేట సీఐ నాగరాజు -
నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
షాద్నగర్ః ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు రూ.700కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూ.180 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి రెండేళ్లు గడిచిపోయిందన్నారు. కమిటీ నివేదికను అమలు చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో జేఏసీతో చర్చలు జరిపి దశల వారీగా పోరాటాలు చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, నాయకులు రాములయ్య, జగన్నాథ్ శర్మ, బుగ్గ రాములు, శంకర్ నాయక్, రాములయ్య, యాదగిరి పాల్గొన్నారు. -
ఫుట్పాత్ల ఆక్రమణలపై
శంషాబాద్: 15 రోజుల కిందట సాతంరాయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న చిరువ్యాపారాలకు సంబంధించిన డబ్బాలు తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి అందిన ఆదేశాలను అధికారులు క్షణాల్లో పూర్తి చేశారు. పక్కాగా పోలీసుల సహకారంతో జేసీబీలను ఏర్పాటు చేసి అక్కడున్న గరీబోళ్ల డబ్బాలను వెంటనే తొలగించి పెద్దసార్ల ఆదేశాలను ఆదేశాలను తూచాతప్పకుండా పూర్తి చేశారు. నాలాను ఆనుకుని ఆక్రమణలున్న కారణంగానే ఫిర్యాదులు అందగానే వాటిని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పుకొచ్చారు. మరి ఇక్కడ..? శంషాబాద్ పట్టణ ప్రధాన కేద్రంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కరంగా మారుతున్న ఫుట్పాత్ల ఆక్రమణపై మున్సిపల్ అధికారులు ఏడేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అనేక మార్లు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కౌన్సిల్లో తీర్మానాలు చేసి అవి కార్యాచరణకు నోచుకున్న దాఖలు కూడా లేవు. రోడ్డులను ఆక్రమించి హోటళ్లు, వ్యాపారాలు చేసుకుంటున్నా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. అద్దెకిచ్చేస్తున్నారు... ఫుట్పాత్లను ఆక్రమించి కొందరు సొంత వ్యాపారాలను విస్తరిస్తుండగా మరికొందరు తమ దుకాణాల ముందు చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నారు. రోడ్డును అద్దెకిచ్చి ఏళ్లుగా లక్షల రూపాయలు సంపాదిస్తున్న తీరు కూడా ఇక్కడ షరామాములే అన్నట్లుగా మారింది. పట్టణంలోని రాళ్లగూడ రహదారిలో ఫిరంగి నాలాను ఆనుకుని పదుల సంఖ్యలో డబ్బాలను ఏర్పాటు చేసి అద్దెకిచ్చేస్తున్నారు. దీనిపై ఇంతవరకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫుట్పాత్ల ఆక్రమణ కారణంగా సాధారణ ప్రజలతో పాటు ప్రయాణికులు సైతం నిత్యం నరకం చూస్తున్నారు. జనాభా రద్దీలేని సాతంరాయిలో పెద్దసార్ల ఆదేశాలతో ఆగమేఘాల మీద ఆక్రమణ తొలగింపులు చేసిన అధికారులు అదే రీతిన పట్టణంలో ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైవే ఫుట్పాత్పై కంటైనర్ వేసి ఏర్పాటు చేసిన హోటల్ శంషాబాద్లో విచ్చలవిడిగా ఫుట్పాత్ల ఆక్రమణ కంటైనర్ల ఏర్పాటు చేసిదందా చేస్తున్నా చర్యలు శూన్యం సాతంరాయిలో యుద్ధప్రాతిపదికన డబ్బాలు తొలగించిన మున్సిపల్ అధికారులు పట్టణ ప్రధాన కేంద్రంలో పట్టించుకోని యంత్రాంగంఆక్రమణలను తొలగిస్తాం.. పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించుకుని ఉ న్న కట్టడాలు, డబ్బాలను తప్పకుండా తొలగిస్తాం. రహదారులను ఆక్రమించి ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలు ఎవరివైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – సుమన్రావు, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్