breaking news
Ranga Reddy District Latest News
-
పుర పోరు.. హడావుడి షురూ!
● పట్టణాల్లో వేడెక్కిన రాజకీయం ● పోటీకి సిద్ధమైన ఆశావహులు ● వార్డుల్లో ప్రచారం మొదలు ● టికెట్ల కోసం తీవ్ర కసరత్తు పట్టణాల్లో ఓట్ల పండగ షురూ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. పురపాలక సంఘాల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్, విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా తలపడుతున్నాయి. ఆశావహులు ఆయా పార్టీల టికెట్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయం వేడెక్కింది. ఆశావహులంతా పోటీకి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది. ఏయే వార్డుల్లో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంలో పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. బలమైన నాయకులకే టికెట్లు ఇవ్వాలని ఆయా ప్రధాన పార్టీలు భావిస్తుండడంతో.. పార్టీ టికెట్లు దక్కవనుకున్న ఆశావహులు ఇప్పటికే కండువాలు మార్చేశారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధ మైన నాయకులు ప్రచారాలు సైతం మొదలు పెట్టా రు. వార్డుల్లో తిరిగి ప్రజలను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మారుతున్న కండువాలు మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. ఈ నెల 17న రిజర్వేషన్లు ఖరారు కావడంతో రిజర్వేషన్లు కలిసి వచ్చిన ఆశావహులంతా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రిజర్వేషన్లు కలిసిరానివారు పక్క వార్డుల్లో పోటీ చేసే ప్రయత్నాలు చేస్తుండగా కొందరు తమ సతులను పోటీలో దింపేందుకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ టికెట్లు రావని భావించిన నాయకులు కొందరు ఇప్పటికే కండువాలు మార్చారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరితే.. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో, బీజేపీలో చేరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జంపింగ్లు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముగ్గురి గురి మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కావడంతో ఆ కేటగిరికి చెందిన ప్రధాన పార్టీల నాయకులు దానిపై గురిపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పదవిపై ఇద్దరు నాయకులు కన్నేశారు. ఓ నాయకుడు ఓ స్థానంలో తాను పోటీ చేస్తూ మరో స్థానంలో తన భార్యను బరిలోకి దింపేందుకు పావు లు కదుపుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలోనూ చైర్మ న్ పదవి కోసం తీవ్ర పోటీనే ఉంది. ముగ్గురు ఎస్సీ నాయకులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ముందుగా కౌన్సిలర్లుగా గెలిచిన తరువాత చైర్మన్ స్థానం ఎవరికనేది తేలుద్దాం అంటూ పార్టీ అధి ష్టానం ఆశావహులకు సూచించినట్లు తెలిసింది. మరో వైపు బీజేపీ సైతం చైర్మన్ స్థానంపై కన్నేసింది. పూర్తి మెజార్టీ రాకపోయినా చైర్మన్ ఎన్నికలో కీలకంగా మారుతామనే ఆశాభావంతో ముందుకెళ్తోంది. ఇంటింటికీ తిరుగుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకులంతా వార్డుల్లో ప్రచారాలు మొదలు పెట్టారు. ఇంటింటికి తిరిగి తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని.. తమను గెలిపించాలని ఓటర్లకు చెబుతూ అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్థాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీల టికెట్ల విషయంలో గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో ఏ వర్గానికి టికెట్లు దక్కుతాయోనని పార్టీ వర్గాలే అయోమయానికి గురవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్లోనూ టికెట్ల కోసం గట్టి పోటీ కొనసాగుతుంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని 26 వార్డులకు సంబంధించిన నామినేషన్లను మున్సిపల్ కేంద్రంలోని మెథడిస్ట్ స్కూల్లో స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియకు 9 మంది ఆర్ఓలను కేటాయించారు. ఒక్కో ఆర్ఓ అధికారి మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 30న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
సాక్షి, సిటీబ్యూరో: లైంగికదాడి కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. తన కుమార్తెతో పరిచయం ఏర్పరుచుకున్న యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత ఆమెతో గొడవపడి వివాహానికి నిరాకరించాడని బాధితురాలి తల్లి 2017 ఫిబ్రవరిలో బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి లోనైన తన కుమార్తె భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్వాప్తు చేపట్టిన పోలీసులు 2017 ఫిబ్రవరి 12 న నిందితుడిని అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసుపై విచారణ చేపట్టిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా 1వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి తిరుపతి నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. మల్లేపల్లిలో అగ్ని ప్రమాదం రూ.50 లక్షల ఆస్తినష్టం నాంపల్లి: మల్లేపల్లిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లేపల్లి ఐటీఐ సమీపంలో కార్ల రిపేరింగ్ షెడ్ కొనసాగుతోంది. సోమవారం రాత్రి గ్రిడ్లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద నిప్పురవ్వలు ఎగిసి పడటంతో పక్కన ఉన్న షెడ్కు మంటలు వ్యాపించాయి. దీంతో షెడ్లో ఉన్న కార్లు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు. నమ్మించి నట్టేట ముంచారు! ● నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా టోకరా ● నగరవాసి నుంచి రూ.45 లక్షలు స్వాహా ● కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియా ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో నగరవాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు వర్చువల్ యాప్ ఇన్స్టాల్ చేయించి నిండా ముంచారు. వాలెట్లో రూ.6.19 కోట్ల బ్యాలెన్స్ చూపిస్తూ... రూ.45.01 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నల్లకుంట ప్రాంతానికి చెందిన వ్యక్తి (52) ఫేస్బుక్లో ‘ఇన్వెస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో వచ్చిన ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. అందులో ఉన్న లింక్ క్లిక్ చేయడంతోనే బాధితుడిని సైబర్ నేరగాళ్లు ‘స్టడీ సర్కిల్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఆ గ్రూప్లో ఉన్న ఇతర సభ్యులు అంతా ట్రేడింగ్పై శిక్షణతో పాటు సూచనలు, సలహాలు ఇస్తామని, తాము లాభాలు పొందుతున్నామని పోస్టులు చేసి అతడిని నమ్మించారు. వారి సూచనల మేరకు బాధితుడు లింక్ ద్వారా వచ్చిన ఈ వర్చువల్ ట్రేడింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారు. తొలుత రూ.50 వేలు ఆ యాప్లోకి బదిలీ చేయడంతో ఆ బ్యాలెన్స్ వాలెట్లో కనిపించింది. ఆపై మరింత మొత్తం పెట్టుబడి పెట్టాలని గ్రూపు సభ్యులు ఒత్తిడి చేశారు. ఓ దశలో ప్రొఫెసర్ ముకుల్ కొచ్చర్, అతడి సహాయకుడిగా కొందరు పరిచయం చేసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్స్లో సలహాలు ఇస్తామంటూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, గ్లోబల్ ఓషన్ లాజిస్టిక్స్ ఐపీఓ షేర్లు ఉచితంగా అధిక సబ్స్క్రిప్షన్ కోటాలో బాధితుడికి కేటాయించినట్లు చెప్పారు. పెట్టుబడి, లాభాలు, ఈ షేర్లతో కలిపి బాధితుడి వర్చువల్ ఖాతాలో మొత్తం రూ.6,19,49,304 బ్యాలెన్స్ చూపించారు. ఆ మొత్తం విత్డ్రా చేసుకోవాలంటే మరికొంత చెల్లించాలంటూ డబ్బు బదిలీ చేయించుకున్నారు. మొత్తమ్మీద బాధితుడు రూ.45,01,017 చెల్లించినా మరికొంత డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన అతను 1930కు ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ఆటకట్టు
నాగోలు: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను మంగళవారం చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 11 తులాల బంగారు అభరణాలు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. మంగళవారం ఎల్బీనగర్ డీసీపీ డాక్టర్ అనురాధ వివరాలు వెల్లడించారు..న్యూఢిల్లీ, సాగర్పూర్కు చెందిన అక్షయ్ కుమార్ శర్మ, , గురుగావ్కు చెందిన రోహిత్ డెలివరీ బాయ్లుగా పని చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న వీరు ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్లో పలు చోరీలకు పాల్పడ్డారు. వీరిద్దరిపై 2017 నుండి 2019 వరకు ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లో 10 కేసులు నమోదయ్యాయి. నాగ్పూర్లోనూ రెండు కేసులు నమోదు కావడంతో గత జూలైలో నాగ్పూర్ వారిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. జైలు నుండి విడుదలైన తర్వాత వీరు ఈనెల 17న హైదరాబాద్కు మకాం మార్చారు. సికింద్రాబాద్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హాస్టల్ ముందు పార్కింగ్ చేసిన బైక్ను చోరీ చేశారు. అనంతరం ఇద్దరు కలిసి బైక్ తిరుగుతూ నాచారం, జవహర్నగర్, షామీర్పేట్, హయత్నగర్, నాగోలు, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల్ పరిధిలో ఏడు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. అనంతరం సికింద్రాబాద్లోని సంగీత థియేటర్ వద్ద చోరీ చేసిన బైక్ను వదిలేసి ఢిల్లీకి పారిపోయారు. వరుస చైన్ స్నాచింగ్లతో అప్రమత్తమైన పోలీసులు ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కృష్ణయ్య పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. చైతన్యపురి డీఐ గురుస్వామి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం నిందితులను అరెస్టు చేసి వారి నుండి 11 తులాల బంగారు అభరాలు, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతి తక్కువ సమయంలో కేసును చేధించిన చైనత్యపురి పోలీస్లను డీసీపీ అభినందించి రివార్టులను అందజేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి సీఐ సైదులు, డీఐ గురుస్వామి, ఎస్ఐలు రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలో వరుస చైన్ స్నాచింగ్లు ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు 11 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం నిందితులపై పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు -
ఒక్కో చెరువుకు రూ.3 కోట్లు
● సుందరీకరణ పనులకు నిధులు మంజూరు ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి మీర్పేట/పహాడీషరీఫ్: నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన చెరువుల సుందరీకరణ కోసం రూ.మూడు కోట్ల చొప్పున హెచ్ఎండీఏ నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీర్పేటలోని క్యాంపు కార్యాలయంలో చెరువుల సుందరీకరణ, ఎస్ఎన్డీపీ నాలాల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీర్పేటలోని చందన చెరువు, పెద్దచెరువు, జల్పల్లి చెరువు, రావిర్యాల చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ముఖ్యంగా చెరువుల్లో మురుగునీరు చేరుతున్న చోట నాలాలు నిర్మించి మళ్లించాలని, ఆ తరువాత సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జల్పల్లి పెద్ద చెరువు కట్టపై మైసమ్మ ఆలయం వద్ద వినాయక ప్రతిమల నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. బతుకమ్మ ఘాట్ను కూడా మహిళా భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. అలాగే రెండో దశలో ఎస్ఎన్డీపీ నాలాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలైన లెనిన్నగర్, మిథులానగర్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే అసంపూర్తిగా ఉన్న ఎస్ఎన్డీపీ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. వాదే ముస్తఫా ప్రజలు చెరువును ఆనుకొని ఉన్న శ్మశాన వాటికకు రాకపోకలు సాగించేలా మార్గం ఉంచాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్ అఫ్జల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఇరిగేషన్ ఏఈ వంశీ, వర్క్ ఇన్స్పెక్టర్ జనార్దన్, మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్, నాయకులు అర్జున్, పటేల్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డింగ్లో నితిన్గౌడ్కు పతకాలు
తాండూరు రూరల్: మండలంలోని కరన్కోట్ గ్రామానికి చెందిన నితిన్గౌడ్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారం, సిల్వర్ పతకాలు సాధించారు. ఈ నెల 23న నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. నితిన్గౌడ్ సీనియర్ విభాగంలో సిల్వర్, జూనియర్ క్యాటగిరిలో బంగారం పతకం సాధించారు. వికారాబాద్లోని అలీ ఫిట్నెస్ జోన్ ట్రైనర్ సద్దాం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్లు నితిన్గౌడ్ తెలిపారు. తనను ప్రోత్సహించిన శ్రీనివాస్గౌడ్, సచిన్, భరత్, పవన్, సాయిమణికి కృతజ్ఞతలు తెలిపారు. -
దోపిడీదారుల లబ్ధికే భూసేకరణ
● రైతులను బెదిరించి లాక్కుంటున్న సర్కారు ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ యాచారం: జిల్లాలో రూ.కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించి దోపిడీదారులకు కట్టబెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. మండలంలోని నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములను మంగళవారం ఆయన పరిశీలించి కౌలు రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా రంగారెడ్డి జిల్లా భూములపై గద్దల్లా వాలిపోతున్నారని విమర్శించారు. ఏళ్లుగా సాగులో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములకు నోటిఫికేషన్లు ప్రకటిస్తూ రైతులను బెదిరింపులకు గురి చేసి తక్కువ ధరలకే సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. మార్కెట్లో ఎకరా భూమి రూ.కోట్లలో పలుకుతుంటే కేవలం రూ.35 లక్షల్లోపే చెల్లించి బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే అన్నదాతలు అడ్డుకుంటారనే భయంతో రాత్రిపూట డ్రోన్లతో వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. కర్షకులు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. లేదంటే గజం భూమి కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు. 30న యాచారంలో ధర్నా నందివనపర్తి ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,400 ఎకరాల భూములను ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నందివనపర్తి, నస్దిక్సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల కౌలు రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ 37ఏ సర్టిఫికెట్లు పొందినప్పటికీ, 38ఈ సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వకుండా అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టాదారు, పాసుపుస్తకాల కోసం ఈ నెల 30న స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాకు కౌలు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, మండల కార్యదర్శి నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పి.అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్, నస్దిక్సింగారం గ్రామ సర్పంచ్ బోడ కృష్ణ, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు తీర్చేందుకు చోరీల బాట
ఏటీఎం లూటీకి యత్నించిన దొంగల అరెస్టు షాద్నగర్ రూరల్: అప్పులు తీర్చేందుకు ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బార్గా జిల్లాకు చెందిన మనపడి రామకృష్ణ, మహారాష్ట్ర సోలాపూర్ చెందిన రాహుల్ సౌరప్ప, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం మాధారం గ్రామానికి చెందిన ఎరుకలి బన్నప్ప, అదే మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి రాజు బంధువులు. వీరందరూ హైదరాబాద్కు వచ్చి ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక గ్రామంలో తల్లిదండ్రులు చేసిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించి అప్పులు కట్టాలనే ఆలోచనతో పథకం పన్నారు. ఏటీఎంలలో ఎక్కువ డబ్బులు ఉంటాయనే భావనతో ఈ నెల 18న హైదరాబాద్ నుంచి మొయినాబాద్కు ఆటోలో జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని లాల్పహాడ్కు చేరుకున్నారు. అక్కడ అర్ధరాత్రి ఏటీఎం సెంటర్లోకి వెళ్లి సుత్తెతో మెషిన్ పగులగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద శబ్దం కావడంతో ఎవరో వస్తున్నట్లు కదలికలు గమనించారు. దీంతో దొరికిపోతామనే భయంతో పరారయ్యారు. దీనిపై ఈ నెల 19న ఏటీఎం నిర్వాహకుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను గుర్తించి పట్టుకున్నారు. చోరీకి ఉపయోగించిన ఆటో, రెండు సెల్ఫోన్లు, రెండు సుత్తెలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. -
జినుగుర్తిలో క్రికెట్ అకాడమీ
● 25 మంది విద్యార్థులకు అవకాశం ● రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ తాండూరు టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ నైపుణ్యం సాధించాలని రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ అన్నారు. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు మండలం జినుగుర్తి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను క్రికెట్ శిక్షణ కేంద్రం కోసం ఎంపిక చేశారన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాల్లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తాండూరు పట్టణంలో క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. వీరు ఏ గురుకులంలో చదువుతూ క్రికెట్కు ఎంపికయ్యారో అదే గురుకులంలో వారి అడ్మిషన్ కొనసాగుతుందని, కానీ క్రికెట్లో శిక్షణ మాత్రం జినుగుర్తి మైనార్టీ గురుకులంలో ఉంటుందన్నారు. మైనార్టీ విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకే గురుకుల సొసైటీ సెక్రటరీ బి షఫీవుల్లా, స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేశ్వర్ గురుకులాల్లో క్రీడా అకాడమీలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్రీడకు ఒక్కో మైనార్టీ గురుకులాన్ని ఎంపిక చేశారన్నారు. దీనిలో భాగంగానే జినుగుర్తి ౖమైనార్టీ గురుకుల పాఠశాలలో క్రికెట్ అకాడమీ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి ఆర్ఎల్సీ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు గురుకుల ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా, కొడంగల్ కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేందర్, పీడీ గోపాల్, శ్రీశైలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు జాతీయ సదస్సు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధ, గురువారాల్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాధిక, సదస్సు కన్వీనర్ రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికసిత్ భారత్–2047 డిజిటల్ ఇండియా, పరివర్తన, సాధికారిత వైపు ఒక చొరవ అనే అంశంపై సదస్సు ఉంటుందున్నారు. దేశంలోని వివిధ వర్సిటీల నుంచి నిష్ణాతులైన అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు హాజరై పరిశోధన పత్రాలను సమర్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్గా ఎమ్మెల్యే వీర్లపల్లి షాద్నగర్: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీచేశారు. ప్రభుత్వ పదవికి రాజీనామా చేసిన గీతావనజాక్షి మొయినాబాద్: చేవెళ్ల కోర్డులో ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్గా పనిచేస్తున్న గీతా వనజాక్షి తన పదవికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఆమె కౌన్సిలర్గా పోటీ చేసేందుకు సిద్ధమై చేవెళ్ల కోర్టు న్యాయమూర్తికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ప్రభుత్వం అప్పగించిన అసిస్టెంట్ ప్లీడర్ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించానన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నానన్నారు. పెద్దమంగళారం సర్పంచ్గా పనిచేసిన అనుభవంతో కౌన్సిలర్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. గతంలో చేసిన అభివృద్ధి, మంచి పనులను గుర్తించిన గ్రాస్తులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి తుక్కుగూడ: పల్లె దవాఖానాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 158 పల్లె దవాఖానాలు ఉన్నాయన్నారు. పల్లెల్లో మాతాశిశు సంక్షేమం, కేన్సర్ కేర్, వయో వృద్ధుల సేవలు తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం వైద్య సిబ్బందికి సిమ్కార్డ్స్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ పాపారావు, సిబ్బంది వినోద్, రాకేశ్, శ్రీనివాసులు, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. కొందుర్గు: గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహిస్తే సహించేది లేదని కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్ హెచ్చరించారు. భగత్సింగ్, ఛత్రపతి శివాజీ యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను విప్పి, పారబోశారు. గ్రామంలో మరోసారి మద్యం విక్రయించినట్లు తెలిస్తే స్థానికులతో కలిసి పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు పట్టించడంతో పాటు కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. -
పాలసేకరణ ధరలు పెంచండి
కడ్తాల్: పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని వివిధ గ్రామాల విజయ డెయిరీ సొసైటీ చైర్మన్లు, పాడి రైతులు కోరారు. మంగళవారం వారు హైదరాబాద్లోని తెలంగాణ పాడి పారిశ్రామాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్డీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, సంస్థ ఎండీ చంద్రశేఖర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ.. ఎస్ఎన్ఎఫ్ డిటెక్షన్ను తీసివేయాలని కోరారు. పాడిరైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పాలసేకరణ ధరలను పెంచాలని కోరారు. సకాలంలో పాలబిల్లులు అందించాలని, సబ్సిడీపై దాణ, మినరల్ మిక్చర్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్గుప్తా, పాడి రైతులు, సొసైటీ చైర్మన్లు కడారి రామకృష్ణ, రంగయ్య, శ్రీకాంత్రెడ్డి, నర్సింహారెడ్డి, జితేందర్రెడ్డి, కృష్ణయ్య, రంగనాయక్, హరి ప్రవీన్యాదవ్, నర్సింలు, దశరథ్, బాలాచారి, దుర్గేశ్, శంకర్నాయక్ తదితరులు ఉన్నారు. టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి పాడిరైతుల వినతి -
పథకాల ఆశచూపి అధికారంలోకి..
కొందుర్గు: తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఆశచూపుతూ అధికారం చేపడుతున్నారని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి విమర్శించారు. మంగళవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం చింతకుంట తండా, వేపకుచ్చ తండా, గోవులబండ తండాలను సందర్శించి గిరిజనుల ఆర్థిక స్థితిగతులు, జీవన నైపుణ్యాలపై ఆరాతీశారు. సాగునీరందక పంటలు ఎండిపోయి అప్పులపాలవుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తీర్చేందుకు ముంబాయి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోతున్నామన్నారు. అనంతరం రాఘవాచారి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఓట్లు వేయించుకుని మోసం చేసిందన్నారు. జూరాల నుంచి నీటిని తరలించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి ఆరంభంలోనే ప్రాజెక్టును ఆపివేశారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వం బీఆర్ఎస్ బాటలోనే పాలనసాగిస్తోందన్నా రు. సంక్షేమ పథకాలకే ప్రాధాన్యతనివ్వడం బాధాకరమన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని బీఆర్ఎస్ మోసం అదేబాటలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి -
ప్రభుత్వ జాగాల్లోపాగా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను టార్గెట్గా స్థిరాస్తి మాఫియా రెచ్చిపోతోంది. వీటికి నకిలీ పత్రాలు సృష్టించి.. కొల్లగొట్టేందుకు యత్నిస్తోంది. అప్పటికే పొజిషన్లో ఉన్న రైతులపై తన ప్రైవేటు సైన్యంతో బలప్రదర్శనకు దిగుతోంది. బలవంతపు భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఎక్కడో మారుమూల ప్రాం తాల్లోని భూములే కాదు.. జిల్లా పరిపాలన కేంద్రానికి కూతవేటు దూరంలోని ఖరీదైన భూములు కరిగిపోతున్నా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కిమ్మనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని శంషాబాద్, కొత్వాల్గూడ, గొల్లపల్లి, ఘాన్సిమియాగూడ, బహుదూర్గూడ సహా మహేశ్వరం, కొంగరకుర్దు రెవెన్యూల పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ భూములకు నకిలీ ఓఆర్సీలు, పట్టాదారు పాసుపుస్తుకాలు సృష్టించి విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అటవీ భూముల్లోనూ అక్రమార్కుల తిష్ట ● కొత్వాల్గూడ సమీపంలోని శంషాబాద్ రెవెన్యూ సర్వే నంబర్ 626/2 అటవీ శాఖకు 176.05 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ 166 ఎకరాలకు ఫెన్సింగ్ వేశారు. మరో 9.5 ఎకరాలను పశువుల మేత కోసం వదిలారు. ఈ భూములపై కన్నేసిన కబ్జాదారులు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. వీరికి రెవెన్యూలోని కొంత మంది అధికారులు పరోక్ష సహకారం అందిస్తుండడంతో భూమిని చదును చేసి, విక్రయించే పనిలో పడ్డారు. తీరా ఈ విషయం ఫారెస్ట్ అధికారులకు తెలిసి అడ్డుకున్నారు. ● శంషాబాద్ విమానాశ్రయం రన్వేకు సమీపంలోని గొల్లపల్లి, బహదూర్గూడ పరిధిలో రియల్ వ్యాపారుల కళ్లుపడ్డాయి. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, నాలా కన్వర్షన్ చేయించకుండానే గుంటల్లో ప్లాట్లను చేస్తున్నారు. 1996లో అప్పటి ప్రభుత్వం హిమాయత్సాగర్ పరిరక్షణకు 111 జీఓను తీసుకొచ్చింది. ఇళ్ల నిర్మాణానికి ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. కానీ ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అసైన్డ్ భూములు వెంచర్లుగా మారాయి. ● శంషాబాద్ మండలం ఘాన్సిమియాగూడ సర్వే నంబర్ 3, 4లో 400 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూములున్నాయి. వీటిని అమ్మడం, కొనడం నిషేధం. కానీ ఈ విలువైన భూములపై కన్నేసిన ముఖ్య నేత ఇప్పటికే 20 ఎకరాలను చెరబట్టారు. ఈ నిషేధిత భూముల్లో భారీ గోదాములు, ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తుండటం విశేషం. ఖాళీగా కన్పిస్తే కబ్జా ● హయత్నగర్–ఇంజాపూర్ రోడ్డులోని సర్వే నంబర్ 191లోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. ఇప్పటికే టిప్పర్ల కొద్ది మట్టిని నింపి భూమిని చదును చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. ● అబ్దుల్లాపూర్మెట్ మండలం మన్నెగూడ సర్వే నంబర్ 49లో 28 గుంటల ప్రభుత్వ భూమిపై ఓ స్థిరాస్తి వ్యాపారి కళ్లు పడ్డాయి. రూ.10 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని తన పట్టా భూమిలో కలిపి, రోడ్డు, పార్కులను ఏర్పాటు చేశారు. ● మహేశ్వరం మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 461లోని 128 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 19 ఎకరాలను ఓ ఎక్స్ సర్వీస్మెన్కు కేటాయించారు. మిగిలిన భూములను పేదలకు అసైన్ చేశారు. ఇక్కడ ఎకరం రూ.పది కోట్లపైనే ఉంటుంది. ఖరీదైన ఈ భూములపై ఆక్రమణదారుల కళ్లుపడ్డాయి. వీటికి తప్పుడు పట్టాదారు పత్రాలు సృష్టించి కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. నకిలీ పత్రాలతో ఆక్రమణలు.. గుట్టుగా వెంచర్లు 111 జీఓ పరిధిలో అక్రమ నిర్మాణాలు రెచ్చిపోతున్న స్థిరాస్తి మాఫియా ఖరీదైన భూములు కరిగిపోతున్నా కిమ్మనని రెవెన్యూ యంత్రాంగం ఇబ్రహీంపట్నం పట్టణ శివారు మంచాల రోడ్డులో ఉన్న బొంతపల్లికుంటపై కబ్జాదారుల కన్నుపడింది. 20.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటకు ఎగువ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రధాన కాల్వను ఇప్పటికే పూడ్చేశారు. తాజాగా నాలాను ఆక్రమించి, రాత్రిపూట మట్టిని నింపుతున్నారు. కళ్లముందే ఖరీదైన కుంట భూములు మాయమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మెయినాబాద్ మండలం నజీబ్నగర్ సర్వే నంబర్ 3,4లలో సింగారం చెరువు కుంట ఉంది. ఎఫ్టీఎల్ పరిధిలో 80 ఎకరాలు ఉంది. ఇందులో శిఖంపట్టా భూములు సైతం ఉన్నాయి. అయితే దాదాపు 819 మీటర్ల పొడవుతో ఉన్న కట్టను రియల్టర్లు ధ్వంసం చేశారు. ఆమనగల్లు పట్టణం సురసముద్రం చెరువుకు సంబంధించిన వరదనీటి కాల్వ కబ్జాకు గురైంది. అయ్యప్పసాగర్ క్షేత్రంలోని చెరువు నుంచి కోనాపూర్ గేటు వద్ద ఉన్న మిషన్ భగీరథ పంపు, మిఠాయిపల్లి చెరువు మీదుగా వరద నీరు ఈ సురసముద్రంలోకి చేరుతుంది. ఓ రియల్టర్ కాల్వ పక్క భూములను కొనుగోలు చేసి, కాల్వలను సైతం తన పట్టా భూమిలో కలిపేశారు. -
సదుపాయాలపై చొరవ చూపాలి
అబ్దుల్లాపూర్మెట్: గ్రేటర్లోని శివారు డివిజన్లలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చొరవ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డిరంగారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. నాగోల్ సర్కిల్–11 పరిధిలోని పెద్దఅంబర్పేట, కుంట్లూర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దఅంబర్పేట లక్ష్మారెడ్డిపాలెంలోని ఎస్ఎన్ఆర్ కళా కన్వెన్షన్ హాల్లో అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడంతో ఇక్కడి ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారని, వారిలో అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేయడానికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. నిధులు కేటాయింపులో శివారు డివిజన్లపై చిన్న చూపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దఅంబర్పేట, కుంట్లూరు డివిజన్ల అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించడంతో పాటు అన్ని విభాగాల అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీల వాసులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కృష్ణకుమారి, చీఫ్ ఇంజనీర్ అశోక్రెడ్డి, నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, బాటసింగారం సహకార సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
విద్యుత్ ఏఈ కార్యాలయం ప్రారంభం
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి సంబంధించి ట్రాన్స్కో ఏఈ కార్యాలయాన్ని డీఈ శ్యామ్సుందర్ రెడ్డి ప్రారంభించారు. ఇదివరకు కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ రెండు మండలాలకు ఒకే ఏఈ విధులు నిర్వహించేవారు. అయితే ఇటీవల జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి నూతనంగా నర్సింలు అనే ఏఈని నియమించారు. కాగా సోమవారం తాత్కాలిక ఏఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ ఇక నుంచి మండలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఏఈ అందుబాటులో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో ఏడీ సత్యనారాయణ, కేశంపేట ఏఈ ఈశ్వర్, కొందుర్గు ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
6,573 మంది ఖైదీలకు న్యాయ సహాయం
తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా చంచల్గూడ: వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 6,573 మంది ఖైదీలు న్యాయ సహాయం పొందారని తెలంగాణ రాష్ట్ర జైళ్ల డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. సోమవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ శిక్షణ సంస్థ (సీకా) మైదానంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురు వేసిన అనంతరం డీజీ మాట్లాడుతూ... జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమంతో పాటు ఖైదీల సంక్షేమానికీ విశేషంగా కృషి చేస్తున్నదన్నారు. గత సంవత్సరం రాష్ట్ర జిల్లా న్యాయ సహకార సంస్థ ద్వారా ఎంతో మంది ఖైదీలు న్యాయ సహాయం పొందారన్నారు. 44 జైల్ అదాలత్లు నిర్వహించి 1,558 కేసులను విచారించగా 985 కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. దేశంలోనే తొలిసారిగా మొత్తం 616 ఖైదీలకు రూ. 1.92 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. అర్హులైన ఖైదీలకు పెరోల్ మంజూరు చేశారన్నారు. థంబ్ ఇన్–సైన్ ఔట్లో భాగంగా 23,220 ఖైదీలను అక్షరాస్యులుగా మార్చామన్నారు. ఐజీలు యెర్రంశెట్టి రాజేష్, ఎన్.మురళీబాబు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీనివాస్, చంచల్గూడ జైలు సూపరింటెండెంట్లు నవాబు శివకుమార్గౌడ్, వెంకటలక్ష్మీ, శ్రీమాన్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ జెండాకు అవమానం
చేవెళ్ల: మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఇక్కడ ఓ స్థానిక నాయకుడు జెండాను ఆవిష్కరించగా, అపసవ్య దిశలో ఎగుతున్న జెండాను గమనించిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ మాధవిరాంరెడ్డి జాతీయ జెండాను కిందికి దించి, సరిచేసిన అనంతరం మళ్లీ ఎగురవేశారు. ఈ విషయంపై సర్పంచ్, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేయగా, పొరపాటు జరిగిందని జెండా కట్టిన వారు చెప్పారు. అయితే, పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను సర్పంచ్ లేదా పంచాయతీ సెక్రటరీ ఎగరేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ సీనియర్ నాయకుడితో జెండావిష్కరణ చేయించారు. ఈ విషయమై ఎంపీడీఓ, ఎంపీఓను అడగగా, విషయం మా దృష్టికి రాలేదని, తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జెండావిష్కరణలో అపశ్రుతి మంచాల: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో మండలంలోని ఆంబోత్ తండాలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేస్తుండగా తాడుతో పాటు పతాకం కింద పడింది. మువ్వెన్నెల జెండా ఎగుర వేసే సమయంలో అపశ్రుతి జరగడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. జెండా ఎత్తని పాఠశాలలు పహాడీషరీఫ్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని విద్యా సంస్థల్లో సోమవారం సంబురాలు నిర్వహించగా, జీహెచ్ఎంసీ జల్పల్లి సర్కిల్లోని సెయింట్ ఫ్లవర్, సెయింట్ మర్యామ్ పాఠశాలలు వేడుకలకు దూరంగా ఉన్నాయి. కనీసం ఆయా స్కూళ్ల గేట్లు కూడా తెరవలేదు. ఇది గమనించిన గ్రామ యువజన సంఘాల నాయకులు గౌర మురళీకృష్ణ, శ్రీకాంత్గౌడ్, యంజాల శివకుమార్, యాదగిరి, దూడల శివకుమార్ తదితరులు స్కూళ్ల వద్దకు వెళ్లి నివ్వెరపోయారు. వెంటనే ఫోన్లో సదరు యాజమాన్యాలను సంప్రదించగా, తమకు ఆరోగ్యం బాగోలేదని, పరీక్షలు ఉన్నాయని పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆగ్రహానికి గురైన యువకులు ఆయా స్కూళ్ల ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయాన్ని పహాడీషరీఫ్ పోలీసులతో పాటు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
దేవాలయం ధ్వంసంపై ఆందోళన
షాద్నగర్: మండల పరిధిలోని కిషన్నగర్లో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనంతో ఢీకొట్టి బంగారు మైసమ్మ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, వీహెచ్పీ రాష్ట్ర ప్రముఖ్ మఠం రాచయ్య, బజరంగ్దళ్ నాయకులు దేవాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవాలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొంత కాలంగా కొందరు దేవాలయాలను టార్గెట్చేశారని, ఆలయాల పరిరక్షణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కక్కునూరు వెంకటేశ్గుప్తా, వంశీకృష్ణ, చెట్ల వెంకటేశ్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్సిగ్, సురేష్, మహేందర్రెడ్డి, మల్చలం మురళి, వెంకటనోళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి
కందుకూరు: వికసిత్ భారత్ 2047 లక్ష్యసాధనకు అనుగుణంగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముచ్చర్లలో వికసిత్ భారత్, గ్యారెంటీ రోజ్ గార్, అజీవికా మిషన్ గ్రామీణ బిల్లుపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో వంద రోజులుగా ఉన్న పని దినాలను 120 రోజులకు పెంచారని, నేరుగా కూలీలకు వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పథకం పేరుతో పేదలను మోసం చేసి దండుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, జిల్లా కార్యదర్శి తేరటి లక్ష్మణ్ముదిరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, సర్పంచ్ ఊటు పద్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్క మల్లేష్, జిల్లా నాయకులు ఊటు మహేందర్, జిట్టా రాజేందర్రెడ్డి, సాధ మల్లారెడ్డి, బొక్క సత్యనారాయణరెడ్డి, కళ్లెం రాజేందర్రెడ్డి, దేశం సత్తిరెడ్డి, కొంతం జంగారెడ్డి, సోమరాజు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పనులకే శంకుస్థాపనలు
ఇబ్రహీంపట్నం: గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులకే తిరిగి శంకుస్థాపనలు చేస్తూ.. రూ.220 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు గొప్పలు చెప్పుకొంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పట్లో తాను నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చిన నిధుల వివరాలను ప్రొసీడింగ్స్తో సహా మీడియా మందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తున్నాడే తప్ప కొత్తగా నిధులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.220 కోట్లు మంజూరు చేయించినట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ విసిరారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందా చేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధిచెబుతారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అన్నీ బీఆర్ఎస్ హయాంలో మంజూరైనవే.. -
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
మొయినాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సోమవారం మొయినాబాద్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, కమిషనర్ జాకీర్ అహ్మద్ తదితరులు నామినేషన్ సెంటర్లు, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్లు, మాక్ కళాశాలో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు. నామినేషన్ సెంటర్ మొయినాబాద్లో ఏర్పాటుకు కొన్ని భవనాలను చూశారు. వారి వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఏసీపీగా ప్రదీప్కుమార్ బాధ్యతల స్వీకరణ ఇబ్రహీంపట్నం: ఆదిబట్ల ఏసీపీగా డీకే ప్రదీప్కుమార్ సోమ వారం బాధ్యతలు చేపట్టారు.పోలీస్స్టేషన్ను ఇటీవల హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చి డివిజన్ ఏసీపీ స్థాయి హోదా ను కల్పించిన సంగతి తెలిసిందే. నూతన డివిజన్ కార్యాలయానికి ఏసీపీగా ప్రదీప్కుమార్ను నియమించడంతో అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో సమావేశమై ప్రజా భద్రత, నేరాలను అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు, స్నేహపూర్వక పోలీసింగ్ వ్యవస్థ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.ఐదు వేలు కడ్తాల్: మండల పరిధిలోని రేఖ్యతండా సర్పంచ్ పాత్లవత్ లక్ష్మీబాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఆడబిడ్డ పుడితే రూ.ఐదు వేలు ప్రోత్సా హంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల తండాకు చెందిన మూడవత్ శ్రీను–రజిత దంపతులకు జన్మించిన ఆడబిడ్డకు రూ.ఐదు వేలు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్, వార్డు సభ్యులు కృష్ణ, విజయ, రాజు, హన్మా, శ్రీను, నాయకులు శ్రీధర్నా యక్, కృష్ణనాయక్, శ్రీనివాస్ ఉన్నారు. 300 వార్డులు, 60 సర్కిళ్లకు మ్యాపింగ్ పూర్తి లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో 300 వార్డులు, 60 సర్కిళ్లకు మ్యాపింగ్ పూర్తి అయింది. 27 అర్బన్ లోకల్ బాడీల విలీనంతోపాటు వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి, సర్కిళ్లను 30 నుంచి 60కి, జోన్లను 6 నుంచి 12కి పెంచిన విషయం తెలిసిందే. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలతోపాటు 60 సర్కిళ్లు, 300 వార్డుల మ్యాపింగ్ను ఖచ్చితత్వంతో పూర్తి చేసింది. జనన, మరణ సాఫ్ట్వేర్ అప్లికేషన్ను విజయవంతంగా ప్రారంభించింది. మ్యా పింగ్ ఆధారంగా జనన, మరణాల నమోదు, ధ్రువపత్రాల జారీ మరింత పటిష్టంగా, పారదర్శకంగా, వేగంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌరులందరూ తమ సమీప మీసేవా కేంద్రాల ద్వారాసులభంగా జనన, మరణ ధ్రువపత్రాల సేవలను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. -
‘కండల ఇంజెక్షన్ల’ పట్టివేత!
సాక్షి, సిటీబ్యూరో: అత్యవసర వైద్య సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ సోమవారం వివరాలు వెల్లడించారు. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ ఖాన్ ఫర్మిచర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. జిమ్కు వెళ్లే అలవాటు ఉన్న ఫైజల్ అక్కడ కొందరు యువకులు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా వాడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇదే అదనుగా తేలిగ్గా డబ్బు సంపాదించడానికి వీటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇండియా మార్ట్ యాప్ ద్వారా సూరత్ నుంచి ఈ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.150కి ఖరీదు చేసి జిమ్కు వచ్చే యువతకు రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నాడు. యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ బరువులు ఎత్తడానికి, కండలు పెంచుకోవడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్గా ఈ ఇంజెక్షన్ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా అనేక దుష్పరిణామాలు.. ఫైజల్ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ యదేందర్, ఎస్సై మహ్మద్ జాహెద్ తమ బృందాలతో వలపన్ని అత్తాపూర్లోని ఏసియన్ థియేటర్ వద్ద పట్టుకున్నారు. అతడి వద్దనున్న 133 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఇంజెక్షన్లను కొన్నాళ్లు ఫైజల్ కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతోపాటు మానసిక ఇబ్బందులు వస్తాయని అదనపు డీసీపీ హెచ్చరించారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆయన కోరారు. -
ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి భద్రత
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయిలో భద్రత కల్పిస్తాం అని పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు పేర్కొన్నారు. పోలీస్ పరేడ్గ్రౌండ్లో సోమ వారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు కవాతుతో ఆయనకు వందనం సమర్పించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వారికి ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ప్రజలతో మమేకమై శాంతిభద్రతలను కాపాడాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. చట్టం నుంచి రక్షణ కోరే వారిని కాపాడుతూ.. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిని శిక్షించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. నేరాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కమిషనరేట్ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ చందనాదీప్తి, డీసీపీలు నారాయణరెడ్డి, యేగేష్, శిరీష, ఏసీపీలు జానకీరెడ్డి, రాజు, చంద్రశేఖర్, కిషన్, లక్ష్మీనారాయణ, సీఐలు పాల్గొన్నారు. -
పారదర్శకతకు పెద్దపీట
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల ను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం.. జిల్లా అభివృద్ధే ధ్యే యంగా శ్రమిస్తున్నాం.. జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలి’ అని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే .. త్వరలో మూసీ సుందరీకరణ పనులు ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనరేట్ ఏర్పాటు ద్వారా ప్రజలు, పెట్టుబడిదారులకు భద్రత మరింత మెరుగు పడుతుంది. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డును కలుపుతూ ఇటు రావిర్యాల నుంచి అటు ఆమనగల్లు వరకు 41.5 కిలోమీటర్లు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో 300 అడుగుల వెడల్పుతో చేపట్టిన రేడియల్ రోడ్డు పనులు హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. బుద్వేల్ నుంచి షాబాద్, కొందుర్గు, చౌదరిగూడ మీదుగా నాచారం వరకు మరో రేడియల్ రోడ్డు ఏర్పాటుకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశాం. మూసీనది ప్రక్షాళనలో భాగంగా మొదటి దశలో హిమా యత్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న ఈసీ నది, ఉస్మాన్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న మూసీ నది సుందరీకరణ పనులు త్వరలోనే చేపట్టబోతున్నాం. సంక్షేమ పథకాలతో లబ్ధి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 15,543 ఇళ్లను మంజూరు చేసి, ఇప్పటి వరకు 10,327 నిర్మాణాలను మొదలు పెట్టి, రూ.253.97 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏడాది కాలంలో 35,543 మంది లబ్ధిదారులకు వివిధ రకాల చికిత్సలు అందించి, రూ.121.39 కోట్లు చెల్లించాం. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 126.24 కోట్ల జీరో టికెట్లు జారీ చేశాం. గృహజ్యోతి పథకంలో భాగంగా 3.31 లక్షల మందికి జీరో బిల్లులు జారీ చేసి, రూ.12.30 కోట్ల సబ్సిడీని డిస్కంకు చెల్లించాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద 2,82,850 మంది రైతుల ఖాతాల్లో రూ.323 కోట్లు జమ చేశాం. 2025–26లో 289 మంది రైతులు మృతి చెందగా, రైతు బీమా పథకం కింద రూ.14.45 కోట్లు.. వానాకాలంలో 2,879 మంది రైతుల నుంచి 14,866 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ.35.52 కోట్లు చెల్లించాం. మొగిలిగిద్దలో ఏటీసీ సెంటర్ జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా, మూడింటిని యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పోగ్రాం కింద ఎంపిక చేసి, కందుకూరులో సీఎల్ఏటీ, ఇబ్రహీంపట్నంలో నీట్, శంషాబాద్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో కేజీబీవీకి రూ.3.66 లక్షలు మంజూరు చేశాం. 764 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.23.37 కోట్లు, 1,251 పాఠశాలల నిర్వహణ కోసం రూ.4.66 కోట్లు మంజూరు చేశాం. ఆరు యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్లకు పాలనా అనుమతులు పొంది, ఇప్పటికే షాద్నగర్, కల్వకుర్తి స్కూళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాం. వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే విద్యార్థుల్లో మరింత నైపుణ్యం కోసం కందుకూరు మండలం పంజాగూడ, ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్దలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లకు పాలనా అనుమతులు తెచ్చుకున్నాం. జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వివిధ శాఖలు శకటాలను ప్రదర్శించారు. ఉత్తమ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశాంసా పత్రాలు అందజేశారు. ‘చెక్ దే ఇండియా’ దేశభక్తి గీతానికి నాదర్గుల్ డీపీఎస్ స్కూలు విద్యార్థులు, గళ్లు..గళ్లు జోడెడ్ల బండి జానపద గీతానికి ఎంజేపీ పాలమూకుల పాఠశాల విద్యార్థులు, జై జవాన్..జై కిసాన్ గీతానికి మహేశ్వరం భాష్యం స్కూలు విద్యార్థులు, ఆమనగల్లు కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన బోనాల నృత్యం, ఆపరేషన్ సింధూర్పై జెడ్పీహెచ్ఎస్ సాహెబ్నగర్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం, తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన బంజారా నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, శంషాబాద్ డీసీపీ రాజేశ్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కూర్చొనేందుకు సరిపడా కుర్చీలు లేకపోగా, అధికారులు, సిబ్బంది సహా వివిధ వేషధారణలో వచ్చిన విద్యార్థులు గంటల తరబడి ఎండలోనే మగ్గాల్సి వచ్చింది. వైద్య సేవల్లో నంబర్ వన్ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కీలకంగా పని చేస్తున్నాయి. వైద్య సేవల్లో రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలవడం అభినందనీయం. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద 20 ఆస్పత్రుల్లో ప్రతి మంగళవారం 18 ఏళ్లు నిండిన మహిళలకు 8 రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. చేయూత పథకం కింద 1,91,716 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.47.75 కోట్లు అందజేస్తున్నాం. బ్యాంక్ లింకేజీ ద్వారా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని 9,243 స్వయం సహాయక సంఘాలకు రూ.785.94 కోట్లు, సీ్త్ర నిధి సంస్థ ద్వారా రూ.19.02 కోట్ల రుణాలు మంజూరు చేశాం. 383 పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు రూ.4.97 కోట్ల రుణాలు మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు, వసతి గృహాల్లో చదువుతున్న వారికి మెస్ చార్జీలు చెల్లిస్తూ పేద విద్యార్థుల చదువుకు పెద్దపీట వేస్తున్నాం. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్రూరల్: షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిద్దిదడమే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో వ్యత్యాసం ఏమిటో ప్రజలే గ్రహిస్తున్నారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచి చేసేవారికి ఓటువేసి న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించాలని కోరారు. మాకు ఎవరు నాయకులు లేరని, ప్రజలే మాకు బాసులని, వాళ్లు చెప్పిందే మాకు వేదమన్నారు. అవినీతికి దూరంగా, అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన అందిస్తున్నామన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకోసం పనిచేసే నాయకులకే టికెట్ ఇస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్యాంసుందర్రెడ్డి, తాండ్ర విశాలశ్రావణ్రెడ్డి, నాయకులు కాశీనాథ్రెడ్డి, అగ్గనూరు విశ్వం, వన్నాడ ప్రకాశ్గౌడ్, మహ్మద్ అలీఖాన్బాబర్, శివశంకర్గౌడ్, కృష్ణారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బాల్రాజ్గౌడ్, సర్వర్పాషా, దామోదర్రెడ్డి, బస్వం, అందె మోహన్, ఖాజాఇద్రీస్అహ్మద్, రఘునాయక్, పురుషోత్తంరెడ్డి, జితెందర్రెడ్డి, కొమ్ముకృష్ణ, మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి రంగారెడ్డిని పునర్నిర్మించాలి
● జిల్లా సాధన సమితి సభ్యుల డిమాండ్ ● తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి వినతిపత్రం తాండూరు టౌన్: రంగారెడ్డి జిల్లా పునర్నిర్మాణం జరగాలని ఉమ్మడి జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి తిరుపతి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలను విడదీసి, పూర్తిగా గ్రామీణ నేపథ్యం కలిగిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 317 జీఓతో రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి వికారాబాద్ జిల్లాకు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు శాశ్వతంగా బదిలీ అయ్యారని, దీంతో ఇక్కడి నిరుద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు. వీటితో పాటు అనేక అంశాల్లో జిల్లా నష్టపోతోందని, ప్రభుత్వం పునరాలోచించి పూర్వ రంగారెడ్డి జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిశ్రావణ్, శ్రీశైలం, రాజు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
క్రీడాపోటీలతో స్నేహభావం పెంపు
ఆమనగల్లు: యువత క్రీడల్లోనూ రాణించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని అయ్యప్పకొండ సమీపంలో నిర్వహిస్తున్న మహేశ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా పోటీల నిర్వహణతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీలు ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు యాదవ్, టోర్నీ నిర్వాహకులు సతీశ్, ప్రసాద్, లక్ష్మణ్, స్థానిక నాయకులు చంద్రశేఖర్రెడ్డి, అంజినాయక్, ఒగ్గు మహేశ్, రాజు, రంజిత్, సుమన్, కిరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి -
ఓంకారేశ్వరాలయ భూములు సేకరించొద్దు
● ఫ్యూచర్సిటీ పేరిట కౌలు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం ● సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూ ములను ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు తీసుకోవద్దని, సాగులో ఉన్న కౌలు రైతులకు హక్కులు కల్పించి, పట్టాదారు, పాసుపుస్తకాలు జారీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నందివనపర్తి గ్రా మంలోని 1,400 ఎకరాల ఓంకారేశ్వరాలయ భూ మిని తాడిపర్తి, నందివనపర్తి, నస్దిక్సింగారం, కుర్మిద్ద రైతులు ఏళ్ల నుంచి సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. కౌలు రైతులకు 37 ఏ సర్టిఫికెట్లు సైతం ఇచ్చారని.. 38 ఈ టెనెంట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఆ భూముల్లో రైతుల సాగుకు రూ.లక్షలాదిగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసుకున్నారని అన్నారు. నేడు ఆ భూములను ఫ్యూచర్సిటీ కోసం తీసుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. 27న జాన్వెస్లీ రాక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఈ నెల 27న ఓంకారేశ్వరాలయ భూములను సందర్శిస్తారని పి.యాదయ్య తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆలయ భూములను సందర్శించి కౌలు రైతులతో మాట్లాడుతారని చెప్పారు. కౌలు రైతులకు న్యాయం చేయడం కోసం సీపీఎం మరో పోరాటానికి సిద్ధమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు పి.అంజయ్య, మండల నాయకులు జంగయ్య, తావునాయక్, వెంకటయ్య, జగన్, బాల్రాజ్, లాజర్, మౌనిక, విప్లవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను దగా చేస్తున్న ప్రభుత్వం
అనంతగిరి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల జీవితాలు, ఆత్మగౌరవంతో ఆడుకుంటోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. వికారాబాద్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టు కేసు తేలకుండా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడం ఆవర్గాలను దగా చేయడమేనని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే కేసు హైకోర్టులో నడుస్తోందని తెలిపారు. గత నవంబర్లోనే విచారణ ఫుల్ బెంచ్పైకి రావాల్సి ఉన్నా.. కేసు వాదించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.300 కోట్ల గ్రాంట్ రాదనే కారణంతోనే ఎన్నికలు పూర్తిచేశారన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల అంశం బలంగా ఉందని వివరించారు. ఏ కోణంలో చూసినా కేసు గెలుస్తామని, ఇందుకోసం అన్నివిధాలా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు గెలిపించడానికి ప్రయత్నం చేయని ప్రభుత్వం, ఎన్నికలకు తొందరపడటంలో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగపరమై, న్యాయపరమైన అవరోధాలేమీ లేవన్నారు. ప్రజల్లో బీసీ ఉద్యమం బలంగా ఉందని, ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే రిజర్వేషన్ల పెంపును అడుగుతున్నామని స్పష్టంచేశారు. ఈవిషయంలో సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేయడం సరికాదన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఉన్న 200 మందికిపైగా ఎంపీలతో ఇండియా కూటమి తరఫున పార్లమెంట్లో అడగడమో, నిరసన తెలపడమో చేయాలని సూచించారు. లేదంటే అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి, సభలో ప్రైవేటు బిల్లు పెట్టి ఆమోదింపజేయాలన్నారు. బీసీలను అణగదొక్కాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుపడుతోంది కోర్టు కేసు తేలకుండా ఎన్నికలకు వెళ్లడం పెద్ద కుట్ర కేంద్రం నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు పెట్టారు బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యబీసీ సర్పంచ్లకు అండగా ఉంటాం నూతనంగా గెలుపొందిన బీసీ సర్పంచ్లకు అండగా ఉంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని గౌలికార్ నర్సింగ్రావు ఫంక్షన్ హాల్లో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సర్పంచ్లను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నా రు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు సరైన న్యాయం జరగలేదన్నారు. అనంతరం శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడారు. రాజ్యాధికారంలో మనవాటా మనకు దక్కాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం బీసీ సర్పంచులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ ర్యాగ అరుణ్కుమార్, బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ లక్ష్మణ్, కన్వీనర్ యాదగిరి యాదవ్, ప్రతినిధులు శ్రీనివాస్గౌడ్, నర్సింలు, వెంకట య్య, మారుతి, విజయ్కుమార్, అనంత య్య, శివరాజు, పాండుగౌడ్, లాల్కృష్ణ ప్రసా ద్, రాజ్కుమార్, షుక్రూ, శ్రీనివాస్, హన్మంతు, రామకృష్ణ, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగిరం
ఇబ్రహీంపట్నం రూరల్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్ ఎదుగుతోందని టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ అన్నారు. శనివారం ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని మంగళ్పల్లి సమీపంలోని రోహిణి ట్రేడర్స్ స్టీల్, సిమెంట్ డీలర్ షాపు వద్ద తాపీమేసీ్త్రలకు అల్ట్రాఫాస్ట్ట్ సెట్టింగ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జి, రహదారుల నిర్మాణాలకు సరైన ఎంపిక అని చెప్పారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని తెలిపారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ రూ.20 అధికంగా ఉంటుందన్నారు. అనంతరం 30 మంది బిల్డర్లకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. డీలర్లు నర్సింహారావు, విష్ణువర్ధన్రావు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ -
పట్టణాల అభివృద్ధి స్థిరంగా జరగాలి
మొయినాబాద్: తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ విజన్–2047 ఆశయాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి స్థిరంగా జరగాలని.. పట్టణాల అభివృద్ధిని కేవలం మౌలిక సదుపాయాలు, విస్తరణ, ఆర్థికవృద్ధితో మాత్రమే కాకుండా మానవ సంక్షేమం, పర్యావరణ సమతుల్యత, సామాజిక సమానత్వం, సాంస్కృతిక నిరంతరత, ధీర్ఘకాలిక స్థిరత్వం వంటి అశాలతో కొలవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) ఆధ్వర్యంలో పట్టణీకరణ, స్థిరత్వంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విధాన నిర్ణేతలు, పట్టణ నిపుణులు, ఆర్కిటెక్టులు, పట్టణ ప్రణాళికకారులు, పర్యావరణ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల నాయకులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పౌర ప్రతినిధులు పాల్గొని పట్టణీకరణ అభివృద్ధి, పట్టణాల సవాళ్లు–వాస్తవ పరిస్థితి, వాతావరణ మార్పు–తక్షణ అవసరం, భవిష్యత్ అంశాలపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధి కోసం స్థిరమైన, సమానత్వంతో కూడిన పట్టణాలను రూపుదిద్దే దిశగా పనిచేయాలని.. అందుకు సామూహిక అవగాహణ అవసరమని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సదస్సు పాలనకు మార్గనిర్దేశం చేసే, ప్రజాజీవితాన్ని బలోపేతం చేసే పరిష్కారోన్నత వేదికగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. సదస్సులో ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధిపతి సుజనారెడ్డి కుంభం, మహేంద్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిర్బన్ ఘోష్, పర్యావరణ నిపుణులు బీవీ సుబ్బారావు, ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీ ప్రతినిధి అరుణ్కుమార్, ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ ప్రతినిధి కవితారెడ్డి, రాంకీ గ్రూప్ ప్రతినిధి శ్రీనివాస్ కేశవరపు, గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ సందర్శన కొందుర్గు: హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తహసీల్దార్ అజాంఅలీ సూచించారు. శనివారం పులుసుమామిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన సందర్శించి, పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని కిచెన్ షెడ్, కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. తాజా కూరగాయలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి నిస్సీ శేకీనా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
● పెద్దేముల్ మండలం రేగొండిలో ఘటన ● డాగ్స్క్వాడ్, క్లూస్టీంతో ఆధారాలు సేకరించిన పోలీసులు ● మృతురాలిది యాలాల మండలం పగిడిపల్లి తాండూరు రూరల్: మహి ళ గొంతుకోసి హ త్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్దేముల్ ఎస్ఐ శంకర్ ప్రకారం.. రేగొండి శివారు అటవీ ప్రాంతాంలోని ఓ కాల్వ వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతు రాలి వద్ద ఉన్న ఆధార్ కార్డులోని వివరాల ద్వారా ఆమె, యాలాల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన లొంకల పద్మమ్మ(45)గా గుర్తించారు. వికారాబాద్ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నిత్యం తాండూరుకు వచ్చి అడ్డా కూలీగా పని చేసుకుంటుందని, గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పనికోసం తీసుకెళ్లి, హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించా రు. ఎస్ఐ శంకర్తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పద్మ మ్మ నాలుగు రోజుల క్రితం పనికోసం బయటకు వెళ్లి, ఇంటికి వెళ్లలేదని తెలిసింది. వరినాట్లు వేసేందుకు వెళ్లి, ఒక్కోసారి వారం రోజుల వరకూ పని ప్రాంతంలోనే ఉంటారని, అలాగే వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యు లు భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. మృతురాలి భర్త చనిపోగా, ఓ కూతురు ఉంది. -
35,23,219
క్రీడాపోటీలతో.. యువత క్రీడల్లోనూ రాణించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆర్థిక, సామాజిక అంశాల్లో తెలంగాణకే తలమానికంగా నిలిచిన జిల్లా ఓటర్ల నమోదు విషయంలోనూ ముందుంది. నగరానికి ఆనుకుని ఉన్న జిల్లాలో జనాభాతో పాటే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 24,46,265 మంది మాత్రమే ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య రెట్టింపైంది. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్నగర్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 ఏళ్లు నిండిన వారు 35,23,219 మంది ఉన్నారు. వీరిలో 18,22,366 మంది పురుషులు ఉండగా, 16,99,600 మంది మహిళలు ఉన్నారు. మరో 454 మంది ఇతరులు ఉన్నారు. వీరితో పాటు ఎన్ఆర్ఐ ఓటర్లు 207 మంది ఉండగా, సర్వీసు ఓటర్లు 592 మంది వరకు ఉన్నట్లు అంచనా. 526 పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, ఇక చేవెళ్ల, మొయినాబాద్, కొత్తూరు, షాద్నగర్, శంకర్పల్లి, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. అత్యధిక ఓటర్లు ఇక్కడే.. ఇదిలా ఉంటే.. తెలంగాణలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి ముందు వరుసలో (6,98,133 ఓటర్లు) ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాకు చెందిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గం (6,69,361 మంది ఓటర్లు) ఉంది. మూడో స్థానంలో మేడ్చల్ (5,95,536 మంది ఓటర్లు) ఉండగా, నాలుగో స్థానంలో ఎల్బీనగర్ (5,66,866 మంది ఓటర్లు) ఉంది. ఇక ఐదో స్థానంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం (5,52,455) ఉండటం విశేషం. ఈ ఐదు నియోజకవర్గాల పరిధిలోనే 30 లక్షల మందికిపైగా ఓటర్లు ఉండటం గమనార్హం. రెచ్చిపోయిన వీధి కుక్కలు ● నలుగురికి గాయాలు ● రెండు మేకలు మృత్యువాత యాచారం: మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో శనివారం వీధి కుక్కల దాడిలో నలుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎ.మణికుమార్, మంగమ్మ, సునీల్, కృష్ణవేణి తమ వ్యక్తిగత పనుల నిమిత్తం బయట ఉండగా వీధి కుక్కలు వారిపై దాడి చేసి గాయపరిచాయి. మరో ఘటనలో యాచారం గ్రామానికి చెందిన మస్కు యాదయ్య, కొండాపురం యాదయ్యకు చెందిన రెండు మేకలపై దాడి చేసి చంపివేసాయి. రూ.10 వేల చొప్పున నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు జిల్లాలో..మంది ఓటర్లు 526 గ్రామ పంచాయతీలు..7,94,653 మంది ఓటర్లు ఏడు మున్సిపాలిటీలు.. 1,75,974 మంది.. నేడు జాతీయ ఓటరు దినోత్సవం ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాలు, మండల కార్యాలయాలు, పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ నిర్వహించడం, ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించడం, కొత్తగా ఓటరుగా నమోదైన యువతకు ఈ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డులను అందజేయడం, ప్రజాస్వా మ్య పండుగలో భాగస్వాములవుతున్న సీనియర్ సిటిజన్లను సన్మానించడం జరుగుతుందని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ వేడుకల్లో ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిల నియామకం
షాద్నగర్: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలను నియమించింది. షాద్నగర్ ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, ఆమనగల్లుకు రజిని సాయిచంద్, ఇబ్రహీంపట్నంకు నందికంటి శ్రీధర్, చేవెళ్లకు సీనియర్ నేత కార్తీక్రెడ్డి, శంకర్పల్లికి కాసాని వీరేష్ ముదిరాజ్, మొయినాబాద్ ఇన్చార్జిగా ముఠా జైసింహ, అమృత్లాల్ చౌహాన్ను నియమించారు. ఇబ్రహీంపట్నం రూరల్: రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం, ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, తాగునీరు, లైటింగ్, భద్రత, మౌలిక సదుపాయలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నవీన్రెడ్డి, ఆర్డీఓ సరిత, అధికారులు, మత పెద్దలు పాల్గొన్నారు. కడ్తాల్: బీదర్– మహేశ్వరం పవర్గ్రిడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ పనులను మండల కేంద్రంలో తాత్కాలికంగా నిలిపివేసేలా చూడాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. బీదర్–మహేశ్వరం 765 కేవీ పవర్గ్రిడ్ సంస్థ పోలీస్ బందోబస్తు పెట్టి రేయింబవళ్లు తమ వ్యవసాయ పొలాల్లో హైటెన్షన్ లైన్ పనులు చేస్తూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నవంబర్లో కేంద్ర విద్యుత్శాఖ మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరామని, మరోసారి కలిసి సమస్యను పరిష్కరించుకుని వచ్చే వరకు నెల రోజుల పాటు పనులు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో బాధిత రైతులు, నాయకులు పాల్గొన్నారు. లారీ బ్రేక్లు ఫెయిల్ తప్పిన పెనుప్రమాదం అబ్దుల్లాపూర్మెట్: విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్మెట్ కూడలిలో శని వారం ఘోర ప్రమాదం తప్పింది. ఓ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు డివైడర్తో పాటు హైమాస్ట్ లైట్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఎలాంటి ప్రాణన ష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీ ల్చుకున్నారు. వివరాలు.. ఉదయం 11గంటల సమయంలో హైదరాబాద్–నల్గొండ మార్గంలో లోడుతో వెళ్తున్న ఓ లారీ అబ్దుల్లాపూర్మెట్ కూడలి వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ రోడ్డు డివైడర్తో పాటు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. లారీ ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
లాభాల పండుగ
● పది రోజుల్లో సంక్రాంతి జోష్ ● ఆర్టీసీకి దండిగా ఆదాయం ● షాద్నగర్ డిపో రాబడి రూ.2.18 కోట్లుషాద్నగర్: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వలస జీవులు, ఉద్యోగులు, పట్టణాల్లో నివాసం ఉంటున్నవారు సొంతూళ్లకు వెళ్లారు. సంతోషంగా పండుగ ముగించుకుని తిరిగి తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. పది రోజుల పాటు బస్సులు, బస్టాండ్లు జనంతో కిటకిటలాడాయి. పది రోజుల్లో రూ.2.18 కోట్లు సంక్రాంతిని పురస్కరించుకుని షాద్నగర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించారు. ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు నడిపించిన బస్సులతో భారీగా ఆదాయం సమకూరింది. పది రోజుల్లో 3,27,000 కిలోమీటర్లు తిరిగిన బస్సులతో 3,94,505 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో రూ.2.18 కోట్ల రాబడి వచ్చింది. పండగ సెలవుల ప్రారంభం రోజు 10న రూ.24 లక్షలు, చివరి రోజు 19న రూ.34 లక్షలకు పైగా సమకూరింది. మహిళా ప్రయాణికులే అధికం మహిళలకు ఉచిత బస్సు పథకంతో సంక్రాంతి వేళ భారీ సంఖ్యలో మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. పది రోజుల్లో మొత్తం 3,94,505 మంది ప్రయాణించగా అందులో మహిళలు 2,39,972 మంది ఉండడం గమనార్హం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపించాం. పది రోజుల్లో డిపోకు రూ.2.18 కోట్ల ఆదాయం వచ్చింది. మహిళా ప్రయాణికులు అధికంగా బస్సుల్లో ప్రయాణించారు. – ఉష, డిపో మేనేజర్, షాద్నగర్ -
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతిఒక్కరూ బాధ్యతగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అనంతరం అధికారుతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, గ్రామీణాబివృద్ధి అధికారి శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉదయం కాంగ్రెస్.. సాయంత్రం బీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొంతమంది నేతలు పార్టీల కండువాలను వేగంగా మార్చేస్తున్నారు. ఉదయం ఒక పార్టీలో, సాయంత్రం మరో పార్టీలో చేరుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి లోని 21వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి మల్లారెడ్డి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ, సాయంత్రం తిరిగి బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరు ఎన్ని పార్టీలు మారుస్తారోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. సాయంత్రం బీఆర్ఎస్ నేత ప్రశాంత్రెడ్డి సమక్షంలో తిరిగి గులాబీ కండువాతో .. ఉదయం ఎమ్మెల్యే మల్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాతో మల్లారెడ్డి -
సహనానికి పరీక్ష!
హుడాకాంప్లెక్స్: పరీక్షల వేళ ఇంటర్ విద్యార్థులకు పస్తులు తప్పడం లేదు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు కాలేజీలోనే ఉండాల్సి వస్తోంది. ఉదయం తొమ్మిది గంటలకు ఇంట్లో టిఫిన్ చేసి, కాలేజీకి చేరుకున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్నం లంచ్ కూడా వారే సమకూర్చుకోవాల్సి వస్తోంది. సాయంత్రం తినేందుకు స్నాక్స్ కూడా లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వస్తోంది. ఎవరికి వారే.. సాధారణంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. టెన్త్ విద్యార్థులకు స్థానిక దాతల సాయంతో సాయంత్రం స్నాక్స్ సైతం సరఫరా చేస్తున్నారు. జి ల్లా వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న సుమారు పదివేల మంది విద్యార్థులకు మాత్రం ఇవేవీ అందడం లేదు. ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం ఇలా అన్ని వేళల్లో నూ వారే ఆహారాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఖాళీ కడుపుతో గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంట్లో తల్లిదండ్రులు వేళకు వంట చేయకపోవడంతో పలువురు విద్యార్థులు ఏమీ తినకుండా కాలేజీలకు వస్తున్నారు. ఆకలేసినప్పడు మంచినీళ్లతో కడుపు నింపుకొంటున్నారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నీ సమకూర్చుతున్న ప్రభుత్వం డే స్కాలర్ విద్యార్థులను పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేళకు భోజనం చేయకపోవడం, గంటల తరబడి ఖాళీ కడుపుతో ఉండటంతో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తి.. తీరా పరీక్షల ముందు కడుపు నొప్పితో చదువుకు దూరం అవుతున్నారు. స్నాక్స్ ఇస్తే బెటర్ కాలేజీలో 651 మంది వర కు విద్యార్థులు ఉన్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. స్నాక్స్ లేకపోవడంతో సాయంత్రం 4.30 వరకే కాలేజీలో ఉంచుతున్నాం. స్నాక్స్ సమకూరిస్తే మరో గంటపాటు అదనంగా చదివించే అవకాశం ఉంది. – అనురాధ, ప్రిన్సిపాల్, సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆకలితో చదవలేక పోతున్నాం కాలేజీకి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతు న్నాం. ఇంటి నుంచి తీసుకొచ్చిన లంచ్బాక్స్ మధ్యాహ్నం వరకు పాడవుతుండడంతో తినలేక పోతున్నాం. సాయంత్రం 4.30 వరకు కాలేజీలోనే ఉండాల్సి వస్తోంది. ఆకలితో ఏకగ్రత కోల్పోయి చదవలేక పోతున్నాం. మధ్యాహ్నం, సాయంత్రం తినేందుకు ఏదైనా ఆహారం సమకూరిస్తే బాగుంటుంది. – నందిని, ఇంటర్మీడియట్ విద్యార్థి -
తల్లిని చంపిన తనయుడికి జీవిత ఖైదు
ఇబ్రహీంపట్నం రూరల్: తాగుడుకు బానిసై తల్లిని హత్యచేసిన కొడుకుకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. ఠాణా పరిధిలోని కొంగరకలాన్కు చెందిన కోహెడ పెంటయ్య(29) మద్యానికి బానిసయ్యాడు. 2024 ఫిబ్రవరి 9న తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తల్లి లలిత(55)తో గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో తల్లి ఛాతిపై కూర్చుని మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి అంతమొందించాడు. మృతురాలి బావ కొడుకు నర్సింహ ఫిర్యాదు మేరకు పోలీసులు పెంటయ్యను రిమాండ్కు తరలించారు. కోర్టులో సాక్షాధారాలను ప్రవేశపెట్టిన పిదప అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శోభరాణి, వేణుగోపాల్రెడ్డిలు ప్రాసిక్యూషన్ తరుపున వాదించగా 15వ అడిషనల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి రంగారెడ్డి వాదోపవాదనలు వినిపించిన తరువాత కోహెడ పెంటయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.వేయి జరిమాన విధిస్తూతీర్పు వెల్లడించారు. కేసుకు సహకరించిన అప్పటి సీఐ రాఘవేందర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస రాజులతో పాటు పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు . నాగారం హత్య కేసులో.. మహేశ్వరం: మండల పరిధిలోని నాగారంలో జరిగిన హత్య కేసులో గ్రామానికి చెందిన కావలి మచ్చేందర్కు శుక్రవారం ఎల్బీనగర్ 3వ అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో నాగారం గ్రామానికి చెందిన కావలి కావలి శంకరయ్య కుమారుడు కావలి కృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన తొట్ల రాజు హత్య చేశాడని మృతుడి సోదరుడు కావలి మచ్చేందర్, తండ్రి శంకరయ్య పగ పెంచుకున్నారు. గ్రామ చౌరస్తాలోని తొట్ల రాజు హోటల్ వద్ద నిలుచుండగా మచ్చేందర్, శంకరయ్య గొడ్డలితో నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి తండ్రి తొట్ల నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. పోలీసులు నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో ఇరువురు వాదనలు పూర్తయిన తరువాత ఎల్బీనగర్ 3వ అదనపు జిల్లా కోర్టు ప్రధాన నిందితుడైన కావలి మచ్చేందర్కు జీవిత ఖైదు విధిస్తూ, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆర్టీసీ బస్సునుఢీకొట్టిన లారీ బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు బాలుడికి గాయాలు తాండూరు టౌన్: అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు ఓ బాలుడు గాయపడ్డారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చేటుచేసుకుంది. సీఐ సంతోశ్కుమార్ తెలిపిన ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన బస్సు మెట్లకుంటకు వెళ్లేందుకు బస్టాండ్నుంచి బయటకు వస్తోంది. ఈ క్రమంలో కొడంగల్ రోడ్డు నుంచి ఇందిరాచౌక్వైపు ప్రయాణిస్తున్న లారీ వేగంగా బస్సును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో బస్సు, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన డ్రైవర్ నారాయ ణ, కండక్టర్ యాదమ్మ, బాలుడికి గాయాలవడంతో స్థానికులు వారిని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బ స్సులో 11మంది ప్రయాణికులున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో రైతులకు మేలు నవాబుపేట: సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో రైతులకు మేలు చేకూరుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. వ్యవసాయ పరికరాలను తీసుకున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్నాయక్, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాలు మరింత అభివృద్ధి చెందాలి
శంకర్పల్లి: చెందిప్పలో మరకత శివాలయం, కొత్తగూడెంలోని పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయాలు మరింతగా అభివృద్ధి చెందాలని సినీ నటుడు సుమన్ ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన ఈ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల ప్రతిమ, శాలువాలతో సన్మానించారు. నటుడు సుమన్ మాట్లాడుతూ.. కొత్తగూడెంలోని పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయం, చెందిప్పలోని మరకత శివాలయాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన వెంట డబ్బింగ్ ఆర్టిస్ట్ కృష్ణవేణి ఉన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆలయ ధర్మాధికారి మాధవరెడ్డి, చెందిప్ప ఆలయ ధర్మకర్త వీడియో రావు, ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్రాజు, ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు సదానందం గౌడ్, శేఖర్, దర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయాన్ని సందర్శించిన సినీ నటుడు సుమన్ -
ఆదుపుతప్పిన బైక్
ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు ఆమనగల్లు: బైక్ అదుపుతప్పడంతో ద్విచక్రవాహనదారుడు గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని చుక్కాపూర్ సమీపంలో ఆమనగల్లు–షాద్నగర్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. కడ్తాల మండలం ముద్వీన్ గ్రామానికి చెందిన వీరాచారి తలకొండపల్లి–ఆమనగల్లు మార్గంలో ప్రయాణిస్తుండగా చుక్కాపూర్ సమీపంలో అడవిపంది అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో వీరాచారికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్లో ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం నగరంలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేశంపేట: గుర్తుతెలియని వృద్ధురాలు శుక్రవారం మండల పరిధిలోని కాకునూర్కు వచ్చింది. ఆమె వివరాలను తెలుసుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా అమె మతిస్థిమితం సరిగా లేక పొంతన లేని సమాధానాలు ఇస్తోంది. వృద్ధురాలిని గుర్తించిన వారు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అబ్దుల్లాపూర్మెట్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కోహెడా రెవె న్యూ పరిధిలోని మణికంఠ రియల్ ఎస్టేట్ సమీపంలో ఓవ్యక్తి మృతిచెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి వయస్సు 55–60 ఏళ్ల మధ్య ఉంటుందని, యాచకుడిగా జీవనం సాగిస్తూ అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఓంకారేశ్వరాలయ భూములను తీసుకోవద్దు
యాచారం: ఓంకారేశ్వరాలయ భూములను పరిశ్రమల పేరుతో తీసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. టీజీఐఐసీ ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,100 ఎకరాల భూమిని సేకరించడాన్ని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ భూములు సాగు చేసుకుంటున్నా నందివనపర్తి, తాడిపర్తి, కుర్మిద్ద, నస్దిక్సింగారం కౌలు రైతులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేవాలయ భూముల జోలికి వెళ్లిన వారు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవన్నారు. ఆలయ భూముల్లో వందలాది మంది కౌలు రైతులు ఏళ్లుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని, నేడు ఆభూములను సేకరిస్తే వారికి జీవనోపాధి కరువవుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాషా, నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్త్యవత్ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి -
విద్యుత్ వైర్లు సరిచేయండి
● లేదంటే చర్యలు తప్పవు ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం: విద్యుత్ అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే మల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శేరిగూడలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ఆయనకు విద్యుత్ తీగలు భూమికి తగిలే ఎత్తులో ఉన్నాయంటూ మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ ఏడీఏ సీతారాం, ఏఈ జ యన్నలను పిలిచి మందలించారు. అభివృద్ధి విషయంలో ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. మీ దగ్గర నిధులు లేకుంటే చెప్పండి.. సొంత నిధులు వెచ్చిస్తానంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్ల తొలగించకుంటే తనకే నేరుగా చెప్పాలని మహిళలకు ఎమ్మెల్యే ఫోన్ నంబర్ ఇచ్చారు. -
పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా..
● అదుపుతప్పిన బైక్ ● ఒకరు దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు మహేశ్వరం: బైక్ అదుపు తప్పి ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధిలోని మహేశ్వరం గేటు శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. వనస్థలిపురం రైతు బజార్కు చెందిన కడారి నరేశ్, కడారి కిరణ్ తమ స్నేహితుడు హరీశ్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బైక్పై మైసిగండి ఆలయానికి వెళ్లి తిరిగివస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మహేశ్వరం గేటు సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కిరణ్ బలమైన గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా, గాయపడిన నరేశ్ను తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరకుని వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడి వద్దకే వెళ్లి ఫిర్యాదును స్వీకరించారు. ఎస్ఐ రాఘవేందర్ మాట్లాడుతూ పోలీస్ పౌర కేంద్రిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. -
అనుమతులు లేకుండా మట్టి రవాణా
చేవెళ్ల: అర్ధరాత్రి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని కందవాడ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోనలి కందవాడ టైర్ల కంపెనీ సమీపంలోని ఓ భూమి నుంచి మట్టి తవ్వి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా రెండు టిప్పర్లలో మట్టి లోడ్ చేయగా మరో మూడు ఖాళీగా ఉన్నాయి. అక్కడే సూపర్వైజర్గా పనిచేస్తున్న వడ్డె యాదయ్యను ప్రశ్నించగా ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు. అనుమతి పత్రాలు చూపలేదు. దీంతో సూపర్ వైజర్తోపాటు డ్రైవర్లను అరెస్ట్ చేసి టిప్పర్లను స్టేషన్ను తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్ షాబాద్: ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ను చేవెళ్ల ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని పోతుగల్కు చెందిన కరుణాకర్రెడ్డి మరికొందరు సిండికేట్గా మారి పోతుగల్ తండా శివారులోని ప్రభుత్వ లావాని భూముల్లో జేసీబీతో మట్టిని తవ్వి మట్టి తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న ఈ తంతును గమనించిన ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఓ టిప్పర్ను పట్టుకున్నారు. లోడ్తో ఉన్న టిప్పర్తో పాటు డ్రైవర్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని షాబాద్ పోలీసులకు అప్పగించామన్నారు. టిప్పర్ యజ మాని కరుణాకర్రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐదు లారీలు సీజ్.. డ్రైవర్లు అరెస్ట్ -
చెట్టును ఢీకొట్టిన ఆటో
ఒకరి మృతి, పలువురికి గాయాలు శంకర్పల్లి: అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం దేవరంపల్లి, చక్రంపల్లి గ్రామాలకు చెందిన 8 మంది గచ్చిబౌలిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సాయంత్రం గచ్చిబౌలిలో విధులు ముగించుకున్న ఆటో మోమిన్పేట్కు బయలు దేరారు. శంకర్పల్లిలో పర్వేద గ్రామానికి చెందిన చంద్రయ్య(50) ఆటోలో ఎక్కాడు. మహాలింగాపురం వద్ద ఆటో చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా, దేవరంపల్లికి చెందిన అశోక్ కాలు విరిగింది. మిగిలిన వారికి పాక్షిక గాయాలు కాగా.. వారిని శంకర్పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ దివాకర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రెండు రోజుల్లో సర్వే పూర్తిమంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్ ఇబ్రహీంపట్నం రూరల్: అడవుల్లో జంతువుల సౌకర్యాలు, పెరుగుతున్న అటవీ సందపను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని మంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్ అన్నారు. ఆల్ ఇండియా పులుల గణన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి అడవుల్లోని శాఖాహార, మాంసాహార జంతువుల సర్వే చేపట్టారు. మండల పరిధిలోని ఎల్మినేడు బీట్లో సెక్షన్ అధికారి లావణ్య ఆధ్వర్యంలో ఈ గణన కొనసాగుతోంది. మూడో రోజు మంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ.. మన ప్రాంతంలో పులులు లేవన్నారు. మాంసాహార జంతువుల పాద ముద్రలు, మలం ఆధారంగా గుర్తిస్తున్నామని చెప్పారు. నక్క, అడవి పిల్లులు ఎక్కువగా సంచరిస్తున్నాయని వివరించారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తి అవుతుందన్నారు. -
పేదల లబ్ధికే ‘జీ రామ్జీ’
చేవెళ్ల: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మేలు చేసేందుకు, వారి ఉపాధికి ఆర్థిక భరోసా కల్పించేందుకే కేంద్రం జీ రామ్ జీ పథకాన్ని చట్టంగా చేసి మీ ముందుకు తీసుకు వస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు పంచాయతీ వద్ద సర్పంచ్ కౌలంపేట భాగ్యమ్మశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం మరింత పక్కాగా 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచి జీరామ్జీ పథకంగా తెచ్చిందని తెలిపారు. ఇది కూలీలకు ఉపాధి తోపాటు గ్రామాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ పథకం పక్కాగా అమలైతే గ్రామీణ స్థాయివరకు బీజేపీ మరింత బలోపేతం అవుతుందనే కాంగ్రెస్పార్టీ దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆలూరు కార్యక్రమానికి వస్తున్న ఎంపీ చేవెళ్ల బస్స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. గతంలో ఆలూరు గేట్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు ఆగేలా చూడాలని గ్రామస్తులు కోరడంతో ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఒప్పించారు. ఈ క్రమంలో స్వయంగా పరిశీలించేందుకు బస్సులో వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, ఆంజనేయులు, శర్వలింగం, ఇంద్రసేనారెడ్డి, సత్యనారాయణ, జయశంకర్ పాల్గొన్నారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
ప్రజల భద్రతకు ప్రాధాన్యత
యాచారం: ప్రజల భద్రతే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందని, ఫ్యూచర్సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి స్వయంగా బైక్ నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి భద్రతకు సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే రాష్ట్ర స్థాయిలో పోలీస్ వ్యవస్థను ప్రజలకు దగ్గరకు తీసుకువచ్చేలా కొత్త కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ప్రయాణించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ, ఇబ్రహీంపట్నం, మంచాల సీఐలు నందీశ్వర్రెడ్డి, సత్యనారాయణ, మహేందర్రెడ్డి, మధు, యాచారం ఎస్ఐ మధు, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు నాథ్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య
తుర్కయంజాల్: పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. తొర్రూర్ డివిజన్ పరిధి కమ్మగూడలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిబట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ వజ్రమ్మ, మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్రూరల్: గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్య రాకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మిషన్ భగీరథ జిల్లా అధికారి హారిక అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల లైన్మెన్లకు తాగునీటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారి వెంకటేశ్వర్రావు, మండల విద్యాధికారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: పశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా పశువైద్యాధికారి ఎం.మధుసూదన్ అన్నారు. మొయినాబాద్, అమ్డాపూర్ పశువైద్య కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పశువులకు ఇచ్చే నట్టల నివారణ మందులు, గాలికుంటు నివారణ టీకాలుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీటిపై గ్రామాల్లో ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. మండలంలో పశుపోషణ, జీవాల పెంపకానికి సంబంధించిన వివరాలను వైద్యాధికారులు అహ్మద్, దేవిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్ఓ సుధాకర్గౌడ్ ఉన్నారు. షాద్నగర్రూరల్: సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించినట్టు గురుకులాల రీజనల్ కో ఆర్డినేటర్ నాగార్జునరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి, ఆరె నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు మీ సేవ కేంద్రాలు, అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీవద్దు
కడ్తాల్: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, పుటేజీల నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెట్రోలింగ్ను పటిష్టం చేసి, నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్ఐ వరప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు -
సాగుపై అవగాహన అవసరం
● భూ పరిరక్షణనకు కృషి చేయాలి ● వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత ఇబ్రహీంపట్నం రూరల్: భూ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత విద్యార్థులకు సూచించారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి కొంగరకలాన్ జెడ్పీహెచ్ఎస్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోషల్ సాయిల్ హెల్త్ కార్యక్రమం నిర్వహించారు. 7వ, 8వ, 9వ తరగతి విద్యార్థులకు భూసారం ప్రాధాన్యత, భూమి, పంటల సంబంధం, భూసార పరిరక్షణ నిమిత్తం సాంపిల్ సేకరించే పద్ధతులను కిట్ ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్ పరిరక్షించే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితులుగా విచ్చేసిన వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత , కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా శాస్త్రవేత్త దిలీప్ మాట్లాడుతూ వ్యవసాయం, పంటలు పండించే విధానాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. భూసార పరీక్షలు, నేలల పరిరక్షణ అవసరమన్నారు. సేంద్రియ ఎరువులు వాడకంతో భూసారం పెరుగుతుందని చెప్పారు. పంటల మార్పిడి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి విద్యాధరి, ఏఓ శ్రవణ్కుమార్, హెచ్ఎం రాజేశ్వర్రెడ్డి, రైతులు రవీందర్, ఎం.శేఖర్గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆరుట్ల బడిని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
మంచాల: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి శుక్రవారం ఆయన పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, క్రీడా స్థలం, విద్యాబోధన తీరును ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడేలా విద్యా బోధన అందించాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ గౌడ్, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
వీధికుక్కల కేసు విచారణ వేగిరం
యాచారం: వీధి కుక్కలకు విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపేసిన బాధ్యులపై కఠిన చర్యలకు స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జాతీయ స్థాయిలో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ వ్యవస్థపకురాలు, మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ తీవ్ర ఒత్తిళ్ల వల్లే యాచారం పోలీసులు కళేబరాలను గుర్తించారు. అంతే వేగంగా విచారణ చేపట్టి పశువైద్యాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు సైతం విచారణ వేగవంతం చేశారు. గ్రామస్తుల పెంపుడు కుక్కలకు సైతం విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపేయడంతో బాధితులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఫోన్లలో ఫిర్యాదు చేసారు. వారు మూడు రోజుల పాటు మనోవేదనతో, అన్నపానీయాలు సైతం తీసుకోలేదని తెలుస్తోంది. గ్రామస్తులు సమాచారంతో, స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు పంచాయతీ సిబ్బంది సహకారంతో పూర్తి సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే.. ఖననం చేసిన వీధి కుక్కల కళేబరాలను గురువారం వెలికి తీశారు. పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. యాచారం పశువైద్యాధికారి డాక్టర్ రేఖ ఆధ్వర్యంలో ఒక్కో కుక్క నుంచి నాలుగు నుంచి ఐదు సాంపిల్స్ సేకరించి పోలీసులకు అప్పగించారు. వారు రెడ్హిల్స్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతే కేసును వేగవంతంగా విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. వీధి కుక్కలను చంపేయడం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారగా, యాచారం పంచాయతీ పాలకవర్గం, సిబ్బందికి మాత్రం కంటికి కునుకు లేకుండా చేసింది.బాధ్యులపై చర్యలకు జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తున్న స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు -
సిమెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా ‘భారతి’
అబ్దుల్లాపూర్మెట్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ ఫైవ్స్టార్ గ్రేడ్ తీసుకువచ్చిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. పెద్దఅంబర్పేటలోని లక్ష్మారెడ్డిపాలెంలో మైత్రి స్టీల్ హౌస్ డీలర్ షాప్లో శుక్రవారం తాపీ మేస్త్రీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు మరియు రహదారులకు సరైన ఎంపిక అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందచేస్తామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారన్నారు. ఈ సందర్భంగా బిల్డర్లకి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను 50 మందికి అందజేశారు. డీలర్ మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్ సర్వీస్ వేగవంతంగా ఉంటుందన్నారు. -
అన్ని వసతులతో డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూం ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం ఆదేశించారు. గురవారం కర్మన్ఘాట్ నందనవనం కాలనీ, మల్లాపూర్, కుర్మలగూడ, బాటసింగారం, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఇళ్ల పనులను పరిశీలించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాల, వైద్య సదుపాయాలు, పార్కుల వంటివి కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కాలనీల్లో జీవనప్రమాణాలతో నివసించేందుకు వీలుగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలన్నారు. వచ్చే రెండు నెలల్లో లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నందనవనంలో పునరావాసంలో భాగంగా నిర్మించిన 2 బీహెచ్కే 80 (2బ్లాక్లను) ఫ్లాట్లను ఆయన పరిశీలించారు. పూర్తయిన ఇళ్లను వారం రోజుల్లో లాటరీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులకు అందించాలని సూచించారు. తర్వాత మల్లాపూర్లో నిర్మాణంలో ఉన్న 17 బ్లాక్ల్లో పనులను సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్లోని భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలని, హైడ్రా అధికారుల సహాయం తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. సెప్టెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి కావాల్సిందే అని స్పష్టం చేస్తూ, అందుకు తగ్గట్లుగా పనులన్నిటినీ ప్రణాళిక బద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కుర్మల్గూడలో పూర్తి కావస్తు న్న 1,536 ఫ్లాట్స్ పనులను పరిశీలించి, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల పనులను మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. బాటసింగారంలోని 20 బ్లాక్ల నిర్మాణాలను చూసి పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఖాళీగా ఉన్న ఇళ్లను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఎం.చైతన్య కుమార్, పి.బలరాం, జి.విజయకుమార్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డి.చంప్లానాయక్ జీహెచ్ఎంసీ అధికారులు పి.వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
బలవంతపు భూ సేకరణ సహించం
షాబాద్: దళిత రైతుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. రేగడిదోస్వాడలో గురువారం నిర్వహించిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా పేదల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. దళితుల భూములు ఎందుకోసం తీసుకుంటున్నారో.. ఏం కంపెనీలు పెడతారో.. ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా ఆక్రమించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాబాద్ మండలం రేగడిదోస్వాడ, తాళ్లపల్లి, మక్తగూడ, తిమ్మారెడ్డిగూడ, వెంకమ్మగూడ గ్రామాలకు చెందిన దళిత రైతుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకించారు. ఈశా ఫౌండేషన్ కోసం భూములు ఇవ్వడానికి పేదల భూములే దొరికాయా, ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించవచ్చు కదా అని నిలదీశారు. చేవెళ్ల సాక్షిగా మల్లికార్జునఖర్గే సమక్షంలో పేదల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమిని లాక్కోవాలని చూశారని గుర్తు చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు న్యాయం జరిగేదాక పోరాడతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు విజయ ఆర్య క్షత్రియ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, దేశమల్ల ఆంజనేయులు, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచ్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
వినియోగం విరివిగా..
గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ టీజీఎస్పీడీసీఎల్ వేసవి కార్యాచరణ సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో నమోదు కావాల్సిన విద్యుత్ డిమాండ్ జనవరి మూడో వారంలోనే వెలుగు చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఏప్రిల్ చివరి నాటికి గ్రేటర్ ఫీక్ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగా వాట్లకు చేరుకోనున్నట్లు డిస్కం అంచనా వేసింది. వేసవి కార్యాచరణలో భాగంగా ఇప్పటికే ఓవర్ లోడుతో ఉన్న సబ్స్టేషన్లు/ ఫీడర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ఆ మేరకు వాటి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రతి నెలా 35 వేల కొత్త కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 67.95 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 55.98 లక్షల గృహ, 9.15 లక్షల వాణిజ్య, 38 వేల పారిశ్రామిక, 1.53 లక్షల వ్యవసాయ, మరో 90 వేలకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల కనెక్షన్లు ఉంటున్నాయి. ఈసారి వేసవి ఎండలు భగ్గున మండే అవకాశం ఉండటంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. సబ్స్టేషన్లలోని పీటీఆర్లు, ఫీడర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంచే పనిలో నిమగ్నమైంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టం చేశారు. తేదీ మెగావాట్లు 18 2675 19 3196 20 3345 21 3385 22 3375 సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేపట్టే అదనపు పనులు జోన్ల వారీగా.. అంశం మెట్రో మేడ్చల్ రంగారెడ్డి కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 716 1483 1158 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు 36 58 69 కొత్తగా ఏర్పాటు చేయనున్న 11 కేవీ ఫీడర్లు 122 187 218 కొత్తగా ఏర్పాటు చేయనున్న 33 కేవీ ఫీడర్లు 37 28 53 -
పడుతూ.. లేస్తూ.. బడికి!
● ఆర్టీసీ బస్సులు అంతంతే.. ● ప్రైవేటు వాహనాలే దిక్కు ● విద్యార్థులకు తప్పని తిప్పలు చేవెళ్ల: చదువుల కోసం విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. నిత్యం పాఠశాలలకు వెళ్లేందుకు అటు సరైన రవాణా సదుపాయం లేక.. ఇటు రోడ్లు బాగాలేక అవస్థలు పడుతున్నారు. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు వెళ్లే వారితో బస్సులు రద్దీగా ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో సమయానికి అనుకూలంగా లేకపోవడంతో ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. మరికొన్ని గ్రామాలకై తే కనీసం బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్నారు. మరికొంతమంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మండలంలో మొత్తం 25 పంచాయతీలు, 11 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. సగానికిపైగా పంచాయతీల్లో ఆటోలను నమ్ముకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఇక రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనాల్లో ప్రయాణం ఇబ్బందిగా మారింది. నిత్యం ఈ రోడ్లపై దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నారు. బస్సులు రాక.. బడికి వెళ్లలేక.. ధారూరు: పాఠశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు రాక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం చింతకుంట, హరిదాస్పల్లి, అల్లీపూర్, అవుసుపల్లి, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్ తండా, స్టేషన్ ధారూరు నుంచి మండల కేంద్రమైన ధారూరులోని ప్రాథమికోన్నత పాఠశాలకు దాదాపు 20 మంది విద్యార్థులు వస్తుంటారు. చిన్నారులు ఎదుర్కొంటున్న బస్సు సమస్యలపై గురువారం శ్రీసాక్షిశ్రీ పరిశీలించగా పలు విషయాలు వెలుగు చూశాయి. ఉదయం అష్టకష్టాలు పడి స్కూల్కి వెళ్లిన రాంపూర్తండా విద్యార్థులు.. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ధారూరు చౌరస్తాలో బస్సుల కోసం దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బస్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో గ్రామానికి వెళ్లారు. మరి కొందరు ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగి వెళ్లారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతి రోజూ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. ఒక్కోసారి చీకటి పడిన తర్వాత గ్రామానికి చేరుకోవాల్సి వస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు వచ్చినా పాయింట్ వద్ద ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధారూరు: చౌరస్తాలో బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు చేవెళ్ల: ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్న విద్యార్థులు -
బస్తా కోసం.. కుస్తీ
యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఉదయాన్నే క్యూ లైన్లలో నిలబడి.. టోకెన్లు తీసుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.. ఒక్క బస్తానైనా దొరక్క పోతుందా అని కుస్తీ పడుతున్నారు.. గురువారం మంచాల పీఏసీఎస్ కార్యాలయానికి లోడ్ రాగానే అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. గంటల పాటు ఎదురు చూసినా కొందరికి ఒకే బస్తా దొరకగా.. మరికొంద రికి రిక్త హస్తమే ఎదురైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు సర్దిచెప్పి పంపించారు. – మంచాల -
గురుకులాల్లో పీజీ వరకు ఉచిత విద్య
యాచారం: రాష్ట్రంలోని గురుకులాల్లో పేద విద్యార్థులకు ఐదో తరగతి నుంచి పీజీ వరకు వసతితో కూడిన ఉచిత విద్య అందిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్ పేర్కొన్నారు. టీజీ సెట్ అడ్మిషన్లపై గురువారం తాడిపర్తి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1,023 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు ఉన్నట్టు తెలిపారు. వీటిలో ఏటా 55 వేల వరకు ఐదో తరగతిలో అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. గురుకులాల్లో ఖాళీ సీట్ల కోసం ఈనెల 25 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాల్లో ఐదో నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టీజీ సెట్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారి నిర్మల, సర్పంచ్ నీలం ఝాన్సీ, ఉప సర్పంచ్ రమేష్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు లీలావతి, రామయ్య, నాగేశ్వర్రావు, శ్రీనివాస్, సీనియర్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.30 లక్షల పరిహారం
కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న మండలంలోని ముద్వీన్ రెవెన్యూ పరిధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల భూ నిర్వాసితులు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ నారాయణరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ బాధితులు పరిహారానికి సంబంధించి తమ డిమాండ్లను కలెక్టర్కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి స్పందిస్తూ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం అందించే ప్యాకేజీని ప్రకటించారు. ఎకరాకు రూ.30 లక్షల నగదు పరిహారంతో పాటు, భూములు కోల్పోతున్న రైతులకు మైసిగండి గ్రామ సమీపంలో 120 గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మిస్తామని చెప్పారు. అదే విధంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక్కోక్కరికి రూ.ఐదు లక్షల చొప్పున అదనపు సాయం అందిస్తామని వివరించారు. రోడ్డు బాగు చేయించండి సారూ అనంతరం మర్రిపల్లి నుంచి ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారి, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మర్రిపల్లి సర్పంచ్ ఈర్లపల్లి రవి కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ రోడ్డును త్వరితగతిన మరమ్మతులు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. సమావేశంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, భూ నిర్వాసితులు వీరయ్య, పెద్దయ్య, రంగారెడ్డి, శంకర్, శివ, వెంకటయ్య, శ్రీనయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూ బాధితులకు కలెక్టర్ హామీ -
వేగంగా ఇంటిగ్రేటెడ్!
● కొందుర్గులో యంగ్ ఇండియారెసిడెన్షియల్ పాఠశాల ● కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు ● అన్ని వర్గాలకు ఒకేచోట విద్యాబోధన షాద్నగర్: పల్లె ప్రకృతి ఒడిలో.. చదువుల కోవెలను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో కూడిన గురుకులానికి సీఎం రేవంత్రెడ్డి షాద్నగర్ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.150 కోట్లతో నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కొందుర్గు తూర్పు శివారులోని సర్వే నంబర్ 109లో సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనికి 2024 అక్టోబర్ 11న సీఎం రేవంత్రెడ్డి భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టే స్థలాన్ని చదును చేసి 10 ఎకరాల విస్తీర్ణంలో పునాదులను బేస్మెంట్ లెవల్ వరకు పిల్లర్లు పూర్తి చేశారు. మిగితా సెంట్రింగ్ పనులు కొనసాగుతున్నాయి. పనులు చురుకుగా చేపట్టేందుకు నిర్మాణం చేస్తున్న ప్రదేశంలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణం పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రతి నియోజకవర్గంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాలమైన ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదులే కాకుండా అంతర్జాతీయ స్కూల్స్తో సమానంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. విద్యార్థులకు ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యనభ్యసించుతారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందనుంది. నాణ్యమైన విద్య ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలో అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందుతుంది. ఈ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి సూచనలు ఇస్తున్నా. – వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్నగర్ -
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు
అబ్దుల్లాపూర్మెట్: స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న ఓ యువకుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని కవాడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండారి సురేశ్(31) ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. గురువారం స్నేహితులతో కలిసి ఆయన కుంట్లూర్లోని ఓ క్రీడా మైదానంలో సరదాగా క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతని స్నేహితులు పక్కన కూర్చోపెట్టి విశ్రాంతి తీసుకోమన్నారు. అనంతరం కవాడిపల్లిలోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటివరకూ బాగానే ఉన్న సురేశ్ మరోసారి అస్వస్థతలకు గురికావడంతో స్థానికులు అబ్దుల్లాపూర్మెట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు ఏడాది క్రితమే వివాహం అయింది. యువ నాయకుడు గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తీవ్ర అస్వస్థతతో వార్డు సభ్యుడి మృతి -
మంచి నేలలతో ఆరోగ్యకర పంటలు
చేవెళ్ల: మంచి నేలలతోనే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ దిలీప్, డాక్టర్ హిమబిందు అన్నారు. పట్టణ కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నేల ఆరోగ్యం, సారవంతమైన భూమి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేల ఆరోగ్యం, పంట ఉత్పాదకతలో నేల పాత్ర గురించి వివరించారు. నేల పోషకాలు నేల సంతానోత్పత్తి నిర్వహణ, భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి.మహేశ్వర్రావు, వినోద్కుమార్, ఏఓ శంకర్లాల్, మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సురక్షిత ప్రయాణానికే ‘అరైవ్–అలైవ్’
చేవెళ్ల: సురక్షిత ప్రయాణానికే పోలీస్ శాఖ ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం చేపట్టిందని చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉపాధ్యాయ విజయ్కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. బుధవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో చేవెళ్ల కోర్టు, ప్రభుత్వ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం వద్ద అరైవ్–అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి పూలు, పెన్నులు ఇస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ శిరీష, పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మెరుగైన పరిహారం ● నాగిరెడ్డిపల్లి బాధితులకు ఎకరాకు రూ.1.20 కోట్లు ● కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి మహేశ్వరం: ఐటీ పార్కు ఏర్పాటులో భూములు కోల్పోతున్న నాగిరెడ్డిపల్లి రైతులకు ఎకరాకు రూ.1.20 కోట్లతో పాటు 121 గజాల ప్లాటును పరిహారంగా అందజేస్తామని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గ్రామంలో బాధిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహేశ్వరం మండల పరిధిలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 9, 10, 48, 49, 50, 51, 53, 54, 63, 66, 110, 144, 162, 163 సర్వే నంబర్లలో 195.5 ఎకరాల సీలింగ్ భూమిని సేకరిస్తున్నామని చెప్పారు. పరిహారం నేరుగా రైతుల ఖాతాలో జమచేస్తామన్నారు. ఇప్పటికే పలువురు రైతులు అంగీకారం తెలుపుతూ పత్రాలు అందజేశారని.. మిగిలిన రైతులు అందజేస్తే పరిహారం అందజేస్తామన్నారు. కాగా రైతులు పరిహారం పెంచాలని కోరగా.. ఇప్పటికే మూడింతల కంటే ఎక్కువ పరిహారం అంజేస్తున్నామని.. పెంచేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వర్ణకుమారి, జీపీఓ స్వప్న, సర్పంచ్ బామిని నాయక్, ఉప సర్పంచ్ జగన్, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు. జీపీఓఏటీజీ వర్కింగ్ ప్రెసిడెంట్గా భాస్కర్ మంచాల: గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ(జీపీఓఏటీజీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా యాట భాస్కర్ నియమితులైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాపాలకు చెందిన ఆయన యాచారం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యసాగరంలో హెర్బల్ పార్క్ ఏర్పాటు
ఎఫ్ఆర్ఓ వెంకటయ్యగౌడ్ ఆమనగల్లు: అయ్యసాగరం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల్లో హెర్బల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని ఆమనగల్లు అటవీశాఖ రేంజ్ అధికారి వెంకటయ్యగౌడ్ అన్నారు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. డీఎఫ్ఓ రోహిత్ ఆదేశాల మేరకు పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. శ్రీశైలం నుంచి వచ్చే పర్యాటకులు, ఈ ప్రాంత ప్రజలు సేద తీరేందుకు పార్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ పార్క్లో 15 కిలో మీటర్లు, 4 కి.మి., 2 కి.మి దూరంలో 3 వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. హోటల్స్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తల్లీకుమారుల అదృశ్యం మీర్పేట: భర్తతో గొడవపడిన మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్పేట లోకాయుక్తకాలనీలో నివాసముండే రమేష్, అనూష(36)లు భార్యాభర్తలు. వీరికి ఆర్యన్(6), సూయాన్(3) కుమారులు ఉన్నారు. ఈనెల 20వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అనూష ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త రమేష్ బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలు, బ్యాంకు సేవలపై అవగాహన కందుకూరు: ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధి మీర్ఖాన్పేటలో సైబర్ నేరాలు, బ్యాంకు సదుపాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ సైబర్ నేరాల గురించి వివరించారు. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు ఏవిధంగా జరుగుతున్నాయో అవగాహన కల్పించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఎస్బీఐ మేనేజర్ ఆర్ఎల్ఎన్ శాస్త్రి బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. 18 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ.20 చెల్లించి వ్యక్తిగత ప్రమాద బీమా చేసుకోవాలని సూచించారు. రూ.436 చెల్లించి జీవన జ్యోతి బీమా పథకంలో చేరవచ్చని తెలిపారు. బీమా పొందిన వారు మృతి చెందితే రూ.2 లక్షలు నామినీకి అందుతుందన్నారు. అనంతరం ప్రమాద బీమాలో సభ్యులుగా ఉండి మరణించిన వారికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ సైదులు, నాయకులు వై.వెంకటేశ్, మల్లేశ్ యాదవ్, ఎస్కే రఫియా, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కల్లుగీత సహకార సంఘం నియామకం కడ్తాల్: ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మర్రిపల్లిలో బుధవారం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్ఐ చంద్ర కిరణ్ పర్యవేక్షణలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం గ్రామ అధ్యక్షుడిగా యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా రాములుగౌడ్, కార్యదర్శిగా ఎన్.పెద్దయ్యగౌడ్, డైరెక్టర్లుగా నర్సింహగౌడ్, జంగయ్యగౌడ్ నియమితులయ్యారు. నూతన కమిటీకి సీఐ బద్యానాథ్ చౌహాన్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు నూతనకమిటీని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశ్గౌడ్, మల్లేశ్గౌడ్, నారాయణగౌడ్ జంగయ్యగౌడ్, హెడ్ కానిస్టేబుల్స్ శంకర్, చానాగౌడ్ పాల్గొన్నారు. -
మల్బరీ సాగుతో సుస్థిర ఆదాయం
ఆమనగల్లు: రైతులు సంప్రదాయ పంటలతో పాటు మల్బరీ సాగు చేసి ఏడాది పొడవునా సుస్థిర ఆధాయం పొందవచ్చని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. తలకొండపల్లి మండలం కోరింతకుంటతండాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమ రిసోర్స్ సెంటర్ను బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పండ్ల తోటలు, కూరగాయలు, పట్టు పరిశ్రమ, ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన, మల్బరీ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సబ్సిడీలు అందిస్తున్నాయని చెప్పారు. వీటిని వినియోగించుకుని రైతులు మల్బరీ సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆరుతడి పంటలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. పట్టుసాగుతో స్వల్ప కాలంలో దిగుబడి చేతికి వస్తుందని, మార్కెటింగ్కు ఇబ్బందులు ఉండవని ఆమె సూచించారు. పట్టుసాగుపై జిల్లాలో ఇటీవల రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత, జిల్లా అధికారి సురేశ్, ఏడీ నాగరత్నం, రిసోర్స్ సెంటర్ నిర్వాహకుడు సక్రునాయక్, అధికారులు హిమబిందు, సౌమ్య పాల్గొన్నారు.రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా -
మా గ్రామంలో బెల్టుషాపులు వద్దు
కొందుర్గులో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్తులు కొందుర్గు: మండల కేంద్రమైన కొందుర్గులో బెల్టు దుకాణాల తొలగింపునకు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని కాలనీల్లో కిరాణ దుకాణాల్లో మద్యం విక్రయిస్తున్నారని, వాటిని తొలగించాలని గ్రామస్తులు కోరారు. బెల్టు షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బెల్టు దుకాణాలు తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం వైన్స్ షాపులకు వెళ్లి బెల్టు దుకాణాలకు మద్యం విక్రయించవద్దని సూచించారు. అనంతరం తహసీల్దార్ ఆజాం అలీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
టాలెంట్ టెస్టులతో మేథోశక్తి పెంపు
మొయినాబాద్: విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి మనోవిజ్ఞానాన్ని పెంపొందించేందుకు టాలెంట్ టెస్టులు దోహదపడతాయని ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచయ్య అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల సాంఘిక శాస్త్రం ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు భవిష్యత్తులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి టెస్టులు నిర్వహించి విద్యార్థుల్లో మనో విజ్ఞానాన్ని నింపాలన్నారు. టాలెంట్ టెస్ట్ నిర్వహించిన ఎస్ఆర్పీలు లలితారెడ్డి, సక్కుబాయ్లను అభినందించారు. మొదటి బహుమతి శిరీష, ద్వితీయ బహుమతి హమన్, తృతీయ బహుమతి శ్రీధర్, కన్సల్టేషన్ బహుమతి శాలిని గెలుచుకున్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బందయ్య, అసోసియేట్ అధ్యక్షుడు రాములు, ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, వినోద్, పద్మ, తుకారాం, రవి, జ్యోతి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ బడులపై చర్యలు తీసుకోండి
తుర్కయంజాల్: వసంత పంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించిన కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి పి.శివకుమార్గౌడ్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పండుగల పేర్లను చెప్పి, ప్రజలను సెంటిమెంట్తో రెచ్చగొట్టి అడ్మిషన్లు ప్రారంభించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పూర్తిగా విస్మరిస్తూ, ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వేదికగా, భారీ ఫ్లెక్సీలతో పలు పాఠశాలలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయని గుర్తుచేశారు. వసంత పంచమి పేరుతో జరుగుతున్న అడ్మిషన్ల దందాపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరికృష్ణానాయక్, శివ, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి శివకుమార్గౌడ్ వసంత పంచమి పేరుతో అడ్మిషన్లు చేపడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి– ఏఐవైఎఫ్ -
పాత సిబ్బందినే కొనసాగించండి
మంచాల: మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో కొన్నేళ్లుగా వంట చేస్తున్న కార్మికులను మాత్రమే కొనసాగించాలని సీఐటీయూ(మధ్యాహ్న భోజన పథకం యూనియన్) జిల్లా అధ్యక్షురాలు వై.స్వప్న అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానోపాధ్యాయుడు గిరధర్గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అన్ని పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారిందన్నారు. అధికారులు కొత్తగా వంట సిబ్బందిని తీసుకోవాలనే నిర్ణయం విరమించుకోవాలన్నారు. పాత సిబ్బంది 20 ఏళ్లుగా అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించారని చెప్పారు. నేడు పాత వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజనం పథకం యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, సరిత తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పేరు మార్పు అన్యాయం
షాబాద్: పూర్వపు ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చి కేంద్రం ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీంభరత్ ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం మండల పరిధిలోని కుర్వగూడ ఉపాధిహామీ కూలీలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఉన్న పథకాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగా గాంధీజీ పేరు తొలగించిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకురాళ్లు స్వరూప, అశ్విని, మహేశ్వరి, కవిత, అమృత తదితరులున్నారు. -
భారతి సిమెంట్తో నిర్మాణం వేగం
బడంగ్పేట్: సిమెంట్ రంగంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5 స్టార్ గ్రేడ్ను తెలంగాణలో విడుదల చేసిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. బుధవారం బడంగ్పేటలోని కనకదుర్గ స్టీల్ హౌస్లో తాపీమేసీ్త్రల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫస్ట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జీలు, రహదారులకు సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందచేస్తామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడతారని తెలిపారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్ రూ.20 రూపాయలు అధికంగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా బిల్డర్లకి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను 20 మందికి అందజేశారు. కార్యక్రమంలో డీలర్ కొండల్రెడ్డి, కాంట్రాక్టర్లు, తాపీమేసీ్త్రలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగిరం చేయండి మంచాల: తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి పనులను వేగిరం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం ఆయన పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల మైదానంలో అదనంగా రెండు అంతస్తుల భవనాలు, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు అథ్లెటిక్స్కు అనుగుణంగా మైదానం ఏర్పాటు చేయాలన్నారు. మైదానంలోని విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి
మాజీ మంత్రి సబితారెడ్డి శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఆమె నివాసంలో మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ దండు సంతోశ్, మహేశ్ సబితారెడ్డి, యువనేత కార్తీక్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీల అమలులో విఫలమైన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో శంకర్పల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, నాయకులు నర్సింలు, ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. -
మాంసాహార జంతువుల గణన
వివరాలు సేకరిస్తున్న అటవీశాఖ అధికారులు యాచారం: ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా బుధవారం గునుగల్ అటవీ ప్రాంతంలో సర్వే నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని గునుగల్, ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతాల్లో రెంజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి, యాచారం సెక్షన్ అధికారి నర్సింహల సమక్షంలో సర్వే చేపట్టారు. 21, 22 తేదీల్లో మాంసాహార జంతువుల సర్వే, 23, 24, 25 తేదీల్లో శాఖహార జంతువుల సర్వే చేపడుతామని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఏఏ జంతువులు సంచరిస్తున్నాయి. వాటి సంరక్షణ ఎలా ఉంది, ఇబ్బందులేమైన పడుతున్నాయా, రక్షణ చర్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్వే చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలో మొత్తం జంతువుల సర్వే గణన చేపడుతామని జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్రెడ్డి తెలిపారు. శ్రీశైలం, మన్నానూర్ అటవీ ప్రాంతాలు.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాలకు లింకు ఉండడంతో చిరుత పులులేమైనా వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28,627 హెక్టార్లు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో జంతువుల సర్వే గణన జరుపుతామని ఆయన వివరించారు. ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో.. చేవెళ్ల: జీవ వైవిధ్యాన్ని, అడవుల పరిరక్షణ లక్ష్యాలను అంచనా వేసేందుకు ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా సర్వే చేపడుతున్నట్లు చిలుకూరు–ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మణ్ అన్నారు. మండల పరిధిలోని ముడిమ్యాల ఫారెస్ట్లో బుధవారం మాంసాహార జంతువుల గణన చేపట్టారు. మూడు రోజులు చొప్పున లైన్ ట్రాంజెక్ట్, ట్రయల్ పాత్ సర్వే చేస్తూ డాటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాలు సేకరించి నివేదికను ఫారెస్ట్ ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్, ఫారెస్ట్ వాచర్ విజయ్ పాల్గొన్నారు. -
‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
కడ్తాల్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీయూఎఫ్ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని వీబీ జీ రామ్ జీ గాపేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం మండల పరిధిలోని చరికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం ప్రధాని మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. గాంధీజీ ప్రతిష్టను దెబ్బతీసేందకు బీజేపీ ఇష్టారాజ్యంగా పేరుమార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం నిధులు కేటాయించాలనే నిబంధనను తీసుకువచ్చి పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు మహేందర్గౌడ్, కరుణాకర్గౌడ్, రవి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములుగౌడ్, వెంకటయ్యగౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. టీయూఎఫ్ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
రూ.10 లక్షలు మింగేశారు
బడంగ్పేట్: పేద విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన పీఎం స్కీం నిధులు మాయమవుతున్నాయి. విద్యార్థుల అభివృద్ధికి కేటాయించిన రూ.10లక్షల నిధులను స్వాహా చేసి తప్పుడు బిల్లులు సృష్టించి ఆడిట్కు వచ్చిన వారిని సైతం బోల్తా కొట్టించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఇది గమనించిన ఓ ఉపాధ్యాయుడు సోమవారం ఆధారాలతో సహా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. విద్యార్థులను టూర్కు తీసుకెళ్లామని.. బడంగ్పేట జెడ్పీహెచ్ఎస్లో గత ఏడాది గుర్రం జగదీశ్వర్రెడ్డి ఎఫ్ఏసీ హెచ్ఎంగా పనిచేశారు. (ప్రస్తుతం తుప్రాన్పేటలో జీహెచ్ఎం) ఇదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడి సహకారంతో పీఎం శ్రీ నిధుల గోల్మాల్కు పథకం వేశాడు. గ్రీన్ స్కూల్ క్షేత్ర పర్యటన పేరుతో విద్యార్థులను కాలేశ్వరం టూర్కు తీసుకు వెళ్లామని.. అందుకు స్నాక్స్కు, చిలుకూరు ఉస్సేన్ ట్రావెల్స్కు, పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించామని, సైన్స్ ఫెయిర్లు ఏర్పాటు చేశామని ఇలా తప్పుడు పత్రాలు జత చేసి రూ.10లక్షలు కాజేశారు. కాగా విద్యార్థులను లక్నవరం వంతెన, జూపార్కు క్షేత్ర పర్యటన తీసుకెళ్తామని ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.వేయి వరకు వసూలుచేశారు. కాగా జగదీశ్వర్రెడ్డిని సస్పెండ్ చేసి ఖాజేసిన నిధులు రాబట్టాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘పీఎం శ్రీ’నిధులు కాజేసిన ప్రధానోపాధ్యాయుడు క్షేత్రపర్యటన పేరిట తప్పుడు రసీదులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బడంగ్పేట్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు హెచ్ఎం జగదీశ్వర్రెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ -
ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు రామారావు ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు నెలల పాటు నిర్వహించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ నిర్వహించే 2025–26కు గాను స్టేట్ సర్వీసెస్, కానిస్టేబుల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు, స్టడీ మెటీరియల్స్ అందజేస్తామన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్టడీ సర్కిల్ నుంచి కోచింగ్ తీసుకున్నవారు అనర్హులని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 8న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ఎల్.వెంకటయ్య హనరరీ డైరెక్టర్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నంబర్ 94405 21419లో సంప్రదించాలన్నారు. 27న హయత్నగర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం బోధించేందుకు గెస్ట్ లెక్చరర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు రసాయన శాస్త్రంలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పీహెచ్డీ, ఎన్ఈటీ, ఎస్ఈటీ, ఎస్ఎల్ఈటీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 24 తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. హయత్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్ మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఆయన బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఖాజా మొయిజుద్దీన్ బైంసాకు బదిలీ మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఖాజా మొయిజుద్దీన్ నిర్మల్ జిల్లా బైంసాకు బదిలీ అయ్యారు. నూతన మున్సిపాలిటీకి తొలి కమిషనర్కు వచ్చిన ఆయన ఏడాదిలోనే వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. ఆగస్టు 15న వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయకపోవడంతో చిలుకూరు వాసులు ఆయన్ను నిలదీశారు. స్థానికులపై ఆయన దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన ప్రజలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేయడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల పెద్దమంగళారం రెవెన్యూలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతలోనూ ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. డీసీ త్రిల్లేశ్వర్రావు డీసీఎంఏ కార్యాలయానికి.. బడంగ్పేట్: సర్కిల్–16కు డీసీగా వ్యవహరిస్తున్న త్రిల్లేశ్వర్రావును బుధవారం సీడీఎంఏ కార్యాలయానికి బదిలీ చేశారు. జీహెచ్ఎంసీలో బడంగ్పేట, మీర్పేట కార్పొరేషన్లను బడంగ్పేట సర్కిల్–16 పేరుతో ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇక్కడ మొదటి డిప్యూటీ కమిషనర్గా వచ్చిన త్రిల్లేశ్వర్రావు బడంగ్పేట కమిషనర్గా ఉన్న సమయంలో అవినీతి మరకలు ఉన్నాయి. ఆయన బదిలీపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్కు ధన్యవాదాలు తెలిపారు. పట్నంకు సుదర్శన్ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణరెడ్డి బుధవారం పదోన్నతిపై జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఇక్కడికి రానున్నారు. -
ఇళ్ల నిర్మాణం డల్
గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిర్మాణ ఖర్చులు ఇందిరమ్మ ఇళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన మేసీ్త్ర కూలీలు, స్టీలు, సిమెంట్, ఇసుక ధరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముందరి కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. ఫలితంగా నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారుల్లో ఇప్పటికీ పలువురు ముగ్గు కూడా పోయలేదు. మెజార్టీ నిర్మాణాలు బేస్మెట్ లెవల్ కూడా దాటలేదు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయానికి.. క్షేత్రస్థాయిలో ఖర్చులకు పొంతన ఉండడం లేదు. దీంతో మెజార్టీ లబ్ధిదారులు చేపట్టిన నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు మొత్తం 17,675 ఇళ్లు కేటాయించగా, వీటిలో 15,543 ఇళ్లు మంజూరు చేసింది. 13,193 ఇళ్లకు మార్కింగ్ చేసి, ఆన్లైన్ ట్యాగింగ్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. కాగా పెరిగిన ధరలకు భయపడి ఇప్పటి వరకు 2,350 మంది ముగ్గు కూడా పోయలేదు. 10,327 నిర్మాణాలు ఇప్పటికీ బేస్మెట్ లెవల్లోనే నిలిచిపోయాయి. కేవలం 355 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు పూర్తి చేశారు. నిర్మాణాలకు వెనుకడుగు ● చేవెళ్ల నియోజకవర్గానికి 2,800 ఇళ్లు కేటాయించగా, వీటిలో 2,491 ఇళ్లకు పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. నియోజకవర్గంలోని చేవెళ్ల, నార్సింగి, శంకర్పల్లి మున్సిపాలిటీలు సహా జన్వాడ, మిర్జాగూడలో 650 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 132 మంది లబ్ధిదారులు ఇప్పటికీ ముగ్గు పోయలేదు. 106 ఇళ్లు బేస్మెట్ లెవల్లోనే ఉన్నాయి. ఇదే నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2,150 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 225 మంది లబ్ధిదారులు ముగ్గు పోయలేదు. మరో 338 నిర్మాణాలు బేస్మెట్ లెవల్ కూడా దాటలేదు. ● ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, వీటిలో 3,397 మంజూరయ్యా యి. ఆదిభట్ల, పెద్ద అంబర్పేట్, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,748 ఇళ్లు కేటాయించగా, మిగిలిన 1,752 ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు కేటాయించారు. వీటిలో 533 మంది లబ్ధిదారులు ముగ్గు కూడా పోయలేదు. 688 ఇళ్లు ఇప్పటికీ బేస్మెట్ స్థాయి దాటలేదు. ● కల్వకుర్తి నియోజకవర్గానికి 2,385 ఇళ్లు కేటాయించగా, 2180 మంజూరయ్యాయి. ఆమనగల్లు మున్సిపాలిటీకి 360 ఇళ్లు కేటాయించగా, మిగిలినవి రూరల్ ఏరియాలకు కేటాయించారు. ఇప్పటి వరకు ఇక్కడ 209 మంది ఇంకా ముగ్గు పోయలేదు. 437 నిర్మాణాలు కనీసం బేస్మెట్ లెవల్ దాటలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ● మహేశ్వరం నియోజకవర్గానికి 3,390 ఇళ్లు కేటాయించగా, వీటిలో 3,205 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. బడంగ్పేట్, జల్పల్లి, మీర్పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీలకు 1,018 ఇళ్లు కేటాయించగా, 862 ఇళ్లు మంజూరయ్యాయి. ఇక్కడ ఇప్పటి వరకు 836 మంది ముగ్గు కూడా పోయలేదు. 390 నిర్మాణాలు బేస్మెట్ దాటలేదు. ● రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 2,100 కేటాయించగా, వీటిలో 1,001 ఇళ్లకు మాత్రమే అనుమతులు లభించాయి. ప్రొసీడింగ్స్ అందుకున్న వారిలో 42 మంది ఇప్పటికీ ముగ్గు పోయలేదు. మరో 251 నిర్మాణాలు బేస్మెట్ కూడా దాటలేదు. ఇప్పటి వరకు ఇక్కడ 31 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ● షాద్నగర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, 3,269 మాత్రమే మంజూరయ్యాయి. 285 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు ముగ్గు కూడా పోయలేదు. 712 నిర్మాణాలు బేస్మెట్ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 35 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. పెరిగిన ముడిసరుకు ధరలతో పురోగతి నిల్ ఇప్పటికీ ముగ్గుపోయని 2,350 మంది లబ్ధిదారులు 10,327 నిర్మాణాలు బేస్మెట్కే పరిమితం ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లకుపైగా జమ చేసింది. కుటుంబ సభ్యులు చనిపోయి కొంత మంది, స్థల వివాదాలతో మరికొంత మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదు. ఇలాంటి వారిని గుర్తించి ఒత్తిడి తీసుకొస్తున్నాం. అయినా నిరాకరిస్తే వారి ప్రొసీడింగ్స్ రద్దు చేసి, వెయిటింగ్ జాబితాలో ఉన్నవారికి కేటాయిస్తున్నాం. ఆర్థిక స్థోమత లేని పేదలకు మహిళా పొదుపు సంఘాల నుంచి లోన్లు ఇప్పిస్తున్నాం. ఇసుక, ఇటుక, స్టీలు, సిమెంట్ సమస్య లేదు. ప్రభుత్వమే ఇసుక యార్డులను నిర్వహిస్తోంది. లబ్ధిదారులు కోరిన వెంటనే సరఫరా చేస్తుంది. 600 చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి నిర్మించే ఇళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం నిలిపివేస్తున్నాం. – చంప్లానాయక్, పీడీ, హౌసింగ్ -
ఫార్మర్ రిజిస్ట్రీ 56 శాతం మించలే!
15 మంది వీఏఓలకు షోకాజ్ నోటీసులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఫార్మర్ రిజిస్ట్రీ జిల్లాలో ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. ఇప్పటి వరకు 56 శాతం మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1.97 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటి వరకు 85 వేల మంది మాత్రమే తమ పేర్లు, భూములు, పంటల వివరాలను నమోదు చేయించారు. మెజార్టీ లబ్ధిదారులు గ్రామాల్లో ఉండకపోవడం, నగరంలో స్థిరపడటమే తక్కువ రిజిస్ట్రీకి కారణమని తెలిసింది. 60 వేల మంది రైతులు భూములను కలిగి ఉన్నప్పటికీ.. సాగుకు దూరంగా ఉన్న వాళ్లు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 15 మంది వీఏఓలకు రెండు రోజుల క్రితం జిల్లా వ్యవసాయశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం కొసమెరుపు. ప్రస్తుత యాసంగిలో 1.57 లక్షల ఎకరాల పంట సాగు అవుతుందని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు 1.19 లక్షల ఎకరాలు మాత్రమే సాగైనట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మొయినాబాద్రూరల్: సర్పంచ్లుగా గెలిచిన వారు గ్రామాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. బుధవారం సర్పంచ్ల సంఘం కమిటీ ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి సర్పంచ్లను సన్మానించి అభినందనలు తెలిపారు. పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. ఎంపీని కలిసిన వారిలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షకుడు ప్రవీణ్రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజేందర్రెడ్డి, పాషా, పద్మసంజీవరెడ్డి, పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
వసంత పంచమికి ఏర్పాట్లు
● ముస్తాబైన జ్ఞాన సరస్వతి ఆలయం ● రేపు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామిజీ చేతులమీదుగా సామూహిక అక్షరాభ్యాసం యాచారం: నందివనపర్తిలోని జ్ఞాన సరస్వతి ఆలయం వసంత పంచమి వేడుకలకు ముస్తాబైంది. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ శ్రీ పంచమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను శ్రీ జ్ఞాన సరస్వతి సేవా సమితి ట్రస్ట్, జ్ఞాన సరస్వతి సంస్థాన్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త సదా వెంకట్రెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఆలయ పూజారి రాఘవేంద్రశర్మ నిర్వహించే ఈ పూజలకు యువత స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం హోమం.. రాత్రి పల్లకీసేవ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో రేపు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ చిన్నారులతో అక్షరాలు దిద్దించి దీవెనలు అందించనున్నారు. జిల్లా వాసులతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అక్షరాభ్యాసానికి కావాలల్సిన పలక, బలపం, అమ్మవారి ఫొటో, ప్రసాదం ఆలయ కమిటీ అందజేస్తుంది. చిన్నారుల తల్లితండ్రులు తమలపాకులు, పూలు, పండ్లు, కుడక, 1.25 కేజీల బియ్యం, పసుపు, కుంకుమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యార్థులచే శ్రీ సరస్వతి హోమంరాత్రి ఏడు గంటల నుంచి పదో తరగతి విద్యార్థులతో అమ్మవారి పల్లకీ సేవ ఉంటుంది. అక్షరాభ్యాసం ఉంటే ఉదయం ఎనిమిది గంటల లోపే ఆలయానికి చేరుకోవాలని ఆలయ ధర్మకర్త సదా వెంకట్రెడ్డి తెలిపారు. -
రోడ్డు భద్రతపై అవగాహన
యాచారం: రోడ్డు భద్రతపై ప్రజలు దృష్టి సారించాలని యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మాల్ మార్కెట్లో మంగళవారం రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించే సమయంలో సరైన భద్రత చర్యలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, హెల్మెట్ లేకుండా బైక్పై వెళ్లరాదని సూచించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో అతి వేగంగా, నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కూడా రోడ్డు భద్రతపై వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాచారం తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ రాధారాణి, ఎస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయానికి స్థలం కేటాయించండి
మొయినాబాద్: అయ్యప్ప ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మండలంలోని పెద్దమంగళారం గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు తహసీల్దార్ గౌతమ్కుమార్కు విన్నవించారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వే నంబర్ 218 ప్రభుత్వ భూమిలో అయ్యప్ప దేవాలయం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంగళవారం స్థానికులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ నరోత్తంరెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, వీరారెడ్డి, ఓంరెడ్డి, ఉపేందర్రెడ్డి, అయ్యప్ప భక్తులు ఉన్నారు. రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంటర్ ఫర్ నాలెడ్జ్, కల్చర్ అండ్ ఇన్నోవేషన్ స్టడీస్ అధిపతి ప్రొఫెసర్ సి.రాఘవరెడ్డికి అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా(ఎన్ఐఎఫ్) కొత్త ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ సలహా కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని ఎన్ఐఎఫ్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాజ ఇంటర్ఫేస్లు, సమ్మిళిత అభివృద్ధికి సంబంధించిన సంస్థాగత విధానాల్లో ప్రొఫెసర్ రాఘవరెడ్డి నైపుణ్యాన్ని గుర్తించి ఈ అవకాశం కల్పించింది. కమిటీ చైర్మన్గా జేఎన్యూ ప్రొఫెసర్ మాధవ్ గోవింద్ని, సభ్యులుగా రాఘవరెడ్డిసహా ఆరుగురిని నియమించింది. హేట్ స్పీచ్ చట్టం తేస్తామనడం తగదు హిందూ లాయర్స్ ఫోరం పంజగుట్ట: రాష్ట్రంలో హేట్ స్పీచ్ బిల్లును తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించడం రాజ్యాంగం, ప్రజాస్వామిక పాలనకు విరుద్ధమని హిందూ లాయర్స్ ఫోరం పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం ప్రతినిధులు శివ స్వామి, రాధా మనోహార్ స్వామీజీ మాట్లాడుతూ సీఎం ఒక వర్గంవారిని సంతృప్తి పరిచేందుకే ఆ ప్రకటన చేశారని, ఈ బిల్లు వల్ల వర్గాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్పై బీఎన్ఎస్ చట్టంలో ఇప్పటికే సెక్షన్లు ఉన్నాయని అన్నారు. సమావేశంలో ఫోరం బాధ్యులు, హైకోర్టు న్యాయవాదులు శ్రీకృష్ణ, గోశాల శ్రీనివాస్, కె.భానుచంద్ర, భరద్వాజిని పాల్గొన్నారు. ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’పై శిక్షణ ఏజీ వర్సిటీ: పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలోని క్షేత్రస్థాయి పశువైద్యులకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, యాంటీ బయోటిక్ మందుల వినియోగంపై రెండు రోజుల శిక్షణను మంగళవారం వీసీ జ్ఞాన ప్రకాశ్ ప్రారంభించారు. సద్గురు ఫౌండేషన్, జెనెక్స్ యానిమల్ హెల్త్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) సహకారంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జ్ఞాన ప్రకాశ్ మాట్లాడుతూ పశువులకు అవసరం లేకున్నా మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడం సరికాదని, దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ కిషన్కూమార్ మాట్లాడుతూ పశువైద్యులు సరియైన చిక్సితా విధానాలను అవలంబిస్తేనే పశువుల ఆరోగ్యం నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియెట్ డీన్ మాధూరి, డాక్టర్ గోపాల్, సత్యనారాయణ, ఎం.సోనాలి తదితరులు పాల్గొన్నారు. చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి కుత్బుల్లాపూర్: బైక్ అదుపుతప్పి చెట్టును డీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. రాజన్న సిరిసిల్ల జిల్లా సత్రాజ్పల్లి గ్రామానికి చెందిన అక్కినపల్లి సుజీత్(22) మైసమ్మగూడలో ఉంటున్నాడు. మంగళవారం మైసమ్మగూడ నుండి స్నేహితుడు చంద్రారెడ్డితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో అపెరల్ రోడ్డులో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న సుజిత్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. -
మహాసభలను జయప్రదం చేయండి
యాచారం: అఖిల భారత మహిళా సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మస్కు అరుణ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చింతుల్ల గ్రామంలో మంగళవారం ఈనెల 25 తేదీ నుంచి 28వ తేదీ వరకు నగరంలో జరిగే సభలకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహా సభలను విజయవంతం చేయడం కోసం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సభలకు మాజీ ఎంపీ బృందా కారత్, అఖిల భారత మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి పీకె, ప్రధాన కార్యదర్శి ధావలే తదితరులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో మస్కు జ్యోతి, శ్యామల, పద్మజ, జంగమ్మ, సరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు అరుణ -
బకాయిలపై నజర్
30 లోపు చెల్లించండి పీఏసీఎస్లో దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు మార్చి 30లోపు అప్పు బకాయితో పాటు వడ్డీని కూడా చెల్లించండి. రైతుల్లో అవగాహన కోసం డీసీసీబీ ఉన్నతాధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రుణాలు చెల్లించకపోతే వారి ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. – నాగరాజు, సీఈఓ, పీఏసీఎస్ యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో రుణాలు పొందిన రైతుల నుంచి బకాయిల వసూల్ చేయడానికి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 30 లోపు బకాయిలు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. సకాలంలో చెల్లిస్తే సరే.. లేదంటే వడ్డీ పెరిగి మరింతా అప్పుకుప్పలాగా మారుతుందని తెలియజేస్తున్నారు. యాచారం పీఏసీఎస్లో 8,832 మంది రైతులు(సభ్యత్వం పొందిన) ఉన్నారు. వారిలో ఫౌల్ట్రీ, డెయిరీ, మేకల, గొర్రెల తదితర పథకాల కింద 938 మంది దీర్ఘకాలికం కింద రూ.45 కోట్ల రుణాలు పొందారు. తమ పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న భూమిని పీఏసీఎస్ మీద మార్టిగేషన్ చేసి ఒక్కో రైతు రూ.10 నుంచి రూ.20 లక్షలకు పైగానే రుణం పొందారు. రెండు నుంచి ఐదేళ్ల కాల వ్యవధిలో అప్పుతో సహా వడ్డీని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లక్ష్యం రూ.35 కోట్లు 2026–27 ఏడాదికిగాను వసూళ్ల టార్గెట్ లక్ష్యం రూ.35 కోట్లు పెట్టుకున్నారు. గతేడాది సైతం అనుకున్న విధంగా బకాయిలు వసూలు కాకపోవడంతో రైతులకు అపరాధ వడ్డీ అధికంగా పడింది. అంత భారాన్ని చెల్లించలేని దుస్థితికి చాలామంది వెళ్లారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని డీసీసీబీ, పీఏసీఎస్ అధికారులు సంయుక్తంగా స్పెషల్డ్రైవ్కు సంకల్పించారు. మార్చి 30 లోపు అప్పు వాయిదాతో కూడిన బకాయిని చెల్లించేలా రైతులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అప్పు వాయిదాలు చెల్లించని రైతులకు ఆ తర్వాత నోటీసులు జారీ చేసి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వసూల్ చేయాల్సిన టార్గెట్ రూ.35 కోట్లల్లో కనీసం రూ.20 కోట్లకు పైగా వసూల్ చేయకపోతే రుణాల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఇవ్వడం కష్టమేనని అధికారులు అంటున్నారు. పంట రుణాలు అంతే యాచారం పీఏసీఎస్లో వ్యవసాయ పంట రుణాలను కూడా రైతులు తీసుకున్నారు. 1,102 మంది రైతులు రూ.13 కోట్లకు పైగా పంట రుణాలను పొందారు. రైతులు సైతం మార్చి 30 లోపు రెన్యూవల్ లేదా.. వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేయించి వడ్డీ చెల్లిస్తే ఏడు శాతం, అదే గడువు దాటితే మాత్రం 13 శాతం వడ్డీ పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. మొత్తం రూ.13 కోట్ల పంట రుణాల్లో రూ.నాలుగు కోట్లకు పైగానే ఫార్మాసిటీకి భూములిచ్చిన నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద రైతులతో పాటు అసైన్డ్, పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్ వేసిన మొండిగౌరెల్లి రైతులు ఉన్నారు. పీఏసీఎస్లో అప్పు వసూలుకు స్పెషల్ డ్రైవ్ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు చెల్లించాలని సూచన రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు -
ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లింది.. ఫోన్ స్విచ్ఛాప్!
హైదరాబాద్: దర్గా దర్శనానికి వెళ్లిన నవ వధువు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ ఉమర్ కాలనీకి చెందిన షేక్ జమీర్ అలీ వివాహం కతీజా సాది(19)తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 18వ తేదీనా మధ్యాహ్నం 3 గంటలకు జమీర్ అలీ తల్లి సాబేరా బేగం, వదిన అంజుమ్, భార్య కతీజా లు పహాడీషరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లారు. దర్శనమనంతరం ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన కతీజా తిరిగి రాలేదు. ఆమె ఫోన్ సైతం స్విచ్ఛాప్ వచ్చింది. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో, అదే రోజు రాత్రి ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
ఎకరాకు ఒక్క బస్తా మాత్రమే
కందుకూరు: యాసంగి పంటల సాగు కోసం అవసరమైన యూరియా కొనుగోలుకు రైతులు కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. మంగళవారం 450 బస్తాల యూరియా రాగా ఒక్కో ఎకరాకు ఒక బస్తా చొప్పున అధికారులు సరఫరా చేశారు. మొక్కజొన్న, వరి పంటల కోసం యూరియాను అధికంగా వినియోగిస్తారు. చాలా మంది పంటలు ఇంకా నారుమళ్ల స్థాయిలోనే ఉండగా, మున్నుందు దొరికదనే భావనలో యూరియా కొనుగోలు చేయడానికి ముందస్తుగా వస్తున్నారు. దీంతో పీఏసీఎస్ కార్యాలయంలో ఆన్లైన్లో వేలిముద్ర ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉండటంతో క్యూలో నిరీక్షిస్తున్నారు. -
రసీదు ఇచ్చి.. శాంతపరిచి
మంచాల: గ్రామాల్లో ఓ వైపు వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మరో వైపు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా 1,800 బస్తాల యూరియా అందజేశారు. అయినా గ్రామాల్లో చాలా చోట్ల వరి నాట్లు పడలేదు. నాట్లు పడిన పొలాల్లో కలుపు సైతం తీయలేదు. దీంతో సరిపడా యూరియా దొరకడం లేదని కర్షకులు వాపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామునే గ్రామాల నుంచి వచ్చి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు. ఇస్తారనే ఆశతో గత మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. పీఏసీఎస్ సిబ్బంది రసీదులు కూడా పంపిణీ చేసింది. వాటిని చేతబట్టిన రైతులు యూరియా కోసం ఎదురు చేస్తున్నారు. ఇప్పటికై నా సకాలంలో ఎరువులు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదే విషయంపై మండల వ్యవసాయాఽధికారి వెంకటేశంను వివరణ కోరగా.. కచ్చితంగా యూరియా వస్తుందని చెప్పారు. రాగానే అందరికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. యూరియా కోసం రైతుల పడిగాపులు మంచాల పీఏసీఎస్ కేంద్రంలో ఉదయం నుంచే క్యూ మూడు రోజులుగా అవస్థలు పడుతున్న కర్షకులు -
చెత్త వేస్తే జరిమానా విధిస్తాం
మీర్పేట: రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విఽధిస్తామని బడంగ్పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వరరావు హెచ్చరించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మంగళవారం మీర్పేట, జిల్లెలగూడ, ప్రశాంతిహిల్స్ డివిజన్లలో ఆయన పర్యటించారు. బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేయరాదని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోల్లో వేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ అవగాహన కల్పించారు. అదే విధంగా 58 డివిజన్ బాలాపూర్ చౌరస్తాలోని ప్రధాన రహదారి, 59 డివిజన్ జిల్లెలగూడ ప్రధాన రహదారి, 60వ డివిజన్లోని భారత్ పెట్రోల్ బంకు వద్ద చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. కార్యక్రమంలో శానిటేషన్ డీఈ అభినయ్కుమార్, ఏఈ గంగాప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, జూనియర్ అసిస్టెంట్ నర్సింహ, పర్యావరణ ఇంజినీర్ రాము, జవాన్లు ఉన్నారు. -
న్యాయమైన పరిహారానికి కృషి
● భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ● గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూ నిర్వాసితులతో సమావేశం కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రేడియడ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల నిర్వాసితులతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎకరాకు రూ.30 లక్షల పరిహారం, ఒక ప్లాట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉందని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. భూసేకరణ విధి విధానాలు, న్యాయపరమైన నష్ట పరిహారం ప్రకటించడకుండా సేకరణ చేపట్టడం తగదన్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా ఎకరాకు రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటుకు కృషి చేస్తానని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, ఎస్ఐ వరప్రసాద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
అవగాహనతో ప్రమాదాల నివారణ
మొయినాబాద్: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా, మద్యం తాగి వాహనాలు నడపడంతోపాటు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడమే అని ఎమ్మెల్సీ, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని జేపీఎల్ కన్వెన్షన్లో మంగళవారం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ పేరుతో డ్రైవర్లు, యువతకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా సుమారు 26 వేల ప్రమాదాలు జరుగుతూ సుమారు 8 వేల మంది మరణిస్తునారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో 83 శాతం 18–63 ఏళ్ల వయసువారేనన్నారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం టాప్ 10లో ఉండటం బాధాకరమన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు ప్రమాదకరమైన రోడ్లను బాగుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకోసం ద్విచక్ర వాహనదారులకు వెయ్యి హెల్మెట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. డీసీపీ యోగేష్గౌతం మాట్లాడుతూ.. డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండొద్దని.. వాహనంలో ఉన్నవారితోపాటు మీ ప్రాణాలు కూడా మీచేతుల్లోనే ఉంటాయన్నారు. అనంతరం ప్రమాదాల నివారణకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఏసీపీలు కిషన్, చంద్రశేఖర్, జిల్లా రవాణాశాఖ అధికారి సాయి కృష్ణవేణి, ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
పైసామే పవర్!
బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026షాద్నగర్: ఎన్నికల బరిలో నిలవాలన్నా.. ప్రత్యర్థిపై గెలవాలన్నా.. మందీమార్బలంతోపాటు ఆర్థిక బలం ఉండాల్సిందే.. రూ.వేలు రూ.లక్షలు దాటి ఎన్నికల ఖర్చు రూ.కోట్లకు చేరింది. చైర్మన్ పీఠాలు, కౌన్సిలర్ పదవులు సాధించాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఇందుకు గాను ప్రధాన పార్టీలు ఆర్థికంగా కాస్తా బలంగా ఉన్న అభ్యర్థులనే మున్సిపల్ ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నాయి. అన్ని పార్టీలు పార్టీ ఫండ్తోపాటు స్వయంగా ఖర్చు చేసే నేతల వైపు చూస్తున్నాయి. అర్థబలం, అంగబలం ఉన్న వారిని బరిలో దింపితే ఎన్నికల ఖర్చుకు వెనుకాడరనే అభిప్రాయం అందరిలో ఉంది. పదవి కోసం ఎంతైనా.. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నియోజకవర్గాల ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఖర్చు చేశారంటే అతిశయోక్తి కాదు. చాలా గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చెల్లించిన వారు ఉన్నారు. తమ పదవి కోసం కోట్ల రూపాయలు వెచ్చించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకానుంది. ఈ లెక్కన ఒక్కో వార్డులో సుమారు రూ.25 లక్షల దాకా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక బలం ఉన్న నేతల కోసం మున్సిపల్ ఎన్నికల్లో ఆర్థిక బలం ఉన్న నేతలను బరిలో దింపేందుకు ప్రధాన పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. ధన బలంతో పాటు, ప్రజా బలం కూడా పరిగణలోకి తీసుకొని టికెట్లు ఇస్తామని అధిష్టానాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని రకాలుగా బలమైన వారినే బరిలోకి దింపితేనే విజయం సాధిస్తామనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రజా బలం కోసం ఆశావహులు కొందరు ఇప్పటికే కాలనీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో నిలబడుతున్నామని, తమకు మద్దతు తెలపాలని ఓటర్లను వేడుకొంటున్నారు. తమవైపు తిప్పుకొని విందులు ఇవ్వడం ప్రారంభించారు. ఆర్థిక బలం ఉంటేనే ఎన్నికల బరిలోకి.. అలాంటి అభ్యర్థులవైపే ప్రధాన పార్టీల మొగ్గు డబ్బుల సర్దుబాటు కోసం ఆశావహుల ప్రయత్నాలు షెడ్యూల్ వచ్చేసరికి పోగుచేసుకునే పనిలో నేతలు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎలాగైనా పోటీ చేయాలనుకునే వారు డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఓవైపు టికెట్ కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్న వారు ఎక్కువ మొత్తం భరించాల్సిన పరిస్థితి నెలకొంది. క్యాంపుల ఏర్పాటు, కౌన్సిలర్ల మద్దతు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండటంతో చాలామంది నేతలు డబ్బుల కోసం వేట ప్రారంభించారు. షెడ్యూల్ వచ్చేలోపు డబ్బులు సిద్ధం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
పేదలకు ‘ఉపాధి’ని దూరం చేసే కుట్ర
● అందుకే పథకానికి పేరు మార్పు ● డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ● చేవెళ్ల మండలం ఆలూరులో నిరసన చేవెళ్ల: పేదలకు ఉపాధిని అందించే ఉపాధి హామీపథకాన్ని వీబీజీ రామ్జీ పేరుతో దూరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరులో 2004లో ఉపాధి హామీ పథకం ప్రారంభించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వేసిన పైలాన్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రతిపల్లెలో తిరిగి ఉపాధి హామీ చట్టం రద్దుతో జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ, బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలంటూ అవగాహన, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఈపథకం ద్వారా సోనియాగాంధీ, రాహుల్గాంధీ కుటుంబానికి పేరు వస్తుందనే పేరు మార్చి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కొత్తగా వీబీజీ రామ్జీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించాలనే నిబంధన తీసుకు రావాలని చెప్పడం వెనుక పథకాన్ని నీరుగార్చే ఉద్దేశం ఉందని తేటతెల్లమవుతోందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన బీంభరత్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బి.జ్ఞానేశ్వర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ రాచమొళ్ల సిద్దేశ్వర్, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్రెడ్డి, మండల అధ్యక్షుడు వీరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిష్టానం ప్రత్యేకంగా నిర్వహించే సర్వే ఆధారంగా గెలిచే వారికే టికెట్ల కేటాయింపు ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ల టికెట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్చార్జి, ముఖ్యమంత్రి పరిశీలించి కేటాయిస్తారన్నారు. టికెట్ల కేటాయింపు కమిటీలో జిల్లా అధ్యక్షుడు కన్వీనర్గా, ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్చార్జి, ఎంపీ, జిల్లాలో ముఖ్యనాయకులు ఉంటారన్నారు. వారంతా కలిసి అధిష్టానం నిర్వహించే సర్వే ఆధారంగా గెలిచే వ్యక్తులకే టికెట్లు కేటాయింపు చేయనున్నట్టు వివరించారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. -
సహాయ ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు సహాయ ఉపకరణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్తో కూడిన వీల్చైర్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించనున్నట్టు తెలిపారు. అర్హులైనవారు ఈనెల 21 నుంచి 30వ తేదీ లోపు ఓబీఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తుక్కుగూడ: గ్రామీణ క్రీడాకారులను ప్రంపచ చాంపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి అన్నారు. తుక్కుగూడ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీఎం కప్ 2025–26 గ్రామస్థాయి క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. పల్లెల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే సీఎం కప్ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. విజేతలకు ట్రోఫీలతో పాటు, నగదు బహుమతులు అందిస్తామన్నారు. కా ర్యక్రమంలో ఎంఈఓ కస్నానాయక్, హెచ్ఎం భాస్కర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యాచారం: వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ.. యాచారం పంచాయతీ పరిధిలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు 70కిపైగా వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారన్న సమాచారం మేరకు స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అదులాపురం గౌతమ్, నుడావత్ప్రీతి, ఈలప్రోల్ అనిత, ఈలప్రోల్ భానుప్రకాశ్రావు, మూల రజిని మంగళవారం యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మేనకాగాంధీకి సైతం ఫోను ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆమె కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేశారు. కలెక్టర్ యాచారం సీఐకి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి కిషన్ను సంప్రదించగా తాను ఐదు రోజుల పాటు సెలవులో ఉన్నట్లు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: ఐటీ సెక్టార్లోని దుర్గం చెరువు నుంచి వెలువడుతున్న దుర్గంధాన్ని దూరం చేయడంపై హైడ్రా దృష్టి పెట్టింది. మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువును పరిశీలించారు. సగం వరకు గుర్రపు డెక్క పెరగడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాట్ (ఎస్టీపీ) ఉన్నా వరద కాల్వ ద్వారా మురుగు నీరు నేరుగా కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీపీల సామర్థ్యానికి మించి వచ్చే మురుగును కాల్వల్లోకి మళ్లించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖ, రహేజా మైండ్స్పేస్, ఎస్టీపీల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడమే దుర్గంధానికి కారణ మని పేర్కొన్నారు. అనంతరం హైడ్రా కార్యాలయంలో చెరువు పరిరక్షణ బాధ్యతలు చేప ట్టిన సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. వరద కాల్వలోకి మురుగు నీరు వెళ్లకుండా పైపులైన్ డైవర్షన్ పనులు చేపట్టడానికి జలమండలికి ఉన్న ఇబ్బందులకు పరిష్కారం చూపారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్తో మాట్లాడిన రంగనాథ్ ట్రాఫిక్ మళ్లింపుల అమలుకు సహకరించాలని కోరారు. రహేజా సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఇనార్బిట్ మాల్, నెక్టర్ గార్డెన్స్ సహా చెరువు పై భాగంలో ఉన్న ఐటీ సంస్థల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా పడమరవైపు కాల్వ తవ్వేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: పోలీసుల ఎదుటే తనపై దాడి చేసి, నానా బూతులు తిట్టి, తన కుమారుడిని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పడాల కరాటే కళ్యాణి (సినీనటి) మంగళవారం ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించింది. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం సాక్షిగా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న కాస ప్రవీణ్, సిద్దమోని నరేందర్ అమాయకులను ఆసరాగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారని.. హిందూ ధర్మంకోసం పోరాడుతుంటే తనపై దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది. అమాయకులను వలలో వేసుకొని లక్కీ డ్రాల పేరుతో మోసం చేస్తున్నారని ఈనెల 14న పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బెట్టింగ్యాప్ లక్కీడ్రా నిర్వాహకుల స్థావరం గుర్తించారు. ఆదిబట్ల సమీపంలోని కొంగరకలాన్ వద్ద ఓ విల్లాలో ఉండగా పంజాగుట్ట పోలీసులతో కలిసి కరాటే కళ్యాణి వెళ్లింది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రశ్నిస్తుండగా ఆమైపె ప్రవీణ్, నరేందర్ అనే బెట్టింగ్ నిర్వహకులు, వారి ముఠా దాడి చేసినట్లు తెలిపింది. లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదిబట్ల సీఐ రవికుమార్, ఎస్ఐ సత్యనారాయణను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నరేందర్ క్రేజీ బాయ్స్ పేరుతో చౌటుప్పల్లో బట్టల దుకాణం నడిపిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం లక్కీ డ్రా తీస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. ఆదిబట్ల ఠాణాలో కరాటే కళ్యాణి ఫిర్యాదు -
పర్యావరణంపై అవగాహన పెంచాలి
కడ్తాల్: పర్యావరణంలో వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సామాజికవేత్త సూదిని పద్మారెడ్డి అన్నారు. అన్మాస్పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్లో కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవాతవరణ మార్పులు–పర్యావరణ సుస్థిరతశ్రీ అంశంపై రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 149 డిగ్రీ కళాశాలలకు చెందిన అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లకు నిర్వహించిన అవగాహన సదస్సు మంగళవారంతో ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సూదిని పద్మారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులతో పాటు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే పర్యావరణ, వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. అనంతరం ప్రొఫెసర్లు, అధ్యాపకులకు సర్టిఫికెట్స్ అందజేశారు. సీజీఆర్ సంస్థ పర్యావరణ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి, వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ సాయిభాస్కర్రెడ్డి, సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లెనిన్బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ జగన్, డాక్టర్ వసంతలక్ష్మి, డాక్టర్ ప్రియాకుమారి, డాక్టర్ ఆనీ షీరాన్, డాక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు. -
టైరు మారుస్తుండగా..
ఇబ్రహీంపట్నం రూరల్: పంక్చర్ అయిన టైరును మారుస్తుండగా లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఓ అభాగ్యుడిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్పై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 12 వద్ద నారాయణ బాలికల హాస్టల్ సమీపంలో టాటా ఏసీ టైరు పంక్చర్ అయింది. దీంతో డైవర్ దీలిప్ వాహనాన్ని పక్కకు నిలిపి సహాయకుడు వెంకట్రెడ్డితో టైర్ మార్చుతున్నారు. అంతలోనే వెనకాల నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దిలీప్(28) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. మరోవైపు వెంకట్రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని రాగన్నగూడ సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ సాగిస్తున్నారు. ● దూసుకొచ్చిన మృత్యువు ● ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం ● ఒకరి దుర్మరణం, మరొకరికి గాయాలు -
టోల్ప్లాజా సిబ్బందికి శిక్షణ
కడ్తాల్: జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులతో స్నేహపూర్వకంగా మెలగాలని ఎన్హెచ్ఏఐ హెచ్ఎల్ఎఫ్పీపీటీ శిక్షణ నిపుణులు అవినాశ్ కోహ్లీ, కృష్ణమూర్తి సూచించారు. మండల కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), హిందూస్థాన్ లేటెక్స్ ఫ్యామిలీ ప్రమోషన్ ట్రస్ట్ (హెచ్ఎల్ఎఫ్పీపీటీ) ఆధ్వర్యంలో టోల్ప్లాజా సిబ్బందికి మూడు రోజుల శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఏ విధంగా నడుచుకోవాలి, హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ఇబ్బందులు కలిగితే సేవ్ అవర్ సోల్ (ఎస్ఓఎస్) ఏ విధంగా వాడాలి, రాజ్మార్గ్ యాత్ర యాప్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టోల్ప్లాజా మెనేజర్ దయారామ్ గుర్జర్, బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళాభివృద్ధే లక్ష్యం
ఇబ్రహీంపట్నం: మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా 87 డ్వాక్రా సంఘాలకు రూ.3.50 కోట్ల వడ్డీలేని రుణాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధికి రేవంత్ సర్కార్ శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్కార్డులు తదితర సంక్షేమ పథకాలను అమలు పరుస్తోందన్నారు. ఆర్థికంగా ఎదిగేందుకే వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించానన్నారు. మభ్యపెట్టి ఓట్లు దండుకునే వారికి వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరుణాకర్, డ్వాక్రా సంఘాల మహిళలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కుట్రను అడ్డుకోండి
మహేశ్వరం: మండల పరిధిలోని సిరిగిరిపురం సర్వే నంబర్ 72, 73 ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు పంచాయతీ పెద్దలు కుట్ర చేస్తున్నారని వడ్డెర సంఘం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ చిన్నప్పల నాయుడుకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి ఈస్థలంలో ఖననాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి తదితరులు శ్మశానవాటిక చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించారని తెలిపారు. ఎంపీడీఓ శైలజ, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లుకు సైతం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా శ్మశానవాటిక చుట్టూ ఉన్న నక్షబాట కబ్జా కాకుండా చూడటంతో పాటు రైతుల పొలాలకు వెళ్లేందుకు రోడ్డును వెడల్పు చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. కొంత మంది కావాలనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. రోడ్డు, ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా పంచాయతీ తీర్మానంతో బొందల చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించామని, ఇది గిట్టని వారు రాత్రి వేళ కూల్చివేశారని తెలిపారు. ఈ విషయమై తాము కూడా పోలీసులు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశామన్నారు. తహసీల్దార్కు వినతి -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
● సీఐటీయూ నేతల డిమాండ్ ● కడ్తాల్లో ర్యాలీ, తహసీల్దార్కు వినతిపత్రం కడ్తాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉప సంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ సీఐటీయూఐ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాఽధి హామీలో తీసుకువచ్చిన వికసిత్ భారత్– జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్మికులకు పరిశ్రమల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, లేబర్కోడ్స్ ఉప సంహరణ, రైతాంగ సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉపాధి హమీ చట్టం పునరుద్ధరణ డిమాండ్లతో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. హమాలీ కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ జయశ్రీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో హమాలీ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా అన్నపూర్ణ
రాయదుర్గం: సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా అన్నపూర్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె సైబరాబాద్ సీపీ ఎం రమేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ ఎస్పీగా, కరీంనగర్ అడిషనల్ ఎస్పీగా, పీటీసీ వరంగల్లో, మంగళగిరి, గుంటూరు డీఎస్పీగా, చిత్తూరు అడిషనల్ డీసీపీగా కూడా విధులను నిర్వర్తించారు. తాజాగా సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. -
ఎయిర్పోర్ట్ దాకా రయ్ రయ్
సాక్షి, సిటీబ్యూరో: విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ట్రాఫిక్ జాంఝాటాలు తప్పించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ వైపుల నుంచి శంషా బాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే వాహనాలు సిగ్నల్ ఫ్రీగా వెళ్లేందుకు రూ.345 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధమైంది. హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద ఆరు లేన్లతో ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్) పనులు త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల వద్ద ఆగకుండా రెండు వైపులా సాఫీగా ప్రయాణం సాగేందుకు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. షాద్నగర్, మహబూబ్నగర్, అత్తాపూర్, మెహిదీపట్నం వైపు వెళ్లేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కాటేదాన్ జంక్షన్ వద్ద మూడు లేన్లతో డౌన్ర్యాంప్ ఉంటుంది. టెండర్ ద్వారా ప్రాజెక్ట్ దక్కించుకునే ఏజెన్సీయే సర్వే, డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టు అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి కావాలి. యుటిలిటీ షిఫ్టింగ్, ఫుట్పాత్లు, ల్యాండ్స్కేపింగ్, సైనేజీలు, లైటింగ్, పేవ్మెంట్ మార్కింగ్స్ తదితర పనులు కూడా చేయాలి. మెట్రోకు సమాంతరంగా.. ఎయిర్పోర్ట్ మెట్రోలైన్కు పక్క నుంచి ఈ ఫ్లై ఓవర్ రానుంది. ఫ్లై ఓవర్ కంటే మెట్రోమార్గం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతోపాటు టీకేర్ కాలేజ్ జంక్షన్, గాయత్రినగర్ జంక్షన్, మంద మల్లమ్మ జంక్షన్ల మీదుగా ఆరు లేన్లతో మరో ఫ్లైఓవర్ పనులకు టెండర్ల గడువు ముగిసింది. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది. రూ. 345 కోట్లతో ఫ్లైఓవర్ మైలార్దేవ్పల్లి, కాటేదాన్, ఆరాంఘర్ వద్ద సిగ్నల్ ఫ్రీగా.. త్వరలో పనులు ప్రారంభం -
సౌకర్యాలు అంతంత మాత్రమే
ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రితో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 250 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఇటీవల పాత ఆస్పత్రిని కూల్చివేసి రూ.17.50 కోట్లతో నూతనంగా నిర్మి స్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న డాక్టర్ క్వార్టర్స్లో ఔట్ పేషెంట్లకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు మైమునాబేగం, జయశ్రీ, మంజులాదేవి రోగులకు వైద్యం చేస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 మందికి రక్త పరీక్షలు నిర్వహించి వెంటనే రిపోర్టు అందిస్తున్నారు. -
ఓటరు జాబితాను సవరించండి
ఆమనగల్లు మున్సిపాలిటీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఆమనగల్లు: మున్సిపాలిటీ ఓటరు జాబితాలో తప్పులను 15 రోజుల్లో పరిశీలించి సవరించాలని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పట్టణానికి చెందిన అడ్వకేట్ వస్పుల మల్లేశ్ మున్సిపాలిటీ ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు ఉన్నాయని, ఒకే ఓటరుకు సంబంధించి రెండు ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించకుండా ఎన్నికలు నిర్వహించొద్దని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ ఈనెల 4న ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్కు ఇచ్చిన పిటిషన్ను పరిశీలించి 15 రోజుల్లోగా ఓటరు జాబితాను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని తెలిపింది. -
వెంటనే రక్త పరీక్షల రిపోర్టు
షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతుంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ నిత్యం 300 వందలకు పైగా ఓపీ పేషంట్లు వస్తున్నారు. రోగుల తాకిడికి సరిపడా సిబ్బంది లేరు. షాద్నగర్ గుండా జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులు ఆస్పత్రికి వస్తున్నారు. ఆర్థోపెడిక్ సర్జరీలు ఇక్కడ అధికంగా నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో సరిపడా మందుల నిల్వలు ఉన్నాయని, రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రక్త పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు రిపోర్టులు అందజేస్తున్నారు. -
‘భూమి తీసుకుని బెదిరిస్తున్నారు’
శంకర్పల్లి: ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు అధినేత రాందేవ్రావు తమ భూములను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుని, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రొద్దుటూరుకు చెందిన బాధితులు సోమవారం సదరు పొలాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 305/2లో ఎరుకలి మల్లమ్మకు 1.20 ఎకరాలు, 305/3లో ఎరుకలి రామయ్యకు 2 ఎకరాలు, 306లో ఎరుకలి పెంటయ్యకు 1.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములను 2020లో ఐదేళ్ల కోసం రూ.32 లక్షలకు లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని పలుమార్లు రాందేవ్రావు వద్దకు వెళ్లగా బెదిరింపులకు పాల్పడున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మలమ్మ, నర్సింలు, యాదగిరి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. చట్టప్రకారం ముందుకెళ్తా.. ఈవిషయమై ఎక్స్పీరియం అధినేత రాందేవ్రావును వివరణ కోరగా.. 2020లో తాను భూమిని లీజుకు తీసుకున్న మాట వాస్తవమేనని, ఇందుకోసం 99 ఏళ్లకు గాను సదరు యజమానులకు రూ.13 లక్షలు ముందుగానే చెల్లించానని తెలిపారు. వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చట్టప్రకారం ముందుకు వెళ్తానని స్పష్టంచేశారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు..భరత్నగర్కు చెందిన గంటా నాయక్ (70) సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఆరాంఘర్ వైపు వెళుతున్నాడు. బహదూర్ఫురా నుంచి ఆర్ఎంసీ లోడ్తో వస్తున్న అశోక్ లే ల్యాండ్ వాహనం అదుపుతప్పి గంటా నాయక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన సుధీర్ కుమార్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మేడిపల్లిలో యువకుడు..మేడిపల్లి: కాప్రాలో నివాసముంటున్న రిషబ్ శర్మ (26) సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ నుంచి ఘటికేసర్వైపు తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా మేడిపల్లి బస్టాప్ వద్ద వెనుకనుంచి అతివేగంగా వచ్చిన అయిల్ ట్యాంకర్ రిషబ్ శర్మను బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ డీలర్పై విచారణ యాలాల: మండల పరిధిలోని నాగసముందర్ రేషన్ డీలర్ పద్మమ్మపై సోమవారం ఆర్ఐ శివచరణ్ విచారణ చేపట్టారు. లబ్ధిదారులకు ఐదు కిలోల చొప్పున బియ్యం తక్కువగా వేస్తున్నారని, నిలదీసిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మహేందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఆర్ఐ విచారణ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. -
చికిత్సకు నిరీక్షణే..
ఆస్పత్రుల్లో తప్పని పడిగాపులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: పల్లెకు సుస్తీ చేసింది.. చికిత్స చేసే నిపుణులు అందుబాటులో లేకపోవడం.. ఉన్న వాళ్లు కూడా నిర్దేశిత సమయానికి ఆస్పత్రికి రాకపోవడం.. వచ్చిన వాళ్లు మధ్యాహ్నం ఒంటిగంటకే తిరుగుముఖం పట్టడంతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు సహా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుకుంటున్న నిరుపేదలకు కనీస వైద్యసేవలు అందకుండా పోతున్నా యి. మెజార్జీ వైద్య సిబ్బంది వేళకు రావడం లేదు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆయాలే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. నాడిపట్టి చూడటం మొదలు.. మందులు, ఇంజక్షన్లు ఇవ్వడం వరకు అన్నీ వారే కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై సోమవారం ‘సాక్షి’ బృందం విజిట్ నిర్వహించింది. మెజార్టీ ఆస్పత్రుల్లో ఆల్ట్రాసౌండ్ మిషన్లు సమకూర్చినప్పటికీ రేడియాలజిస్టులు/గైనకాలజిస్టులు లేకపోవడంతో రోగులకు ఆ తరహా సేవలు అందకుండా పోతున్నాయి. ఎక్సరే మిషన్లు ఉన్నప్పటికీ.. టెక్నీషియన్ల కొరతతో ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోంది. రోగుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపుతున్నారు. థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. నేరుగా రోగుల ఫోన్ నంబర్లకే రిపోర్టులు జారీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ..గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రోగులకు ఈ సాంకేతికతపై సరైన అవగాహన లేక ఇబ్బందులు తప్పడం లేదు. 24 గంటల తర్వాత కూడా రిపోర్టులు చేతికి అందకపోవడంతో జ్వరపీడితుల ఆరోగ్యం మరింత దెబ్బతింటున్నట్లు తేలింది. మారుమూల పల్లెల్లోనే కాదు మున్సిపాలిటీ కేంద్రాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. మచ్చుకు కొన్ని.. నిరంతరం పర్యవేక్షణ మెరుగైన వైద్యసేవలు అందించాలనేదే లక్ష్యం. వైద్య సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సమయ పాలన పాటించని వైద్య సిబ్బందితో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో మందుల కొరత లేదు. ఖాళీల భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాం. – డాక్టర్ కె.లలితాదేవి, జిల్లా వైద్యాధికారి -
ట్రాఫిక్ రూల్స్పై అవగాహన
చేవెళ్ల: వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి, సురక్షిత ప్రయాణం చేయాలని డీసీపీ యోగేశ్గౌతమ్, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో సోమవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం, బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయణించే వారు సీటుబెల్టు పెట్టుకోవాలని సూచించారు. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. అనంతరం మున్సి పాలిటీకి చెందిన మధుసూదన్గుప్తా 50 హెల్మెట్లను కొనుగోలు చేసి ఎమ్మెల్యే కాలె యాద య్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ కిషన్, సీఐలు భూపాల్శ్రీధర్, డీఐ ఉపేందర్, ఎస్ఐలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం షాబాద్: మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కవిత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలతో పాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లను సైతం ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం సెషన్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, మధ్యాహ్న సెషన్లో ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ఆబ్జెక్టివ్ టైప్ (బహుళ ఎంపిక ప్రశ్నలు) విధానంలో పరీక్ష నిర్వహిస్తారన్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ మొయినాబాద్: ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు స్వ యం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. మహిళల కు వడ్డీ లేని రుణాలు అందజేసి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఆర్డీఓ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మ న్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మోయిజుద్దీన్, నాయకులు షాబాద్ దర్శన్, హన్మంత్యాదవ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులతో దురుసు ప్రవర్తన తహసీల్దార్ డ్రైవర్పై కేసు నమోదు యాచారం: ఓ తహసీల్దార్ కారు డ్రైవర్ దురుసు ప్రవర్తనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని ఓ మండల తహసీల్దార్, ఉప తహసీల్దార్, ఆర్ఐతో కలిసి సోమవారం సాయంత్రం కారులో నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో యాచారం పోలీస్స్టేషన్ పరిధిలో సాగర్ హైవేపై సీఐ నందీశ్వర్రెడ్డి తన సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందరు వాహనదారుల మాదిరిగానే పోలీస్ సిబ్బంది తహసీల్దార్ ప్రయాణిస్తున్న కారును ఆపి డ్రైవర్కు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న తహసీల్దార్ అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సీఐకి ఫోను చేయించినా వినిపించుకోలేదు. ఈ వ్యవహారంలో డ్రైవర్పై కేసు నమోదు చేశారు. గంటపాటు తహసీల్దార్ కారులోనే ఉండిపోయారు. -
గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి
ఇబ్రహీంపట్నం రూరల్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రజావాణికి 33 ఫిర్యాదులు ఈ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 33 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి విన్నవించి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందించే వినతులను పెండింగ్లో పెట్టకుండా సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. -
పరికరాలు, పరీక్షలు లేవు
ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులందరూ డిప్యూటేషన్పై వచ్చిన వాళ్లే ఉన్నారు. ఇటీవల పాత ఆస్పత్రి స్థానంలో నూతనంగా నిర్మిస్తున్నారు. అవుట్ పేషెంట్లకు చికిత్స తప్పా అడ్మిట్ చేసుకొని వైద్యం అందించే సదుపాయాలు లేవు. డీపీహెచ్ కింద ఇద్దరు, టీవీవీపీ కింద నలుగురు వైద్యులు సేవలందిస్తున్నారు. నిత్యం 10 నుంచి 15 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ కేంద్రానికి నీటి కొరత ఉంది. రోజూ 250 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తారు. ఆస్పత్రిలో ఎలాంటి శస్త్ర చికిత్సలు జరగడం లేదు. అందుకు అవసరమైన పరికరాలు, పరీక్షలు అందుబాటులో లేవు. 100 పడకల ఆస్పత్రిగా మారితేనే మెరుగైన సేవలు అందుతాయి. -
గ్రామాభివృద్ధికి శిక్షణ కీలకం
శంషాబాద్ రూరల్: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. మండలంలోని ముచ్చింతల్ శివారు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, పాలన విధానాలు, నిబంధనలు, నిర్వహణ అంశాల్లో పూర్తి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. ఈ శిక్షణ గ్రామాభివృద్ధికి అత్యంత కీలకమని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ సురేశ్మోహన్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, పంచాయతీ డైరక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
అల్ట్రాసౌండ్ సేవలు లేవు
మహేశ్వరం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 16 మంది వైద్యులకు గాను ప్రస్తుతం ఏడుగురు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, ఆప్తమాలజీ, పైతాలజీతో పాటు పలు నిపుణులు లేరు. 52 రకాల రక్త, ఇతర పరీక్షలు నిర్వహించి మూడు రోజుల్లో పరీక్షల ఫలితాలు ఇస్తున్నారు. అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయడం లేదు. నిత్యం సుమారు 250 నుంచి 350 వరకు రోగులు వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. డయాలసిస్ సేవలు పెంచాలని స్థానికంగా కోరుతున్నారు. మండల పరిధిలోని దుబ్బచర్ల పీహెచ్సీలో తలుపులు, కిటికీలు, ఇతర వైద్య పరికరాలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. ప్రసుత్తం మరమ్మతులు చేసి వైద్యం అందిస్తున్నారు. -
సీహెచ్సీలో రోగుల కిటకిట
యాచారం: వాంతులు, విరేచనాలతో వచ్చిన రోగులతో యాచారం సీహెచ్సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం) సోమవారం కిటకిటలాడింది. దాదాపు 250 మందికి పైగా రోగులు వచ్చారు. అందులో అత్యధికంగా వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతున్న వారే. డాక్టర్ లలిత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ మందులు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి పంపిస్తున్నారు. సీహెచ్సీలో 24 గంటల పాటు వైద్యులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరారు. -
వసతుల్లేక.. సేవలు అందక
రాత్రిపూట సేవలు బంద్ కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో పీహెచ్సీలో పగటిపూటే సేవలు అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది, పరికరాలు లేక పోవడంతో పీహెచ్సీలో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకే వైద్య సేవలు అందుతాయి. ఆస్పత్రిలో ఇద్దరు రెగ్యులర్ డాక్టర్ పోస్టులు ఉండగా, ఒక్కరు డిప్యూటేషన్పై వెళ్లారు. డాక్టర్ కిరణ్కుమార్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కుక్క, పాము కాట్లకు సైతం మందులు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 60–70 మంది ప్రజలకు ఓపీ సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది తెలిసింది. ఖాళీగా ఉన్న మూడు స్టాఫ్నర్స్ పోస్టులతో పాటు, రెగ్యులర్ డాక్టర్, స్వీపర్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు అరకొర వైద్య సేవలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. సోమవారం సర్కారు వైద్యశాలలను ‘సాక్షి’ విజిట్ చేసింది. ఇందులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ఒక ఆస్పత్రిలో సమయం దాటినా వైద్యుడి కుర్చీ ఖాళీగా కనిపించింది. చాలా వైద్యశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించే కేంద్రం లేకపోవడంతో హైదరాబాద్కు పంపిస్తున్నారు. దీంతో చికిత్స ఆలస్యం అవుతోందని రోగులు మదన పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడుతున్న రోగులు సరిపడా సిబ్బంది, గదులు, పరికరాలు లేని వైనం అన్ని చోట్ల రక్త పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ -
‘ప్రీ యాక్టివేషన్’పై యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లతో పాటు అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్ దందాకు చెక్ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. ఇందులో భాగంగా సీసీఎస్ అధీనంలోని స్పెషల్ టీమ్ పోలీసులు నగరవ్యా ప్తంగా నిఘా ఉంచారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని కడప నుంచి వీటిని తీసుకువచ్చి, నగరంలో విక్రయించడానికి ప్రయత్నించి ఇద్దరు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన 184 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ తరహా సిమ్కార్డుల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్ సెల్ఫోన్ వినియోగదారు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు, వేలిముద్రలు కచ్చితంగా ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనేక మంది సిమ్కార్డుల విక్రేతలు తమ వద్దకు వచ్చే సాధారణ వినియోగదారులకు తెలియకుండా వారి నుంచి గుర్తింపులు తీసుకుంటున్నారు. వేలిముద్రల సేకరణ సమయంలో మొదటి ప్రయత్నం విజయవంతమైనా.. అలా కాలేదంటే మరోసారి ఫింగర్ ప్రింట్స్ తమ వద్ద ఉండే మిషన్లో తీసుకుంటున్నారు. మొదటి ప్రయత్నంతో యాక్టివేట్ చేసినవి వినియోగదారుడికి ఇచ్చేసి పంపిస్తున్నారు. ఆపై రెండో ప్రయత్నంతో యాక్టివేట్ చేసుకున్నవి తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి పదుల సంఖ్యలో.. ఏపీలోని కడప జిల్లా భద్రిపల్లికి చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్ కడపలో లావణ్య ఎంటర్ప్రైజెస్ సిమ్స్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రణపల్లి సాయి ప్రదీప్ ఓ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలో సిమ్కార్డ్స్ ప్రమోటర్గా పని చేస్తున్నారు. ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డులకు ఉన్న డిమాండ్ తెలుసుకున్న ఈ ఇద్దరూ దాన్ని క్యాష్ చేసుకోవాలని పథకం వేశారు. కొన్నాళ్లుగా లావణ్య ఎంటర్ప్రైజెస్కు సిమ్కార్డ్స్ కోసం వచ్చే వినియోగదారుల్ని టార్గెట్ చేశారు. వారికి తెలియకుండా గుర్తింపులు, వేలిముద్రలు తీసుకుని సిమ్కార్డుల్ని యాక్టివేట్ చేస్తున్నారు. వీటికి హైదరాబాద్లో డిమాండ్ ఎక్కువగా ఉందని భావించి విక్రయించడానికి వచ్చారు. దీనిపై సీసీఎస్ స్పెషల్ టీమ్కు సమాచారం అందింది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటేనే కట్టడి ఏసీపీ జి.వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ డి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఆదివారం నాంపల్లి ప్రాంతంలో వల పన్ని ఇద్దరు నిందితులను పట్టుకుని 184 ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే సిమ్కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. పోస్ట్పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. అక్రమ సిమ్కార్డుల దందాపై సీసీఎస్ నజర్ వీటిని తరచూ వినియోగిస్తున్న అసాంఘిక శక్తులు ఏపీ నుంచి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన స్పెషల్ టీమ్ -
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్
అక్కడికక్కడే వ్యక్తి మృతి యాచారం: కూలీ డబ్బులు వస్తాయనే ఆశతో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఫ్యూజ్ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని సాయిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన ముద్దం పర్వతాలు(55)కు ఆదివారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో మరమ్మతు చేయాలని, అందుకు కొంత డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. దీంతో పర్వతాలు విద్యుత్ సరఫరా జరిగే ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయకుండా ఫ్యూజ్ మరమ్మతు చేయబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం చేసే వరకు మృతదేహన్ని తరలించే ప్రసక్తే లేదని ధర్నా చేపట్టారు. గ్రామస్తులు, పోలీసుల జోక్యం చేసుకుని కూలీ డబ్బులు ఆశ చూపిన సదరు రైతు మృతుడి కుటుంబానికి పరిహారంగా కొంత నగదు ఇస్తాననే హామీ ఇప్పించడంతో వారు శాంతించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వలేదు.. సాయిరెడ్డిగూడెంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఫ్యూజ్ మరమ్మతు కోసమని ఆ గ్రామ రైతులెవరూ కనీస సమాచారం ఇవ్వలేదని కందుకూరు మండల విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా, విద్యుత్ సరఫరా అవుతున్నా ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయకుండానే ఫ్యూజ్ మరమ్మతు చేయబోయి షాక్కు గురై మృతి చెందాడని పేర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లో ఏమైనా సమస్యలుంటే గ్రామానికి సంబంధించిన విద్యుత్ సిబ్బంది లేదా మండల విద్యుత్ శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అవగాహన లోపంతో మరమ్మతులు చేయబోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. -
సర్పంచులకు శిక్షణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా/యాచారం: కొత్తగా ఎన్నికై న సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో జిల్లాలోని 525 మంది సర్పంచులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని రెండు సమావేశ మందిరాలను సిద్ధం చేశారు. గ్రామ స్వరూపం, ఇంటి నిర్మాణాలకు అనుమతుల జారీ, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, పార్కుల పరిరక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, వాటిని సద్వినియోగం చేసుకునే అంశం, ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడటం వంటి అంశాలపై వివరించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 109 మందికి.. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడతలో షాబాద్ మండల పరిధిలోని 41 పంచాయతీలు, మొయినాబాద్ మండల పరిధిలోని 19, చేవెళ్ల మండల పరిధిలోని 25, శంకర్పల్లి మండల పరిధిలోని 24 పంచాయతీల సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడతలో 103 మందికి.. మాడ్గుల మండల పరిధిలోని 34 మంది సర్పంచులు, ఆమనగల్లు మండల పరిధిలోని 13 మంది, తలకొండపల్లి మండల పరిధిలోని 32 మంది, కడ్తాల్ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నిర్వహించే రెండో విడతలో శిక్షణ ఇవ్వనున్నారు. మూడో విడతలో 113 మందికి.. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు కందుకూరు మండల పరిధిలోని 35 మంది సర్పంచులు, నందిగామ మండల పరిధిలోని 19 మందికి, మహేశ్వరం మండల పరిధిలోని 30 మందికి, కేశంపేట మండలంలోని 29 మంది సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో 105 మందికి.. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు నాలుగో విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఫరూఖ్నగర్ మండల పరిధిలోని 47 మంది, కొత్తూరు మండలంలోని 12 మంది, కొందుర్గు మండలంలోని 22 మంది, జిల్లెడ్ చౌదరిగూడ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఐదో విడతలో 96 మందికి.. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు చివరి విడతగా నిర్వహించే శిక్షణ తరగతుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని సర్పంచులకు అవగాహన కల్పించనున్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని 14 మంది సర్పంచులు, ఇబ్రహీంటపట్నం మండల పరిధిలోని 14 మంది, మంచాల మండల పరిధిలోని 23 మందికి, యాచారం మండల పరిధిలోని 24 మందికి, శంషాబాద్ మండల పరిధిలోని 21 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో ప్రత్యేక తరగతులు గ్రామ పంచాయతీ పాలన.. పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన ముచ్చింతల్లోని స్వర్ణభారతి ట్రస్టులో ఏర్పాట్లు జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా హాజరయ్యేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆయా మండలాల ఎంపీడీఓ, ఎంపీఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలం నుంచి అన్ని గ్రామాల సర్పంచులు హాజరయ్యే విధంగా పర్యవేక్షణ చేయడం కోసం జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. శిక్షణ పొందనున్న సర్పంచులకు నిత్యం ఆన్లైన్ పోర్టల్లో హాజరు నమోదు, చివరి రోజు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. -
పుర పోరు.. సందడి షురూ
రిజర్వేషన్లు వెలువడడంతో ‘పుర పోరు’ మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులంతా టికెట్ల వేట మొదలు పెట్టారు. రిజర్వేషన్లు కలిసిరాని నాయకులు పక్కవార్డుల వైపు చూస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం గెలుపు గుర్రాలను అన్వేశించే పనిలో పడ్డాయి. షాద్నగర్/మొయినాబాద్: మున్సిపల్ సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎన్నికల నిర్వాహణకు నేడో రేపో షెడ్యూల్ విడులయ్యే అవకాశాలు ఉన్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలు రూపొందించే దిశగా పార్టీల ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. వీడిన ఉత్కంఠ కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. చైర్మన్ పీఠంతోపాటు, వార్డుల రిజర్వేషన్లు కలెక్టర్ ప్రకటించారు. రొటేషన్ ప్రాతిపదికన వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో మహి ళల స్థానాలను కేటాయించారు. దీంతో ఆశావాహుల నిరీక్షణ ఫలించింది. బలమైన అభ్యర్థుల కోసం.. ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థులను గుర్తించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వార్డుల్లో పోటీ చేసే ఆశావాహుల వివరాలను సేకరించే పనులు మొదలు పెట్టారు. ఒక్కో వార్డు నుంచి మూడు పేర్లు తీసుకుని అందులో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఆశావహులతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఆర్థికంగా బలంగా ఉండి, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వారికి టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకు గాను సర్వేల ద్వారా గుర్తించి ఎవరు మెరుగ్గా ఉంటే వారికి బీఫాం ఇవ్వాలని చూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే టికెట్లు ఎవరికి దక్కుతాయనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొరపాట్లకు తావివ్వకుండా.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తిరిగి తావివ్వకుండా అన్ని పార్టీల నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు నేతల ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన మద్దతుదారులు విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బెదడ లేకుండా అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారించారు. ఆశావహుల ప్రయత్నాలు పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీఫాం తప్పనిసరి. దీన్ని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు మొదలుపె ట్టారు. నేతలను ఆకర్షించేందుకు, ఓటర్ల మద్దతు కూడగట్టుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటనతో మొదలైన హడావుడి ఎన్నికల సమరానికి పార్టీల సన్నద్ధం గెలుపు గుర్రాల కోసం వేట మరోవైపు ఆశావహుల ప్రయత్నాలు -
అల్లుడి వేధింపులు తాళలేకే ..
● పోలీసులకు సుష్మిత తల్లి లలిత వాంగ్మూలం ● భర్త యశ్వంత్రెడ్డిని రిమాండ్కు తరలించిన పోలీసులుమీర్పేట: సంచలనం సృష్టించిన ఆత్మహత్యల కేసులో భర్తను మీర్పేట పోలీసులు రిమాండ్కు తరలించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం. ఈ నెల 8న హస్తినాపురం జయకృష్ణ ఎన్క్లేవ్లోని కుందనిక అపార్ట్మెంట్లో నివసించే సుష్మిత (27) తన 11 నెలల బాబు అశ్వంత్నందన్రెడ్డిని కడతేర్చి తాను ఆత్మహత్యకు పాల్పడగా, ఆమె తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న సుష్మిత తల్లి లలిత పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తన కూతురు ఆత్మహత్యకు అల్లుడు యశ్వంత్రెడ్డే కారణమని, వివాహమైన నాటి నుంచి వేధింపులు, వరకట్నం పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురిచేసేవాడని తెలిపింది. దీంతో పాటు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ చిత్ర హింసలకు పాల్పడేవాడని, వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. మొదట లలిత నిద్రమాత్రలు దంచి వేసుకోగా, ఆ తరువాత సుష్మిత చిన్నారి బాబు ముక్కుమూసి ఊపిరాడకుండా చేసి అనంతరం ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లలిత వాంగ్మూలం ఆధారంగా యశ్వంత్రెడ్డిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా..
స్థానికం● వేణుగోపాలస్వామి ఆలయంలో 22 నుంచి వార్షికోత్సవాలు ● 25న స్వామివారి కల్యాణం ● బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం కడ్తాల్: కడ్తాల్ మండలం మఖ్తామాధారం గ్రామంలో కొలువైన, భక్తుల ఆరాధ్యదైవం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తేది గురువారం నుంచి ప్రారంభమై 27వ తేది వరకు నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో ఆరు రోజుల పాటు, భక్తజన సందోహం మధ్య వైభవంగా వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలతో పాటు ఆయా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెంది, పురాతన ఆలయంగా వేణుగోపాల స్వామి ఆలయానికి గుర్తింపు ఉంది. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఆలయం చూడచక్కగా ఉంటుంది. వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్దులవుతారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా..జగత్రక్షకుడిగా వేణుగోపాల స్వామి ఆలయం ఈ ప్రాంతంలో ప్రత్యేక కీర్తి గడించింది. ఉత్సవాల కోసం ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో, వివిధ రంగులు వేసి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని శోభాయామానంగా తీర్చిదిద్దుతున్నామని ఆలయ అనువంశిక అర్చక ధర్మకర్త తిరుమల వింజమూరు రామానుజాచార్యులు వివరించారు. ఉత్సవ వివరాలు ● 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, స్వస్తివాచనం, ఋత్విగ్వరణం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం ● 23న నిత్యవిధి, ఆదివాస హోమం, ద్వజారోహణం, బేరిపూజ దేవాతహ్వానం, పల్లకీ సేవ, ● 24న నిత్య విధి, హోమం అభిషేకం, గరుడవాహన సేవ, మోహినిసేవ ● 25న శ్రీవారి కల్యాణం. చంద్రప్రభసేవ, రథోత్సవం, అన్నదానం. ● 26వ తేదిన, గంధావళి ఉత్సవం, నిత్యవిధి, అభిసేకం, హోమం, శ్రీవారి అశ్వవాహన సేవ ● 27న నిత్యవిధి, మహా పూర్ణహూతి, చక్రస్నానం, ద్వజా అవరోహణం, దేవతా విసర్జనం, ద్వాద శారాధనం, పుష్పయాగం, సప్తవరణ మహాదాశీర్వాదం, సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇలా చేరుకోవచ్చు ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు తరలి వస్తుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి 44 కిలో మీటర్ల మేర ప్రయాణించి కడ్తాల్ చేరుకోవాలి. అక్కడి నుంచి షాధ్నగర్ వెళ్లే రహదారి నుంచి కడ్తాల్ మీదుగా 7 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించి మఖ్తామాధారం వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ శ్రీశైలం రూట్లో ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు. -
డివైడర్ ఢీకొని కారు బోల్తా
ఫిలింనగర్: మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్షిప్లో నివసించే బోడ సచిన్(34) ఆదివారం ఉదయం చింతల్ బస్తీ నుంచి తన ఇంటికి వెళుతున్నాడు. ఫిలింనగర్లోని శంకర్ విల్లాస్ చౌరస్తాలో కారు అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సచిన్ స్వల్ప గాయాలతో బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్కు తరలించారు. ఈ కారు బోడ స్వర్ణలత అనే పేరు మీద ఉండగా, సచిన్ కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడు. సచిన్ను పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించగా జీరో అని వచ్చింది. అయితే కారులో మాత్రం ఆరుకు పైగా విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితుడు రాత్రంతా మద్యంతాగి ఆదివారం మధ్యాహ్నం పట్టుబడడంతో డ్రంకన్ డ్రైవ్లో జీరో నమోదైనట్లు తెలుస్తున్నది. కారు డివైడర్ను ఢీకొట్టిన సమయంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం, బోల్తా పడడంతో కారు నడుపుతున్న సచిన్ ప్రాణాలతో బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యానికి కారకుడైన సచిన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
సాపాటు ఎటూ లేదు.!
శంషాబాద్: నిర్మాణ రంగంతో పాటు అనే సంస్థలు, పరిశ్రమల్లో లేబర్ పనులు చేసుకునే అడ్డాకూలీలు, ప్రయాణికులు, బాటసారులు శంషాబాద్ సర్కిల్లో వేల సంఖ్యలో ఉంటారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఇందిరమ్మ క్యాంటీన్ రూ.5 భోజన కేంద్రం లేదు. దీంతో పనులు లభించని వేళ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇక్కడ రూ.5 భోజన కేంద్రం లేకపోవడానికి కారణం ఇది మున్సిపాలిటీ కావడమే. శంషాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటై ఆరేళ్లయ్యింది. ఈ ప్రాంతంలో కూలీలు ఎక్కువగా ఉండటంతో స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చాయి. కానీ మున్సిపాలిటీ వద్ద బడ్జెట్ లేక అధికారులు వెనకడుగు వేశారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూ.5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ● శంషాబాద్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలోకి విలీనమైన విషయం విదితమే. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్లే ఇప్పుడు ఇక్కడ కూడా రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? అని స్థానిక నేతలను.. కార్మిక సంఘాల నాయకులను ఆశగా అడుగుతూ కూలీలు కనిపిస్తున్నారు. శంషాబాద్ జీహెచ్ఎంసీలో విలీనమైన నేపథ్యంలో రూ.5 భోజన కేంద్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారోనని కూలీలు, పేదలు వేయి కళ్లతో వినిపించని ఆకలి ఆర్తనాదాలతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వేల సంఖ్యలో శంషాబాద్ సర్కిల్లోని శంషాబాద్, కొత్వాల్గూడ డివిజన్ల పరిధిలో నిర్మాణ రంగాలతో పాటు పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు వేల సంఖ్యలో ఉంటారు. వీరితో పాటు ప్రయాణికులు, బాటసారులు అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. సర్కిల్లో రూ. భోజన కేంద్రం ఏర్పాటు చేయాలని ఐదేళ్లుగా కార్మికులతో పాటు వాటి సంఘాల నేతలు డిమాండ్ చేయడంతో పాటు మున్సిపాలిటీలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అయితే స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఉండే ఈ కేంద్రానికి సంబంధించిన బడ్జెట్లో సగానికి పైగా స్థానిక సంస్థలే భరించాల్సి ఉండటంతో బడ్జెట్ భారం అనుకున్న అధికారులు, నేతలు దానిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు సాధ్యమేగా ప్రస్తుతం శంషాబాద్ జీహెచ్ఎంసీలో విలీనమై నెలరోజులు కావస్తోంది. జీహెచ్ఎంసీలో పదుల సంఖ్యలో కొనసాగుతున్న మాదిరిగానే శంషాబాద్లో లేబర్ అడ్డాలున్న చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం వీటి ఏర్పాటుకు బడ్జెట్ కూడా భారం కాకపోవడంతో త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రూ.5భోజన కేంద్రంతో వందల సంఖ్యలో డబ్బులు లేని వారు కడుపు నింపుకుంటారని దీనిపై అధికారులు సత్వరమే స్పందించాలనికోరుతున్నారు. దీనిపై స్థానికంగా సీపీఐ నాయకులు ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. శంషాబాద్లో వందల సంఖ్యలో అడ్డా కూలీలు పనులు దొరకకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి గతంలో మున్సిపాలిటీగా ఉండటంతో రూ.5 భోజన కేంద్రం ఏర్పాటుకు వెనకడుగు బడ్జెట్ లేకనే ఏర్పాటు చేయలేకపోయామన్న అధికారులు జీహెచ్ఎంసీలోకి విలీనమైన నేపథ్యంలో ఏర్పాటు చేస్తారని చిగురిస్తున్న ఆశలు -
26లో.. దక్కింది ఐదే!
మొయినాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు రిక్త హస్తం చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 31 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతుంటే.. మొయినాబాద్ మున్సిపాలిటీలో మాత్రం బీసీలకు దక్కింది కేవలం 19 శాతం మాత్రమే. మున్సిపాలిటీలో మొత్తం 26 స్థానాలుండగా కేవలం 5 స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వు అయ్యాయి. అందులోనూ బీసీ మహిళలకు 2 స్థానాలు, బీసీ జనరల్కు 3 స్థానాలు కేటాయించారు. జనాభా పరంగా చూసినా, ఓటర్ల పరంగా చూసినా మొయినాబాద్ మున్సిపాలిటీలో బీసీలు 56 శాతానికి పైగానే ఉన్నారు. మున్సిపాలిటీ రిజర్వేషన్లలో మాత్రం కేవలం 19 శాతం మాత్రమే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే తనయుడి గురి? మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కావడంతో ఆ పదవిపై స్థానిక ఎమ్మెల్యే తనయుడు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొయినాబాద్ జెడ్పీటీసీగా పనిచేసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య తనయుడు కాలె శ్రీకాంత్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఎస్సీ జనరల్కు రిజర్వు అయిన 11వ వార్డు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు తగిన ఏర్పాట్లను ఆయన అంతర్గతంగా చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. 11వ వార్డులో విజయం సాధించి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొంత కాలం వేచిచూడాల్సిందే. మొయినాబాద్ మున్సిపల్లో బీసీలకు 19 శాతమే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు తీవ్ర నిరాశలో పలు పార్టీల ఆశావహులు -
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
కందుకూరు: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలు కాపాడుకోవచ్చని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, స్థానిక పీఎస్ సీఐ సీతారామ్ అన్నారు. అరైవ్, అలైవ్ క్యాంపెయిన్–2026లో భాగంగా శనివారం మండల పరిధిలోని కొత్తగూడ చౌరస్తాలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం, అధిక వేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు ఎంతో ప్రమాదకరమైనవన్నారు. అలాంటి తప్పిదాలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నారు. అనంతరం సురక్షితంగా రోడ్డు దాటడం, లేన్ క్రమశిక్షణ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ పాండు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన షాద్నగర్రూరల్: ప్రజల భద్రతే ముఖ్యమని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో శనివారం పట్టణ సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో అలైవ్ –అరైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమా దాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. ఎంవీఐ వాసు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించవ చ్చని అన్నారు. రెప్పపాటులో జరిగే చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని అన్నారు. ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలను నడపడంతో ఎంతో మంది ప్రమాదాల బారిన పడి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నవకిరణినర్సింహ్మ, ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ను కలిసిన లగచర్ల భూ నిర్వాసితులు దుద్యాల్: మండలంలోని పారిశ్రామిక వాడ భూ నిర్వాసితులు శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నగరంలోని తెలంగాణ భవన్లో కలిశారు. ఇక్కడి పరిస్థితులను ఆయనకు వివరించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించనట్లు వారు తెలిపారు. కార్యక్ర మంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, లగచర్ల సురేశ్, పులిచర్లకుంట తండా గోపాల్ నాయక్, రోటిబండ తండా రాములు నాయక్, పోలేపల్లి విశాల్, మడిగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారుల ఔదార్యం
యాచారం: సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడా పోటీల్లో గెలుపొందిన నగదును కష్టాల్లో ఉన్నవారికి అందించి మంచి మనుసును చాటుకున్నారు క్రీడాకారులు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోడుకొండ్ల ప్రవీణ్కుమార్ మూడు నెలల కింద రోడ్డు ప్రమాదానికి గురై ఇంట్లో మంచానికే పరిమితమయ్యారు. జీవచ్చంలా పడి ఉన్న ప్రవీణ్కుమార్ చూసి చలించిన క్రీడాకారులు కుంటి పాండుయాదవ్ తదితరులు క్రికెట్ పోటీలో గెలుపొందిన రూ.ఐదు వేలను బాధితుడికి శనివారం అందజేశారు. అదే విధంగా కుర్మిద్ద గ్రామంలో వారం కింద వలబోతు నర్సింహ అనారోగ్యానికి గురై మృతి చెందారు. అదే గ్రామంలో క్రికెట్ పోటీలో గెలుపొందిన నరేష్, మహేందర్ తదితరులు బాధిత కుటుంబ సభ్యులకు రూ.ఐదు వేల ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. రెండు గ్రామాల్లోని క్రీడాకారులు తమ ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్నవారికి అందజేసి అండగా నిలవడంపై మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జనరల్కు జై
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల కమిషన్ మున్సిపల్ చైర్మన్/ వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం మున్సిపల్, కార్పొరేషన్ల చైర్మన్/ మేయర్ పోస్టులకు గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీల సమక్షంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రిజర్వేషన్లు ఖరారు చేయగా, ఆయా మున్సిపాలిటీల్లోని వార్డులకు జిల్లా ఎన్నికల అధికారులు లాట రీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా పరిధిలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా వీటిలో ఐదు జనరల్కు, ఎస్సీలు, బీసీలకు ఒక్కోటి చొప్పున రిజర్వ్ అయ్యాయి. శంకర్పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, ఆమనగల్లు మున్సిపాలిటీలు జనరల్కు రిజర్వ్ అయ్యాయి. మొయినాబాద్ ఎస్సీ జనరల్కు, షాద్నగర్ బీసీ జనరల్కు దక్కింది. వార్డు స్థానాలకు ఇలా.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆమనగల్లు మున్సిపల్ పరిధిలో 15 వార్డులు, చేవెళ్ల పరిధిలో 18, ఇబ్రహీంపట్నం పరిధిలో 24, మొయినాబాద్ పరిధిలో 26, షాద్నగర్ పరిధిలో 28, శంకర్పల్లి పరిధిలో 15 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీ మహిళ, ఎస్సీ మహిళ, బీసీ మహిళ, అన్ రిజర్వ్డు మహిళలకు 62 స్థానాలు దక్కడం విశేషం. ఈ మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మో హన్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ప్రక్రియ పూర్తి చేశారు. ఆమనగల్లులో ఏడు, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్లో 13, షాద్నగర్లో 14, శంకర్పల్లిలో 7 వార్డుల చొప్పున మహిళలకు కేటాయించినట్లు ప్రకటించారు. కార్యక్రమానికి రాజకీయ పార్టీల నుంచి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు (సీపీఐ), బోడ సామెల్, సీహెచ్ ఎల్లేష్ (సీపీఎం), చల్లా నర్సింహా రెడ్డి, బండారి ఆగిరెడ్డి, జంగారెడ్డి (కాంగ్రెస్), మదుపు వేణుగోపాల్, నిట్టూ జగదీశ్వర్, వెంకట్ రెడ్డి(బీఆర్ఎస్), విజయ్ కుమార్, దేవేందర్ రెడ్డి, కొండా మధుకర్ రెడ్డి (బీజేపీ) హాజరయ్యారు. వీరితో పాటు మెప్మా పీడీ వెంకటనారాయణ, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ఎస్.వెంకటేశ్, ఎ.యోగేశ్, వి.సునీత, బి.స త్యనారాయణ రెడ్డి, ఎం.శంకర్, ఎండీ మొయినొద్దీన్ హాజరయ్యారు. ఆశావహులకు భంగపాటు ఇదిలా ఉంటే చైర్మన్, మేయర్ సహా కార్పొరేటర్ స్థానాలను ఆశించిన ఆశావహులకు భంగపాటు తప్పలేదు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న వాళ్లు.. ఆశించిన దానికి భిన్నంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఖంగు తినాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలు/ఆశావహుల అంచనాలకు తలకిందులు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేతలను వెతికి బరిలో నిలిపే పనిలో నిమగ్నమయ్యాయి. వీడిన ఉత్కంఠ -
శాంతి ర్యాలీ భగ్నం
సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్బన్సీలాల్పేట్: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ శనివారం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఆందోళ నకు దిగిన బీఆర్ఎస్, లష్కర్ జిల్లా సాధన సమితి నాయకులు, ఇతరత్రా అసోసియేషన్ల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన డిమాండ్తో మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సనత్నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు ఉదయం అల్ఫా హోటల్ ప్రాంతానికి తరలివ చ్చారు. రైల్వేస్టేషన్ నుంచి క్లాక్టవర్, ప్యాట్నీ చౌరస్తా, ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ చేసేందుకు యత్నించారు. అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకు లను అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. దీంతో సికింద్రాబాద్ అల్ఫా హోటల్ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు.. ఆందోళనకారుల నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది. లష్కర్ జిల్లా సాధన సమితి, బీఆర్ఎస్ పిలుపు మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, మోండా మార్కెట్, సుభాష్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు పాక్షికంగా బంద్ పాటించాయి. అనంతరం వ్యాపార కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాయి. అరెస్టులు.. నిర్బంధాలు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో చేపట్టిన శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్కుమార్ గౌడ్, తలసాని సాయికిరణ్ యాదవ్, తలసాని స్కైలాబ్ యాదవ్, మోండా మార్కెట్ చిల్లర వర్తకుల సంఘం ప్రధాన కార్యదర్శి కోత్మీర్ మధు, ఆకుల హరికృష్ణ తదితరులను పోలీసులు అరెస్టు చేసి రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్కు తరలించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ను మోండా మార్కెట్ టకార బస్తీలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. కాగా.. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను, కార్పొరేటర్లను, వ్యాపార వర్గాల ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. శాంతి ర్యాలీని అడ్డుకోవడం సరికాదు: ఎమ్మెల్యే పద్మారావు సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం చేపట్టిన శాంతి ర్యాలీని అడ్డుకోవడం సరికాదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ అన్నారు. మోండా మార్కెట్ టకారబస్తీలోని తన నివాసం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి అను గుణంగా నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేదిలేదన్నారు. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎస్సీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు డి.సుదర్శన్బాబు డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ నాయకుల అరెస్టు భారీగా మోహరించిన పోలీసులు.. ఉద్రిక్తత -
పైగా పాలెస్
స్వర్ణ జయంతిమార్చి నాటికి హెచ్ఎండీఏ కార్యాలయం బదిలీ ● ప్యాలెస్ పునరుద్ధరణ పనులు వేగవంతం ● అన్ని విభాగాలు ఒకేచోట ఉండేలా చర్యలు టు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాలయం అమీర్పేట్ లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి త్వరలో బేగంపేట్లోని పైగా ప్యాలెస్కు మారనుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. ప్రస్తుతం పైగా ప్యాలెస్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మార్చి నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలను ఖాళీ చేసి సొంత భవనాల్లోకి మారాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో స్వర్ణజయంతి కాంప్లెక్స్ను మరేదైనా ప్రభుత్వ విభాగానికి కేటాయించేలా పూర్వ హుడా భవనమైన పైగా ప్యాలెస్కు హెచ్ఎండీఏను బదిలీ చేయనున్నారు. దీని అన్ని విభాగాలు ఒకేచోట కొలువుదీరేందుకు అవకాశం ఏర్పడనుంది. పైగా ప్యాలెస్ లోని 4, 5వ అంతస్తులను అదనంగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం స్వర్ణజయంతిలో ఉండగా, డైరెక్టర్ అర్బన్ ఫారెస్ట్, ఓఆర్ఆర్ కార్యాలయాలు నానక్రాంగూడలోని హెచ్జీసీఎల్ ఉన్నాయి. బుద్ధపూర్ణి మ ప్రాజెక్టు కార్యాలయం ట్యాంక్బండ్ సమీపంలో ఉంది. ఈ మూడు విభాగాల కార్యకలాపాలను పైగా ప్యాలెస్లోనే నిర్వహించే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏకు పూర్వ వైభవం వందల ఏళ్లనాటి చారిత్రక సౌధమైన పైగా ప్యాలెస్ 2008 వరకు హెచ్ఎండీఏ కార్యాలయంగానే కొనసాగింది. అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ భవనాన్ని అదే ఏడాది అక్టోబర్లో అమెరికన్ కాన్సులేట్కు కేటాయించారు. 2023 మార్చిలో అమెరికన్ కాన్సులేట్ను నానక్రాంగూడలోని సొంత భవనంలోకి తరలించారు. అప్పటి నుంచి పైగా ప్యాలెస్ నిరుపయోగంగానే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పైగా ప్యాలెస్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా.. ఆచరణలో మాత్రం ముందుకు సాగలేదు. చివరకు హెచ్ఎండీఏ కార్యాలయాన్ని అక్కడే పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఏడాది క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పునరుద్ధరణ పనులు ముందుకు సాగలేదు. ఇటీవల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా అద్దె భవనాలను ఖాళీ చేసి సొంత భవనాల్లోకి మారాలని ప్రభుత్వం నిర్ణయం తీసు కోవడంతో పనులు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆకట్టుకునే ఇండో– యూరోపియన్ నిర్మాణ శైలి ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వద్ద ప్రధానిగా పని చేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా బేగంపేట లోని రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇండో – యూరోపియన్ శైలిలో పైగా ప్యాలెస్ను నిర్మించారు. నవాబ్ కోరిక మేరకు ఆయనకు దీనిని బహుమతిగా ఇచ్చారు. హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం ఇది రాష్ట్ర ప్రభుత్వ వారసత్వ సంపదగా మారింది. సుమారు 1981 నుంచి 2008 వరకు అంటే అమెరికా కాన్సులేట్ ఏర్పాటు వరకు ఈ భవనంలోనే హెచ్ఎండీఏ కార్యాలయం ఉండేది. తర్వాత 14 ఏళ్ల పాటు అమెకన్ కాన్సులేట్ కార్యాలయంగా కొనసాగింది. తాజాగా మరోసారి హెచ్ఎండీఏ కార్యాలయంగా పూర్వవైభవాన్ని సంతరించుకోనుంది. -
ఎయిర్ ఇండియా పైలెట్గా మరియాపురం వాసి
షాబాద్: మండలంలోని మరియాపురంవాసి ఎయిర్ ఇండియా పైలెట్గా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి బాలశౌరిరెడ్డి ఆరోగ్య మేరీ దంపతుల కుమారుడు సిరిల్రెడ్డి ఈనెల 16న బెంగళూరులో జరిగిన ఇంటర్వ్యూలో పైలెట్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందన్నారు. జిల్లా నుంచి మొదటి పైలెట్ కావడం గర్వంగా ఉందన్నారు. చాలా సంతోషంగా ఉందని, అంకిత భావంతో పనిచేస్తానన్నారు. కాగా సిరిల్రెడ్డి ఎంపికపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ధర్మరక్షణ అందరి బాధ్యత
మొయినాబాద్రూరల్: దేవాలయాల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, సనాతన ధర్మ పరిరక్షణ అత్యంత అవసరమని ఆలయ అర్చకుల సంఘం రాష్ట్ర చైర్మన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలో చెన్నకేశవ ఉత్సవాల్లో ఆయన శనివారం పాల్గొని మాట్లాడారు. ఆలయాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే ధర్మ రక్షణలో పాల్గొన్నట్లు అవుతుందని చెప్పారు. చివరి రోజు కావడంతో స్వామివారిని రథంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో టపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, నాయకులు పవన్కుమార్, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పట్టా భూములకు పరిహారం పెంచండి
దుద్యాల్: పారిశ్రామిక వాడ ఏర్పాటులో భాగంగా పట్టా భూములు కోల్పోతున్న తమకు పరిహారం పెంచి ఇవ్వాలని 11 మంది బాధిత రైతులు శనివారం వికారాబాద్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి విన్నవించారు. గత ఏడాది నవంబర్ 3న పట్టా భూముల సేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల గ్రామాల పరిధిలోకి వచ్చే 815, 816, 817 సర్వే నంబర్లలో 32 మంది రైతులకు సంబంధించిన 23.15 ఎకరాల పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. 816, 817 సర్వే నంబర్లలో 13 ఎకరాలకు చెందిన రైతులు కలెక్టర్ను కలిశారు. తమది విలువైన భూమి అని పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. ధర పెంచి ఇస్తే ఇతర ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు మామిళ్ల నర్సింలు, సరిత, జయమ్మ, మాణేమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
రూ.2.20 లక్షల అపహరణ కేశంపేట: తాళం వేసి పండుగకు ఊరెళ్లిన వారి ఇంట్లో దొంగలు పడి నగదు దోచుకెళ్లిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైకని శ్రీశైలం డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టి అందుకు అవసరమైన నగదును తెలిసిన వ్యక్తుల వద్ద అప్పుగా తెచ్చి పెట్టారు. అందులో నుంచి కొంత నగదు ఇంటి నిర్మాణానికి ఉపయోగించగా మిగిలిన రూ.2.20 లక్షలను ఇంట్లో బీరువాలో భద్రపరిచారు. ఈ నెల 12న డ్రైవింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెళ్లగా అదే రోజు సాయంత్రం అతడి భార్య నిర్మల తన తల్లిగారి ఊరైన ఘనపురానికి వెళ్లారు. అయితే ఇంటి వెనుకవైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి బీరువా తెరిచి అందులో ఉన్న నగదును దొంగిలించారు. సంక్రాంతి పండుగ తర్వాత నిర్మల శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. బీరువాలో ఉన్న నగదు లేకపోవడంతో భర్తకు విషయాన్నిన తెలియజేశారు. దీంతో శ్రీశైలం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు. అనుమానాస్పదంగా వ్యక్తి మృతి మర్పల్లి: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి రావులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మోమిన్పేట్ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన గొల్ల రమేష్ జీవనోపాధి నిమిత్తం 10 సంవత్సరాల క్రితం రావులపల్లికి వచ్చారు. గ్రామంలోని ఓ వెంచర్లో పనిచేస్తుండేవాడు. శుక్రవారం సాయంత్రం వెంచర్లో మిత్రులతో డిన్నర్ ఉందని రమేష్ ఇంట్లో కుటుంబీకులకు చెప్పి వెళ్లాడు. రాత్రి 10 గంటలు అయినా ఇంటికి రాకపోవటంతో కంగారు పడిని కుటుంబీకులు.. అతనికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇదే విషయమై మృతుడి మిత్రులను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో అతని ఆచూకీ కోసం వెతకగా.. రావులపల్లి సమీపంలోని కుటుగుంట రోడ్డు పక్కన విగతజీవిగా పడున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఎస్ఐ రహూఫ్ ఘటన స్థలికి చేరుకున్నారు. వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. అనంతరం దేహాన్ని బంధువులకు అప్పగించారు. తన భర్త చావుకు అతని ముగ్గురు స్నేహితులే కారణమంటూ మృతుడి భార్య అనుసూజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానస్పద కేసుగా నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. చీమల్దరే ఆదర్శం మోమిన్పేట: సుపరిపాలనలో జాతీయ అవా ర్డు పొందిన చీమల్దరి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటామని గోవా రాష్ట్ర సర్పంచుల బృందం తెలిపింది. శనివారం గ్రామంలో వారితోపాటు ఎన్ఐఆర్డీ బృందం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనం, రో డ్లు, భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం, ప్రజలకు పంచాయతీ నుంచి అందుతున్న సేవలు, పన్నుల వసూలు, వీధి దీపాల ఏర్పాటు తదితర వాటిని తెలుసుకున్నారు. మారుమూల గ్రామం ఇంతలా అభివృద్ధి చెందడం, అందుకు గ్రామస్థుల సహకారం, సర్పంచ్ పని తీరును వారు కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్పన, ఎన్ఐఆర్డీ అధికారి విద్యులత, గోవా రాష్ట్ర ఎస్ఐఆర్డీ అధికారి లక్ష్మీకాంత్, ఎంపీడీఓ సృజన సాహిత్య, ఎంపీఓ యాదగిరి, ఉప సర్పంచ్ రాంచంద్రయ్య, కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి గోల్కొండ: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని టోలిచౌకీ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ అన్నారు. శనివారం గోల్కొండలోని లిటిల్స్ ప్యారడైస్ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..చెడు వ్యసనాలకు వ్యతిరేకంగా పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. డ్రగ్స్ రహిత నగర నిర్మాణానికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ సేవనం వల్ల తలెత్తే దుష్పరిణామాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ విషయంలో పాఠశాలల కరస్పాండెంట్లు, పోలీసులకు బాగా సహరిస్తున్నారన్నారు. అనంతరం ఆయన చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ సయ్యద్ యూనుస్, అధ్యాపక బృందం ఉన్నారు. -
‘విలీనం’.. శాపం!
తుర్కయంజాల్: గ్రేటర్లో విలీనం చేయక ముందు సీడీఎంఏకు సంబంధించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటి నంబర్కు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేవారు. అధికారుల పరిశీలన అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ జారీ అయ్యేది. విలీనం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సాఫ్ట్వేర్లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం పాత పీటీఐఎన్ నంబర్లు ఉండి, అసెస్మెంట్ పూర్తయిన వారికి మాత్రమే పన్నులు చెల్లించడానికి వీలు కుదురుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే సాఫ్ట్వేర్ అప్లికేషన్ను కేటాయించకపోవడంతో అసెస్మెంట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ విషయమై మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులకు సైతం స్పష్టత లేదు. ఎప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో చెప్పలేకపోతున్నారు. వేధిస్తున్న టెక్నికల్ సమస్యలు ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేసే బిల్డ్ నౌ సాఫ్ట్వేర్లో దొర్లిన తప్పులను సరిదిద్దే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అబ్దు ల్లాపూర్మెట్ మండలం ఆదిబట్ల సర్కిల్లోని గ్రా మాలను ఇబ్రహీంపట్నం మండలంలో చేర్చారు. దీనిపై పలువురు దరఖాస్తుదారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు వరుసగా ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు ఇబ్రహీంపట్నం మండలంలోనే చేర్చాలని చెప్పారని, వారి సూచన మేరకే ఇలా చేశామని చెప్పుకొస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు వస్తేనే చేస్తామని అప్పటి వరకు ఇంతేనని చెబుతుండటం గమనార్హం. ఈ ఒక్క సర్కిల్లోనే కాదు విలీన మున్సిపాలిటీల్లో అనేక టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. సులువుగా పరిష్కా రమయ్యే వాటిని కూడా చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బిల్డ్ నౌలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పీటీఐఎన్ నంబర్ల జారీ ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నారు.విలీన మున్సిపాలిటీల్లో నిలిచిన ఇంటి నంబర్లజారీ మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసి 45 రోజులు పూర్తవుతున్నా నేటికీ పాలన చక్కబడలేదు. ఇళ్ల నిర్మాణ అనుమతుల నుంచి మొదలు ఇంటి నంబర్ల జారీ, మ్యూటేషన్, బర్త్, డెత్ సర్టిఫికెట్, వెకెంట్ ల్యాండ్ ట్యాక్సీ, ట్రేడ్ లైసెన్స్ల కోసం ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. వేచి చూడాల్సిందే.. గ్రేటర్లో విలీనం నుంచి కొత్త అసెస్మెంట్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిన మాట వాస్తవమే. గతంలో మున్సిపాలిటీల నుంచి పీటీఐఎన్ నంబర్లు పొందిన వారు మాత్రమే పన్నులు చెల్లించవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇది పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. – శ్రీనివాసులు, రెవెన్యూ అధికారి, ఆదిబట్ల సర్కిల్ -
నిరాధార ఆరోపణలు సరికాదు
కొడంగల్ రూరల్: ధూప దీప నైవేద్య పథకం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మపై నిట్టూరి సతీష్కుమార్ చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్లు డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి తెలిపారు. శనివారం పట్టణంలోని శ్రీ మహాదేవుని ఆలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్చకుడే కాని సతీష్కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకోవడం సరికాదన్నారు. వాసుదేవశర్మ నాయకత్వంలో డీడీఎన్ఎస్ అర్చకులు పనిచేస్తున్నట్లు తెలిపారు. అర్చకుల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు కిట్టుస్వామి, జగదీష్ స్వామి, భానుప్రకాష్, హన్మంతు, శివకుమార్, డీ నర్సింలు, జీ నర్సింలు, జీ శ్రీను, కిష్టప్ప పాల్గొన్నారు. -
ఉపాధి చట్టం నిర్వీర్యానికి కుట్ర
● కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ అనంతగిరి: ఉపాధిహామీ చట్టం నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ ఆరోపించారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 19న వికారాబాద్లో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లేబర్కోడ్స్, వీబీ జీ రామ్జీ, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికవర్గాలను అణగదొక్కేలా చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. ఈ విషయాల్లో ప్రజలు జాగురతా కావాలని, కేంద్రం విధానాలను ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి బుస్స చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం సభను విజయవంతం చేద్దాం
కొడంగల్ రూరల్: సీపీఐ శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పీర్ మహమ్మద్, నియోజకవర్గ నాయకు డు గంటి సురేష్కుమార్ పిలుపునిచ్చారు. శనివా రం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని పారీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాబు,సావిత్రమ్మ, శ్యామప్ప, మల్కప్ప, శంకర్నాయక్, శైలజ, కనకప్ప పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఇక పల్లెబాట
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘వీబీ జీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘పల్లెబాట’ పట్టనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టంతో నిరుద్యోగ సమస్య పెరగడం, కూలీలపై నిర్భందం, శ్రమ దోపిడీకి గురవడం, మహిళలు ఉపాధి అవకాశాలను కోల్పోవడంతో పాటు పట్టణాలకు మళ్లీ వలసలు పెరిగే ప్రమాదం ఉందని.. దళిత, ఆదివాసీ కుటుంబాలకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టే చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జంగారెడ్డి, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, శంషాబాద్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, నర్కుడ గ్రామ సర్పంచ్ శేఖర్ యాదవ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును కాలరాస్తోందని ఆరోపించారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వం పేదలకు 100 రోజుల పని కల్పించి, వలసలను నివారించేందుకు మహాత్మాగాంధీ పేరున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని, వందశాతం నిధులను కేంద్రమే చెల్లించేదని గుర్తు చేశారు. కాంగ్రెస్కు పేరు వస్తుందనే..ఈ పథకంతో కాంగ్రెస్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే భయంతో మోదీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించి, గాడ్సే వారసుల పేరుతో చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కూలీల పని దినాలకు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం చెల్లించాలని మెలిక పెట్టి పథకాన్ని పేదలకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పేద కూలీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వరుసగా పది రోజుల పాటు పార్టీ కేడర్ అంతా గ్రామాల్లో పర్యటించి, ఉపాధి హామీ పథకంలో పేరు మార్పుతో పేదలకు జరగనున్న నష్టాలను వివరించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు మొదలుకార్పొరేషన్ల చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీ మాజీ సభ్యు లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ఎంపీపీలు, ముఖ్య నేతలంతా ఈ పది రోజులు జనం మధ్యే ఉండాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేసి కేంద్రం వైఖరిని ఎండగట్టాలన్నారు. వీబీజీ రామ్జీ చట్టం రద్దు కోసం ప్రజలందరినీ సంఘటితం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాన్నుట్లు ఆయన ప్రకటించారు. -
పెళ్లికి వెళ్లిన వాచ్మెన్ అదృశ్యం
మీర్పేట: స్నేహితుడి పెళ్లికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మీర్పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వినాయకనగర్కు చెందిన ముక్కల మోసెస్(32) వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 5న ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో స్నేహితుడి వివాహానికి వెళ్తున్నానని భార్య ఉషారాణికి చెప్పి బయలుదేరాడు. తిరిగి రాకపోవడంతో భార్య ఆయన బంధుమిత్రుల వద్ద వాకబు చేసింది. ఆచూకీ తెలియకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య సికింద్రాబాద్: మానసికస్థితి సరిగాలేని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు .. మేడ్చల్లోని సుచిత్రకు చెందిన నరేష్(38)కు మానసిక స్థితి సరిగా లేదు. ఈ నెల 15న రాత్రి సమయంలో డబీర్పుర రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
లాకప్డెత్పై సీబీఐ విచారణ జరిపించాలి
పంజగుట్ట: కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్డెత్ కేసును సీబీఐతో గానీ..హైకోర్టు సిట్టింగ్ జడ్జితోగానీ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజేష్ లాకప్డెత్ అయ్యి రెండు నెలలు గడుస్తోందని.. అప్పటి నుంచి పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగితే కోదాడ, చిలుకూరు పోలీసులు గాంధీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గాంధీలో పోస్టుమార్టం చేయాల్సిన డాక్టర్ను రాత్రికి రాత్రి మార్చేశారని.. గాంధీలో వీడియో తీయాల్సిన వ్యక్తితో కాకుండా కోదాడ నుంచి అగ్రకులానికి చెందిన వీడియో గ్రాఫర్ను తీసుకురావడం, వైద్యునితో వారికి అనుకూలంగా రిపోర్టు రాయించడం ప్రతి ఒక్కటీ కేసు నుంచి ఎలా బయటపడదామని పోలీసులు తప్పులమీద తప్పులు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు ఇటీవల మానవ హక్కుల కమిషన్ కూడా లాకప్డెత్ కేసుల్లో పోస్టుమార్టం నిస్పక్షపాతంగా జరగడంలేదని, వైద్యులు పోలీసులకు అనుకూలంగా రిపోర్టు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజేష్ లాకప్డెత్పై నిజాలు ప్రజలకు వివరించేందుకు ఈ నెల 18వ తేదీన సూర్యాపేటలో ఎమ్ఆర్పీఎస్, దాని అనుబంధ సంఘాల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
● అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు ● బంగారు ఆభరణాలు స్వాధీనం ● రిమాండ్కు తరలింపు షాద్నగర్: తాళాలు వేసే ఇళ్లే టార్గెట్ చేసుకొని రాత్రివేళ దొంగతనాలకు పాల్పడే ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని శుక్రవారం షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ విజయ్కుమార్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పుణే జిల్లా కాట్రాజ్కు చెందిన లఖాన్ అశోక్ కులకర్ణి కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకొని రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నాడు. గత డిసెంబర్ 20న పట్టణంలోని గంజ్రోడ్డులో నివసిస్తున్న వన్నాడ అశోక్గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఆస్పత్రి నిమిత్తం హైదరాబాద్కు వెళ్లారు. తిరిగి డిసెంబర్ 23న వచ్చి చూడగా తాళం పగలగొట్టి, ఇంట్లోని బెడ్రూంలో ఉన్న కబోర్డు తాళాలు ధ్వంసం చేసి బంగారు నగలుతో పాటు రూ.ఐదు లక్షల నగదు దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతికత ఆధారంగా లఖాన్ అశోక్ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతడిపై మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో సుమారు 300 ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయని విచారణలో తేలింది. నిందితుడి నుంచి బంగారు చైన్, రెండు జతల చెవుల కమ్మలు, మూడు బంగారు ఉంగరాలు, మొత్తం 3.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివారెడ్డి, క్రైం సిబ్బంది రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, సంతోష్ కీలకంగా వ్యవహరించినట్లు సీఐ తెలిపారు. -
దారుణాలు
పై ఫొటోలో కనిపిస్తున్నది నవాబుపేటమండలం చించల్పేట్, అత్తాపూర్, అక్నాపూర్ గ్రామాల మీదుగా నారేగూడకు వెళ్లే రోడ్డు.. రెండు దశాబ్దాల క్రితం పీఎంజీఎస్వై పథకం కింద చించల్పేట్ గేట్ నుంచి అక్నాపూర్ వరకు 8 కిలో మీటర్ల రహదారి వేశారు. కాలక్రమేణ గుంతల మయంగా మారింది. నాలుగేళ్ల క్రితం రూ.12 కోట్లతో రీబీటీ తోపాటు, అక్నాపూర్ నుంచి నారేగూడ వరకు నాలుగు కిలోమీటర్లు కొత్త రోడ్డుమంజూరైంది. అప్పట్లో పనులు ప్రారంభమైనా నేటికీ పూర్తి కాలేదు. 12 కిలో మీటర్లకు గాను మూడు కిలో మీటర్ల మేర రోడ్డు వేసి చేతులు దులుపుకొన్నారు. ఈ రహదారి ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వగ్రామానికి వెళ్లేది కావడం గమనార్హం. వికారాబాద్: ప్రాంతాల కనెక్టివిటీకి రోడ్లు ఎంతో కీలకం. మెరుగైన రహదారి వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయి. కానీ ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూ పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ నిధు లు మంజూరు చేసినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప నులు పూర్తికావడం లేదు. ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతుండటంతో అంచనా వ్యయం భారీగా పెరు గుతోంది.దెబ్బతిన్న రోడ్ల కారణంగా తరచూ ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. జిల్లాలోని పలు గ్రామీణ రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంట ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతోంది. వంతెనలు, బ్రిడ్జిల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఏటా కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. వాటి పూర్తిపై దృష్టి సారించడం లేదు. కొన్ని రోడ్లు శిలాఫలకాలతో, మరికొన్ని శంకుస్థాపనలతో ఆగిపోత్నుఆయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించాక నిధులు విడుదల కావడం లేదు. దీంతో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.నిర్మాణ వ్యయం పెరిగి కాంట్రాక్టర్లు పనులను మధ్యలో వదిలేసి వెళ్లిపోతున్నా రు. కొన్ని చోట్ల పనులు చేపట్టేందుకు ముందు కు రావడంలేదు. దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. దూరమై న వేరే మార్గాల్లో సొంత గ్రామాలకు వెళ్తున్నారు. నాలుగేళ్లు కావస్తున్నా.. జిల్లాకు 2020 – 21 సంవత్సరంలో పీఎంజీఎస్వై కింద 13 రోడ్లు మంజూరయ్యాయి. 93.9 కిలో మీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.56.85 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో కొన్నింటిని నాలుగేళ్ల క్రితం, మరికొన్నింటిని మూడేళ్లు క్రితం ప్రారంభించారు. 13కు గాను 8 రోడ్లును ఇటీవల పూర్తి చేశారు. ఐదు నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని ప్రారంభించి మధ్యలో ఆపేశారు. రోజురోజుకూ నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. నిధుల కొరత కారణంగా రోడ్డు పనులు అక్కడక్కడ నిలిచిపోయిన మాట వాస్తవమేనని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్ తెలిపారు. గ్రామీణ రోడ్లకు గ్రహణం -
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య
కొందుర్గు: ఆర్థిక సమస్యలతో వ్యవసాయ కూలీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని విశ్వనాథ్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి చంద్రయ్య (48), పద్మమ్మ దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు. చంద్రయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు శ్రీదేవికి ఇటీవలే పెళ్లిచేశారు. పెళ్లి సమయంలో ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేశారు. చేసిన అప్పు ఎలా తీర్చాలా అని తరచూ బాధపడేవారు. ఈ క్రమంలో చంద్రయ్య శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాలేదు. పరిసర పొలాల వారు చంద్రయ్య పొలంలో పడి ఉండడం గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి కనిపించాడు. దీంతో వెంటనే 108 అంబులెన్స్లో షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు. బావ చేతిలో మరదలి హత్య జగద్గిరిగుట్ట: బావ చేతిలో మరదలు హత్యకు గురైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతరానికి చెందిన పవన్ కుమార్ గాజులరామారం చంద్రగిరి నగర్లో తన కుటుంబంతో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు. పవన్ కుమార్ భార్య సంక్రాంతి పండుగకు బుధవారం ఊరికి వెళ్లగా మహదేవ్పురంలో ఉండే తన మరదలు ఎర్ర శైలజ (17) అదే రోజు ఇంటికి వచ్చింది. వీరి మధ్య ఏదో విషయంలో తీవ్ర వాగ్విదాదం జరగగా పక్కనే ఉన్న రాడ్డుతో ఆమైపె దాడి చేసి అక్కడినుండి వెళ్లిపోయాడు. తిరిగి మళ్లీ గురువారం వచ్చి చూడగా శైలజ మృతిచెందినట్లు గమనించి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మన సంస్కృతిని కాపాడుకుందాం
కొడంగల్ రూరల్: భిన్నత్వంలో ఏకత్వంలా ఉండే మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్గ్ ప్రముఖ్ గాజుల సిద్దిరామేశ్వర్ అన్నిరు. గురువారం పట్టణంలోని శ్రీ మహాదేవుని ఆలయ ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. పూర్వీకులు ప్రతి పండుగకూ విశేషాలను తెలియజేశారని, కాలనుగుణంగా పండుగల ప్రత్యేక ఉంటుందని, మనమంతా పాటి స్తూ ముందుతరాలకు అందించాల్సి బాధ్యత మన పై ఉంటుందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నా యని తెలిపారు. దేశ ఔన్యత్యాన్ని నిలిపేందుకు ప్ర తి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశంపై ప్రేమ, గౌ రవం, అభిమానం ఉండాలన్నారు. విభిన్న మతా లు, కులాలు, భాషలున్నా, భారతీయ సనాతన ధర్మానికి అనుగుణంగా సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హిందూవాహిని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
అధికారిక అస్త్రం
జిల్లాలో 90వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములు అసైన్డ్ భూములపైసాక్షి, రంగారెడ్డిజిల్లా: అసైన్డ్ భూములపై ప్రభు త్వం అధికార అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు పేరుతో వీటిని సేకరించనుంది. ఇప్పటికే చందనవెల్లి, ఫ్యాబ్సిటీ సహా ఫార్మాసిటీ పేరుతో 20 వేల ఎకారాలకుపైగా సేకరించిన సర్కారు.. తాజాగా మరికొన్ని భూములను సేకరించాలని నిర్ణయించింది. ఆ మేరకు రెవెన్యూ గ్రామాల్లోని సర్వే నంబర్ల వారీగా ఉన్న అసైన్డ్ భూముల వివరాలపై ఆరా తీస్తోంది. ఇటీవల మీర్ఖాన్పేట వేదికగా నిర్వహించిన రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రూ.ఐదున్నర లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు సేకరించాలంటే ఇందుకు మరికొంత భూమి అవసరమని భావిస్తోంది. అదనంగా మరో పది వేల ఎకరాలు భవిష్యనగరం చుట్టూ ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం భారీగా భూములను సేకరిస్తోంది. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గత డిసెంబర్లో కందుకూరు మండలం తిమ్మా పూర్ సర్వే నంబర్ 38లో 350 ఎకరాలు, సర్వే నంబర్ 162లో 217 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం 198.21 ఎకరాలు అవసరమని భావించి, ఆ మేరకు 2025 ఫిబ్రవరి మొదటి వారంలో 195.05 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్9లోని 439 మంది రైతుల నుంచి 366.04 ఎకరాలు సహా మహేశ్వరం మండలం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 277.06 ఎకరాల భూసేకరణకు మార్చి 13న నోటిఫికేషన్ జారీ చేసింది. యాచారం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే సేకరించిన భూములతో పాటు అదనంగా మరో పది వేల ఎకరాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. రెవెన్యూ అధికారులు ఇటీవల యాచారం మండలం కొత్తపల్లి, తక్కళ్లపల్లి, చింతపట్ల, తదితర గ్రామాల్లోని అసైన్డ్, ప్రభుత్వ భూములను గుర్తించి, హద్దులు నిర్ధారిస్తుండటంతో ఇప్పటి వరకు ఆయా భూములపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో మొత్తం భూములు: 12,43,035 ఎకరాలు ప్రభుత్వ భూములు: 2,18,530.2 ఎకరాలు అటవీ భూములు: 64,803 ఎకరాలు అసైన్డ్ భూములు: 90,911 ఎకరాలు ప్రభుత్వం రైతులకు 75,450.29 ఎకరాలు అసైన్డ్ చేసింది:అసైన్డ్ భూములే టార్గెట్.. జిల్లాలో 12,43,035 ఎకరాల భూములు ఉండగా, వీటిలో 2,18,530.2 ఎకరాల ప్రభుత్వ, 64,803 ఎకరాల అటవీశాఖ భూములు ఉన్నాయి. అసైన్డ్ భూములు 90,911 ఎకరాలు ఉండగా.. వీటిలో 52,315 మంది రైతులకు 75,450.29 ఎకరాలను అసైన్ చేసింది. మరో 25,597.35 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. అసైన్డ్ చేసిన భూమిలో తర్వాత 9,815.15 ఎకరాలు చేతులు మారినట్లు సమాచారం. భూదాన్ బోర్డు పేరున 21,931.03 ఎకరాలు ఉండాల్సి ఉండగా, వీటిలో 9,678 ఎకరాలను నిరుపేదలకు పంచారు. మిగిలిన భూమి రియల్టర్ల చేతుల్లోకి వెళ్లింది. దేవాదాయశాఖ పేరున 9360.01 ఎకరాలు ఉండగా, ఇప్పటికే 1148.15 ఎకరాలు అన్యాక్రాంతమైంది. వక్ఫ్ బోర్డు పరిధిలో 14,785.17 ఎకరాలు ఉండాల్సి ఉండగా, వీటిలో 13,480.25 ఎకరాలు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (యూఎల్సీ) పరిధిలో తొమ్మిది వేలకుపైగా ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, వీటిలో 840 ఎకరాలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రైవేటు పట్టా భూముల సేకరణతో ఆర్థికంచీగానే కాకుండా న్యాయపరంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం మౌకిక ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని భూములపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
దోబూచులాట
కార్పొరేషన్ ఒకటేనా.. మూడయ్యేనా?సాక్షి, సిటీబ్యూరో: ఏడాది కాలంగా కొనసాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విభజన రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ మొత్తాన్ని (300 వార్డులు) ఒకే కార్పొరేషన్గా పేర్కొంటూ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించడంతో పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2011 జనాభా లెక్కలు, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, తెలంగాణ మున్సిపల్ యాక్ట్– 2019 మేరకు అంటూ ప్రభుత్వం పేర్కొనడంతో.. జీహెచ్ఎంసీ ఇక ఒకే కార్పొరేషన్గా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. వార్డుల్ని 300గా పేర్కొనడం ఇందుకు ఊతమిచ్చేలా ఉంది. దాదాపు ఏడాది క్రితం నుంచే జీహెచ్ఎంసీ పరిధి పెంచి రెండు నుంచి నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు లీకులిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికీ ఇంకా స్పష్టతనివ్వలేదు. కొరవడిన స్పష్టత.. గత నెలలో 27 స్థానిక సంస్థల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసి 150 వార్డుల్ని 300 వార్డులకు పెంచడం తెలిసిందే. పరిధి పెరిగిన జీహెచ్ఎంసీ మొత్తం ఒకటే కార్పొరేషన్గా ఉంటుందంటూ ఒకసారి.. లేదు రెండు, మూడు, నాలుగు కార్పొరేషన్లు కావచ్చంటూ వివిధ సందర్భాల్లో చర్చలు జరిగినా ప్రభుత్వం నుంచి ఔనని కానీ, కాదని కానీ స్పష్టత లేదు. వార్డుల పెంపుతో పాటు 6 జోన్లను 12 జోన్లుగా మార్చాక రెండు జోన్లకు ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్లుగా ఐఏఎస్ల నియామకం.. ఆయా విభాగాల అధికారుల బదిలీలు, పోస్టింగులు, తదితరమైన వాటితో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు ఏర్పాటు కావడం లాంఛనమేనని, ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చేనెల 10వ తేదీతో ముగియనున్నందున, 11వ తేదీనుంచే కొత్త కార్పొరేషన్లుగా పాలన మొదలు కానుందనే అభిప్రాయాలు బలపడ్డాయి. అంతేకాదు. ఈ మూడు కార్పొరేషన్లు, మూడు పోలీస్ కమిషనరేట్లతో పాటు మూడు జిల్లాల పరిధుల్లో ఉండనున్నాయనీ అధికార వర్గాలు సైతం భావించాయి. తొందరెందుకు? ప్రస్తుత పాలకమండలి గడువు ముగిశాక జీహెచ్ంఎసీని విభజించి మూడు కార్పొరేషన్లుగా చేస్తారని చెబుతున్న పరిశీలకులూ ఉన్నప్పటికీ, పాలకమండలి గడువు దాదాపు మూడు వారాలు మాత్రమే ఉంది. గడువు ముగిశాకే మూడు కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించవచ్చు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేషన్ను మాత్రం జీహెచ్ఎంసీగా ఉంచి, వార్డుల్ని 300గా పేర్కొనడంతో పలు సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆయా అంశాలకనుగుణంగా రిజర్వేషన్లు ప్రకటించినా.. తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజించవచ్చని చెబుతున్న వారు కూడా ఉన్నారు. మూడు కార్పొరేషన్లుగా మారితే ప్రస్తుతం 300 వార్డులను పరిగణనలోకి తీసుకొని పేర్కొన్న రిజర్వేషన్లు.. విభజన తర్వాత ఏదైనా ఒకటి లేదా రెండు కార్పొరేషన్ల పరిధిలోకే వెళ్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. విభజనలో భాగంగా హైదరాబాద్ కార్పొరేషన్ 150 వార్డులతో, సైబరాబాద్ కార్పొరేషన్ 76 వార్డులతో, మల్కాజిగిరి కార్పొరేషన్ 74 వార్డులతో ఉంటాయన్నది ఇప్పటికే ప్రజల్లో మదిలో నాటుకుందిప్రకటన మేరకు జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఇలా .. కార్పొరేషన్: జీహెచ్ఎంసీ వార్డులు: 300 ఎస్టీ: 5 ఎస్సీ: 23 బీసీ: 122 మహిళ (జనరల్): 76 అన్రిజర్వ్: 74త్వరలో కొత్త ప్రకటన ప్రస్తుతం జీహెచ్ఎంసీ పేరిటే 300 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ, ఇవి మారేందుకు అవకాశం ఉందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాలకమండలి గడువుకు అటూ ఇటూగా మూడు కార్పొరేషన్ల పేరిట వేర్వేరుగా రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్యమం సైతం మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ఇక లాంఛనమనే అభిప్రాయంతోనే సికింద్రాబాద్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ ఉండాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ స్థానికులతో ఉద్యమానికి సిద్ధం కావడం తెలిసిందే. -
సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి
ఆమనగల్లు: ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్రెడ్డిని శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి కలిశారు. హైదరాబాద్లో జరిగిన దివంగత కేంద్రమంత్రి జైపాల్రెడ్డి జయంతి సందర్భంగా స్ఫూర్తిస్థల్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎంను కలిసి కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, ఆమనగల్లులో అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. భద్రతకు భరోసా ఆర్టీసీ హయత్నగర్: నిష్ణాతులైన డ్రైవర్లు ఉండడంతో సురక్షితమైన, భద్రమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సు ప్రతీకగా నిలుస్తుందని ఎల్బీనగర్ డీసీపీ అనూరాధ అన్నారు. రోడ్డు భద్ర తా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం హయత్నగర్ డిపోలో నిర్వహించిన అలీవ్ అండ్ అరైవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్సును నడిపే సమయంలో డ్రైవర్లు ఎంతో క్రమ శిక్షణతో పనిచేయాలని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాద రహితంగా బస్సులు నడిపిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కాశిరెడ్డి, సీఐలు నాగరాజుగౌడ్, సంతోష్కుమార్, డీఎంలు విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ టికెట్లకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, సిటీబ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబర్చే పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. దరఖాస్తు ఫారాన్ని పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ నుంచి డౌన్లోడ్ చేసుకుని.. వివరాలు పూర్తి చేసిన తర్వాత ఏఐఎంఐఎం పేరిట తీసిన రూ.3,000 డిమాండ్ డ్రాఫ్ట్తో ఈ నెల 20లోగా సంబంధిత జిల్లా టౌన్, మజ్లిస్ అధ్యక్షుడికి సమర్పించాలని సూచించాయి. అసంపూర్తి దరఖాస్తులను పరిగణనలోకి తిర స్కరిస్తామని, అభ్యర్థుల తుది జాబితాను పార్టీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటిస్తారని మజ్లిస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పతంగ్లతో 309 ఫీడర్లు ట్రిప్ సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి సందర్భంగా సరదాగా ఎగరేసిన పతంగ్లు విద్యుత్ తీగలకు షాక్ కొట్టాయి. విద్యుత్ తీగలకు పతంగ్లు తగిలి మెట్రోజోన్, రంగారెడ్డిజోన్, మేడ్చల్ జోన్ల పరిధిలో బుధవారం 309 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. గురువారం కూడా అదే స్థాయిలో లైన్లు ట్రిప్పయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. మరికొన్ని ప్రాంతాల్లో అర గంటకు పైగా నిలిచిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై.. వైర్ల మధ్య వేలాడుతున్న పతంగ్లను తొలగించారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో ఏకంగా 107 ఫీడర్ల ట్రిప్పవడం గమనార్హం. మున్సిపల్ బరిలో ఉంటాం బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ తాండూరు టౌన్: రానున్న మున్సిపల్ ఎన్ని కల్లో తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జ్ అమ్జద్ అలీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ముఖ్య ఉద్దేశంతో బీఎస్పీ కొనసాగుతోందన్నారు. పట్టణ ప్రజలు తమ అభ్యర్థులను ఆదరిస్తారని, ఎన్నికల్లో తప్పకుండా అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్, మంచాల శ్రీకాంత్, అసెంబ్లీ ఇంచార్జి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు కృష్ణయ్యగౌడ్, పట్టణ ఇన్చార్జ్ అమ్జద్ అలీ, ఆమీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
బహుజన రాజ్యం సాధిస్తాం
షాద్నగర్: తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని బీఎస్పీ సెంట్రల్ సెక్టార్ కో ఆర్డినేటర్ అతార్సింగ్రావు అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పుట్టిన రోజును పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని సాయిరాజ ఫంక్షన్ హాల్లో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సభకు హాజరైన అతార్సింగ్రావు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్తో ఏర్పడిన తెలంగాణ పోరాటంలో అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారన్నారు. అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో బహుజనులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని పార్టీల నాయకులు కుట్రలు పన్ని, బహుజనులను అధికారానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా ఎగరాల్సినవి పతంగులు కానవి, ఆత్మగౌరవ జెండాలని అన్నారు. బీఎస్పీతోనే అది సాధ్యమని స్పష్టంచేశారు. సమానత్వం, ఆర్థిక విముక్తితో సంక్రాంతి సంబురాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే బహుజనులను కాపాడుకుంటామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రవీణ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగన్న, కృష్ణ, బండి పృధ్వీరాజ్, శివప్రసాద్, నరేందర్, రాములు, రవి, అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన నాదర్గుల్లో చోటుచేసుకుంది. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. చింతల ప్రవీణ్కుమార్ (30 ఒగ్గు కథలు చెబుతూ జీవనం సాగిస్తాడు. ఈనెల 8న ఉదయం ఇంటి అద్దె చెల్లించాలని యజమాని అడగడంతో, బయటకు వెళ్లి తెస్తానని బయలుదేరాడు. మూడు రోజులు గడిచినా రాకపోవడంతో బంధువులు, తెలిసినవారిని ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన దాడి అరుణ్రెడ్డి(29) శుక్రవారం ఉదయం 9.30 గంటలకు షాప్కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అతని భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక పీఎస్లో లేదా 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యాచారం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన కె.నర్సింహ(40)కు అతని కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పాడ్డాయి. తీవ్ర మనస్తాపంతో శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య భారతమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీ తెలిపారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి కుత్బుల్లాపూర్: ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి పడి మృతి చెందింది. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. హర్యానా రాష్ట్రం ముంగేలి మండలం, బోధిపుర గ్రామానికి చెందిన దోమన్ బంజారా, ఆశ బాయి దంపతులు దండమూడి ఎన్క్లేవ్ ఫేజ్–2లోని వారాహి కన్స్ట్రక్షన్స్లో కూలి పనులు చేస్తున్నారు. ఈ నెల 12న భార్యాభర్తలిద్దరూ భవనం 5వ అంతస్తులో పనిచేస్తుండగా రెండవ కుమార్తె అన్షిక (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు భవనంపై నుండి కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 15వ తేది రాత్రి 9 గంటలకు మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్తాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారుతో బీభత్సం ● ఇద్దరికి గాయాలు మియాపూర్: మద్యంతాగి ఓ వ్యక్తి కారు నడుపుతూ భీభత్సం సృషించాడు. మియాపూర్ ఎస్ఐ వేంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. బోడ వెంకన్న (52) అనే వ్యక్తి మద్యం తాగి కేపీహెచ్బీ నెక్సెస్ మాల్ నుండి మియాపూర్ వైపు శుక్రవారం ఉదయం కారు వేగంగా నడుపుతూ వస్తున్నాడు. గోకుల్ప్లాట్స్ ప్రధాన రహదారి పై వేర్వేరు చోట్ల ఇద్దరిని ఢీకొనడంతో గాయపడ్డారు. కిరాణం దుకాణం నడుపుతున్న మాధవరావు(53)తోపాటు మరో వ్యక్తిని ఢీకొట్టాడు. కారు కొంతదూరం వెళ్లాక టైర్ బ్లాస్ట్ కావడంతో అక్కడే అగిపోయింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఇద్దరు డ్రగ్స్విక్రేతల అరెస్ట్
అత్తాపూర్: అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తుల వద్ద నిషేధిత మాదక ద్రవ్యం ఎండిఎంంఏ ఉందనే సమాచారం పోలీసులకు అందింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 242 వద్ద వాహనాలను నిలిపి వాహనాల తనిఖీ చేపట్టగా ఓ కారులో డ్రగ్ లభ్యమైంంది. బెంగళూర్కు చెందిన చరణ్ వద్ద నుంచి అన్వర్హుస్సేన్, బుర్రా సంపత్లు రూ.25 వేలకు ఎనిమిది గ్రాముల డ్రగ్ను కోనుగోలు చేసినట్లు తెలిపారన్నారు. డ్రగ్తో పాటు కారు, ఒక ఫోన్ను స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ విక్రేతలు -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
నందిగామ: యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మామిడిపల్లిలో నిర్వహించిన ఎంపీఎల్ లీగ్ సీజన్–10 క్రికెట్ పోటీల విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రదానోత్సవం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలను ఆసక్తి ఉన్న క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు.కార్యక్రమంలో సర్పంచ్లు హనుమంత్ రెడ్డి, చిందం పాండు, ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్లు కవిత, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.


