breaking news
Ranga Reddy District Latest News
-
‘గ్రీన్ ఫీల్డ్’ పనుల అడ్డగింత
యాచారం: గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులను రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. కుర్మిద్ద అనుబంధ గిరిజన తండాలైన మంగలిగడ్డ, మర్లకుంట, పోతుబండ తండాల రైతులకు చెందిన 283, 286, 274 తదితర పట్టా సర్వే నంబర్లలోని 30 ఎకరాల భూమిలోంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తోంది. ఈ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు జేసీబీ, ఇతర యంత్రాలతో పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న రైతులు తరలివచ్చారు. పట్టా భూములకు సంబంధించి పరిహారం చెల్లింపుపై స్పష్టత లేదని.. సేకరణపై కోర్టుల్లో కేసులు, స్టేలు ఉన్నాయని.. అయినా అధికారులు బలవంతంగా పనులు ప్రారంభించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. దీంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ వద్ద సమావేశపర్చండి.. అక్కడే తేల్చుకుంటామని రైతులు అన్నారు. రెండు, మూడు రోజుల్లో కలెక్టర్ సమయం తీసుకుని సమావేశం అయ్యేలా చూస్తానని ఆర్డీఓ అనంత్రెడ్డి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
జాతీయ సెమినార్లో షాద్నగర్ ప్రొఫెసర్
షాద్నగర్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో గ్రీన్ ఎనర్జీ రీసోర్సెస్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఇండియా పేరుతో నల్లగొండలో శుక్రవారం జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు షాద్నగర్కు చెందిన అర్ధశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పర్యావరణ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అంశంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ సదస్సుకు దేశంలోని విఽవిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల ప్రొఫెసర్లు హాజరయ్యారు. -
నిరాడంబరతకు నిదర్శనం
ఇబ్రహీంపట్నం: అశ్రునయనాల మధ్య ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు అంత్యక్రియలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేని నిరాడంబర రాజకీయ జీవితానికి నిదర్శనంగా నిలిచారు కొండిగారి రాములు. భేషజాలకు తావివ్వకుండా, ప్ర జాసేవకు, సమస్యల పరిష్కరానికే జీవితాన్ని అంకితం చేశారు. పదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగినా ఆస్తులు కూడబెట్టుకోలేదు. అనారోగ్యంతో పెద్ద కుమారుడు అరుణ్ ఆస్పత్రిపాలైతే చికిత్స అందించేందుకు సైతం పైకంలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. సొంత గూడు కట్టుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యేగా వచ్చే గౌరవ వేతనం పార్టీ ఫండ్కే ఇచ్చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేలకు బంజారాహిల్స్లో ఇంటి స్థలాన్ని కేటాయించినా తీసుకోలేదు. కమ్యూనిస్టు నేతగా నమ్ముకున్న పార్టీ సిద్ధాంతం కోసం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. సాదాసీదా జీవితాన్ని గడిపి ఆదర్శప్రాయంగా నిలిచారు. రాజకీయ ప్రస్థానం చిన్న వయస్సులోనే కమ్యూనిస్టు భావజాలంతో ఆయన స్వగ్రామమైన ఆరుట్ల నుంచి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1967లో భూ పోరాట సమితిలో కృష్ణమూర్తి నాయకత్వలో పనిచేశారు. భూ, ప్రజా సమస్యల పోరాటాల ఫలితంగా 1989 నుంచి 2007 వరకు ఆయనపై సుమారు 50 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నేతగా 1985–1989 వరకు పనిచేశారు. 1989 నుంచి 1999 వరకు పదేళ్ల పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. దుఃఖసాగరంలో కుటుంబం కొండిగారి రామలు ఆయన సతీమణి ముత్యాలమ్మ తొమ్మిది నెలల వ్యవధిలోనే కన్నుమూయడంతో కుటుంబసభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. చిన్న కుమారుడు త్రిలోక్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్గా విజయం సాధించాడు. బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా క్యాంపులో ఉండడంతో ఆయన కూడా అక్కడే ఉన్నారు. తండ్రి అంత్యక్రియలు జరిపించేందుకు త్రి లోక్ రాకకోసం ఎదురుచూశారు. కుమారుడి రాకతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహోన్నత వ్యక్తి కొండిగారి రాములు భౌతికకాయానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మచ్చలేని రాజకీయ నాయకుడని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకుశాంతి చేకూరాలని ప్రార్థించారు. నిస్వార్థ నాయకుడు నిస్వార్థ నాయకుడు, అందరినీ కలుపుకెళ్లే తత్వం కొండిగారి రాములుదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పెద్ద దిక్కున్న నాయకుడుని కోల్పోవడం బాధకరమన్నారు. ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పించారు. నిఖార్సైన ఉద్యమ నేత నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనం, నిఖార్సైన కమ్యూనిస్టు ఉద్యమ నేత కొండిగారి రాములు అని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సాధారణ జీవనం గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరనిలోటన్నారు. నేటి యవతకు ఆదర్శం ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యకి కొండిగారి రాములు అని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. పేదల హక్కుల కోసం ఆయన చేసిన కృషి నేటి యువతకు ఆదర్శమన్నారు. ప్రజాసేవకే జీవితం అంకితం ఆదర్శంగా కొండిగారి రాములు స్మరించుకున్న ప్రముఖులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి -
కేన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించాలి
శంకర్పల్లి: మహిళల్లో వచ్చే కేన్సర్ని ప్రాథమిక దశలోనే గుర్తించి, సరైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి లలితా దేవి అన్నారు. శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ నాలుగు విడతల్లో కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 34 ఆరోగ్య కేంద్రాల్లో, ఆరుగురు స్పెషలిస్ట్ వైద్యులతో మెగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో మహిళల్లో గర్భాశయ కేన్సర్ ఎక్కువగా వస్తుందని, దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు హెచ్పీ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా 93శాతం మందికి కేన్సర్ వచ్చే అవకాశం ఉండదన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రేవతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి లలితా దేవి -
కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
మొయినాబాద్: విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్న గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి వారు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్ మాట్లాడుతూ.. కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పలువురు విద్యార్థులు జేఎన్టీయూకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో వైస్ ప్రిన్సిపాల్ అహ్మద్, సిబ్బంది మల్లేశ్లు కలిసి సంబంధిత విద్యార్థులను గదిలో బంధించి, దాడి చేసినట్లు ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అల్లి దేవేందర్, చరణ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ -
దిగ్విజయం
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026పరీక్ష కావాలి.. సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 255 కేంద్రాలను ఎంపిక చేశారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన భద్రత మధ్య ప్రశాంతమైన వాతావ రణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులతో పది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాధికారి సుశీందర్రావు శుక్రవారం మొయినాబాద్ మండలం చిలుకూరు, అజీజ్నగర్ సహా పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 16 వరకు వార్షిక పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఇదీ జిల్లా లెక్క మొత్తం పాఠశాలలు 1,024విద్యార్థులు 53,050 పరీక్ష కేంద్రాలు 255 ఇన్విజిలేటర్లు 2,200 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 10సిట్టింగ్స్క్వాడ్స్ 255 ప్రశ్నపత్రాల స్టోరేజీ పాయింట్లు 37 జవాబు పత్రాలు తరలించే పోస్టాఫీసులు 53 కస్టోడియన్స్ 74 ఏఎన్ఎం/స్టాఫ్ నర్సులు 255 సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్న వారు 1,108సమయం: ఉదయం: 9.30 నుంచి మధ్యాహ్నం: 12.30హాల్ టికెట్స్ డౌన్లోడ్ కోసం వాట్సాప్ నంబర్ 80969 58096ఉదయం 9.35 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. హాల్టికెట్, పరీక్ష ప్యాడ్, బాల్ పెన్ను మర్చిపోవద్దు. వెంట మంచినీళ్ల బాటిల్ మినహా ఇతర ఎలక్ట్రానిక్(సెల్ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్లు, పెన్డ్రైవ్లు) వస్తువులకు అనుమతి లేదు. ప్రతి సెంటర్ను ఒక సిట్టింగ్ స్క్వాడ్ సహా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో పది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. చూచిరాతలు, చీటీలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను కార్లలో కాకుండా బైకులు/స్కూటీలపై తీసుకొచ్చి, పరీక్ష రాసిన తర్వాత తీసుకెళ్లడం ఉత్తమం. – సుశీందర్రావు, డీఈఓ వార్షిక పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయొద్దు. చదువు పేరుతో నిద్రాహారాలు మాన్పించొద్దు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయించాలి. చివరి నిమిషంలో కలిగే ఆందోళన, చికాకులతో ఇప్పటికే వచ్చిన అంశాలను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత బాగా చదివితే అంతే బాగా సమాధానాలు రాయగలుగుతాం. ఆఖరి నిమిషంలో హడావుడి చేయ కుండా విద్యార్థులంతా నిర్దేశిత సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మొదటిసారిగా బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. – నారాయణరెడ్డి, కలెక్టర్ ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాం. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. జీరాక్స్ సెంటర్లు మూసివేయిస్తున్నాం. పేపర్ లీకేజీ పుకార్లను నియంత్రించేందుకు పోలీసులు మఫ్టీలో విధులు నిర్వర్తించనున్నారు. పోలీసు స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలను ఆయా కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసు ఎస్కార్ట్ బందోబస్తు ఏర్పాటు చేశాం. జవాబు పత్రాల తరలింపులోనూ ఇదే తరహా బందోబస్తు ఏర్పాటు చేశాం. మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల సహా పలు మండల కేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. – జి.సుధీర్బాబు, కమిషనర్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ -
జిల్లాలో గ్యాస్ కొరత లేదు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వందతులను నమ్మొద్దు’ అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకు ముందు బుక్ చేసుకున్న తరువాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా ఉంటుందన్నారు. ఎలాంటి జాప్యం ఉండదని, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల వంటి సంస్థలకు కొరత లేదన్నారు. అవాస్తవాలను, వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హయత్నగర్: మునుగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించనున్నట్టు రిజిస్ట్రార్ విజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మునుగనూరులోని పాత పంచాయతీ భవనంలోకి మార్చాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్యాలయాన్ని మునుగనూరుకు మార్చినట్లు ఆయన తెలిపారు. పహాడీషరీఫ్: మామిడిపల్లి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నూతన రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు తెలిపారు. మామిడిపల్లి వార్డు కార్యాలయంలో శుక్రవారం గ్రామసభ ఏర్పాటు చేసి భూములు కోల్పోయే రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మొత్తం తొమ్మిది మంది పట్టాదారులకు సంబంధించి 106, 107, 108 సర్వే నంబర్లలో 3.17 ఎకరాల భూమిని సేకరించనున్నారు. గ్రామం నుంచి రంగనాయకుల దేవాలయానికి వెళ్లే దారి మధ్యలో నుంచి దాదాపు 600 మీటర్ల పొడవులో 100 ఫీట్ల విస్తీర్ణంలో నూతన రహదారిని నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసి పనులు మొదలు పెడతామని వెల్లడించారు. సమావేశంలో బాలాపూర్ డిప్యూటీ తహసీల్దార్ మణిపాల్ రెడ్డి, ఆర్ఐ జమీల్, మాజీ కార్పొరేటర్లు సుక్క శివకుమార్, యాతం పవన్కుమార్ యాదవ్, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. శంకర్పల్లి: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ అన్నారు. మహారాజ్పేట్ పశు వైద్యశాల పరిధిలోని జన్వాడలో శుక్రవారం గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి శ్రావణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువుల్లో వచ్చే వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలని తెలిపారు. పశు వైద్యులు గ్రామాలకి వచ్చినప్పుడు వారి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
పురుగు మందు తాగి వ్యక్తి బలవన్మరణం
శంకర్పల్లి: పురుగు మందు తాగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలలోని రావులపల్లి గ్రామానికి చెందిన పాల యాదయ్య(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకి భార్య, కొడుకు ఉన్నారు. కూతురికి ఏడాది క్రితం వివాహం చేశాడు. కూతురు వివాహ సమయంలో కొంత మేర అప్పు చేసి విడతల వారీగా చెల్లిస్తున్నాడు. కొన్ని నెలలుగా చెల్లింపులలో ఇబ్బందులు తలెత్తడంతో.. ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన యాదయ్య గురువారం శంకర్పల్లికి వచ్చి పురుగు మందు డబ్బాని కొనుగోలు చేసి, రాత్రి పొలం వద్దకు వెళ్లి అక్కడే నిద్రించాడు. ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచారు. అప్పుడే పొలం వద్ద పురుగుల మందు తాగిన యాదయ్య, వెంటనే ఇంటికి వెళ్లి, వాంతులు చేసుకున్నాడు, కుటుంబసభ్యులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పాడు. వెంటనే హుటాహుటినా సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. చికిత్స పొందుతున్న ఆయన మధ్యా హ్నం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. చికిత్స పొందుతూ మృతి -
అవమాన భారంతో మహిళ ఆత్మహత్య
● పురుగుల మందు తాగి మృతి ● సిరిగిరిపేట్లో ఘటన ● కరన్కోట్ పీఎస్లో కేసు నమోదు తాండూరు రూరల్: వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక, మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాండూరు మండలం సిరిగిరిపేట్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వినోద్ రాథోడ్, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అగ్గనూర్ లక్ష్మి(35), వీరప్ప దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పంట పెట్టుల కోసం ఏడాది క్రితం ఇదే ఊరికి చెందిన హన్మంత్రెడ్డి వద్ద మూడు రూపాయల వడ్డీకి రూ.లక్ష తీసుకున్నారు. కొద్ది నెలలుగా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఇటీవల అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతినడంతో నష్టపోయి, వడ్డీ చెల్లించలేకపోయారు. ఈక్రమంలో శుక్రవారం హన్మంత్రెడ్డి తన భార్య ఉమాదేవితో కలిసి వీరప్ప ఇంటికి వెళ్లారు. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఉగాది వరకు చెల్లిస్తామని, అప్పటి వరకు తమ బైక్ తీసుకెళ్లమని లక్ష్మి చెబుతున్నా పట్టించుకోకుండా గ్రామస్తుల ఎదుట అవమానపర్చారు. ఈ ఘటనను అవమానంగా భావించిన లక్ష్మి మధ్యాహ్నం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి మరణాన్ని తట్టుకోలేని లక్ష్మి కొడుకు, కూతురు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వీరప్ప ఫిర్యాదు మేరకు కరన్కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీపీఆర్ చేసి.. ఆస్పత్రికి తరలించి
మోమిన్పేట: పురుగు మందు తాగిన ఓ వ్యక్తిని 108 సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన శుక్రవారం మోమిన్పేటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి దేవరంపల్లి గ్రామానికి చెందిన చాకలి ఎల్లయ్య.. అప్పుల పాలయ్యాడు. ఆ రుణం తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురై.. పరుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు అంబులెన్స్కు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది.. సీపీఆర్ చేశారు. అనంతరం మెరుగైన కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఈఎంటి తరుణ్, పైలట్ తాజొద్దీన్లను కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది -
బాలిక అదృశ్యం
పహాడీషరీఫ్: బాలిక అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన ప్రకారం.. యూపీకి చెందిన సుభాహ్ రాజ్బార్ తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు నిమిత్తం జల్పల్లి శ్రీరామ కాలనీకి వలస వచ్చాడు. ఈ నెల 9వ తేదీన దంపతులు పనికి వెళ్లగా ఇంట్లో కుమార్తె రాధ(15), కుమారుడు ఉన్నాడు. ఉదయం 10 గంటల సమయంలో కిరాణ దుకాణానికి వెళుతానని బయటికి వెళ్లిన రాధ తిరిగి రాలేదు. లాలీరామ్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ రాజ్బార్ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. రేషన్ డీలర్పై తాత్కాలిక సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేసిన ఆర్డీఓ పార్థసింహారెడ్డి శంకర్పల్లి: మండల పరిధిలోని మహాలింగాపురంలో రేషన్ షాప్ నం.06 డీలర్ మాచన్నగారి లక్ష్మారెడ్డి ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో న్యాయ విచారణ నిమిత్తం 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కి వెళ్లాడు. ఆయన అందుబాటులో లేకపోవడంతో డీలర్షిప్ని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో షాప్ నం.07 డీలర్ ఎండీ ఆయూబ్ జహాన్కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు గమనించి, షాప్ నం. 07నుంచి రేషన్ సరుకులు తీసుకోవాలన్నారు. -
డీసీపీని కలిసిన ఆమనగల్లు ఎస్హెచ్ఓ
ఆమనగల్లు: మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డిని శుక్రవారం ఆమనగల్లు ఠాణా ఎస్హెచ్ఓ సంద వెంకటేశ్వర్లు శుక్రవారం కలిశారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఆయన డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆమనగల్లు పట్టణంలో ప్రథమశ్రేణి న్యాయమూర్తి కాటం స్వరూపను కలిసి పూలమొక్క బహూకరించారు. మండల విద్యాధికారిపై చర్యలకు ఫిర్యాదు శంకర్పల్లి: మండల విద్యాధికారి అక్బర్పై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్యూ జిల్లా నాయకులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కి ఫిర్యాదు చేశారు. అనంతరం పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ.. మండలంలోని జన్వాడ జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడైన సయ్యద్ అక్బర్ 2015లో మండల విద్యాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఇష్టారీతినా అనుమతులు ఇస్తూ, ప్రభుత్వ విద్యా విధా నాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలకు పదో తరగతికి అనుమతి లేకున్నప్పటికీ దాంట్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే మండల విద్యాధికారిపై తగు విచా రణ జరిపి, చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్దఎత్తున అందోళన చేపడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వరుడికి అడిషనల్ ఎస్పీ పూజలు కుల్కచర్ల: బండవెల్కిచర్ల గ్రామం పాంబండ రామలింగేశ్వరునికి శుక్రవారం అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు.. అడిషనల్ ఎస్పీని సన్మానించారు. కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, అర్చకులు పాండు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి దోమ: ప్రమాదవశాత్తు చింత చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన దోమ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వసంత్ జాదవ్ వివరాల ప్రకారం.. మండల పరిధి దిర్సంపల్లి గ్రామానికి చెందిన బైండ్ల బాబు(47), ఈ నెల 10న అదే గ్రామానికి చెందిన ఖదీర్ పాష వద్దకు చింతకాయను దులిపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలోని చెట్టు ఎక్కి రాల్చేందుకు యత్నించగా.. కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం వికారాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ప్రాణాలు విడిచాడు. కేసు దర్యాప్తులో ఉంది. మూసీ బాధితులపై గృహ నిర్బంధం అప్రజాస్వామికం మానవ హక్కుల వేదిక ఆందోళన సాక్షి, సిటీబ్యూరో: మూసీరివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే బాధితుల గొంతు నొక్కుతూ ప్రభుత్వం వారిపై గృహ నిర్బంధం విధించడం దారుణమని మానవ హక్కుల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టు నివేదికను వెల్లడించగా, మరోవైపు మానవ హక్కుల వేదిక నగర కమిటి ఉపాధ్యక్షుడు, మూసీ, బస్తీ ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న సయ్యద్ బిలాల్ పై గృహనిర్బంధం విధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, ఉభయరాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.జీవన్కుమార్, హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు సురేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. మానవ హక్కుల వేదికతో పాటు, నివాస హక్కుల సంస్థలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, బస్తీ ప్రజలు తదితర వర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తాము వ్యతిరేకించడం లేదని, ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే బాధితులకు పునరావాసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. పునరావాసం కల్పించకుండా నిరాశ్రయులను చేయడం తగదన్నారు. సామాన్య ప్రజల నివాస హక్కులను గౌరవిస్తూ మూసీ నదిని శుభ్రం చేసే ప్రాజెక్ట్ ను చేపట్టాలని, గాంధీ సరోవర్ను ఇదివరకే ఉన్న బాపూ ఘాట్ ప్రాంగణానికి పరిమితమై మాత్రమే నిర్మించాలని వారు కోరారు. కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య తాండూరు రూరల్: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కరన్కోట్ పోలీస్స్టేషన్ పరిధి చెంగోల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాథోడ్ వినోద్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైండ్ల లక్ష్మి(52), వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. కొన్ని నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో దూలానికి తాడుతో ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కేసు దర్యాప్తులో ఉంది. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు
● ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు ● వాహనాన్ని బయటకు తీసిన పోలీసులు, డీఆర్ఎఫ్ బృందం షాద్నగర్ రూరల్: అతివేగంగా దూసుళ్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లగా, ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మున్సిపల్ పరిధిలోని చటాన్పల్లిలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని నలందానగర్కు చెందిన శ్రీకాంత్రెడ్డి, నరేష్ స్నేహితులు. వీరు గురువారం తమ స్నేహితుడు బండ్లగూడజాగీరు పరిధిలోని వ్యాలీ కాలనీలో నివాసం ఉంటున్న కజ్జం రమంత్కు చెందిన గ్రాండ్ విఠారా కారును తీసుకొని ఫరూఖ్నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామానికి వచ్చి, రాత్రి హైదరాబాద్ పయనమయ్యారు. మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్రెడ్డి, నరేష్ కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపు తప్పి చటాన్పల్లి శివారులోని సురసముద్రం చెరువులోకి దూసుకెళ్లింది. కారును నిలిపే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకపోవడంతో స్నేహితులిద్దరూ కిందకు దూకేశారు. కారు పూర్తిగా చెరువులోకి దూసుకెళ్లిన తర్వాత ఇద్దరూ అక్కడనుండి వెళ్లిపోయారు. చెరువులో పడిపోయిన కారును చూసిన పలువురు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఆర్ఎఫ్ బృందం సభ్యులతో శ్రమించి బయటకు తీశారు. కారు నంబర్ ఆధారంగా యజమాని వివరాలు తెలుసుకుని సమాచారం అందించారు. రమంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ మల్లిఖార్జున్ తెలిపారు. -
మూసీలోకి చేరే ముందు వంద శాతం నీటి శుద్ధి
జలమండలి ఎండీ అశోక్రెడ్డి మాదాపూర్: మూసీనదిలోకి చేరే ముందు మురుగునీటిని దాదాపు 100 శాతం శుద్ధి చేసే విధంగా అదనపు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. మాదాపూర్ సైబర్ గార్డెన్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సదస్సు (హైడ్రెకాన్–2026) నిర్వహించారు.ఈ సందర్భంగా అశోక్రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో గత 10 సంవత్సరాలలో నీటి కనెక్షన్లు 8 లక్షల నుంచి 14 లక్షలకు పైగా పెరిగాయన్నారు. దీని వల్ల తాగునీటి అవసరం గణనీయంగా పెరిగిందని వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సుమారు రూ.7300 కోట్ల వ్యయంతో గోదావరి ఫేజ్–2, ఫేజ్–3 ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే నగరంలో తాగునీటి సరఫరా మెరుగుపడుతుందన్నారు. అనంతరం మూసీ రివర్ప్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు, నగరంలో మౌలిక వసతులు, పర్యాటకం, నీటి నిర్వహణ, పట్టణ ప్రణాళికలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఐఐ ఐజీబీసీ జాతీయ చైర్మన్ శేఖర్రెడ్డి, క్రెడాయి జాతీయ అధ్యక్షుడు జి.రామ్రెడ్డి, క్రెడాయి హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయ్సాయి మేక, నారెడ్కో జనరల్ సెక్రటరీ శ్రీధర్రెడ్డి, హైబిజ్ వన్ ఎల్ఎల్పీ ఫౌండర్ జె.సంద్యారాణి, హైబీజ్ టీవి ఫౌండర్ రాజ్గోపాల్ పాల్గొన్నారు. -
ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా వీరేష్కుమార్
షాద్నగర్: కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామ పరిధిలో ఉన్న జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ను కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సుమారు రూ.12 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, మరో రూ.8 కోట్లు మంజూరు చేయాలన్నారు. స్పందించిన మంత్రి దర్గాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టిందని, అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం మునుగనూరులోని సర్వే నంబర్ 83లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుండడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు గురువారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని అక్రమంగా దున్నుతూ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో బోర్డు తొలగించి ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసు కేసు కూడా నమోదైందని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదని, బోర్డును తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుద్యాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎంవో సెక్రటరీ మాణిక్కరాజ్ కన్నన్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 16 నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి కావాలని టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతి రెడ్డికి సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. భవనాలు అందుబాటులోకి రాగానే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ డీఈఈ విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈఈలు రాజయ్య, నాగేశ్వర్ రావు, ఏఈలు జనార్దన మూర్తి, విజయభాస్కర్ రెడ్డి, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
నిద్రలేని రాత్రులు గడుపుతున్న పేదలు
పంజగుట్ట: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ మాసం మొత్తం పండగలా ఉండేది కానీ ఇప్పుడు పండగలానే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం సోమాజిగూడలోని జయా గార్డెన్లో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రంజాన్ రేషన్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... గతంలో బీఆర్ఎస్ హయాంలో రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్టులు, షాదీ ముబారక్ కింద ఒక లక్ష రూపాయలు ఇచ్చేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే షాదీ ముబారక్ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తానని హామీ ఇచ్చారని దాన్ని తుంగలో తొక్కారని అన్నారు. తులం బంగారం ఏమో గాని.. ఏ టైంలో వచ్చి మా ఇండ్లను కూల్చేస్తారో అని పేదలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. రంజాన్ పవిత్ర మాసంలో అబద్దాలాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఆ దేవుడు కూడా క్షమించడని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అక్కున చేరిన దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ కూడా చేసి నేను పార్టీ మారలేదు అంటూ అబద్ధమాడుతున్నాడన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ ఏ మహేష్ యాదవ్ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
గ్యాస్ పాయే.. కట్టెలపొయ్యే
ఇబ్రహీంపట్నం: గ్యాస్ సంక్షోభం ఇటు వ్యాపార, అటు గృహ వినియోగదారులను పట్టి పీడిస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తలెత్తిన సమస్య అన్నివర్గాల ప్రజలను, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. డివిజన్ పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, ఉన్నత విద్యాలయాలు, హాస్టల్స్ ఉన్నాయి. టీ, టిఫిన్ సెంటర్స్, హోటళ్లు, బేకరీలు, కర్రీ పాయింట్లు, పెద్ద సంఖ్యలో వెలిసాయి. వారం రోజులుగా గ్యాస్ కొరత నెలకొనడంతో వారి వ్యాపారం దెబ్బతింటోంది. కమర్షియల్ సిలిండర్లను నిలిపివేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. రోజుకు మూడు, నాలుగు సిలిండర్లు అవసరమయ్యే వ్యాపారులకు ఏం చేయాలో తోచడం లేదు. చేసేది లేక కట్టెల పొయ్యిలు పెట్టి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. హోటల్స్ను మూసివేస్తే భవనాల రెంట్, పనిచేసే సిబ్బంది జీతభత్యాలు భారంగా మారనున్నాయి. వివిధ హాస్టళ్లలో గ్యాస్ నిల్వలు నిండుకుంటుండడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవకాశం ఉన్న వ్యాపారులు కట్టెల పొయ్యిలవైపు దృష్టి సారిస్తున్నారు. గ్యాస్ బుకింగ్ కాక అగచాట్లు వంట గ్యాస్ కొరతతో సామాన్యులు సతమతమవుతున్నారు. రోజురోజుకూ సమస్య జఠిలంగా మారుతోంది. వారం రోజులుగా గృహ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నా డీలర్ పాయింట్ నుంచి రెస్పాన్స్ రావడం లేదు. వాణిజ్య సిలిండర్కు గండం హోటళ్లు, బేకరీలు, కర్రీ పాయింట్లు, హాస్టళ్లపై ప్రభావం ఆందోళనలో వ్యాపారులు, నిర్వాహకులు గృహ వినియోగదారులకూ తప్పని అవస్థలు కట్టెల పొయ్యిలపై వంటకాలు -
బాధ్యతల స్వీకరణ
శంకర్పల్లి: స్థానిక పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్గా గురువారం మీర్ ముదస్సర్ అలీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన వెయింటింగ్ లిస్ట్లో ఉండగా.. తాజాగా ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు శంకర్పల్లి ఠాణా ఇన్స్పెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇక్కడ పని చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ని కమిషనరేట్లోని సైబర్ క్రైమ్స్ విభాగానికి బదిలీ చేశారు. ఠాణాలో శాంతి భద్రతలను కాపాడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని, అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విసృత్తంగా అవగాహన కల్పించనున్నట్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ముదస్సర్ అలీ పేర్కొన్నారు. మట్టి టిప్పర్ల పట్టివేత ఇబ్రహీంపట్నం రూరల్: అర్ధరాత్రి మట్టి తరలించే టిప్పర్లను ఆదిభట్ల పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల మేరకు.. రావిర్యాల సమీపంలో ఓ ప్రభుత్వ భూమిలో జేసీబీల సహాయంతో టిప్పర్లల్లో మట్టి నింపి అక్రమంగా తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు జరిపి.. నాలుగు మట్టి టిప్పర్లు, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ సస్పెన్షన్ దుండిగల్: దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ (టీపీఎస్) సంజనను సస్పెండ్ చేస్తూ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్ లలిత్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టౌనన్్ ప్లానింగ్ విభాగంలో సంజన అవినీతికి పాలడినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
● వెంటాడిన రోడ్డు ప్రమాద కేసు ● శ్రీశైలం హైవే పక్కన ఉరేసుకున్న వైనం ఇబ్రహీంపట్నం రూరల్: మద్యం మత్తులో ఇద్దరిని ఢీకొట్టడంతో మనోవేదన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శ్రీశైలం హైవేపై నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి బాలరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తుర్క యంజాల్లో నివాసం ఉంటున్నాడు. ఆయన కు మారుడు బాలకృష్ణ(28) ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి మద్యం తాగి కారులో తుర్కయంజాల్లోని బవర్చి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మనోజ్, మంజునాథ్ తీవ్రంగా గా యపడ్డారు. దీంతో క్షతగాత్రులు ఆదిభట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు 9వ తేదీన బాలకృష్ణపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీస్స్టేషన్కు రావాలని తండ్రీకొడుకులను నోటీసు అందజేశారు. చనిపోతానని ఇంట్లో నుంచి వెళ్లి ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తీవ్ర మనోవేదనకు బాలకృష్ణ లోనయ్యాడు. మధ్యాహ్నం తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే ఆయన భార్య స్పందించి 100 కాల్ చేసి చెప్పింది. ఆదిభట్ల పోలీసులు అప్రమత్తమై లోకేషన్ ఆమనగల్లులో గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు. అటవీ ప్రాంతం ఉండటంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మిస్సింగ్ కేసుగా సాయంత్రం నమోదు చేశారు. కుటుంబీకుల సపోర్ట్ లేక గురువారం ఉదయం శ్రీశైలం హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఉన్నాడని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు వెళ్లి పరిశీలించి బాలకృష్ణ(28)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు మద్యం మత్తులో ప్రమాదం కలిగించానని, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
74 కేసుల్లో 117 మంది అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 74 కేసులకు సంబంధించి 117 మందిని అరెస్టు చేశారు. నిందితులందరినీ 16 రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్నట్లు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు గురువారం ప్రకటించారు. 63 మంది ట్రేడింగ్/ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్, ఆరుగురు డిజిటల్ అరెస్టు, నలుగురు ఓటీపీ ఫ్రాడ్, ఒకరు సోషల్మీడియా ఫ్రాడ్స్ కేసుల్లో నిందితులు చిక్కారు. మరోపక్క బాధితులు కోల్పోయిన మొత్తంలో రూ.34,76,884 ఫ్రీజ్ చేయించి, రీఫండ్ చేశారు. గతనెల్లో అరెస్టు అయిన 117 మందిపై దేశంలోని వివిధ ఠాణాల్లో నమోదైన 1081 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.వీరి బ్యాంక్ ఖాతాల్లో రూ.139 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. ఈ నిందితుల నుంచి రూ. 36 లక్షల నగదు, 221 ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరంలోని జోనల్ సైబర్ సెల్స్కు ఫిబ్రవరిలో 2963 ఫిర్యాదులు అందగా... వీటిలో 461 కేసులుగా నమోదయ్యాయి. ఈ అధికారులు 11 మందిని అరెస్ట్ చేసి, బాధితులకు రూ.24,10,741 రీఫండ్ చేయించారు. నిరంతర సైబర్ పెట్రోలింగ్, ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న 124 ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్స్ను పోలీసులు గుర్తించారు. ఇవి 539 ప్రకటనల ద్వారా యువతను ఆకర్షిస్తుండటంతో వీటిని తొలగించారు. సీ–మిత్ర అధికారులు 2,396 మంది బాధితులకు ఫోన్ చేసి సహాయం అందించారు. ఫిర్యాదుల ఆధారంగా 257 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలి. 16 రాష్ట్రాల్లో పట్టుకున్న సైబర్ కాప్స్ రూ.34.76 లక్షలు బాధితులకు రీఫండ్ ఫిబ్రవరి గణాంకాలు వెల్లడించిన అదనపు సీపీ -
రైతులకు అండగా ఉంటాం
తుర్కయంజాల్: బీసీ, ఎస్సీ కులాలకు చెందిన రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరుతో లాక్కోవడం దారుణమని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో పండ్ల మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం కోల్పోనున్న భూములను గురువారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూములను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవడంతో అనేక మంది ఉపాధిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోతున్న ప్రతి రైతుకు పరిహారంతో పాటు, 500 గజాల ప్లాట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తుర్కయంజాల్ బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి, రైతు సేవా సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, సీనియర్ నాయకులు బచ్చిగళ్ల రమేష్, కందాల బల్దేవ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం మద్దతు కొహెడ సర్వే నంబర్ 167 బై 1లో భూములు కోల్పోతున్న రైతులు మూడు రోజులుగా చేపడుతున్న నిరసనకు గురువారం సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏర్పుల నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.సత్యనారాయణ, శ్రీను, మల్యాద్రి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ -
‘ఉపాధి’ని నీరుగార్చే కుట్ర
కందుకూరు: జాతీయ ఉపాధిహామీ చట్టానికి పేరు మార్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చట్టాన్ని పూర్తిగా తొలగించేలా చేస్తున్న తిప్పికొట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అంకగళ్ల కుమార్ ఆధ్వర్యంలో గురువారం కందుకూరులో ఉపాధిహామీ కూలీలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ పేరుతో ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి నూతనంగా వీబీ రామ్జీ 2025/197 చట్టాన్ని తేవడం అంటే రాబోయే రోజుల్లో చట్టాన్నే నిర్వీర్యం చేసే ప్రయత్నమేనన్నారు. ఎర్ర జెండా పోరాటంతో అప్పటి ప్రభుత్వం 2005లో వలసలు తగ్గించి పేదల కడుపు నింపాలనే లక్ష్యంతోనే తెచ్చిన ఉపాధిహామీ చట్టంలో పురుషులు, మహిళలు అనే తారతమ్యం లేకుండా సమాన పనికి సమాన వేతనం, వంద రోజుల పని దినాలు కల్పించేలా అమలైందన్నారు. ఈ చట్టానికి రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్ ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.90 వేల కోట్లకు పరిమితం చేశారన్నారు. సకాలంలో కూలీ డబ్బు అందించడంలో విఫలమవుతున్నారన్నారు. కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు మస్కు అరుణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల అంజయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రాంచందర్, సీఐటీయూ జిల్లా నాయకుడు బుడ్డీరపు శ్రీనివాస్, సీపీఎం మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్, పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు రాయికంటి శేఖర్, సురేష్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
పాతాళానికి ఉల్లి ధరలు
మర్పల్లి: ఉల్లి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. పెట్టుబడి డబ్బు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మినుము, పెసర, సోయాబీన్ వంటి పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాల రైతులు సుమారు 600 ఎకరాల్లో యాసంగి పంటగా బావులు, బోర్ల కింద ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.60 నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టారు. 80 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. ఆశించిన మేర దిగుబడి వచ్చి నా ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటాలు ఉల్లిపాయల బస్తా రూ.700 ఉందని తెలిపారు. నాట్లు, రవాణ, కూలీల ఖర్చులకే సరిపో యిందని వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతుఽ ధర రూ.2 వేలు ప్రకటించాలని కోరారు. -
డిప్యూటేషన్ రద్దు చేయాలని వినతి
ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్పై వెళ్లిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని కౌన్సిలర్ ఆంజనేయులుయాదవ్ కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వి ద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఈ మేరకు ఆయన వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్ను రద్దు చేసి పాఠశాలలోనే విధులు నిర్వహించేలా చూడాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు. 108 అంబులెన్స్లో ప్రసవం అబ్దుల్లాపూర్మెట్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ అంబులెన్స్లో ప్రసవించిన సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుంతపల్లి గ్రామానికి చెందిన లావణ్యకు పురిటి నొప్పుల రావడంతో 108 వాహనానికి కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 వాహన మెడికల్ టెక్నిషీయన్ దశరథ, పైలట్ చెరుకు శ్రీనివాస్ సాధారణ ప్రసవం చేశారు. ఫలితంగా లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో హయత్నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తల్లీశిశువును తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా లావణ్య కుంటుబీకులు అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలయజేశారు. మహిళా సమస్యల పరిష్కారానికి ‘జన్ సున్వాయ్’ హాజరైన జాతీయ మహిళా కమిషనర్ చైర్పర్సన్ విజయ రహత్కర్ సాక్షి, సిటీబ్యూరో: మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) నడుం బిగించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఈనెల 8 నుంచి 13 వరకు ఎన్సీడబ్ల్యూ దేశవ్యాప్తంగా మహిళా జన్ సున్వాయ్ (పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గురువారం మల్కాజ్గిరి కమిషనరేట్లో మహిళలు ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి మహిళా జన్ సున్వాయ్ను నిర్వహించింది. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నుంచి 30 ఫిర్యాదులు, ఐదు వాక్ ఇన్ ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ప్రధానంగా గృహ హింస, వేధింపులు, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. ఆయా కేసులను ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రహత్కర్ సమీక్షించి సత్వర చర్యలు, పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఏసీబీ తెలంగాణ డీజీ చారు సిన్హా, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కే అవినాష్ మొహంతి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సీపీ ఎం శ్రీనివాస్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఇతర అధికారులు హాజరయ్యారు. 11కిలోల గంజాయి స్వాధీనం సికింద్రాబాద్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురితోపాటు నలుగురు వినియోగదారులను పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ పోలీసులు గురువారం తెలిపిన మేరకు.. చిలకలగూడ డబుల్ బెడ్రూం క్వార్టర్స్ సమీపంలో కొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఇన్స్పెక్టర్ రామకృష్ణలు సిబ్బందితోకలిసి దాడులు చేసి సుభాష్ మిషాల్(33), పబిత్ర బీరా(24), బాపున్ బిడికా(24)లతో పాటు మరో నలుగురు గంజాయి వినియోగదారులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 11.530 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
మట్టిదందాపై పోలీసుల దాడి
షాద్నగర్రూరల్: గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అక్రమ మట్టి దందాపై శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. మట్టి సరఫరా చేస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని విఠ్యాల గ్రామ పంచాయతీ శ్యామలబండతండాలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుశీల కథనం ప్రకారం.. శ్యామలబండతండా సమీపంలో కొంత కాలం క్రితం అగ్రిగోల్డ్ వెంచర్ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్ కొంత కాలంగా వివాదాస్పదంగా ఉండటం, ఇళ్ల స్థలాలపై కోర్టులో కేసులు నడుస్తుండటంతో యజమానులు వెంచర్ వైపు రావడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమ మట్టి వ్యాపారులు యథేచ్ఛగా అగ్రిగోల్డ్ వెంచర్లో అక్రమ మట్టి దందాకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీతో ప్లాట్లను తవ్వి రాత్రింబవళ్లు మట్టి దందాను కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసి మూడు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు. -
ముప్పు పక్కా!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో వయసు పైబడి చావుకు దగ్గరగా ఉన్న, వ్యాధులు సోకిన జీవాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. తాజాగా మంగళ్హాట్ పరిధిలోని చిస్తీచమాన్దర్గా సమీపంలోని ఓ వ్యక్తి నుంచి 300 కిలోల కుళ్లిన మాంసాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ జిల్లాల్లో అధికారికంగా 7 వేలకుపైగా మాంసం విక్రయ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా 30 వేల వరకు ఉన్నట్లు అంచనా. గత ఏడాది ఫుడ్సేఫ్టీ అధికారులు తనీఖీలు నిర్వహించగా 5,730 విక్రయ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. మెజార్టీ కేంద్రాల్లో శుభ్రత లోపం, స్టాంపు లేని గొర్రెలు, మేకలు కోసి అమ్ముతుండటాన్ని గుర్తించారు. ఈరోజు కాదంటే.. మరుసటి రోజు నిజానికి ఏదైనా మేక, గొర్రె, కోడి కోసే ముందు పశువైద్యుడు క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. కానీ 99 శాతం మాంసం వ్యాపారుల వద్ద ఇవేవీ ఉండటం లేదు. గొర్రెలు, మేకల మాంసంలో పశువుల మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి గొర్రెను కోసిన తర్వాత సాధారణ వాతావరణంలో నిల్వ ఉంచితే త్వరగా పాడవుతుంది. మెజార్టీ మాంసం విక్రయ దుఖాణాల్లో రోజంతా రోడ్డు పక్కన ఓ తాడుకు వేలాడదీసి ఉంచుతున్నారు. ఈ రోజు కోసింది అమ్ముడు పోకపోతే.. దాన్ని మరుసటి రోజు అమ్ముతున్నారు. అప్పటికే అందులో అనేక రకాల బ్యాక్టీరియా చేరుతోంది. కుళ్లిన మాంసంతో కలర్ఫుల్ బిర్యానీ, ఫ్రై వంటకాలు తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలియక చాలామంది మాంసం ప్రియులు ఆరగించేస్తున్నారు చివరకు అనారోగ్యానికి గురవుతున్నారు. తాము కొన్న మాంసంపై ఏదైనా అనుమానం ఉంటే పరీక్ష కోసం చంగిచర్లలోని జాతీయ మాంసం పరిశోధన మండలి (ఎన్ఆర్సీఎం)ని సంప్రదించొచ్చు. యథేచ్ఛగా నాసిరకం, కుళ్లిన మాంసం విక్రయాలు తాజాగా మంగళ్హాట్లో 300 కిలోల పట్టివేత వ్యాధులు సోకిన జీవాలను కోసి అమ్ముతున్న వైనం రోగాలు తప్పవంటున్న వైద్య నిపుణులుతలసరి మాంసం వినియోగం ఇలా గొర్రె మాంసం 4.02 కేజీలు మేక మాంసం 0.950 కేజీలు చికెన్ 3.5 కేజీలు ఇతర జంతువుల మాంసం 0.73 కేజీలు మొత్తం 9.2 కేజీలు -
సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పని చేస్తే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులపై అనేక బాధ్యతలు ఉన్నాయని, ప్రజలతో మమేకమై పనులు చేసినప్పుడే ప్రజల మన్ననలు పొందుతారని అన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక రూపొందించాలని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రోడ్డు భద్రత, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చూడాలన్నారు. రాష్ట్ర మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ టీకే శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలని, బాధ్యతతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పథకాల అమలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
శంషాబాద్ రూరల్: బైక్పై స్నేహితుడిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థితో పాటు యువకుడు మృతి చెందాడు. బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన మేరకు.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన సూరజ్(17) కొత్తూరులో అక్కబావల వద్ద ఉంటూ శంషాబాద్లోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. బీహార్ వాసి విక్కీసింగ్(22) స్థానికంగా ఉంటూ కూలీ పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. విక్కీ సింగ్ రెండు నెలల క్రితం కొత్త బైక్ కొన్నాడు. విక్కీసింగ్, సూరజ్ స్నేహితులు కావడంతో శంషాబాద్లోని పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి ఇద్దరూ కలిసి బైక్పై కొత్తూరు నుంచి బయలుదేరారు. విక్కీసింగ్ బైక్ నడుపుతుండగా.. సూరజ్ వెనకాల కూర్చున్నాడు. మదన్పల్లి పాతతండా సమీపంలో జాతీయ రహదారిపై వెనక నుంచి అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. బైక్ను ఢీకొన్న వాహనం వీరిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. మానవత్వం చాటుకున్న మంత్రి హైదరాబాద్ నుంచి మక్తల్ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర మంత్రి శ్రీహరి ఘటన స్థలానికి కొద్ది దూరం వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే తన సిబ్బందితో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించి మృతదేహాలను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేందుకు సహాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్లో హిట్ అండ్ రన్ బైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం మృతుల్లో పరీక్షకు వెళ్తున్న ఇంటర్ విద్యార్థి -
పాడైన మాంసం తింటే రోగాలు
కుళ్లిన, కల్తీ మాంసం తినడం ద్వారా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, అలర్జీ వంటి సమస్యలతో పాటు కాలేయం, మూత్ర పిండాల పని తీరు దెబ్బ తింటుంది. వధశాల నుంచే మాంసం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలి. వధశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంతో పాటు మాంసం పాడవకుండా ఎక్కువ సమయం నిల్వ ఉండేందుకు 0–4 సెల్సియస్ డిగ్రీల మధ్య నిల్వ చేసుకోవాలి. లేదంటే పాడవుతుంది. వధశాల నుంచి హోటళ్లకు పరిశుభ్రమైన వాహనాల్లోనే మాంసాన్ని తరలించాలి. – డాక్టర్ ఎంకే శ్రీకాంత్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, హైదర్గూడ -
ముదిరాజ్ సంఘం యువత విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
మొయినాబాద్: ముదిరాజ్ సంఘం యువత విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా షాబాద్ మండలం కొమరబండ గ్రామానికి చెందిన సుభాష్చంద్రబోస్ను నియమించారు. ఈ మేరకు బుధవారం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు బైరమోని మల్లేశ్ ముదిరాజ్, యువత విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణపురం మహేందర్ ముదిరాజ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ ముదిరాజ్ల అభివృద్ధికి, సంఘం విస్తరణకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు లింగం ముందిరాజ్, వెంకటయ్య ముదిరాజ్, సామయ్య ముదిరాజ్, బుచ్చయ్యముదిరాజ్, సర్పంచ్ నర్సింలు ముందిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బెంగాల్ ప్రభుత్వ తీరు సరికాదుఅనంతగిరి: ఇటీవల పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు యాస్కి శిరీష ఒక ప్రకటనలో తెలిపారు. ఒక పక్క అంతర్జాతీయ మహిళా దినోత్సం పేరిట ప్రపంచమంతా వారోత్సవాలను జరుపుకొంటున్న తరుణంలో మనదేశ అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి పట్ల ఇలాంటి ఘటన జరగడం సరైంది కాదన్నారు. అక్కడ జరిగే సదస్సును ముందుగా నిర్ణయించి రాష్ట్రపతి చెప్పిన ప్రాంగణంలో కాకుండా ఆదివాసీ ప్రజలు సభకు చేరుకోవడానికి వీలులేని దూర ప్రదేశానికి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మార్చిందన్నారు. రాష్ట్రపతిని ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం చేసుకోవాల్సిన సీఎం, మంత్రులు ఎవరు రాలేదన్నారు. కేవలం మేయర్ ఆమెను రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. నూతన భవనాలకు భూ కేటాయింపు ఆక్రమణకు గురైన భూమి స్వాధీనం: తహసీల్దార్ ధారూరు: మండల పరిధి కొండాపూర్కలాన్ గ్రామంలోని సర్వే నంబర్ 62లోని 32 గుంటల ప్రభుత్వ భూమిని సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేశామని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. బుధవారం సర్వే అనంతరం ఆమె మాట్లాడారు. ఈ భూమిలో డ్వాక్రా భవనం, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించనున్నామని చెప్పారు. ఓ రైతు ఆక్రమించిన 32 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆక్రమించలేదు.. కబ్జాలో ఉన్నాం భూమిని ఆక్రమించినట్లు అధికారులు పేర్కొంటున్న వెంకటయ్య, అతని కుటుంబీకులు సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులతో వాదనకు దిగారు. తాము ఈ భూమిని ఆక్రమించలేదని, ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్నామని తెలిపారు. తమ భూమిలోకి ఎవరూ రావొద్దని పేర్కొన్నాడు. ఈ భూమిని స్వాధీనం చేసుకుంటే.. తాము ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరించారు. ఈ క్రమంలో వెంకటయ్య జారి కిందపడటంతో.. అధికారులు 108 వాహనంలో అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ, డ్వాక్రా భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలం కోసం ఈ 62 సర్వే నంబర్లోని 4 ఎకరాలు ప్రభుత్వ భూమిని సర్వే చేయగా.. 32 గుంటల భూమి ఆక్రమణకు గురియైనట్లు తేలిందని వివరించారు. వెంకటయ్య, అతని కటుంబ సభ్యులు చెబుతున్న దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆమె పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే నాయక్ మృతి పరిగి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మోహన్ నాయక్ మృతి చెందాడని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆరోపించారు. బుధవారం కిష్టమ్మగుడితండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో అప్రమత్తత కరువైందన్నారు. వారి నిర్లక్ష్యంతోనే మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయక్ మృతి తీరని లోటన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్కుమార్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, కౌన్సిలర్లు రవికుమార్ పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి పోటీల్లో బాలికల సత్తా
కేశంపేట: మండల పరిధిలోని పీఎం శ్రీ కొత్తపేట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లా వ్యాప్తంగా 41 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడాపోటీలు మంగళవారంతో ముగిసాయి. ఖోఖో బాలికల విభాగంలో జిల్లా ప్రథమ స్థానం, వంద మీటర్ల పరుగుపందెంలో సుప్రియ ప్రథమ, వైష్ణవి తృతీయ స్థానంలో నిలిచారు. షార్ట్పుట్ బాలికల విభాగంలో అక్షిత ద్వితీయ బహుమతిని గెలుపొందారు. ఈ మేరకు బుధవారం ఎంఈఓ చంద్రశేఖర్ విద్యార్థులను కోచ్ నరేశ్, పీఈటీ గౌరిని అభినందించారు. -
తల్లీకూతురి అదృశ్యం
పహాడీషరీఫ్: తొమ్మిది నెలల కూతురుతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ షరీఫ్, హీనా బేగం(19) దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. పెద్ద కూతురు ఫాతీమాను నాలుగు రోజుల క్రితం వాదే ముస్తఫా బస్తీలోని అమ్మమ్మ ఇంట్లో వదిలేశారు. తొమ్మిది నెలల వయసున్న చిన్న కూతురు ఫిర్దోస్తో కలిసి బుధవారం ఉదయం ఇంట్లోనే ఉన్న హీనా బేగం సాయంత్రం భర్త వచ్చి చూడగా కనిపించలేదు. స్థానికంగా వెతికినా తల్లి, కూతురు ఆచూకీ లభ్యం కాలేదు. ఈ విషయమై వెంటనే పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరి ఆచూకీ తెలిస్తే పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లోనైనా సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కేసులు కొత్తూరు మున్సిపల్ కమిషనర్ బాలాజీ కొత్తూరు: ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ బాలాజీ సిబ్బందితో కలిసి కొత్తూరు పట్టణంలోని హోటళ్లు, బేకరీల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన నాణ్యమైన ఆహార పదర్థాలను మాత్రమే విక్రయించాలని, శుభ్రత పాటించాలని సూచించారు. కాలం చెల్లిన, మురిగిన కూరగాయలను ఉపయోగించినట్లు గుర్తిస్తే కేసులు తప్పవన్నారు. తనిఖీల్లో భాగంగా ఓ హోటల్లో కాలం చెల్లిన పదార్థాలను గుర్తించి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో శానిటైజేషన్ అధికారి మహేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్యతో విశ్వజ్ఞానం
● సాంకేతిక తరగతులను సద్వినియోగం చేసుకోవాలి ● కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి బొంరాస్పేట: కంప్యూటర్ విద్యతో విశ్వజ్ఞానం పెంపొందుతుందని, ఈ సాంకేతిక విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధి రేగడిమైలారం ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ తరగతి ల్యాబ్ను ప్రారంభించి మాట్లాడారు. ఇందులో ఎంఈఓ హరిలాల్, సీహెచ్ఎం రవీందర్గౌడ్, హెచ్ఎం మల్లేశ్, ఉపాధ్యాయులున్నారు. వినతులు పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను తొలగించి, ఉపయోగకరంగా మార్చాలని కడా అధికారికి స్థానికులు విన్నవించారు. గ్రామంలోని జాతీయరహదారిపై వెళ్లే ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులకు ఫీడర్ఛానళ్లు ఏర్పాటు, పూడికతీత పనులు చేపట్టాలని పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు. దీంతో కడా అధికారి మాట్లాడుతూ.. కొత్తూరు, రేగడిమైలారం చెరువుల తూముల మరమ్మతు తదితర పనులకు రూ.18 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. కుబ్యానాయక్తండా, నాందార్పూర్, బొంరాస్పేట, తుంకిమెట్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు. 99రోజుల ప్రగతి ప్రణాళిక పనులపై ఆరా తీశారు. వీరి వెంట జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహులు గౌడ్, వెంకట్రాములు గౌడ్, జయకృష్ణ, మల్లేశ్, రాంచంద్రారెడ్డి, మల్లికార్జున్, చంద్రప్ప, గుండప్ప, వెంకట్రెడ్డి, వీరప్ప తదితరులు ఉన్నారు. -
తలకొండపల్లి ఎస్హెచ్ఓగా జానకిరాంరెడ్డి
ఆమనగల్లు: తలకొండపల్లి పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓగా బుధవారం జానకిరాంరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు తలకొండపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐగా పనిచేసిన శ్రీకాంత్ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు అటాచ్ చేశారు. అనంతరం ఆమనగల్లు సీఐగా పనిచేస్తున్న జానకిరాంరెడ్డిని తలకొండపల్లి ఎస్హెచ్ఓగా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన జానకిరాంరెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. రెవెన్యూ కార్యాలయం పరిశీలన ఇబ్రహీంపట్నం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ తహసీల్దార్ సునితారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా వ్యవసాయ శాఖ కార్యాలయానికి సైతం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ తాండూరు టౌన్: తాళం వేసిన ఇంట్లో చోరి జరిగింది. ఈ సంఘటన పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సాయిపూర్కు చెందిన అంజిలయ్య వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వివాహ నిమిత్తం ఊరికి వెళ్లారు. బుధవారం వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి, బీరువా తెరిచి ఉన్నట్లు గమనించారు. పరిశీలించగా.. 8 గ్రాముల బంగారం, 5 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దుండగులు అపహరించినట్లు గుర్తించారు. అనంతరం బాధిత కుటుంబం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆర్థికాభివృద్ధికి సమన్వయం ముఖ్యం
యాచారం: ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు, ప్రభుత్వ విభాగాల మధ్యన సమన్వయం ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా బ్యాకింగ్ కార్యకలాపాల పురోగతి, వివిధ ప్రభుత్వ ప్రయోజిత పథకాల అమలుపై ఆయన లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా సంప్రదింపుల కమిటీతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ అడ్వాన్స్లు, విద్యారుణాల పంపిణీలో బ్యాంకుల, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా వివిధ రుణ పథకాల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ పద్దుల కింద దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందజేసే విధంగా సహకరించాలని సూచించారు. మంజూరు, పంపిణీని నిర్ధారించడానికి బ్యాంకులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఆర్థిక చేరికను పెంచడానికి కృషి చేయాలని తెలిపారు. రుణ ప్రాసెసింగ్ను క్రమబద్ధీకరించడానికి క్రెడిట్ డెలివరీ అడ్డంకులపై చర్చించారు. అదే విధంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా సంభావ్య క్రెడిట్ ప్రణాళికను సమావేశంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
మోటార్ వాహనాల దొంగ అరెస్ట్
● ఎనిమిది కేసుల్లో ప్రమేయం ● నిందితుడికి సహకరించిన బాలుడిని జువైనల్ హోంకు తరలించిన పోలీసులు పహాడీషరీఫ్: మోటార్ వాహనాలతో పాటు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి మూడు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పహాడీషరీఫ్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ బి.ఎల్.ఎన్.రెడ్డితో కలిసి శంషాబాద్ ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. కొందుర్గుకు చెందిన సల్లంగుల శ్రీకాంత్(23) బతుకుదెరువు నిమిత్తం వలస వచ్చి మైలార్దేవ్పల్లి పరిధిలోని లక్ష్మీగూడలో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టాడు. బహిరంగ పార్కింగ్ ప్రదేశాలు, ఇళ్ల ఎదుట పార్కు చేసి ఉన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను చోరీ చేసి అద్దెకివ్వడం లేదంటే విక్రయించడం చేసేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన పహాడీషరీఫ్ రంగనాయకుల కాలనీలో దాసరి శరత్బాబు అనే వ్యక్తి ఇంటి ఎదుట పార్కు చేసిన ఆటో(ఏపి 24డబ్ల్యూ 9588) చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టగా అటుగా వచ్చిన శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాల చిట్టా విప్పాడు. ఈ ఆటో దొంగతనం కేసులో తనకు తోడుగా డబ్బు ఆశజూపి బాలుడి సాయం తీసుకోవడంతో, బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. ఇళ్ల ఎదుట పార్కు చేసే ఆటోలకు తాళాలు పకడ్బందీగా వేసుకోవడంతో పాటు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఏసీపీ వాహనదారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది కేసుల్లో ప్రమేయం. నిందితుడు ఇప్పటి వరకు పహాడీషరీఫ్లో రెండు ఆటోలు, ఒక పల్సర్ బైక్, కర్నూల్ టూ టౌన్ పీఎస్ పరిధిలో ప్యాసింజర్ ఆటో, మహబూబ్నగర్లో పల్సర్ బైక్, యాక్టివా, మైలార్దేవ్పల్లిలో ఒక బైక్ను దొంగతనం చేశాడు. ఎనిమిది కేసులకు గాను పోలీసులు ఐదు కేసులకు సంబంధించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2025 డిసెంబర్లో జల్పల్లి శ్రీరామ కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ చోరీ చేసి రూ.70 వేల నగదును దోచేశాడు. ఆలయాల్లో ఇలాంటి నేరాలు చేసే వారితో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుందని ఏసీపీ పేర్కొన్నారు. -
హత్యచేసి.. దూలానికి వేళాడదీసి!
● భార్య మృతిపై భర్త అనుమానం ● ఆస్పత్రి ఎదుట ఆందోళన ● పోలీసులకు ఫిర్యాదు దౌల్తాబాద్: వీధి నాటకం చూసి వస్తానని వెళ్లిన ఓ మహిళ.. పక్కింట్లో దూలానికి వేళాడుతూ విగతజీవిగా కనిపించగా.. ఆమెను చంపి, దూలానికి వేళాడదీశారని మృతురాలి భర్త అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి కుప్పగిరి గ్రామానికి చెందిన మదరప్ప, అశోక్ కుటుంబ సభ్యులకు నాలుగు రోజుల క్రితం భూ విషయంలో పంచాయితీ జరిగింది. ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడే పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకొని, ఇకముందు ఎలాంటి గొడవలు చేసుకోమని హామీపత్రం రాసుకున్నారు. మారుమారు దాడి.. అలా పెద్దల మధ్య ఒప్పందం రాసుకున్న వారు.. భూ విషయంలో మంగళవారం ఉదయం మరోసారి గొడవకు దిగారు. ఇందులో అశోక్ భార్య కృష్ణవేణి(31)పై మదరప్ప కుటుంబ సభ్యులు దాడి చేసి, గాయపర్చారు. కాగా.. అదే రోజు రాత్రి గ్రామంలో ప్రదర్శించిన నాటకం చూడటానికి వెళ్తానని చెప్పిన సదరు మహిళ.. తెల్లవారే సరికి పక్కింట్లో దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో తన భార్యను మదరప్ప కుటుంబ సభ్యులు హత్యచేసి, ఇలా ఉరి వేశారని మృతిరాలి భర్త, కుటుంబీకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పరిసరాలను పరిశీలించి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. కొడంగల్ సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ రాజుకుమార్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. మృతురాలి భర్త అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
టీపీఎస్లతో నాణ్యమైన విద్య
మంచాల: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న డిజిటల్ తరగతులు, ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి బోధన తీరు ఎలా ఉందో తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీలో మెనూ పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఇందుకు విద్యార్థులు బాగుందని చెప్పారు. ఉపాధ్యాయులు, పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడి పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న పాఠశాలకు.. ప్రస్తుతం మార్పు ఎలా ఉందని తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు తీసుకువస్తే నిరుపేదలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ పాఠశాల నిర్వహణ తీరు బాగుందని కితాబిచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలో హుజూర్నగర్లో ఇదే తరహా పాఠశాలను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్, చంద్రారెడ్డి, డీఈఓ సుశీందర్రావు, హౌసింగ్ పీడీ చంపానాయక్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ పొట్రు, తహసీల్దార్ వెంకట ప్రసాద్, హెచ్ఎం గిరిధర్ గౌడ్, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్లో ముఖ్యమంత్రి రాక? ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏప్రిల్ 10 లేదా 12వ తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సందర్శించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 3న నగరంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలోనూ సీఎం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ గురించి మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుతో విద్యారంగంలో మరింత మార్పు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి బుధవారం ఆరుట్ల పర్యటనతో సీఎం వసార్తనే విషయానికి మరింత బలం చేకూరుతోంది. సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి -
ప్రగతి ప్రతీ గడపకు చేరాలి
మాడ్గుల: ప్రగతి ప్రతీగడపకు చేరాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కోల్కులపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో వార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ ఫైళ్లను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేసి ఆ సమాచారం లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినయ్ సాగర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ బట్టు అనురాధ, వార్డు సభ్యులు, మండల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి -
కిడ్నీలు కుదేలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లకు తోడు.. హైపర్ టెన్షన్, మధుమేహం, యాంటీబయోటిక్, పెయిన్ కిల్లర్స్ వంటి మందులు అతిగా వాడటంతో చిన్న వయసులోనే కిడ్నీల పనితీరు దెబ్బతింటోంది. జిల్లాలో ఏటావేయికిపైగా కిడ్నీ సంబంధ కేసులు నమోదవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గత నాలుగేళ్లలో 3,760 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు పొందుతున్నారు. ఇక నగదు చెల్లించి, ప్రైవేటు ఇన్సూరెన్సు కార్డులు సహా ఈఎస్ఐ, ఆర్టీసీ, సింగరేణి, సీజీ హెచ్ఎస్, ఈజేహెచ్ఎస్, తదితర పథకాల్లో భాగంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందిన వారి సంఖ్య రెండింతలు ఉన్నట్లు అంచనా. 80శాతం మందికి తెలీదు ఐసీఎంఆర్ సర్వే ప్రకారం 12శాతం మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన అంశమేమంటే బాధితుల్లో 80 శాతం మందికి తమకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తెలియదు. వీరంతా 90శాతం కిడ్నీ పాడైన తర్వాతే చికిత్సలకు వస్తున్నారు. ఇదిలా ఉండగా బాధితుల్లో 70 శాతం మంది పురుషులు ఉంటే, 30 శాతం మహిళలు ఉంటున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో 80 శాతం పురుషులు ఉండగా, మహిళలు 20శాతమే ఉంటున్నారు. మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో 93శాతం పురుషులు, కేవలం 7శాతమే మహిళలు ఉంటున్నారు. కానీ కిడ్నీ దాత(లైవ్ కిడ్నీ డోనర్స్)ల్లో మాత్రం 80 శాతం మహిళలే ఉంటుండటం గమనార్హం. ఐదు దశలుగా విభజిస్తే.. మొదటి దశలో 10 శాతం దెబ్బతిన్నప్పుడు అసలు లక్షణాలేమీ తెలియవు. రెండో దశలో 20–40 శాతం దెబ్బతిన్నప్పుడు అధిక రక్తపోటు, మూత్రంలో ప్రొటీన్ వెళ్లిపోవడం. ఇక మూడో దశలో 40–70 శాతం దెబ్బతిన్నప్పుడు రక్తహీనత, ఎముకలు బలహీనపడడం.. ఈ దశలో రక్తంలో పరీక్షలుచేస్తే క్రియేటినిన్ పెరగడం గుర్తించొచ్చు. నాలుగో దశలో 70–85 శాతం దెబ్బతిన్నప్పుడు.. కాళ్ల వాపులు, తలనొప్పి వంటి సమస్యలు కన్పిస్తాయి. ఐదో దశలో 85శాతానికి కంటే ఎక్కువగా పనిచేయనప్పుడు.. రక్తశుద్ధి అవసరమవుతుంది. లేదా మూత్రపిండాల మార్పిడి చేయాల్సి వస్తుంది. కారణాలివే: డాక్టర్ కె.లలితాదేవి, డీఎంహెచ్ఓ ● అధిక బరువు, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం ● హైపర్టెన్షన్, మధుమేహం ● పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్, యాంటి ఆకై ్సడ్ మందులు ఎక్కువగా వాడటం ● మద్యం, మాంసాహారాలు ఎక్కువగా తీసుకోవడం ● శరీరానికి రోజుకు సగటున 3 నుంచి 4 లీటర్ల నీరు అవసరం కాగా.. ఒకటి రెండు లీటర్లకు మించి తాగకపోవడం. ● మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. ● హైప్రొటీన్ డైట్ విషయంలోనూ జాగ్రత్తలు చూసుకోవాలి. కబళిస్తోన్న అధిక రక్తపోటు, మధుమేహం, ఇన్ఫెక్షన్లు ఏటా పెరుగుతున్న మూత్రపిండాల వైఫల్య కేసులు ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం జిల్లాలో 3,760 మంది బాధితులు గణాంకాల్లోకి చేరని బాధితులు పదింతలున్నట్లు అంచనా చికిత్స కంటే నివారణపైనే దృష్టి పెట్టాలంటున్న నిపుణులు నేడు అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవం -
విఠ్యాల హెచ్ఎం సస్పెన్షన్
● మరో ఉపాధ్యాయుడిపై బదిలీ వేటు ● వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని విఠ్యాల జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రవి విధులకు హాజరుకాకపోవడంతో గ్రామస్తులు, విద్యార్థులు మంగళవారం పాఠశాలకు తాళం వేశారు. ఈ విషయమై ‘తాళం వేయబడి’అనే శీర్షికన ‘సాక్షి’దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్నికోలస్.. డీఈఓ సుశీందర్రావు, మండల విద్యాధికారి మనోహర్తో కలిసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం బాగుంటుందా? చదువు ఎలా చెబుతున్నారు? ఉపాధ్యాయులు సక్రమంగా వస్తున్నారా లేదా అని విద్యార్థులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం బాగుంది.. హెచ్ఎం రవి కొంత కాలంగా పాఠశాలకు రావపోవడంతో మాకు ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయుడు లేడు. దీంతో పాఠాలు అర్ధం కావడం లేదని, మరో ఉపాధ్యాయుడు మల్లేశ్ విద్యార్థినులు, స్వీపర్తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఆయన హెచ్ఎం రవిని సస్పెండ్ చేయాలని, ఉపాధ్యాయుడు మల్లేశ్ను మరోపాఠశాలకు బదిలీ చేయాలని డీఈఓ సుశీందర్రావును అదేశించారు. -
ఉగాదికి ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాలు
ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు ఉగాది పండగకు గృహప్రవేశాలు చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ పొట్రు సూచించారు. బుధవారం ఆయన ఆదిబట్ల జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని బొంగ్లూర్లో ఆకస్మికంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మూల విమల, అండేకార్ జహంగీర్, చెన్ను రాణి, సరిత, కామేటి విజయ, జర్పుల లక్ష్మి, అండేకార్ సుజాత నిర్మిస్తున్న ఇళ్ల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సకాలంలో వస్తున్నాయా లేదా.. బిల్లులు మంజూరుకు ఎవరైనా లంచం అడుగుతున్నారా అని తెలుసుకున్నారు. కాగా అలా ఏమీ లేదని బదులిచ్చారు. ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు ఎలా ఉన్నాయి అడగ్గా ధరలు పెరిగాయని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోతున్నాయా ప్రశ్నించగా అదనంగా మరో రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతోందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం మధ్యలో నిలిపేసిన వారికి మెప్మా ద్వారా రుణాలు అందించి సహకరించాలని, బిల్లులు చెల్లించిన వెంటనే మళ్లీ రుణాలు చెల్లించేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిందని ఇందులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికి అసలు పనులు ప్రారంభించని ఇళ్లు ఉంటే కారణాలు తెలుసుకుని నిర్మాణాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. కొంత మంది లబ్ధిదారులకు అదనంగా ఇళ్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ అధికారులు, ఎండీని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ పీడీ నాయక్, డీఈ సంపత్కుమార్/, ఏఈ నందిని, జీహెచ్ఎంసీ మేనేజర్ రమేశ్, వార్డు అధికారులు హనుమంతు, శ్రీశైలం, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ పొట్రు నిర్మాణం నిలిచిపోయిన వారికి మెప్మా రుణాలు అందించాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక -
అన్ని చెరువులు అభివృద్ధి చేయండి
● పారిశుద్ధ్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదు ● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మీర్పేట: హైడ్రా ద్వారా అన్ని చెరువులను అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి సూచించారు. బడంగ్పేట సర్కిల్ పరిధిలోని మీర్పేట, జిల్లెలగూడ డివిజన్లలో బుధవారం తెల్లవారుజామున డీసీ, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించి పారిశుద్ధ్యం, చందన చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఔటర్ లోపల ఉన్న వందలాది చెరువులను కోట్ల రూపాయలహెచ్ఎండీఏ నిధులు వెచ్చింది అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రెండేళ్లలో తాము అభివృద్ధి చేసిన చెరువులన్నీ ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని, దోమలు, చెత్తా చెదారంతో దర్శనమిస్తూ, పోకిరీలకు అడ్డాలుగా మారడంతో వాకర్స్కు ఇబ్బందిగా మారిందన్నారు. చెరువుల నిర్వహణ బాధ్యతపై జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్లపై చెత్త ఉంటోందని, పారిశుద్ధ్య సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని, చెత్త ఎక్కడైనా కనిపిస్తే సస్పెండ్ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి అనడం పాలనపై చిత్తశుద్ధి లేక తప్పించుకునేందుకేనని ఆరోపించారు. కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించిన పారిశుద్ధ్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్వచ్ఛ ఆటోలు, సౌకర్యాలు, అదనపు సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో కేటీఆర్ 4,500 స్వచ్ఛఆటోలను ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం చందన చెరువు వద్ద వాకర్స్, పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట డీసీ సరస్వతి, శానిటేషన్ డీఈ అభినయ్కుమార్, ఏఈ గంగాప్రసాద్, స్థానిక నాయకులు అర్కల కామేశ్రెడ్డి, జటావత్ శ్రీనునాయక్, అనిల్యాదవ్, మాదరి రమేశ్, నర్సిరెడ్డి, ప్రవీణ్రెడ్డి తదితరులు ఉన్నారు. -
108 సేవల్లో జాప్యం జరగొద్దు
జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆమనగల్లు: రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బుధవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్రెడ్డిని సైతం ఆచారి కలిసి ఆత్మీయంగా పలకరించారు. -
‘ఉల్లాస్’ పనితీరు సంతృప్తి
కందుకూరు: మండల పరిధిలో కొనసాగుతున్న ఉల్లాస్ కార్యక్రమాన్ని ఢిల్లీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఉల్లాస్ రాష్ట్ర డైరెక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ అనిత ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జైత్వారం, సాయిరెడ్డిగూడ, గుమ్మడవెల్లి, గుమ్మడవెల్లి తండాల్లో పర్యటించి ఉల్లాస్ పథకం కింద అందుతున్న వయోజన విద్య తీరును పర్యవేక్షించారు. ఎంత మంది విద్య నేర్చుకునేందుకు వస్తున్నారు తదితర వివరాలు అడిగితెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేస్తున్న ఉపాధ్యాయులు, వీఓఏలు, విలేజ్ టీచర్లును అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ నర్సింహ, ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ఇబ్రహీంపట్నం రూరల్: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు. జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం కార్యాలయంలో అంతర్జాతీ మహిళా దినోత్సవాన్ని, జాతీయ డౌన్ సిండ్రోమ్ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధికారులను సన్మానించారు. మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి రమేశ్, సంస్మిత, మల్లికశ్రీ, జయశ్రీ, సజితా, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు ఎస్హెచ్ఓగా వెంకటేశ్వర్లు ఆమనగల్లు: స్థానిక పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓగా వెంకటేశ్వర్లు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఆమనగల్లు ఎస్ఐగా పనిచేసిన వెంకటేశ్ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు అటాచ్ చేశారు. ప్రస్తుతం షాద్నగర్ పోలీసు స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును ఆమనగల్లు ఎస్హెచ్ఓగా బదిలీ చేయగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
షాద్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల సాకారమైందని మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. ఇళ్ల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించినా.. అక్కడ పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సుమారు రూ.8 కోట్లు వెచ్చించి అన్ని ఇళ్ల సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి ఇళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు మురళీమోహన్, దిలీప్కుమార్, శ్రావణి, విశాల, రాజునాయక్, సంతోషిబాయి, ఎస్పీ శివ, మరియాబేగం, పెంటయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక పనులు ప్రారంభం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని 18, 26 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ బస్వం పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం -
దళితుల భూములు లాక్కోవొద్దు
తుర్కయంజాల్: వందేళ్లుగా తమ కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం లాక్కుని, ఉపాధిని దూరం చేస్తుందని ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధి కొహెడకు చెందిన రైతు బుడ్డ ఆగమయ్య ఆరోపించారు. మంగళవారం రైతు పొలం వద్ద ఏర్పాటు చేసిన నిరసనలో కొహెడ జేఏసీ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆగమయ్య మాట్లాడుతూ.. సర్వే నంబర్ 167/1లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణం కోసం 4 ఎకరాల ప్రభుత్వ భూమిని అధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం.. అందులోని సొప్ప, జొన్న చేనును రాత్రిపూట పూర్తిగా ఽతొలగించారని ఆరోపించారు. జేఏసీ నాయకుడు కందాల బల్దేవ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితులు, బీసీ, ఎస్టీల భూములు మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడానికి కనిపిస్తున్నాయని చెప్పారు. కనీసం తినడానికి తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు చెందిన రైతుల భూములను లాక్కోవడం దారుణమని, రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా భూములను లాక్కుంటే చూస్తూ ఊరకోమని హెచ్చరించారు. ఇదే సర్వే నంబర్లోని 266 ఎకరాల ఏక్సాల్ పట్టాలను కలిగిన రైతుల భూములను కూడా ఎలాంటి పరిహారం అందించకుండా తీసుకుందామనే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడంతో పాటు, అభివృద్ధి చేసిన లే అవుట్లో ఎకరానికి 500 గజాల ప్లాట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కంబాలపల్లి ధన్రాజ్, బాల్రాజ్తో పాటు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొహెడ జేఏసీ నేత బల్దేవ్రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చేవెళ్ల: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని పోతుగల్ గేట్ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోతుగల్ గ్రామానికి చెందిన యాదయ్య(55) ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఎప్పటి మాదిరిగానే పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో పోతుగల్ గేట్ వద్ద రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తమ్ముడు రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాలికుంటు టీకాలు తప్పనిసరి కడ్తాల్: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా పాడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి(డీవీఎహెచ్ఓ) డాక్టర్ శ్రీనివాస్రావు అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడ్తండాలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ శారదబిక్కునాయక్తో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు గాలికుంటు వ్యాధికి సంబంధించి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ మేరకు వైద్య సిబ్బంది 485 పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి భానునాయక్, జేవీఓలు వెంకటయ్య, మల్లేశ్, రాజేశ్, వైద్య సిబ్బంది రైతులు ఉన్నారు. -
రుధిరవేదన
వికారాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ మూతపడింది. ఎనిమిది నెలలు కావస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ సగటున ఐదు నుంచి ఎనిమిది యూనిట్లు బ్లడ్ అవసరం. ఈ లెక్కన నెలకు 150 నుంచి 200 వరకు యూనిట్లు కావాలి. ఇంత పెద్ద మొత్తంలో రక్తం అవసరమున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. బ్లడ్ అవసరమైన ప్రతిసారీ పరిగి లేదా తాండూరుకు పరుగులు తీయాల్సి వస్తోంది. సమస్యను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. డయాలసిస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్లు రక్తం దొరక్క అవస్థలు పడుతున్నారు. జిల్లాలో చాలా మంది గర్భిణులు రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రసవ సమయంలో రక్తం దొరకడం లేదు. రక్తం నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ల ఇష్టారాజ్యం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ సేవలు నిలిచి పోవడం.. ఇదే క్రమంలో స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటుపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇందు కోసం వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది. వికారాబాద్లో రెండు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఉండగా వాటిపై అధికారుల నియంత్రణ పూర్తిగా కరువైంది. నిర్వాహకులు డిమాండ్ను బట్టి అధిక ధరలకు బ్లడ్ విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉచితంగా బ్లడ్ ఇస్తారు. ఒక వేళ ప్రైవేటు ఆస్పత్రుల్లోని రోగులకు కావాల్సి వస్తే ఒక్కో యూనిట్ రూ.1,050 విక్రయిస్తారు. ప్రైవేటులో అయితే పెషెంట్ల అవసరాన్ని బట్టి ఒక్కో యూనిట్కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే 50 కిలోమీటర్ల దూరంలోని తాండూరు జనరల్ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. మూడు నెలల క్రితం జరిగిన టిప్పర్ – బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో వికారాబాద్ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం కలెక్టరేట్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు ఉద్యోగులు రక్త దానం చేశారు. బ్లడ్ బ్యాంక్లో విధులు నిర్వహించే వైద్యులు, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర కింది స్థాయి సిబ్బంది పది మంది వరకు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది నిర్వాకం కారణంగా పలు పరికరాలు పాడైనట్లు తెలిసింది. జనరల్ ఆస్పత్రిని పాత భవనం నుంచి కొత్త బిల్డింగ్లోకి మార్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో చాలావరకు పాడైనట్లు సమాచారం. రక్త నిధి కేంద్రం అందుబాటులోకి రావాలంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో సమస్యను కలెక్టర్కు విన్నవించినట్లు తెలుస్తోంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మూతబడిన బ్లడ్ బ్యాంక్ ఎనిమిక్ గర్భిణులు, డయాలసిస్ పేషెంట్ల అవస్థలు అత్యవసర సమయాల్లో తాండూరుకు వెళ్లాల్సిందే.. ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు పట్టించుకోని అధికారులు, పాలకులు బ్లడ్ బ్యాంక్ పరికరాలు పాడైన విషయాన్ని గత కలెక్టర్కు విన్నవించాం. ఏ మేరకు నిధులు అవసరమో అంచనాలు పంపమన్నారు. ఈ లోగా ఆయన బదిలీ అయ్యారు. ప్రస్తుత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. నెల రోజుల్లో బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – రాజ్యలక్ష్మి, జనరల్ ఆస్పత్రి సూపరింటిండెంట్ -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ
కందుకూరు: రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైయింది. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తగూడ చౌరస్తా నుంచి కొత్తగూడ గ్రామానికి వెళ్లే రహదారి పక్కన సామ సుదర్శన్రెడ్డి ఇంటి వద్ద ఉన్న 16 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు తరలించుకుపోయారు. ఉద యం విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి ఇబ్రహీంపట్నం: మండలంలోని శేరిగూడ మాజీ సర్పంచ్, ఉత్తమ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత ఎదుళ్ల కృష్ణారెడ్డి(73) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుతూళ్లు ఉన్నారు. గ్రామానికి 1981 నుంచి 1995 వరకు సర్పంచ్గా కొనసాగారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డితోపాటు పలువురు నేతలు మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ● పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప పరిగి: మహిళలు వంటింటికి పరిమితం కారాదని, అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానంలో నిలవాలని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప సూచించారు. మంగళవారం పరిగి మండల పరిషత్ కార్యాలయంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మహిహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీ్త్ర అంటే శక్తి అని.. సీ్త్ర ఉంటేనే కుటుంబ, దేశం, ప్రపంచం బాగుంటుందన్నారు. అన్ని రంగాల్లో రాణి స్తేనే మహిళలకు గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వరి, కమిషనర్ వెంకటయ్య, ఎంపీడీఓ కరీం, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకా శ్, కౌన్సిలర్లు బాదం అఖిల, హబీబ్ఉనిసా, షాహేదాబేగం తదితరులు పాల్గొన్నారు. -
వీధి దీపాల ఏర్పాటుకు వినతి
తుర్కయంజాల్: ఆదిబట్ల సర్కిల్ పరిధి సాగర్ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి మీదుగా తొర్రూర్ వరకు రోడ్డు వెంట వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం డిప్యూటీ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మునగనూర్లోని అనేక కాలనీల్లో వీధి దీపాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి డీసీ సానుకూలంగా స్పందించినట్లు నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, కృష్ణ, శేఖర్ రెడ్డి, భరత్రెడ్డి, అనిల్, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘మహవీర్’పై విచారణ జరిపించండి
● అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి ● సీపీఐ నాయకుల డిమాండ్ ● కలెక్టర్ దీపక్ తివారికి ఫిర్యాదువికారాబాద్: జిల్లా కేంద్రంలోని మహవీర్ ఆస్పత్రిలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి యాజమాణ్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ దీపక్ తివారిని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్, నియోజకవర్గ కార్యదర్శి మల్లేశ్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహవీర్ ఆస్పత్రిలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేదని తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆస్పత్రిపై నమ్మకం సన్నగిల్లి రోగులు కూడా రావడం లేదన్నారు. మూడు వందల మంది ఫ్యాకల్టీ ఉండాల్సిన చోట 50 మంది కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. కర్ణాటకకు చెందిన వారు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నట్లు తెలిపారు. కొందరు ఉద్యోగులు విద్యార్థుల పట్ట అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. కళాశాల విషయాలు బయట చెబితే మీరు ఎలా పాస్ అవుతారో చూస్తామని కొందరు బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఇన్స్పెక్షన్ జరిగే సమయంలో డబ్బు ఇచ్చి రోగులను ఆస్పత్రికి రప్పిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిని విక్రయించేందుకు నిర్ణయించిన యాజమాన్యం విద్యార్థులు, రోగులతో చలగాటమాడుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ను కోరారు. సమయాన్ని వృథా చేసుకోవద్దు ● పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి ● రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి కొడంగల్ రూరల్: విద్యార్థులు లక్ష్యం దిశగా చదువుతూ ఉన్నత స్థానాల్లో నిలవాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ బాలాజీ కేజీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు అందించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, సమయాన్ని వృథా చేసుకోరాదని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తూ పాఠశాల పేరు నిలబెట్టాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, హెచ్ఎం వెంకటప్ప, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ధారూరు: వ్యవసాయ విస్తరణ అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా సంజూ రాథోడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం వికారాబాద్లో వ్యవసాయ విస్తరణ అధికారులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పెంటయ్య, కోశాధికారిగా విశ్వనాథ్ను ఎన్నుకున్నారు. -
పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
షాద్నగర్రూరల్: పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏపీఎం జయమాలిని అన్నారు. మంగళవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని మండల మహిళా సమాఖ్య భవనంలో ఏపీఎం జయమాలిని ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మహిళా సమాఖ్య భవనం పరిసరాలలోని చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయించారు. అదేవిధంగా మండల మహిళా సమాఖ్య భవనంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, కార్యదర్శి సులోచన, కోశాధికారి అలివేలు, సీసీలు శివకుమార్, రాంచంద్రయ్య, మల్లేశ్, కృష్ణయ్య, యాదయ్య, విజయ, సరళ, డీఎంజీలు కృష్ణ, గిరి, గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, వీఓఏలు, సెర్ప్ సిబ్బంది, మండల సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీఎం జయమాలిని -
ఉత్తుత్తి కేంద్రం
● యాచారంలో రైతు ఉత్పత్తిదారుల కూరగాయల కేంద్రం మూత ● నిర్వహణ లేక ఆదరణ కరువు ● ఇబ్బందులు పడుతున్న మహిళా రైతులు యాచారం: డ్వాక్రా సంఘాల్లోని మహిళా రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రారంభించిన రైతు కూరగాయల (యాచారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్) ఉత్పత్తి కేంద్రం మూతపడింది. అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన నిర్వహణ లేకపోవడంతో కేంద్రానికి కూరగాయలు తీసుకవచ్చే విషయంలో మహిళా రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో డ్వాక్రా సంఘాల్లోని మహిళలు తమ వ్యవసాయ పొలాల్లో పండించిన కూరగాయలకు సరైన ధర పొందేలా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళా రైతులు నగరంలోని మార్కెట్లకు కూరగాయల తరలించి ప్రయాణ చార్జీలతో పాటు సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆయా గ్రామాల్లో పండించిన కూరగాయలను మండల కేంద్రంలో ప్రారంభించిన ఉత్పత్తి కేంద్రంలో విక్రయించడానికి ఏర్పాటు చేశారు. 2017లో అప్పటి మంత్రి కేటీఆర్ యాచారంలో ప్రారంభించారు. ఈ కేంద్రానికి చైర్మన్, పది మందిని బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా నియమించారు. వీరికి ప్రత్యేక బ్యాంకు ఖాతా, చెక్ పవర్ అవకాశం కల్పించారు. అధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండల కేంద్రంలో ఉన్న రైతు కూరగాయల ఉత్పత్తి కేంద్రం మూతపడింది. ఈ కేంద్రం ప్రారంభం కొత్తలో మొండిగౌరెల్లి, చౌదర్పల్లి, చింతపట్ల, యాచారం, గునుగల్, గడ్డమల్లయ్యగూడ, మల్కీజ్గూడ, నందివనపర్తి, మొగుళ్లవంపు, గాండ్లగూడెం, తక్కళ్లపల్లి తదితర గ్రామాల నుంచి నిత్యం వందలాది టన్నుల వివిధ రకాల కూరగాయలు వచ్చేవి. తూకం వేయక ముందే ధర నిర్ణయించి రైతులకు బిల్లులు ఇచ్చేవారు. సేకరించిన కూరగాయలను బోయన్పల్లి మార్కెట్కు ప్రత్యేక వాహనాల్లో తరలించేవారు. బిల్లుల ఆధారంగా నేరుగా మహిళా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుల జమ అయ్యేవి. నిర్వహణ లేక పైలెట్ కేంద్రం మూతపడి మర్చిపోయే పరిస్థితి వచ్చింది. డ్వాక్రా సంఘాలకు దండిగా నిధులు మండలంలోని ఆయా గ్రామాల్లో కూరగాయల పంటల సాగు గణనీయంగా పెరిగింది. వెయ్యి ఎకరాలకు పైగానే పంటలు ఉన్నాయి. దాదాపు 500 మంది మహిళా రైతులకు పైగా తమ వ్యవసాయ పొలాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. సాగును ప్రోత్సహించడానికి వివిధ పద్దుల కింద బ్యాంకుల నుంచి నుంచి 2025–26 కింద రూ.50 కోట్లకు పైగానే రుణాలిచ్చారు. అందులో అత్యధిక మంది మహిళా రైతులు వ్యవసాయ పొలాల్లోని పెట్టుబడులకే ఖర్చు చేశారు. రూ.కోట్లాది అప్పులు ఇస్తున్నా, కూరగాయల సాగు సమృద్ధిగా ఉన్నా యాచారం మండల కేంద్రంలో ఉన్న ఉత్పత్తి కేంద్రం మూతపడడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. -
తాళం వేయబడి..
షాద్నగర్రూరల్: ‘ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయుడు లేరు.. పరీక్షలు సమీపిస్తున్నాయి.. సిలబస్ ఇంకా పూర్తి కాలేదు.. పాఠాలు అర్థం కావడం లేదు.. కొన్ని నెలలుగా హెచ్ఎం పాఠశాలకు రావడంలేదు.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు’ అని వాపోతూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేశారు. ఈ ఘటన మంగళవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని విఠ్యాలలో చోటుచేసుకుంది. వివరాలివీ.. మండల పరిధిలోని విఠ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న రవి విద్యార్థులకు ఇంగ్లిష్ బోధిస్తున్నారు. అధికారుల సూచన మేరకు కొంత కాలంగా తనిఖీల విభాగం (ఇన్స్పెక్షన్)లో విధులు నిర్వర్తిస్తూ పాఠశాలకు వెళ్లడం లేదు. దీంతో విద్యార్థులకు ఇంగ్లిష్ బోధించే వారు లేక ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎంకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని విషయాన్ని సర్పంచ్ డుబ్బుల వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్పంచ్, గ్రామపెద్దలు, తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మనోహర్ గ్రామస్తులతో మాట్లాడి తాళం తీయించారు. జరిగిన ఉదంతాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డీఈఓ హెచ్ఎం రవిని పాఠశాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు శాంతించారు. ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి విధులకు హాజరుకాని ప్రధానోపాధ్యాయుడు రవిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ఎంఈఓ మనోహర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న అధికారులకు విద్యార్థుల ఇబ్బందులు కనిపించడంలేదని ఆరోపించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఎందుకు వెనుకాడుతున్నారో ఈ ఘటన నిదర్శనమన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు చరణ్, బన్నీ, చెర్రీ తదితరులు ఉన్నారు. పాఠాలు చెప్పడం లేదని విద్యార్థుల నిరసన తల్లిదండ్రులు, గ్రామ పెద్దల మద్దతు అంతా కలిసి ప్రభుత్వ పాఠశాలకు తాళం ఎంఈఓ, డీఈఓ జోక్యంతో ఆందోళన విరమణ -
రైతు భరోసా విడుదల చేయాలి
మహేశ్వరం: రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంత మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని తుమ్మలూరు, మెహబ్బత్నగర్, ఘట్టుపల్లి, ఆకన్పల్లి, దుబ్బచర్ల, కోళ్లపడకల్, పోరండ్ల, మహేశ్వరం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగియగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి ఇంకా విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. యాప్ ద్వారా పంపిణీ చేయడంతో యూరియా దొరకడం లేదని, రైతులకు యాప్ ద్వారా బుక్ చేసుకోవడం అర్థం కావడం లేదన్నారు. ఏ కొర్రీలు పెట్టకుండా సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాంచందర్, విజయ్, అశోక్, నరేందర్, ముజీబ్, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరి
మొయినాబాద్: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుభాష్ అన్నారు. మున్సిపాలిటీలోని అజీజ్నగర్లో మంగళవారం టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రోజువారీగా అన్ని గ్రామాల్లో పశువైద్యాధికారులు, సిబ్బంది పశువులకు టీకాలు వేస్తారని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి అహ్మద్, సిబ్బంది ప్రసన్నకుమార్, భీమ్రావు, గోరేమియా తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లి: హెచ్టీ (హార్బీ సైడ్ టోలరెంట్) పత్తితో ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయని, రైతులు వాటిని ఉత్పత్తి చేయొద్దని జిల్లా వ్యవసాయాధికారి ఉష సూచించారు. మండల పరిధిలోని మహాలింగాపురం రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దిలీప్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయంపై ఎక్కువగా దృష్టి సారించాలని, రసాయనాల వాడకం తగ్గించాలని అన్నారు. పత్తిసాగులో మెలకులవలు పాటించి అధిక దిగుబడి సాధించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గోవిందమ్మ, మండల వ్యవసాయాధికారి చైతన్య, సర్పంచ్ రాఘవేందర్రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఏ పార్టీకీ మద్దతివ్వొద్దని ఆ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల మహేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. గరిష్టంగా నాలుగు వారాల్లో ఎన్నిక పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులు గడిచిపోవడంతో ఏ సమయంలోనైనా ఎన్నిక జరిపే అవకాశం ఉండొచ్చనే ఉద్దేశంతో బీజేపీ కౌన్సిలర్లు తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చేవెళ్ల: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును అమలు చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ పార్థసింహారెడ్డికి వివనతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ యాజ మాన్యం విద్యను వ్యాపారంగా మార్చి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటీకీ ఎక్కడా ఎవరూ అమలు చేయడం లేదన్నారు. వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్స్ తీసుకునే సమయానికి చట్టం అమలయ్యేలా చర్యలు చెపట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి బోజ్జి శ్రీకాంత్, సహాయ కార్యదర్శులు న్యాలట అశోక్, సునీల్ పాల్గొన్నారు. -
జీపీల్లో కోట్లాట!
పల్లెల్లో బిల్లుల పంచాయితీ మొదలైంది. ముందు పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్లు ఒత్తిడి తెస్తుండగా, ఆ పనులతో తమకు సంబంధం లేదంటూ తాజా సర్పంచ్లు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా తాజా, మాజీల మధ్య కార్యదర్శులు నలిగిపోతున్నారు. ఎటువైపు మొగ్గు చూపితే ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, రంగారెడ్డిజిల్లా రెండేళ్ల విరామం తర్వాత 15వ ఆర్థిక సంఘం జిల్లాలోని 525 పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయా జీపీల ఖాతాల్లో రూ.38.95 కోట్లకుపైగా నిధులు జమయ్యాయి. వచ్చిన నిధులను వివిధ అభివృద్ధి పనులకు వినియోగించాలని తాజాగా ఎన్నికై న పాలకమండళ్లు భావిస్తుండగా, అదేమీ కాదు.. ఇప్పటికే తాము ఆస్తులు అమ్ముకుని అభివృద్ధి పనులు చేపట్టామని, ముందు తమ బకాయిలు చెల్లించిన తర్వాతే మిగిలిన చూసుకోవాలని మాజీలు స్పష్టం చేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు కార్యదర్శులతో వాగ్వాదానికి దిగుతుండటం విశేషం. నిధులు ఇలా.. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 14 జీపీల ఖాతాల్లో రూ.1.28 కోట్లు జమ కాగా, ఆమనగల్లులోని 13 జీపీలకు రూ.85.74 లక్షలు, చేవెళ్లలోని 25 జీపీలకు రూ.1.67 కోట్లు, ఫరూఖ్నగర్లోని 47 జీపీలకు రూ.2.93 కోట్లు, ఇబ్రహీంపట్నంలోని 14 జీపీలకు రూ.1.59 కోట్లు, చౌదరిగూడలోని 24 జీపీలకు రూ.1.51 కోట్లు, కడ్తాల్లోని 24 జీపీలకు రూ.1.89 కోట్లు, కందుకూరులోని 35 జీపీలకు రూ.2.66 కోట్లు, కేశంపేటలోని 29 జీపీలకు రూ. 2.06 కోట్లు, కొందుర్గులోని 22 జీపీలకు రూ.1.39 కోట్లు, కొత్తూరులోని 12 జీపీలకు రూ.1.05 కోట్లు, మాడ్గులలోని 34 జీపీలకు రూ.2.41 కోట్లు, మహేశ్వరంలోని 30 జీపీలకు రూ.2.16 కోట్లు, మంచాలలోని 23 జీపీలకు రూ.2.25 కోట్లు, మొయినాబాద్లోని 19 జీపీలకు రూ.1.30 కోట్లు, నందిగామలోని 19 జీపీలకు రూ.1.45 కోట్లు, షాబాద్లోని 41 జీపీలకు రూ.2.43 కోట్లు, శంషాబాద్లోని 21 జీపీలకు రూ.1.63 కోట్లు, శంకర్పల్లిలోని 24 జీపీలకు రూ.1.85 కోట్లు, తలకొండపల్లిలోని 32 జీపీలకు రూ.2.11 కోట్లు, యాచారంలోని 24 జీపీల ఖాతాల్లో రూ.2.42 కోట్లు జమ అయ్యాయి. వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికుల ఎదురుచూపు జిల్లాలో 27 మండలాలు ఉండగా, 21 మండలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 525 పంచాయతీలు ఉన్నాయి. గత పంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం 2019 జనవరితో మొదలై 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఆయా పంచాయతీలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లాయి. ఫలితంగా రెండేళ్లుగా కేంద్రం నుంచి ఆయా పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. తాగునీటి బోర్ల రిపేర్లు సహా ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, వీధిలైట్లు, డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లింపు వంటి వాటికి కార్యదర్శులే నిధులు సమకూర్చాల్సి వచ్చింది. తెలిసిన పెట్రోల్ బంకులు, ఎలక్ట్రికల్, ఇతర షాపుల్లో ఖాతా పెట్టారు. ఒక్కో జీపీ నుంచి వారికి పెద్ద మొత్తంలోనే చెల్లింపు చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ 2025 డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల కొత్త పాలక మండళ్లు కొలువుదీరడంతో 15వ ఆర్థిక సంఘం నాలుగు విడతల్లో ఆయా జీపీల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ప్రత్యేకాధికారుల పాలనలో రాసి పెట్టిన ఖర్చులు చెల్లించాలా? లేక మాజీల పాలనలోని బకాయిలు చెల్లించాలా? అనే అంశంపై క్లారిటీ లేకపోవడం ఆందోళనకు కారణమవుతోంది. కొత్తగా కొలువుదీరిన పాలకమండళ్లు మాత్రం బకాయిల చెల్లింపునకు ససేమిరా అంటున్నాయి. దీనికి తోడు మూడు నెలలుగా మూడు వేల మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. వచ్చిన నిధుల నుంచే వేతనాలు చెల్లించాలనే పంచాయతీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. పంచాయతీల ఖాతాల్లో రూ.38.95 కోట్లు జమ 15వ ఆర్థిక సంఘం నిధులతో ఖజానా కళకళ చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటున్న మాజీ సర్పంచ్లు వాటితో తమకు సంబంధం లేదంటున్న తాజా సర్పంచ్లు ఇద్దరి మధ్య నలిగిపోతున్న కార్యదర్శులు -
‘ప్రగతి’లో భాగస్వాములవ్వాలి
మహేశ్వరం: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, విజయవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని సిరిగిరిపురంలో మంగళవారం ఆయన ప్రభుత్వ పాఠశాల, క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సిరిగిరిపురంలో ప్రభుత్వ పాఠశాల బాగుందని, సర్పంచ్ దయ్యాల కృష్ణవేణి ప్రత్యేక చొరవ తీసుకొని సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడాన్ని అభినందించారు. అనంతరం మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని త్వరలో పూర్తి చేసి వాడుకలోకి తీసుకొస్తామన్నారు. మహేశ్వరం రోడ్డుపై శుభ్రత పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం మంఖాల్ రెవెన్యూ సర్వే నంబర్ 131లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఎంపీఓ రవీందర్రెడ్డి, ఆర్ఐ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం సహించం
కందుకూరు: పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని డీపీఓ సురేష్మోహన్ హెచ్చరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ముచ్చర్ల, కందుకూరు, కొత్తగూడ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ముచ్చర్లలో కంపోస్టు యార్డు నిర్వహణ సరిగ్గా లేదని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం కొత్తగూడ చౌరస్తాలో పర్యటించారు. రోడ్డు కిరువైపులా ఎందుకు చెత్తను పూర్తిస్థాయిలో తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడ చౌరస్తా, కందుకూరు చౌరస్తా మధ్య శ్రీశైలం హైవేపై పారుతున్న మురుగు నీటి సమస్యపై నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు నిలవకుండా ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో నేషనల్ హైవే అధికారులు, పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. రోడ్లపై మురుగు పారకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత పంచాయతీ కార్యదర్శులదేనన్నారు. రోడ్లు, మురుగు కాల్వలను ఆక్రమించి చేసే నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. చెత్తను కాల్చనివ్వకుండా డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఏపీఓ గీత, సర్పంచులు సరికొండ పాండు, బొక్క సువర్ణ అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. డీపీఓ సురేష్మోహన్ -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
రూ.5 వేల జరిమానా తీర్పు వెల్లడించిన న్యాయస్థానం చేవెళ్ల: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ చేవెళ్ల న్యాయస్థానం తీర్పు వెల్లడించిందని షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కాలనీలో వడ్డె రమేశ్ భార్య అనిత, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవారు. ఇదిలా ఉండగా, 2021 జూలై 12న అర్ధరాత్రి వేళ అనిత ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతోందని అనుమానించిన రమేశ్ గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు షాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. విచారణలో భాగంగా సోమవారం చేవెళ్లలోని 18వ ఏడీజే కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన షాబాద్ సీఐ కాంతారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపారాణి, కోర్టు కానిస్టేబుల్ ఎండీ అనీఫ్, ప్రభాకర్ను చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ అభినందించారు. బైక్ను ఢీ కొట్టిన కారు : ఒకరు మృతి శంకర్పల్లి: మద్యం మత్తులో కారును అతివేగం, అజాగ్రత్తతో నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన నర్సింలు (45) పట్టణ శివారులోని సిమెంట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకొని కందుకూరులోని తన బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. శంకర్పల్లి మండలం మహాలింగాపురానికి చెందిన మాచన్నగారి లక్ష్మారెడ్డి ఫుళ్లుగా మద్యం తాగి కారులో వెళ్తున్నాడు. పట్టణ శివారులోని ఫత్తేపూర్ వద్దకు రాగానే ఎదరుగా వస్తున్న బైక్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మద్యం తాగినట్లు గుర్తించి సోమవారం రిమాండ్కి తరలించారు. ఉత్సాహంగా బండలాగుడు పోటీలు ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి ఎద్దులతో రైతులు హాజరై పోటీలో పాల్గొన్నారు. సైరా బసవన్న సై.. అంటూ పోటీలను సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ ప్రారంభించారు. పోటీలో మొదటి బహుమతిగా రూ.1.10 లక్షల నగదు, రెండో బహుమతిగా రూ.90 వేలు నగదు, 3వ బహుమతిగా రూ.70వేలు నగదు, నాల్గవ బహుమతిగా రూ.50 వేలు నగదును అందించారు. పోటీల్లో పాల్గొన్న రైతులందరికీ ప్రోత్సాహక బహుమతిగా ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్, మాజీ ఎంపీటీసీ రవి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
కడ్తాల్: కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్యూటీఎఫ్) జిల్లా కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో టీఎస్యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి శంకర్, మండల అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 495 కేజీబీవీ పాఠశాలల్లో 1.25లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆయా చోట్ల 1657 మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రారంభించిన కేజీబీవీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని చెప్పారు. కేజీబీవీల్లో చాలీచాలని వేతనాలు ఇస్తున్నారన్నారు. ఉద్యోగ భద్రత కరువైందని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులను, స్పెషల్ ఆఫీసర్లను ప్రిన్సిపాల్స్గా, టీజీసీఆర్టీలను జేఎల్గా, సీఆర్టీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చి వారిని రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈనెల 16న జిల్లా కేంద్రంలో ధర్నాలు, 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు మల్లయ్యగౌడ్, కోశాధికారి నర్సింహమూర్తి, నాయకులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్ -
డంపింగ్యార్డును తొలగించాలని ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని కొంగరకలాన్లో ఉన్న డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని కొంగరకలాన్ పట్టణ ప్రజలు, నాయకులు డిమాండ్ చేశారు. వారం రోజులుగా డంపింగ్యార్డు నుంచి దట్టమైన పొగలు రావడంతో సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకి రవీందర్ ముదిరాజ్, గోపగల్ల బాబు, దేవరపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కనే డంపింగ్ యార్డు ఉందన్నారు. కొంగరకలాన్లో 20వేల మంది జనాభా నివాసం ఉంటుందన్నారు. సర్వే నంబరు 300లో గతంలో డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తుర్కయంజాల్, ఆదిబట్ల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున చెత్తను తీసుకొచ్చి పోస్తున్నారన్నారు. గత వారం రోజులుగా డంపింగ్ యార్డుకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు వస్తున్నాయని, ఆ పొగతో వాయు కాలుష్యం అయి అనారోగ్యాల బారిన పడుతున్నట్లు వాపోయారు. తక్షణమే డంపింగ్యార్డును తరలించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోల నాగేష్, నాయకులు రమేష్, మహేందర్, ప్రవీణ్, సురేష్, భాస్కర్, పవన్, రాఘవేందర్, రమేష్, శ్రీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన పరిహారం ఇవ్వండి
యాచారం: ఏళ్లుగా ఆ భూములను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాం, అవి పోతే బతుకుదెరువు పూర్తిగా కోల్పోతాం.. న్యాయమైన పరిహారం అందజేసి ఆదుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డికి గిరిజన రైతులు మొర పెట్టుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వద్ద వ్యవసాయ భూములు కోల్పోతున్న మండలంలోని కుర్మిద్ద గ్రామ అనుబంధ గిరిజన తండాలైన మంగళిగడ్డ, మర్లకుంట తండాలకు చెందిన చెందిన రైతులు సోమవారం యాచారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ అనంత్రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్పతో కలిసి సమావేశమయ్యారు. సార్ ఎకరాకు రూ.కోటి వరకు పరిహారం ఇప్పించండి.. ఆ భూములు పోతే మేము జీవనోపాధిని పూర్తిగా కోల్పోతామని విన్నవించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులతో మాట్లాడి మెరుగైన పరిహారం అందజేస్తామని, కానీ రోడ్డు పనులు ఆపవద్దని రైతులకు సూచించారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆర్డీఓకు మొరపెట్టుకున్న గిరిజన రైతులు -
ప్రజాపాలన ప్రగతిపై అలసత్వం
షాద్నగర్రూరల్: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విధుల పట్ల అలసత్వంగా వహించిన పంచాయతీ కార్యదర్శిపై డీపీఓ సురేశ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బూర్గుల, కాశిరెడ్డిగూడ గ్రామ పంచాయితీలను ఆయన స్థానిక ఎంపీడీఓ బన్సీలాల్, ఎంపీఓ జయంత్రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులు, తడిచెత్త, పొడి చెత్త, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. కాశిరెడ్డిగూడలో పల్లె ప్రకృతి వనం నిర్వహణ సక్రమంగా లేకపోవడం, బూర్గుల డంపింగ్యార్డులో పశువులను కట్టివేయడంతో డీపీఓ కార్యదర్శి వాసవాచారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. తూతూ మంత్రంగా కార్యక్రమాలను చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం రూ.కోట్ల ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారుతుందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి నివేదికను అందించనున్నట్లు డీపీఓ సురేశ్మోహన్ తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బూర్గుల పంచాయతీ కార్యదర్శిపై డీపీఓ ఆగ్రహం -
క్రీడారంగ అభివృద్ధే కేంద్రం లక్ష్యం
షాద్నగర్: క్రీడా రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో ప్రధాన్ మంత్రి సంసద్ ఖేలో క్రీడా పోటీలకు సంబంధించిన వాల్పోస్టర్ను పోటీల నియోజకవర్గ కోఆర్డినేటర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా బాబయ్య మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఆలోచనలతో సంసద్ ఖేలో కార్యక్రమం ప్రారంభం అయ్యిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో ఉన్న క్రీడా ప్రతిఽభను వెలికి తీసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. సంసద్ ఖేలో కార్యక్రమంలో భాగంగా పాలమూరు పార్లమెంట్ పరిధిలో క్రీడాకారులకు కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16 ఏళ్లు పైబడిన యువకులు ఈ పోటీల్లో పాల్గొన వచ్చని తెలిపారు. మార్చి 24 వరకు క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఏప్రిల్ 9 నుంచి 24 వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్గౌడ్, మురళీ, శ్రీను, శ్రీనివాస్చారి, మోహన్సింగ్, లక్ష్మీకాంత్రెడ్డి, అశోక్, లష్కర్ నాయక్, మహేందర్రెడ్డి, రాజు, అరవింద్, రుషికేష్, సుధాకర్, మహేష్, రాజేశ్వరీ, రఘు, రామకృష్ణ, అనిల్గౌడ్, ప్రశాంత్, ప్రవీణ్, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య -
అదుపు తప్పి.. కిందపడి
బైక్ ప్రమాదంలో ఒకరి మృతి శంకర్పల్లి: ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పర్వేద అనుబంధ గ్రామమైన లచ్చిరెడ్డి గూడకు చెందిన ఖలీల్ (45) శంకర్పల్లిలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా మంచర్లగూడెం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్
షాద్నగర్: విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని ఐ సడక్ సంస్థ సీఈఓ రామన్ చెస బైడియా అన్నారు. ఐసడక్, జడ్చర్ల టోల్ ప్లాజా ఎక్స్ప్రెస్వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో బాత్రూంలు, దూసకల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్, పల్లె దవాఖానాలను నిర్మించారు. వీటిని సోమవారం సంస్థ సీఈఓ రామన్ చెస బైడియా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రామన్ చెస్ బైడియా మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి వాటిలో అత్యాధునిక సదుపాయాలను తమ సంస్థ నిధులను వెచ్చిస్తున్నామని చెప్పారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంఈఓ మనోహర్, సంస్థ ఆపరేషన్ ఆఫీసర్ మార్క్, హెచ్ఎంలు భాగ్యమ్మ, రేవతి, టోల్ప్లాజా మేనేజర్ ఇబ్రహీం, జగదీష్, కౌన్సిలర్ పెంటయ్య, సర్పంచ్ జ్యోతిర్మయి, ఉప సర్పంచ్ కుమార్, డాక్టర్ శ్వేత, ఉపాధ్యాయులు సంతోష, శ్రీనివాస్, సర్పరాజ్, శిరీష పాల్గొన్నారు. ఐ సడక్ సంస్థ సీఈఓ రామన్ చెస బైడియా -
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్లో వాలీబాల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం రాత్రి ముగిసింది. విజేతలకు వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ ప్రజాపతి, సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ బహుమతులు అందించారు. పురుషుల విభాగంలో మొదటి బహుమతి పడకల్, రెండో బహుమతి శేఖర్ టీమ్, మూడో బహుమతి పెద్దూరు టీమ్, మహిళా విభాగంలో మొదటి బహుమతి రంగారెడ్డి జిల్లా, రెండో బహుమతి హైదరాబాద్ టీమ్, మూడో బహుమతి ఏకే స్పోర్ట్స్ అకాడమీ గెలుచుకున్నాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, ఉపసర్పంచ్ అంబటి వెంకటేశ్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పైపు పగిలి.. భగీరథ ఏరులై పారి
మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని కనకమామిడి చౌరస్తా సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ పగలడంతో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై తాగునీరు ఏరులై పారుతుంది. సోమవారం రోడ్డు నిర్మాణంలో జేసీబీతో మట్టిని తీస్తుండడంతో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరంతా రోడ్డుపై ప్రవహించింది. దీంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాదారులు ఈ వరద నీటిలో ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పను లు నిర్వహిస్తున్న సిబ్బంది అధికారులకు తెలపడంతో వెంటనే మిషన్ భగీరథ పైపులైన్ మర మ్మతు పనులు నిర్వహించారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిసాక్షి,రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కె. రాజేష్ రెడ్డి అన్నారు. షాబాద్ మండలం హైతాబాద్లో ఏర్పాటు చేసిన బుగ్గారెడ్డి క్లినిక్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజ లకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ ఐనాపురం అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం కేవలం నగరాలకే పరిమితం కాకూడదని, గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే సంకల్పంతో క్లినిక్ ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన భీమ్ భరత్, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, హైతాబాద్ సర్పంచ్ శాంతమ్మ, ఉపసర్పంచ్ హిర్సా నాయక్, షాబాద్ సర్పంచ్ అశోక్, ఉపసర్పంచ్ రాహుల్ తదతరులు పాల్గొన్నారు. -
విజయవంతం చేయాలి
‘ప్రగతి ప్రణాళిక’ను కడ్తాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, తడి, పోడి చెత్త నిర్వహణ, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్వహణ, పైపులైన్ లీకేజీల మరమ్మతులు, నీటి ట్యాంకులను శుభ్ర పరచడం, ఉపాధి హామీ కింద మంజూరైన పనులు సకాలంలో పూర్తి చేయడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, ఎంపీడీఓ సుజాత, ఎంఈఓ నిర్మల, ఎంపీఓ లాలయ్య, సర్పంచ్ భిక్షపతి, ఉప సర్పంచ్ యాదగిరెడ్డి, నాయకులు రాఘవేందర్, జహంగీర్బాబా, గణేశ్గౌడ్, చందోజీ నాగరాజు, మహేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి -
మొక్కలు ఎండిపోతే చర్యలు తప్పవు
యాచారం: పల్లె ప్రకృతి వనం, నర్సరీల్లో మొక్కలు ఎండిపోతే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం యాచారంలో తడి, పొడి చెత్త వేరు చేసే డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. తడి, పొడి చెత్త వేరు చేసి సెంద్రియ ఎరువులు ఎందుకు తయారు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. డంపింగ్ యార్డులను నిరపయోగంగా ఉంచి నిత్యం గ్రామంలోని చెత్తాచెదారాన్ని ఎక్కడ పడేస్తున్నారని నిలదీశారు. పల్లె ప్రకృతి వనంలోని చెట్లకు నీళ్లు ఎందుకు పోయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోవడం గమనించి అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు, సిబ్బంది తీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, సర్పంచ్ మస్కు అనితశరణం, పంచాయతీ కార్యదర్శి కిషన్ తదితరులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డు పరిశీలన ఇబ్రహీంపట్నం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్, డీఆర్సీ షెడ్లను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం, డంపింగ్ యార్డు నిర్వహణపై మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
ప్రభుత్వ భూములను రక్షిస్తున్నాం
మొయినాబాద్లోని విలువైన ప్రభుత్వ భూ ములను రక్షిస్తున్నాం. ఖాళీగా ఉన్న సర్కారీ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేయించాం. కొన్ని భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. వాటికి కౌంటర్లు వేస్తున్నాం. హిమాయత్నగర్ 151 సర్వే నంబర్లో విద్యాసంస్థ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఖాళీ చేయాలని చెప్పాం. విద్యా సంసవత్సరం పూర్తయ్యేవరకు సమయమిచ్చాం. సదరు విద్యాసంస్థవారు కోర్టుకు వెల్లడంతో కౌంటర్ వేశాం. కోర్టు ఆదేశాలు ఇస్తే కూల్చివేస్తాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
అభివృద్ధికి సమష్టిగా పనిచేయండి
శంకర్పల్లి: మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికై న పాలకవర్గం పట్టణాభివృద్ధికి కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త సభ్యులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. తొలి సమావేశంలో రూ. 46 లక్షల పనులకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీకి చెందిన దుకాణాలకు అద్దె పెంపుపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శంకర్పల్లి పట్టణం హైదరాబాద్ మహానగరానికి చేరువలో ఉన్నందున ప్రభుత్వ పెద్దలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, రాబోయే రోజుల్లో పట్టణం మరింత వృద్ధి సాధిస్తుందన్నారు. పాలకవర్గ సభ్యులు పలు పార్టీలకు చెందిన వారైనప్పటికీ సమష్టిగా పని చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 5కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, వైస్చైర్పర్సన్ శ్వేత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం
కొత్తూరు: ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన మెగా హెల్త్క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిపోర్టుల మేరకు అవసరం ఉన్న వారిని కొండాపూర్లోని జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయడంతో పాటు మిగిలిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, పీహెచ్సీ వైద్యురాలు దీప్తి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, సీడీతండా సర్పంచ్ గభ్రునాయక్, పెంజర్ల సర్పంచ్ జగన్, ఎంపీడీవో అరుంధతి, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ -
రెవెన్యూ రక్షణ
మొయినాబాద్: హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. నగరానికి అతిచేరువలో ఉండటంతో వీటి విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో పలుచోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. పేదలకు పంపిణీ చేసిన భూముల ను, కొంతమంది పెద్దలు నిబంధన లకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. గతంలో నే రెవెన్యూ అధి కారులు పీఓటీ చట్టం కింద వీటిని స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సదరు స్థలాలు కబ్జాదారుల చెరలోనే ఉన్నాయి. పలు చోట్ల కబ్జాకు గురైన ప్రభుత్వ, అసైన్డ్ భూములపై కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఓఆర్ఆర్ పక్కనే ఉన్న మొయినాబాద్ ప్రాంతంలోని భూముల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతోపాటు కబ్జాలకు గురైన స్థలాలను సైతం స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఎనికేపల్లిలో 99 ఎకరాలు స్వాధీనం మొయినాబాద్ మండలంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. ఎనికేపల్లి రెవెన్యూ పరిధి 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు కొంతమంది భారీ పథకం వేశారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్లు సైతం పూర్తయ్యాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఎం దృష్టి సారించారు. వెంటనే ఆ భూములను గోశాలకు కేటాయించి, హెచ్ఎండీ ఏకు అప్పగించారు. వందలాది ఎకరాలకు కంచె పెద్దమంగళారం రెవెన్యూ సర్వేనంబర్ 149లో 159 ఎకరాలు, 218లో 220 ఎకరాల సర్కారు భూమి చుట్టూ కంచె నిర్మించారు. హిమాయత్నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 151లో 38.29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 10.36 ఎకరాల స్థలం ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఆధీనంలో ఉంది. ఇటీవల సర్వే చేసిన అధికారులు ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ భూములను సైతం సమీకృత మార్కెట్కు కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నారు. సర్కారీ భూములకు తహ‘సీల్’ ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఫెన్సింగ్ వేస్తున్న అధికారులు విలువైన భూములను స్వాధీనం చేసుకుంటున్న యంత్రాంగం కోర్టు వివాదాల్లో ఉన్నవాటి వివరాల సేకరణ మొయినాబాద్లో రూ.వేలాది కోట్ల విలువైన భూముల స్వాధీనం పేదల భూములపై పెద్దల కన్ను నగర శివారులోని విలువైన ప్రభుత్వ భూముల కబ్జా చెర వీడుతోంది. ఖాళీగా ఉన్న సర్కారీ స్థలాలు పరాధీనం కాకుండా రెవెన్యూ అధికారులు నడుం బిగించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ దస్త్రాల దుమ్ము దులుపుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ భూములను గుర్తించి ఫెన్సింగ్ వేస్తూనే మరో పక్క.. ఇతరుల కబ్జా, కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల వివరాలను సేకరిస్తున్నారు. అజీజ్నగర్ రెవెన్యూ 176 సర్వే నంబర్లో 220.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 1962లో పేదలకు 94.08 ఎకరాలు పంపిణీ చేశారు. ఈ భూములపై కొందరు పెద్దల కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పట్లోనే పీఓటీ చట్టం కింద రెవెన్యూ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, కబ్జా మాత్రం విడిపించలేకపోయారు. తాజాగా ఈ భూములను సమీకృత మార్కెట్కు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే సర్వే నంబర్లో కబ్జాకు గురైన 75.07 ఎకరాల ప్రభు త్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాన్ని బలోపేతం చేస్తాం
ఇబ్రహీంపట్నం: భూసార పరీక్ష కేంద్రాన్ని ఆధునీకరించి, బలోపేతం చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీసీ (ఆగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ కోఆపరేషన్), ప్రజాపాలన నోడల్ ఆఫీసర్ సురేంద్రమోహన్ తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం పట్టణంలోని భూసార పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాయపోల్ పరిధిలోని రాయన్గూడ గ్రామంలోని డిజిటల్ క్రాప్ బుకింగ్ను ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఆధునిక పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. సబ్సిడీపై విత్తన కిట్, భూసార పరీక్ష కార్డులను అందజేశారు. రాయపోల్లో కూరగాయలు విక్రయించుకునేందుకు రైతులకు మార్కెట్ షెడ్ను నిర్మించాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీశైలం కోరారు. కార్యక్రమంలో డీఏఓ ఉష, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డి, ఏడీఏ సుజాత, భూసార పరీక్ష ల్యాబ్ ఏడీఏ మహేశ్వరి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, ఏఓ భవాని, విద్యాధరి, ఏఈఓ సృజన రైతులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీసీ సురేంద్రమోహన్ -
99 అర్జీలు
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ వారం అత్యధికంగా 99 వినతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడంలో జాప్యం చేయరాదని, వెంటనే స్పందించి 108 వాహనాన్ని సంఘటనా స్థలానికి చేర్చి బాధితులకు ప్రథమచికిత్స అందించడంతో పాటు సకాలంలో దగ్గరలోని ఆస్పత్రిలో చేర్చాలని జిల్లా ప్రోగ్రాం మేనేజన్ షేక్ జాన్ షాహిద్ అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్లో సోమవారం ఆయన 108 వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలో పనిముట్లు, మందులు, దస్త్రాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 108 సేవలను మెరుగ్గా అందించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కృష్ణ, లక్ష్మీకాంత్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: భాస్కర మెడికల్ కళాశాల ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు స్టైఫండ్ వెంటనే చెల్లించాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు దేవరాల రాజేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భాస్కర మెడికల్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఈ విషయమై చాలాసార్లు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై ఎన్ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యూయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు భాస్కర మెడికల్ కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందన్నారు. అయినా యాజమాన్యం స్పందించడంలేదని.. విద్యార్థులు ఆస్పత్రిలో కీలక సేవలు అందిస్తున్నా.. వారికి స్టైఫండ్ ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి విద్యార్థులకు వెంటనే స్టైఫండ్ చెల్లించాలని.. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చేవెళ్ల: జిల్లాలో మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు అన్ని గామ్రాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. షాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న పశువులకు ఆయా మండలాల్లో ఉన్న పశువైద్యాధికారుల బృందం టీమ్లుగా ఏర్పడి టీకాలు వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఏడు విడతలుగా టీకాలు వేసినట్టు తెలిపారు. దీంతో 75 శాతానికిపైగా పశువుల్లో వ్యాధినిరోదక శక్తి పెరిగిందన్నారు. పూర్తిగా పెరగాలంటే 8వ విడతలో అన్ని పశువులకు టీకాలు వేయాల్సిన అసవరం ఉందన్నారు. ప్రతి రైతు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను విధిగా వేయించుకోవాలని సూచించారు. -
మంజీరా పైపులైన్ భారీ లీకేజీ
శంకర్పల్లి: నగరానికి సరఫరా అయ్యే మంజీర పైపులైన్ సోమవారం ఉదయం 4.30 గంటలకు మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ శివారులో లీకేజీ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు 5 గంటలకు నీటి సరఫరాను నిలిపివేశారు. తర్వాత సిబ్బంది మరమ్మతు చర్యలు చేపట్టారు. ఈ పైపులైన్ నుంచి నిత్యం నగరానికి 60 లక్షల లీటర్ల నీరు వెళ్తుంది. భారీ లీకేజీ కారణంగా సరఫరా ఆగిపోవడంతో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీ అశోక్ రెడ్డి హుటాహుటిన లీకేజీ అయిన ప్రాంతానికి వచ్చి మరమ్మతు పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి, నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సుమారు 12 గంటల పాటు శ్రమించి పునరుద్ధరణ తర్వాత సరఫరాని ప్రారంభించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ట్రాన్స్మిషన్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజశేఖర్, జనరల్ మేనేజర్ రామకృష్ణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిత్, మేనేజర్ జనార్దన్ పాల్గొన్నారు. 12 గంటల పాటు నిలిచిన నీటి సరఫరా పరిశీలించిన హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీ అశోక్ రెడ్డి -
పోలీసు వెబ్సైట్.. అప్డేట్ మిస్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ పోలీసు...ఈ పేరు చెప్పగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. దీని వినియోగానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న రాష్ట్రం అనేక ప్రాంతాలకు మార్గదర్శకమైంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, అభియోగపత్రాల దాఖలు వరకు ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాథమిక అంశమైన అధికారిక వెబ్సైట్ నిర్వహణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పునర్వ్యవస్థీకరణను పట్టించుకోకుండా, అధికారుల బదిలీలపై దృష్టి పెట్టకుండా, అదనపు బాధ్యతలు తప్పినా ఇన్చార్జ్లను కొనసాగిస్తూ దీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని కమిషనరేట్లలో జరిగిన మార్పుచేర్పులను పట్టించుకోవట్లేదు. కొన్ని బదిలీ, బాధ్యతల స్వీకరణ జరిగి ఇప్పటికి నెలన్నర అవుతున్నా అధికారిక వెబ్సైట్లో మాత్రం మార్పుచేర్పులు లేవు. ఇలాంటి చిత్రాలు మరెన్నో రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి... ● జనవరి 17న జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి ఎస్.చైతన్యకుమార్ నగర డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా వచ్చారు. అంత వరకు ఈ పోస్టుకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు ఇన్చార్జ్గా ఉన్నారు. అంతర్థానమైపోయిన సౌత్ ఈస్ట్ జోన్ను కొనసాగిస్తున్న పోలీసు వెబ్సైట్ దీనికి చైతన్యకుమార్ డీసీపీగా ఉన్నట్లు చూపిస్తోంది. ● నగర పోలీసు విభాగంలో పరిపాలన డీసీపీగా కె.వెంకట లక్ష్మి నియమితులయ్యారు. అయినా ఇప్పటికీ తఫ్ఫీర్ ఇక్బాల్ను వెబ్సైట్ ఇన్చార్జ్గా కొనసాగిస్తోంది. ఈయన నగరంలో సౌత్ రేంజ్ అదనపు సీపీగా నియమితులైనా... ఇంకా సంయుక్త సీపీ శాంతిభద్రతలుగానే చూపిస్తోంది. ● గతంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్కు డీసీపీగా పని చేసిన అపూర్వ రావు కొన్నాళ్ల ఇంటెలిజెన్స్కు బదిలీ అయ్యారు. అధికారిక వెబ్సైట్ మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు. ● రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్లో కలిశాయి. అలాగే నగరంలో ఉన్న జోన్ల పేర్లు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్... నుంచి సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్... ఇలా మారాయి. ఈ అంశమూ వెబ్సైట్ నిర్వాహకులకు పూర్తిగా పట్టలేదు. రక్షితా మూర్తిని సికింద్రాబాద్ డీసీపీ అంటూ అప్డేట్ వెర్షన్ నమోదు చేసినా.. కె.శిల్పవల్లిని మాత్రం ఇప్పటికీ సెంట్రల్ జోన్ డీసీపీగానే వెబ్సైట్ సంబోధిస్తోంది. రాజేంద్రనగర్ను సైబరాబాద్తో చూపిస్తున్న సైట్... అక్కడ ఉన్న డీసీపీ శ్రీనివాస్కు బదులు యోగేష్ గౌతం అంటూ కొనసాగిస్తోంది. ● రాచకొండ కమిషనరేట్ పేరు మల్కాజ్గిరిగా మారింది. అవినాష్ మహంతిని దీనికి కమిషనర్గా చూపిస్తున్న వెబ్సైట్... మహేశ్వరం జోన్ను మాత్రం రాచకొండగానే కొనసాగిస్తోంది. మరికొందరు డీసీపీ పోస్టులూ రాచకొండలో ఉన్నట్లే పేర్కొంటోంది. నగర సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా కె.శ్యామ్ సుందర్ వచ్చినా... ఇప్పటికీ అపూర్వ రావే ఇన్చార్జ్ అని వెబ్సైట్ చెప్తోంది. ● హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీగా పని చేసిన చింతమనేని శ్రీనివాస్ చాలా రోజుల క్రితమే సైబరాబాద్లో కొత్తగా ఏర్పడిన శేరిలింగంపల్లి డీసీపీగా వెళ్లారు. విభజన తర్వాత జూబ్లీహిల్స్గా మారిన ఈ జోన్కు రమణారెడ్డి డీసీపీగా వచ్చారు. ఈ అంశాలు వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. ● పాతబస్తీలోని సౌత్ జోన్ చార్మినార్ జోన్గా మారిపోయింది. అయితే పోలీసు వెబ్సైట్లో మాత్రం ఇంకా పాత పేరే కొనసాగుతోంది. ఇంకా రాజేంద్రనగర్సైబరాబాద్ కమిషనరేట్లోనే జోన్ల పేర్లు మార్చడంలోనూ నిర్లక్ష్య ధోరణి బదిలీ అయిన వాళ్లూ అక్కడే...ఇన్చార్జ్లు ఇంకా కొనసాగింపు -
బంజార నాయకుడికి అవకాశం హర్షణీయం
పరిగి: పదవులకు దూరంగా ఉన్న బంజారులకు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కల్పించేందుకు చొరవతీసుకోవడం హర్షణీయమని బంజార రాష్ట్ర నాయకులు అన్నారు. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ హన్మంత్ను ఆదివారం బంజార ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంజార నాయకుడికి అవకాశం రావ డం సంతోషించదగిన విషయమన్నారు. హన్మంతు భవిష్యత్లో మరిన్న పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాంగ్యనాయక్, వెంకట్, హరిలాల్, రూప్సింగ్, మాంగ్య, రాకేశ్, రెడ్యా, శ్రీను పాల్గొన్నారు. -
రియల్ మాయ
వికారాబాద్: వెంచర్లకు అనుమతులు, అక్రమ నిర్మాణాల విషయంలో రియల్టర్లు నిబంధనలు తుంగలో తొక్కుతుండగా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. విమర్శలు, ఆరోపణలు వస్తే నామమాత్రపు చర్యలు, నోటీసులతో సరిపెడుతున్నారు. ఫిర్యాదులు అందిన సమయంలో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నానే అపవాదు ఉంది. రియల్టర్లకు అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రైతులు, వారికి మేలు చేసే చట్టాల ముసుగులో ఫాం లేఅవుట్లు ఏర్పాటు చేస్తూ నాలా కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల చెరువులు, నాలాలు సైతం కబ్జా చేస్తున్నారు. ఫాం లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా.. కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పంచాయతీ, టౌన్ ప్లానింగ్ అధికారులు అటుగా కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గజాల్లో విక్రయం.. గుంటల్లో రిజిస్ట్రేషన్ వ్వవసాయ భూములను ప్లాట్లు చేయాలన్నా.. గజాల్లో విక్రయించాలన్నా.. ముందుగా ఆ భూమికి సంబంధించి నిర్దేశిత రుసుము చెల్లించాలి. అనంతరం వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ భూములు వ్యవసాయ భూముల నుంచి కమర్షియల్ పర్పస్ ల్యాండ్గా మారుతుంది. కాగా వ్యవసాయ యోగ్యంగా లేని భూములు మాత్రమే నాలా కన్వర్షన్ చేయాలనే నిబంధన కూడా ఉంది. ఇవన్నీ పట్టించుకోని అక్రమార్కులు నాలా కన్వర్షన్ చేయకుండానే గజాల్లో విక్రయిస్తూ గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. భూమిని నాలా చేయకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో బీటీ రోడ్డు, సీసీ రోడ్డు వేయడానికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయకుండా.. ప్రభుత్వ రుసుము చెల్లించకుండానే వ్యవసాయ భూములు లేఅవుట్గా మార్చి విక్రయిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొత్త దందాకు తెరలేపారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తున్నారు. గజాల చొప్పున విక్రయిస్తూ గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే బీటీ, సీసీ రోడ్లు నిర్మించి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. పుట్టగొడుగుల్లా ఫాం లేఅవుట్స్ అనుమతులు లేకుండా బీటీ, సీసీ రోడ్లు నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్ల విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ల నిర్మాణం మిన్నకుంటున్న రెవెన్యూ, పంచాయతీ, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వాదాయానికి భారీగా గండి అవకతవకలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అవకతవకలకు పాల్పడుతున్న రియల్టర్లతో అధికార యంత్రాంగం సైతం కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పంచాయతీలతో పాటు, మున్సిపల్ పరిధిలోనూ ఫాం హౌస్ల పేరుతో పంచాయతీల అనుమతులు సైతం లేకుండా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవటంలేదు. మరికొన్ని చోట్ల వ్యవసాయ భూమిని ఫాం లే అవుట్ల పేరుతో అభివృద్ధి చేసి ఐదు, పది గుంటలు, అర ఎకరం చొప్పున విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తతంగం కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రెపల్లి సమీపంలో సుమారు పదెకరాలకు పైగా ఫాం లేఅవుట్లు చేశారు. మర్పల్లి మండలం తుమ్మలపల్లిలో, పరిగి మండలంలో, వికారాబాద్, నవాబుపేట, మోమిన్పేట, పూడూరు తదితర చోట్ల ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో 20 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిలో రోడ్లు నిర్మించారు. ప్రహరీ ఏర్పాటు చేసి ఫాం లేఅవుట్గా అభివృద్ధి చేశారు. మండల పరిధిలోని పీరంపల్లి, సిద్దులూరు గ్రామాల పరిధిలో సైతం 130 ఎకరాల్లో ఇలాంటి ఫాంలేఅవుట్లే చేసి గజాల చొప్పున విక్రయిస్తూ గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. -
నిర్మాణ పనుల్లో నాణ్యత తప్పనిసరి
దుద్యాల్: ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నాణ్యత నియంత్రన ఎస్ఈ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని హకీంపేట్ శివారులో కొనసాగుతున్న ఎడ్యుకేషన్ హబ్లో కొనసాగుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా స్కూల్, వెటర్నరీ ఆస్పత్రి, సైనిక్ స్కూల్కు సంబంధించిన హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ కేఎల్ఎస్ఆర్ ప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఎడ్యుకేషన్ హబ్ సుపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ విజయవర్ధన్ రెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ ఈఈ నాగేశ్వర్ రావు, రాజయ్య, ఏఈ విజయ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఈ సుదర్శన్ రెడ్డి -
ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని దాడి.. ఒకరి మృతి
చైతన్యపురి: అప్పు వసూలు విషయంలో జరిగిన వివాదంలో ఒకరు మృతి చెందారు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. సతీష్ అనే వ్యక్తి జూబ్లిహిల్స్ మోతీనగర్లో ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్లో సతీష్ స్నేహితులు ఎడ్ల యాదయ్య (30) తో పాటు మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ఇటీవల యాదయ్య.. సతీష్ దగ్గరు రూ. 5 వేలు అప్పుగా తీసుకున్నాడు. తరువాత కొన్నాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా హోటల్లో పనిమాని వేసి చైతన్యపురిలోని హాస్టల్లో ఉంటున్నాడు. చైతన్యపురిలో ఉంటున్న విషయం తెలుసుకుని హోటల్లో పనిచేసే ఇద్దరు వర్కర్లతో కలిసి సతీష్ ఇక్కడకు వచ్చాడు. చైతన్యపురి మెట్రో స్టేషన్ వద్దకు యాదయ్యను పిలిపించి డబ్బుల కోసం గొడవ పెట్టుకున్నాడు. దీంతో మాటామాటా పెరిగి సతీష్ మరో ఇద్దరితో కలిసి యాదయ్యపై దాడి చేశారు. దీంతో స్ప ృహ తప్పి పడిపోయిన యాదయ్యను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సతీష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి కోటేశ్వరరావు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కడ్తాల్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని ప్రజలు ఆదరించి ఆశీర్వదించడమే దీనికి నిదర్శనమన్నారు. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందని, అర్హులందరికీ కొత్త రేషన్కార్డులతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని గుర్తు చేశారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు గృహావసరాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు. క్షేత్ర స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాలరాజు, సేవాదళ్ మండల అధ్యక్షుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి -
9న జాతీయ అప్రెంటీస్షిప్ మేళా
షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న జాతీయ అప్రెంటీస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మణ్ ఒక ప్రటకనలో పేర్కొన్నారు. ఈ మేళా ద్వార ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో అప్రెంటీస్షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే మేళాకు ఆసక్తి కలిగిన ఐటీఐ పాసైన విద్యార్థులు తమ బయోడేటా, పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని చెప్పారు. ఆన్లైన్ అప్రెంటీస్షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ నంబర్ను విధిగా తేవాలన్నారు. బీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, రాడంట్ అప్లయెన్సెస్, ప్రగతి ఆర్ఆర్డీ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్రమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, షనైడర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఒలెక్ట్రా మోటార్స్, అపెక్స్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ వారు హాజరువుతున్నట్లు తెలిపారు. వివరాలకు 80748 16395, 80192 63018 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కమ్మదనం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఇన్స్పైర్ మనక్ అవార్డు 2025–26కు ఎంపికయ్యారు. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శాలిని, సహస్ర తమ వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద ప్రతి విద్యార్థికి ప్రాజెక్టు అభివృద్ధికోసం ప్రభుత్వం రూ. 10వేలు మంజూరు చేస్తుంది. అవార్డుకు ఎంపికై న విద్యార్థినులలు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయురాలిని శుక్రవారం ఇన్చార్జి ప్రిన్సిపాల్ శారద, ఉపాధ్యాయులు అభినందించారు. పరామర్శ మొయినాబాద్: గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు బస్వపురం అంజయ్యగౌడ్ను మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పరామర్శించారు. ఇటీవల అంజయ్యగౌడ్ తండ్రి కిష్టయ్యగౌడ్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం అంజయ్యగౌడ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేశ్గౌడ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కౌకుంట్ల మల్లేశ్గౌడ్ తదితరులు ఉన్నారు. శాలిని సహస్ర -
ఆలయాలపై దాడులు దారుణం
కందుకూరు: మండల పరిధిలోని బైరాగిగూడలో ఏళ్ల నుంచి పూజలందుకుంటున్న పోతురాజు లింగంను ఈనెల 1వ తేదీన గుర్తు తెలియని దుండగులు తొలగించారు. ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసి భూమిలో పూడ్చి వేశారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు పోలీసుల సమక్షంలో పోతురాజు లింగాన్ని బయటికి తీసి యథాస్థానంలో ఉంచారు. గుప్త నిధులు కోసమే ఇదంతా జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం ధ్వంసమైన స్థలాన్ని పరిశీలించారు. పోతురాజు లింగానికి గ్రామస్తులతో కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువుల ఆరాధ్య దేవతలపై దాడులు చేయడం, ఆలయాలను అపవిత్రం చేయడం తదితర ఘటనలు పెరుగుతుండటం బాధాకరమన్నారు. పోతురాజు లింగాన్ని ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం దారుణమన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసే ముష్కరులపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేసుకోవాలని, కారకుల్ని గుర్తించి చట్టపరంగా శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పోతురాజు లింగానికి యథావిధిగా పూజలు చేసుకునేలా రక్షణ కల్పించాలన్నారు. స్థలాన్ని అభివృద్ధి చేసి ఆలయాన్ని పునఃనిర్మిచేందుకు పూర్తి సహకారం ఇస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, సర్పంచ్ పల్స కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ ఎలిమినేటి సంజీవ, వార్డు సభ్యులు భగవంత్, మంజుల, నగేశ్, లత జంగయ్య, వినోద, దేవేందర్గౌడ్, కిరణ్, ఏ.దేవేందర్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్గౌడ్, నాయకులు శివగౌడ్, నరేందర్, సురేందర్, అంజయ్య, మైసయ్య, శ్రీకాంత్, జంగయ్య, రవీందర్, బీజేపీ సీనియర్ నాయకులు సాధ మల్లారెడ్డి, గంగాపురం అమరేందర్రెడ్డి, అశోక్గౌడ్, టి.జగదీశ్వర్రెడ్డి, గౌర ప్రభాకర్, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.బైరాగిగూడలో పోతురాజు లింగం ఆలయాన్ని సందర్శించిన అందెల శ్రీరాములుయాదవ్ -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి గ్రామానికి చెందిన కెతావత్ లక్ష్మణ్ కుమార్తె నీలా (24) ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 5న ఉదయం కుటుంబ సభ్యులు పనికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వచ్చింది. శుక్రవారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసం ఇఫ్తార్ విందులు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ 4వ వార్డులో శుక్రవారం రాత్రి ముస్లింలకు వార్డు కౌన్సిలర్ బక్కరెడ్డి మాధవియాదిరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతావెంకట్రెడ్డి, కౌన్సిలర్లు బండారి శైలజ, నాయకులు బక్కరెడ్డి రవీందర్రెడ్డి, నరేందర్గౌడ్, రవిందర్, మోసిన్, జాఫర్, ఉమ్మర్, సర్దార్, యాసిన్, శివరాజ్, గోపాల్రెడ్డి, వెంకటేశ్, యాదయ్య పాల్గొన్నారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్లోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం స్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వేదిక మీదకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, గోపాలాచార్యులు కల్యాణక్రతువు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత మల్లేశ్, ఉపసర్పంచ్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ శ్రీశైలం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, నాయకులు రామస్వామి, శ్రీరాములు, కృష్ణయ్య, లక్ష్మయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ లీకై మంటలు
కొందుర్గు: మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–1లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలండర్ లీకవడంతో మంటలు చెలరేగాయి. వివారాలు.. ఉదయం 10 గంటల సమయంలో అంగన్వాడీ ఆయా రమాదేవి విద్యార్థులకు వంటచే క్రమంలో స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా పెద్దగా మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అంగన్వాడీ టీచర్ శ్రీలత, ఆయా రమాదేవి కేంద్రంలో ఉన్న 18 మంది చిన్నారులను బయటికు తరలించారు. అనంతరం స్టవ్ ఆపే ప్రయత్నం చేశారు. స్థానికులు ఇనుపకడ్డీ సాయంతో గ్యాస్ సిలిండర్ను బయటికి తీశారు. మంటలార్పేందుకు పెట్రోల్ బంక్లలో అగ్నిప్రమాద నివారణ యంత్రం కోసం యత్నించగా లభించలేదు. స్థానికులు, పోలీసుల సాయంతో గోనెసంచులు కప్పి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ ఉదయ, సూపర్వైజర్ జ్యోత్స్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేంద్రాల్లో గ్యాస్ పైపులు, సిలిండర్లు నాణ్యత పరిశీలించి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. అంగన్వాడీ సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని సీడీపీఓ ఉదయ సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో తప్పిన ముప్పు -
విధుల్లో నిర్లక్ష్యం
మహేశ్వరం: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రం కొనసాగుతోంది. శుక్రవారం పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మహేశ్వరం ఠాణా నుంచి ఉదయం 8.45 గంటలకు స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ ఈ.గోపి తీసుకురావాల్సి ఉంది. ఆయన వాటి కోసం వెళ్లకుండా ఉదయం 10 గంటలకు నేరుగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ విషయమై పరీక్షల మండల కస్టోడియన్ అధికారి నర్సయ్యను వివరణ కోరగా ఉదయం 8.45 గంటలకు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ గోపి స్టేషన్ నుంచి పేపర్లు తీసుకురావాల్సి ఉండగా హాజరు కాలేదు. పరీక్ష కేంద్రం డిపార్ట్మెంటల్ అధికారి ఒక్కరే పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష పత్రాలను తీసుకొని వెళ్లారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, చీఫ్ సూపరిండెంట్ గోపి సమయానికి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు చెప్పారు. ఈ విషయమై గోపిని వివరణ కోరగా తాను ఆలస్యంగా వస్తున్నానని కస్టోడియన్ అధికారికి సమాచారం అందించానని, డిపార్ట్మెంటల్ అధికారితో పరీక్ష పత్రాలు తీసుకొని పరీక్ష సజావుగా నిర్వహించాలని కోరానని తెలిపారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి అగ్నిమాపక కేంద్రం అధికారి రవీందర్రెడ్డి చేవెళ్ల: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం అధికారి రవీందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం అగ్నిప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పరిసరాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరైన విధంగా ఆలోచన చేసి మంటలు ఆదుపు చేయలేని పరిస్థితి ఉంటే వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. మంటలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఆదుపు చేయాలో చూపించారు. అందుబాటులో ఉన్న వాటితో మంటలను ఎలా అదుపు చేయాలో చేసి చూపించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు. -
సమస్యలపై ఆందోళనబాట
ఇబ్రహీంపట్నం: గ్రామాల్లో నెలకొన్న ప్రజాసమస్యలను పరిష్కరించాలని చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ, ఇతర సమస్యలను ఈ నెల 20 వరకు గుర్తిస్తామన్నారు. అనంతరం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆయా సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాస్తారోకోలు, ధర్నాలు తదితర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సామేల్, జంగయ్య, శ్రీనివాస్రెడ్డి, బుగ్గరాములు, నర్సింహ, జగన్, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఐక్య పోరాటాలు చేయాలి మంచాల: ఉపాధిహామీ పథకం చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తిప్పాయిగూడలో ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలను కలిశారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు గడ్డపారలు ఇవ్వాలన్నారు. మెడికల్కిట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని నీరుగార్చేందుకు పావులు కదుపుతోందని ఆరోపించారు. కార్మికులు, కర్షకులు ఐక్యతతో కేంద్రప్రభుత్వ మెడలు వంచాలన్నారు. అందుకోసం ఐక్య పోరాటాలు చేయడం అవసరమన్నారు. కార్మికుల హక్కుల కోసం సీపీఎం ముందుండి పోరాడుతుందన్నారు. కార్మికులు, కర్షకుల సమస్యలపై భవిష్యత్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జంగయ్య, మండల కమిటీ సభ్యులు యాదయ్య, నాయకులు సుధాకర్, ప్రభాకర్, యాదయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య -
ఉద్యానం.. ఉదాసీనం!
ఇబ్రహీంపట్నం డివిజన్లో కార్యాలయం కరువు ● రాయితీల కోసం రైతుల ఇబ్బందులు ● అధికారులను ఎక్కడ కలవాలో తెలియక అయోమయం యాచారం: ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖకు ఇబ్రహీంపట్నం డివిజన్లో అడ్డా కరువైంది. డివిజన్ కింద యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, అబ్దుల్లాపూర్మెట్, బాలాపూర్, హయత్నగర్, సరూర్నగర్ మండలాలు వస్తాయి. ఈ మండలాల కింద 15 వేలకుపైగా రైతులు 40 వేల ఎకరాలకు పైగా పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పండించిన కూరగాయలు, ఆకుకూరలను నగరంలోని పలు మార్కెట్లకు తరలించి విక్రయిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. కార్యాలయం లేక... డివిజన్లో ఉద్యాన శాఖకు కార్యాలయం లేకపోవడం రైతులకు శాపంగా మారింది. ఇక్కడ ఒక హెచ్ఓ (ఉద్యాన శాఖ అధికారి), ఇద్దరు విస్తరణ అధికారులు ఉన్నారు. రైతుల సంఖ్యను బట్టి ఇద్దరు హెచ్ఓలు, ఎనిమిది మంది విస్తరణ అధికారులు ఉండాలి. హెచ్ఓతో పాటు ఇద్దరే విస్తరణ అధికారులు ఉండడం.. వారు కూడా ఎప్పుడు వస్తారో.. ఏ గ్రామానికి వెళ్తారో.. ఏ రైతును కలుస్తారో తెలియడం లేదు. అప్పుడప్పుడు ఆయా మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదికల వద్దకు వచ్చి మొహం చూపించి వెళ్లిపోతున్నారు. కార్యాలయం ఉంటే ఏదో ఒకరోజు, ఏదో ఒక సమయంలో వస్తారనే భరోసా రైతుల్లో ఉంటుంది. ఏటా అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఆ సమయంలో రైతులు ఎక్కడికి వెళ్లి, ఎవరిని కలవాలో తెలియడం లేదు. సర్కార్ ప్రోత్సహిస్తున్నా.. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జిల్లాలోనే ఇబ్రహీంపట్నం డివిజన్ను పంట కాలనీల పథకం కింద పైలెట్గా ఎంపిక చేశారు. దాదాపు రూ.25 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని ఆరు వేల మందికి పైగా రైతులకు ఉచితంగా డ్రిప్ పరికరాలు, యంత్రాలు, బోరుబావుల తవ్వకం, నాణ్యమైన విత్తనాలు, నార్లు ఉచితంగా అందించారు. పండించిన కూరగాయలను నగరంలోని వివిధ మార్కెట్లకు తరలించడానికి ప్రతి మండల కేంద్రంలో కూరగాయల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా రేవంత్రెడ్డి సర్కార్ సైతం కూరగాయల సాగును ప్రోత్సహించడం కోసం రూ.లక్షలాది నిధులతో రాయితీలు అందజేస్తోంది. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, చౌదర్పల్లి, గడ్డమల్లయ్యగూడ గ్రామాలను రైతు కమిషన్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. -
అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి
పహాడీషరీఫ్: అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం వావిల్కోలు గ్రామానికి చెందిన మేకల గీత (35), వెంకటయ్య దంపతులు రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం తుక్కుగూడకు వలస వచ్చారు. గీత స్థానిక హాస్టల్లో, భర్త కర్రీ పాయింట్లో పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటలకు గీత మృతి చెంది ఉన్నట్లు పొరుగింటి వ్యక్తి ఆమె సోదరుడు నవీన్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె సోదరుడు తన బావపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. -
సిరులు పూయని విరులు
వేలాది ఎకరాల్లో బంతి, చేమంతి, గులాబీ, చాందిని తోటల సాగు ● సరైన దిగుబడి లేక దిగాలు ● సుముహూర్తాలున్నా ఎగబాకని ధరలు ● నష్టాల పాలవుతున్న పూల రైతులు మొయినాబాద్ రూరల్: పండుగైనా పబ్బమైనా, వేడుకై నా.. వేదికైనా పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పెద్దలను కలవాలన్నా.. దేవుడిని కొలవాలన్నా.. పూలు, బొకేలు పట్టుకుని వెళ్లడం గౌరవప్రదమని భావిస్తారు. కానీ పూలను పండిస్తున్న రైతులు మాత్రం నష్టాలే మూట కట్టుకుంటున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో దాదాపు 2వేలకు పైగా ఎకరాల్లో రైతులు వివిధ రకాల పూల తోటలు సాగు చేశారు. అమ్డాపూర్, కాశీంబౌలి, వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి, ఎత్మార్పల్లి, నక్కలపల్లి, చందానగర్, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, నాగిరెడ్డిగూడ, బాకారం, కనకమామిడి, కంచమౌనిగూడ, చాకలిగూడ, తోల్కట్ట, అప్పారెడ్డిగూడ, చేవెళ్ల, కందాడ, ఆలూరు, పలుగుట్ట, పామెన, మల్కాపూర్, మునిమాలతో పాటు శంకర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బంతి, చేమంతి, గులాబీ, చాందిని పూల తోటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పెద్దగా లేకపోవడంతో ఆశించిన మేర లాభాలు రావడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. చెమటోడ్చినా దక్కని ఫలితం ఉద్యాన పంటల సాగు కోసం కర్షకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఎకరా పొలంలో పూల తోట పెట్టేందుకు డ్రిప్తో పాటు మొక్కలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఎకరాకు సుమారు రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనికి తోడు ఇంటిల్లిపాదీ చెమటోడుస్తున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. అకాల వర్షాలు, అతివృష్టి కారణంగా తోటలు పాడవుతున్నాయి. గతేడాది తెగుళ్లు సోకి, వాతావరణం అనుకూలించక దిగుబడులు పూర్తిగా తగ్గిపో యాయి. ఈసారి దిగుబడి కాస్త బాగుందనుకుంటున్న సమయంలో పది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు మళ్లీ రైతుల నడ్డి విరిచాయి. కోతకు వచ్చిన పూలు చేతికందకుండాపోయాయి. శుభకార్యాలు, పెళ్లి ముహూర్తాలు, పండుగలు వస్తున్నా పండించిన పంటకు డిమాండ్ ఉండటం లేదని పూల రైతులు పేర్కొంటున్నారు. సిరుల వర్షం కురిపిస్తుందనే ఆశతో విరులు సాగు చేసిన రైతులకు అశ్రువులే మిగులుతున్నాయి. దిగుబడి, ధర లేక నష్టాల పాలవుతున్నారు. లాభాల పంట పండించాలని పూల తోటలు పెడితే.. అప్పులే మిగిలాయని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత మార్కెట్లో కిలో చేమంతి రూ.40– రూ.50, బంతి రూ.10– రూ.20, గులాబీ రూ.5– రూ.10 వరకు పలుకుతున్నాయి. వీటిని తెంపితే కూలీల డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
వివాహ వేడుకకు సీఎం హాజరు
కందుకూరు: సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు సమ్మెలో భాగంగా శుక్రవారం కందుకూరు విద్యుత్ డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల సంఘం డివిజన్ అధ్యక్షుడు ఆమనగంటి సురేష్ మాట్లాడారు. 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నా తమను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. 30 రోజుల పని దినాలు కల్పించాలని, ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఐటీఐ అర్హత కలిగిన వారితో భర్తీ చేయాలని, ఐటీఐ లేని కార్మికులకు అర్హతను బట్టి మిగిలిన విభాగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శివ, మహేందర్, భరత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాచారం: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, పొందే రుణాల్లో ప్రతి మహిళ ఆర్థిక ప్రగతి సాధించాలని తెలంగాణ రాష్ట్ర సెర్ప్ ఐబీ డైరెక్టర్ నవీన్కుమార్ పేర్కొన్నారు. మండల ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సంఘాల పాలకవర్గాలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పొందే రుణాలు సద్వినియోగం చేసుకునేలా ఐకేపీ ఉద్యోగులు నిత్యం పర్యవేక్షణ చేయాలని అన్నారు. తీసుకునే రుణాలు, చెల్లింపుల విషయంలో ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరుణాకర్, ఐబీ డీపీఎం యాదయ్య, ఐకేపీ ఏపీఎం రవీందర్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు ప్రేమలత, సీసీలు దార గణేశ్, రాజు, జయలక్ష్మి, పద్మశ్రీ, కార్యాలయ కోశాధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల: మహిళలు వంటింటికే పరిమితం కారాదని, అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చేవెళ్ల అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి బృంగి శ్రీనివాస్ అన్నారు. కోర్టు ఆవరణలో శుక్రవారం చేవెళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా న్యాయవాదులు, సిబ్బందికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు సమాజ అభివృద్ధిలో భాగం కావాలని సూచించారు. కోర్టు సూపరింటెండెంట్ ఇందిర మాట్లాడుతూ.. ఆడపిల్లలకు విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రులు సరైన సహకారం అందిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, ముకరం నర్సింలు, ప్రధాన కార్యదర్శి మహేశ్గౌడ్, మహిళా న్యాయవాదులు మాధురి, రోజారెడ్డి, ప్రమీణ, పూజ, లోకేశ్వరి, మీనా, ఏఓ స్వరూప కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
గిరాకీ లేక..
చామంతి పూలకు గిరాకీ అంతంత మాత్రమే ఉంది. మహారాష్ట్ర, బెంగళూరు నుంచి హైదరాబాద్ మార్కెట్కు పెద్ద మొత్తంలో పూలు దిగుమతి అవుతున్నాయి. దీంతో స్థానికంగా సాగు చేసిన రైతులకు సరైన ధర దక్కడం లేదు. ఎకరా పొలంలో తోట సాగు చేసేందుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చవుతోంది. – గుంటం సైపాల్రెడ్డి, రైతు, అమ్డాపూర్ వాణిజ్య పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయనే ఆశతో పూల సాగు చేశా. ఇటీవల కురిసిన అకాల వర్షంతో తోటలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రకాల మందులు స్ప్రే చేశాం. దీనికి తోడు ధరలు లేకపోవడంతో పెట్టబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. కనీసం మొక్కలనైనా సబ్సిడీపై ఇవ్వాలి. – భూపాల్రెడ్డి, కాశీంబౌలి, పూల రైతు -
వాతావరణంపై అవగాహన అవసరం
కడ్తాల్: యువత వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలని కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోర్పోలు లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి ఎర్త్సెంటర్లో శుక్రవారం నిర్వహించిన ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్ కార్యక్రమానికి కాచిగూడ భద్రుక డిగ్రీ కళాశాలకు చెందిన 104 మంది విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదర్ట్రీకి పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పర్యావరణవేత్తలు డాక్టర్ తులసీరావు, డాక్టర్ నారాయణరావు, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, భద్రుక కళాశాల ప్రొఫెసర్స్ డాక్టర్ నవీన్కుమార్, డాక్టర్ సుష్మాదేవి, డాక్టర్ శృతి, మహేందర్, సీజీఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇండోర్ సరసన చేరాలి
● మున్సిపాలిటీలు ప్రగతి సాధించాలి ● సీడీఎంఏ డైరెక్టర్ టీకే శ్రీదేవి శంకర్పల్లి: స్వచ్ఛ నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో ఉండగా.. దాని సరసన శంకర్పల్లి మున్సిపాలిటీ సైతం చేరాలని సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) డైరెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల పాటు చేపడుతున్న ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ఆమె శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, పురవాసులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని అన్నారు. పట్టణాలు, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం 99రోజుల బృహత్ కార్యాచరణ చేపట్టిందని, ఒక్కోరోజు ఒక్కో అంశంపై దృష్టి సారించి, పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అధికారులు తమకు అప్పగించిన విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం స్వచ్ఛతపై నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఫాల్గుణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్చైర్పర్సన్ శ్వేత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకయ్య అధ్యక్షతన వివిధ శాఖల మండలాధికారులు, సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయం షాద్నగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ మమత అన్నారు. మున్సిపాలిటీలో నిర్వహించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం, వైస్ చైర్మన్ అందెమోహన్, కమిషనర్ సునీత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి డాక్టర్ నరేందర్కుమార్ అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మొదటి రోజు మండలంలోని ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి, దంత, సీ్త్ర సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ కుమార్ మాట్లాడుతూ.. 99 రోజుల పాటు వివిధ రకాల ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, వార్డు సభ్యుడు నర్సింహ, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ కృష్ణ, లక్ష్మీప్రసన్న, పీహెచ్సీ వైద్యులు డాక్టర్ మోహన్, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రజలకు ప్రభుత్వం, అధికారులు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలకు సమాధానం చెప్పేందుకే ప్రభుత్వం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే 99 రోజుల కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది’ అని శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మండలి చీఫ్ విప్ పి.మహేందర్రెడ్డితో కలిసి ఆయన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఆరు గ్యారంటీలతో ప్రజలకు అందిన ఫలితాలపై చర్చించాలని, ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకు నోచుకోని వారిని ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించి లబ్ధి చేకూర్చాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశానికి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ కలెక్టర్లు నారాయణరెడ్డి, మను చౌదరి, దీపక్ తివారి, ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనర్ సుధీర్బాబు, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, ప్రకాష్గౌడ్, కాలె యాదయ్య, వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం 200 యూనిట్ల లోపు వినియోగించిన వాళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని అందిస్తున్నాం. ఈ జాబితాలో ఇంకెంత మంది అర్హులున్నారో లెక్క తీయాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్లు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయకూడదు. చిన్నచిన్న సాంకేతిక లోపాలను సాకుగా చూపించి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయొద్దు. నిరుద్యోగ యువత ఎంత మంది డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు పూర్తి చేశారో లెక్కించాలి. వీరి కోసం జిల్లా స్థాయిలో జాబ్మేళా పెట్టి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. జిల్లాలో నిరుద్యోగ సమస్య లేకుండా చూడాలి. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి: మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు 10 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. అధికార యంత్రాంగమంతా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తుంది. ఇప్పటికీ రేషన్ కార్డులు, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లను కేటాయించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులంతా చక్కగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. అప్పుడే ఈ కార్యక్రామానికి సార్థకత చేకూరుతుంది. షెడ్యూల్ రెడీ చేశాం: రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ రెడీ చేశాం. నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించాం. మొదటి దశలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయాలని నిర్ణయించాం. పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మార్చి 19న ఉగాది రోజు ఏకంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించాం. అదే ప్రభుత్వ లక్ష్యం ప్రజాప్రతినిధులు, అధికారులుసమన్వయంతో పని చేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి అందుకే ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ అవగాహన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన మెగా మహిళా ఆరోగ్య శిబిరాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలితాదేవి పర్యవేక్షించారు. -
సదస్సును జయప్రదం చేయండి
వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య కొడంగల్ రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘాలు, డీవైఎఫ్ఐ, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కొడంగల్లో నిర్వహించనున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య కోరారు. బుధవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక పోరాటం స్ఫూర్తితో మార్చి 01వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8వ తేదీన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఐద్వా, సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అనిల్, హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు సాంకేతిక నైపుణ్యం
● డ్రోన్ల ద్వారా పంటల సస్యరక్షణ ● వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుధాకర్ చౌరట్ తాండూరు: ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సాంకేతిక నైపుణ్యం జోడించడం ద్వారా పంట పెట్టుబడులను ఆదా చేసుకోవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. సుధాకర్ చౌరట్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చారు. డీజీసీఏ అడ్వాన్స్డ్ సర్టిఫైడ్ డ్రోన్ల నిర్వహణపై లవ్లీ వుడ్ బిజినెస్ ఇన్కూబేటర్ సంస్థ జిల్లాలోని ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. అనంతరం డ్రోన్ నడిపే విధానాన్ని తిలకించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. విమానయాన మౌలిక సూత్రాలు, ఏటీసీ విధానం, రేడియో టెలీఫోన్ తోపాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని డ్రోన్ శిక్షణ తీసుకున్న వారికి సూచించారు. త్వరలో డ్రోన్ పైలెట్లకు డీజీసీఏ లైసెన్సులు జారీ చేయనున్నట్లు వారు తెలిపారు. -
సదావకాశం
డివిజన్లోని ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు ఇది సదావకాశం. రూ.వేలాది విలువ జేసే నాలుగు రకాల విత్తనాల ప్యాకెట్లను ఉచితంగా పొంది సాగును చేపట్టి, మంచి లాభాలు పొందండి. కూరగాయల సాగును పెంచేందుకు ఇబ్రహీంపట్నం డివిజన్లో 400 మంది రైతులకు పైగా లబ్ధి చేసేలా కృషి చేస్తున్నాం. విత్తనాలతో పాటు ట్రేలు, వర్మీ బెడ్స్, తేనెటీగల బాక్సులను అందజేస్తున్నాం. పూర్తి వివరాలకు 89777 14219 నంబరులో సంప్రదించండి. – నవీన, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ డివిజన్ అధికారి, ఇబ్రహీంపట్నం ● -
ప్రభుత్వ పాఠశాల భూమిపై సర్వే
ఎకరం ఆక్రమణకు గురైనట్లు అధికారుల వెల్లడి దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భూమిని బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. దాదాపు ఎకరం భూమి ఆక్రమణకు గురైనట్లు వెల్లడించారు. వందేళ్ల క్రితం పాఠశాలకు 4.29 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో పాఠశాల భవనం, క్రీడా ప్రాంగాణం ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా పాఠశాలకు చెందిన భూమిలో నుంచి హస్నాబాద్–పెద్దనందిగామ వెళ్లే రోడ్డును నిర్మించారు. దీంతో పాటు గ్రామస్తులు భూమి చివర భాగంలో పెంట కుప్పలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొంత భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల పాఠశాలకు ప్రహరీ మంజూరు కావడంతో నిర్మాణానికి భూమి పూజ చేశారు. పూర్తి స్థాయి భూమిని సర్వే చేసి హద్దులు గుర్తించి ప్రహరీ నిర్మించాలని హెచ్ఎంకు సూచించారు. దీంతో రెవెన్యూ సిబ్బందితో బుధవారం సర్వే చేయించారు. దాదాపు అర ఎకరం రోడ్డు నిర్మాణానికి, మరో అర ఎకరం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. త్వరలో పూర్తి స్థాయి నివేదికను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ మహేశ్, గ్రామ పాలన అధికారి గోపాల్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
హోలీ.. దుండ్తో కేళి
● గిరిజన సంప్రదాయంలో సంబురాలు ● ఏళ్ల నుంచి వస్తున్న ఆచారానికి తిరిగి జీవం బొంరాస్పేట: ఎన్నో ఏళ్లుగా కనుమరుగైన గిరిజనుల హోలీ సంబురాల్లో భాగమైన ‘దుండ్’ మళ్లీ ఆదరణకు నోచుకుంది. ఈ వేడుక గిరిజన తండాల్లో కొత్తదనాన్ని నింపింది. యువతకు నైతిక విలువలు నేర్పి, ఆడపడచుల్లో ఆనందాన్ని నింపిలే ఈ పండుగ చేస్తుంది. ఇది బంజారా తెగలోని రమావత్ గోత్రం వారు ప్రత్యేకంగా జరుపుకొంటారు. హోలీ పండుగ సందర్భంగా ఉదయం నుంచే గిరిజన ఆచారం ప్రకారం సామూహికంగా చేరి ఇళ్ల ముందట బెల్లం బువ్వతో ప్రసాదం వండుతారు. దాని చుట్టూ యువకులు కోలాటం ఆడుతారు. మరోవైపు తండాపెద్ద యువతులు తీసుకొచ్చిన కుండల్లో ప్రసాదాన్ని వడ్డిస్తారు. అనంతరం తిరిగి నెత్తిన ప్రసాదాన్ని పెట్టుకొని సంతోషంగా ఆడి పాడుతారు. చివరన హోలీ రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకొంటారు. పెళ్లికాని యువతీయువకులకు దుండ్ చాలా ప్రత్యేకం. దుండ్ అంటే? దుండ్ అంటే లంబాడ మాండలికంలో వెతుకు, శోధించు అని అర్థం. ముఖ్యంగా పెళ్లికాని యువకులను సామాజికీకరణ కోసం ఇలా చేస్తారు. పండుగకు వారం రోజుల ముందే గ్రామపెద్దలు సమావేశమై తండాలో ఉన్న యువకులను లెక్కిస్తారు. ఐక్యత కోసం పిల్లవాడి ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం ప్రార్థించడం చేస్తారు. తండాలో సామాజిక ఐక్యతను పెంచడం కోసం చేస్తారు. ప్రతి కుటుంబానికి సంతోషం కలగాలని కోరుకుంటారు. లంబాడా సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించడం దీని ఉద్దేశం. బెల్లం బువ్వ, అగ్నిని పూజిస్తారు. తరాల నుంచి వస్తోంది దుండ్ అనేది తరతరాలుగా వస్తున్న ఒక గిరిజన సంప్రదాయం పండుగ. ఆ రోజు మా యువతను మంచివైపు నడిపించే ముఖ్యమైన ఘట్టం ఇది. ఆడపడుచులు కూడా ఆనందంతో పూజలు చేస్తారు. – కమ్లీబాయి, బొట్లోనితండా యువతకు నైతిక విలువలు ఈ దుండ్ పండుగ గిరిజన ఆచార సంప్రదాయాల మీద పరిశోధన చేస్తూ వారి జీవితంలో మార్పునకు మార్గం వేయడం. అలాగే చెడు వ్యసనాలకు దూరం చేసే వాతావరణం కల్పించడమే ముఖ్య ఉద్దేశం. – రాథోడ్ నాని, ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృతిని కాపాడాలి చదువుకున్న యువకుడిగా మా తండాలో దుండ్ సంప్రదాయాన్ని మళ్లీ పరిచయం చేశాను. బంజారాల్లో ఉన్న మునుపటి మంచి సంస్కృతిని కాపాడి, నైతిక విలువలు పెంపొందించాం. తండాకు ప్రత్యేక బంధాన్ని ముడి వేశాం. – బాలునాయక్, సర్పంచ్, బొట్లోనితండా రమావత్ గోత్రం అంతటా మా గిరిజన జాతిలో ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే పండుగ. ప్రతి రమావత్ గోత్రంలో ఈ దుండ్ పండుగ చేస్తాం. ముఖ్యంగా పురుషుల జీవితానికి పట్టాభిషేకం లాంటిది ఈ వేడుక. – రుక్మానాయక్, తండాపెద్ద, బొట్లోనితండా -
విధులపై నిర్లక్ష్యం తగదు
మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కొడంగల్: వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. బుధవారం పట్టణంలోని బస్తీ దవాఖానను సందర్శించారు. వైద్యురాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సంతకాలు చేసే రిజిస్టర్ చూపించాలని అక్కడున్న సిబ్బందిని అడిగారు. జనవరి నెల నుంచి రిజిస్టర్ లేదని సమాధానం చెప్పారు. మూడు నెలలుగా సంతకాలు చేయడం లేదన్నారు. దీంతో అసహనానికి గురైన చైర్మన్ వైద్యురాలు ఎక్కడికి వెళ్లారని అడిగారు. పట్టణంలోని సబ్ సెంటర్కు వెళ్లారని సిబ్బంది తెలిపారు. బస్తీ దవాఖాన నుంచి సబ్ సెంటర్కు వెళ్లిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్లు డాక్టర్తో మాట్లాడుతూ రిజిస్టర్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సంతకాలు చేసే రిజిస్టర్ కొడంగల్లో దొరకలేదని ఆమె సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైర్మన్ జిల్లా వైద్యాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వైద్యశాలల్లో రోగులకు సేవలందించంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వెంటనే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ముందుండాలన్నారు. -
సీఐ విజయ్కుమార్ బదిలీ కొత్త సీఐగా సీతారాం
షాద్నగర్ రూరల్: షాద్నగర్ పట్టణ సీఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు అటాచ్ చేస్తూ బుధవారం ఆశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్కుమార్ ఇక్కడ దాదాపు 20 నెలల పాటు పనిచేశారు. ఇతని స్థానంలో కందుకూరు సీఐ సీతారాం నూతన సీఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాత్కాలిక నియామకాలకు దరఖాస్తులు అనంతగిరి: జనాభా–2027 లెక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లాలో పొరుగు సేవల ప్రాతిపదికన(17 నెలల కాల పరిమితితో)సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకుంటున్నట్లు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చీఫ్ ప్లానింగ్ కార్యాలయం, 20 మండలాలు, 4 మున్సిపల్లలో పనిచేయటకు మొత్తం 26 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు (20 మండలాలకు ఒక్కొక్కటి, 4 మున్సిపల్లకు ఒక్కొటి చొప్పున, చీఫ్ ప్లానింగ్ కార్యాలయానికి 2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 1 మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టు భర్తీ చేయబడుతుందన్నారు. ఈ నియామకాలు ఈనెల 20 నుంచి 2027 జూన్ 30 వరకు ఉంటుందన్నారు. టెక్నికల్ అసిస్టెంట్కు నెలకు రూ.25 వేలు, మల్టీ టాస్కింగ్ స్టాప్నకు నెలకు రూ.18వేలు కన్సాల్టెడ్ వేతనం చెల్లించ బడుతుందన్నారు. ఈ పోస్టులకు కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ, నిమిషానికి 25–30 పదాల టైపింగ్ వేగం, ఎంఎస్ ఆఫీస్లో డేటా ఎంట్రీ అనుభవం, డిజిటల్ మొబైల్ అప్లికేషన్లపై పరిజ్ఞానం అవసరమన్నారు. అర్హులైన వారు తమ బయోడెటాను అన్ని ధ్రువపత్రాలతో కలిపి 2 సెట్ల జిరాక్స్ కాపీలను వికారాబాద్లోని మెప్మా కార్యాలయంలో ఈనెల 7వ తేది సాయంత్రం 5గంటలలోపు ఇవ్వాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9177933822, 9398003089లో సంప్రదించాలన్నారు. టిప్పర్ బోల్తా డ్రైవర్కు గాయాలు ధారూరు: టిప్పర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన ధారూరు – గట్టెపల్లి బస్స్టేజ్ మధ్య బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ నుంచి కంకర లోడుతో టిప్పర్ తాండూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున ధారూరుకు రాగానే బారికేడ్ను ఢీకొట్టింది. వంద మీటర్ల వరకు వాహనం అలాగే వెళుతుండటంతో పోలీసులు గమనించి వెంబడించారు. అయినా వాహనం ఆపకుండా తాండూరు వైపు వేగంగా వెళ్లింది. సోమశంకరప్ప గుడి దాటిన తర్వాత రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి గుంతలో పల్టీ కొట్టింది. డ్రైవర్కు గాయాలు కావడంతో స్థానికులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుకు ఫిర్యాదు అందలేదు. -
ఆలయ పరిరక్షణకు కృషి చేస్తున్నాం
సంజీవయ్య ఆలయ ధర్మకర్త పార్థసారథి పరిగి: దోమ మండలంలో సంజీవయ్య ఆలయ పరిరక్షణ కోసం తమ తాతముత్తాల నుంచి కాపాడుతూ వచ్చామని ధర్మకర్త పార్థసారథి పంతులు అన్నారు. సంజీవయ్య ఆలయ భూములపై బుధవారం పట్టణ కేంద్రంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్మాణం కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామన్నారు. సొంత ఖర్చులతో ఆలయం నిర్మిస్తామని చెబితే దేవాదాయ శాఖ ఒప్పుకోలేదన్నారు. తమ వందల ఎకరాల భూమి సీలింగ్లో పోయిందని, కానీ దేవాలయ భూములు తామే అన్యాక్రాంతం చేశామని కొందరూ అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. జనవరిలోనే దేవాలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుంచి అనుమతి వచ్చిందని, ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రారంభించలేదని చెప్పా రు. దేవాలయ పరిరక్షణ సమితి పేరుపై కొందరు చేస్తున్న దీక్షలు ఉత్తవేనని అది పరిరక్షణ సమితి కాదని భూ భక్షసమితి అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పరిగిలోని 383 సర్వే నంబర్లో 16 ఎకరాల భూమిలో 9 ఎకరాలు దేవాలయ భూమి ఉందన్నా రు. ఆ భూమి ఎలా మరిందనే విషయం తమకు తెలియదని తెలిపారు. భూములు అన్యాక్రాంతం అవుతుంటే తాను తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆలయం పేరుపై ఖాతాలో రూ.19లక్షలు జమ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, నాయకులు వెంకటేష్, శివకుమార్, చిన్ననర్సింహులు, ఆంజనేయులు, మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ బలవన్మరణం
మంచాల: కుటుంబ కలహాలతో ఓ మహి ళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆరుట్లలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మంచాల సీఐ మధు తెలిపిన ప్రకారం.. గ్రామా నికి చెందిన జోగు సుదర్శన్తో ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన సంధ్యారాణి (45)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం. దంపతులు తరచూ గొడవపడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు సర్దిచెప్పారు. వారిలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన సంధ్యారాణి మంగళవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి పిల్లలు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు సుదర్శన్పై కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఇబ్రహీంపట్నం ప్రభు త్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం ఆరుట్లలో అంత్యక్రియలు నిర్వహించారు. బెల్టుషాప్పై దాడులు పహాడీషరీఫ్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్టుషాప్పై పహాడీషరీఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హార్డ్వేర్ పార్కులోని శివ కిరాణ జనరల్ స్టోర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు దాడులు చేయగారూ.17వేల విలువైన 88 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు శివకుమార్(32) అరెస్ట్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. వెంచర్ ప్రహరీకూల్చివేతపై కేసు షాద్నగర్రూరల్: మున్సిపల్ పరిధి చటాన్పల్లి శివారులో ఉన్న ఆర్సిడో లారెల్ స్ప్రింగ్ వెంచర్ ప్రహరీని కూల్చారని వెంచర్ యజమాని మిట్టపల్లి యాదగిరి బుధవారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుశీల, బాధితుడు తెలిపిన ప్రకారం.. సర్వే నంబర్ 529పీ, 530పీ, 554పీ, 556పీ, 557పీ, 558లోని 28 ఎకరాలలో రెరా అనుమతులను తీసుకుని వెంచర్ చేశారు. సంబంధంలేని సర్వే నంబర్ 534లో తనకు భూమి ఉందని చటాన్పల్లికి చెందిన శివకుమార్, రాజుగౌడ్, రామకృష్ణ, భాస్కర్గౌడ్, రాజు, శ్రీశైలం, జంగయ్య, యాదగిరి, అశోక్, చెన్నయ్య, గిరి, రమేశ్, చిన్నచంద్రయ్య వెంచర్లోకి ప్రవేశించి ప్రహరీ కూల్చి వేశారు. ఆ వీడియోలు పంపి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశారని తెలిపాడు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ అన్నిశాఖలనుంచి అనుమతులను తీసుకున్న తరువాతనే వెంచర్చేసి గోడను నిర్మించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మాజీ ఎమ్మెల్యే జైపాల్కు మాతృ వియోగం
కడ్తాల్: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుర్క జైపాల్యాదవ్కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగమ్మ (95) వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీ రాములు, షాద్నగర్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, క్యామ మల్లేశ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మాజీ ఎంపీపీలు, బీజేపీ నాయకులు తదితరులు చల్లంపల్లి గ్రామానికి చేరుకుని మంగమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జైపా ల్యాదవ్ను పరామర్శించారు. జైపాల్యాదవ్కు హరీశ్రావు ఫోన్ మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు జైపాల్యాదవ్కు ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జనసందోహం మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. చల్లంపల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో మంగమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు. నివాళులర్పించిన ఆయా పార్టీల నేతలు -
బెల్టు దుకాణాలపై దాడులు: కేసు నమోదు
శంకర్పల్లి: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మగ్గురు వ్యక్తులపై మోకిల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు మూసి ఉండడంతో కొంత మంది అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. ఠాణా పరిధిలోని మిర్జాగూడ, జన్వాడ, కొండకల్ గ్రామాల్లోని మూడు కిరాణా దుకాణ్లాలో పోలీసులు దాడులు చేశారు. మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి, వారి నుంచి 20 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచలో ప్రమాదవశాత్తు జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ మల్లేశ్ ఎనిమిది ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. పంట కోత దశకు వచ్చింది. మధ్నాహ్నం పంటకు నిప్పంటుకోవడంతో గమనించిన స్థానికులు రైతుకు సమాచారం ఇచ్చారు. మంటలార్పేందుకు పలువురు విఫలయత్నం చేశారు. తాండూరు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటాలార్పే వరకు ఆరు ఎకరాల్లో పంటల పూర్తిగా దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని.. సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. భూ తగాదాల్లో ఘర్షణ ● పలువురికి గాయాలు ● ఇరువర్గాలపై కేసులు పరిగి: మండల పరిధిలోని నస్కల్లో మంగళవారం భూ తగాదాలు భగ్గుమన్నాయి. సర్వేనంబర్ 216లో కాసుల వెంకటయ్య కుటుంబ సభ్యుల పేరున మూడెకరాల భూమి ఉంది. ఇదే సర్వేనంబర్లో దాయాది కాసుల నగేష్ రోడ్డు వేసేందుకు జేసీబీతో చదును చేస్తుండగా, వెంకటయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు కొనసాగుతున్నాయని సమాచారం. 202, 203 సర్వే నంబర్లలోని పొలాల విషయంలోనూ ఇరు కుటుంబాలు తగాదా పడుతున్నాయని తెలుస్తోంది. శ్మశానవాటికలో యువకుడి బలవన్మరణం మర్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య పరిగి: శ్మశాన వాటికలో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ, స్థానికులు తెలిపిన ప్రకారం.. దోమ మండలం మైలారం పంచాయతీ పాశంబండ తండాకు చెందిన కాట్రావత్ దీపక్(23) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం పట్టణంలో ఉండే అక్క నీల వద్దకు వచ్చి పని చూసుకుంటానని చెప్పాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయిన దీపక్ ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న శ్మశాన వాటికలో మర్రి చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ తల్లి పారుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
మహిళ అదృశ్యం
పహాడీషరీఫ్: మానసిక స్థితి సరిగ్గా లేని మహిళ అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన ఫాతిమా బేగం(45) భర్త ఖురేషీ చనిపోవడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. శాసీ్త్రపురంలో నివసించే ఆమె సోదరుడు ముస్తఫా నిత్యం ఆహారం తెచ్చిస్తుంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆమె 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి అబ్దుల్లాపూర్మెట్: ఓఆర్ఆర్పై కారులో ప్ర యాణిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితి లో మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్రోడ్డుపై పెద్దఅంబర్పేట నుంచి బొంగ్లూర్ వెళ్లే మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు ఆగి ఉండడాన్ని గమనించి న పెట్రోలింగ్ సిబ్బంది దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కారులో డ్రైవింగ్ సీటు పక్కనే ఉన్న సీ టులో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు నోట్లో నుంచి నురగ రావడాన్ని గ మనించి 108 వాహనానికి సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అతని వివరాల గురించి ఆరా తీయగా మృతుడు ఎన్టీఆ ర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం వేడ మనూరు గ్రామానికి చెందిన తడపనేని శివరామకృష్ణ(33) అని తేలింది. ఆయన గచ్చిబౌ లిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రాప్ సర్వేకు వలంటీర్లు
పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు సిద్ధమయింది. ఈ సర్వేకు వలంటీర్లను నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది. దుద్యాల్: పంట నమోదు ఏఈఓలకు భారమైంది. దీంతో ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్కో వలంటీరును నియమించారు. స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వలంటీరు సంబంధిత పొలం దగ్గరకు వెళ్లి సాగు చేసిన పంటల వివరాలు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఫొటోకు రూ.7 పంటల వివరాలు నమోదుకు వలంటీర్లకు వ్యవసాయ శాఖ ఒక్కో ఫొటోకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. ఒక్కో సబ్ సర్వే నంబర్కు ఒక్కో ఫోటో తీయాల్సి ఉంటుంది. సబ్ సర్వే నంబర్లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో మాత్రమే నమోదు చేయాలి. ఇలా చేయడంతో ఏ రైతు ఏ సర్వే నంబర్లో ఏ పంటను సాగు చేస్తున్నారో పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. పంటల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయడంతో సాగు వివరాలు పక్కగా ఉంటాయి. పంట విక్రయాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతు ఆధార్ కార్డు, భూమి పాస్బుక్ నంబర్ నమోదు చేసిన వెంటనే పంటల వివరాలు తెలిసిపోతాయి. 12 రెవెన్యూ గ్రామాలు మండల వ్యాప్తంగా హంసంపల్లి, గౌరారం, దుద్యాల్, హస్నాబాద్, కుదురుమల్ల, నాజుఖాన్పల్లి, చిలుముల్ మైల్వార్, మాచన్పల్లి, లగచర్ల, హకీంపేట్, ఈర్లపల్లి, పోలేపల్లిలు రెవెన్యూ గ్రామాలు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ను నియమించుకోవాలనే నిబంధన ఉండగా 12 గ్రామాలకు గాను తొమ్మది మందిని నియమించుకున్నారు. ఇందులో హకీంపేట్, పోలేపల్లి, నాజుఖాన్పల్లి రెవెన్యూ గ్రామాలకు వలంటీర్లను నియమించకుండా ఏఈఓనే పంట వివరాలు నమోదు చేస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు వలంటీర్లను కలిసి మీ సాగు వివరాలు నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్కొక్కరు నియామకం క్షేత్రస్థాయికి వెళ్లి పంటల నమోదు హకీంపేట్, పోలేపల్లి, నాజుఖాన్పల్లిలో ఏఈఓలతో సర్వే సదావకాశం పంటలను సర్వే చేయడా నికి కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. గ్రామాల్లో చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్నాం. ప్రస్తుతం ఈర్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో పంటల వివరాలు నమోదు చేయడానికి వలంటీర్గా ఎన్నికయ్యాను. ఉత్సాహంతో పని చేస్తున్నాం. – మోద్రేచ్చ సంతోష్ కుమార్, వలంటీర్, ఈర్లపల్లి తప్పులకు ఆస్కారం లేదు గతంలో పంటలు సాగు చేయకుండా చేసినట్లు నమోదు చేయించారు. ప్రస్తుతం ఆస్కారం లేదు. వలంటీర్ రైతు సాగు చేస్తున్న పొలం లోకేషన్కు వెళ్లి సర్వే నంబర్ ఆధారంగా సాగు చేస్తున్న పంటలను నమోదు చేస్తారు. తప్పుడు సమాచారం నమోదుకు అవకాశం లేకుండాపోయింది. పంటలు సాగవుతున్న భూ వివరాలు నమోదు అవుతాయి. – నాగరాజు, మండల వ్యవసాయ అధికారి, దుద్యాల్ -
ఆయుష్ పోయరూ!
● పురాతన వైద్యానికి కరువైన ప్రాధాన్యత ● సిబ్బంది లేక మూతపడిన ఆస్పత్రులు ● కళాశాల మంజూరు చేసి వైద్యాన్ని విస్తరించాలని డిమాండ్ కొడంగల్: కొడంగల్ కేంద్రంగా ఆయూష్ కళాశాలను మంజూరు చేయాలని ఆయుర్వేద విద్యార్థులు కోరుతున్నారు. నియోజకవర్గానికి చెందిన వందలాది మంది విద్యార్థులు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లి బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ప్రాంతలో ఆయుష్ కళాశాలను ఏర్పాటు చేస్తే ఇక్కడి విద్యార్థులకు మేలు జరిగడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కొడంగల్కు ఆయుష్ మెడికల్ కళాశాలను మంజూరు చేయించాలని గతంలో ఈ ప్రాంత ప్రజలు కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్కు అనేక కళాశాలలను మంజూరు చేశారు. ఇప్పటికే మెడికల్ కళాశాల, ఇంట్రిగ్రేటెడ్ గురుకులాలు, వృత్తి విద్యా కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, కొత్త మండలాల్లో జూనియర్ కళాశాలలను మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయుష్ మెడికల్ కాలేజీ మంజూరు చేసి ఆసుపత్రుల్లో డాక్టర్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్ ఆయుర్వేదానిదే.. ఇప్పటికే ఆయుర్వేదం, హోమియోపతి వైద్యానికి ప్రాధాన్యత పెరిగింది. దీర్ఘకాలిక రోగాలకు ఈ వైద్యంలోనే నయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆయుర్వేద, హోమియోపతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు రోగులు కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్, యాద్గిర్, గుల్బర్గా, రాయిచూర్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ తీసుకొని కొడంగల్కు ఆయుష్ను మంజూరు చేసి పురాతన వైద్యానికి ప్రాధాన్యత కల్పించాలని కొడంగల్ వాసులు కోరుతున్నారు. మూతపడిన ఆస్పత్రులు నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రులు పని చేయడం లేదు. డాక్టర్లు, వైద్య సిబ్బంది లేక మూతపడ్డాయి. పేదలకు ఆయుర్వేద వైద్యం అందని ద్రాక్షగా మారింది. కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో ఆరు ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. అందులో కొడంగల్ మండలంలో రుద్రారం, అంగడిరాయిచూర్, బొంరాస్పేట మండలంలో బొంరాస్పేట, దుద్యాల మండలంలో దుద్యాల, దౌల్తాబాద్ మండలంలో దౌల్తాబాద్, కోస్గి మండలంలోని గుండుమాల్లో ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. ఒక్కో దవాఖానాలో ఒక డాక్టర్, కంపౌండర్, అటెండర్, వాచ్మెన్ ఉండాలి. ప్రభుత్వం వైద్యులను నియమించక పోవడంతో పాటు కింది స్థాయి సిబ్బంది పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఆస్పత్రులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇన్చార్జిలు ఉన్న చోట మందులు లేవు. వైద్యులను నియమించి ఆస్పత్రులకు పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయుర్వేద విద్యార్థులు కోరుతున్నారు. నియోజకవర్గంలోని ఆయుర్వేద ఆస్పత్రులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. ఆయుర్వేద దవాఖానాల పర్యవేక్షణాధికారి కార్యాలయం హైదరాబాద్లో ఉంది. రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి చూడాల్సి ఉంది. ఆయుర్వేద ఆస్పత్రుల్లో పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ వైద్యం పేదలకు అందే విధంగా కృషి చేయాలి. -
మండుతున్న ఎండలు
● వికారాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ ● గరిష్టంగా 36.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు తాండూరు: ఎండలు మండుతున్నాయి.. నిన్న మొన్నటి వరకు చల్లటి వాతావరణంలో ఉన్న ప్రజలకు ఎండ వేడి చురకలంటిస్తోంది. పక్షం రోజులుగా గ్రీన్ జోన్లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. గత నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. సోమవారం వికారాబాద్ జిల్లా ఎల్లో అలర్ట్ జోన్లోకి వెళ్లింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. గ్రీన్జోన్లో పరిగి, చౌడాపూర్ జిల్లాలో 20 మండలాలు ఉండగా రెండు మండలాలు మినహా 18 మండలాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ధారురు మండలంలో 36.9 డిగ్రీలు, దుద్యాల మండలంలో 36.7 డిగ్రీలు, మర్పల్లి మండలంలో 36.6 డిగ్రీలు నమోదవ్వగా మరో ఏడు మండలాల్లో 36.5 డిగ్రీల వరకు, ఎనిమిది మండలాల్లో 35 డిగ్రీలకు వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పరిగి, చౌడాపూర్ మండలాలు 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో గ్రీన్ జోన్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 17 – 20 డిగ్రీల కనిష్ట్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాండూరు ప్రాంతంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
టిప్పర్, కారు ఢీ
ఒకరికి తీవ్ర గాయాలు చేవెళ్ల: రెండురోజుల్లో పెళ్లి ఉందని స్నేహితులకు పెళ్లికార్డు ఇచ్చేందుకు వచ్చి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్లారీ ఢీకొన్న ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన బస్వ ప్రవీణ్ నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 5న తన వివాహం ఉండటంతో చేవెళ్లలోఉన్న స్నేహితులకు పెళ్లికార్డు ఇచ్చేందుకు మంగళవారం కారులో వచ్చి తిరిగి వెళ్తున్నాడు. మార్గమధ్యలో మీర్జాగూడ సమీపంలో కి రాగానే రోడ్డు పనులకు మట్టిపోస్తున్న టిప్పర్ లా రీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. మరో కారు వెనుక నుంచి వచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కారులో ఇరుక్కుపోయాడు. అతన్ని స్థా నికులు బయటకు తీసి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి త రలించారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హుడాకాంప్లెక్స్: రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో (హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) 2025–26 విద్యా సంవత్సరానికి గాను నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన, క్రీడాధికారి స్వర్ణలత పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు మాత్రమే జిల్లా స్థాయికి అర్హులన్నారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులను రాష్ట్రస్థాయికి పంపిస్తారన్నారు. 8 నుంచి 9 సంవత్సరాల మధ్య (01.09.2017 నుంచి 31.08.2018 మధ్య జన్మించి ఉండాలి) వయస్సు ఉండాలన్నారు. ఈనెల 4వ తేదీ వరకు tgss.telangana.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు మండల విద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. షాద్నగర్రూరల్: ఉద్యోగులు మానసిక ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని షాద్నగర్ డిపో మేనేజర్ ఉష అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం జాతీయ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని జయంచడం ఎలా అన్న అంశంపై డాక్టర్ మహేశ్తో అవగాహన కల్పించారు. అనంతరం డీఎం మాట్లాడుతూ.. మానసిక ఆందోళనతో విధులను సక్రమంగా నిర్వర్తించలేమనే విషయాన్ని ఉద్యోగులు గ్రహించాలని అన్నారు. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామంచేస్తే మానసిక ఆందోళన తగ్గుతుందన్నారు. చిన్నపాటి సమస్యలకు కుంగిపోవద్దని, ఆనందంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు విధులకు హాజరయ్యే ముందు ఇంటి నుంచి ప్రశాంతంగా రావాలన్నారు. సమయానికి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్, మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్ నాగులు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: కార్గోలో వచ్చిన పార్సిల్ సామగ్రిని ఈనెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నం బస్టాండ్లో వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. కార్గో బస్సుల్లో రవాణా చేసిన పలు పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు కొన్నాళ్లుగా తీసుకెళ్లడం లేదన్నారు. ఈ సామగ్రిని వేలం వేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనా లని సూచించారు. -
స్నానానికి వెళ్లి.. నీట మునిగి
షాద్నగర్రూరల్: విద్యార్థులంతా కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు.. స్నానం చేసేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు.. చెరువులోకి దిగిన వారిలో ఓ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు.. గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు.. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామశివారులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఫరూఖ్నగర్ మండలం రాయికల్ శివారులోని ఓ భవనంలో నారాయణపేట, నాగర్కర్నూల్, దేవరకద్రకు చెందిన మహాత్మాజ్యోతిరావుపూలే డిగ్రీ కళాశాల కొనసాగుతోంది. ఈ కళాశాలలో జోగులాంబ గద్వాలజిల్లా, ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు (19) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాలలో విద్యార్థులు హోలీ వేడుకలను జరుపుకొన్నారు. మధ్యాహ్నం దాదాపు ఆరుగురు విద్యార్థులు రాయికల్ సమీపంలోని చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో చెరువులోకి దిగిన రాజు గల్లంతయ్యాడు. విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల అధ్యాపకులకు చెప్పడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయాన్ని తెలుసుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిషన్ ఆధ్వర్యంలో ఫైర్ అధికారులు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెరువులో గురుకుల విద్యార్థి గల్లంతు -
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
హయత్నగర్: పాడి రైతులు, సంస్థ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థను గాడిలో పెట్టేందుకే ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)తో ఒప్పందానికి సిద్ధమయ్యామని నార్ముల్ మదర్డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి అన్నారు. పెండింగ్ పాల బిల్లుల చెల్లింపుకోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని మెజారిటీ సొసైటీల చైర్మన్లు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన హయత్నగర్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సొసైటీల చైర్మన్లు మాట్లాడుతూ.. ఐదున్నర నెలలుగా బిల్లులు చెల్లించలేదని అన్నారు. పాలక వర్గం రాజీనామ చేయాలని, చైర్మన్ స్పందించకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పాలకవర్గం, అధికారుల అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేపట్టాలని, చైర్మన్ను రైతులే నేరుగా ఎన్నుకునే విధంగా బైలా మార్చాలని డిమాండ్ చేశారు. మిజా చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. చిట్యాల భూమి కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాల కోసమే లాభాలు చూపించామని తెలిపారు. పాలక వర్గం సభ్యులకు అవగాహన లేకపోవడం, అనుభవ లేమి కారణంగా సంస్థ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. ఎన్డీడీబీతో ఒప్పందంతో సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చైర్మన్ మధుసూదన్రెడ్డి సమాధానం ఇస్తూ గతంలో ఉన్న పాలక వర్గం నిర్వాకంతోనే సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని, ఎన్డీడీబితో ఒప్పందంలో ఎలాంటి దాపరికం లేదన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వెంటనే రూ.10 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చారని తెలిపారు. సంస్థ ప్రతినిధి మహిపాల్రెడ్డి ఎన్డీడీబి ఒప్పంద వివరాలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. నార్ముల్ మదర్డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
మున్సిపల్ ఆఫీసుకు.. డీసీపీ కార్యాలయానికి
3 ప్రతిపాదనలు పంపించాం మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మున్సిపల్ అధికారులు లేఖరాశారు. చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో అందుబాటులో ఉందని కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించాం. డీసీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు సంబంధించిన లేఖ ఇంకా అందలేదు. లేఖ అందిన వెంటనే కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదిస్తాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ ఎకరాలు మొయినాబాద్: కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ పురపాలిక సంఘం, చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూకేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చిలుకూరు రెవెన్యూలో సర్వేనంబర్ 786లోని ప్రభుత్వ భూమిని కేటాయించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్కు పంపారు. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ భూమి పరాధీనం కాకుండా.. నగర శివారుల్లోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఇందులోని 9 ఎకరాల్లో వేద పాఠశాల ఏర్పాటుకు కేటాయించారు. కానీ వేద పాఠశాల ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వ భూమి ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్న భూమి పరులపాలు కాకుండా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విధంగా చేయాలని రెవెన్యూ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. కలెక్టర్కు ప్రతిపాదనల నివేదిక మొయినాబాద్ మున్సిపాలిటీ ఏడాది క్రితం ఏర్పడింది. మొయినాబాద్, చిలుకూరు, పెద్దమంగళారం, అప్పోజీగూడ, సురంగల్, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్నగర్, హిమాయత్నగర్ పంచాయతీలను విలీనం చేసి మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయానికి సరైన భవనం లేకపోవడంతో అజీజ్నగర్ పంచాయతీ కార్యాలయంలోనే మున్సిపల్ కార్యాలయాన్ని తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో పాలకమండలి ఏర్పడింది. చైర్పర్సన్ కార్యాలయం, వైస్చైర్మన్, కౌన్సిలర్లు కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. కొత్త మున్సిపల్ కార్యాలయం ఏర్పాటుకు సుమారు 3 ఎకరాల స్థలం కేటాయించాలని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. దీంతో చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయం తాత్కాలికంగా మొయినాబాద్లోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో కొనసాగుతోంది. డీసీపీ కార్యాలయం ఏర్పాటుకు సైతం స్థలం కావాలని పోలీసు శాఖ కోరడంతో రెవెన్యూ అధికారులు చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో 3 ఎకరాలు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయం, డీసీపీ కార్యాలయానికి 3 ఎకరాల చొప్పున భూకేటాయింపులకు సంబంధించిన పూర్తి ప్రతిపాదనల నివేదికను రెవెన్యూ అధికారులు కలెక్టర్కు పంపించనున్నారు. ప్రభుత్వం సైతం సానుకూలం మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయం, చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉంది. మొయినాబాద్లోని విలువైన భూములను కాపాడే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. చిలుకూరు రెవెన్యూలోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవడమే మంచిదని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భూకేటాయింపుకు అనుమతిస్తూ నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. చిలుకూరు రెవెన్యూలో భూ కేటాయింపులు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు -
వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపుదాం
నవాబుపేట: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో 30 ఫీట్ల పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని అభివృద్ధి చేసుకోవాలని కార్యకర్తలకు సూ చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కేఎస్ రత్నం, మండల అధ్యక్షుడు చంద్రకాంత్, ఐటీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ శ్రీధర్, నాయకులు జగన్, గాలయ్య, శేఖర్, మల్లేశం, చంద్రశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, భీంరెడ్డి, రత్నం, రాజశేఖర్ రెడ్డి, కల్యాణ్ రావు, రాంరెడ్డి, పద్మా రావు, జైపాల్ రెడ్డి, గోపాల్ గౌడ్ పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
● బంగారు, వెండి ఆభరణాల చోరీ ● ఎల్లకొండలో ఘటన నవాబుపేట: ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపరించిన సంఘటన ఎల్లకొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లిలోని గణేశ్నగర్కు చెందిన మీనపల్లి బాలమణి(45) గృహిణి. ఇరవైఐదేళ్ల క్రితమే భర్తతో విడిపోయి, కొడుకు శేఖర్తో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. శేఖర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా గత 28న ఎల్లకొండలో జాతర ఉందని, తాను బంధువుల వద్దకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. జాతరకు తన అక్క యాదమ్మ, చెల్లెలు భారతమ్మలు కూడా వచ్చారని కొడుకుకు ఫోన్ చేసింది. అదే రోజు రాత్రి శేఖర్ మళ్లీ ఫోన్ చేయగా కల్లు దుకాణంలో ఉన్నామని, రాత్రి వీధి నాటకం చూసి పొద్దున్నే శంకర్పల్లికి వస్తానని చెప్పింది. మరుసటి రోజైన ఆదివారం ఉదయాన్నే శేఖర్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అతను పెద్దమ్మ అయిన యాదమ్మకు ఫోన్ చేయగా, ఉదయం నాలుగు గంటలకే శంకర్పల్లికి బయలుదేరిందని చెప్పింది. కానీ మధ్యాహ్నం దాటినా ఇంటికి రాకపోవడంతో శేఖర్ ఎల్లంకొండకు వెళ్లి, గ్రామంలోని బంధువుల ఇంటి పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా అందులో కనిపించలేదు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు స్థానికులు ఊరి శివారులో ఓ మహిళ మృతదేహాన్ని గమనించారు. ఈ ఫొటోలను చూసిన శేఖర్ తమ అమ్మేనని గుర్తించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీఐ వెంకట్, ఎస్ఐ పుండ్లిక్ డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్లతో ఆధారాలు సేకరించారు. తన తల్లి ఒంటిపై మూడు తులాల బంగారు పుస్తెలతాడు, బంగారు కమ్మలు, వెండి పట్టీలు ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. ఇందులో ఒక చెవి కమ్మ మాత్రమే ఉందని, గొంతు కోసి చంపారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జైభీమ్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జైభీమ్ డైరీ, క్యాలెండర్ను సరూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. సరూర్నగర్ ఎస్ఈ లక్ష్మీనారాయణకు క్యాలెండర్ అందజేశారు. కార్యక్రమంలో సరూర్నగర్ సర్కిల్ కార్యదర్శి పి.రవీందర్, ప్రెసిడెంట్ ప్రవీణ్కుమార్, నాయకులు మహేందర్, అశోక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ పహాడీషరీఫ్: గుట్టు చప్పుడు కాకుండా మూడు ముక్కలాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీలో గరడు రమేష్ (34), పవన్ (24), ఎల్లప్ప (60), సంతోష్ (22), కాశీరాం (22) సోమవారం సాయంత్రం పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దాడి చేసి, ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సెట్ల కార్డులు, ఒక సెల్ఫోన్, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్కు ఏడాది జైలు రూ.6 వేల జరిమానా పూడూరు: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన తోక అంజలిదేవి నారాయణపేట్ బస్సులో హైదరాబాద్కు వెళ్తోంది. పూడూరు గేట్ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపుతూ మామిడి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా అంజలీదేవి అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటి ఎస్ఐ నాగరాజు 2015లో కేసు నమోదు చేసి కోర్డులో పత్రాలు దాఖలు చేశారు. వాదోప వాదనలు విన్న న్యాయమూర్తి నాగుల శిల్ప ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ హరికృష్ణ నాయక్కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 వేలు జరిమానా విధించారు. ఈ కేసులో అధికారి శేఖర్ దర్యప్తు చేయగా ప్రస్తుత ఎస్ఐ భరత్రెడ్డి సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. ప్రభుత్వ తరపున ఏపీపీఓ సమీనాబేగం వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసులు శివకుమార్, తదితరులను అభినందించారు. -
బొత్స సత్యనారాయణకు పరామర్శ
ఇబ్రహీంపట్నం రూరల్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ పరామర్శించారు. సోమవారం నగరంలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఆరోగ్యం, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యమకారుల హామీలు నెరవేర్చండి బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ నవాబుపేట: ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శుభప్రద్ పటేల్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మెనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారులందరికీ 250గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులను స్వతంత్ర సమయోధులుగా గుర్తించి ప్రతీ నెల గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిరెడ్డి, శాంతి కుమార్, మల్లేశం, నరసింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, కావలి శేఖర్, అశోక్ పాల్గొన్నారు. ప్రాణాలు కాపాడిన సీటుబెల్టు తాండూరు రూరల్: ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటన పెద్దేముల్ మండలం మారెపల్లి తండా గేటు వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రశాంత్వర్ధన్ తెలిపిన ప్రకారం.. తాండూరు నుంచి మెహదీపట్నంకు వెళ్తున్న తాండూరు ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సు, వికారాబాద్ నుంచి తాండూరుకు ప్రయాణిస్తున్న కారు మారెపల్లి గేటువద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతినగా.. కారు చక్రాలు ఊడిపోయి నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న హంతేజ్ సీటుబెల్టు ధరించడంతో బెలూన్లు తెరుచుకుని స్వల్పగాయాలతో బయటపడ్డాడు. హంతేజ్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. నా భర్త నుంచి కాపాడండి ● ముగ్గురు ఆడపిల్లల తల్లి ఆవేదన ● పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు బషీరాబాద్: ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. తరచూ నాపై దాడికి పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. మెడలో ఉన్న తాళి బొట్టు తెంపేశాడు. అతనితో నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, పోలీసులు తెలిపసిన వివరాల ప్రకారం.. ఎక్మాయికి చెందిన జోగి అశ్విని, జోగి రవికుమార్ భార్యభర్తలు. వీరికి లావణ్య, వితిక, సుభిక్ష ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డ్రైవర్గా పనిచేసే తన భర్త నిత్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి బాధితురాలికి అండగా నిలిచారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
మనోభావాలు దెబ్బతీయొద్దు
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య హోలీ వేడుకలకు రెడీ ఇబ్రహీంపట్నం: హోలీ వేడుకలకు ఇబ్రహీంపట్నం సిద్ధమైంది. మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ చిల్ల దగ్గర సోమవారం రాత్రి కాముని దహనం నిర్వహించారు. పట్టణంలోని పలు చౌరస్తాల్లో మంగళవారం తెల్లవారుజామున కామ దాహనానికి పలువురు ఏర్పాట్లు చేశారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆమనగల్లులో సందడి ఆమనగల్లు: పట్టణంలో హోలీ సందడి మొదలైంది. వేడుకను పురస్కరించుకొని ప్రత్యేకంగా రంగుల విక్రయ దుకాణాలు వెలిశాయి. సోమవారం స్థానికులు వాటిని కొనుగోలు చేస్తూ కనిపించారు. ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీయొద్దని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య అన్నారు. పట్టణంలో సోమవారం ఆ సంఘం మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరకొర వసతులు, ప్రైవేట్ పాఠశాలలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుల జీతభత్యాలు, పదోన్నతులపై విద్యా కమిషన్ నివేదిక సమర్పించడం యావత్ ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలో చెప్పాల్సిందిపోయి ఇలా నివేదిక ఇవ్వడం సరైందికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యాకమిషన్ సమర్పించిన రిపోర్టుపై అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినేలా నివేదికలు ఉండొద్దన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్ల కాశీరావు, ప్రధాన కార్యదర్శి పూజారి రమేష్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ సత్తారి రాజిరెడ్డి, రాజేందర్, నర్సింహ, కరుణాకర్, జంగయ్య పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపు
హుడాకాంప్లెక్స్: రోడ్లను ఆక్రమించుకొని అక్రమంగా వేసిన షెడ్లను అధికారులు తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా షెడ్లు నిర్మించి చిరు వ్యాపారాలు చేస్తుండడంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు, వాహనదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో సోమవారం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరూర్గర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి అర్చన నేతృత్వంలో కొత్తపేట బాబు జగ్జీవన్ రామ్ భవన్ నుంచి ఓమ్ని ఆస్పత్రి సర్వీసు రోడ్డు, కొత్తపేట నాగోల్ రోడ్డులోని మహాలక్ష్మి థియేటర్ రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన షెడ్లను చైతన్యపురి పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో కూల్చివేశారు. ఈ క్రమంలో తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని చిరు వ్యాపారులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ వ్యాపారం చేసుకునే తమపై ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. దీంతో అధికారులు చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పి పంపించారు. కార్యక్రమంలో చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. చిరువ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదం -
మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు ఘన నివాళి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ నారాయణరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం శ్రీపాదరావు సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు పహాడీషరీఫ్: పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఎల్బీ నగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో 2024లో ఆటోడ్రైవర్ షేక్ ముజీబ్ (24) పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు డీఎన్ఏ ఆధారాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శోభారాణి, సత్యనారాయణ వాదనలు వినిపించారు. కేసు విచారించిన ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి సాధారణ జీవిత ఖైదుతో పాటు రూ.70 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో బాధితురాలికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించారు. యువతి అదృశ్యం పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బీఎల్ఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్కుమార్ కుటుంబంతో కలిసి పదిరోజుల క్రితం జల్పల్లి పిట్టలగూడెంకు వలస వచ్చాడు. తాను పనిచేస్తున్న బిల్డింగ్లోనే నివాసం ఉంటున్నాడు. ఈనెల 1న ఉదయం 10 గంటలకు అతని చిన్న కుమార్తె ముస్కాన్ అహిర్వార్ (20) ఇంట్లో చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో తండ్రి అదేరోజు రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సోమవారం కోరారు. -
గుట్టకాయ స్వాహా!
గుట్టలనూ వదలని అక్రమార్కులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమార్కులు ప్రభుత్వ, అసైన్డ్ భూములే కాదు.. కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. ఒకవైపు గుట్టుగా మైనింగ్ (మట్టి తవ్వకాలు, గ్రానేట్ అమ్మకాలు) చేస్తూనే మరోవైపు చుట్టూ బౌన్సర్లను పెట్టి భూమిని చదును చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, తర్వాత లే అవుట్లు చేసేస్తున్నారు. వీరి వెనుక స్థానికంగా ఉన్న అధికారపార్టీ పెద్దలు ఉండడంతో విషయం తెలిసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కళ్లముందే ఖరీదైన భూములు కరిగిపోతున్నా.. వాటిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. ఏమీ చేయలేక నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హయత్నగర్లోని వీరన్నగుట్ట పూర్తిగా కబ్జాకు గురైంది. బీఎన్రెడ్డినగర్ సమీపంలోని మరో గుట్ట సహా దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి ఇప్పటికే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా బాలాపూర్ మండల పరిధిలోని పలు విలువైన గుట్టలు కరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేవతలగుట్టపై దెయ్యాల పాగా బాలాపూర్ రెవెన్యూ సర్వే నంబర్లు 78, 79, 80,81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90లో దేవతల గుట్ట ఉంది. గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడి విలువైన భూములను ఆక్రమించేస్తున్నారు. అర్బన్ సీలింగ్ నేచర్ సహా మల్టీపుల్ కేసులున్న ఈ భూముల్లో ఇప్పటికే కొంత ఆక్రమణకు గురికాగా.. తాజాగా మరికొంత భూమి కబ్జాకు యత్నిస్తున్నారు. చుట్టూ బౌన్సర్లను పెట్టి.. అటువైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకుంటున్నారు. ఖరీదైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు చేస్తున్నారు. ఆక్రమించిన ఆయా భూములను 400 గజాల ప్లాట్ల చొప్పున విభజించి గుట్టుగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గుట్ట చుట్టూ జిలెటిన్స్టిక్స్తో పెద్ద ఎత్తున పేలుళ్లు చేపడుతున్నారు. సమీపంలోని నివాసాలు దెబ్బతింటున్నా.. మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గ్రానైట్ సహా విలువైన భూములను ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తోంది. అనధికారిక వెంచర్లు.. అడ్డగోలు రోడ్లు శంషాబాద్ మండలం గొల్లపల్లి కేంద్రంగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. బహుదుర్గూడ రెవెన్యూ సర్వే నంబర్ 62లో 500 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, వీటి మధ్య నుంచి 1.5 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. బహుదుర్గూడ–తుక్కుగూడ ఔటర్ సర్వీసు రోడ్డుకు అనుసంధానంగా ఈ రోడ్డును వేశారు. ఎయిర్పోర్టు రన్వేకు అతి సమీపంలోని పొలాలను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నారు. వీటిలో పెద్ద సంఖ్యలో విల్లాలు నిర్మిస్తున్నారు. ఐదు నిమిషాల్లో ఔటర్కు చేరుకోవచ్చని ప్రచారం చేసుకుంటున్నారు. శంషాబాద్ మండలం చౌదరిగూడ సర్వే నంబర్ 34లోని సీలింగ్ భూముల్లోనూ వెంచర్లు వెలిశాయి. శంకర్పల్లి మండలం జన్వాడ రెవెన్యూ సర్వే నంబర్ 192లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. కొందుర్గు మండలం లూర్తునగర్ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వెలిశాయి. బాలాపూర్ మండలం బడంగ్పేట్ సర్వే నంబర్ 161 ఎర్రకుంట ఎఫ్టీఎల్లోని రెండు ఎకరాల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేసినా పట్టించుకున్న నాథుడు లేడు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని దేవతలగుట్ట. ఇక్కడి భూములను ప్రభుత్వం యూఎల్సీ (నిషేధిత) జాబితాలో చేర్చింది. విలువైన ఈ భూములపై స్థానిక అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఇప్పటికే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ భూములను పెద్ద సంఖ్యలో కొల్లగొట్టి.. నిర్మాణాలు సైతం చేపట్టింది. తాజాగా సర్వే నంబర్ 78, 80లోని మరికొంత భూమిని ఆక్రమించి.. ఇల్లీగల్ లే అవుట్ను సిద్ధం చేసింది. వీటిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఇది జల్పల్లి రెవెన్యూ సర్వే నంబర్ 177లో 17 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎత్తయిన గుట్ట. ఇప్పటికే దీనికి ఆనుకుని ఉన్న మెజార్టీ భూమి ఆక్రమణకు గురైంది. ఇది ప్రభుత్వ భూమి అని, అమ్మడం.. కొనడం నేరమని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి, యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతుండటం గమనార్హం. దర్జాగా లే అవుట్లు.. అక్రమ నిర్మాణాలు పట్టించుకోని అధికారులు విలువైన భూముల ఆక్రమణ ప్రభుత్వ బోర్డుల తొలగింపు -
‘ఉపాధి’పై సామాజిక తనిఖీ
చేవెళ్ల: ఉపాధిహామీ పనులతో ప్రజలకు ఉపాధి కల్పించటంతో పాటు ఎలాంటి అవకతవకలు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టేలా ఏటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ ఎల్.శ్రీలత అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం మండలంలో ఏడాది కాలంలో జరిగిన ఉపాధిహామీ పథకం పనులపై 16వ విడత సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు. మండలంలోని 37 గ్రామాల్లో ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు జరిగిన ఏడాది ఉపాధిహామీ పనులపై ఆడిట్ చేపట్టినట్టు తెలిపారు. మొత్తం రూ.1,93,20,661 పనులు జరిగినట్లు చెప్పారు. జిల్లా అధికారి పీడీ శ్రీలత, అడిషనల్ డీఆర్డీఏ సుభాషిణి, అంబుడ్స్మెన్ సునీత, క్వాలిటీ కంట్రోలర్ సునీత, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కొండయ్య, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ కాశన్న సమక్షంలో సామాజిక తనిఖీ నివేదికలు చదివి వినిపించారు. అవకతవకలపై అధికారులు మండిపడ్డారు. రికార్డులు సక్రమంగా లేని గ్రామాల సిబ్బందిని ఏం చేస్తున్నారంటూ మందలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, ఎంపీఓ విఠలేశ్వర్జీ, ఉపాధిహామీ పథకం ఈసీ రాజశేఖర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ పథకం టీఏలు, ఎఫ్ఏలు, సిబ్బంది, ఉన్నారు. -
నైపుణ్యహస్తం
వికారాబాద్: లోక్సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్ర నేత రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం వికారాబాద్లోనే గడిపారు. పది రోజులుగా కొనసాగుతున్న ఉమ్మడి రాష్ట్ర డీసీసీ అధ్య క్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. రాహుల్ ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి 10.15 గంటలకు ఎస్ఏపీ కళాశాల హెలిపాడ్కు చేరుకున్నారు. అనంతరం ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్లు మహేశ్కుమార్గౌడ్, వైఎస్ షర్మిల, శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మన్ టి.రామ్మోహన్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అనన్య పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. పార్టీ పరిస్థితిపై ఆరా అనంతరం రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం, రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కళాశాల ఆవరణలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంలో ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అరగంటపాటు చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, అజహరుద్దీన్, వి.హన్మంతరావు, కేశవరావు, షబ్బీర్అలీ, రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నా రు. అనంతరం అనంతగిరి హిల్స్లోని హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి చేరుకున్నారు. సమర్థవంతంగా శిక్షణ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ హరిత రిసార్ట్స్లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులు, డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్లు మహేశ్కుమార్గౌడ్, వైఎస్ షర్మిల, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్రావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన తదితర అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. ఇరు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు తమ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మాణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీ డీసీసీ అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపారు. అందరితో విడిగా ఫొటోలు దిగారు. సాయంత్రం 4.35 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. డీసీసీ జిల్లా అధ్యక్షులకు ముగిసిన శిక్షణ హంగూ ఆర్భాటం లేకుండా..రాజకీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా రాహుల్గాంధీ పర్యటన కొనసాగింది. వీవీఐపీల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు మినహా ఎలాంటి ఆర్భాటం లేకుండా పర్యటన సాగింది. మీడియాకు సైతం అనుమతి లేకుండా పార్టీ అంతర్గత కార్యక్రమాన్ని కొనసాగించారు. -
నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత
మొయినాబాద్: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి ఆలయాన్ని మూసివేయనున్నట్టు చెప్పారు. గ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 7 గంటలకు సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేస్తామన్నారు. భక్తులకు దర్శన అవకాశం ఉండదన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే వినతులను శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ వారం 51 అర్జీలు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, వివిధ శాఖల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. షాద్నగర్: ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో సోమవారం అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి విధిగా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సాహితి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రవీణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్రావు, గుండుబావి శ్రీనివాస్రెడ్డి, అపోలో ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. షాద్నగర్రూరల్: పట్టణంలోని మిలీనియం టౌన్షిప్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ కార్యాలయాన్ని సోమవారం ఫ్యూచర్సిటీ కమిషనర్ సుధీర్బాబు సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ శిరీష ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిసి సీపీకి స్వాగతం పలికారు. అనంతరం సీపీ సుధీర్బాబు నియోజకవర్గంలోని సీఐలు, ఎస్ఐలతో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నెలకొన్న స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. క్రైం రేటు పెరగకుండా ఉండేందుకు, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కనుల పండువగా శ్రీవారి కల్యాణం
పరిగి: పట్టణ కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు భక్తు లు అందించిన సహకారం మరువలేనిది అన్నా రు. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలి
● వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ● దుద్యాల్ మండలంలో సుడిగాలి పర్యటన దుద్యాల్: నిర్మాణ పనుల్లో వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని దుద్యాల్, హకీంపేట్ గ్రామాల్లో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా దుద్యాల్లో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత భవనాలను పరిశీలించారు. లక్ష్యం మేరకు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులను పెండింగ్లో ఎందుకు పెట్టారని ఆర్అండ్బీ అధికారులను ప్రశ్నించారు. హకీంపేట్ శివారు ఎడ్యుకేషన్ హబ్ ప్రాంతాన్ని పరిశీలించారు. సంబంధిత మ్యాప్ను పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అధికారులు చర్యలు తీసుకోవాలి కొడంగల్: నిధులు మంజూరైన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ఆదివారం ఆయన పట్టణంలోని కడా కార్యాలయంలో వికారాబాద్, నారాయణపేట జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిచారు. కొడంగల్, నారాయణపేటకు సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్, తాగునీరు, మిషన్ భగీరథ పైప్లైన్లు, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, టీజీఈడబ్ల్యూడీసీ, పబ్లిక్ హెల్త్ శాఖల ద్వారా మంజూరైన నిర్మాణ పనులు ప్రారంభించి లక్ష్యం మేరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి.. సమ్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆర్అండ్బీ ద్వారా చేపట్టే పనులు, వెటర్నరీ, వైద్య కళాశాలలకు సంబంధించిన పనులు వేగిరంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు చెప్పారు. అంతకుముందు కడా ప్రకత్యేకాధికారి వెంకట్రెడ్డి వివిధ అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్చౌదరి, పంచాయతీరాజ్ డీఈ సుదర్శన్, ఆర్అండ్బిబీ ఈఈ శ్రీధర్రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ రవిప్రసాద్, కొడంగల్, నారాయణపేట ఇంజనీరింగ్ విభాగం ఈఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఎవరి కోఆప్షన్!
● సభ్యుల ఎంపికకు పైరవీలు ● అధికార పార్టీ నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇక కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అవకాశం దక్కించుకోవడం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని అధికార పార్టీ దక్కించుకుంది. వైస్ చైర్మన్గా స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకున్నారు. 26 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందినవారికే కోఆప్షన్ సభ్యలుగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో ఆశావహులంతా కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నాలుగులో రెండు మహిళలకు.. మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల స్థానాలు నాలుగు ఉన్నాయి. వాటిలో రెండు మహిళలకు కేటాయించనున్నారు. ఇందూలోనూ మైనార్టీ, బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకోసం మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ తదితరులను కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పైరవీల మధ్య ఎవరికి అవకాశం దక్కుతుందో మరికొన్ని రోజులు వేచిచూడాలి. పార్టీకోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా పార్టీకోసం పనిచేసిన వారికే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జొన్నాడ రాజు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నామని.. తనకు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ బలోపేతం, విస్తరణకోసం ఎంతో కృషి చేశామని.. పనిచేసేవారిని అధిష్టానం గుర్తించాలన్నారు. కొత్తగా పార్టీలో చేరినవారికి పదవులు ఇస్తే.. పార్టీ జెండాలు మోసి కష్టపడినవారికి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు గ్రహించాలన్నారు. -
చివరి దశకు సాగు
● బోర్ల కింద ఇప్పటికే 90 శాతం పూర్తి ● ఆయకట్టు కింద మిగిలిన పది శాతం ● జిల్లా వ్యాప్తంగా 93,116 ఎకరాల్లో నాట్లు పూర్తి దుద్యాల్: వానాకాలం సీజన్లో చివరి వరకు వర్షాలు కురియడంతో జలశయాలు కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగడంతో పలువురు రైతులు బోర్ల కింద ఇప్పటికే వరి నాట్లు వేశారు. ఆయకట్టు కింద కొనసాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పూర్తవ్వగా మరో పది శాతం నాట్లు వేసేందుకు పొలాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు నాట్లు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండల పరిధిలోని దుద్యాల్, హస్నాబాద్, లగచర్ల, అల్లిఖాన్పల్లి, లగచర్ల, గౌరారం, చెట్టుపల్లి తండా. చిలుముల్ మైల్వార్, నాజుఖాన్పల్లి, ఆలేడ్, కుదురుమల్ల, హకీంపేట్. పోలేపల్లి, ఈర్లపల్లి, గ్రామాల్లో ఆయకట్టు రైతులు వరి నాట్లు అధికంగా వేస్తున్నారు. ప్రస్తుతం హస్నాబాద్, ఆలేడ్లకు ఒకే చెరువు నీరు అందుతుంది. రెండు గ్రామాల్లో దాదాపు 2వేల ఎకరాలకు పైగా వరి సాగు చేపట్టారు. దుద్యాల్లోనూ రెండు పెద్ద చెరువులు ఉండడంతో దాదాపుగా వేయి ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. ప్రస్తుతం 11 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి 93,116 ఎకరాల్లో వరి నాటు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం తెలిపారు. ఈ నెల చివరి వరకు దాదాపు 1,05,000 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దొడ్డు రకాలతో అధిక దిగుబడి యాసంగి సాగులో రైతులు అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాల వైపు మొగ్గు చూపుతున్నారు. చీడ పీడలను తట్టుకుని అధికంగా దిగుబడి అందించే రకాలను ఎంచుకుని అందుకు తగిన సాగు యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. దొడ్డు రకాలైన వరి ధాన్యం కేఎన్ఎం––118, ఎంటీయూ–1,121, యూటీఆర్–1010 వంటివి సాగు చేస్తున్నారు. సన్న రకాలైన ఆర్ఎన్ఆర్–15,048 ఎక్కువ విస్తీర్ణంలో వేసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అధికంగా లాభాలు పొందేందుకు 90 శాతం మంది దొడ్డు రకాలైన వరి వంగడాలను సాగు చేస్తున్నారు. వీటి దిగుబడిని అధికంగా ఉంటుందని నమ్మకం. -
పదోన్నతుల సంబురం
శంషాబాద్: సీఐఎస్ఎఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ హైదరాబాద్లో పనిచేస్తున్న 217 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. సీనియర్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారికి దానికి సంబంధించిన చిహ్నాలను సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ రిక్రియేషన్ క్లబ్లో ఘనంగా అందించారు. ఈ సందర్భంగా సీనియర్ కమాండెంట్లు చిహ్నాలను వారి దుస్తులకు పెట్టారు. పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు మరింత ఉన్నతంగా రాణించాలని సూచించారు. మృతదేహంతో రోడ్డుపై ధర్నా ప్రమాదకారకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ మోమిన్పేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి శవంతో ధర్నా చేపట్టిన ఘటన మోమిన్పేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్భూషన్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని మొరంగపల్లికి చెందిన రుక్కల పాండు(56) శనివారం సాయంత్రం మోమిన్పేట సంతకు వెళ్లాడు. తిరుగుప్రయాణంలో దేవరంపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ బైక్తో పాండును ఢీకొట్టాడు. దీంతో క్షతగాత్రుడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాగా ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మృతుడి కుమారుడు బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు ఆదివారం సాయంత్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద శవంతో ధర్నా చేపట్టారు. ప్రమాదకారకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడకు చేరుకుని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రమాదకారుకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని డిస్చార్జి చేసిన వెంటనే అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆర్టీసీ డెయిలీ పాస్ ధర పెంపు సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ రోజువారీ (డైలీ) బస్ పాస్ ధర పెరిగింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డైలీ పాస్ చార్జీలను రూ.150 నుంచి రూ.130కి తగ్గించారు. తాజాగా ఈ రాయితీని ఆర్టీసీ ఉపసంహరించుకుంది. దీంతో యథావిధిగా డైలీ పాస్ చార్జీ రూ.130 నుంచి రూ.150 కి పెరిగింది. ఈ పాస్పైన ప్రయాణికులు ఏ బస్సుల్లోనైనా 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చు. -
అసలే అక్రమం.. ఆపై కల్తీ!
సాక్షి, సిటీబ్యూరో: నాసిరకం ముడిసరుకులతో అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ రంగులు వాడుతున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆదివారం రెండు ప్రాంతాల్లో దాడులు చేసి నలుగురిని పట్టుకున్నారు. రూ.10 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ వివరాలు వెల్లడించారు. జల్పల్లి ప్రాంతంలో అబ్దుల్ సత్తార్ అనుమతులు, లేబర్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్రమైన వాతావరణంలో ‘ఓ రాయల్ ఎంటర్ర్పైజెస్’, ‘షాహీ గోల్డ్ ’కంపెనీల పేరిట కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. ఈ పేస్టును స్థానిక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇతడికి జల్పల్లితోపాటు ముస్తాఫానగర్లోనూ కార్ఖానాలు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు వాటిపై దాడి చేసి ప్రధాన నిందితుడు సత్తార్తోపాటు మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ ఇఫ్తేఖర్, నూర్ నబీలను పట్టుకున్నారు. వీరి నుంచి 340 కిలోల విడి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఒక్కోటి 50 కిలోల బరువు ఉన్న 12 పెద్ద టబ్ల అల్లం మిశ్రమం, ఒక్కోటి 25 కిలోల బరువు ఉన్న 20 సంచుల వెల్లుల్లి మిశ్రయం, ఐదు సంచుల ఉప్పు, అజంతా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ బాక్సులు, సిట్రిక్ యాసిడ్ పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు. సింథటిక్ రంగులతో అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు చేసిన శంషాబాద్ టాస్క్ఫోర్స్ -
వర్షాకాలం కంటే తక్కువ
బోరు కింద వర్షాకాలం దాదాపు మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. బోర్లలో నీటి శాతం పెరిగిన వేసవి ఎండల కారణంగా భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. నీటి లభ్యతని బట్టి సాగు చేశా. నెల రోజు క్రితమే నాటు వేశాను. ప్రస్తుతం పిలకు వచ్చి పంట బాగుంది. – ఈరప్ప, రైతు, హస్నాబాద్ అధిక వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండుకోవడంతో బోర్లలో నీరు పెరిగి యాసంగి వరి సాగు శాతం పెరిగింది. ప్రస్తుతానికి 93,116 ఎకరాల వరకు వరి నాటు పూర్తయ్యాయి. దాదాపుగా 1,05,000 ఎకరాల వరకు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. రైతులు యాజమన్య పద్ధుతులు పాటించి సాగు చేస్తే అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చు. సందేహాలు, సలహాలు, సూచనల కోసం ఆయా గ్రామాల వారీగా ఏఈఓలను సంప్రదించాలి. – రాజారత్నం, జిల్లా వ్యవసాయ అధికారి -
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: భర్తతో గొడవపడిన గృహిణి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన కొమిరి యాదయ్య భార్య శారద (38) కూలి పని చేస్తుంటుంది. గత నెల 26న రాత్రి భర్త, పిల్లలతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె భర్త ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. బావిలో పడి మహిళ మృతి ఆమనగల్లు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన తలకొండపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం హర్యనాయక్ తండాకు చెందిన ఇస్లావత్ లలిత (34)కు జాన్యాతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నేళ్లుగా లలితకు ఆరోగ్యం బాగా లేదు. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్తానని చెప్పి లలిత ఇంట్లో నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో బంధువులు, సమీప గ్రామాల్లో వెతికినప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో ఆదివారం తండా సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదస్థితిలో ఉపాధ్యాయుడి మృతి ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని చిలుకానగర్కు చెందిన శంబెళ్ల సతీష్కుమార్ (47) మంచాల మండలం ఆరుట్లలోని టీజీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల బదిలీపై ఇక్కడకి వచ్చిన ఆయన ఇబ్రహీంపట్నంలోని ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఇంటి బాత్రూమ్లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సతీష్కుమార్ను ఇంటి యజమాని గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పరిశీలించి, ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సన్మానం
జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్ రావు ఉద్యోగ విరమణ చేశారు. సరోర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు అధికారులు, క్రీడాకారులు ఆయనను ఘనంగా సన్మానించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిత, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోచ్లు, సిబ్బంది, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. – హుడాకాంప్లెక్స్ -
లారీ చక్రాల కింద నలిగి మహిళ మృతి
● మరో వ్యక్తికి గాయాలు ● బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం అబ్దుల్లాపూర్మెట్: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తార్నాక మాణికేశ్వర్కాలనీ వడ్డెరబస్తీకి చెందిన గండికోట లలిత (41) వృత్తిరీత్యా కూలీ. శనివారం ఉదయం మేసీ్త్ర లింగస్వామితో కలిసి పనికోసం తార్నాక నుంచి బైక్పై అబ్దుల్లాపూర్మెట్ వెళ్తున్నారు. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్సిటీ గేటు వద్ద విజయవాడ మార్గం నుంచి వస్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి, వీరి బైక్ను ఢీకొట్టింది. రోడ్డు పక్కన పడిపోయిన లలిత తల పైనుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. లింగస్వా మి గాయపడ్డారు. మృతురాలి సోదరుడు యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని వ్యక్తి మృతి కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలు.. కడ్తాల్ మండలం గోవిందపల్లికి చెందిన కంబాలపల్లి అంజయ్య(38), భార్య సువర్ణ, పిల్లలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తుమ్మలూరు పరిధిలోని బీటీఆర్లో కూలీ పనులు చేయడానికి వెళ్లిన సువర్ణను తీసుకువచ్చేందుకు శుక్రవారం రాత్రి బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో దెబ్బడగూడ గేట్ వద్ద శ్రీశైలం రహదారిపై ఎదురుగా వచ్చిన కారు అంజయ్య బైక్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బిల్డర్లకు అండగా ఉంటాం
పహాడీషరీఫ్: బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. బిల్డర్స్ డే ను పురస్కరించుకొని మామిడిపల్లిలోని పద్మజా పామ్ గ్రోవ్స్లో ఏర్పాటు చేసిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 4వ నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ సమావేశాలను శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్న ‘బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ కాంట్రాక్టర్లు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తోందని కొనియాడారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన డాక్టర్ మాధవీలత, ఎ.నరేందర్రెడ్డి, బొల్లినేని శీనయ్య, డి.సుధాకర్రెడ్డి, జానపద గాయకుడు నల్గొండ గద్దర్కు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రసింగ్ కాంబో, ఐఎఫ్ఏడబ్ల్యూపీసీఏ బోర్డు మెంబర్ ఎస్ఎన్ రెడ్డి, బీఏఐ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణారావు, బీఏఐ మాజీ చైర్మన్ బి.సీనయ్య తదితరులు పాల్గొన్నారు.మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం అంబేడ్కర్నగర్కు చెందిన భర్తకి శోభన్బాబు(52) బైక్పై నాగన్పల్లి నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆక్టోపస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రామైంది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శోభన్బాబు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ మృతి -
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన
శంకర్పల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోకిల సీఐ వీరబాబు అన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఠాణాలో ప్రైవేటు పాఠశాల రవాణా ఇన్చార్జీలతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి నిత్యం బస్సులు నడిపేందుకు వచ్చే డ్రైవర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, అదే విధంగా బస్సులను ఎప్పటికప్పుడూ తనిఖీ చేయిస్తూ ఉండాలన్నారు. డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు కోటేశ్వర్రావు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదం జరగకముందే స్పందించండి
షాద్నగర్రూరల్: పట్టణంలోని చౌరస్తాలో రోడ్డు ప్రమాదాల బారినపడి మృతి చెందిన వారికి శనివారం ప్రజా సంఘాలు, బీసీసేన ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ముఖ్యకూడలిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. షాద్నగర్ మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయని.. పట్టణంలోని ముఖ్యకూడలి ఇరుకుగా ఉండటంతో ద్విచక్రవాహనదారులు భారీ వాహనాల చక్రాల కింద పడి మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. ముఖ్యకూడలిలో ఇప్పటి వరకు 62 మంది మృతి చెందగా 103 మంది గాయాలపాలయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికే వారి కుటుంబాలకు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయని మరో ప్రమాదం జరగకముందే ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్.రాము, చంద్రశేఖరప్ప, వెంకటేష్, స్రవంతిరాజ్, నర్సింలు, రాములు, రవికుమార్గౌడ్, టీజీ.శ్రీనివాస్, అర్జునప్ప, రవీంద్రనాఽథ్, తిరుమలయ్య, నర్సింలు, రాము తదితరులు పాల్గొన్నారు. -
సైనిక్ ఫలితాల్లో రేయాన్ ప్రభంజనం
నాగోలు: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఫలితాల్లో రేయాన్ సైనిక్ స్కూల్ విద్యార్ధులు ప్రభంజనం సృష్టించారు. తెలంగాణలో నెంబర్–1 ర్యాంక్తో పాటు 3వ ర్యాంక్ సాధించినట్లు కోచింగ్ సెంటర్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. శనివారం నాగోలు రేయాన్ కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా రేయాన్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ లో 9, 6వ తరగతి పరీక్ష ఫలితాల్లో దేవాన్ష్ ఆరవ్, 3వ ర్యాంకుతో పాటు మ్యాథ్స్లో 150/150, ఐటీలో 50/50 సాధించారు. 9 మంది విద్యార్థులు మ్యాథ్స్ లో 150/150, ఐటీలో 50/50 మార్కులు సాధించారన్నారు. మార్కులు సాధించిన వారిలో బాల వర్షిత్ రెడ్డి, రంజిత్ సాయి, జ్ఞాన వీర్ రెడ్డి, కంసికర్, సాయి సజన్, సాయి చరణ్ రెడ్డి, దీక్షిత్ , సోహన్ రెడ్డి, కే. దేవాన్ష్ ఉన్నారు. 63 మంది విద్యార్థుళు 250కి పైగా మార్కులు సాధించారన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందించారు. వేలాదిమంది పిల్లలను ఉన్నత శిఖరాలను చేరేందుకు రేయాన్ సైనిక్ నవోదయ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ కల్పిస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఉమా రెడ్డి అన్నారు. -
రాహుల్ పర్యటనకు పటిష్ట భద్రత
● ఎస్పీ స్నేహ మెహ్ర ● అప్రమత్తంగా ఉండాలని ఆదేశం అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హాజరుకానుండటంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వీవీఐపీల పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బందోబస్తుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను వివరించారు. హెలిప్యాడ్ వద్ద భద్రత, కాన్వాయ్ ప్రయాణించే రూట్ మ్యాప్, సభా ప్రాంగణం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. పర్యటన సాగే మార్గాల్లో ముందస్తుగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పర్యటన ప్రశాంతంగా ముగిసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బీ రాములు నాయక్, డీఎస్పీలు శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాసులు, జానయ్య, వీరేష్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో.. పట్టణంలోని మైదానంలో వారాంతపు పరేడ్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు ఒకరితో ఒకరికి సమన్వయం పెరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. భద్రత ఏర్పాట్లు పరిశీలన జిల్లా కేంద్రం వికారాబాద్లో సోమవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ స్నేహమెహ్ర, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి భద్రత ఏర్పాట్లన పరిశీలించారు. హెలిపాడ్ ప్రాంతం, రూట్మ్యాప్, అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ను సందర్శించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. -
దారి తప్పిన చిన్నారి.. అరగంటలో తల్లి ఒడికి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆడుకుంటూ దారితప్పిన ఓ చిన్నారి అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నంలో కలకలం రేపింది. స్థానిక యువకుల చొరవ, పోలీసుల సహకారంతో బాలిక అరగంటలోనే తల్లి ఒడికి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, రావుట్ల గ్రామానికి చెందిన అంజలి, రాజు దంపతులకు ఏడేళ్ల కూతురు ఆధ్య ఉంది. ఇబ్రహీంపట్నం హాస్టల్లో ఉంటున్న తన చెల్లిని చూసేందుకు శుక్రవారం అంజలి కూతురుతో కలిసి వచ్చింది. చెల్లితో మాట్లాడుతుండగా ఆధ్య ఆడుకుంటూ బయటకు వెళ్లింది. కొద్ది దూరం రోడ్డుపై నడిచి వెళ్లిన చిన్నారి, ఆతర్వాత అయోమయానికి గురైంది. ఇది గమనించిన పలువురు స్థానికులు, యువకులు వివరాలు అడగగా సమాధానం చెప్పలేకపోయింది. దీంతో చిన్నారిని పోలీసులకు అప్పగించారు. ఆధ్యను వెతుకుతూ ఆందోళనకు గురైన అంజలి పీఎస్ను ఆశ్రయించింది. ఆమె వివరాలు చెబుతుండగానే పోలీసులు పాపను తీసుకుని స్టేషన్కు చేరుకున్నారు. చిన్నారిని చూసిన తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ఎస్ఐ సుమలత, ఏఎస్ఐ సతీష్తో పాటు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు చెప్పింది.


