breaking news
Ranga Reddy District Latest News
-
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆదివారం జింక మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గునుగల్ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను సాగర్ రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కళేబరాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. జింక మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎయిడ్స్.. నివారణే మార్గం
బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలుహెచ్ఐవీ ఉన్నవారికి మద్దతు ఇచ్చేందుకు, ఎయిడ్స్తో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళికి ఎయిడ్స్ డే ఒక సందర్భం. వ్యాధి తొలికేసు నమోదై దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ సందేహాలు, అపోహలు తొలగలేదు. అవగాహనతో ప్రశాంతమైన జీవనం కొనసాగించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.● వ్యాధిగ్రస్తులకు ఉచిత మందుల పంపిణీ ● జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కేసులు ● నేడు ప్రపంచ ఎయిడ్స్ డే నవాబుపేట: జబ్బులు అనేక రకాలు. అందులో ప్రాణాంతకరమైనవి, భయంకరమైన వ్యాధుల్లో ప్రపంచాన్నే వణికిస్తోంది హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునో వైరస్). వైరస్ చివరి దశ ఎయిడ్స్(హ్యూమన్ ఇమ్యునో డెఫిసియెన్సీ సిండ్రోమ్) వ్యాధి. వైరస్ సోకిన నాటి నుంచి ఇది వ్యాధిగా మారేందుకు కొన్ని ఏళ్లు పడుతుందని డబ్ల్యూహెచ్ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) చెబుతోంది. కానీ వైరస్ సోకిన వారు మానసికంగా కుంగిపోతూ వ్యాధ/కి దగ్గరవుతారు. వ్యాధికి చికిత్స లేదు. వైరస్ను అదుపు చేస్తూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే మార్గాలున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ఏఆర్టీ (యాంటీ వైరల్ థెరపీ)ని సమర్థవంతమైన చికిత్సగా ప్రామాణీకరించింది. మందులు, మంచి జీవన శైలితో వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టే మందులున్నాయి. ఇవేమీ తెలియక, బయటకు చెప్పుకోలేక ఎంతోమంది తనవు చాలించారు. హెచ్ఐవీ సోకిన వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆస్పత్రుల్లో ఐసీటీసీ కేంద్రాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి సోకిన వారికి ఉచిత చికిత్సలు, మందులు అందజేస్తున్నారు. డిసెంబర్ 1న ఎయిడ్స్ డే సందర్భంగా వైద్య నిపుణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్దతులను ‘సాక్షి’కి వివరించారు. తాండూరు, వికారాబాద్లో ఏఆర్టీ కేంద్రాలు హెచ్ఐవీ బారిన పడిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్, అనంతగిరి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆరు మాసాల పాటు చికిత్స పొందిన రోగులకు ప్రతీనెల మందులను అందించేందుకు తాండూరు, వికారాబాద్లలో సహాయక ఏఆర్టీ కేంద్రాలు పని చేస్తున్నాయి. శిశువులకు డీఎస్ఏ–పీసీఆర్ హెచ్ఐవీ సోకిన తల్లుల నుంచి బిడ్డలకు హెచ్ఐవీ సోకింది లేనిది తెలుసుకునేందుకు కనీసం 18 నెలల సమయం పడుతుంది. ఇటీవల డీఎస్ఏ–పీసీఆర్ పరీక్ష అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో శిశువు ఏడు రోజుల వయస్సులో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించి చికిత్సను ప్రారంభించి పూర్తిగా వైరస్ లేకుండా నివారించే అవకాశం ఉంది. సంక్రమణ ఎలా? ● రక్షణ లేకుండా సెక్స్ చేయడం, వ్యాధి సోకిన వారి రక్తం ఎక్కించడం, హెచ్ఐవీ ఉన్నవారికి వాడిన సూదులు, సిరంజిలు ఇతరులకు వాడడం, వారికి వాడిన సూదితో మరొకరికి పచ్చబొట్లు వేయడం. తలనీలాలు, షేవింగ్ చేసేప్పుడు బ్లేడ్లు వాడడం తదితర కారణాలు. ● తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు ● కండోమ్ వాడడం ● సుఖవ్యాధులు రాకుండా చూసుకోవడం, హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ ● పౌష్టికాహారం, విశ్రాంతి, వ్యాయామం ● సమయానికి మందులు అపోహలు ● దోమకాటు, కుక్కకాటు, దగ్గు, తుమ్ములతో సంక్రమించదు ● వ్యాధిగ్రస్తుని దుస్తులు ధరించడం, కలిసి జీవించడం, పనిచేయడం -
పక్కాగా లెక్క!
● పంచాయతీ ఎన్నికల వ్యయ పరిమితి ఖరారు ● జనాభా ప్రాతిపదికన ప్రచారానికి ఖర్చు ● క్షుణ్ణంగా పరిశీలించనున్న అధికారులు షాద్నగర్: పంచాయతీ సంగ్రామం మొదలైంది. బరిలో నిలబడే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వీలు లేదు. ఇందుకుగాను ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని విధించింది. అభ్యర్థుల ఖర్చులను అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. లెక్కకు మించి ఖర్చు చేస్తే వేటు పడే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన అభ్యర్థులు ప్రచారానికి డబ్బులు ఖర్చు చేయాలి. సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు బరిలో నిలబడే అభ్యర్థులు బ్యాంకు ఖాతా వివరాలను నామినేషన్ పత్రాలతో పాటే సమర్పించాలి. నూతన పంచాయతీరాజ్ పట్టం ప్రకారం ఐదువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ 2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలకు మించి ఖర్చు చేయకూడదు. ఐదు వేల లోపు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేలకు మించి ఖర్చు చేయకూడదు. వివరాల నమోదు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ప్రచారానికి ఖర్చును ఏ రూపంలో నిల్వ చేసుకున్నారో వివరాలను పొందుపరుస్తూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయాలి. అయితే రిటర్నింగ్ అధికారి ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రచార, వ్యయ పుస్తకాలను అందించడం, ఆ పుస్తకాల్లో ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయించాల్సి ఉంటుంది. మూడు విడతలుగా తనిఖీలు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచార ఖర్చుకు సంబంధించి ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు లెక్కలను పరిశీలిస్తుంటారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు అధికారులు వ్యయాన్ని మూడు దఫాలుగా తనిఖీలు చేస్తారు. ఇందుకు అభ్యర్థులు ఖర్చులను పుస్తకాల్లో ఏ రోజుకారోజు నమోదు చేసుకోవాలి. ఎన్నికల్లో ధన ప్రవాహన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో అభ్యర్థుల ప్రచార శైలిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. ఇందుకు ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనుంది. ఖర్చు మించితే వేటు తప్పదు బరిలో నిలబడే అభ్యర్థులు ఎన్నికల సంఘం సూచించిన విధంగా ప్రచారానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడానికి వీలులేదు. ప్రచార ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు చూపించాలి. అభ్యర్థులు వ్యయ పరిమితి మించినా, ప్రచార ఖర్చుల లెక్కలు చూపించకపోయినా వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో గెలిచినా పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులూ జర జాగ్రత్త. నిబంధనలు పాటించాలి ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి. జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం ఖర్చును నిర్ణయించింది. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేయడానికి వీలు లేదు. ఎప్పటికప్పుడు లెక్కలు చూయించాలి. – బన్సీలాల్, ఎంపీడీఓ, ఫరూఖ్నగర్ -
ఇద్దరు వ్యక్తుల అదృశ్యం
మరో ఘటనలో.. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య మైలార్దేవ్పల్లి: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అబ్దుల్లా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాసీ్త్రపురం డైమండ్ హిల్స్లో ఉంటున్న షేక్ ఇమ్రాన్(38) అప్పులు ఎక్కువ కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన అతను ఆదివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాద మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోడిపందేల స్థావరంపై దాడి మేడిపల్లి: కోడిపందేల స్థావరాలపై మేడిపల్లి పోలీసులు దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెంగిచెర్ల మేకల మండి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దాడిచేసి 15మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారినుంచి రెండు పందెం కోళ్లు, రెండు కోడి కత్తులు, రూ.18వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి
అనంతగిరి: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ మేరకు వికారాబాద్ మండలంలో 21 సర్పంచ్ స్థానాలకు గాను 30 నామినేషన్లు రాగా, 182 వార్డు సభ్యుల స్థానాలకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సుధీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఆర్ఓలకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటిరోజు మదన్పల్లి, అత్వెల్లి, పెండ్లిమడుగు, పీలారం, రాళ్ల చిట్టంపల్లి, ద్యాచారం, పాతూర్ గ్రామాల నుంచి నామినేషన్ దాఖలు కాలేదు. వికారాబాద్ అదనపు కలెక్టర్ సుధీర్ -
బ్రహ్మయ్య మృతి పేదలకు లోటు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ యాచారం: సీపీఎం సీనియర్ నాయకుడు పెండ్యాల బ్రహ్మయ్య అకాల మృతి పేద ప్రజలకు తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. గాండ్లగూడెం గ్రామంలో ఆదివారం బ్రహ్మయ్య మృతదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. బ్రహ్మయ్య సీపీఎంలో మండల కార్యదర్శిగా, ప్రజా సంఘాల్లో పనిచేసి పేద ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆశయాల సాధన కోసం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, నాయకులు జంగారెడ్డి, మధుసూదన్రెడ్డి, భాస్కర్, భూపాల్, నర్సింహ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పేదల సమస్యలపైనే పోరాటం పెండ్యాల బ్రహ్మయ్య తన జీవితం మొత్తం పేద ప్రజల సమస్యలపైనే పోరాటం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్రహ్మయ్య మృతి చెందినట్లు తెలుసుకుని గ్రామంలోని ఆయన మృతదేహనికి పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా పనుల్
‘గ్లోబల్’..వంద ఎకరాల్లో ‘సమ్మిట్’కు ఏర్పాట్లు సమ్మిట్కు చేస్తున్న ఏర్పాట్లుసాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిసరాలను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. సమ్మిట్ సమయం సమీపిస్తుండటంతో ఏర్పాట్ల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వెయ్యి మంది కూలీలతో రాత్రి పగలు తేడా లేకుండా పని చేయిస్తోంది. ఇప్పటికే హెచ్ఎండీఏ ఎంపిక చేసిన భూమిలోని ఎత్తు పల్లాలను జేసీబీలతో చదును చేయిస్తూ.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా సమ్మిట్ నిర్వహించే ప్రదేశానికి వచ్చే పోయే మార్గాలకు ఇరు వైపులా 1.50 లక్షల ఎత్తైన పూల మొక్కలను నాటే పనులు చేపట్టింది. ఇరుకుగా ఉన్న రోడ్లను మట్టి, కంకర, తారుతో విస్తరిస్తున్నారు. ఎంపిక చేసిన వంద ఎకరాల ప్రాంగణాన్ని 32 విభాగాలుగా విభజించారు. ప్రధాన హాలు చుట్టూ వృత్తాకార డిజైన్లో వేదిక ఏర్పాటు చేశారు. సమ్మిట్ ప్రారంభ వేదికలో 2,500 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు ఇరువైపులా మరో ఆరు హాల్స్ సిద్ధం చేస్తున్నారు. ఇవి పూర్తిగా వృత్తాకారంలోనే ఉండనున్నాయి. ఎగ్జిబిషన్, ఇష్టాగోష్టి, పరస్పర ఒప్పందాలు వీటి కిందే జరగనున్నాయి. వివిధ విభాగాలకు చెందిన 45 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందినవి సైతం ఉంటాయి. 1,300 ప్రముఖ సంస్థల నుంచి 2,600 మంది పెట్టుబడిదారులు రానుండటంతో ఈ ప్రాంతాన్ని పర్యావరణహితంగా, ప్లాస్టిక్ రహితంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. మూడో తేదీ లోగా ఏర్పాట్లు పూర్తి చేసి, నాలుగు, ఐదు తేదీల్లో డ్రై రన్ నిర్వహించేందుకు సమయాత్తమవుతున్నారు. 32 విభాగాల్లో వేయి మంది కూలీలతో పనులు కిలోమీటరు దూరంలో మూడు హెలీపాడ్లు.. ఆరు బస్సులు వృత్తాకారంలో వేదిక.. ఇరువైపులా ఆరు హాల్స్ రాకపోకలకు వెయ్యి ప్రత్యేక బస్సులు 2,500 మంది పోలీసులతో బందో‘మస్తు’ వివిధ దేశాల నుంచి వచ్చే ప్రముఖులను రిసీవ్ చేసుకునేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మీర్ఖాన్పేట వరకు మూడు హెలీకాఫ్టర్లు సహా మూడు హెలీపాడ్లను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రధాన వేదికకు కిలోమీటర్ దూరం ఉంది. ఆరు బస్సులను రెడీ చేస్తున్నారు. దేశవిదేశీ ప్రతినిధుల బస కోసం శంషాబాద్ సహా నగరంలోని వివిధ ప్రముఖ హోటళ్లలో వెయ్యికిపైగా గదులను బుక్ చేశారు. వీరి రాక పోకల కోసం వెయ్యి బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. పెట్టుబడిదారులతో పాటు ప్రధాని సహా పలువురు ప్రముఖులు హాజరుకానుండటంతో 2,500 మందితో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కేవలం సమ్మిట్ నిర్వాహకులు జారీ చేసిన పాసులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. మెరుగైన కమ్యూనికేషన్ కోసం టీ–ఫైబర్ ఆధ్వర్యంలో 10 గిగా బైట్స్ ఫర్ సెకండ్(జీబీపీఎస్) వేగంతో వైఫై సౌకర్యం కల్పించనున్నారు. ప్రాంగణంలోకి అనుమతి ఉన్న వారికే పాస్వర్డ్ ఇవ్వనున్నారు. సెల్ టవర్స్ ఆన్ వీల్స్ విధానంలో బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఎయిర్టెల్, జియో తదితర నెట్వర్క్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల వాహనాల పార్కింగ్కు ఆరు స్థలాలను కేటాయించారు. సదస్సు సమీపానికి ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్లను మాత్రమే అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలు అర కిలోమీటర్ దూరంలోని అమెజాన్ డేటా సెంటర్ సమీపంలో నిలపాల్సి ఉంది. అక్కడి నుంచి వారిని ప్రత్యేక విద్యుత్ వాహనాల్లో సమ్మిట్ నిర్వహించే ప్రదేశానికి తరలించనున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఇప్పటికే మూడు 160 కేవీఏ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మూడు కిలోమీటర్ల మేర ఉన్న ఓవర్ హెడ్ లైన్లను తొలగించి, దాని స్థానంలో యూజీ కేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా భూ బాధితులకు ఇచ్చిన ప్లాట్లలోనూ ఓహెచ్ లైన్లను తొలగించి, యూజీ కేబుల్స్ వేయనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను స్థానిక తుక్కుగూడ మున్సిపాలిటీకి అప్పగించగా, తాగునీటి సరఫరా బాధ్యతను జల మండలికి అప్పగించింది. ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ప్రాంగణం చుట్టూ జనరేటర్లను సైతం సిద్ధం చేశారు. అతిథులకు టీ, కాఫీ, టిఫిన్, స్నాక్స్, లంచ్, డిన్నర్ సప్లయ్ బాధ్యతను నగరంలోని ఓ ప్రముఖ హోటల్కు అప్పగించారు. భోజనం కోసం మూడు హాల్స్ సిద్ధం చేశారు. వీటిలో ఒకటి వీవీఐపీలకు, రెండు అతిథులకు కేటాయించారు. పోలీసులు, మీడియా కోసం ఎంట్రన్స్ వద్దే ప్రత్యేక హాల్స్ సిద్ధం చేస్తున్నారు. ప్రాంగణాన్ని సుందరంగా తీర్చి దిద్దే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించారు. -
బీజేపీ మెదక్ ఇన్చార్జిగా బొక్క నర్సింహారెడ్డి
కందుకూరు: బీజేపీ మెదక్ జిల్లా ఇన్చార్జిగా మండల పరిధిలోని కొత్తగూడకు చెందిన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ ఆదివారం ఆయన్ని ఎన్నుకుని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో పాటు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చోడ: 12వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల సాఫ్ట్బాల్ పోటీల్లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో 7–2తో మహబూబ్నగర్పై ఘన విజయం సాధించింది. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 జట్లు పాల్గొన్నాయి. విజేత జట్టుకు కప్తోపాటు బంగారు పతకం, ద్వితీయస్థానంలో నిలిచిన మహబూబ్నగర్ రజతం సాధించింది. హన్మకొండ జట్టు 4–3తో హైదరాబాద్పై గెలిచి తృతీయస్థానంలో నిలువగా కన్సోలేషన్ బహుమతి పొందింది. గెలుపొందిన జట్లకు జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆప్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్బాబు, తెలంగాణ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా కార్యదర్శి గంగాధర్, శిక్షకులు చిన్నికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన 431 మంది మందుబాబులు సాక్షి, సిటీబ్యూరో: మందుబాబులు మారడంలేదు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. నవంబర్ 24 నుంచి 29 వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనం నడుపుతూ 431 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. 325 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది ఆటోలు, 86 మంది కార్లు, నలుగురు భారీ వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ ఉంటే అది ఉల్లంఘన. దీన్ని సాంకేతికంగా బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అంటారు. 378 మందికి 35–200 మధ్య, 42 మందికి 200–300 మధ్య, 11 మందికి 300–500 మధ్య బీఏసీ కౌంట్ వచ్చిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భాస్కర్ షాబాద్: పేదల భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కడిగాళ్ల భాస్కర్ హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని రేగడిదోస్వాడ, మక్తగూడ గ్రామాల అసైన్డ్ భూమి పేద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల దగ్గర భూములు లాక్కొని బడా పెట్టుబడిదారులకు ఇవ్వాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలిస్తామని హామీని నెరవేర్చాలన్నారు. రేగడిదోస్వాడ, మక్తగూడ, వెంకమ్మగూడ, తాళ్లపల్లి గ్రామాల పరిధిలోని 102 సర్వే నంబర్లు రైతులందరికీ శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్, మాజీ సర్పంచులు రాములు, శ్రీనివాస్గౌడ్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, రైతులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. -
పటిష్ట భద్రత
ఎయిడ్స్.. నివారణే మార్గం అవగాహనతోనే ఎయిడ్స్ను నివారించొచ్చని, ప్రశాంత జీవనం కొనసాగించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శంషాబాద్ డీసీపీ రాజేశ్ అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. అంనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేస్తామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో షాద్నగర్ ఏసీపీ లక్ష్మీ నారాయణ, ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి, ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్, తలకొండపల్లి ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఆకస్మిక తనిఖీ కడ్తాల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పోలీసు సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని ముచ్చర్ల గేట్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్తో పాటు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం షాద్నగర్ ఎసీపీ లక్ష్మీనారాయణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. చెక్పోస్ట్లో జరుగుతున్న వాహనాల తనిఖీని స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ -
రైతులకు హై‘టెన్షన్’ లేకుండా చూడండి
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు పరిసరా గ్రామాల వ్యవసాయ పొలాల మీదుగా బీదర్– మహేశ్వరం పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్తో రైతులకు నష్టం జరుగకుండా చూడాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పవర్గ్రిడ్ అధికారులను కోరారు. ఈ మేరకు బాధిత రైతులతో కలిసి ఆదివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో పవర్గ్రిడ్ కార్పొరేషన్ సీజీఎం బిపిన్ బీహారిరథ్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్, డీజీఎం సంతోష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైటెన్షన్లైన్ బాధిత రైతుల గోడును వపర్గ్రిడ్ అధికారులకు వివరించారు. న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పవర్గ్రిడ్ అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్గుప్తా, మాజీ ఉప సర్పంచ్ కడారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త’ కిక్కు!
ఎకై ్సజ్ డివిజన్ మద్యం దుకాణాలు శంషాబాద్ 111 సరూర్నగర్ 138 షాద్నగర్: ప్రభుత్వం ఏ శుభ సమయాన కొత్త వైన్స్లకు అనుమతులు మంజూరు చేసిందో కానీ ప్రస్తుతం వ్యాపారుల పంట పండింది. కొత్త మద్యం పాలసీ ప్రారంభమయ్యే సమయానికే సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో అమ్మకాలు జోరుగా సాగనున్నాయి. ఎన్నికల సమయంలో పారే మద్యం బహిరంగ రహస్యమే. 2025–27 సంవత్సరానికి కేటాయించిన నూతన మద్యం షాప్లు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలోపు మద్యం దుకాణాలకు కిక్కేకిక్కు. పాత దుకాణాలకు ముగిసిన గడువు రెండేళ్ల కాలపరిమితికి ఎకై ్సజ్ శాఖ ఇటీవల టెండర్లు పిలిచి డ్రా పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయించిన విషయం తెలిసిందే. పాత షాప్లకు నవంబర్ 30తో గడువు ముగిసింది. కొత్తగా టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఎకై ్సజ్ అధికారులకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి షాప్ల నిర్వహణకు లైసెన్స్లు పొందారు. ఎన్నికలకు మద్యం కిక్ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో మద్యం భారీగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో డిసెంబర్ 31న కూడా విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. జనవరిలో సంక్రాంతి పండుగ సైతం కలిసిరానుంది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కో ఆపరేటివ్ ఇలా వరుసగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఈసారి భారీగా అమ్మకాలు జరిగి రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు, ఎకై ్సజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు మద్యం సరఫరా ఏర్పాట్లను వేగవంతం చేశారు. మద్యంతో విందులు నామినేషన్ల పర్వం కంటే ముందే పల్లెల్లో మద్యంతో కూడిన విందులు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో పోటీ పెరగడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ వెంట వచ్చే అనుచరగణానికి నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలింగ్ ముందు రోజు మద్యం, డబ్బుల పంపకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆనందంలో వ్యాపారులు పంచాయతీ ఎన్నికలు కొత్త మద్యం వ్యాపారుల్లో హుషారు నింపుతున్నాయి. వ్యాపారం ప్రారంభంలోనే లక్షల్లో ఆదాయం సమకూరనుంది. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు చెల్లించారు. డ్రాలో షాప్లు దక్కించుకున్న వెంటనే ఎన్నికలు రావడంతో వ్యాపారులు ఆనందంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి అన్ని విడతల్లో వారం రోజులు గడువు ఉండటం, ఇప్పటి నుంచే ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకునే వారు, పోటీ చేస్తున్న వారు మద్దతు కూడగట్టుకొని ఓట్లు పొందేందుకు మద్యాన్ని ఎరగా వేస్తున్నారు. జోరుగా బెల్టుషాపులు ఎన్నికల్లో మద్యం, డబ్బును అరికడతామని ఒకవైపు అధికారులు చెబుతున్నా మరోవైపు పల్లెల్లో ఇప్పటికే బెల్టు షాప్లు ఏర్పాటు చేసి జోరుగా మద్యం విక్రయిస్తున్నారు. మద్యం సరఫరాను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. వ్యాపారులకు లక్కు నేటి నుంచి నూతన మద్యం షాప్లు ప్రారంభం కలిసివచ్చిన పంచాయతీ ఎన్నికలు ప్రారంభంలోనే లక్షల్లో ఆదాయ మార్గం -
సవాల్గా సర్పంచ్ ఎన్నికలు
చేవెళ్ల: సర్పంచ్ ఎన్నికలు నేతలకు సవాల్గా మారుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నా పార్టీలే తెరవెనుక ఉండి నడిపిస్తాయి. దీంతో ఇన్నాళ్లుగా పార్టీ నమ్ముకుని ఉన్నవారు కొందరికి అవకాశాలు రాక.. మరికొందరు తమ వ్యతిరేక వర్గం వారిని బలపరుస్తున్నారనే తదితర కారణాలతో పార్టీలు మారుతున్నారు. అభ్యర్థుల గెలుపును ప్రధాన పార్టీల నాయకులు భుజానెత్తుకుని పోటాపోటీగా ప్రచారాలు చేయిస్తున్నారు. మండల పరిధిలోని ముడిమ్యాలలో ఈ పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. తాజాగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు బూర్ల సాయినాథ్ కాంగ్రెస్ను వీడి మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దీంతో శనివారం మాజీ ఉపసర్పంచ్ షేక్ ఆరీఫ్ కారు దిగి ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్రెడ్డి, పి.ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు. పోటాపోటీగా పార్టీలు మారుతున్న నాయకులు -
ఏకగ్రీవం.. ఏం లాభం!
● యునానిమస్ చేస్తే ప్రోత్సాహకాలు అంటూ గత ప్రభుత్వం ప్రకటనలు ● ప్రస్తుతం ఊసెత్తని కాంగ్రెస్ ప్రభుత్వంకాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.7లక్షల నజరానా అందించగా.. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.5లక్షలు అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రకటన రాలేదు. దౌల్తాబాద్/షాబాద్: పంచాయతీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. డిసెంబర్ 11న జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ప్రక్రియ శనివారం పూర్తయింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ పాలనలో అవినీతికి తావుండదు. సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నగదు ప్రోత్సహాకాలు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. గత ప్రభుత్వాలు ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఏకగ్రీవాలపై స్థానిక నాయకులు అసక్తి చూపడంలేదు. రూ.15 లక్షలకు పెంచినా అందించలేదు గ్రామాల్లో రాజకీయ కక్షలు పెరగకుండా ఉండాలంటే గ్రామస్తులు కూర్చుని ఏకగ్రీవ పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ను ఎన్నుకునే ఆనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతం చేశారు. ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎంపిక చేసిన పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయని చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ ప్రోత్సహక పథకాన్ని రూ.15లక్షలకు పెంచింది. అప్పట్లో చాలా పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కానీ నిధుల కొరతతో ఏ ఒక్క పంచాయతీకి నజరానా అందించలేదు. ఈ సారి మూడు విడతల్లో ఎన్నికలను జరపనుండగా తొలివిడత సంగ్రామం మొదలైనా ప్రభుత్వం నుంచి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సహక విషయంపై స్పష్టత లేదు. స్పష్టత రాలేదు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేస్తే ఈ అంశాన్ని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేస్తాం. – అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్ -
ఆడిట్తో నాణ్యతా ప్రమాణాలు అంచనా
చేవెళ్ల: ఉన్నత విద్యా సంస్థల నాణ్య, ప్రమాణాలను అంచనా వేయడంలో అకడమిక్ ఆడిట్లు కీలకపాత్ర పోసిస్తాయని అకడమిక్ నిపుణులు శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.కవిత, హయత్నగర్ డిగ్రీ కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ వి.ఇందిర అన్నారు. శనివారం చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత ఆధ్వర్యంలో 2022–23, 2023–24కు సంబంధించి అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యా వ్యవస్థను సమీక్షించి పలు నాణ్యతా ప్రమాణాలపై పరిశీలించిన అధికారులు మాట్లాడుతూ.. కళాశాలలోని వసతులు, సంస్థ సాధిస్తున్న పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆడిట్తో భోధనా విధానాలు, సహపాఠ్య కార్యకలాపాలపై సమగ్ర విశ్లేషణ చేసే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. వీటి నుంచి లభించే సూచనలు సంస్థ అభివృద్ధి, విద్యార్థుల విజయానికి నిర్మాణాత్మక, మార్గదర్శకత్వంగా నిలుస్తాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత మాట్లాడుతూ.. అకడమిక్ ఆడిట్తో లోటుపాట్లను గుర్తించి కళాశాల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఆడిట్ అధికారులు సూచించిన ప్రతీ సిపార్సును వ్యవస్తీకృతంగా అమలు చేసి సంస్థ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రమేశ్బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.విజయలక్ష్మి, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ షాజహాన్ సిద్దికీ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ కవిత, డాక్టర్ ఇందిర -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
షాద్నగర్రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ అన్నారు. శనివారం ఆయన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్ట, మొగిలిగిద్ద, చౌలపల్లి పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ మాట్లాడుతూ.. ప్రజలందరు ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా నిఘాను పెంచాలని అన్నారు. కేంద్రాల వద్ద గుంపులను ప్రోత్సహించవద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాలలో పోలీసు బందోబస్తును పటిష్టంగా చేపట్టాలని సూచించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రజలందరు అధికారులకు సహాకరించాలని అన్నారు. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన వారిలో ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్కుమార్, పోలీసు సిబ్బది తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిగూడలో ఫ్లాగ్ మార్చ్ మొయినాబాద్రూరల్: ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేయకుండా అభ్యర్థులు, నాయకులు పోలింగ్ను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలని మొయినాబాద్ సీఐ పవన్కుమార్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నాయకుల భయబ్రాంతులకు గురికాకుండా ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసేందుకు శాంతియుతంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులే దేశానికి ఆదర్శం అని అందుకు నిజమైన నాయకుడిని ఎన్నుకునేందుకు తమకు ఇష్టానుసారంగా ఓటు వేయాలని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకావొద్దని సూచించారు. పట్టుబడిన మద్యం కొందుర్గు: స్థానిక ఎన్నికల్లో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారులో మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు జిల్లేడ్ చౌదరిగూడ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. లాల్పహాడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా స్విఫ్ట్ కారులో రూ.5,525 విలువైన 34 కింగ్ ఫిషర్ బీర్లు లభ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మద్యం బాటిళ్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ -
ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు
ఇబ్రహీంపట్నం: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని ఆర్డీఓ అనంతరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్, సామగ్రి, అధికారుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడు తూ.. పోలింగ్ కేంద్రాలకు వచ్చే మెటీరియల్ను సర్దుబాటు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. వార్డులు, బూత్ల వారీగా బ్యాలెట్ బాక్స్లు పరిశీలించారు. అధికారులు ఎన్నికల డ్యూటీలో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించేందుకు వచ్చే బస్సులను ఎక్క డ నిలపాలి తదితర అంశాలను పరిశీలించారు. ఆ యన వెంట ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ ఉష, సూపరింటెండెంట్ యెల్లంకి జంగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. ఆర్డీఓ అనంతరెడ్డి -
‘గ్లోబల్’ ఏర్పాట్లు
కందుకూరు: ఫ్యూచర్సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖలకు చెందిన అధికారులు వేగంగా చేపట్టారు. గ్లోబల్ సమ్మిట్కు వచ్చే మార్గంలో శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దమ్మ దేవాలయం నుంచి కొత్తూర్ గేట్ ఫ్యూచర్సిటీ రహదారి వరకు నేషనల్ హైవే అధికారులు తారు వేసే పనులు చేపట్టారు. ఫ్యూచర్సిటీ మార్గంలో ఇప్పటికే గ్రీనరీ ఉండగా అదనంగా మొక్కలు నాటే పనులను హెచ్ఎండీఏ అధికారులు చేపట్టారు. మున్సిపల్ అధికారులు తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి వచ్చే మార్గంలో ఇరువైపులా కుండీల్లో నాటిన మొక్కలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు తమ పనుల్లో బిజీబిజీ అయ్యారు. మరోవైపు నిత్యం ఎవరో ఒక అధికారి గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని సందర్శిస్తుండటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నం: తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నంకు చెందిన చెనమోని శంకర్ ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘం 4వ రాష్ట్ర మహాసభల్లో ఈ మేరకు శంకర్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం శంకర్ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవి అప్పగించిన వారి ఆశలను వమ్ము చేయకుండా, మత్స్యకారుల, కార్మికుల సమస్యల పరిష్కరానికి అహర్నిశలు కృషిచేస్తానని తెలిపారు. మొయినాబాద్: ఇందిరమ్మ కాలంలో దళితులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవడానికి కుట్రలు చేస్తోందని దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో సర్వేనంబర్ 218/1లో 6 ఎకరాల భూమిని కోళ్ల ఫారాల నిర్మించుకోవడానికి యాబై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ హయాంలో గ్రామానికి చెందిన 36 మంది దళిత కుటుంబాలకు కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సదరు సర్వేనంబర్లోని మొత్తం ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏకు అప్పగించింది. దళితులకు కేటాయించిన భూములు సైతం అందులోనే కలిపి చదును చేస్తుండడంతో శనివారం దళితులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు కేటాయించిన భూమిని తమకే ఇవ్వాలని.. ఇతరులకు కేటాయించొద్దని పట్టు బట్టారు. దీనిపై కలెక్టర్ను కలిసి తమ ఆవేదన చెప్పుకొంటామన్నారు. ఎట్టి పరిస్థితుత్లో భూములు వదులుకోమని తేల్చి చెప్పారు. భూములు గుంజుకోవాలని చూస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సాక్షి, సిటీబ్యూరో: ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. శనివారం బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించిన సజ్జనర్.. పది ప్రధాన ముఠాలకు చెందిన 86 మందిని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 126 కింద బైండోవర్ చేశారు. వచ్చే ఏడాది కాలం పాటు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో ఉంటామని వారి చేత సెక్యూరిటీ బాండ్లు రాయించుకున్నారు. బాండ్ రాసిచ్చిన కాలపరిమితిలోపు ఎవరైనా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్ను రద్దు చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె.అపూర్వారావు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
పొరపాట్లకు తావివ్వొద్దు
● గ్లోబల్ సమ్మిట్ పనులను పక్కాగా పూర్తి చేయాలి ● కలెక్టర్ నారాయణరెడ్డి కందుకూరు: ఫ్యూచర్సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ పనులను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మీర్ఖాన్పేట రెవెన్యూలో గ్లోబల్ సమ్మిట్ కోసం చేపట్టిన ఏర్పాట్లను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు ఆయన విమానాశ్రయం నుంచి వచ్చే రహదారితో పాటు గ్లోబల్ సమ్మిట్కు వచ్చే శ్రీశైలం రహదారిని పర్యవేక్షించారు. వివిధ దేశాల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయం నుంచి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతం వరకు రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమ్మిట్ జరిగే ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. రోడ్లపై గుంతలు లేకుండా, నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ విధులు బాధ్యతతో నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ అండ్ బీ అధికారులు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. -
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే
హుడాకాంప్లెక్స్: వైకల్యమనేది శరీరానికే గానీ మనసుకు కాదని, సాధించాలనే తపన ఉండాలే గానీ ఏదైనా సాధ్యమే అని జిల్లా సంక్షేమాధికారి శ్రీలత అన్నారు. సరూర్నగర్ స్టేడియంలో శనివారం మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలత జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు తమ ప్రతిభాపాటవాలు చూపడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. సుమారు 600 మంది దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొనడం వారి మానసిక స్థైర్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పరుగు పందెం, షాట్పుట్, జావెలిన్త్రో, క్యారమ్స్, చెస్ తదితర అంశాల్లో చిన్నారులు, పెద్దల కేటగిరీలుగా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన దివ్యాంగులు, వసతి గృహాల విద్యార్థులు, ఐసీడీఎస్ శాఖలోని సీడీపీఓలు, సూపర్వైజర్లు, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. -
చాలా కాస్ట్లీ గురూ!
లోటుపాట్లు ఉండొద్దు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని ఆర్డీఓ అనంతరెడ్డి అన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. షాద్నగర్: సర్పంచ్ పదవికి కో అంటే కోట్లయినా వెచ్చిస్తామంటున్నారు బరిలో దిగిన అభ్యర్థులు.. గెలుపే లక్ష్యంగా ఖర్చుకు ఏ మాత్రం వెరవడం లేదు.. స్థిరాస్తి వ్యాపార, పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొంది రాజధానికి అతి సమీపంలో ఉన్న షాద్నగర్ నియోజకవర్గంలో పరిస్థితి ఇది. 1994లో అప్పట్లో షాద్నగర్ ఎమ్మెల్యే బక్కని నర్సింలు అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కేవలం రూ.10లక్షలు. ఈ విషయాన్ని ఆయనే చెబుతుంటారు. 1999 ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే శంకర్రావు ఎన్నికల ఖర్చు రూ.50 లక్షలు దాటలేదు. ఇప్పుడు ఒక గ్రామానికి సర్పంచ్ కావాలంటే రూ.50 లక్షల నుండి రూ.కోటి వరకు ఖర్చు చేయాల్సిందే. కొన్ని చోట్ల అవసరమైతే ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధం అంటున్నారు. ఆ పల్లెలు ప్రత్యేకం షాద్నగర్ నియోజకవర్గం 1975లో పారిశ్రామిక ప్రాంతంగా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తర్వాత 2004 నుండి ఇక్కడ స్థిరాస్తి వ్యాపారాల జోరు పెరిగింది. షాద్నగర్, కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ఉన్న ఈ మూడు మండలాల్లో స్థిరాస్తి వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ కొన్ని గ్రామాల్లో సర్పంచుల పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కో పార్టీ మద్దతు నుంచి ఇద్దరు లేక ముగ్గురు పోటీలో ఉన్నారు. పార్టీ ఎవరిని నిర్ణయింస్తుందో తెలియదు కాని అభ్యర్థులు మాత్రం ఇప్పటి నుంచే పోటీకి సిద్ధమై నామినేషన్లు వేశారు. ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట, లింగారెడ్డిగూడ, కిషన్నగర్, బూర్గుల, మొగిలిగిద్ద, రాయికల్, అన్నారం.. కొత్తూరు మండలంలోని మల్లాపూర్, ఎస్బీ పల్లి, మక్తగూడ, ఇన్ములనర్వ.. నందిగామ మండలం మామిడిపల్లి, చేగూరు, అంతిరెడ్డిగూడ, మేకగూడ, నందిగామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికల ఖర్చు రూ.50లక్షల పైమాటే. కొన్ని గ్రామాల్లో రూ.కోటి దాటి కూడా ఖర్చు చేసేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పోటీ చేయాలని ఆశ ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేని వారు వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకింత ఖర్చు ఈ మూడు మండలాలు ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతానికి నెలవయ్యాయి. ఎలికట్ట – మొగిలిగిద్ద గ్రామాల పరిధిలో ఇటీవల పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొత్తూరు, నందిగామ మండలాల్లో పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఇక్కడ సర్పంచ్లుగా ఉండడం లాభదాయకమైన వ్యవహారం అన్న ఆలోచనలతో సర్పంచులుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో చాలా మంది అప్పులు చేసి సర్పంచ్లుగా ఎన్నికై ఆ తర్వాత చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడ్డారు. మరి కొందరు అప్పులు తెచ్చి అభివృద్ధి చేసి నిధులు చేతికి అందక అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది మాజీలు ఈ విడత పోటీ చేయకుండా ఆగిపోయారు. రియల్ఎస్టేల్ వ్యాపారులు, ఇతర సంపాదనలు ఉన్న మాత్రం ఈ సారి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రిజర్వేషన్లు మహిళలకు ఉన్న చోట తమ భార్యలను, లేదంటూ తల్లులను రంగంలోకి దించుతున్నారు. మొత్తానికి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సర్పంచ్ పదవి కోసం వెచ్చించే ఖర్చు అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ పోటీకి కో.. అంటే కోట్లే.. పారిశ్రామిక ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్ ఎంతైనా ఖర్చుపెడతాం.. తగ్గేదేలేదంటున్న అభ్యర్థులు వేడెక్కుతున్న పల్లె రాజకీయం ఆశ్చర్యపరుస్తున్న ఎన్నికల ఖర్చు -
నామినేషన్ల జోరు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తొలి విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం నుంచి రెండో విడత ఘట్టం మొదలు కానుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు డివిజన్లు, ఏడు మండలాల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలు, 1,530 వార్డులకు నామినేషన్లు ఆహ్వానించగా తొలి రోజైన గురువారం145 నామినేషన్లు జీపీలకు రాగా, 119 నామినేషన్లు వార్డులకు అందాయి. శుక్రవారం రెండో రోజు జీపీలకు 203, వార్డులకు 688 నామినేషన్లు అందాయి. ఇక చివరి రోజైన శనివారం జీపీలకు 581 వార్డులకు 2,520నామినేషన్లు దాఖలయ్యాయి. నిజానికి సాయంత్రం ఐదు గంటలకే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయా గ్రామాల నుంచి అభ్యర్థులు భారీగా తరలిరావడంతో రిటర్నింగ్ అధికారులు నిర్ధేశిత సమయంలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి రాత్రి తొమ్మిది తర్వాత కూడా స్వీకరించారు. ఇదిలా ఉంటే నామినేషన్ల స్క్రూట్నీ, ఉపసంహరణపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. సొంత పార్టీలోనే ఉంటూ పోటీగా నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించి ఉపసంహరింపచేసే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. మొండికేస్తున్న వాళ్లపై ఎమ్మెల్యేలు, ఇతర నేతల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది. తొలి విడతలో ఎంపిక చేసిన స్థానాలకు 11న ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆయా పార్టీల మద్దతుతో రంగంలోకి దిగుతున్న అభ్యర్థులు ఒకవైపు ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయి కేడర్ సహా ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జీపీల్లోనే పోటీ అధికం పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ చెప్పుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు ఎక్కడిక్కడ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వెంచర్లు సహా భూముల క్రయ విక్రయాలు, ఐటీ, అనుబంధ రంగాల పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జీపీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానాలను ఎలాగైనా కై వసం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. రాజకీయ కోణంలోనే కాకుండా ఆర్థిక, సామాజిక కోణంలోనూ ఆలోచించి అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం కొంత మంది భూములు, ప్లాట్లను కుదువపెడుతున్నారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం పలు రకాల ఆఫర్లు ఇస్తున్నారు. నేటి నుంచి రెండో విడత చేవెళ్ల, కందుకూరు డివిజన్లు ఏడు మండలాల పరిధిలోని 178 పంచాయతీలు, 1,540 వార్డులకు ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా మండలాల్లోని ప్రతి రెండు మూడు గ్రామాలకు ఒక రిటర్నింగ్ కేంద్రాన్ని ఎంపిక చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ సహా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని నియమించారు. డిసెంబర్ 2 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 6 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. ముగిసిన తొలివిడత ప్రక్రియ చివరి రోజు తరలివచ్చిన అభ్యర్థులు రాత్రి వరకు స్వీకరించిన అధికారులు నేటి నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం పంచాయతీల్లో ఎటు చూసినా ఎన్నికల సందడిమండలం జీపీలు వార్డులు శంకర్పల్లి 24 210 మొయినాబాద్ 19 166 చేవెళ్ల 25 218 షాబాద్ 41 325 ఆమనగల్లు 13 112 కడ్తాల్ 24 210 తలకొండపల్లి 32 272 -
ఇక జీహెచ్ఏ!
గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధి విస్తరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ (జీహెచ్ఏ) ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేస్తోంది. జీహెచ్ఏ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో పురపాలకశాఖ ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవానికి మెగా కార్పొరేషన్గా అవతరించడం ద్వారా ప్రపంచ శ్రేణి నగరాల సరసన హైదరాబాద్ చేరుతుందని, దీనికితోడు వివిధ గ్రాంట్లను కూడా పొందే అవకాశముంటుందని సర్కారు తొలుత భావించింది. అయితే.. బడా కార్పొరేషన్ ద్వారా పాలనా పరమైన ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో జీహెచ్ఏ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగా జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఏ పరిధిలోనే ఉంటాయి. జీహెచ్ఏ ఏర్పాటుతో పట్టణ పరిపాలన సులువు కావడంతో పాటు పౌర సేవలు మెరుగవుతాయి. క్రమబద్ధమైన జవాబుదారీతనం, పారదర్శకతకు అవకాశముంటుంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధ్యయనం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) స్థానంలో గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ)ను ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో జీహెచ్ఏను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ ఉన్నతాధికారులు, సీనియర్ ఐఏఎస్లు జీబీఏ ఏర్పాటు, కార్యకలాపాలను అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం 712 చ.కి.మీ మేర విస్తరించి ఉన్న జీబీఏ పరిధిలో నార్త్ సిటీ, ఈస్ట్ సిటీ, సౌత్ సిటీ, వెస్ట్ సిటీ, సెంట్రల్ సిటీ.. ఇలా ఐదు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇదే విధంగా ఈ జీహెచ్ఏ పరిధిలో బహుళ స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లు కార్యకలాపాలు సాగిస్తాయి. జీహెచ్ఏ ఏం చేస్తుందంటే.. స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్ల కార్యకలాపాలను సమన్వయం చేయడం, పర్యవేక్షించడం ఈ అత్యున్నత సంస్థ విధి. మెట్రోపాలిటన్ ప్రణాళిక, రవాణా, పర్యావరణ నిర్వహణలను సమన్వయం చేస్తుంది. ఏకీకృత ప్రణాళిక, వికేంద్రీకృత పరిపాలన, పౌరుల భాగస్వామ్యాన్ని సమన్వయం చేస్తూ.. పట్టణీకరణ సవాళ్లు, మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. జీహెచ్ఏ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్లను పర్యవేక్షిస్తుంది. కార్పొరేషన్ల పరిధిలో పౌర సేవలు జీహెచ్ఎంసీ పరిధి పెరగడంతో ఆస్తి పన్నులు, వినియోగదారుల చార్జీలు, అభివృద్ధి రుసుముల ద్వారా ఆదాయం కూడా భారీగానే పెరుగుతుంది. ఏకీకృత పట్టణ నిర్వహణ, పౌర సేవలు సమానంగా అందించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పడనున్న స్వతంత్ర నగరపాలక సంస్థలు ఆస్తి పన్ను, స్థానిక ఆదాయం, పౌర సేవలను నిర్వహిస్తాయి. దీంతో సమర్థమైన పరిపాలన, సమాంతర అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులను వేగవంతమవుతాయి. దీంతో స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. 200 చ.కి.మీ., లేదా 20 లక్షల జనాభాకుఒక కార్పొరేషన్ 27 నగర, పురపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా జీహెచ్ఎంసీ అవతరించింది. రెండు వేల చ.కి.మీకు పైగా విస్తరించిన జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్ కింద కార్యాచరణ కష్టసాధ్యం. బహుళ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం వల్ల పరిపాలన ప్రజలకు చేరువ అవడంతో పాటు స్థానిక సమస్యలు సకాలంలో పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో 200 చదరపు కిలోమీటర్లు లేదా 20 లక్షల జనాభా. అంతకుమించి విస్తీర్ణం పెరిగినా, జనాభా మించినా పరిపాలనపరంగా ఆరోగ్యదాయకం కాదని, కార్యాచరణపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని పురపాలక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన మెగా జీహెచ్ఎంసీలో బహుళ కార్పొరేషన్ల ఏర్పాటు అనివార్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు 200 చ.కి.మీ., 20 లక్షల జనాభాకు ఒక కార్పొరేషన్ పరిపాలన సౌలభ్యం, సమాంతర అభివృద్ధికి అవకాశాలు -
అన్నా డబ్బులున్నయా..
యాచారం: ‘అన్నా.. సర్పంచ్ రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఏమైనా డబ్బులున్నయా.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చూడు అత్యవసరమన్నా.. నేను గెలిస్తే నీవు గెలిచినట్లే’ అని పంచాయతీ పోటీదారులు అప్పుల కోసం ఆరాటపడుతున్నారు. ఇందుకోసం వ్యవసాయ భూమి, లేదా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో నగదు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లాలోని 526, 4,668 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం సర్పంచ్లుగా పోటీ చేస్తున్న వారిలో చాలా వరకు స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారే. రెండేళ్లుగా బిజినెస్ లేకపోవడంతో కొంత డీలా పడ్డారు. ఈక్రమంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికలు రానే వచ్చాయి. పదవులకు భలే డిమాండ్ మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న పలు మండలాల్లోని గ్రామాల్లో సర్పంచ్ పదవులకు భలే డిమాండ్ ఉంది. వెంచర్ల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమల కోసం పంచాయతీల అనుమతులు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో సర్పంచ్లుగా గెలిచిన వారికి ఎంతో కొంత ఆదాయానికి అవకాశం ఉంటుంది. దీంతో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసి, సర్పంచ్గా గెలవాల్సిందేనని ఆశావహులు పట్టుదలతో ఉన్నారు. వెయ్యి మంది నుంచి 2,500 మంది ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేసేందుకు కనీసం రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. పోటీ చేసే వ్యక్తికి మంచి పేరున్నా.. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఎన్నికల సమయంలో పెద్ద మొత్తం డబ్బు ఖర్చు చేయనిదే గెలిచే పరిస్థితి ఉండదు. అందుకే పోటీదారులంతా అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఐదు రూపాయల వడ్డీ అయినా సరే అప్పు తీసుకునేందుకు వెనకాడటం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న వడ్డీ వ్యాపారులు ముందు జాగ్రత్తగా భూములు, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పులు ఇస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల పరిధిలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఈవ్యాపారం జోరుగా సాగుతోంది. రూ.2 వేల కోట్లకు పైనే ఖర్చు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు రూ.2 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. చిన్న గ్రామంలో నాలుగు పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తే రూ.2 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అదే 2,500లకు పైగా ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీల్లో నలుగురైదుగురు బరిలో ఉంటే రూ.5 కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఈమొత్తం కొంత తగ్గే అవకాశం ఉన్నా, జనరల్, బీసీ స్థానాల్లో అంతకు మించి పెరుగుతుంది. ఫ్యూచర్ సిటీ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ సమరం మరింత వేడిగా సాగే చాన్స్ ఉంది. వడ్డీ ఎంతైనా ఓకే! భూమి లేదా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తా సర్పంచ్గా పోటీ చేసే అవకాశంవచ్చింది.. నేను గెలిస్తే నువ్వు గెలిచినట్లే నగదు కోసం పంచాయతీ పోటీదారుల పాట్లు -
కుల ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షణ
కొందుర్గు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం అనేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం పత్రాల కోసం దరఖాస్తు చేయడానికి మీ సేవల్లో క్యూ కడుతున్నారు. కాగా మీ సేవల్లో సర్వర్ పనిచేయకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ అజాం అలీని వివరణ కోరగా సర్వర్ పనిచేయకపోవడమనే సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు. రాత్రివేళల్లో పనిచేయవచ్చని తెలిపారు. ఇంకా ఒకరోజు సమయం ఉందని, ఒకవేళ పనిచేయకపోతే మాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. ట్రావెల్స్ బస్సు, కారు ఢీ శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన సంఘటన గురువారం అర్ధరాత్రి శంకర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం లింగంపల్లి గ్రామంలో విందుకు హాజరైన 40 మందితో కూడిన ఓ కుటుంబం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో బస్సు మండలంలోని మహాలింగాపురం వద్దకు రాగానే ఎదురుగా కారులో అజాగ్రత్తగా వస్తున్న నాగసేనారెడ్డి బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్కి పాక్షిక గాయాలు కాగా.. బస్సు ముందు భాగం దెబ్బతింది. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గ్రామ పోరు.. జ్ఞాపకాలు అదురు
పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి మొదలైంది. స్వాతంత్య్రం తొలినాళ్లలో ఏర్పాటు చేసిన పంచాయతీ సమితి వ్యవస్థను ప్రధాని హాదాలో జవహర్లాల్ నెహ్రూ షాద్నగర్ ప్రాంతంలో ప్రారంభించారు. అనంతరం 61 ఏళ్ల కిందట పంచాయతీ వ్యవస్థ రూపుదాల్చుకోవడంతో గ్రామాల్లో సమర్థ పాలనకు అంకురార్పణ ఏర్పడింది. తాజాగా స్థానిక సంస్థల పోరు నేపథ్యంలో ఆ ప్రస్తానాన్ని ఓసారి నెమరేసుకుందాం. షాద్నగర్: భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు షాద్నగర్ ప్రాంతానికి వీడదీయలేని బంధం ఉంది. తొలి పంచాయతీ సమితిని ఇక్కడే ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం అనంతరం పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో ప్రభుత్వం బల్వంత్రాయ్ మెహతా కమిటీని నియమించింది. పరిపాలన వికేంద్రీకరణతోనే దేశంలో పాలన సమర్థవంతంగా సాగుతుందని కమిటీ భావించింది. అందుకు మూడంచెల విధానాన్ని (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) సిఫారసు చేసింది. 1958లో ఈ విధానాన్ని జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది. మూడంచెల విధానాన్ని దేశంలో తొలిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న అమలు చేశారు. అదే ఏడాది నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ వ్యవస్థను అప్పటి మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న షాద్నగర్లో తొలిసారిగా ప్రధాని నెహ్రూ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగులోకి పీవీ అనువాదం పంచాయతీ సమితిని నెహ్రూ ప్రారంభించేందుకు ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావులతో కలిసి వచ్చారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వారికి స్వాగతం పలికారు. నెహ్రూ హిందీలో చేసిన ప్రసంగాన్ని పీవీ తెలుగులో అనువాదం చేశారు. అంబేడ్కర్ కాలనీలో అప్పట్లో ఏర్పాటు చేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. బ్లాక్ ఆఫీస్గా ఏర్పాటు చేసిన ఇప్పటి మండల పరిషత్లో పార్కు మధ్యలో నీటిని చిమ్మే తారమ కొలను, ఎదురుగా సాంస్కృతిక ప్రదర్శనల నిమిత్తం కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత మండల పరిషత్ కార్యాలయమే అప్పటి పంచాయతీ సమితి కార్యాలయం. తొలి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కొత్తూరు మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాందేవ్రెడ్డి ఎన్నికయ్యారు. నాటి నుండి 1984 వరకు పంచాయతీ సమితి ఆదర్శవంతంగా కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ మండలాల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పంచాయతీ సమితులు రద్దయ్యాయి. తాలూకాగా ఉన్న షాద్నగర్ను నాలుగు మండలాలుగా విభజించారు. ఫరూఖ్నగర్, కొత్తూరు, కేశంపేట, కొందుర్గు ఏర్పాటయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నందిగామ, చౌదరిగూడ మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. నెహ్రూ ప్రారంభించిన మూడంచెల విధానం షాద్నగర్లో మొదటి పంచాయతీ సమితి ఏర్పాటు 1978 నుంచి సర్పంచులకు ప్రత్యక్ష ఎన్నిక మొదట్లో పరోక్ష పద్ధతి ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీ చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం 500 జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 వరకు వార్డు సభ్యులుండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, వారు సర్పంచులను ఎన్నుకునే వారు, ఎన్నికై న సర్పంచులు కలిసి పంచాయతీ సమితి ప్రెసిడెంట్ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. 1978లో నర్సింహ కమిటీ సర్పంచులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్లకు నేరుగా ఎన్నుకుంటున్నారు. -
సర్పంచ్ 203 .. వార్డులకు 688
షాద్నగర్: పంచాయతీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం శుక్రవారం రెండోరోజు కొనసాగింది. ఆశావహులు జోరుగా దాఖలు చేశారు. కొత్తూరు, ఫరూఖ్నగర్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్కుమార్ పరిశీలించారు. వార్డు కోసం దాఖలైనవి ఫరూఖ్నగర్లో 133, జిల్లేడు చౌదరిగూడలో 47, కేశంపేటలో 100, కొత్తూరులో 80, కొందుర్గులో 63, నందిగామలో 96, శంషాబాద్లో 169 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఏసీపీ కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ నరసయ్య, ఎస్ఐ సత్యశీలారెడ్డి, హెచ్సీ గోపాల్, కానిస్టేబుల్ నరేష్ తదితరులు ఉన్నారు. ఉరుకులు, పరుగులు నామినేషన్ల పర్వం రెండ రోజు అభ్యర్థులు పత్రాల కోసం అటు ఇటు పరుగులు పెట్టారు. బ్యాంకు ఖాతాలు తెరవడం, పంచాయతీల్లో ఇంటి పన్నులు, నల్లా పన్నులు చెల్లించడం, కుల ధ్రువీకరణ, ఆధార్ పత్రాల కోసం మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు కొడుతూ కనిపించారు. పలు గ్రామాల్లో ప్రతిపాదించే వారి పన్నులు బకాయిలు ఉంటే బరిలో నిలిచే వారు చెల్లిస్తున్నారు. సర్పంచ్ కోసం దాఖలైన నామినేషన్లు మండలం మొత్తం జీపీలు దాఖలైనవి ఫరూఖ్నగర్ 47 55 జిల్లేడుచౌదరిగూడ 24 18 కేశంపేట 29 35 కొత్తూరు 12 17 కొందుర్గు 22 22 నందిగామ 19 24 శంషాబాద్ 21 32 రెండో రోజు దాఖలైన నామినేషన్లు -
మున్సిపాలిటీల విలీనం సమంజసం కాదు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చెయ్యాలనే నిర్ణయాన్ని జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు ఖండించారు. మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే నిధుల కొరతతో జీహెచ్ఎంసీలో ఉన్న 150 డివిజన్లలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కొత్తగా మరిన్ని మున్సిపాలిటీలను జోడించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 60 శాతం గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రాంతాలను జీహెచ్ఎంసీలో ఏ విధంగా విలీనం చేస్తారని నిలదీశారు. జిల్లాకుఇన్చార్జి మంత్రిగా ఉన్న శ్రీధర్బాబు రెండేళ్లలో ఒక్కసారి కూడా జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించలేదని దుయ్యబట్టారు. అధికారం కోసం వెంపర్లాడి, అమలుకు అసాధ్యమైన హామీలు ప్రకటించి అధికారం చేజిక్కించుకొని, ఇప్పుడు ఆ హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే విలీన ప్రక్రియ అని విమర్శించారు. విలీనం చేస్తే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయిలో పన్నులు విధిస్తారనే భయాందోళనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపాదించిన పలు రేడియల్ రోడ్లు నేటికీ పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాటి పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనేక కాలనీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పలు అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, ఇలాంటి ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వృద్ధుడి అదృశ్యం
పహాడీషరీఫ్: ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన కుర్వ మహేశ్ ఇంటికి నారాయణపేటలో నివాసం ఉండే అతని తండ్రి భీంషప్ప(57) వచ్చివెళ్తుంటాడు. ఇతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఈనెల 18న ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. 20న ఉదయం 9.30 గంటలకు ఆరుబయట కూర్చునేందుకు వచ్చి, ఎక్కడికో వెళ్లిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అతని కుమారుడు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పీఎస్లో లేదా 87126 62367 నంబర్కు ఫోన్ చేసి, సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఎవరీ బాలుడు ● తక్కళ్లపల్లి గేట్ వద్ద చేరదీసిన యాచారం పోలీసులు ● మేరీ హోమ్స్ సేఫ్ కస్టడీకి తరలింపు యాచారం: నాగా ర్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై తక్కళ్లపల్లి గేట్ వద్ద శుక్రవారం ఓ మతిస్థిమితం లేని బాలుడి(13)ని స్థానిక పోలీసులు గుర్తించారు. వివరాలు అడిగే ప్రయత్నం చేయగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అతన్ని సికింద్రాబాద్లోని (మేరీ హోమ్స్ ఫర్ ద డిసేబుల్డ్) సేఫ్ కస్టడీలో చేర్పించారు. లైట్ బ్లూ కలర్ టీ షర్ట్, తెలుపు రంగు ప్యాంట్, నైక్ చెప్పులు ధరించి ఉన్నాడు. బాలుడిని ఎవరైనా గుర్తిస్తే యాచారం పోలీస్ స్టేషన్ నంబరు 8712662657కు ఫోను చేసి సమాచారం అందించాలని సీఐ నందీశ్వర్రెడ్డి సూచించారు. -
కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు
● అమెజాన్ సంస్థ ప్రతినిధి జాన్ నోబెల్ ● నందివనపర్తి ఉన్నత పాఠశాల సందర్శన యాచారం: అమెజాన్ సంస్థ ప్రతినిధి జాన్ నోబెల్ శుక్రవారం నందివనపర్తి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన తమ సంస్థ ద్వారా స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై కెరీర్ గైడెన్స్, చదువు ప్రాముఖ్యత, విదేశాల్లో ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించారు. ఉన్నత లక్ష్యంతో కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అమెజాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేశారు. సంస్థ ప్రతినిధులు లత, రాము, పాఠశాల హెచ్ఎం వెంకటరామశాస్త్రి, ఉపాఽ ద్యాయులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి శంకర్పల్లి: ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శుక్రవారం శంకర్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామంతాపూర్కి చెందిన వడ్ల బాలమణి(60) గురువారం వ్యక్తిగత పనులపై శంకర్పల్లికి వచ్చింది. సాయంత్రం చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు, ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మైసిగండి హుండీ ఆదాయం లెక్కింపు
ఇబ్రహీంపట్నం రూరల్: పాత విత్తన చట్టాన్ని మార్చి కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. చట్టం ముసాయిదాపై కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో శుక్రవారం అవగాహన, అభిప్రాయ సేకరణ నిర్వహించారు. డాట్ సెంటర్ శాస్త్రవేత్త మధుశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ముసాయిదా గురించి వివరించారు. అనంతరం అభిప్రాయ సేకరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సురేష్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ, రైతులు, విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, మండల స్పెషలాఫీసర్ కె. నవీన్కుమార్రెడ్డి ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం గ్రామ కార్యదర్శులు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైట్లు, మౌలిక సదుపాయాలతోపాటు దివ్యాంగుల కోసం ర్యాంపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ ఉష, సూపరింటెండెంట్ ఎల్లంకి జంగయ్యగౌడ్ పాల్గొన్నారు. -
ఉన్నతాధికారుల సమీక్ష
గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల ముఖ్య అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, టీజీఐఐసీ ఎండీ శశాంక, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, డీసీపీ నారాయణరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఆర్డీఓ అనంత్రెడ్డి, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నిఘా నీడన..
షాద్నగర్: పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంలో కోడ్ అమల్లోకి వచ్చింది. ఉల్లంఘనలకు పాల్పడకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల సంఘం అధికారులు షాద్నగర్లో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఫ్లయిండ్ స్క్వాడ్ (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలైన్స్ (ఎస్ఎస్టీ) బృందాలను నియమించారు. ఈ బృందాలు అక్రమ మద్యం, నగదు రవాణా ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ వంటివాటిని అడ్డుకోవడంతో పాటు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నాయి. ఎఫ్ఎస్టీ ఏం చేస్తారంటే.. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, ఫరూఖ్నగర్ మండలాలకు గాను మండలానికి ఒకటి చొప్పున ఎఫ్ఎస్టీ బృందాలను కేటాయించారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉన్నారు. వీరు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ ఉల్లంఘనలు, నియమావళి సరిగా అమలు చేయక పోవడం వంటి ఫిర్యాదులపై స్పందించి చర్యలు చేపడుతున్నారు. ఎస్ఎస్టీ బృందం తనిఖీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా కోసం స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించారు. ఈ బృందాల్లో ఒక డిప్యూటీ తహసీల్దార్, నలుగురు పోలీసులు, ఒక వీడియోగ్రాఫర్ ఉన్నారు. వీరు వాహనాల రాకపోకలపై నిరంతరం నిఘా పెట్టారు. రసీదులు చూపించాల్సిందే.. ఎన్నికల సంఘం నిర్ణయించిన నగదు కంటే ఎక్కువ తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటారు. రూ.10 వేల విలువైన ఒకే రకమైన వస్తువులు రవాణా చేస్తే ఆయా బృందాలకు వివరణ ఇవ్వాలి. నగదు రసీదులు చూపించాల్సి ఉంటుంది. గంపగుత్తగా చీరలు, మద్యం వంటివి తీసుకెళ్లినా ఆధారాలు చూపించాలి. రూ.50 వేల కంటే అధికంగా నగదు ఉంటే రసీదులు చూపాలి. సరైన ఆధారాలు చూపకుంటే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకుంటారు. టోల్ ప్లాజా వద్ద తనిఖీ కేంద్రం షాద్నగర్ సమీపంలోని రాయికల్ శివారులో జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజా వద్ద ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఎస్టీ బృందం అధికారులు ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలను 24 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల తనిఖీ ప్రక్రియను మొత్తం వీడియో చిత్రీకరిస్తున్నారు. టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని శుక్రవారం షాద్నగర్ ఆర్డీఓ సరిత, తహసీల్దార్ పార్థసారధి పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ రంగంలోకి ప్రత్యేక బృందాలు షాద్నగర్ టోల్ప్లాజా వద్ద తనిఖీ కేంద్రం వాహనాల్లో పోలీసుల విస్తృత సోదాలు -
పెరగనున్న జీహెచ్ఎంసీ పరిధి
సాక్షి, సిటీబ్యూరో: శివార్లలోని 27 మున్సిపాలిటీల విలీనంతో పెరగనున్న జీహెచ్ఎంసీ ఎన్ని జోన్లు కానుంది? ప్రస్తుతమున్న 150 వార్డులు (కార్పొరే టర్ల డివిజన్లు) ఎన్ని వార్డులు కానున్నాయి? 30 సర్కిళ్లను ఎన్ని సర్కిళ్లకు పెంచుతారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. వార్డుకు సగటు జనాభా/ఓటర్లను నిర్ణయించి అందుకనుగుణంగా వార్డులను పునర్వ్యవస్థీకరించనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఎంసీఆర్హెచ్ఆర్డీసీఎల్లో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ వార్డుల్లో జనాభా మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. కొన్ని వార్డుల్లో 30 వేల జనాభా ఉంటే కొన్ని వార్డుల్లో లక్ష జనాభా ఉంది. దీంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఇటీవలే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు రూ.2 కోట్ల వంతున నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. 30 వేల జనాభా ఉన్న వార్డులకు అవి సరిపోయినా లక్ష జనాభా ఉన్న వార్డులకు సరిపోవు. ఇలాంటి ఇబ్బందుల్లేకుండా సగటు జనాభా ప్రాతిపదికన వార్డుల్ని పునర్వ్యవస్థీకరించను న్నారు. అంతేకాదు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాల సరిహద్దుల్ని సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. వీటితో పాటు జిల్లాల భౌగోళిక సరిహద్దుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న 6 జోన్లు అందుకు రెట్టింపు 12 కానీ, లేదా 10 కానీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే వార్డులు కూడా 150 నుంచి 300కు పెరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న సర్కిళ్లు సైతం 50 లేదా 60 వరకు ఉండే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ప్రస్తుత జనాభా దాదాపు: 1,45,15,600 విలీన మున్సిపాలిటీల జనాభా దాదాపు: 20,17,000 విలీనంతో జీహెచ్ఎంసీ మొత్తం జనాభా: 1,65,32,600 శివారు మున్సిపాలిటీల విలీనంతో..డివిజన్కు సగటున 55 వేల జనాభా ఉండేలా చేయాలనుకుంటే 300 వార్డులుగా విభజించనున్నారు. ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీని ఎన్నికార్పొరేషన్లు చేస్తారనే అంశంపై స్పష్టత వచ్చాక అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. -
స్వీయ లబ్ధి కోసమే విలీన ప్రక్రియ
తుర్కయంజాల్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా ఫర్ సేల్ అన్నట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. తుర్కయంజాల్లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం గతంలో అనేక అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించేలా చేస్తే నేడు ఫోర్త్ సిటీ పేరుతో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు ప్రోత్సహించి స్వీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక జీడీపీ కలిగిన జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పడిందన్నారు. శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా ప్రజలపై పన్నుల భారం పడనుందని, ఇంటి నిర్మాణ అనుమతులకు అధికంగా వెచ్చించాల్సి వస్తుందన్నారు. జిల్లా అస్తి త్వాన్ని దెబ్బతీసేలా సీఎం సొంత నిర్ణయాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విలీనం పూర్తిగా అనైతికమని, దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఉనికి, హక్కులను కాపాడటానికి ఎంతవరకై నా సిద్ధమేనని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ ఏనుగు ఆనంద్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొండ్రు మల్లేష్, నాయకులు బొక్క గౌతమ్ రెడ్డి, చెరుకు రఘునాథ్గౌడ్, కొండ్రు శ్రీనివాస్, జక్క రాంరెడ్డి, మర్రి సంపతీశ్వర్ రెడ్డి, కళ్లెం ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం అనైతికం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే పోరాటం తప్పదు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి -
హే బాలాజీ.. ఏమిటీ దుస్థితి
● చెప్పులతో లోపలికి ప్రవేశిస్తున్న షూటింగ్ సిబ్బంది ● పట్టించుకోని దేవాదాయ అధికారులు పహాడీషరీఫ్: మామిడిపల్లిలోని ప్రాచీనమైన బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అపవిత్రంగా మారుతోంది. దాతల సహకారంతో నూతన సొబగులతో తీర్చిదిద్దబడుతున్న ఈ ఆలయాన్ని అధికారులు మాత్రం కేవలం కాసుల కోణంలోనే చూస్తున్నారు. ఆలయ పరిసరాలలో కొన్నాళ్లుగా సినిమా, సీరియల్, పాటలు, వివాహాది ఫొటోషూట్లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఒక్కో దానికి ఒక్కో ధరను నిర్ణయించి దేవాదాయ శాఖ అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. ఆదాయం సమకూరడం వరకు బాగానే ఉంది. కానీ ఆయా షూటింగ్లకు వచ్చే నటులు ఆలయం వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా వ్రతాలు చేసే ప్రాంగణం(సాలాహారం)లో దేవతామూర్తుల చిత్రపటాలను ఏర్పాటు చేసినప్పటికీ, అందులోకి షూటింగ్ నటులు ఎంచక్కా బూట్లు, చెప్పులతో కూర్చొంటున్నారు. కొన్ని షూటింగ్లైతే ఆలయంలోకి భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా ప్రధాన ద్వారం ముందే చేస్తున్నారు. ఇక ఆలయ ముందు భాగంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర విగ్రహాలు కలిగిన పార్కులో గతంలో బయటే చెప్పులు వదిలి వెళుతుండగా, కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం అందరు చెప్పులతోనే అందులోకి ప్రవేశిస్తున్నారు. ఇక వివాహం కోసం ఫొటోషూట్లకు వచ్చే జంటలు ఆలయ పవిత్రతను మరింత దెబ్బతీస్తున్నాయి. ఆలయ ప్రాకారంపై ఇష్టమైన రీతిలో స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఆలయ పార్కు, శ్రీకృష్ణుడి గోశాల వైపు గ్రిల్స్ విరిగిపోతున్నా కూడా అధికారులకు పట్టడం లేదు. మొత్తం మీద మానసిక ప్రశాంతత కోసం భగవంతుడి సన్నిధిలో గడిపేందుకు వస్తే ఏకాగ్రతకు భంగం కలగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలి
షాద్నగర్రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలని ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అన్నారు. పట్టణంలోని ఉద్యమకారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులను గుర్తించాలని, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉద్యమకారుల సంక్షేమ సంఘం మండల అధక్షుడు దొడ్డి రవీందర్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మేకల వెంకటేశ్, రవికుమార్గౌడ్, చంద్రశేఖర్గౌడ్, రాందాస్ పాల్గొన్నారు. అలీనగర్ కాలనీలో చోరీ డబీర్పురా: ఓ ఇంట్లో దొంగలు పడి 15 తులాల బంగారు ఆభరణాలు దొంగలించిన సంఘటన మీర్చౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నూర్ఖాన్బజార్ అలీనగర్ కాలనీలో ప్రాంతానికి చెందిన మీర్జా ఆలంధార్ అలీ, సయ్యదా సకీనా యుస్రా రజ్వీలు దంపతులు. ఈ నెల 26న రాత్రి 10.30 గంటల సమయంలో ఆలంధార్ అలీ కుటుంబ సభ్యులు శుభాకార్యానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుందామని చూడగా 15 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఇంట్లోని అన్ని ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మీర్జా ఆలంధార్ అలీ గురువారం మీర్చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గరుడ భవన్ నిర్మాణానికి రూ.2 కోట్ల విరాళం
బంజారాహిల్స్: హరేకృష్ణ మూవ్మెంట్–హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్టాత్మక హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టుకు అరబిందో ఫార్మా లిమిటెడ్ దాతృత్వ సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ నుంచి కీలకమైన ఆర్థిక సహాయం లభించింది. ఈ మేరకు భారతీయ సంస్కృతి, కళలు, వారసత్వాన్ని ప్రోత్సహించే గరుడ భవన్ నిర్మాణం కోసం రూ.2 కోట్లు విరాళంగా అందజేశారు. అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ నిత్యానందరెడ్డి చెక్కును హరేకృష్ణ హెరిటేజ్ టవర్ వైస్ ప్రెసిడెంట్ కౌంతేయ దాస ప్రభూజీకి అందజేశారు. ఈ సందర్భంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్లు నిత్యానందరెడ్డి, శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ..భారతీయ సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు, సమగ్ర సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇది అరబిందో ఫార్మా వైఖరిని ప్రతిబింబించే విరాళమన్నారు. హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం భారతీయ కళా సంపదను, ఆధ్యాత్మికతను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే మహోన్నత ప్రయత్నమని అభినందించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఔదార్యతనంతో కూడిన ఆర్థిక సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. -
చోటా నేతల్లో నైరాశ్యం
పహాడీషరీఫ్: ఓఆర్ఆర్ లోపలి యూఎల్బీలను(అర్బన్ లోకల్ బాడీస్) జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో జల్పల్లి మున్సిపాలిటీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ అయ్యేందుకు ఇదే సరైన అదునుగా భావిస్తున్నారు. వాస్తవానికి జల్పల్లి మున్సిపాలిటీ పాలక మండలి గడువు ఈ ఏడాది జనవరి 25వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మాజీ కౌన్సిలర్లతో పాటు కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇన్నాళ్ల పాటు నాయకులు క్షేత్రస్థాయిలో తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తగ్గనున్న నాయకత్వం మున్సిపల్లో 1,12 లక్షల జనాభా, 85 వేల ఓటర్లు, 28 వార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధానమైన మూడు పార్టీలను పరిగణనలోకి తీసుకున్నా దాదాపు 100 మంది వరకు యాక్టివ్ లీడర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. కానీ మున్సిపాలిటీని జీహెచ్ంసీలో విలీనం చేస్తే సగటున 30 వేల ఓటర్లకు ఒక డివిజన్ చొప్పున, మూడు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వెరసి 10–15 మంది నాయకులే ప్రధానం కానున్నారు. ఈ డివిజన్లలో కార్పొరేటర్గా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు వెచ్చించేంత పోటీ ఉండనున్న నేపథ్యంలో మాజీ కౌన్సిలర్లు సైతం పోటీకి దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది. పెరగనున్న పన్నుల భారం పెద్ద ఎత్తున సమస్యలతో కూడిన జల్పల్లి లాంటి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యను అధిగమించడానికి కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు అవసరమైన మేరకు యంత్రాలను కూడా సమకూర్చనున్నారు. రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. మరోవైపు ఇక్కడి ప్రజలపై జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు పెద్ద ఎత్తున పన్నుల భారం కూడా పడే అవకాశం లేకపోలేదు. -
చదువుకు దూరమై.. మనస్తాపానికి గురై
ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య పహాడీషరీఫ్: కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా పైచదువులు చదవలేకపోతున్నానని మనస్తాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన ఇర్ఫాన్ ఖాన్ కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం ఎర్రకుంటలోని తూర్ కాలనీకి వలస వచ్చి ఆటోడ్రైవర్గా కొనసాగుతున్నాడు. అతని కూతురు ఇఫ్రా ఖానమ్(19) గతేడాది 10వ తరగతి నాందేడ్లోని చదివింది. ఇంటర్ చదివేందుకు ఏడు నెలల క్రితం ఇక్కడికి వచ్చింది. వీరి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో అక్కడ రూ.4 వేలు చెల్లించి టీసీ తీసుకురాకపోవడంతో పాటు ఇక్కడ కాలేజీలో కూడా చేర్పించలేకపోయారు. ఈ విషయమై ఖానమ్ తీవ్ర వేదనకు గురవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం తల్లి సోదరులకు టిఫిన్ ఇచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఖానమ్ ఇంటి రేకుల పైప్నకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. అనంతరం గమనించిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లివి కేఫ్, కిచెన్ ప్రారంభం శంకర్పల్లి: మండలంలోని మోకిలతండాలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘లివి కేఫ్, కిచెన్’ను గురువారం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, శాసన సభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ప్రారంభించారు. అనంతరం కేఫ్ నిర్వాహకుడు ప్రశాంత్ అతిథులను ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నేతలతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ శంకర్పల్లి అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, నాయకులు గోవర్ధన్రెడ్డి, రాజునాయక్ పాల్గొన్నారు. పేలిపోయిన వాషింగ్ మిషన్ అమీర్పేట: అమీర్పేట ధరం కరం రోడ్డులోని ఓ ఇంట్లో ఎల్జీ వాషింగ్ మిషన్ పేలిపోయింది.పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళకు గురై బయటకు పరుగులు తీశారు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కేకే ఎన్క్లేవ్ ఫ్లాట్ నెం.503లో గురువారం మధ్యాహ్నం ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ నడుస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వాషింగ్ మిషిన్ పేలిపోయింది. ఈ సమయంలో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. తేరుకుని బాల్కానీలోనిలోకి వచ్చి చూడగా వాషింగ్ మిషిన్ ఎక్కడికక్కడ విరిగి పోయి విడిబాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. లోపలి పేలుడు ధాటికి లోపల అత్యంత బరువుగా ఉన్న బ్యాటరీ సీలింగ్ తగిలి కింద పడిపోయింది.పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డామని మహిళ వాపోయింది. షార్ట్సర్క్యూట్ జరిగి కరెంటు వైర్లు కాలిపోతే ఇంట్లో అంతటా మంటలు వ్యాపించి కాలిబూడిదయ్యేదని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియరాలేదని,బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐబొమ్మ రవిని నిర్దోషిగా బయటకు తెస్తా హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు హిమాయత్నగర్ : మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు అన్నారు. గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి, త్వరలోనే జైలు నుండి బెయిల్పై విడుదల చేయిస్తానని అన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లే అని తెలిపారు. -
తొలి ఘట్టం ఆరంభం
పంచాయతీ పోరుకు నామినేషన్ల పర్వం మొదలు ● మొదటిరోజు సర్పంచ్లకు 145, వార్డు సభ్యులకు 119 దాఖలు ● ఆయా కేంద్రాల వద్ద నేతల హడావుడిషాద్నగర్: ఎన్నికల సం‘గ్రామానికి’ ‘తొలి’ ఘట్టం ప్రారంభమైంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మొదటిరోజు ఎన్నికల బరిలో నిలబడే సర్పంచు, వార్డు సభ్యులకు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం సర్పంచ్ కోసం 145, వార్డు కోసం 119 దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో షాద్నగర్, శంషాబాద్ పరిధిలో 174 పంచాయతీలు, 1,530 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వార్డులకు దాఖలైన నామినేషన్లు వార్డు సభ్యుడి కోసం ఫరూఖ్నగర్లో 19, జిల్లేడు చౌదరిగూడలో 5, కేశంపేటలో 7, కొత్తూరులో 22, కొందుర్గులో 25, నందిగామలో 10, శంషాబాద్లో 31 నామినేషన్లు దాఖయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు షాద్నగర్ డివిజన్ పరిధిలోని ఫరూఖ్నగర్లో 15 క్లస్టర్లు, కేశంపేటలో 9, జిల్లేడు చౌదరిగూడలో 6, కొందుర్గులో 6, నందిగామలో 5, కొత్తూరులో 4, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్లో 7 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మొదటిరోజు నామినేషన్ల కేంద్రాల వద్ద ఆశావహులు హడావుడి చేశారు. అధికారుల నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవడం, పంచాయతీల్లో పన్నులు చెల్లించడం, బలపరిచే అభ్యర్థులతో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో సందడి నెలకొంది. కొత్తూరు మండలం మల్లాపూర్లోని నామినేషన్ కేంద్రాన్ని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు. మండలం మొత్తం జీపీలు దాఖలైనవి ఫరూఖ్నగర్ 47 34 జిల్లేడుచౌదరిగూడ 24 30 కేశంపేట 29 24 కొత్తూరు 12 11 కొందుర్గు 22 13 నందిగామ 19 16 శంషాబాద్ 21 17 -
భూములు లాక్కోవద్దు
కడ్తాల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడ్తాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల కూడలి వద్ద గురువారం ప్రత్యేకంగా చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఐ గంగా ధర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు శాంతి, క్రమశిక్షణ పాటించాలని అన్నారు. ఎవరైనా గందరగోళ పరిస్థితులు సృష్టించాలని ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మద్యం అనధికారికంగా విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, అనుమానాస్పదంగా సంచరించినా పోలీసులకు తెలపాలన్నారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్తే సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వరప్రసాద్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడిన కబ్జాదారులు తుర్కయంజాల్: ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టడమే కాకుండా, అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించిన సంఘటన అబ్దుల్లాపూర్మెంట్ మండల పరిధి ఇంజాపూర్లో గురువారం చోటు చేసుకుంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, గ్రామ పాలన అధికారి సుప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ సర్వే నంబర్ 126లో స్వామి, విజయ్ కుమార్ అనే వ్యక్తులు సుమారు 300 గజాల స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణ పనులను కొన్ని రోజులుగా చేపడుతున్నారు. మొదటి నుంచి ఇది ప్రభుత్వ భూమి అని ఇందులో నిర్మాణం చేపట్ట వద్దని చెప్పినా వినడం లేదన్నారు. తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్మాణం వద్దకు వెళ్లగా అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ మేరకు కబ్జాదారులపై ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. అక్రమ నిర్మాణం చుట్టూ తహసీల్దార్ ఆదేశాల మేరకు జేసీబీ సహాయంతో కందకం తవ్వించినట్లు చెప్పారు. -
వడివడిగా విలీనం..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో శివార్లలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మున్సిపాలిటీల విలీనంతో ఆయా స్థానిక సంస్థల్లో రికార్డులు, ఆస్తుల స్వాధీనంపై పురపాలకశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఉద్యోగుల సంఖ్య లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది. రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల నగర/పురపాలక సంఘాలను జీహెచ్ఎంసీలో కలుపుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఆ లోపే ఆయా మున్సిపాలిటీ వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత బల్దియా పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత విలీన ప్రాంతాలపై పురపాలక శాఖ మరింత పట్టు బిగించనుంది. అప్పటిలోపు రికార్డులు, ఆస్తులు, ఆదాయ వనరులు, పద్దుల వివరాల లెక్క తీయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. తీన్మార్! ఔటర్ రింగ్రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీ మెగా కార్పొరేషన్గా అవతరించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ను రెండు లేదా మూడుగా విభజించాలనే ప్రతతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ను ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. అయితే, కార్పొరేషన్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని వార్డుల పునర్విభజన, సర్కిళ్ల ఏర్పాటుపై ముందడుగు వేయాలని పురపాలక శాఖ యోచిస్తోంది. సంస్థాగత పునర్విభజన కార్పొరేషన్ల సంఖ్యను బట్టి ఉన్నందున.. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రెండు లేదా మూడు కార్పొరేషన్ల సరిహద్దులను బట్టి ఏ కార్పొరేషన్లో ఏ మున్సిపాలిటీలు చేరతాయానేది స్పష్టం కానుంది. విలీనమైన యూఎల్బీలు ప్రస్తుతం స్పెషలాఫీసర్ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఇవి జీహెచ్ఎంసీలో కలవడంతో వీరి సేవల నుంచి ఉపసంహరించుకోనున్నారు. ప్రజాభిప్రాయం అవసరమా ? గతంలో గ్రామపంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే వాటిని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో విలీనం చేయడం తెలిసిందే. ఇప్పుడు వాటిని జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారు. వీటికి ప్రజాభిప్రాయ సేకరణ అవసరమని కొన్ని వర్గాలు చెబుతుండగా, గ్రామపంచాయతీలను యూఎల్బీల్లో విలీనం చేసినప్పుడే ఆ ప్రక్రియ కూడా మమ అనిపించారని కొందరు చెబుతున్నారు. రైతులకు ఇబ్బంది కలిగించొద్దు ఆదాయ వనరులు, రికార్డుల సేకరణపై కసరత్తు ఉద్యోగులు, సిబ్బంది లెక్కలు తేల్చే పనిలో పురపాలకశాఖ కార్పొరేషన్ల సంఖ్యను బట్టి వార్డులు, సర్కిళ్ల పునర్విభజన విలీన మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు తెరఅదనపు కలెక్టర్ చంద్రారెడ్డి -
నగర విస్తరణ.. నేతల అచేతన!
హైదరాబాద్ మహా నగర ఖ్యాతిని విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్న పురపాలక సంఘాలను జీహెచ్ఎంసీలోకి విలీనం చేసింది. నగర పౌరులుగా మారామన్న ఆనందం ఓవైపు అయితే, పన్నుల భారంతో అవస్థలు పడతామని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు స్థానిక నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మారుతామని నిరాశలో కూరుకుపోతున్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ ఒకప్పుడు కుగ్రామం. కనీసం ఆ ఊరికి బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. ప్రస్తుతం ఆదిబట్ల అంటే హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనం. మినీ గచ్చిబౌలిగా పేరు గాంచింది. ఐటీ సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ఆదిబట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకురావడంతో అభివృద్ధి పరుగులు పెట్టింది. అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంలో ఆదిబట్లగా పేరు ప్రఖ్యాతలు పొందింది. 2018లో మున్సిపాలిటీగా ఏర్పాటు ఆదిత్యనగర్ కాస్త స్థానిక నేతల చొరవతో ప్రత్యేక గెజిట్ తీసుకొచ్చి ఆదిబట్లగా పేరు మార్చారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఆదిబట్లను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఇబ్రహీంపట్నం మండలంలో భాగమైన ఆదిబట్ల పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. రాందాస్పల్లి, బొంగ్లూర్, కొంగరకలాన్, మంగళ్పల్లి, ఎంపీపటేల్గూడ, ఆదిబట్లలను కలుపుతూ 15 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 15,453 మంది జనాభా ఉంది. ప్రస్తుతం 20 వేలు దాటింది. 2020 జనవరి నెలలో పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. మొదట చైర్పర్సన్గా కొత్త ఆర్తిక, వైస్ చైర్పర్సన్గా కోరె కళమ్మ పని చేశారు. తదనంతరం 2024 ఏప్రిల్ 6న జరిగిన ఉప ఎన్నికల్లో చైర్మన్గా మర్రి నిరంజన్రెడ్డి, వైస్ చైర్మన్ కమాండ్ల యాదగిరి ఎన్నికయ్యారు. ఇక రాజకీయ నిరుద్యోగమే ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో వీలినం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆదిబట్లలో నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు. మహా నగరంలో కలిస్తే కార్పొరేటర్గా పోటీ చేసేందుకే అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కువ ఓటర్లకు కలిపి ఒక వార్డును ఏర్పాటు చేస్తారు. దీంతో రాజకీయ ఆశావహులకు భంగపాటు తప్పదు. ఇప్పటివరకు ఆదిబట్ల నుంచే అత్యధికంగా పని చేసిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా పాశం లక్ష్మీపతిగౌడ్, మర్రి నిరంజన్రెడ్డి, భూపతిగళ్ల మహిపాల్, డొంకని పద్మ, పొట్టి అయిలయ్య పని చేశారు. 15 వార్డుల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉండేది. కానీ జీహెచ్ఎంసీలో వీలినం కావడంతో ఇబ్బందులు తప్పదు. జీహెచ్ఎంసీలో ఔటర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం స్థానికంగా పెరగనున్న రాజకీయ నిరుద్యోగులు పూర్తిగా అభివృద్ధి కాకముందే కలపడంపై మిశ్రమ స్పందన పన్నుల భారం మోపొద్దని ప్రజల విజ్ఞప్తులు మరింత అభివృద్ధి ఆదిబట్ల మున్సిపాలిటీ అస్తిత్వం దెబ్బతీయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా కృషి చేస్తాం. జీహెచ్ఎంసీలో విలీనంతో మరింత అభివృద్ధి చెందుతుంది. కొంత పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతుంది. – నిరంజన్రెడ్డి, మాజీ చైర్మన్, ఆదిబట్ల ప్రజలపై భారం వేయొద్దు ప్రజలపై భారం వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇంటి అద్దెలు, నల్లా బిల్లు లు, వివిధ రకాల పెంచితే సహించేది లేదు. పూర్తిగా అభివృద్ధి కాకముందే విలీనం చేయడం తగదు. ఇంకో దఫా మున్సిపాలిటీ ఉంటేనే బాగుండేది. – జంగయ్య, బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆదిబట్ల -
పొరపాట్లకు తావివ్వొద్దు
● పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి ● ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ జీవన్ పాటిల్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: పంచాయతీ ఎన్నికల్లో పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం ఆయన జిల్లా వ్యయ పరిశీలకులు ఆర్య, కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్ఓలు, పీఓ, ఏపీఓలకు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, నోడల్ అధికారులు అవసరమైతే వారి కార్యాలయం నుంచి లేదా ఇతర సిబ్బందిని సహాయకులుగా నియమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ప్రతిరోజు నివేదికలు పంపేలా ఎంసీసీ నోడల్ అధికారి పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఖరారైన తర్వాత వారి ఖర్చులకు సంబంధించిన వివరాలు, రిపోర్టులను వ్యయ నోడల్ అధికారి, బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ అధికారి చూడాలన్నారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మా నిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించే విధులు సంబంధిత అధికారి చూడాలని ఆదేశించారు. ఎక్కడా అలసత్వానికి తావివ్వొద్దని, ఎన్నికల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే నియమావళి ప్రకారం కఠిన చర్యలు తప్పవని ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, నోడల్ అధికారులు, ఆర్డీవోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నిఘా నేత్రాల కోసం ‘ఐస్’
రాజధానిలో ఉన్న సీసీ కెమెరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినవి, కమ్యూనిటీలు పెట్టిన వాటితో పాటు నేను సైతం పథకం కింద అమర్చినవి ఉన్నాయి. వీటిలో ఒక్కో రకం ఒక్కో విధమైన టెక్నాలజీతో కూడినవి. –సాక్షి, సిటీబ్యూరో ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో అనేకం పని చేయట్లేదు. కొన్ని నిత్యం మరమ్మతులకు లోనవుతున్నాయి. వీటిని గాడిలో పెట్టడానికి బయటి టెక్నీషియన్లపై ఆధారపడాల్సి వస్తోంది. సిటీలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు సైతం ఉన్నాయి. అయితే వీటి నిర్వహణను ప్రస్తుతం వేర్వేరు విభాగాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ కారణంగానే సమన్వయం సహా అనేక అంశాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిఘా నేత్రాల నిర్వహణకు ఎంపవరింగ్ యువర్ ఎవ్రీ డే సేఫ్టీ (ఐస్) పేరుతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలను ఒకే గొడుకు కిందికి తీసుకువస్తూ అడ్వాన్డ్స్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్ (ఏస్ఎస్జీపీ) పేరుతో ప్రత్యేక వ్యవస్థకు రూపమిచ్చారు. వీటిని సజ్జనర్ బంజారాహిల్స్లోని ఐసీసీసీలో గురువారం ఆవిష్కరించారు. ఏస్ఎస్జీపీలో ఉండే, ఉండబోయే విభాగాలు ఇలా... టెక్నాలజీ డ్యూ డిలిజెన్స్ టీమ్: నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసే సీసీ కెమెరాలతో పాటు సంబంధిత పరికరాల్లో యూనిఫామిటీ సాధించడం కోసం పని చేస్తుంది. ఇందులో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానాలను అధ్యయనం చేస్తూ నగర అవసరాలకు అనుగుణంగా మారుస్తుంది. ప్రధాన, ప్రతిష్టాత్మక టెక్నాలజీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలను కనిపెడుతుంది. కెమెరా సపోర్ట్ కాల్ సెంటర్: సీసీ కెమెరాల కోసమే ప్రత్యేకంగా ఈ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది క్షేత్రస్థాయిలో సీసీ కెమెరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పని చేస్తుంది. దర్యాప్తు అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు ఇస్తుంది. సీసీ కెమెరాల పని తీరుపై వచ్చే ఫిర్యాదులతో పాటు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే వారి వినతుల్నీ స్వీకరిస్తుంది. ఐస్ టీమ్స్: ఏదైనా సీసీ కెమెరాలో లోపం గుర్తించిన వెంటనే దాన్ని సరి చేయడానికి అంతర్గతంగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి జోన్కు రెండు చొప్పున ఈ బృందాలు ఉండగా తొలి దశలో వీటి కోసం పది ద్విచక్ర వాహనాలు, నాలుగు తేలికపాటి వాహనాలతో పాటు ఓ క్రేన్ను కేటాయించారు. వీళ్లు అవసరమైతే ఆయా కాంట్రాక్టర్లతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తారు. స్టోర్స్ అండ్ రిపేర్ సెంటర్: ప్రతి మరమ్మతుకు బయటి వారిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా కమిషనరేట్ కేంద్రంగా ఏర్పాటు చేసిన కేంద్రం ఇది. లోపాలు ఉన్న సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్సులు తదితరాలకు ఇవి మరమ్మతులు చేస్తాయి. వీరికి అవసరమైన ఉపకరణాలు, స్పేర్ పార్ట్స్ సరఫరా చేయడానికి స్టోర్స్ టీమ్ సిద్ధంగా ఉంటుంది. సీఎస్సార్ డెస్క్: హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్తో (హెచ్సీఎస్సీ) కలిసి సిటీ పోలీసులు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్ని సంప్రదిస్తుంటుంది. వారి నుంచి సీఎస్సార్ నిధులు పొంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. దీనికోసం ‘అడాప్డ్ ఎ కెమెరా’, ‘షేర్ ఎ లైవ్ ఫీడ్’ పేరుతో స్కీములు ఉన్నాయి. డేటా అనలిటిక్స్ టీమ్: వీరి వద్ద ఓ రియల్ టైమ్ డ్యాష్ బోర్డ్ ఉంటుంది. దర్యాప్తు అధికారులతో పాటు కీలక సందర్భాల్లో అవసరమైన ఫీడ్ ఇస్తుంది. కేసుల దర్యాప్తుతో పాటు నేరాల నిరోధంలో తనదైన పాత్రను పోషిస్తుంది. అవసరమైన సందర్భాల్లో వీడియో ఎన్హ్యాన్స్మెంట్ తదితర కీలక బాధ్యతలూ ఈ బృందానికి ఉన్నాయి. ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేసిన సిటీ కొత్వాల్ -
చెరువులు, కుంటలు కాపాడండి
హైడ్రా కమిషనర్కు వినతి తుక్కుగూడ: జిల్లాలోని చెరువులు, కుంటలను కబ్జాదారుల చెర నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి కోరారు. బుధవారం ఆయన నగరంలోని హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో భూకబ్జాదారులు ఓఆర్ఆర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఇరిగేషన్కు సంబంధించిన భూముల్లో మట్టిపోసి పాత తేదీల్లో ఎన్ఓసీలు సృష్టించి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మివేస్తున్నారని ఆరోపించారు. వినతిపత్రంలో సంఘం నాయకులు కె.శ్రీనివాస్, విష్ణుమూర్తి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని విలువైన భూములు, జిల్లా ఆదాయంపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసిందని.. జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు నడుం బిగించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను, మేడ్చల్ జిల్లా మొత్తాన్ని ఏకపక్షంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. ఆర్థికంగా పరిపుష్టమై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శివారు ప్రాంతాలకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా మారిందన్నారు. ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికంగా పెను భారం తప్పని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ఇతర చార్జీలు అడ్డగోలుగా పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం, నల్లా కనెక్షన్, వీధి దీపాలు, డ్రైనేజీలు, రోడ్లు ఇలా ప్రతీ పనికి హైదరాబాద్ వైపు చూడాల్సి వస్తుందని చెప్పారు. నగర అభివృద్ధిని మూలన పడేసిన రేవంత్ సర్కార్ శివారు ప్రాంతాలను సైతం అధోగతిపాలు చేయడానికే ఈ విలీన ప్రక్రియ చేపట్టారని తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయం మీద మక్కువ ఉన్న కేసీఆర్ సాగుకు ఊతమిస్తే.. రియల్ ఎస్టేట్ మీద మక్కువతో రేవంత్ రెడ్డి భూముల అమ్మకం మీద దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజలంతా ఏకమై జిల్లాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దీక్షాదివస్కు తరలిరండి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 29న ఉదయం 10 గంటలకు శంషాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే దీక్షాదివస్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్ పాలనలో జిల్లా నంబర్ వన్గా ఎదిగితే రేవంత్ సర్కార్ హోల్సేల్గా అమ్మేందుకు దిగిందని మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు పంచుతోందని, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండగలకు రెండు సార్లు ఎగ్గొటిందన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లా అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, రైతు బంధు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, నాయకులు దేశమోల్ల ఆంజనేయులు, దండెం రాంరెడ్డి, నరేందర్, వేణుగోపాల్ రెడ్డి, బూర్కుంట సతీశ్, మోహన్ రావు, కృపేశ్, యాదగిరి, సురేందర్ రెడ్డి, దీపా మల్లేశ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.దీక్షాదివస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
సంగ్రామం షురూ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గురువారం 10.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రతీ రెండు మూడు గ్రామాలకు ఒక రిటర్నింగ్ కేంద్రాన్ని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ సహా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ను నియమించారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా షాద్నగర్, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలోని 174 గ్రామ పంచాయతీలు.. 1,530 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆయా స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావహులు ఉవ్విల్లూరుతున్నారు. పార్టీ గుర్తుతో సంబంధం లేకపోయినప్పటికీ.. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోటీ పడుతున్నారు. నామినేషన్ల సందర్భంగా ఆయా అభ్యర్థులు తమ మద్దుతుదారులతో ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆయా రిటర్నింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. కోడ్ అమలు: కలెక్టర్ నారాయణరెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల విధులను ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను పాటించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలను తొలగించాలని ఆదేశించారు. అలసత్వానికి అవకాశం ఇవ్వొద్దు ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అవసరమైన సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులను నిర్వహించామని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సరి చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఎక్కడైనా సదుపాయాలు లేకపోతే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. గడువులోపే పరిష్కరించాలి తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్, విద్యుత్, లైటింగ్ వంటి వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. రిజర్వేషన్ల జాబితాను మరోమారు పరిశీలించుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. అందుకు అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణతో ముడిపడిన అంశాలపై, నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను గడువు లోపు పరిష్కరించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, నోడల్ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ● నామినేషన్ వేసే వ్యక్తి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ● అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్ ఉదయం 10.30గంటల నుంచి 5 గంటల లోపు సమర్పించాలి. ● ప్రతిపాదకుడు సంబంధిత వార్డు ఓటర్ లిస్టులో నమోదై ఉండాలి. అభ్యర్థి గ్రామ ఓటరుగా నమోదై ఉండాలి. ● అభ్యర్థి, ప్రతిపాదకుడు ఇంటి పన్ను చెల్లించి గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ● డిపాజిట్ రుసుము సర్పంచ్ అభ్యర్థికి రూ.2 వేలు, వార్డుసభ్యుడికి రూ.500, రిజర్వుడు కేటగిరి సర్పంచి అభ్యర్థి రూ.వేయి, వార్డు అభ్యర్థికి రూ.250 ● ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.. లేదంటే నామినేషన్ ఫాంలోని పార్ట్–3లో డిప్యూటీ తహసీల్దార్తో సంతకం చేయించాలి. ● ఇద్దరు సాక్ష్యుల స్వీయ ధ్రువీకరణ పత్రంలో అన్ని గడులు పూరించి ఇవ్వాలి. ● రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్ పై సంతకం చేసి ఇవ్వాలి. ● అభ్యర్థి తన గుర్తింపు కార్డు కొరకు ఫొటో సమర్పించాలి. ● స్క్రుట్నీ రోజు నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట హాజరవాలి. ● నామినేషన్ దాఖలు చేసేవారు ఎన్నికల ఖర్చు లెక్క కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాల్సి ఉంది. తొలిదశ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఏడు మండలాలు.. 174 జీపీలు 1,530 వార్డులకు ఎన్నికలు రెండు మూడు జీపీలకు ఒక రిటర్నింగ్ ఆఫీసు ఏర్పాటుతొలి విడత ఎన్నికలు నిర్వహించే పంచాయతీలు మండలం జీపీలు వార్డులు కొత్తూరు 12 110 నందిగామ 19 170 కేశంపేట 29 260 కొందుర్గు 22 186 చౌదరిగూడ 24 204 ఫరూఖ్నగర్ 47 410 శంషాబాద్ 21 190తొలి విడత వివరాలు మొత్తం సర్పంచ్ స్థానాలు 174 వార్డులు, పోలింగ్ బూత్లు 1,530 నామినేషన్ల స్వీకరణ 27 నుంచి 29వ తేదీ వరకు స్క్రుట్నీ, అభ్యర్థుల గుర్తింపు నవంబర్ 30 అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 1 నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 3 తుది అభ్యర్థుల జాబితా డిసెంబర్ 3 పోలింగ్, ఫలితాల ప్రకటన డిసెంబర్ 11 -
కడ్తాల్కు మంత్రి సీతక్క
కడ్తాల్: శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వెళ్లిన మంత్రి సీతక్క బుధవారం హైదరాబాద్కు వెళ్తూ కడ్తాల్ మండల కేంద్రంలో ఆగారు. రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్ అలీ నివాసంలో అల్పాహారం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆసీఫ్ అలీ నివాసానికి చేరుకుని మంత్రి సీతక్కను సన్మానించారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మంత్రిని సన్మానించిన వారిలో నాయకులు మహేశ్, రాజేశ్క్యామ, జహంగీర్అలీ, అజ్గర్అలీ, ఇమ్రాన్బాబా, రజనీకాంత్, శివనాయక్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. -
తరిగేస్తున్నారు!
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం.. 24 గంటల్లో ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. కేంద్రం నిర్వాహకులు పెట్టే కొర్రీలకు ఇబ్బందులు పడలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. యాచారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం లేక వెలవెలబోతున్నాయి. ప్రారంభించి పక్షం రోజులైనా అంతంత మాత్రం ధాన్యమే వస్తోంది. వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1,40,238 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్ తదితర మండలాల్లో వరి పంటను అత్యధికంగా సాగు చేశారు. 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఆయా మండలాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వీటి నిర్వహణ కొనసాగుతోంది. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2,389, సాధారణ గ్రేడ్ క్వింటాల్కు రూ.2,369గా ధర నిర్ణయించారు. సన్నాలకు రూ.500 బోనస్ అదనం. కానీ ఆశించిన స్థాయిలో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం లేదు. నేటికీ జిల్లా వ్యాప్తంగా కేవలం 50 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు చేరింది. మిల్లర్లు తేమ శాతంతో సంబంధం లేకుండానే క్వింటాల్కు రూ.2,500కు పైగా చెల్లిస్తుండడంతో రైతులకు వారికే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఐకేపీ, డీసీఎంఎస్ సిబ్బంది లారీలతో పొలాల వద్దకే వెళ్లి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నందివనపర్తి కొనుగోలు కేంద్రానికి మంగళవారం ధాన్యం తీసుకెళ్లా. రోజంతా పడిగాపులున్నాం. ప్రైవేటు వ్యాపారులు పొలాలవద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కేంద్రాలకు తీసుకువచ్చి ఇబ్బంది పడుతున్నాం. – బౌరమ్మ, మహిళా రైతు, కుర్మిద్ద కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులను ఇబ్బంది పెట్టొద్దు. తూకం, తరుగు, హమాలీ ల మోసంతో ధాన్యం తెచ్చేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. దళారులకు, మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. – అంజయ్య యాదవ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం లేదనే సమాచారం ఉంది. మండల వ్యవసాయాధికారులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పరిశీలించాలని ఆదేశించాం. మోసం చేస్తున్నట్లు తేలితే తగు చర్యలు తీసుకుంటాం. – ఉష, జిల్లా వ్యవసాయాధికారి ఐకేపీ సెంటర్లలో తూకం, తరుగు, హమాలీ పేరిట కోత కొర్రీలు పెట్టడంతో ధాన్యం తెచ్చేందుకు రైతుల అనాసక్తి అధికశాతం మిల్లర్లకు, దళారులకే విక్రయం పక్షం రోజులు గడుస్తున్నా 50 వేల క్వింటాళ్ల వరి ధాన్యమే సేకరణ పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు మెండిగౌరెల్లికి చెందిన మేకల యాదగిరిరెడ్డి 93 బస్తాల ధాన్యాన్ని యాచారం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. కేంద్రం నిర్వాహకులు ఒక్కో బస్తాలో 43 కిలోల ధాన్యం నింపి మూడు కిలోల చొప్పున తరుగు తీశారు. బస్తాల్లో ధాన్యం నింపినందుకుగాను హమాలీలు క్వింటాల్కు రూ.50 చొప్పున 37 క్వింటాళ్ల ధాన్యానికి రూ.2 వేలు వసూలు చేశారని చెప్పాడు. తరుగు, తూకం, హమాలీ పేరుతో ఇలా దోపిడీ చేస్తే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా ఫలితం లేదని వాపోయాడు. -
ఎకరాకు రూ.కోటి ఇస్తే.. ఓకే
● లేదంటే భూ సేకరణ అడ్డుకుంటాం ● భూనిర్వాసితుల గ్రామసభలో మర్రిపల్లి రైతులు కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కొల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.కోటి నష్టపరిహారం అందించాలని.. లేదంటే భూమికి భూమి పరిహారంగా అందించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. రావిర్యాల–ఆకుతోటపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో మర్రిపల్లి గ్రామంలో భూసేకరణ, నష్ట పరిహారం, పునరావాసం, పునరుపాధి కల్పనకు భూ నిర్వాసితులతో బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) చంద్రారెడ్డి, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ జయశ్రీ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నష్టపరిహారానికి సంబంధించి గ్రామాల మధ్య పోలిక తగదు అన్నారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో భవిష్యత్లో అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. మర్రిపల్లిలో నిర్వాసితులకు రూ.30లక్షల పరిహారం, లేదంటే రూ.25 లక్షలతో పాటు, ఒక ప్లాట్ అందిస్తుందని చెప్పారు. పరిహారంతో ప్లాట్కూడా రాదు భూ నిర్వాసితులు మాట్లాడుతూ నష్టపరిహారం చెల్లించకుండా భూ సేకరణ చేపట్టడం ఎలా చేపడతారని ప్రశ్నించారు. మార్కెట్ ధర రూ.కోటిన్నర ఉండగా ఇరవై, ముప్పై లక్షల రూపాయలు కట్టించి తమ భూములు లాక్కోవడం తగదన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో తమ గ్రామంలో ఒక ఇంటి స్థలం కూడా కొనలేమన్నారు. న్యాయమైన పరిహారం ఇస్తే భూములిస్తామని లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నారాయణ, జంగయ్య, శ్రీరాములు, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రాజ్యాంగం పవిత్ర గ్రంథం
షాద్నగర్రూరల్: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదని జిల్లా అదనపు జడ్జి స్వాతి రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం షాద్నగర్ కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠికను చదివించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు జడ్జి స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్య్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు రాజ్యాంగం ఎంతో ఉపయోగపడిందన్నారు. వ్యక్తిగత గౌరవం జాతి ఐక్యతను, అఖండతను రాజ్యాంగం సంరక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళి రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకొని బుధవారం పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ తాలూక అధ్యక్షుడు సురేందర్, పట్టణ అధ్యక్షుడు అనిల్, నాయకులు బాదేపల్లి సిద్దార్థ, జాంగారి రవి, నాగి సాయిలు, కృష్ణయ్య, అంతయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా అదనపు జడ్జి స్వాతి రెడ్డి -
జేసీబీని ఢీకొట్టిన పెళ్లి కారు
● బెలూన్లు ఓపెన్ కావడంతో నూతన వధూవరులకు తప్పిన ప్రమాదం ● నలుగురికి స్వల్పగాయాలు చేవెళ్ల: నూతన వధూవరులతో వెళ్తున్న పెళ్లి కారు రోడ్డుపై ఆగి ఉన్న జేసీబీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూతన దంపతులతో పాటు మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని దేవునిఎర్రల్లి స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రావుపల్లికి చెందిన జ్యోతి, వెంకటేశ్ల కూతురు అనూష(లక్ష్మీప్రియ)కు మొయినాబాద్ మండలపరిధిలోని నాగిరెడ్డిగూడకు చెందిన శివకుమార్తో చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం వివాహమైంది. సాయంత్రం 6.30 గంటలకు వధువు ఇంటికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలోని దేవునిఎర్రవల్లి బస్స్టేజీ వద్ద ఓ బొలెరో వాహనం పాడవడంతో దాన్ని బాగు చేసేందుకు జేసీబీని తీసుకువచ్చి పెట్టారు. చీకట్లో వాహనాలు కనిపించకపోవడంతో పెళ్లి కారు వేగంగా జేసీబీని వేగంగా ఢీకొట్టింది. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చేవెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్లైవుడ్ వర్కర్ అదృశ్యం
పహాడీషరీఫ్: పని నిమిత్తం బయటికి వెళ్లిన యువకుడు కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన టి.రమణ కుమారుడు సాంబశివరావు(22) ఫ్లైవుడ్ వర్క్ చేస్తుంటాడు. ఒక్కోసారి 10–15 రోజులకు ఆర్డర్లపై బయటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే 45 రోజుల క్రితం పనికి వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. ఈ నెల 13వ తేదీనా తన మేన మరుదలకు ‘ఆదివారం వస్తాను.. ఇంట్లో చెప్పమని’వాట్సాప్లో సందేశం పంపాడు. అనంతరం స్విచ్ఛాప్ చేశాడు. ఈ విషయమై యువకుడి తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లోగానీ సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ముచ్చర్లలో తల్లీబిడ్డలు.. యాచారం: ఏడాది చిన్నారితో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. ఠాణా పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన భాగ్యమ్మ తన ఏడాది వయసున్న చిన్నారితో కలిసి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త శ్రీశైలం ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీటెక్ విద్యార్థిని బలవన్మరణం యాచారం: బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం మాల్లో చోటు చేసుకుంది. యాచారం ఎస్ఐ మధు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపల్లి సింధు(20) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గున్గల్ అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి రెండు రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు మాల్కు వచ్చింది. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిద్రలోనే వ్యక్తి మృతి మొయినాబాద్రూరల్: నిద్రలోనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నాగిరెడ్డిగూడకు చెందిన నరేశ్(30) మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఉదయం భార్య జ్యోతి లేపేందుకు యత్నించగా స్పందించలేదు. దీంతో ఆమె స్థానికుల సాయంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజ్యాంగాన్ని అనుసరించాలి
శంకర్పల్లి: భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని అందరూ అనుసరించాలని ఇక్ఫాయ్ లా స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ రవిశేఖర రాజు అన్నారు. బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇక్ఫాయ్ డీమ్డ్ వర్సిటీ లా స్కూల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులతో రాజ్యాంగంలోని విలువలు, విధులు సక్రమంగా పాటిస్తామని చెబుతూ ప్రతిజ్ఞ చేయించారు. ప్రొఫెసర్ రవిశేఖర రాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతీ పౌరునికి సమాన హక్కులను కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.పది లక్షలు పట్టుబడితే ఇన్కమ్ ట్యాక్స్కు..
రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్గౌతమ్ షాబాద్: పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్, నాకాబందీ, వాహనాల తనిఖీలు చేపడుతున్నామని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన షాబాద్ ఠాణా పరిధి లో ఐదు ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. ఎన్నికలలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధలన ప్రకారం రూ.పది లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామన్నారు. రూ.50వేల నుంచి రూ.పది లక్షల లోపు నగదు పట్టుబడితే కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కమిటీకి అందజేస్తామన్నారు. ఎన్నికల తర్వాత సరైన ఆధారాలు తీసుకువచ్చి డబ్బు తీసుకువెళ్లొచ్చన్నారు. ఈ తనిఖీల్లో రూ.లక్ష నగదు, నంబర్ ప్లేట్ లేని ఆరు వ ఆహనాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 26 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐలు రమేశ్, సతీశ్కుమార్ తదితరులున్నారు. -
దొంగల బీభత్సం
ఇబ్రహీంపట్నం రూరల్: దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదిబట్ల ఠాణా పరిధిలో బుధవారం గుర్తు తెలియని దుండగులు రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోనలి బొంగ్లూర్ రాఘవేంద్ర హోమ్స్లో మాడ్గుల మండలం అన్నబోయినపల్లికి చెందిన ఆమనగంటి శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం వారు వనస్థలిపురంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన పెద్ద కూతురు రిషిత ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేసిఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. బెడ్రూంలోని దాచిన ఏడు తులాల బంగారు నెక్లెస్, రెండు తులాల బంగారు చైన్లు, ఐదు గ్రాముల బ్రాస్లెట్, కూతురును విదేశాలకు పంపేందుకు దాచిన రూ.6 లక్షల నగదు, ల్యాప్టాప్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన శ్రీనివాస్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఎన్ఎస్ఆర్ నగర్లో.. ఎన్ఎస్ఆర్ నగర్లో ఓ ఇంటికి తాళం వేసి యజమానులు అమెరికా వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఎక్కడ ఏమి లభించకపోవడంతో ఇంట్లో ఉన్న వీదేశీ మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది. రాఘవేంద్ర హోమ్స్లో 9.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.6లక్షల నగదు, ఓ ల్యాప్టాప్ అపహరణ ఎన్ఎస్ఆర్ నగర్లో విదేశీ మద్యం బాటిళ్లు -
అయోధ్య ఆలయానికి మిథాని తయారు చేసిన కిటికీలు
సంతోష్నగర్: కంచన్బాగ్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థలో తయారైన భారతదేశపు తొలి టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిధాని అధికారులు తెలిపారు. మిధాని సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా వ్యూహాత్మక అనువర్తనాల కోసం టైటానియం మిశ్రమాలు సరఫరా చేస్తున్నప్పటికీ.. నిర్మాణ రంగంలో టైటానియం వినియోగం మొదటిసారన్నారు. వారసత్వ స్మారక కట్టడంలో నిర్మాణ పదార్థంగా టైటానియంను అమర్చిన భారతదేశపు తొలి సంస్థగా మిధాని నిలిచిందన్నారు. ఆలయ సముదాయంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగం తయారు చేసిన టైటానియం 31 కీటికీలను తయారు చేసి సరఫరా చేశామన్నారు. -
అత్యాచార నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన కొత్తూరు సీఐ నర్సయ్య ● కల్లు దుకాణాలు, లేబర్ అడ్డాల వద్ద జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచన కొత్తూరు: ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తూరు సీఐ నర్సయ్య తెలిపిన ప్రకారం.. కర్నూల్ జిల్లా బ్రహ్మణ్కూట్కూర్ మండలం బొల్లారంలో నివాసం ఉంటున్న నల్లబోతుల సలేశ్వరం(47) (నాగర్కర్నూల్ జిల్లా లింగాల స్వగ్రామం), కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలోని లక్ష్మీపల్లికి చెందిన ఎరుకలి లోకేష్ బంధువులు. వీరు ఈనెల 22న షాద్నగర్ సమీపంలోని బూర్గుల లేబర్ అడ్డా వద్ద పనికోసం వేచిఉన్న ఓ మహిళతో మాటలు కలిపారు. అనంతరం ఆమెను బైకుపై మున్సిపల్ పరిధిలోని కుమ్మరిగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బుధవారం కొత్తూరులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైకుపై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్కివానిగూడ వద్ద మహిళపై అత్యాచారం చేసి, ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయాన్ని అంగీకరించారు. సలేశ్వరంపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. కల్లు దుకాణాలు, లేబర్ అడ్డాల వద్ద కొత్తగా పరిచమయ్యే వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. కేసును ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సత్యశీలరెడ్డి, గోపాలకృష్ణ, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు. -
భవనం పైకెక్కి యువకుడి హల్చల్
● కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్తాపం ● పోలీసుల చొరవతో కిందికి దిగిన యువకుడు తుర్కయంజాల్: కుటుంబ సభ్యులతో నెలకొన్న మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ఐదంతస్తుల భవనం ఎక్కి హల్చల్ చేశారు. ఈ సంఘటన పురపాలక సంఘం పరిధి స్నేహపురి కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శుభం అనే యువకుడు అమెజాన్లో ఉద్యోగం చేస్తు ఉపాధి పొందుతున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓ భవనంపైకి ఎక్కి దూకుతానని బెదిరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అనిల్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, యువకుడికి నచ్చజెప్పి కిందికి దించారు. అనంతరం తన డిమాండ్లను పైపర్పై రాసిచ్చాడు. ఇదిలా ఉండగా శుభంకు మాటలు స్పష్టంగా రావని, చెవుడు కూడా ఉందని తెలిసింది. -
జీవనాధారాన్ని లాక్కోవద్దు
షాబాద్: జీవనాధారమైన భూములను గుంజుకుంటే ఎలా బతకాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బుధవారం మండలంలోని రేగడిదోస్వాడ, మక్తగూడ, తాళ్లపల్లి, వెంకమ్మగూడ గ్రామాల్లో పర్యటించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వం మీ భూములు తీసుకుంటుందని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే షాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేగడిదోస్వాడ సర్వేనంబర్ 102లో ఉన్న సుమారు 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని గత 70 ఏళ్లుగా సుమారు 600 మంది రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. జీవనాధారమైన భూములను లాక్కుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితిలోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. తహసీల్దార్ అన్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డెరెక్టర్ రాజారత్నం, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు రాములు, శ్రీనివాస్గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, నారాయణరెడ్డి, నాలుగు గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతుల నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు డైబ్బె ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వబోమని వెల్లడి -
పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం
తుర్కయంజాల్: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం పెంపొందాలని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గారెత్ విన్స్ ఓవెన్, మాజీ స్పెషల్ ఛీప్ సెక్రటరీ, యూఎన్ఏసీసీసీ నేషనల్ చైర్మన్ అజయ్ మిశ్రా అన్నారు. ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ గ్లోబలైజేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుర్కయంజాల్లోని సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇండస్ వ్యాలీ స్కూల్లో మంగళవారం నిర్వహించిన గ్రీన్ అవేర్నెస్ మాస్ ప్లాంటేషన్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండడంతో పాటు పలువురిని చైతన్యం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్టేట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ బి.ప్రభాకర్, టీటీడీ మాజీ జేఈఓ, ఐఏఎస్ రిటైర్డ్ డా.లక్ష్మీ కాంతం, ఈసీజీ ఫౌండేషన్ కోర్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠకు తెర.. రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉత్కంఠకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంతో పోలిస్తే బీసీలకు భారీగా అవకాశాలు తగ్గాయి. కొన్ని పంచాయతీలు శివారు మున్సిపాలిటీల్లో కలిసిపోవడం, కొత్త మున్సిపాలిటీలు ఏర్పడడంతో సుమారు వంద బీసీ సర్పంచ్ స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా, ఎస్టీ జనరల్కు 49, ఎస్టీ మహిళలకు 42 స్థానాలు కేటాయించారు. 55 ఎస్సీ జనరల్కు, 51 ఎస్సీ మహిళలకు, బీసీ జనరల్కు 50, మహిళలకు 42 స్థానాలు కేటాయించారు. ఇక అన్ రిజర్వ్డ్ కేటగిరీలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.బీసీ స్థానాలపై పెదవి విరుపుఆమనగల్లు మండలంలో 13 జీపీలు ఉండగా వీటిలో ఎస్సీ, ఎస్టీలకు ఏడు స్థానాలు రిజర్వ్ కాగా మిగిలిన వాటిని జనరల్కు కేటాయించారు. ఇక్కడ బీసీలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. కొత్తూరు, కడ్తాల్ మండలాల్లోనూ ఒకే స్థానంతో సరిపెట్టాల్సి వచ్చింది. ఆయా గ్రామాల్లో మెజార్టీ జనాభా బీసీలే ఉన్నప్పటికీ వారికి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల నిరసన వ్యక్తం చేశారు.వార్డుల కేటాయింపు ఇలా..జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉండగా వీటిలో వందశాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు/ మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీల్లో ఎస్టీ మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా, 522 స్థానాలు మహిళలు/ పురుషులకు కేటాయించారు. 379 స్థానాలు బీసీ మహిళలకు, మరో 549 బీసీ పురుషులు/మహిళలకు కేటాయించారు. అన్ రిజర్వ్డ్ కేటగిరీలోని మహిళలకు 983 స్థానాలు, పురుషులకు 1,122 స్థానాలు కేటాయించారు. -
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్
అబ్దుల్లాపూర్మెట్: అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ‘మైనింగ్ మాఫియా’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించారు. మట్టి మాఫియాపై కొరడా ఝళిపించారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కోహెడ రెవెన్యూ పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను సీజ్ చేశారు. మట్టి తరలింపునకు పాల్పడుతున్న నరహరి, సత్తయ్య, ఆనంద్ అనే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. -
రక్షణ కల్పించలేకపోతే ఆయుధాలివ్వండి
షాద్నగర్: పేదలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వానికి చేతకాకపోతే వారికి ఆయుధాలిచ్చి లైసెన్సులు జారీ చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఫరూఖ్నగర్ పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల దారుణహత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కులాంతర వివాహానికి సహకరించాడని దళితుడైన రాజశేఖర్ను దారుణంగా హతమార్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సమాజంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందులో బహుజన వర్గాల వారే చితికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి హోంశాఖను తన వద్దే ఉంచుకొని పేదలను కాపాడలేకపోతున్నారని, బహుజనులను రక్షించడం చేతకాకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరువు హత్య జరిగినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్డూరి లక్ష్మణ్ బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రాజశేఖర్ హత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యహరించి పోలీసులపై చర్యలు చేపట్టాలని అన్నారు. దిశ ఎన్కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నాయకులు కొందూటి నరేందర్, ఎంఎస్ నటరాజన్, లక్ష్మణ్ నాయక్, సత్యనారాయణ, పెంటనోళ్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ హత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి దిశ ఎన్కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని అన్మాస్పల్లి, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, ఆకుతోటపల్లి గ్రామాల రైతులతో సోమవారం ఎక్వాయిపల్లిలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న పలువురు రైతులు తమ గోడు వెలిబుచ్చారు. తాతల కాలం నుంచి సేద్యం చేసుకుంటూ బతుకుతున్నామని, ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తే ఎక్కడికి వెళ్లి బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా కోల్పోతున్న భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని, లేని పక్షంలో కొంగరకలాన్, రావిర్యాలలో ఇచ్చినట్లు పరిహారం ఇవ్వాలని కోరారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు ప్రారంభమయ్యే రావిర్యాల నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు ఒకే విధమైన పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామని, న్యాయమైన పరిహారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ సుజాత, మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ పాల్గొన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి -
బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు
తాండూరు రూరల్: బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే ఉండదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దేముల్ మండలం మంబాపూర్లో 30 అడుగుల బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. లిక్కర్ కేసులో మేం మాజీ ఎంపీ కవితను లోపల వేశామని.. కాంగ్రెస్కు దమ్ముంటే ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, ఇతర కుంభకోణాల్లో కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయన్నారు. భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ సమావేశానికి అప్పటి సీఎం కేసీఆర్ బస్సులు పంపారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి భారీగా నిధులు ఇస్తోందని తెలిపారు. ఆవాస్ యోజన కింద తెలంగాణకు నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేస్తోందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రూ.13 కోట్లు వెచ్చించి 200 సీసీ రోడ్లు వేశామని పేర్కొన్నారు. దేశానికి బీజేపీ అవసరం ఉంది దేశానికి బీజేపీ అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. బిహార్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని చెప్పారు. దేశ ప్రజలు ప్రధాని మోదీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ స్ఫూర్తిలో దేశం ఐక్యత సాధిస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో డీ లిమిటేషన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరగవచ్చని అన్నారు. రెండు వారాల క్రితం గుండె చికిత్స చేయించుకున్న ఆయన మొదటి సారి జిల్లాకు వచ్చారు. ప్రహ్లాద్రావే.. జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం పార్టీ జిల్లా ఇన్చార్జ్గా వ్యహరిస్తున్న ప్రహ్లాద్రావును జిల్లా అధ్యక్షుడిగా అనుకోవాలని ఎంపీ కొండా అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలో దింపాలన్నారు. కార్యకర్తలే బీజేపీ బలమన్నారు. కార్యక్రమంలో పార్టీ వికారాబాద్ ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్కుమార్, నాయకులు వడ్ల నందు, శ్రీధర్రెడ్డి, కృష్ణ, రాంచెందర్, వీరారెడ్డి, రాజు, శాంతుకుమార్, లలిత, సాహు శ్రీలత, వీరేశం, సందీప్, ఆంజనేయులు, వడ్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. మేం కవితను లోపల వేశాం కాంగ్రెస్కు దమ్ముంటే కేటీఆర్ను జైల్లో పెట్టాలి సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మంబాపూర్లో 30 అడుగుల బీజేపీ జెండా ఆవిష్కరణ -
ప్రజావాణి అర్జీలను
నిర్లక్ష్యం చేయొద్దుఇబ్రహీంపట్నం రూరల్: వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 8, ఇతర శాఖలకు సంబంధించి 32 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్ఓ సంగీత పాల్గొన్నారు. నాదర్గుల్ రైతుల ఆందోళన బాలపూర్ మండలం నాదర్గుల్ సర్వే నంబర్ 197లో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా మార్పిస్తామని సైదాబాద్కు చెందిన రాజ్కుమార్, కౌండిన్య కుమార్ నకిలీ ఎన్ఓసీ సృష్టించి 200 మందిని మోసం చేశారని బాధిత రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అవగాహన భవన నిర్మాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3వ తేదీ వరకు భవన నిర్మాణ కార్మికుల కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కార్మిక శాఖ, యూనియన్లు, కాంట్రాక్టర్లు, స్థానిక సంస్థలు సమష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీత, అసిస్టెంట్ లేబర్ అధికారి వినీల తదితరులు పాల్గొన్నారు. నేడు వడ్డీలేని రుణాల పంపిణీ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్హెచ్జీ) ఇందిరా మహిళా శక్తి కింద వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 16,518 సంఘాలకు రూ.17.02 కోట్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు రుణాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.కలెక్టర్ నారాయణరెడ్డి -
అస్తవ్యస్తంగా రిజర్వేషన్ల ప్రక్రియ
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మిన పాపానికి బీసీలను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని.. బీసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని, ఏటా రూ.20 వేల కోట్లు బీసీ సబ్ప్లాన్ కింద ఇస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో 23 శాతం కూడా ఇవ్వలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన స్థానాలు దక్కకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన సోమవా రం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీ పటేల్గూడ గ్రామానికి చెందిన బొమ్మ రాజు(35) ఇబ్రహీంపట్నం నుంచి తన స్వగ్రామానికి వెళుతున్నాడు. కళ్లెం జంగారెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో బైక్ అదుపు తప్పి కిందపడటంలో రాజు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మోసం చేసిన వారిపై కేసు నమోదు ఇబ్రహీంపట్నం రూరల్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని అమాయక ప్రజల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు. కుర్మల్గూడకు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్కుమార్ 36 మంది వద్ద ప్లాట్లు ఇప్పిస్తామని మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేయగా నిజం అని తేలింది. దీంతో ఇరువురిపై కేసు సోమవారం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు కేశంపేట: మండల పరిధిలోని బైర్కాన్పల్లి గ్రామ శివారులోని నిర్మల ఫాంహౌజ్లో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సీఐ నరహరి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ఎస్ఓటీలు కలిపి ఆకస్మికంగా సోమవారం దాడులు నిర్వహించారు. 13 మంది మూడు కార్డుల జూదం ఆడుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో 11 మంది పోలీసుల ఆధీనంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు సీఐ తెలిపారు. రూ.2,66,940 నగదు, 14 మొబైల్ఫోన్లతో పాటుగా 12 సెట్ల పేకాట కార్డులు లభించాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
కులవ్యవస్థను నిర్మూలించాలి
షాద్నగర్రూరల్: గ్రామాల్లో కులవ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల పరువు హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కులాంతర వివాహానికి సహకరించాడని దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ను దారుణంగా హత్య చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సమాజంలో కులవివక్ష హత్యలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులవివక్ష అనేది కరోనా కంటే ప్రమాదకరమైందన్నారు. కరోనాను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా ప్రచార చర్యలు చేపట్టాయో అదేవిధంగా కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడాలని కోరారు. ఎర్ర రాజశేఖర్ను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ, నాయకులు జాంగారి రవి, దొడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
కొడంగల్ రావాలె..
గొప్ప చదువుకు కొడంగల్: ‘గొప్ప చదువు చదవాలంటే కొడంగల్కు రావాలే.. రూ.5 వేల కోట్లతో విద్యా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నాం.. ఎడ్యూకేషన్, ఇరిగేషన్కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బొంరాస్పేట మండలం ఎన్కేపల్లి సమీపంలో సోమవారం అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇక్కడే రూ.103 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాలకు కేటాయించిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. సంఘం సభ్యులకు చెక్కులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. కొడంగల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 70 ఏళ్లపాటు ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైందని ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటి కోసం రూ.5 వేల కోట్లు వెచ్చించి ప్రత్యేక క్యాంపస్ నిర్మిస్తామని.. ఏడాదిన్నరలోపు పనులను పూర్తి చేస్తామన్నారు. కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. త్వరలో వికారాబాద్ – కృష్ణ రైల్వే లైన్ పనులు ప్రారంభించి మూడేండ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. క్రీడా ప్రాంగణం, ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్, కొడంగల్లోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. లగచర్లకు పారిశ్రామిక వాడ గుర్తింపు తెస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 312 పాఠశాలకు చెందిన 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటూ అమ్మలా ఆకలి తీరుస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ్మ, వాకిటి శ్రీహరి, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ స్నేహమెహ్ర, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గం ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్కు మొదటి ప్రాధాన్యత రూ.5 వేల కోట్లతో ప్రత్యేక క్యాంపస్ 70 ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఎన్కేపల్లి సమీపంలో అక్షయ పాత్ర కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
ఆమనగల్లు: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగే కార్యక్రమానికి వెళుతున్న ఆయనకు స్థానిక నేతలు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం రాంచందర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఉద్యమించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు విక్రమ్రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ, జిల్లా కౌన్సిల్ మెంబర్ లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్సింగ్, నాయకులు చెన్నకేశవులు, శీధర్, శ్రీనివాస్, రాఘవ, జగన్రెడ్డి, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. ఘన స్వాగతం కడ్తాల్: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు సోమవారం కడ్తాల్లో పార్టీ మండల అధ్యక్షుడు దోనాదుల మహేశ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, నాయకులు సాయిలాల్నాయక్, రవీందర్రెడ్డి, మాన్యనాయక్, శ్రీశైలంగౌడ్, భగీరథ్, వెంకటేశ్, సాయి ప్రభు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
రైతుల సంక్షేమానికి సంఘాలు కృషి చేయాలి
అబ్దుల్లాపూర్మెట్: రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు పని చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని వైఎన్నార్ గార్డెన్స్లో సోమవారం బాటసింగారం సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన 57వ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్మే మల్రెడ్డి మాట్లాడుతూ.. సంఘం పరిధిలోని రైతులకు కావాల్సిన సమయంలో రుణాలను అందించేందుకు సంఘం పాలకవర్గం, సిబ్బంది ముందుకు రావాలన్నారు. తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు. రుణాలను వసూళ్లు చేసే క్రమంలో రైతులను ఇబ్బందులకు గురి చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. సంఘం జమా ఖర్చులు, ఆడిట్ వివరాల నివేదికను సంఘం మేనేజర్ ఐలేష్యాదవ్ సభ్యులకు వివరించారు. సంఘం ద్వారా రుణాలు తీసుకుని సక్రమంగా వాయిదాలు చెల్లించిన 21 మంది రైతులను అభినందిస్తూ వారిని నగదుతో పాటు పురస్కారం అందించి సంఘం తరఫున సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, సంఘం వైస్చైర్మన్ నార్లకొండ మల్లమ్మ, డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, మహిపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, యాదిరెడ్డి, బాల్రెడ్డి, నర్సింహ, బాలనర్సమ్మ, లక్షమ్మ, రాములు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన
తుక్కుగూడ: మున్సిపల్ కేంద్రంలో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్టీపీ ద్వారా గృహ, వాణిజ్య, పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీరు శుద్ధి అవుతుందని అన్నారు. మురుగు నీటిలో హానికరమైన రసాయనాలు, దుర్వాసన, కాలుష్యాన్ని పూర్తిగా తొలగించడంలో ఎస్టీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణి, హెచ్ఎండబ్ల్యూఎస్ సీజీఎం సుజాత, డీజీఎం భానుచందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ లోన్ వేధింపులకు యువకుడి బలి
ఇబ్రహీంపట్నం: ఆన్లైన్ లోన్ నిర్వాహకులు పెట్టే వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ చందర్సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దండుమైలారం గ్రామానికి చెందిన అచ్చిన నవీన్(23) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని సిలింగ్ హుక్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటికే అతని సోదరి గుర్తించి ఇరుగుపొరుగు వారికి, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కిందికి దించారు. అప్పటికే నవీన్ మృతి చెందినట్లు గుర్తించారు. అతని మొబైల్ పరిశీలించగా ఆన్లైన్లో రుణాలు తీసుకున్నాడని.. దీంతో లోన్ నిర్వాహకులు సందేశాలు పంపి వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
మొయినాబాద్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ నెల 5వ తేదీలోపు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, నూతన యూనిఫాం, గుర్తింపు కార్డులు, సబ్బులు, నూనెలు, ఈఎస్ఐ కార్డు, పీఎఫ్ నంబర్ వంటి అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, మండల కన్వీనర్ ప్రవీణ్కుమార్, మున్సిపల్ గౌరవ అధ్యక్షుడు రత్నం, అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, సురేష్, కోశాధికారి కృష్ణ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్ -
సర్పంచ్ రిజర్వేషన్లపై ఆగ్రహం
బీసీలకు ఒక్కస్థానం కేటాయించలేదని నిరసన ఆమనగల్లు: గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆమనగల్లు మండలంలో ఉన్న 13 పంచాయతీలకు ఒక దాన్ని కూడా బీసీలకు కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారని పలు బీసీ సంఘాలు బ్యాక్ గ్రౌండ్ వ్యక్తం చేస్తున్నాయి. ఏ విధంగా చూసినా కనీసం రెండు గ్రామపంచాయతీలు అయిన బీసీలకు కేటాయిస్తారని ఎదురు చూశారు. కానీ రిజర్వేషన్ల చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం సర్పంచుల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ, జిల్లా కౌన్సిల్ మెంబర్ లక్ష్మణ్, నాయకులు శ్రీకాంత్సింగ్, చెన్నకేశవులు, శీధర్, శ్రీనివాస్, రాఘవ, జగన్రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బీసీలపై ఉన్న ప్రేమ ఇదేనా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఉన్న ప్రేమ ఇదేనా అని బీఆర్ఎస్ ఆమనగల్లు మున్సిపాలిటీ గౌరవధ్యక్షుడు చుక్క నిరంజన్గౌడ్ ప్రశ్నించారు. పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. 13 గ్రామ పంచాయతీలు ఉండగా బీసీలకు ఒకటి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. మండలంలో బీసీలకు రెండు గ్రామ పంచాయతీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పెద్దయ్యయాదవ్, వెంకటేష్, గణేష్, శివ, నిరంజన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంట పొలాల మీదుగా రోడ్డు వేయొద్దు
కొందుర్గు: తమ పంట పొలాల మీదుగా రోడ్డు వేయొద్దంటూ మండలంలోని చుక్కమెట్టు, ముట్పూర్, ఉమ్మెంత్యాల గ్రామాల రైతులు సోమవారం నగరంలోని హెచ్ఎండీఏ కార్యా లయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించే తమ భూములు తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. పచ్చని పంట పొలాల్లో రోడ్డు వేయడం ఏమిటని నిలదీశారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలని, లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. కార్యక్రమంలో రైతులు యాదయ్య గౌడ్, రాజు, చెన్న కేశవులు, నర్సింహారెడ్డి, కిష్టారెడ్డి, మల్లేష్, రామయ్య, రాములు, నర్సింలు, శివ తదితరులు పాల్గొన్నారు. కందుకూరు: అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వం నుంచి చీరలు తప్పకుండా అందుతాయని డీఆర్డీఓ శ్రీలత స్పష్టం చేశారు. మండల పరిషత్ సమావేశ హాల్లో సోమవారం ఏపీఎం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల్లోని సభ్యులందరితో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి యువతిని సంఘంలో చేర్పించి చీరలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీసీ సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, వైస్ చైర్మన్ యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, డీపీఎం యాదయ్య, సీసీలు, వీఓఏలు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: తిరుపతిలోని అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా సరూర్నగర్కు చెందిన రావిరాల సంధ్యారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం తిరుపతిలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ధర్మకర్తలను ఎన్నుకున్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం నేతల ఆధ్వర్యంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. తనకు అవకాశంకల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో కొలువైన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని సోమవారం బిగ్బాస్ ఫేం, సినీ నటి దివి దర్శించుకున్నారు. శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆమెకు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరకత శివాలయంలోని ప్రశాంతత, శివ నామస్మరణ తనకి ఎంతో నచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు, అర్చకుడు ప్రమోద్, సభ్యుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అరుణాచలక్షేత్రానికి ప్రత్యేక బస్సు
షాద్నగర్: తమిళనాడులోని సుప్రసిద్ధ శైవక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణకు వీలుగా షాద్నగర్ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మిక యాత్రగా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. డిపో నుంచి వచ్చేనెల 3న (బుధవారం) ప్రత్యేక బస్సును కేటాయించారు. సాయంత్రం 7 గంటలకు డిపో నుంచి బస్సు బయలుదేరుతుంది. 4వ తేదీ ఉదయం 4గంటలకు కాణిపాకం చేరుకొని అక్కడ దేవాయలం దర్శనం అనంతరం గోల్డెన్ టెంపుల్కు చేరుకుంటుంది. దర్శనం తర్వాత రాత్రికి అరుణాచలం బయలుదేరుతుంది. 5న శుక్రవారం పౌర్ణమి రోజున భక్తులకు గిరి ప్రదక్షిణ ఉంటుంది. స్వామి దర్శనం తర్వాత అదే రోజు సాయంత్రం 5గంటలకు తిరుగు ప్రయాణమై 6న ఉదయం షాద్నగర్ డిపోకు చేరుకుంటుంది. బస్సు చార్జీలు ఇలా.. పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 టికెట్ ధర నిర్ణయించారు. వసతి, ఫలహారం, భోజనం ఖర్చులు ఎవరికి వారే భరించుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు షాద్నగర్ డిపోలోని రిజర్వేషన్ కౌంటర్లో లేదా 99592 26287, 91826 95281 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. డిసెంబర్ 3న షాద్నగర్ డిపో నుంచి.. అరుణాచలం క్షేత్రానికి డిసెంబర్ 3న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడిపిస్తున్నాం. రిజర్వేషన్ కౌంటర్లో టికెట్లు తీసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఉష, డిపో మేనేజర్, షాద్నగర్ -
విద్యుదాఘాతానికి వలసజీవి బుగ్గి
నందిగామ: ఐరన్ పరిశ్రమలో ఫర్నేస్(వస్తువులను వేడి చేసే పరికరం) వద్ద పైపును శుభ్రం చేస్తుండ గా విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన కొత్తూ రు మండల కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ గోపాలకృష్ణ కథనం ప్రకారం.. బిహా ర్ రాష్ట్రం కై మూరు జిల్లా కుక్కురాద్ గ్రామానికి చెందిన రమేశ్ పాండే(41) తన కుటుంబ సభ్యులతో కలిసి 15 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం కొత్తూరుకు వలస వచ్చారు. అప్పటి నుంచి స్థానిక వినాయక స్టీల్ పరిశ్రమలో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 8 గంటలకు యథావిధిగా విధులకు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పరిశ్రమలోని ఫర్నేస్ ఆగిపోవడంతో అక్కడి కాయిల్ వద్ద తోటి కార్మికులు అజిత్ కుమార్, సంతోష్ కుమార్, శంభూ యాదవ్లతో కలిసి రమేశ్ పాండే పైపును శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో అతడి శరీరం ఒక్కసారిగా కాలిపోవడంతో తోటి కార్మికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు యజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. -
మత్తు వదలరా!
షాబాద్: యువత మత్తుకు బానిస అవుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా బానిస అవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో తమ బంగారు భవిష్యత్ను చేజేతులా అంధకారంలోని నెట్టి వేసుకుంటున్నారు. అంతేకాకుండా కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నం అవుతున్నాయి. మత్తుకు బానిస అయిన వారికి అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో గ్రామసభల ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో గుట్కా నుంచి గంజాయి వరకు విచ్చల విడిగా వినియోగిస్తూ తమ జీవితలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో అధికారులు గ్రామాల బాట పట్టారు. మత్తు పదార్థాలు వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. గంజాయి, గుట్కా, తంబాకు, మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతూ కటాకటాల పాలవుతున్నారు. మత్తుతో కలిగే అనర్థాలు ● మత్తు పదార్థాలు తాగడంతో ఏం చేస్తున్నామో తెలియక అత్యాచారాలు, అఘాయిత్యాలు చేస్తున్నారు. ● తాగి వాహనడం నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ● చిరాకు, కోపం ఎక్కువై కుటుంబాల్లో కలహాలు ఏర్పడుతున్నాయి. ● ఆరోగ్యం క్షీణించి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ● అధిక మత్తు పదార్థాలైన డైజోఫాం కలిపిన కల్లు తాగి మతి స్థిమితం కోల్పోతున్నారు. గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు యువత సన్మార్గంలో నడవాలని సూచన -
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
పహాడీషరీఫ్: చాంద్రాయణగుట్ట–పహాడీషరీఫ్ ర హదారికి మహర్దశ పట్టుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి(ఎన్హెచ్–765)పై ఆరు కిలోమీటర్ల పొడవులో నూతనంగా నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భారత జాతీయ రహదారుల అధికార సంస్థ అంగీకరించింది. నగరం నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డు వరకు గతంలో రెండు వరుసలుగా మాత్రమే ఉండేది. దీన్ని జాతీయ రహదారిగా గుర్తించి 2015–16 మధ్యకాలంలో తుక్కుగూడ నుంచి ఘాట్ రోడ్డు వరకు విస్తరించారు. కానీ పహాడీషరీఫ్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మాత్రం విస్తరించకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఈ రోడ్డు విస్తీర్ణ విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపడంతో ఎట్టకేలకు విస్తరణకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల నేషనల్ హైవే అధికారులతో కలిసి ఈ రహదారిని ఆమె పరిశీలించారు. నిబంధనలతో నిర్మాణం చాంద్రాయణగుట్ట నుంచి పహాడీషరీఫ్లోని బైపాస్ రోడ్డు వరకు 5.7 కిలోమీటర్ల పొడవులో ఈ రహదారి నిర్మాణం జరగనుంది. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ను మొదలుకొని సీఆర్పీఎఫ్, జల్పల్లి మున్సిపాలిటీలోని ఎర్రకుంట, షాహిన్నగర్, జల్పల్లి కమాన్ మీదుగా బైపాస్ రోడ్డు వద్ద ముగియనుంది. ఈ రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు కలిగి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కారిడార్గా నిర్మాణం చేయనున్నారు. నాలుగు లేన్ల రోడ్డు, మధ్యలో సెంటర్ డివైడర్, కిరువైపులా వర్షపు నీరు, వ్యర్థ జలాలు వెళ్లేలా బాక్స్ డ్రెయిన్లు, ఇనుప జాలీ ఏర్పాటు చేసి జాతీయ రహదారి నిబంధనలతో పూర్తిస్థాయిలో పటిష్టంగా నిర్మాణం చేయనున్నారు. విస్తరిస్తే మేలు నగరం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీశైలం, తుక్కుగూడ, కందుకూర్, ఆమనగల్లు, కల్వకుర్తి, అచ్చంపేట లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఈ రూట్లో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇరుకు రోడ్డు, గోతులమయం, ఆపై మురుగునీరు పారుతుండడంతో వాహనదారులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. గోతుల వద్ద తరచూ ట్రాఫిక్ స్తంభించిపోతుండడంతో ఒక్కోసారి విమాన ప్రయాణికులు సకాలంలో చేరుకోలేక ఫ్లైట్ మిస్ అయిన సందర్భాలున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు పహాడీషరీఫ్ వరకు రా వడం ఒక ఎత్తైతే.. పహాడీ నుంచి చాంద్రాయణగుట్టకు చేరుకోవడం మరో ఎత్తుగా మారింది. ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డును విస్తరిస్తే ఎంతో మందికి మేలు జరగనుంది. ఎర్రకుంట–పహాడీషరీఫ్ రహదారికి మహర్దశ రోడ్డు విస్తరణకు ఎన్హెచ్ఏఐ అంగీకారం రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులు -
మైనింగ్ మాఫియా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొంత మంది తవ్వకాలు చేపడుతుంటే.. మరికొంత మంది తాత్కాలిక అనుమతుల పేరుతో అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపడుతున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ, మున్సిపల్, మైనింగ్, పోలీసు యంత్రాంగాలు కళ్లప్పగించి చూస్తున్నాయే కానీ.. అక్రమ మైనింగ్ను మాత్రం అడ్డుకోవడం లేదు. గనుల లీజు, అనుమతి ఫీజులు, రాయల్టీల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో భారీగా గండిపడుతోంది. మైనింగ్ తవ్వకాలపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లా మైనింగ్ విభాగం అధికారులు ఇటీవల ఇబ్రహీంపట్నం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, పహడీషరీఫ్, ఆదిబట్ల తహసీల్దార్లతో పాటు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడం గమనార్హం. అడ్డుకోవాల్సిన పోలీసులు ఒక్కో లారీ యజమాని నుంచి రోజుకు రూ.30 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇచ్చేందుకు నిరాకరించిన వాళ్ల లారీలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. కోహెడను కొల్లగొట్టిన గనులు అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ సర్వే నంబర్ 167/2 ఓ ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొంది పెద్ద మొత్తంలో విల్లాలు కడుతోంది. సహజసిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలను చదును చేస్తోంది. అనుమతులు లేకుండా తవ్వకాలు, జిలిటెన్స్టిక్స్తో బ్లాస్టింగ్ పనులు చేపట్టి తవ్వకాల ద్వారా వచ్చిన మట్టి, కంకరను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది. మైనింగ్శాఖకు రాయల్టీ చెల్లించడం లేదు. పేలుళ్ల దాటికి పక్కనే ఉన్న బోరు బావులు దెబ్బతినడంతో పాటు విపరీతమైన శబ్దకాలుష్యం వెలువడుతోంది. క్రషర్ మిషన్ నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటీవల మైనింగ్ శాఖ ఏడీ నర్సిరెడ్డి అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం విశేషం. సదరు స్టేషన్ పోలీసులు చిన్నాచితక లారీలను సీజ్ చేసి, పెద్దలను వదిలేస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులకు మట్టి, కంకర, డస్ట్, ఇసుకను తరలిస్తున్నట్లు టిప్పర్లకు ముందు స్టిక్కర్లు అట్టించుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. సరూర్నగర్ మండలంలో.. మన్సూరాబాద్ (ఆటోనగర్) రెవెన్యూ సర్వే నంబర్ 38లో ఓ నిర్మాణ సంస్థ ఏడు ఎకరాల విస్తీర్ణంలో సెల్లార్ తవ్వకాలు చేపట్టింది. జిలెటెన్ స్టిక్స్తో బ్లాస్టింగ్ పనులు చేస్తుండటంతో పక్కనే ఉన్న ఇళ్లు, బోరు బావులు దెబ్బతింటున్నాయి. స్థానికులు మైనింగ్శాఖకు ఫిర్యాదు చేశారు. 1966 టీజీఎంఎంసీ రూల్స్(22/2)కు భిన్నంగా వ్యవహరించినట్లు గుర్తించారు. తీసుకున్న అనుమతులకు భిన్నంగా 35,726.38 మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వినట్లు లెక్కించి.. పదిరెట్లు అధికంగా రూ.77 లక్షలకుపైగా ఫెనాల్టీ వేసి నోటీసులు జారీ చేశారు. ఇక్కడి తవ్వకాలతో ప్రభుత్వానికి రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. అయినా తవ్వకాలు ఆపకపోవడంతో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, సరూర్నగర్ తహసీల్దార్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. హయత్నగర్ మండలం విజయవాడ ప్రధాన రహదారిపై సంగం హోటల్ ఎదురుగా భారీ అక్రమ సెల్లార్ తవ్వకంపై కూడా హయత్నగర్ తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్వరం మండలంలో.. శ్రీనగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 185,188,189లో ఓ మైనింగ్ కాంట్రాక్ట్ సంస్థ 10 వేల మెట్రిక్ టన్నుల తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు పొందింది. అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టడంతోపాటు రాయల్టీ ఎగ్గొట్టి ప్రభుత్వానికి నష్టాన్ని మిగిల్చింది. అక్రమ తవ్వకాలపై స్థానికులు ఇటీవల మైనింగ్శాఖకు ఫిర్యాదు చేయగా ఫెనాల్టీ విధిస్తూ నోటీసులతో సరిపెట్టారు. రాత్రి పూట గుట్టుగా చేపడుతున్న తవ్వకాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా మహేశ్వరం తహసీల్దార్, పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. ఇబ్రహీంపట్నం మంగళ్పల్లి సర్వే నంబర్ 313లోనూ అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. తీసుకున్న అనుమతులకు భిన్నంగా ఎక్కువ మొత్తంలో తవ్వకాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సర్వే నంబర్ 1146లోని ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఇదే అంశంపై ఇటీవల ఇబ్రహీంపట్నం తహసీల్దార్, పోలీసు స్టేషన్లలో మైనింగ్శాఖ అధికారులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అయితే లారీల సీజ్, కేసుల నమోదులో వివక్ష చూపుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది.. అక్రమార్కులు అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ కొండలను పిండి చేస్తున్నారు.. అటు పర్యావరణానికి హాని తలపెట్టడంతోపాటు ఇటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. డిటోనేటర్లతో యథేచ్ఛగా పేలుళ్లు అడ్డగోలుగా మట్టి, గ్రానైట్ తవ్వకాలు కొండలు, గుట్టలు మాయం భారీగా చెట్ల తొలగింపు పర్యావరణానికి తీవ్ర ముప్పు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న ఆయా శాఖల అధికారులు -
మొయినాబాద్లో ట్రాఫికర్
మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న షాపులు, హోటళ్ల ముందు పార్కింగ్ సరిగా లేక వాహనదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. షాపుల ముందు బడ్డీ కొట్లు ఏర్పాటు చేయడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో ప్రతి రోజు ప్రధాన చౌరస్తాతోపాటు హిమాయత్నగర్, అజీజ్నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అవుతోంది. దీన్ని పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం, పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. హిమాయత్నగర్ చౌరస్తా నుంచి అజీజ్నగర్ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్, టైల్స్ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్లపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాల ముందు ఖాళీ స్థలం ఎంత ఉంది.. పార్కింగ్ స్థలం ఉందా అనే విషయాలను పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ముందు ఉన్న స్థలాన్ని కబ్జాచేసి బడ్డీకొట్లకు అద్దెకిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. షాపుల ముందు అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా పట్టించుకోవడంలేదు. వీఐపీ రూట్గా ప్రకటించినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిని వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించారు. సీఎం కొడంగల్ వెళ్లాలంటే ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తన నియోజకవర్గం వికారాబాద్కు వెళ్లాలన్నా ఈ మార్గం నుంచే వెళ్లాలి. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికారాబాద్ వెళ్లి వస్తూ ఉంటారు. పోలీసులు వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించినప్పటికీ అందుకు తగ్గట్లు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఫొటోలు తీసి చలాన్లు వేసి.. ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడానికే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిత్యం ట్రాఫిక్ జాం అవుతున్నా క్లియర్ చేయకుండా రోడ్డుపక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్డుపక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ జాం షాపులు, హోటళ్ల ముందు పార్కింగ్ స్థలం కరువు రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులుషాపుల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్లపై నిలిపే వాహనాలకు చలాన్లు వేస్తున్నాం. షాపుల ముందు సామాన్లు పెట్టినా, బడ్డీకొట్లు పెట్టినా తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు సూచించాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. తగిన చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశం, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల -
కులదురహంకార హత్యలను అరికట్టాలి
షాద్నగర్రూరల్: ఎల్లంపల్లిలో జరిగిన కుల దురహంకార హత్యపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని సామాజిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద నుంచి ఎల్లంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. మృతుడి ఇంటివద్ద న్యాయవాది సంగమేశ్వర్ అధ్యక్షతన ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న కులదురహంకార హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి నిలువ నీడ లేదని, ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, మృతుడి భార్య వాణికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇవ్వాలన్నారు. మాదిగ ఐక్యవేదిక కన్వీనర్ దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఘటనపై విచారణ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తక్షణమే ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాట్లాడుతూ.. ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని అన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎల్లంపల్లికి రానున్నారని తెలిపారు. ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు భిక్షపతి మాట్లాడుతూ.. 11 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 142 కుల దురహంకార హత్యలు జరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో సామాజిక, ప్రజా సంఘాల నాయకులు రాజు, బోడ సామేల్, జగన్, శ్రీనునాయక్, బాదేపల్లి సిద్ధార్థ, జగదీష్, ఈశ్వర్నాయక్, చెన్నయ్య, శంకర్, శివ, అనిల్, జాంగారి రవి, సురేందర్, వెంకటయ్య, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక, ప్రజా సంఘాల నేతలు -
సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
● ఓఆర్ఆర్పై లారీని వెనుక నుంచి ఢీకొన్ని డీసీఎం ● ఒకరి దుర్మరణం, ఇద్దరికి తీవ్ర గాయాలు అబ్దుల్లాపూర్మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో వెనుక నుంచి వచ్చి డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందడంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ గుజ్జ గ్రామానికి చెందిన బంగారు సతీష్కుమార్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర గ్రామానికి చెందిన సూరజ్కుమార్రామ్, అజిత్ రామ్లు అదే మండలం నాగారం గ్రామానికి చెందిన రాచకొండ భిక్షం వద్ద కోళ్లు సరఫరా చేసే డీసీఎంపై ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున యాచారం నుంచి దమ్మాయిగూడకు కోళ్లను తీసుకుని వస్తుండగా మార్గమధ్యలో ఔటర్ రింగ్రోడ్డుపై గండిచెరువు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసి నిలిపివేశాడు. దీంతో అప్పటికే వేగంగా ఉన్న డీసీఎం లారీకి వెనుక భాగంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎంలో ప్రయాణిస్తున్న సూరజ్కుమార్ రామ్(34) క్యాబిన్లో ఇరుక్కుపోయి శరీరమంతా నుజ్జునుజ్జు అయి అక్కడిక్కడే మృతిచెందాడు. సతీష్కుమార్, అజిత్రామ్లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ వర్గీకరణను సవరించాలి
హుడాకాంప్లెక్స్: సుప్రీంకోర్టు సూచనకు విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టారని, మాలలకు అన్యాయం జరిగే వర్గీకరణను సవరించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం మాలల రణభేరి మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ల శాతం పెంచాలని, పెండింగ్లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 99 రోస్టర్ పాయింట్ల విధానంతో రాష్ట్రంలోని 40లక్షల మంది మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు ఏకమై 33 జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ అధ్యక్షుడు చేగూరి శంకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు మల్లేశ్వరి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య -
తలసీమియా బాధితులకు అండగా నిలవాలి
హుడాకాంప్లెక్స్: తలసీమియా బాధిత చిన్నారులకు అండగా నిలవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సరూర్నగర్లోని అమితాబ ఆదరణ విద్యాలయంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్తదానంతో ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. తలసీమియా బాధితుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభి నందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వివేక్ యాస్కి, సాకేత్ చిట్టిమల్ల, ఉపేందర్ గుప్తా, ప్రవీణ్, రాహుల్ గుప్తా, పారితాల సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బొంరాస్పేట: సీఎం రేవంత్రెడ్డి సోమవారం సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్, నారాయణ పేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్జైన్, సిక్తా పట్నాయక్, వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్ర, సీఎంఈఓ అధికారి వాసుదేవరెడ్డి తదితరులు ఎన్కేపల్లి గేటు సమీపంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్షెడ్ నిర్మాణ పనులకు సీఎం భూమిపూజ చేస్తారు. బొంరాస్పేటలో గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం, హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్, సైనిక్స్కూల్ నిర్మాణ పనులకు సామూహిక శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆదివారం భారీగా పోలీసులు మోహరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, సబ్కలెక్టర్ సుధీర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, డీపీఎం నర్సింలు తదితరులు పాల్గొన్నారు. హకీంపేట్లో ఏరియల్ సర్వే దుద్యాల్: సీఎం దుద్యాల్ మండలం హకీంపేట్లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించే అవకాశం ఉందని ఎడ్యుకేషన్ హబ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయభాస్కర్రెడ్డి తెలిపారు. ఆదివారం హకీంపేట్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హకీంపేట్ పర్యటన రద్దయిన నేప థ్యంలో హెలిక్యాప్టర్ నుంచి విద్యాలయాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ హబ్ డీఈఈ పీ రాజయ్య, ఏఈ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిగి: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆరోపించారు. లేబర్ కోడ్ల నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ఆదివారం పట్టణంలో కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. మోదీ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసి కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తోందని ఆరోపించారు. పెన్షన్, సహజ మరణాలకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
మహిళలను ఉన్నతస్థానంలో నిలుపుతాం
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు కోటి మందికి ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఆడపడుచులకు గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలు నిర్ణయించిన మోడల్ చీరలను పంపిణీకి ఎంపిక చేశామన్నారు. గ్రామ, మండల సమాఖ్య బాధ్యులు బాధ్యత తీసుకొని మహిళలకు చీరలు అందేలా చూడాలన్నారు. రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, బస్సుల కొనుగోలు వంటి వ్యాపారంలో మహిళా సంఘాలకు తోడ్పాటునిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నట్టు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, సన్నబియ్యం తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం, షాద్నగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వీరపల్లి శంకర్, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు -
కోడిపందేల స్థావరంపై ఎస్ఓటీ పోలీసుల దాడి
● 14 మంది అరెస్ట్ ● నాలుగు కార్లు, 13 మొబైల్స్, 22 కోళ్లు, 18 కోడి కత్తులు స్వాధీనం మొయినాబాద్ రూరల్: ఓ ఫాంహౌస్లో కోడి పందేలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. శనివారం రాత్రి మండల పరిధిలోని బాకారం సమీపంలో ఓ ఫాంహౌస్లో రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణం రాజు పాటు మరో 14 మందిని అరెస్ట్ చేశారు. నాలుగు కార్లు, 13 మొబైల్ ఫోన్స్, రూ.60,950 నగదు, 22 కోళ్లు, 18 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై మొయినాబాద్ పోలీసులను వివ రణ కోరగా వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్ వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్ నియమితులయ్యారు. శనివారం ఏఐసీసీ విడుదల చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో ఆయనకు చోటు లభించింది. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన గతంలో పలుమార్లు పెద్దేముల్ ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన భార్య తారాబాయి పెద్దేముల్ సర్పంచ్గా పనిచేశారు. 1988లో పెద్దేముల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పని చేశారు. 1995లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2001లో జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2012లో ఎఫ్ఏసీఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. డీసీసీబీ డైరక్టర్గా పనిచేశారు. 2019లో జెడ్పీటీసీగా గెలుపొందారు. 2022 నుంచి ఇప్పటి వరకు పీసీసీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జెడ్పీటీసీ సభ్యుల్లో ఆయనొక్కరే గెలుపొందారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యం నవాబుపేట: అర్హులైన ప్రతి మహిళకూ ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం నవాబుపేట ఎంపీడీఓ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిర రాజ్యంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తుండగా..
● వెనుక నుంచి ఢీకొట్టిన లారీ ● ఔటర్పై ఘటన..డ్రైవర్ మృతి శంషాబాద్ రూరల్: ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం చోటు చేసుకోగా కిందకు దిగి కారును పరిశీలిస్తుండగా..వెనక నుంచి గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ పట్టణానికి చెందిన కాముని భరత్(26) డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే పట్టణ వాసి వేముల శేఖర్ కుటుంబాన్ని కారులో తీసుకుని శనివారం తెల్లవారుజామున కొల్లాపూర్లోని సింగోటం ఆలయానికి బయలుదేరారు. వీరి కారు పెద్దగోల్కొండ టోలు గేటు తర్వాత ఔటర్పై తుక్కుగూడ వైపు వెళ్తుండగా..పక్క నుంచి వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొంది. దీంతో కారు కుడి వైపు టైరు, కారు దెబ్బతింది. ఈ ప్రమాదంతో కారు మొరాయించింది. అందులో ఉన్న డ్రైవర్ భరత్తో పాటు శేఖర్, అతని కూతురు బయటకు దిగారు. శేఖర్ భార్య శోభారాణి ఆరోగ్యం బాగాలేక కారులోనే కూర్చుంది. మొరాయించిన కారును భరత్ పరిశీలిస్తుండగా.. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని ఓ లారీ అతనితో పాటు కారును ఢీకొంది. తీవ్ర గాయాలైన భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న శోభారాణికి గాయాలవగా.. శేఖర్, అతని కూతురు తృటిలో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విహార యాత్రలో విషాదం
వండర్లాలో ఈత కొడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థి మృతి ఇబ్రహీంపట్నం రూరల్: తో టి విద్యార్థులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన విద్యార్థి మృతిచెందాడు. ఆదిబట్ల పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని బల్కంపేటకు చెందిన వేలంగి శివకుమార్ తేజ(13) అమీర్పేట్లోని నివేదిత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న విహార యాత్రలో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి రావిర్యాల సమీపంలోని వండర్లాకు వచ్చాడు. మధ్యాహ్న భోజనం అనంతరం వండర్లాలోని కొలనులో ఈత కొడుతూ పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని, వెంటనే అంబులెన్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. బాలుడి తండ్రి సునీల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
● దేవరంపల్లిలో ఘటన ● చేవెళ్ల పీఎస్లో కేసు నమోదు చేవెళ్ల: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని దేవరంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన అలుగారి సుమతమ్మ (66) ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది. ఆమె కొడుకు రాఘవేందర్రెడ్డి పిల్లల చదువుకోసం, షాబాద్ మండలం నాగరగూడలో అద్దెకు ఉంటున్నాడు. నిత్యం దేవరంపల్లికి వచ్చి, తల్లితో కలిసి, వ్యవసాయ పనులు చేసుకుని, సాయంత్రం నాగరగూడకు వెళ్తాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా, అచేతనంగా పడిపోయిన తల్లిని గమనించి, చుట్టుపక్కల వారి సాయంతో చేవెళ్ల ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సుమతమ్మ మెడలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు కనిపించకపోవడంతో ఆమె మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ బాధిత కుటుంబ సభ్యులు పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, క్లూస్ టీమ్తో వెళ్లి ఆధారాలు సేకరించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
నవజాత శిశువుల సంరక్షణకు చర్యలు అవసరం
షాద్నగర్: నవజాత శిశువుల సంరక్షణకు తల్లులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. జాతీయ నవజాత శిశువుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. శిశువు సంరక్షణలో తల్లుల పాత్ర కీలకమని అన్నారు. శిశువు పుట్టిన నాటి నుంచి కొన్ని నెలల పాటు తల్లి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నవజాత శిశువులకు ఏదైనా బాధ, అనారోగ్యానికి సంబంధించిన సంకేతాలు తల్లులు నిశితంగా పరిశీలించాలని సూచించారు. శిశువులకు వైద్య సంరక్షణ ఎంత ముఖ్యమో పోషణ సంరక్షణ సైతం అంతే ముఖ్యమని అన్నారు. మంచి ఆహారం అందించడం, చర్మాన్ని తాకడం, తల్లిదండ్రులు తమ బిడ్డతో మంచి బంధాన్ని ఏర్పర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా శిశువుల శరీరాన్ని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలని, శరీరాన్ని తడి గుడ్డతో తుడవాలని సూచించారు. శిశువు పుట్టిన 48 గంటలలోపు మలవిసర్జన చేయకపోతే తగినంత పాలు అందడం లేదని అర్థం చేసుకోవాలన్నారు. ఆరు నెలల వరకు శిశువులకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని, దీంతో రోగ నిఽరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాస్రెడ్డి, విజయలక్ష్మి, నస్రీన్, ఆంజనేయులు, విజయ్కుమార్ పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి -
‘గ్లోబల్ సమ్మిట్’ పనులు వేగిరం!
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో మీర్ఖాన్పేట వేదికగా నిర్వహించతల పెట్టిన ఈ సమ్మిట్కు ఫార్చూన్–500 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండడంతో..ప్రభుత్వం ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమెజాన్ డేటా సెంటర్కు సమీపంలో సర్వే నంబర్ 120లోని వంద ఎకరాల విసీ్త్రర్ణంలో ఇప్పటికే బ్లూ ప్రింట్ను సిద్ధం చేసింది. సమ్మిట్ సమయం సమీపిస్తుండటంతో అధికార యంత్రాంతం ఇప్పటికే భూమి చదను పనులు సహా ప్రధాన వేదికకు తూర్పు వైపున మూడు హెలిప్యాడ్ల పనులను ప్రారంభించింది. పది జేసీబీలతో విరామం లేకుండా పని చేయిస్తుంది. భద్ర తా పరమైన చర్యల కోసం సభాస్థలి చుట్టూ వందకుపైగా సీసీ కెమెరాలు, నిరంతరాయ విద్యుత్ సర ఫరా కోసం అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేసింది. సదస్సు నిర్వహించే ప్రదేశానికి వెళ్లే సింగిల్ లేన్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను కూడా ముమ్మరం చేసింది. ఒకటి రెండు రో జుల్లో ఈ రోడ్డు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. రోజుకో అధికారి సందర్శన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ‘తెలంగాణ విజన్ రైజింగ్–2047’ పేరుతో కందుకూరు మండలం మీర్ఖాన్పేట వేదికగా నిర్వహించబోతున్న ఈ సమ్మిట్ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 27 మంది ఉన్నతాధికారులతో తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో విభాగానికి ఒక్కో సీనియర్ ఐఏఎస్ను ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటికే వారంతా క్షేత్రస్థాయిలో పర్యటించి, విభాగాల వారీగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అధికారులు తాత్కాలిక డేరాల కింద కూర్చొని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఎఫ్సీడీఏ భవనం పుట్టింగ్ వర్క్ కొనసాగుతోంది. అదే విధంగా 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన స్కిల్ వర్సిటీ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక అంతస్తు పూర్తైంది. రెండో ఫ్లోర్ నిర్మాణంలో ఉంది. సమ్మిట్ నాటికి ఒక ఫ్లోర్ను అందుబాటులోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. శనివారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సహా సమ్మిట్ కో ఆర్డినేటర్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఉన్నతాధికారుల వరుస సందర్శనలతో ఆ ప్రాంతంలో హడావుడి నెలకొంది. మీర్ఖాన్పేటలో సందడే సందడి అమెజాన్ సమీపంలో వంద ఎకరాల్లో లెవలింగ్ పనులు షురూ... రోడ్ల విస్తరణ.. అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం తూర్పు వైపుమూడు హెలిపాడ్ల నిర్మాణం -
గో‘పాల’రత్న
బడంగ్పేట్: చిన్నప్పటి ను ంచి పాడిపశువులంటే ఆయనకు ఎంతో ఇష్టం.. ఆ ఇష్టంతోనే డెయిరీ ఫాం ఏర్పాటు చేశారు.. నిత్యం వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ నాణ్యమైన పాలను అందిస్తున్నారు.. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ‘జాతీయ గోపాలరత్న’ అవార్డుకు ఎంపిక చేసింది. నాగర్కర్నూల్ జిల్లాలో జన్మించిన కృష్ణారెడ్డి జియాలజీలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ పూర్తి చేసి హైదరాబాద్లోని జియాలజీ ఆఫ్ ఇండియాలో సీనియర్ జియాలజిస్టుగా పనిచేశారు. 2000 సంవత్సరంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. డెయిరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లో ఐదెకరాల్లో శ్రీకారం చుట్టారు. 100 గేదెలు, 50 ఆవులతో నిత్యం వెయ్యి లీటర్ల ఉత్పత్తి సాధిస్తూ నగరానికి నాణ్యమైన పాలను అందిస్తున్నారు. డెయిరీఫాంలో 50 మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి పశువులకు కృత్రిమ గర్భధారణ, వైద్యాన్ని అందిస్తూ వస్తున్నారు. 39 ఏళ్లుగా డెయిరీఫాం నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ నుంచి.. 73 ఏళ్ల వయసులోనూ కృష్ణారెడ్డి నిత్యం డెయిరీఫాంకు వెళ్లి పశువుల బాగోగులు చూస్తుంటారు. ఈ సేవనే జాతీయ గోపాలరత్న అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. కేంద్ర మత్స్య పశుసంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జాతీయ గోపాలరత్న–2025 (ఎన్జీఆర్ఏ) అవార్డులు ప్రకటించగా అందులో తెలంగాణ నుంచి కృష్ణారెడ్డి ఒక్కరే ఉండడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయన పలు అవార్డులు అందుకున్నారు. ఈనెల 26న జాతీయ పాల దినోత్సవం రోజున ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డిని పలకరించగా మూగ జీవాలకు సేవ చేయడంతో పాటు స్వచ్ఛమైన పాలను అందిచండంలో ఎంతో ఆనందం పొందుతున్నానని తెలిపారు. యువత డెయిరీ రంగాన్ని ఎంచుకోవాలని సూచించారు. జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కృష్ణారెడ్డి జాతీయ అవార్డుకు ఎంపిక కావడంపై నాదర్గుల్వాసులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డికి జాతీయ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈనెల 26న ప్రదానం రాష్ట్రం నుంచి ఒకేఒక్కరు -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
మహేశ్వరం: మహేశ్వరం జోన్ డీసీపీగా కె.నారాయణరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. తుక్కుగూడలోని డీసీపీ కార్యాలయంలో విధులు ప్రారంభించారు. ఆయనకు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఏసీపీలు, మహేశ్వరం, కందుకూరు, పహా డీషరీఫ్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీసీపీ మహేశ్వరం జోన్ పరిఽధిలోని ఏసీపీలు, సీఐలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమష్టిగా కృషి చేయాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో పని చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఏసీపీలు జానకిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఫేక్ ఓసీలు.. ఫోర్జరీలు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొంతమంది ప్రైవేటు విద్యుత్ కాంట్రాక్టర్లు ఇటు వినియోగదారులను, అటు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ను బురిడీ కొట్టిస్తున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల పేరుతో సృష్టించిన తప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ), ఫోర్జరీ సంతకాలతో కూడిన సీఈఐజీ అనుమతి పత్రాలు సమర్పిస్తూ మోసం చేస్తున్నా రు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు విషయం తెలిసీ పట్టించుకోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే పలు భవనాలకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి విద్యుత్ కనెక్షన్లు పొందినట్లు గుర్తించగా తాజాగా సరూర్నగర్ సర్కిల్ పరిధిలో ఫోర్జరీ సంతకాలతో కూడిన సీఈఐజీ అప్రూవల్ సర్టిఫికెట్ సమర్పించిన కాంట్రాక్టర్ ఉదంతం బహిర్గతమైంది. ప్రతి నెలా 35 వేల దరఖాస్తులు గ్రేటర్లో ప్రస్తుతం 65 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రతీ నెల 35 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిలో గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు, మల్టీ స్టోరేజీ బిల్డింగ్లు, పరిశ్రమలు ఉన్నాయి. ఆయా మల్టీస్టోరేజీ భవనాలకు తొలుత తాత్కాలిక కనెక్షన్లు జారీ చేస్తుంటారు. తర్వాత డిమాండ్ను బట్టి అంచనాలు రూపొందిస్తుంటారు. నిబంధనల ప్రకారం పది మీటర్ల ఎత్తు/ విద్యుత్ లోడు 25 కిలోవాట్లు మించి ఉన్న భవనాలకు కనెక్షన్ జారీ చేయాలంటే ముందు ఆ యా స్థానిక సంస్థల నుంచి ఆ క్యూపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) సమర్పించాల్సి ఉంది. తర్వాత డిస్కం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అంతర్గత లైన్లు, కేబుల్, ఏబీ స్విచ్, హెచ్జీ ఫ్యూజ్సెట్స్, కండక్టర్ సహా డీటీఆర్, ఇతర మెటీరియల్ వాడినట్లు సీఈఐజీ ధ్రువీకరించిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) సమర్పించాలి.అన్నీ సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న త ర్వాతే డిస్కం కనెక్షన్ రిలీజ్ చేస్తుంది.కానీ గచ్చిబౌలి టీఎన్జీఓ ఫేజ్–2కాలనీలో జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేని నాలుగంతస్తుల భవనానికి మీటర్లు జారీ చేశారు. ఇదే కాలనీలో పది మీటర్ల కంటే ఎత్తు నిర్మించిన భవనానికి సైతం ప్యానల్ బోర్డులు, మీటర్లు జారీ చేశారు. కంచగచ్చిబౌలిలో రెండు భవనాలకు, నానక్రాంగూడలోని మరో భవనానికి ప్యానల్బోర్డులు, డీటీ ఆర్లు మంజూరు చేశారు. గౌలిదొడ్డిలో కనీస అనుమతులు లేని ఓ ఐదంతస్తుల భవనానికి మీటర్లు జారీ చేయడాన్ని పరిశీలిస్తే అక్రమార్కుల ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. శివారు సెక్షన్లలో పాగా మెజార్టీ భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మి స్తుండటం, శిఖం, బఫర్ జోన్లు, వివాదాస్పద, నిషే ధిత జాబితాలోని భూముల్లో నిర్మిస్తుండటంతో ఓసీల జారీకి మున్సిపాలిటీలు నిరాకరిస్తున్నాయి. ప్రమాణాల మేరకు విద్యుత్ పనులు చేయకపోవడంతో సీఈఐజీ కూడా ఎన్ఓసీ జారీ చేయడం లేదు. దీంతో ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. ఏదీ ఒరిజినలో.. ఏదీ నకిలీనో గుర్తించే వ్యవస్థ డిస్కం వద్ద లేకపోవడం ఇటు కాంట్రాక్టర్లు, అటు క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కలిసి వస్తోంది. అమీన్పూర్, పటాన్చెరు, గచ్చిబౌలి, కంచ గచ్చిబౌలి, గౌలి దొడ్డి, కొండాపూర్, అయ్యప్పసొసైటీ, టీఎన్జీఓస్ కాలనీ, గోపన్పల్లి, అంజయ్యనగర్, శంషాబాద్, మోకిల, నార్సింగి, మొయినాబాద్, కోకాపేట్, వట్టి నాగులపల్లి, చిలుకూరు, సరూర్నగర్, మేడ్చల్, కీసర, బైరమల్గూడ, తుర్కయంజాల్, బడంగ్పేట్, తుక్కుగూడ, వనస్థలిపురం, బైరమల్గూడ, ఇబ్రహీంపట్నం సెక్షన్ల పరిధిలో ఫేక్ ఎన్ఓసీల దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి క్షేత్రస్థాయి ఇంజనీర్లు పరోక్షంగా అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నంబర్లు ఏమార్చి.. దరఖాస్తు సమయంలో వినియోగదారుని ఫోన్ నంబర్ బదులు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నంబర్లు ఇచ్చి దృష్టిని ఏమార్చుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని టీకేపల్లి, ఆమనగల్లు, మాడ్గులలో 417 కనెక్షన్లు ఒకే నంబర్తో దరఖాస్తు చేయడం గమనార్హం. ఎస్టిమేషన్ చార్జీ, ఎంపిక చేసిన విద్యుత్ లోడు, సూపర్ విజన్ చార్జీ, జీఎస్టీ, మెటీరియల్ కాస్ట్, లేబర్ చార్జీ ఇలా ఏ పనికి ఎంత ఖర్చవుతుంది వంటి కనీస సమాచారం భవన యజమానులకు చేరకుండా చేస్తున్నారు. రూ.2 లక్షల్లో పూర్తయ్యే పనులకు రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దీంట్లో లైన్ ఇన్స్పెక్టర్ మొదలు, ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్ఈ వరకు ఇలా ఎవరి వాటా వారికి చేరుతోంది. ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు మోసం వెలుగుచూసి అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. -
పొరపాట్లకు తావివ్వొద్దు
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి పనులను ఎలాంటి పొరపాట్లు లేకుండా, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఫ్యూచర్సిటీ పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని శనివారం ఆయన సందర్శించారు. సమ్మిట్ నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లతో పాటు హెలిపాడ్ పనులను పరిశీలించారు. సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, ఏసీపీ కేవీ రాజు, తహసీల్దార్ గోపాల్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
లేబర్ కోడ్లు అమలు చేయొద్దు
తుర్కయంజాల్: కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తుర్కయంజాల్లో సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తి పరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ను అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు కోడ్లు కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం మున్సిపల్ కన్వీనర్ ఎం.సత్యనారాయణ, మధు, ఆటో యూనియన్ నాయకులు హనుమంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పశు సంరక్షణకు ప్రాధాన్యం
ఏజీవర్సిటీ: పశు సంరక్షణ, పశు సంపద వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పశు సంరక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ ఇలంబర్తి తెలిపారు. రాష్ట్రంలో చేపలు, గొర్రెలు, మేకల పెంపకానికి అధిక నిధులు కేటాయించిందన్నారు. రాజేంద్రనగర్లోని పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 11వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇలంబర్తి ఐసీఏఆర్–షెడ్యూల్ కుల ఉప ప్రణాళిక నిధుల కింద మంజూరైన ఈ–రిసోర్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడ్డు, మాంసం ఉత్పత్తుల ద్వారా చౌకై న ప్రొటీన్ను పశు సంరక్షణ శాఖ ద్వారా అందిచవచ్చని తెలిపారు. దశాబ్ద కాలంలో విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని అభినందించారు. అలుమ్ని కనెక్ట్ను వర్చువల్గా ప్రారంభించారు. పాడి రైతులకు పెంపుడు జంతువులకు అందించే ఉత్తమ క్లినికల్ సే వలను ప్రశంసించారు. రాష్ట్ర జనాభా పెరిగిన కొద్దీ పశు సంరక్షణ, పశు పెంపకం పెంచాలని సూచించారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజీరెడ్డి మాట్లాడుతూ.. పశు వైద్య విశ్వవిద్యాలయం వీసీ జ్ఞానప్రకాశ్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంతోపాటు మమ్నూర్, కోరుట్ల, ల్యాబ్లు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయన్నారు. -
ఉద్యమకారులను ఆదుకునేలా చూడండి
షాద్నగర్: ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పలువురు నాయకులు ఉద్యమకారుల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారులను ఆదుకుంటామని, వారి అభివృద్ధికి తగిన విధంగా కృషి చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ఉద్యమకారులు, ఎన్నోఏళ్లు పోరా టం చేశారని, ప్రస్తుతం వారు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్, టీజీ శ్రీనివాస్, కళ్లెం నర్సింహారెడ్డి, ఆంజనేయులు, ఆనంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలపై అవగాహన చేవెళ్ల: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలల పరిరక్షణ విభాగం జిల్లా అధికారి భాను ప్రకాశ్ అన్నారు. ఊరెళ్ల సమీపంలోని సాగర్ కళాశాలలో ఉన్న బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం చేవెళ్ల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్యవివాహలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భాను ప్రకాశ్ మాట్లాడుతూఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపా రు. బాల్య వివాహాలు జరిపిస్తే రూ.లక్ష జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని చెప్పా రు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. గ్రామ స్థా యిలో అధికారులు బాల్యవివాహాలు జరగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అనురాధ, డాక్టర్ అ నూష,పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్లు,ఆశావర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చేనెల 10, 11 తేదీల్లో జాతీయ సదస్సు చేవెళ్ల: వచ్చేనెల 10, 11 తేదీల్లో చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ మల్టీ డిసిప్లీనరీ సదస్సు నిర్వహిచనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారతదేశ రోడ్డు మ్యాప్ టు ఎస్డీజీ–16, శాంతి న్యాయం సమగ్ర సమాజాల బలోపేతం’ అంశంపై సదస్సు ఉంటుందని చెప్పారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి ప్రముఖ ఆచార్యులు, పరిశోధకులు, నిపుణులు హాజరవుతారని తెలిపారు. రైతుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయండి యాచారం: నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల రికార్డులను రైతుల పేర్లపై నమోదు చేయాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భూ బాధితులు శనివారం కలెక్టర్ నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వకపోయినా నాలుగేళ్లుగా రికార్డుల్లో టీజీఐఐసీ పేరు నమోదు చేసి పరిహారం డబ్బులను అథారిటీలో జమ చేశారని తెలిపా రు. దీంతో రికార్డుల్లో తమ పేర్లు లేక అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోలేక, బ్యాంకు రు ణాలు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ రాక తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఇకనైనా తమ పేర్లపై భూ రికార్డులు నమోదు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, యాచారం తహసీల్దార్తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. -
ధరల మంట.. చప్పటి వంట
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో అమాంతం పెరిగిపోయాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. ఏది కొనాలన్నా కిలో రూ.50 పైమాటే.. గతంలో కేజీ కొనేవారు ప్రస్తుతం పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ధరల మంట, చప్పటి వంటతో గృహిణులు వంటింటిని నెట్టుకొస్తున్నారు. హుడా కాంప్లెక్స్: మార్కెట్లో మళ్లీ ట‘మోత’ మోగుతోంది. రైతు బజార్లలో కిలో రూ.50 పలుకుతుండగా,బహిరంగ మార్కెట్లో రూ.60పైగా అమ్ము తున్నారు. కార్తీక మాసం కావడం, వరుస వన భోజనాలు, అయ్యప్ప దీక్షలు, అన్నదానాలతో కూరగాయాలు, ఆకు కూరలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు ఇటీవల ఏకధాటి వర్షాలు, వరదలకు జిల్లాలో పంట దిగుబడి భారీగా తగ్గింది. డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడంతో టమాట మాత్రమే కా దు.. బెండ, దొండ, గోకర, వంకాయ, బీన్స్, క్యారెట్, ఆలు అ న్నీ అమాంతం పెరిగిపోయా యి. నిన్న మొన్నటి వరకు కేజీ కొనుగోలు చేసిన సగటు కుటుంబం తాజా ధరలతో పావు కిలో, అరకేజీతో సరి సర్దుకుపోతోంది. మెంతికట్ట రూ.30పైనే.. జిల్లాలోని చేవెళ్ల, యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో కాయగూరల సాగు ఎక్కువగా చేస్తుంటారు. మెజార్టీ రైతులు తమ పంటను సరూర్నగర్ రైతు బజార్, ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్, వనస్థలిపురం రైతుబజార్, బాలాపూర్ రైతు బజార్కు ప్రతి రోజూ ఉదయాన్ని తీసుకొచ్చి అమ్ముతుంటారు. సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు తక్కువగా ఉండాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో ధరలు పెంచి అమ్మాల్సి వస్తోందని రైతులే స్వయంగా చెబుతున్నారు. గోంగూర, పాలకూర, తోటకూరల ధరలు సైతం రెట్టింపయ్యాయి. ఇక మెంతి కట్టకు రూ.30పైగా చెల్లించాల్సి వస్తోంది. నిన్న మొన్నటి వరకు రూ.10కే దొరికిన పుదీనా, కొత్తిమీర కట్టలు ప్రస్తుతం రూ.25 పైగా పలుకుతున్నాయి. కోడిగుడ్డ ధర రూ.7పైనే.. సాధారణంగా కార్తీక మాసంలో మాంసం, కోడిగుడ్ల వినియోగం తక్కువగా ఉంటుంది. చికెన్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ కోడిగుడ్ల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. హోల్సేల్ మార్కెట్లో ఒకటి రూ.7 చొప్పున పలుకుతుండగా, రిటేల్ మార్కెట్లో రూ.7.50 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. కోళ్ల ఫారాల సంఖ్య తక్కువగా ఉండటం, ఉన్నవి కూడా ఆఖరి దశలో ఉండటం గుడ్ల ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో అంగన్వాడీలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలు, ఆస్పత్రుల్లో మధ్యాహ్న భోజనంలో భాగంగా అందించే గుడ్లలో సైతం కోత పెడుతున్నారు. భగ్గుమంటున్న కూరగాయల రేట్లు బహిరంగ మార్కెట్లో ధరలు కిలో రూపాయల్లో.. బీన్స్ 120–150 చిక్కుడు 120 బెండకాయ 80–100 దొండ 60–80 పచ్చిమిర్చి 80 టమాటా 40– 60 బీరకాయ 60 వంకాయ 59–60 క్యాబేజీ 60 కాకర 60దిగుబడి తగ్గడంతోనే.. గతంతో పోలిస్తే ప్రస్తుతం పంట దిగుబడి తగ్గింది. సరూర్నగర్ రైతు బజార్కు రోజుకు సగటున 540 నుంచి 560 క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో పంట రావడం లేదు. డిమాండ్కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ధరల పెరుగుదలకు కారణం. – స్రవంతి, ఎస్టేట్ ఆఫీసర్, సరూర్నగర్ అరకిలోతో సరిపెట్టుకుంటున్నాం మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏది కొనలన్నా రూ.50 పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో అరకిలోతో సరిపెట్టుకుంటున్నాం. కూరగాయల ధరలతో పోలిస్తే పప్పు ధరలే నయం. – శైలజ, గృహిణి -
గురూజీ అనిల్కుమార్జోషికి డాక్టరేట్
కందుకూరు: మండలంలోని పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనా కేంద్రం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గురూజీ అనిల్కుమార్జోషి మిజోరాం ఇక్ఫాయి వర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆయుర్వేద పరిశోధనలో ఆయన చేసిన అత్యుత్తమ కృషితో పాటు క్యాన్సర్ చికిత్సలో రెండు పేటెంట్లు సాధించనందుకు గుర్తింపుగా ఆ వర్సిటీ నిర్వాహకులు ఆయన్ని డాక్టరేట్కు ఎంపికచేశారు. గురువారం మిజోరాంలోని ఇక్ఫాయి వర్సిటీ 13వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జనరల్ వీకే సింగ్ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించారు. సినీ దర్శకుడు రాజమౌళిపై ఫిర్యాదు కేశంపేట: సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్లో ఓ సినిమా ఈవెంట్లో హనుమంతుడిపై చేసిన అనుచిత వాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కేశంపేట ఠాణాలో బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి శివాజీ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. రాజమౌళి చేసిన వాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకులు అంజయ్య, నరసింహ, వెంకటేశ్వర్జీ, మహేశ్, శివగౌడ్ తదితరులు ఉన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు శంషాబాద్ డీసీపీ రాజేశ్ షాద్నగర్రూరల్: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ డీసీపీ రాజేశ్ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఫరూఖ్నగర్, నాగులపల్లి రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు, కిరాణం, బెల్టుషాపులపై దాడులు చేశారు. 6 బెల్టు షాపు కేసులు, 2 గుట్కా, 10 డ్రంకెన్ డ్రైవ్, 10 బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న కేసులను నమోదు చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా నడుపుతున్న 24 కేసులు బైక్లను సీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాజేశ్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో భాగంగా ఈ కార్డెన్ సెర్చ్ను చేపట్టామని చెప్పారు. నిషేధిత గుట్కాలు విక్రయించే వారిపై, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని, అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బెల్టు షాపులలో మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, సీఐలు విజయ్కుమార్, నర్సయ్య, శ్రీనివాసులు, జానకిరాం, గంగాధర్, నరహరి, ఎస్ఓటీ సీఐ సంజయ్, సీసీఎస్ సీఐ రవికుమార్, డీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్బీ ఎస్ఐ దేవకి, ఎస్ఐలు శరత్కుమార్, రాంచందర్, సుశీల, ప్రణయ్, శ్రీకాంత్, విజయ్, ఏఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై కొండచిలువ సంచారం మొయినాబాద్: రాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ వాహనదారులను, స్థానికులను భయాందోళనకు గురిచేసిందసింది. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న వెల్డింగ్ షాపు వద్ద శుక్రవారం రాత్రి కొండచిలువ ప్రత్యక్షమైంది. షాపు నిర్వాహకులు చూస్తుండగానే హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపైకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులతోపాటు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి కొండచిలువను పట్టుకుని సంచిలో వేశాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి కొండచిలువను అడవిలోకి తీసుకెళ్లారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నుంచే కొండ చిలువ బయటకు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆర్టీసీ కార్గో వస్తువుల బహిరంగ వేలం సాక్షి, సిటీబ్యూరో: మహాత్మా గాంధీ బస్స్టేషన్లో పెండింగ్లో ఉన్న కార్గో, పార్సిల్ వస్తువులకు శనివారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిక్ వస్తువులు, ఐరన్, ద్విచక్రవాహనాలు, కార్ల విడిభాగాలు, కంప్యూటర్ విడిభాగాలు, దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, బుక్స్, రెగ్జిన్ తదితర వస్తువులను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంజీబీఎస్లోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఫోన్: 9391778825, 9154298865 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. -
‘గ్లోబల్ సమ్మిట్’ పోలీస్ బాస్ బదిలీ
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ కమిషనరేట్లోని మహేశ్వరం జోన్ పరిధిలోకి వచ్చే మీర్ఖాన్పేటలో వచ్చే నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేశ్వరం జోన్ డీసీపీగా ఉన్న డి.సునీతా రెడ్డిని బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో వికారాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.నారాయణ రెడ్డికి మహేశ్వరం జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. కాగా.. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రేటర్లో తొలిసారిగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. శుక్రవారం రాష్ట్రంలో ఒకేసారి 32 మంది ఐపీఎస్లకు స్థానచలనం కాగా.. ఇందులో పలువురు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో ఒక్క అధికారికీ బదిలీ కాకపోవడం గమనార్హం. రాచకొండలో.. మల్కాజిగిరి జోన్ డీసీపీ పీవీ పద్మజ (2013)ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (అడ్మిన్) ఎస్పీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న సీహెచ్ శ్రీధర్ (2020)కు పోస్టింగ్ ఇచ్చారు. భువనగిరి ఎస్డీపీఓ కంకనాల రాహుల్ రెడ్డి (2021)ని భువనగిరి గ్రేడ్–1 అదనపు ఎస్పీ/ఏఎస్పీగా బదిలీ చేశారు. రాచకొండ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబును బదిలీ చేసి, ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న కె.గుణశేఖర్కు పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో.. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా (2018)ను బదిలీ చేసి, ఆమె స్థానంలో జయశంకర్ భూపాల్పల్లి ఎస్పీ ఖారే కిరణ్ ప్రభాకర్ (2017)కు అప్పగించారు. హైదరాబాద్ టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా ఉన్న చెన్నూరి రూపేష్ (2017)ను హైదరాబాద్ సిటీ ఎస్ఎంఅండ్ఐటీ డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ సిటీ టాస్క్ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర స్థానంలో గైఖ్వాడ్ వైభవ్ రఘునాథ్ (2018)కు పోస్టింగ్ ఇచ్చారు. సమ్మిట్ బందోబస్త్ రోడ్ మ్యాప్ పరిశీలన వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ జి.సుధీర్ బాబు అన్నారు. శుక్రవారం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ బందోబస్త్ రోడ్ మ్యాప్ను ఆయన పరిశీలించారు. వాహనాల పార్కింగ్ స్థలం, హెలిపాడ్ ప్రదేశం, సభాస్థలి తదితరాల రోడ్ మ్యాప్ను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తదితరులున్నారు. మహేశ్వరం జోన్ డీసీపీ సునీత బదిలీ ఆమె స్థానంలోనారాయణ రెడ్డికి పోస్టింగ్ గ్రేటర్లో పలువురు ఐపీఎస్లకు స్థానచలనం -
ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
చైతన్యపురి: ఆర్థిఽక ఇబ్బందులతో భార్యాభర్తలు తనువు చాలించారు. వాకింగ్కు అని వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన గడ్డమిడి మల్లేష్ (45), సంతోషి (37) దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్వగ్రామంలోని రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు అమ్మి బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కొత్తపేట మార్గదర్శి కాలనీ రోడ్ నంబర్–4లో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. కుమారుడు శివ డిగ్రీ చదువుతుండగా పెద్దకూతురు మేఘన ఇంటర్, చిన్నకూతురు మౌనిక టెన్త్ క్లాస్ చదువుతుంది. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రోజు మాదిరిగానే మార్నింగ్ వాకింగ్కని బయటకు వెళ్లారు. ఎంత సేపటికి తిరిగి రాకపోవటంతో 7.30 గంటలకు కుమారుడు శివ తండ్రి సెల్ ఫోన్ నంబర్కు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత తండ్రి మల్లేష్ సెల్ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. ‘నాకు రూ.20 లక్షలు, మీ అమ్మకు రూ.20 లక్షలు ఎస్బీఐ బ్యాంక్ నుంచి వస్తాయి’ అని మెసేజ్లో ఉంది. తరువాత ఫోన్ స్విచాఫ్ చేసి వుంది. దీంతో ఆందోళన పడ్డ శివ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాగోలులో గుర్తింపు... మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మల్లేష్, సంతోషి దంపతుల జాడ వెతకటం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జీపీఆర్ఎస్ ద్వారా సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటి లొకేషన్ ఆధారంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఅన్నారం ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. 100 ఫీట్ల రోడ్డు పక్రన నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి చూడగా మల్లేష్, సంతోషి అపస్మారక స్థితిలో ఉన్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని పరీక్షించగా సంతోషి అప్పటికే మృతిచెంది వున్నట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న మల్లేష్ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా కొద్దిసేపటికే మల్లేష్ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చైతన్యపురిలో మిస్సింగ్ కేసు... నాగోలు పరిధిలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తింపు -
సైకిల్ను ఢీకొట్టిన టిప్పర్
యాచారం: టిప్పడర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణా పరిధిలోని శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆకులమైలారం గ్రామానికి చెందిన గండికోట యాదయ్య ఉదయం గ్రామం నుంచి సైకిల్పై పనికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ సైకిల్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది. గృహిణి అదృశ్యం పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిద్యాదర్ సేతి, భార్య సంగమిత్ర సేతి(28) జల్పల్లి శ్రీరాం కాలనీకి వలస వచ్చారు. భర్త స్థానికంగా సింగానియా ఫుడ్స్ కంపెనీలో మెకానిక్గా పని చేస్తుండగా, భార్య ఖాజాగూడలోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంది. రోజు మాదిరిగానే ఈ నెల 19న బిద్యాదర్, సంగమిత్రలు తమ విధులకు వెళ్లారు. సంగమిత్ర ఎంతకూ ఇంటికి రాకపోవడంతో, ఆమె ఆచూకీ కోసం ఎక్కడ వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గురువారం రాత్రి బిద్యాదర్ పోలీసులను ఆశ్రయించాడు. పుష్పేందర్ సింగ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లోనైనా సమాచారం ఇవ్వాలన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారం
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్రెడ్డి షాబాద్: పేదల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్య మని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మ ధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆస్పల్లిగూడలో చిలకల సువర్ణ ఇందిరమ్మ ఇంటిని నిర్మి ంచుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆయన గృహప్రవేశానికి హాజరై ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ద శల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాను క్షేత్రస్ధాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నిక ల్లో సత్తా చాటేందుకు సమష్టిగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కా వలి చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యులు చెన్న య్య, అశోక్, మాజీ సర్పంచ్లు ప్రతాప్రెడ్డి, మహే ందర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, రవీందర్నాయక్, నా యకులు ప్రభాకర్రెడ్డి, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, రాహుల్, సూర్యగౌడ్, రమేశ్, గౌరీ శ్వర్, కృష్ణారెడ్డి, మహేశ్, శేఖర్, తదితరులున్నారు. చెక్కుల పంపిణీ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ పండ్ పథకాలు పేదలకు మేలు చేకూరుస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకుకల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి శంకర్పల్లి: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ పరిధిలోని 2వ వార్డుకి చెందిన ఆరెగూడెం మీన దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, నాయకులు ప్రవీణ్, గోపాల్రెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రమౌలి, రాజశేఖర్రెడ్డి, రఘునందన్రెడ్డి పాల్గొన్నారు. మందు బాబులకు జైలు శిక్ష, జరిమానా శంషాబాద్ రూరల్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులుపించారు. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ విభాగం వారు నమోదు చేసిన కేసుల్లో కోర్టు 9 మందికి శిక్షతో పాటు జరిమానా విధించింది. మద్యం సేవించి వాహన నడిపిన మైస్యకు రెండు రోజుల సాధారణ కారాగార శిక్ష, రూ. 3 వేల జరిమానా, మహేష్కు రెండు రోజుల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ. 2,500 జరిమానా విదిస్తూ రాజేంద్రనగర్ 10 స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభ ఆదేశాలు జారీ చేశారు. మరో ఇద్దరికి రూ. 5,500 జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన ఐదు మందికి రూ. 7,500 జరిమానా పడింది. రహ దారి భద్రతను నిర్ధారించడం, ట్రాఫిక్ నియ మాలను కఠినంగా అమలు చేస్తామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.ప్రమోద్కుమార్ తెలిపారు. -
బీజేపీని విమర్శించే స్థాయి కవితది కాదు
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి కేశంపేట: కేంద్రంలో బీజేపీ పార్టీని విమర్శించే స్థాయి కల్వకుంట్ల కవితది కాదని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తోందన్నారు. ఇది జీర్ణించుకోలేకే కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రోడ్ల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తున్న ప్రజలు స్ధానిక ఎన్నికలతో పాటుగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఆదరించి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పసుల నర్సింహయాదవ్, అంజయ్య, మహేశ్, నర్సింలు, నరేందర్రెడ్డి, ఉదయ్గౌడ్, ముల్తూంకార్ శివాజీ, కుమారస్వామి, మహేశ్, తలసాని పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందేమాతరం మహోత్సవాలు ప్రతీ ఒక్కరు దైవ భక్తితో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పా లమూరు విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వందేమాతరం–150 ఏళ్ల మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ నా యకులు విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతా న్ని ఆలపించారు. అనంతరం విష్ణువర్ధన్రెడ్డి మా ట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత వందేమాతరం గీతాన్ని గీతాన్ని జాతీయ గీతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. దేశరక్షణ కు యువత ముందుకురావాలని కోరారు. బీజేపీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ నర్సింహయాదవ్, అంజయ్య, ఉదయ్కుమార్గౌడ్, యుగేందర్, నర్సి ంలు, మహేశ్, అశోక్, నరేందర్రెడ్డి, పవన్కుమార్ రెడ్డి, కుమార్, వెంకటేశ్వర్జీ, మహేశ్, సందీప్గౌడ్, శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
17 ఏళ్ల తర్వాత కేసు కొట్టివేత
షాద్నగర్: జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అన్నందుకుగాను బీజేపీ నేతలపై నమోదైన కేసును 17 ఏళ్ల తర్వాత షాద్నగర్ కోర్టు కొట్టి వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాబ్రీ మసీదును కూల్చివేత దినోత్సవాన్ని పురస్కరించుకొని 2008 డిసెంబర్ 6న బీజేపీ నేతలు షాద్నగర్ పట్టణంలో వీరశౌర్య దివస్ను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పట్లో వీరశౌర్య దివస్ కార్యక్రమంలో పాల్గొన్న వనం ఝాన్సీ, నేతలు శ్రీవర్ధన్రెడ్డి, కృష్ణారెడ్డి, నందిగామ వెంకటేష్, అశోక్గౌడ్, కక్కునూరి వెంకటేష్గుప్తా, నర్సింహాగౌడ్, బల్వంత్రెడ్డి, వెంకటేష్, రాఘవులు, వెంకటేష్యాదవ్, కుమార్, శ్రీరాంయాదవ్, కొండల్రెడ్డి, వీరాంజనేయులురెడ్డి, ఖాజన్నగౌడ్లపై షాద్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కోర్టులో కేసు కొనసాగింది. గురువారం మరోసారి విచారణ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. దీంతో కేసు నమోదైన వారిలో వనం ఝాన్సీ, వీరాంజనేయులురెడ్డి మృతి చెందడంతో మిగతా 14 మంది నేతలు కోర్టుకు హాజరయ్యారు. విచారణ చేపట్టిన జడ్జి బీజేపీ నేతలపై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పును ఇచ్చారు. దీంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తా
కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న మర్రిపల్లి, ఎక్వాయిపల్లి భూ నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, న్యాయం జరిగేలా చూస్తానని, తగిన పరిహారం అందించేందుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ, కందుకూరు, కడ్తాల్ మండలాల మీదుగా ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనున్న విషయం విదితమే. ఈ మేరకు మండల పరిధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల భూ నిర్వాసితులు శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని, లేని పక్షంలో కొంగరకలాన్, రావిర్యాలలో ఇచ్చిన విధంగా పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వీరయ్య, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్గౌడ్, రైతులు కరుణాకర్, వెంకట్రెడ్డి, సుమన్, నారాయణ, పాండురంగారెడ్డి, చెన్నయ్య.శంకరయ్య, పాండు, మల్ల య్య, హరీశ్, రమేశ్ తదితరులు ఉన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
ఎంపీహెచ్డబ్ల్యూలో మహిళలకు ఉచిత శిక్షణ
జిల్లా టీకా అధికారి షెబాహయత్ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్ యాదవ్ తుక్కుగూడ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జి.మల్లేశ్ యాదవ్ డిమాంఆడ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి డికర్లేషన్ అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కలిపించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లు పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు ఏడాది నుంచి ప్రకటించి.. పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య, నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్గౌడ్, రవీందర్గౌడ్, పర్వతాలు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం
● ఎదురెదురుగా రెండు కార్లు ఢీ ● ఇద్దరు దుర్మరణంమొయినాబాద్: మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటన మరువక ముందే బీజాపూర్ హైవేపై మరో యాక్సిడెంట్ జరగడం ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఫొటో షూట్కు వెళ్తున్న ఫొటోగ్రాఫర్లు ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకునేవారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న క్యాబ్ అతివేగంగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ కారులోనే ఇరుక్కుని దుర్మరణం చెందగా.. ఫొటో గ్రాఫర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన కరీం(37) కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నగరంలోని బంజారాహిల్స్కు చెందిన లోకేశ్(24), జగద్గిరిగుట్టకు చెందిన బాబురావు, కుత్బుల్లాపూర్కు చెందిన షేక్ అఖిల్ ముగ్గురు ఫొటోగ్రాఫర్లు కనకమామిడి రెవెన్యూ పరిధి గుల్మోర్ గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్లో ఫొటో షూట్కోసం శుక్రవారం కరీం క్యాబ్(వ్యాగనార్)లో బయలుదేరారు. క్యాబ్ను వేగంగా నడుపుతున్న డ్రైవర్ హైదరాబాద్–బీజాపూర్ హైవేపై మొయినాబాద్ సమీపంలోని ఆన్ ది వే డ్రైవ్ ఇన్ హోటల్(పెంటయ్య హోటల్) వద్దకు రాగానే రాంగ్రూట్లో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న హోండా డబ్ల్యూఆర్వీ కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డుపక్కన బోర్డును ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. క్యాబ్ డ్రైవర్ కరీం కారులోనే ఇరుక్కుని దుర్మరణం చెందాడు, ఫొటో గ్రాఫర్ లోకేశ్ తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు ఫొటోగ్రాఫర్లకు స్వల్ప గాయాలయ్యాయి. హోండా కారులో డాక్టర్ వంశీధర్రెడ్డి, బంధువులు సుజాత, రోజా, డ్రైవర్ వెంకట్ ఉన్నారు. డ్రైవర్ వెంకట్కు తీవ్రగాయలు కాగా సుజాత, రోజా స్వల్పంగా గాయపడ్డారు. వంశీధర్రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. చికిత్స పొందుతూ ఫొటోగ్రాఫర్ మృతి ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి కార్లలో ఇరుక్కుపోయినవారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు పది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. లోకేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ కరీం మృతదేహంఫొటో గ్రాఫర్ లోకేష్(ఫైల్)ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ హైవే రోడ్డుపై దామరగిద్ద సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్న వికారాబాద్ డిపోకు చెందిన బస్సు దామరగిద్ద సమీపంలో ఎదురుగా వికారాబాద్–చేవెళ్ల వైపు ప్రయాణిస్త్ను కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు, బస్సు ముందు భాగాలు రోడ్డుపక్కకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో ఎక్కించి పంపించారు. -
పెద్ద చెరువును రక్షించండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాలుష్యం కోరల్లో కూరుకుపోతున్న పెద్ద చెరువును రక్షించి ఇక్కడి ప్రజల జీవితాలను కాపాడాలని ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ను స్థానికులు కోరారు. ఇబ్రహీంబాగ్లోని 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్న నేపథ్యంలో స్థానికులు ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్కు తమ సమస్యలను వివరించారు. మణికొండ, పుప్పాలగూడ, అల్కాపూర్, ఓయూ కాలనీ ప్రాంతాల నుంచి నియంత్రణలేని మురుగు ప్రవాహం చెరువును దెబ్బతీస్తోందన్నారు. చెరువు జీవవైవిధ్యం నాశనం అవుతోందని, దుర్వాసన, అపరిశుభ్రవాతావరణం స్థానికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. మురుగు ప్రవాహం చెరువులోకి రాకుండా నిలిపి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు, చెరువు శుభ్రపరిచే పనులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెరిక సురేశ్, వెంగల్రెడ్డి, దయానంద్పటేల్, శ్రీరాంరెడ్డి, భీంరెడ్డి, రాకేశ్ పటేల్, వెంకట్, శ్రీనివాస్కల్యాణ్, డేవిడ్, రాంగోపాల్, దీప్తి, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్కు స్థానికుల వినతి -
నచ్చినట్టు సర్దుబాటు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉపాధ్యాయుల అంతర్గత సర్దుబాటు అంశం జిల్లా విద్యాశాఖలో వివాదాస్పదంగా మారుతోంది. పోస్టింగ్కు భిన్నంగా కొంత మంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు ఆగ్రహానికి కారణమవుతోంది. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించి, వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలతో అడ్డదారుల్లో వచ్చి ఏళ్ల తరబడి జిల్లాలో పాగా వేసిన అక్రమార్కులకు సైతం జిల్లా విద్యాశాఖ కొమ్ముకాస్తుండటం విశేషం. ఒక చోట పోస్టింగ్ పొంది.. మరో చోట విధులు నిర్వహిస్తుండటంతో పాఠ్యాంశాలు బోధించేందుకు టీచర్లు లేక ఆయా పాఠశాలల విద్యార్థులు తరచూ ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రోడ్డెక్కగా, తాజాగా కడ్తాల్ మండలం ముద్విన్ పాఠశాల విద్యార్థులు పాఠశాల గేటుకు తాళం వేసి, అక్కడే బైఠాయించడం చర్చనీయాంశంగా మారింది. రూరల్లో పోస్టింగ్.. అర్బన్లో విధులు జిల్లాలో పనిచేస్తున్నవారిలో 50 శాతానికిపైగా ఉపాధ్యాయులు స్థానికేతరులే. అనారోగ్యకారణాలతో కొంత మంది, స్పౌజ్ కేటగిరిలో మరికొందరు, ఉపాధ్యాయ సంఘాల ముసుగులో ఇంకొందురు వచ్చి చేరారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల బంధువులు సైతం అడ్డదారుల్లో వచ్చి చేరారు. మొదట్లో వీరంతా కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, కడ్తాల్, తలకొండపల్లి, మంచాల, మాడ్గుల సరిహద్దు మండలాల్లోని పాఠశాలల్లో పోస్టింగ్లు పొందుతున్నారు. ఆ తర్వాత తమకున్న రాజకీయ, ఆర్థిక బలాలతో అంతర్గత సర్దుబాటు పేరిట ఇంటికి సమీపంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో వాలిపోతున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో విరామం లేకుండా పని చేయడం ఇష్టం లేని వారు పిల్లల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలను ఎంచుకుంటున్నారు. వర్క్ అడ్జెస్ట్మ్మెంట్ పేరుతో ఉపాధ్యాయులు వేరే చోట విధులు నిర్వహిస్తుడడంతో ఆయా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. డిప్యూటేషన్లపై వెళ్లిన ఉపాధ్యాయులను వెనక్కి పంపాలని కోరినా డీఈఓ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలు 1,300ఎస్జీటీలు4,054 స్కూల్ అసిస్టెంట్లు 3,997హై స్కూల్ హెచ్ఎంలు 278ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు200 ‘కడ్తాల్ మండలం ముద్విన్ ప్రభుత్వ పాఠశాలలో 141 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఇద్దరు(రమాదేవి, ప్రవీణ) సైన్స్ టీచర్లు ఉండగా, వీరిలో రమాదేవి ఇటీవల హెచ్ఎంగా పదోన్నతి పొంది నాగర్కర్నూల్ జిల్లాలో పోస్టింగ్ పొందారు. ప్రవీణ సైతం పైరవీతో తన ఇంటికి సమీపంలోని మన్సూరాబాద్ స్కూల్కు డిప్యూటేషన్పై వెళ్లారు. దీంతో మూడు నెలలుగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు సైన్స్ బోధించే వారు లేరు. ఉన్నతాధికారులకు విన్నవించినా.. ఫలితం లేక విద్యార్థులంతా పాఠశాల గేటుకు తాళం వేసి, అక్కడే బైఠాయించారు. డీఈఓ సంబంధిత ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్ను రద్దు చేసి, నిబంధనల మేరకు ఆమెను వెనక్కి పంపాల్సి ఉంది. కానీ ఇందుకు భిన్నంగా మాడ్గుల మండలం కలకొండ జెడ్పీహెచ్ఎస్లో పోస్టింగ్ పొంది, వర్క్ అడ్జెస్ట్మ్మెంట్లో భాగంగా హయత్నగర్ జెడ్పీహెచ్ఎస్లో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న సైన్స్ టీచర్ పి.రాజును ముద్విన్కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడంలో ఆంతర్యం అంతు చిక్కడం లేదు’. పోస్టింగ్ ఒక చోట.. విధులు మరో చోట విద్యాశాఖలో అడ్డగోలు డిప్యూటేషన్లు సబ్జెక్టు టీచర్ల కోసం రోడ్డెక్కుతున్న విద్యార్థులు ముద్విన్ పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన కొందుర్గు మండలం ఉమ్మెత్యాలలో పోస్టింగ్ పొందిన నరేందర్రెడ్డి శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. న్యూఆగిరాలలో పోస్టింగ్ తీసుకున్న చంద్రశేఖర్రెడ్డి డీఈఓ ఆఫీసు(వయోజన విద్య)కు డిప్యూటేషన్పై వెళ్లారు. లక్ష్మీదేవిపల్లి పాఠశాలలో పోస్టింగ్ పొందిన అతిరాం ఆరుట్ల పబ్లిక్ స్కూలుకు మారారు. చెర్కుపల్లి పాఠశాలలో చేరిన సుష్మారెడ్డి గండిపేట్కు వెళ్లారు. ముట్కూరు హైస్కూల్ నుంచి పీఈటీ శ్రావణి ఆరుట్ల పబ్లిక్ స్కూలుకు వెళ్లారు. ఉత్తరాసుపల్లిలో పోస్టింగ్ పొందిన కరుణాకర్రెడ్డి సరూర్నగర్కు వెళ్లారు. జిల్లేడుచౌదరిగూడ మండలం చింతకుంటతండాలో పోస్టింగ్ పొందిన రేణుక అబ్దుల్లాపూర్మెట్కు వెళ్లారు. పెద్దఎల్కిచర్ల నుంచి వరప్రసాద్ శంకర్పల్లికి వెళ్లారు. గ్రామీణ ప్రాంతాలు, తండాల పాఠశాలలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తోంది. వర్క్ అడ్జెస్ట్మ్మెంట్లో భాగంగా ఖాళీగా ఉన్న కొంత మంది ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలకు అంతర్గత డిప్యూటేషన్లపై పంపాల్సి వస్తోంది. హయత్నగర్లో 1,200 మందికిపైగా విద్యార్థులకు 12 మంది టీచర్లే ఉన్నారు. మణికొండలో 1,400 మంది పిల్లలకు 18 మందే ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు లేక విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న స్కూళ్ల నుంచి కొంత మంది టీచర్లను డిప్యూటేషన్లపై అడ్జెస్ట్ చేయాల్సి వస్తోంది. – సుశీందర్రావు, డీఈఓ -
ఉద్యమకారుల ఆశయాలను నెరవేరుస్తాం
● మలిదశ ఉద్యమానికి ఊపిరి సిరిపురం యాదయ్య ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహేశ్వరం: సిరిపురం యాదయ్య ఆత్మాహుతితో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని, ఆయన త్యాగం మరువలేమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని మహేశ్వరం గేటు వద్ద మలిదశ ఉద్యమకారుడు మహేశ్వరం వాసి సిరిపురం యాదయ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారుల ఆశయాలను తెలంగాణ జాగృతి నేరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు నరేశ్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ జాడేది..? బడంగ్పేట్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆమె బడంగ్పేటలోని జిల్లా గ్రంథాలయ కేంద్రాన్ని సందర్శించారు. నిరుద్యోగులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని.. ప్రస్తుత ప్రభుత్వమైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లైబ్రరీలో వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్ తదితరులున్నారు. జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం కందుకూరు: మండల పరిధిలోని కొత్తూర్గేట్ శ్రీశైలం హైవేపై జాగృతి నియోజకవర్గం ఇన్చార్జి అందుగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాగృతి కార్యాలయాన్ని శుక్రవారం కవిత ప్రారంభించారు. అంతకుముందు కొత్తూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే ‘జాగృతి జనం బాట’ మీర్పేట: ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే ముందుకొచ్చానని కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మీర్పేట కూడలిలో జరిగిన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. 19 ఏళ్లుగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రశ్నించే వారుంటేనే పనులవుతాయని, ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. చెరువుల కబ్జా అవుతున్నా హైడ్రా ఏం చేస్తోందన్నారు. జిల్లాలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో జాగృతి కమిటీలను వేసి బలోపేతం చేస్తామని, జనంబాటలో ప్రజలంతా భాగస్వాములై సమస్యలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సి.లావణ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడులో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మండల పరిధిలోనలి ఎల్మినేడు గ్రామంలో శుక్రవారం కల్వకుంట్ల కవిత పర్యటించారు. భూ నిర్వాసితులతో మాట్లాడేందుకు వచ్చిన ఆమె సమస్యలు చెప్పాలని కోరగా ఎవరూ ముందుకు రాలేదు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్కిరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాచారం పీఏసీఎస్ చైర్మన్గా రాజేందర్రెడ్డి
యాచారం: హైకోర్టు ఉత్తర్వుల మేరకు యాచారం పీఏసీఎస్ చైర్మన్గా రాజేందర్రెడ్డి శుక్రవారం మరోమారు బాధ్యతలు చేపట్టారు. రెండు నెలల క్రితం సర్కార్ చైర్మన్ బాధ్యతల నుంచి రాజేందర్రెడ్డితో పాటు పాలకవర్గాన్ని తొలగించింది. వీరు హైకోర్టును ఆశ్రయించడంతో వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ మేరకు డీసీఓ సి.సుధాకర్ యాచారం పీఏసీఎస్ చైర్మన్గా రాజేందర్రెడ్డితో మరో 8మంది బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వులు ఇచ్చారు. రుణాలు పొంది సకాలంలో చెల్లించకుండా డిఫాల్టర్గా మిగిలిన నలుగురు సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళా రక్షణలో ప్రభుత్వాలు విఫలం
ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత చేవెళ్ల: మహిళలకు రక్షణ కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత ఆరోపించారు. పట్టణ కేంద్రంలో గురువారం ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. షీ టీమ్స్ ఎక్కడా సక్రమంగా పని చేయడం లేదన్నారు. మహిళలపై హత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వీటిని అరకట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేరాలు, ఘోరాలు పెరిగి పోయాయన్నారు. విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకు వచ్చి విద్యాభివృద్ధిని అడ్డుకోవటం సరికాదన్నారు. మహిళల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కన్వెన్షన్ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా గరల్స్ కమిటీ కన్వీనర్గా అంబిక, కో–కన్వీనర్గా కీర్తన, కమిటీ సభ్యులుగా అమ్ములు, అక్షిత, మానస, నందిని, నవమి, మౌనిక, ప్రియా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రణయ్, శంకర్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, తరంగ్, నాయకులు అరుణ్కుమార్, సింధు, శ్రీనివాస్, చరణ్గౌడ్, వంశీ, ఇర్మాణ్, చందు, యశ్వంత్, పవన్కుమార్, విష్ణు, నవీన్, విష్ణుగుప్తా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అభిమాన సంద్రం
జై జగన్.. సీఎం.. సీఎం అంటూ నినదించిన జనం సనత్నగర్/నాంపల్లి/బంజారాహిల్స్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ గడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. ఆయనను కనులారా చూసేందుకు గురువారం వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో బేగంపేట్ ఎయిర్పోర్ట్తో పాటు నాంపల్లిలోని సీబీఐ కోర్టు పరిసరాలు, బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రహదారులు కిక్కిరిసిపోయాయి. జై జగన్.. జైజై జగన్.. సీఎం..సీఎం.. అనే నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో దద్దరిల్లాయి. జగన్మోహన్రెడ్డిని చూసేందుకు పోలీసుల తాళ్ల కంచెను సైతం దాటుకుంటూ వెళ్లిపోయారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు తమ లాఠీలతో కార్యకర్తలను, అభిమానులను అడ్డుకునే ప్రయత్నాలు చేసినా అభిమానం ముందు నిలబడలేదు. దీంతో అశేషంగా తరలివచ్చిన జనం తోసుకుంటూ రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అభిమానులు బైక్ ర్యాలీలతో ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. జై జగన్ నినాదాలు చేయడంతో బేగంపేట్ రహదారులు హోరెత్తాయి. స్వాగత హోర్డింగ్లు.. ప్లకార్డుల ప్రదర్శన బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని లోటస్పాండ్లోని తన నివాసానికి వచ్చేముందు జగన్కు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాన చౌరస్తాల్లో స్వాగత హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో జగన్ నివాసిత ప్రాంతం కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు గంటన్నర పాటు ఆయన లోటస్పాండ్లో ఉండగా అభిమానులు, కార్యకర్తలు కూడా అంతసేపు అక్కడే ఉండిపోయారు. ఇంటి నుంచి జగన్ తిరిగి ఎయిర్పోర్ట్కు వెళ్లే క్రమంలో కూడా బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు వేలాదిగా కార్యకర్తలు బారులుతీరారు. అభిమానులకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఉదయం నుంచే అభిమానుల ఎదురుచూపులు సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు, నేతలు భారీగా తరలివచ్చారు. నాంపల్లి కోర్టుకు జగన్ వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఉదయాన్నే నాంపల్లికి చేరుకున్నారు. అభిమాన నాయకుడు రాకకోసం నాంపల్లి రోడ్లపై ఎదురు చూశారు. జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు వస్తున్నారన్న కారణంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ట్రాఫిక్ను మళ్లించారు. అడుగడుగునా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడుగడుగునా అత్యుత్సాహం ప్రదర్శించారు. నాంపల్లి కోర్టుకు అరకిలో మీటరు దూరంలో చుట్టూ బారికేడ్లను, ముళ్ల కంచెను ఉంచారు. కోర్టుకు వచ్చే దారులన్నింటిని మూసివేశారు. సమీపంలోని వ్యాపార సముదాయాలను సైతం బలవంతంగా మూసివేయించారు. ఉదయం బారికేడ్లను తెరుచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ కోర్టు ఆవరణలోకి ప్రవేశించింది. భారీగా మోహరించిన అభిమానులకు కాన్వాయ్లోంచి జగన్ అభివాదం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యానవన శాఖ కార్యాలయం పక్కన ఉన్న గేటు వైపు నుంచి రెడ్హిల్స్, లక్డీకాపూల్ మీదుగా జగన్ కాన్వాయ్ తిరిగి వెళ్లింది. బేగంపేట్ విమానాశ్రయానికి తరలివచ్చిన ప్రజావాహిని బైక్ ర్యాలీలతో హోరెత్తిన రహదారులు అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద పెల్లుబికిన ప్రజాభిమానం లోటస్పాండ్లోని నివాసం వద్దా అదే ఉత్సాహం అడుగడుగునా పోలీసుల అత్యుత్సాహం లాఠీచార్జ్తో అభిమానులను భయపెట్టే యత్నం -
రైతును రాజుగా చేయడమే లక్ష్యం
యాచారం: రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. గురువారం ఆయన యాచారం రైతువేదికలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని కూరగాయల సాగును పెంచాలని నిర్ణయించామని.. వచ్చే ఏడాది ఇందుకు జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే మూడు గ్రామాల్లో కూరగాయల సాగు గణనీయంగా పెరిగిందని చెప్పారు. కూరగాయలు విక్రయానికి సరూర్నగర్ మార్కెట్కు తీసుకెళ్తే అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. రైతు బజార్లో కూరగాయలు విక్రయించేందుకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాయితీపై కూరగాయల విత్తనాలు, డ్రిప్, యంత్రాలు అందిస్తే సాగు విస్తీర్ణం పెంచుతామని చెప్పారు. రైతులు యూనిట్గా ఏర్పడితే ప్రభుత్వం నుంచి రాయితీలు అందుతాయని కోదంరెడ్డి వివరించారు. అనంతరం కమిషన్ సభ్యులతో కలిసి ఆదర్శ రైతు కాశమల్ల రాములు డ్రిప్ పద్ధతిలో చేపట్టిన వరిసాగును పరిశీలించి అభినందించారు. భూసమస్యలపై నిర్లక్ష్యం వద్దు ఎన్ని చట్టాలు తెచ్చిన రైతుల భూసమస్యలు తీరడం లేదని రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల నుంచి తిరుగుతున్నా తమ భూ సమస్యలు పరిష్కారం అవ్వడం లేదని గాండ్లగూడెం, మల్కీజ్గూడ, యాచారం రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. వెంటనే కోదండరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ కీర్తిసాగర్ను పిలిచి భూసమస్యలు తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలన్నారు. పెద్ద గుట్టను ధ్వంసం చేయడం గమనించిన ఆయన వెంటనే పనులు నిలిపేయాలని ఉప తహసీల్దార్కు సూచించారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డి, భవాని, జిల్లా వ్యవసాయాధికారి ఉష, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి సురేశ్, మార్కెటింగ్ అధికారి రియాజ్, ఇబ్రహీంపట్నం ఏడీఏ సుజాత, మండల వ్యవసాయాధికారి రవినాథ్, రైతులు సురేందర్రెడ్డి, వెంకటేశ్ నాయక్, నర్సింహ, సందీప్రెడ్డి పాల్గొన్నారు. కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు వచ్చే ఏడాది జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటాం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి -
ప్రజా పోరాటమే ఎజెండా
● జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ● జిల్లాలో విస్తృత పర్యటన షాద్నగర్: ప్రజా సమస్యలపై పోరాడటమే ఎజెండాగా ముందుకు సాగుతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు తగ్గు తూ వస్తున్నాయని ఆరోపించారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె జిల్లాలో పర్యటించారు. షాద్నగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులను కలిసి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్రి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, పట్టణ శివారులో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల వసతుల కల్పనకు నిధుల కొరత ఉందని, ఈవిషయంపై సీఎం రేవంత్రెడ్డి శ్రద్ధ చూపాలని సూచించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన బాధితులను పరామర్శించారు. ట్రిపుల్ ఆర్ కోసం పెద్దోళ్ల భూములను వదిలేసి, పేదల భూములను తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ప్రాణాలైనా ఇస్తాం.. కానీ భూములను వదులుకోమని కన్నీటి పర్యంతమయ్యారు. కోల శ్రీనివాస్, కప్పాటి పాండురంగారెడ్డి, రమేశ్, లింగంముదిరాజ్ పాల్గొన్నారు. రిలేదీక్షలకు మద్దతు షాబాద్: నలభై రోజులుగా కొనసాగుతున్న బీసీ రిజర్వేషన్ల సాధన రిలే దీక్షలకు కవిత మద్దతు తెలిపారు. జ్యోతిరావుపూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు రైల్ రోకో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారయ్య, ముస్తఫా, రాజేందర్గౌడ్ తమ్మలి రవీందర్, రాపోల్ నర్సింహులు, వెంకట్యాదవ్, రమేష్యాదవ్, రాము పాల్గొన్నారు. పట్టువస్త్రాల సమర్పణ శంకర్పల్లి: మోకిలలో కొనసాగుతున్న ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాల వార్షికోత్సవంలో కవిత పాల్గొన్నారు. అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.లంబాడా మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. దర్గాలో ప్రార్థనలు నందిగామ: కొత్తూరు మండల పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాను కవిత దర్శించుకున్నారు. చాదర్, దట్టీలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలి మహేశ్వరం: మండల కేంద్రంలోని శివ గంగ రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం ఆలయాభివృద్ధి చేయాలని కోరారు. -
సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
చేవెళ్ల: ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుందని.. ఇందుకు నిదర్శనం నేషనల్ హైవే–163 విస్తరణ పనులేనని చేవెళ్ల, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్రెడ్డి, బుయ్యని మనోహర్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్–బీజాపూర్ హైవే విస్తరణ పనులపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2015లో రోడ్డు మంజూరుకు నిధులు మంజూరైనా గత పాలకుల నిర్లక్ష్యం, గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల కారణంగా ఆలస్యమైందని చెప్పారు. ఈ రోడ్డు దుస్థితిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎన్హెచ్ఏ అధికారులు, పర్యవరణ హితులతో చర్చించి ఎన్జీటీ కేసు విత్డ్రా చేయించారన్నారు. రెండు రోజులకే మీర్జాగూడ బస్సు ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఈ రోడ్డు అభివృద్ధికి ఇబ్బందులు లేకుండా పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు అనుసంధానంగా రూ.50వేల కోట్లతో కొత్త రోడ్లు అభివృద్ధి కానున్నాయన్నారు. రూ.450 కోట్లతో నూతన రైల్వే లైన్ రానుందని చెప్పారు. మరుగున పడిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఉమ్మడి జిల్లాకు సాగునీరును అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కత్వాల్గూడ–కొండగల్ వరకు ఇండస్ట్రియల్పార్కు వరకు కొత్తగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలకు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని చెప్పారు. పోలీస్ అకాడమి నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల రోడ్డుపై చేవెళ్ల, మొయినాబాద్లో రెండు బైపాస్తో పాటు 15 అండర్పాస్లు నిర్మించనున్నట్లు చెప్పారు. ఏడాదిలోనే పనులు పూర్తి చేసందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చింపుల సత్యనారాయణరెడ్డి, జనార్ధన్రెడ్డి, పెంటయ్యగౌడ్, వీరేందర్రెడ్డి, బల్వంత్రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రతాప్రెడ్డి, గోపాల్రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్గౌడ్, శ్రీకాంత్, ఆగిరెడ్డి, రాములు, మల్లేశ్, సురేందర్రెడ్డి, కార్తీక్రెడ్డి, పాండు, నరేందర్, శ్రీనివాస్, మల్లేశ్, భీమయ్య, తదితరులు ఉన్నారు. హైదరాబాద్–బీజాపూర్ హైవే విస్తరణ పనులు వేగిరం ‘ప్రాణహిత–చేవెళ్ల’ అభివృద్ధికి చర్యలు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి -
అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరించాలి
● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ● కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో సమీక్ష సమావేశంయావజ్జీవ శిక్ష పడేలా చర్యలు షాద్నగర్: రాజశేఖర్ను హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటా మని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం ఆయన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబాన్ని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఆర్డీఓ సరిత, ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిపి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ.4.12 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ.. ఆధునిక యుగంలోనూ పరువు హత్యలు బాధాకరమన్నారు.రాజశేఖర్ కుటుంబానికి కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో రూ.50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం, ఐదు ఎకరాల భూమి అందజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజశేఖర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కలెక్టర్, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. అవసరానుసారం ఎల్లంపల్లిలో పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ ప్రవేశ కార్యక్రమం చేపట్టండి గ్రామంలో ఉన్న ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదని తెలుసుకున్న వెంకటయ్య వెంటనే ఆలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అన్నివర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్, రాంబాబు నాయక్, తహసీల్దార్ నాగయ్య, సీఐ విజయ్కుమార్, నాయకులు సిద్దార్థ, రవి, జగన్, అనిల్కుమార్, భవానీమల్లేశ్, వేణుగోపాల్, రవి పాల్గొన్నారు. -
గుండెపోటుతో అయ్యప్ప భక్తుడి మృతి
శంకర్పల్లి: శబరిమలలో గురువారం ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండపైకి పాదయాత్ర చేస్తూ వెళ్తుండగా అయ్యప్ప భక్తుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్కి చెందిన గుంతల మల్లికార్జున్ రెడ్డి(40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి భార్య, 13 ఏళ్ల ఇద్దరూ కవల కూతుళ్లు ఉన్నారు. అయితే 41 రోజుల అయ్యప్పస్వామి మాలధారణ అనంతరం ఇరుముడితో ఈనెల 18న 40మంది బృందం బస్సులో శబరిమలకి బ యలుదేరింది. గురువారం అక్కడికి చేరుకున్న బృందం, అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం మార్గమధ్యలో ఉండగా.. మల్లికార్జున్రెడ్డికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కూప్పకూలిపోయాడు. తోటి భక్తులు పైకి లేచి చూడగా.. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. -
శివోహం.. ఘనంగా సమాప్తం
ముగిసిన ఆరుట్ల బుగ్గ జాతర ● ఆలయానికి రూ.14.95 లక్షల ఆదాయం మంచాల: దక్షిణ కాశీగా పేరొందిన ఆరుట్ల శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర గురువారంతో ముగిసింది. ఈనెల 5న కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమైన ఉత్సవాలు 20వ తేదీ నాటికి పదిహేను రోజులు పూర్తి చేసుకొని వైభవంగా ముగింపు పలికింది. పక్షం రోజులపాటు నిర్విరామంగా కొనసాగిన ఉత్సవాలకు పది లక్షల మంది భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రకాలుగా ఆలయానికి రూ.14.95 లక్షల ఆదాయం వచ్చింది. వాటిలో దాదాపు రూ.9 లక్షలు చందాల రూపంలో రాగా, రూ.1.50 లక్షలు లడ్డూ ప్రసాదం, రూ.2.05 లక్షలు పార్కింగ్, తైబజారు రూ.2.40 లక్షలు సమకూరాయి. నిత్యం పటిష్ట బందోబస్తుతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ యాదయ్య, కమిటీ సభ్యులు నిత్యం జాతరలో ఉండి భక్తులకు ఇబ్బందులు లేకుండా సహకరించారు. జాతరకు వచ్చిన పది లక్షల మందిలో 60 శాతం మహిళలే ఉన్నారు. మహిళలు స్నానాలు చేసి కార్తీక దీపారాధన చేసి తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.ఉత్సవాల్లో బొమ్మలు కొనుగోలు చేస్తున్న మహిళలు స్వామి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులు -
ఆలయాలకు సోలార్ సెక్యూరిటీ
● సీఎస్ఆర్లో భాగంగా 60 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్బీఐ, యూబీఐ ● సీఎస్ఆర్ ఆధారిత సామాజిక భద్రత దేశానికే ఆదర్శం: రాజేంద్రనగర్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు మొయినాబాద్: ఆలయ భద్రతకు సోలార్ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు చిలుకూరు బాలాజీ ఆలయం వేదికయింది. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) బ్యాంకులు 60 సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నాయి. అందుకు అవసరమైన నిధులను గురువారం చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ఆయా బ్యాంకుల ప్రతినిధులు సరఫరాదారుడికి చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాజిక భద్రత, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సీసీఆర్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకులు–ఆలయాల భాగస్వామ్యానికి కొత్త దారి చూపుతూ చిలుకూరులో సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటుకు బ్యాంకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ ఆలయాల భద్రతను బలోపేతం చేయడంతోపాటు పర్యావరణ అనుకూల పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. ఆలయ భద్రతలో రిమోట్ సర్వేలెన్స్ సొల్యూషన్లను సీఆర్ఆర్కు అనుసంధానం చేయడం దేశంలో ఇదే తొలుత అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. ఆలయ సముదాయాలకు సీఎస్ఆర్ ఆధారిత సామాజిక భద్రత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును చిలుకూరులో ప్రారంభించినందుకు ఎస్బీఐ, యూబీఐ అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, ఎస్బీఐ డీజీఎం సలీల్ శుక్ల, రీజనల్ మేనేజర్ నితిన్కుమార్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
మర్రి చెట్టును ఢీకొట్టిన టిప్పర్
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ ర హదారిపై అదుపుతప్పి ఓ టిప్పర్ మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ బస్ స్టేజీ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైవే రోడ్డు పనుల కోసం మట్టిని తీసుకువస్తున్న టిప్పర్ వికారాబాద్ వైపు నుంచి చేవెళ్లకు వస్తుంది. ఖానాపూర్ బస్స్టేజీ వద్దకు రాగానే టిప్పర్ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును తప్పించబోయి పక్కకు మలపడంతో అదుపుతప్పి మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ వడ్డె శ్రీరామ్ క్యాబిన్లో ఇరుక్కుపోయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు జేసీబీ సహాయంతో డ్రైవర్ను బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఎస్ రాజమౌళిపై ఫిర్యాదు
అబ్దుల్లాపూర్మెట్: హనుమంతుడిపై అనుచిత వ్యా ఖ్యలు చేసిన సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్లో యుగ తులసీ పార్టీ అధ్యక్షుడు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు కె.శివకుమార్ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది వినోద్, శ్రీ రామ్ జోషి, సందీప్, శ్రీకాంత్, నాగిరెడ్డి, లక్ష్మణ్, చంటిలతో కలిసి ఫిర్యాదు పత్రాన్ని సీఐ అశోక్రెడ్డి అందజేశారు. సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్య హస్తినాపురం: పురుగుల మందుతాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. సాహెబ్నగర్కు చెందిన పారంద శ్రీకాంత్ (32) గతంలో హయత్నగర్కు చెందిన నలుగురితో రూ.2 లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు శ్రీకాంత్పై ఒత్తిడి తేవడంతో పాటు నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తామని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంటికి తాళాలు వేసి రోడ్డుమీదకు లాగుతామని ఫోన్లో బెదిరించారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్ సెల్ఫోన్లో సెల్ఫీ వీడియోలో ‘తల్లిదండ్రులు నన్ను క్షమించండి... నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. నా చావుకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు.. ఇంటికొచ్చి పరువు తీస్తారనే భయంతోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నానని’ వీడియోను స్థానిక సాహెబ్నగర్ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. గురువారం శ్రీకాంత్ హరిహరపురం కాలనీలోని కప్పలచెరువు కట్టమీద మందులో విషం కలుపుకుని తాగి అక్కడే మృతి చెంది కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. -
విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి అవసరం
బడంగ్పేట్: మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. గురువారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫుయెల్ సంస్థ, సీజీఐ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఎంపవరింగ్ యూత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా బాలకిష్టారెడ్డి, కాలేజ్ అధ్యక్షుడు పీవీఆర్ కాశ్యప్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి చాలా అవసరమన్నారు. విద్యాసంస్థలు–పరిశ్రమల సహకారంపై అవగాహన కల్పించారు. మార్కెటింగ్ లక్ష్యాలను తెలుసుకొని విద్యార్థులు భాగస్వామ్యం కావాలన్నారు. సమగ్ర శిక్షణను విద్యార్థులకు అందించేందుకు ఎంవీఎస్ఆర్ తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో డా.ఎం.కామేశ్వర్రావు, కె.సర్వేశ్, జ్యోతి శైలేంద్ర, డా.నందితారాజ్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
పాడి రైతుల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు
కడ్తాల్: విజయ డెయిరీలో పాలు విక్రయించే రైతులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు, తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య తోడ్పాటునందిస్తోందని విజయ డెయిరీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మోహన్ మురళి అన్నారు. మండల పరిధి మక్తమాధారంలోని పాలసేకరణ కేంద్రంలో బుధవారం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారులతో నిర్వహించిన సమావేశంలో మోహన్ మురళి మాట్లాడుతూ.. విజయ డెయిరీకి పాలు విక్రయించే రైతులను ప్రోత్సహించేందుకు పాడి పరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య ప్రత్యేక కృషి చేయడం జరుగుతోందన్నారు. స్థానికంగా ఆయా గ్రామాల్లో బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడి, పాడి రైతులకు పాడి పశువుల కొనుగోలుకు రుణాలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ ప్రాణేశ్కుమార్, సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఇంటర్ స్కూల్ పోటీలు
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ ఇంటర్ స్కూల్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా చిన్నారులకు జిమ్నాస్టిక్, స్కేటింగ్, స్విమ్మింగ్, కరాటే, చెస్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు మహేశ్వర్, వెంకటేశ్, ప్రియాంక సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
సీలింగ్ భూములు స్వాహా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా /శంషాబాద్ రూరల్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న ఘాంసిమియాగూడ సర్వే నంబర్ 3, 4లో 400 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ప్రభుత్వం అప్పట్లో కొంత మంది నిరుపేద రైతులకు కొంత అసైన్డ్ చేసింది. ఆయా భూములు సీలింగ్ పట్టాలుగా రికార్డు అయ్యాయి. నిబంధనల ప్రకారం వీటిని అమ్మడం, కొనడం నేరం. రిజిస్ట్రేషన్ చేయొద్దని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ 2025 ఫిబ్రవరి 18న జిల్లా రిజిస్ట్రార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే షన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో 15 ఎకరాల స్థలంలో ఓ కీలక నేత నిర్మాణాలు చేపట్టడాన్ని పరిశీలిస్తే.. అధికార యంత్రాంగం ఎలా దాసోహం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 20 ఎకరాలకు సంబంధించి గత ప్రభుత్వంలోని సీఎంకు లెఫ్ట్..రైట్ అనుకున్న ఓ పెద్దమనిషి ఆ భూములను రైతుల నుంచి కొనుగోలు చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో రేవంత్రెడ్డే స్వయంగా నాగలికట్టి నిరసన తెలిపారు. సదరు భూములు పేదలకు చెందాల్సినవని, క్రయవిక్రయాలకు వీలు లేదు, కొనుగోలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే సర్వే నంబర్లో గోల్డ్స్టోన్ కంపెనీ భారీగా భూములు కొనుగోలు చేసింది. దీనిపై నాటి ప్రభుత్వం కోర్టులో కేసు కూడా వే సింది. గోల్డ్స్టోన్ ప్రసాద్ను మాత్రమే కాదు ఎన్నో ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులను కూడా భూముల్లోకి రాకుండా అడ్డుకుంది. అదే సర్వే నంబర్లోని కొంత భూమిని స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్ర తినిధి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అందులో భారీ నిర్మాణాలు చేపడుతుండటం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమి నుంచి గోదాం వరకు ఏకంగా మట్టి రోడ్డు వేసుకున్నా పట్టించుకున్న నాథుడు లేడు. వారసుల పేరుతో పాగా వివాదాస్పద ఈ భూములు పైగా వారసులకు చెందినవంటూ కొంతమంది కోర్టు నుంచి తమకు అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకుని పాగా వేశారు. ఏళ్ల నుంచి భూములను సాగు చేసుకుంటున్న రైతులను బెదిరించి, ఎంతో కొంత వారికి ముట్టజెప్పి వారిని బలవంతంగా కబ్జా నుంచి పంపించి వేశారు. ఇదే సమయంలో ఈ భూముల్లో కొంత సీలింగ్ పట్టాలు కలిగిన రైతులు ఉన్నారు. మరికొంత మంది పట్టాదారులు ఉన్నారు. పైగా భూములపై తమకు హక్కులు ఉన్నాయంటూ గోల్డ్ స్టోన్ కంపెనీ అప్పట్లోనే ఇక్కడ కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి వరకు సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించి.. వారి వద్ద ఉన్న అన్ని రికార్డులు స్వాధీనం చేసుకుంది. ఇదే కంపెనీ నుంచి స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి 15 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఆ తర్వాత పట్టా భూములుగా మారిపోయాయి. ఇదిలా ఉండగా ఈ భూములను రెవెన్యూ అధికారులు ఇటీవల రీసర్వే చేశారు. రైతుల వద్ద ఉన్న రికార్డులు, సాగు విస్తీర్ణం మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడలో అక్రమాలు పట్టా భూములుగా.. నిషేధిత జాబితాలోని భూములు 111 జీఓ నిబంధనలకు తూట్లు.. భారీ షెడ్ల నిర్మాణాలు పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగంచట్టాలు చేయాల్సిన పాలకులే.. వాటిని తుంగలో తొక్కుతున్నారు. పేదల భూములపై కన్నేసి.. లీజు పేరుతో తక్కువ ధరకు కొల్లగొడుతున్నారు. తమకు నచ్చిన రెవెన్యూ అధికారులకు పోస్టింగ్లు ఇప్పించి నిషేధిత జాబితాలో ఉన్న భూములను.. పట్టా భూములుగా మార్చేస్తున్నారు. ఒకవైపు సీలింగ్ యాక్ట్.. మరోవైపు 111 జీఓలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కళ్లముందే ఖరీదైన భూములు కరిగిపోతున్నా.. వాటిల్లో అడ్డగోలు నిర్మాణాలు వెలుస్తున్నా.. అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుందే కానీ.. అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఘాన్సీమియాగూడలోని వివాదాస్పద భూముల విషయంలో కోర్టు నుంచి పలు ఉత్తర్వులు ఉన్నాయి. 2011లోనే సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. తర్వాత 2023లోనూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అప్పటి వరకు ఉన్న సీలింగ్ను తొలగించి, దాని స్థానంలో పట్టా భూమిగా నమోదు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు సీలింగ్ భూములను పట్టా భూములుగా మార్చాల్సి వచ్చింది. గోదాములు, ఇతర నిర్మాణాలు ఉన్న ప్రదేశానికి 111 జీఓలో మినహాయింపు కల్పించింది. – రవీందర్దత్తు, తహసీల్దార్, శంషాబాద్ -
గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఫిర్యాదులపై విచారణ
కడ్తాల్: మండల పరిధిలోని ఎక్వాయిపల్లిలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించి గతంలో వచ్చి న ఫిర్యాధులపై బుధవారం విచారించారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయం వద్ద బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు తమ అభిప్రాయాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో పాటు, అధికారుల దృష్టికి తెచ్చారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలని, లేని పక్షంలో కొంగరకలాన్లో ఇచ్చిన విధంగా ఎకరాకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
వివాదాలకు తావివ్వొద్దు
● ప్రణాళిక ప్రకారం ఇందిరమ్మ చీరల పంపిణీ జరగాలి ● కలెక్టర్ నారాయణరెడ్డిఇబ్రహీంపట్నం రూరల్: వివిదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కోటి మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా కలెక్టర్లతో వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. పంపిణీపై స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు పంపిణీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఆర్డీఓ, మెప్మా పీడీ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శరవేగంగా రహదారి పనులు
చేవెళ్ల: పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో జరుగుతున్న రోడ్డు పనులను బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న తీరును, నాణ్యత గురించి కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఈరోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోడ్డు పూర్తయితే చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొండగల్ నియోజకవర్గాలతోపాటు బీజాపూర్ వరకు వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. చేవెళ్ల, మొయినాబాద్ బైపాస్ రోడ్డు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, త్వరలో పూర్తవుతాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, వెంకట్రెడ్డి, పెంటయ్యగౌడ్, శ్రీనివాస్గౌడ్, ప్రభాకర్, వీరరేందర్రెడ్డి, గోనే ప్రతాప్రెడ్డి, గోపాల్రెడ్డి, పాండు, మధుసూదన్గుప్తా తదితరులు ఉన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
కులాంతర వివాహితులకు రక్షణ చట్టం తేవాలి
షాద్నగర్రూరల్: రాష్ట్రంలో జరుగుతున్న కుల దురహంకార హత్యలను నివారించేందుకు ప్రభుత్వం కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చటం తేవాలని ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకట్రాములు డిమాండ్ చేశారు. సంఘం నాయకులు బుధవారం మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించారు. మృతుడి రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మాదిగ ఐక్యవేదిక, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీల నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ.. కొందరు కుల ఉన్మాదులుగా వ్యవహరించి దళిత యువకుడిని అత్యంత అమానవీయంగా హత్య చేయడం వెనుక ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రోజురోజుకూ కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ హత్యను నిరసిస్తూ ఈ నెల 20, 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు అంజయ్య, జగన్, శ్రీనునాయక్, రాజు, సాయిబాబు, పెంటనోళ్ల నర్సింలు, దొడ్డి శ్రీనివాస్, శ్రీకాంత్, ఈశ్వర్నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ బడుల్లో ఫీజు రాయితీ ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి సైదులు మాట్లాడుతూ.. ప్రైవేట్ బడుల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వడంలో యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని తెలిపారు. హెల్త్కార్డులు జారీ చేయాలని చెప్పారు. పై విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, మణికుమార్, రాందాస్, జిల్లా సహాయ కార్యదర్శులు ప్రభాకర్, నర్సింహ, నేషనల్ కౌన్సిల్ సభ్యులు దేవేందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఖాజా పాషా, శ్రీనివాస్, యాదగిరి, జగన్, రాఘవేందర్, నరేష్, రాజు, నర్సింహ, సురేందర్, గోపాల్, శ్రీరాములు, నర్సింహారెడ్డి, ఆంజనేయులు, సాయినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ -
ప్రభుత్వ భూములపై టీజీఐఐసీ నజర్
యాచారం మండలంలో భూ బ్యాంకు నోటిఫికేషన్ ● ఉపాధి కోల్పోతామని రైతుల ఆవేదన ఫార్మాసిటీ, పారిశ్రామికవాడ.. ఇలా అభివృద్ధి పేరిట సాగు భూములను లాక్కోవడంతో ఉపాధి కోల్పోతున్నామని యాచారం మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భూ బ్యాంకు మరింతగా నిరాశ్రయులను చేస్తుందని వాపోతున్నారు. యాచారం: పారిశ్రామిక వాడ కోసమని యాచారం మండలంలోని సర్కారు భూములపై టీజీఐఐసీ దృష్టి పెట్టింది. రోడ్డు మార్గం అనువుగా ఉండడం, అత్యధికంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములే ఉండడంతో అధికారులకు భూసేకరణ అనుకూలంగా మారింది. గతంతో ఫార్మాసిటీ పేరుతో నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో వేలాది ఎకరాల భూమిని సేకరించింది. ఆయా గ్రామాల్లో దాదాపు 12 వేల ఎకరాలకు పైగానే అసైన్డ్, పట్టా భూముల సేకరణకు సిద్ధమై, ఇప్పటికే 9 వేల ఎకరాలు సేకరించింది. మరో 2,500 ఎకరాల పట్టా భూమి పరిహారాన్ని అథారిటీలో జమ చేసి, భూ రికార్డుల్లోని రైతుల పేర్లను మార్చేసిన అధికారులు టీజీఐఐసీ పేరును నమోదు చేశారు. రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయాలని 900 మందికి పైగా రైతులు నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందన లేకుండా పోయింది. హైకోర్టు స్వష్టమైన ఆదేశాలిచ్చినా చలనం లేదు. పారిశ్రామికవాడ కోసమని పారిశ్రామికవాడ మొండిగౌరెల్లిలో 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరణకు అధికారులు నిర్ణయించారు. గత మార్చి నెలలోనే నోటిఫికేషన్ ప్రకటించి, పలుమార్లు గ్రామ రైతులతో సమావేశమై పరిహారాన్ని ఇచ్చే విషయంలో చర్చించారు. ఎకరాకు రూ.60 లక్షల పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల ప్లాటు ఇస్తేనే భూములు ఇస్తామని లేదంటే, ఇవ్వమని కర్షకులు మొండికేశారు. అధికారులు మాత్రం కేవలం రూ.22 లక్షలతోపాటు 121 గజాల ప్లాటు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది. తాజాగా భూ బ్యాంకు సిద్ధం చేసే పనిలో భాగంగా 250 ఎకరాలకు పైగా అసైన్డ్, ప్రభుత్వ భూములున్న యాచారం, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, చింతుల్ల, నల్లవెల్లి, మంతన్గౌరెల్లి తదితర గ్రామాల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. 20 వేల మందికి పైగా మండలంలోని ఫార్మాసిటీ, భూ బ్యాంకు సిద్ధం చేసిన పలు గ్రామాల్లో దాదాపు 20 వేల మందికి పైగా రైతులు నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఉంది. అదే భూముల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేసే మరో 50 వేల మంది ఉపాధిని కోల్పోతారు. పాడి, పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి భూములే ఉండని దుస్థితి రావచ్చు. భూముల్లో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే ఫ్యూచర్సిటీ (ఫోర్త్) ఏర్పాటు అవుతుండొచ్చు. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందొచ్చు. కానీ భూములు కోల్పో యే రైతులు, వాటిపై ఆధారపడి జీవనోపాధి పొందే కూలీలు బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయి. అభిప్రాయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మోజార్టీ రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తే ఆ గ్రామంలో ప్రక్రియ నిలిపేయాలి. భూములు కోల్పోయే రైతులు పూర్తిగా జీవనోపాధులు కోల్పోయే ప్రమాదం ఉంది. – సుకన్య, మాజీ ఎంపీపీ యాచారం మెరుగైన పరిహారం ఇవ్వాలి భూసేకరణ చట్టాన్ని అధికారులు తుంగలో తొక్కుతున్నారు. చట్టం ప్రకారం రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడం లేదు. ఆ భూములపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న రైతులతో పాటు కూలీలను ఆదుకోవడం లేదు. ఫార్మాసిటీ భూసేకరణలో అదే జరిగింది. – నర్సింహ, సీపీఎం మండల కార్యదర్శి ఇదేక్కడి న్యాయం భూములు కోల్పోయాక ఏం అభివృద్ధి జరిగితే ఏం ప్రయోజనం. ఫార్మాసిటీ పేరుతో పంటలు పండే పది ఎకరాలకు పట్టా భూమిని తీసుకోవాలని చూస్తున్నారు. ఇదేక్కడి న్యాయం. న్యాయమైన పరిహారం ఇవ్వడం లేదు. టీజీఐఐసీ పేరు ఉన్న భూ రికార్డులను రైతుల పేర్లపై మార్చడం లేదు. – నిర్మలమ్మ, మాజీ సర్పంచ్, నక్కర్తమేడిపల్లి -
కులవివక్ష నిర్మూలనకు చర్యలేవి?
షాద్నగర్: గ్రామాల్లో కులవివక్ష నిర్మూలన కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు షాద్నగర్ ఆర్డీఓ సరితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జంగయ్య మాట్లాడుతూ.. 15ఏళ్ల క్రితం గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనం రూపుమాపేందుకు అధికారులు చర్యలు చేపట్టేవారన్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది ప్రతి నెల చివరి వారంలో గ్రామాలను సందర్శించి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేసేవారన్నారు. దీంతో అన్ని కులాలు, మతాల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేదన్నారు. ప్రస్తుతం అలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నారు. కులవివక్ష కారణంగానే ఇటీవల ఎల్లంపల్లి గ్రామంలో దళిత యువకుడు రాజశేఖర్ను దారుణంగా హతమార్చారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పవన్చౌహాన్, వెంకటయ్య, రమేష్ యాదవ్, నర్సింహ, రాజునాయక్, వీరేశం, మాసయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య -
ప్రజా సమస్యలపై పోరాటం
మొయినాబాద్: పేదల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాశ్య పద్మ అన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న ప్రచార జాత మంగళవారం రాత్రి మొయినాబాద్కు చేరుకుంది. కళా ప్రదర్శనలు నిర్వహించి కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందేళ్లుగా సీపీఐ పార్టీ పేదలు, బడుగులు, కార్మికులు, కర్షకుల పక్షాన అనేక పోరాటాలు చేసిందన్నారు. చట్టసభల్లో సీట్లు లేకున్నా నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్నామన్నారు. ఈ నెల 26న ఖమ్మంలో జరిగే సీపీఐ వందేళ్ల ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు ప్రభులింగం, సత్యనారాయణ, మంజుల, అంజయ్య, సుధాకర్, శ్రీనివాస్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఇబ్రహీంపట్నం: ‘యువజన ఉత్సవాలు–2025’ పోటీల్లో సాహిత్య, సాంస్కృతిక విభాగాల్లో రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు తమ విద్యార్థులు ఎంపికై నట్లు ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, సాంస్కృతిక విభాగాల కన్వీనర్ రాకేశ్భవాని తెలిపారు. కథా రచనల్లో టీనా కుమారి(బీఎస్సీ, ప్రథమ సంవత్సరం) ప్రథమ, సాయి కృప(బీకాం, ప్రథమ సంవత్సరం) ద్వితీయ, చిత్ర లేఖనంలో రజిత(బీకాం, ప్రథమ సంవత్సరం) ద్వితీయ బహుమతులను సాధించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సురేష్, అధ్యాపకులు, సిబ్బంది రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. -
ఇక్ఫాయ్లో సాంస్కృతిక వేడుకలు
చేవెళ్ల: శంకర్పల్లి మండలంలోని దొంతన్పల్లి సమీపంలోని ఇక్ఫాయ్ లా స్కూల్లో బుధవారం వార్షిక సాంస్కృతిక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన మోరాకి కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా లా స్కూల్ డైరెక్టర్ డాక్టర్ పూజారి రవిశేఖర రాజు, డీన్ డాక్టర్, వై.ప్రతాప్రెడ్డి, యాంకర్ అంజలి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళ, సృజానాత్మకతల సమ్మేళనంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, అతిథులను ఒకే వేదికపై తీసుకువచ్చి నిర్వహించిన ఈ ప్రదర్శనలు ఉత్సహభరితంగా సాగాయి. కార్యక్రమంలో మోరాకి కల్చరల్ క్లబ్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ డాక్డర్ రేణుబాలా, అసిస్టెంట్ డీన్ డాక్టర్ అరుణ్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాడి పరిశ్రమ అభివృద్ధితో లాభాలు
షాబాద్: మహిళలు, యువకులు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించ వచ్చునని పశువైద్య వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ కొండల్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుర్వగూడలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్, పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ వర్సిటీ(పీవీఎస్ఆర్టీయూ) రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో జిల్లా శాసీ్త్రయ పద్ధతుల డెయిరీసాగు, పాల ఉత్పత్తుల విలువల జోడింపుపై మహిళలకు, యువకులకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతిలో పాడి పశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై అవగాహన కల్పించామన్నారు. డాక్టర్ ఎం.శశికుమార్, సాహిత్యరాణి శాసీ్త్రయ పద్ధతుల ఆధారంగా ఆధునిక డెయిరీ ఫారాల స్థాపనపై సూచనలు ఇచ్చారు. పశుపోషణ, షెడ్ నిర్మాణం, తక్కువ లాభాలు వంటి అంశాలపై వివరించారు. రత్నాకర్ మాట్లాడుతూ.. డెయిరీ రంగంలో గ్రామీణ మహిళల సాధికారత అంశంపై పాడి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. పాల ఉత్పత్తి, పశుపోషణ వంటి కార్యకలాపాల్లో మహిళల పాత్రను కొనియాడారు. ప్రభుత్వం పథకాల వినియోగం, వ్యాపార నైపుణ్యాల సాధన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలన్నారు. మజ్జిగ, నెయ్యి, క్రీమ్ తయారీపై డెమో ఇచ్చారు. పాలపదార్థాల తయారీపై వర్క్షాప్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుర్వగూడ మాజీ సర్పంచ్ బుయ్యని సంధ్య మల్లికార్జున్గౌడ్, కార్యదర్శి యాదయ్య, శ్రీనివాస్, పద్మ, పాడి రైతులు యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పశు వైద్య వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ కొండల్రెడ్డి -
● ఆవేదన
● ఆందోళన ఇబ్రహీంపట్నం చెరువులోకి భారీగా నీరు రావడంతో ఉప్పరిగూడ రైతుల పంటలు నీటమునిగాయి. బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, గోపాల్, నర్సింలు పంటలను పరిశీలించారు. పెద్దవాగు, రాచకాలువ పారి 40 మంది రైతులకు చెందిన 80 ఎకరాల పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను పంట నష్టపరిహారంఅందజేయాలని డిమాండ్ చేశారు. – ఇబ్రహీంపట్నం రూరల్ ముద్వీన్ జెడ్పీహెచ్ఎస్లో మూడు నెలలుగా భౌతిక, రసాయన శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నామని 8,9,10 తరగతుల విద్యార్థులు మంగళవారం రహదారిౖపైబెఠాయించారు. ఎంఈఓ, డీఈఓలకు సమస్యను వివరించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు నరేశ్ అక్కడకు చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. – కడ్తాల్ -
జనావాసాల మధ్య ఎస్టీపీ వద్దు
ఆందోళన చేపట్టిన ప్రజలు ● మరోచోటుకు తరలించాలని డిమాండ్ అబ్దుల్లాపూర్మెట్: పెద్దఅంబర్పేట రెవెన్యూ సర్వే నెంబర్ 292లో ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధి ప్లాంటు)ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం అంబికా నగర్, స్వగృహ కాలనీ, పోలీస్ కాలనీ, దయాకర్ రెడ్డి కాలనీల ప్రజలు ఆందోళనకు చేపట్టారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో భూగర్భ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈదుల చెరువు సైతం కలుషితమై చేపల పెంపకానికి ఇబ్బందిగా మారే అవకాశముందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ను జనావాసాలకు దూరంగా ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్టీపీ ప్లాంట్ వద్దు.. పార్కులు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి, మురళీధర్ రెడ్డి, పెంటయ్య, కృష్ణారెడ్డి, చిన్న భూపాల్ రెడ్డి, రాజు, అయ్యప్ప రెడ్డి, నర్సింగ్ రావు, అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, చంటి, ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
కొందుర్గు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మృతి చెందాడు. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన ప్రకారం.. మ ండల పరిధిలోని వెంకిర్యాలకు చెందిన కలాల్ మాసయ్యగౌడ్(60) సో మవారం తన టీవీఎస్ మోటార్ సైకిల్పై పొలం నుంచి ఇంటి వస్తుండ గా కొల్లూరు–వెంకిర్యాల మార్గంలో ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో తీవ్రంగా గాయపడిన మాసయ్యగౌడ్ను చికిత్స నిమిత్తం శంషాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విష మి ంచి మంగళవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడి కుమారుడు ఆనంద్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీధి కుక్కను ఢీకొట్టి.. యాచారం: వీధి కుక్కను ఢీకొట్టిన ద్విచక్రవాహనదారుడు చికిత్ప పొందుతూ మృతి చెందాడు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని చౌదర్పల్లికి చెందిన అజ్జు(40) సోమవారం రాత్రి 10.30గంటలకు తన బైక్పై చీదేడ్లో అత్తారింటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో గడ్డమల్లయ్యగూడ సమీపంలో వీధి కుక్కను ఢీకొట్టాడు. క్షతగాత్రుడిని ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఆసియా, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. దొరకని కొండ చిలువ జాడ తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని న్యూ సుభాష్ నగర్ కాలనీలో సోమవారం స్థానికలు కంటపడి కలకలం రేపిన కొండ చిలువ కోసం మంగళవారం అటవీ శాఖ, మున్సిపల్ అధికారులు వెతికినా ఫలితం లేకపోయింది. పరిసరాలను శుభ్రం చేయించి, ట్రాక్టర్తో దున్నించినా దాని జాడ తెలియలేదు. స్థానికులకు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
షాద్నగర్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ విజయ్కుమార్ వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు వినియోగించినట్లు సమాచారం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు. డ్రగ్స్ను నిషేధించడం ప్రతీ పౌరుడి బాధ్యత అన్నారు. విద్యార్ధులు, యువకులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో.. మాదక ద్రవ్యాల నివారణకు మంగళవారం చించోడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, డాక్టర్ ప్రవీణ, సూపర్ వైజర్ చంద్రకళ, నర్సులు సువర్ణ, ఫకీరమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు షాద్నగర్రూరల్: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పీఎస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత యువకుడు రాజశేఖర్ను హత్య ఘటనలో ఇప్పటికే ఏడుగురిని రిమాండ్కు తరలించగా పరారీలో ఉన్న గణేశ్ను బుధవారం అరెస్ట్ చేశామన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్య కేసును నమోదయిందన్నారు. నిందితులకు చట్టపరంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగుల వెంకటేశ్ మీడియా ముసుగులో జర్నలిస్టుగా చలామణి అవుతున్నాడని, నకిలీ మీడియా విలేకరులపై సైతం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసు దర్యాప్తులో ప్రధాన భూమిక పోషించిన సీఐ విజయ్కుయార్, ఎస్ఐలు సుశీల, శరత్కుమార్, సిబ్బందిని అభినందించారు. ఏసీపీ లక్ష్మీనారాయణ -
అప్పుడే డంపు.. కాసేపటికే తొలగింపు
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత హెచ్చరించారు. మంగళవారం మున్సిపల్ పరిధి కమ్మగూడలోని సర్వే నంబర్ 212లో లారీలో వ్యర్థాలను తీసుకువచ్చి డంప్ చేస్తుండగా స్థానికులు గమనించి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత రంగంలోకి దిగారు. అప్పటికే పెద్ద మొత్తంలో వ్యర్థాలను డంప్ చేయడంతో అడ్డుకొని హెచ్చరించారు. తిరిగి డంప్ చేసిన చెత్తను లారీ యజమానితోనే జేసీబీ తెప్పించి ఎత్తి వేయించారు. అనంతరం రూ.వేయి జరిమానా విధించినట్లు తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి, పర్యావరణ కాలుష్యానికి కారకులు కావద్దని కోరారు. – తుర్కయంజాల్ -
‘బ్రిలియంట్’ దొంగలు దొరికారు
● ఇంజినీరింగ్ కళాశాలలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు ● పరారీలో మరో ముగ్గురు.. ● రూ. 37.5 లక్షల నగదు స్వాధీనం నాగోలు: నగర శివారు అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో గత నెల 10వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసును ఎల్బీనగర్ సీసీఎస్, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు చేధించారు. అంతర్రాష్ట దొంగల ముఠాలోని ఆరుగురిలో.. ఇద్దర్ని అరెస్టు చేసి ఒక మైనర్ను హోమ్కు తరలించారు. వారి వద్ద రూ.37.05 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీసీపీ అనురాధ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన రాజు మనోహర్ పవార్, దనేష్ మోహితే, రితిక్ అలియాస్ రితిక్ మోహితే, అరుణ్ మోహితే, విలాస్ బోహన్, 16 ఏళ్ల బాలుడు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు వాళ్లకు నచ్చిన ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలు చేస్తారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా.. ఈ ముఠాలోని నిందితులు గూగుల్ మ్యాప్ ఉపయోగించి జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న విద్యాసంస్థలను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ కేసులో నిందితులు ఒకరికొకరు బంధువులు. అబ్దుల్లాపూర్ మెట్ చోరీకి ముందు వీరంతా ముందుగా గుజరాత్ రాష్ట్రం వల్సాద్ జిల్లాలోని ఉమర్గామ్ గ్రామంలో సమావేశమయ్యారు. అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ నగర శివార్లలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అక్టోబర్ 8న స్లీపర్ బస్సులో హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో దిగారు. లింగంపల్లి రైల్వే స్టేషన్లో స్నానం చేసిన తర్వాత, జూపార్క్కు ఆటోలో వచ్చి సమీపంలోని దుకాణంలో హ్యాండ్ గ్లవ్స్ కొనుగోలు చేశారు. అనంతరం గూగుల్ మ్యాప్ ఉపయోగించి తట్టి అన్నారంలోని శ్రేయాస్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బందిని చూసి చోరీ చేయలేమని భావించారు. తర్వాత బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాల చోరీకి అనుకూలంగా ఉందని గుర్తించారు. ఆటోలో కళాశాలకు చేరుకుని అర్ధరాత్రి 12 గంటలకు కళాశాల అడ్మిన్ బ్లాక్లోని గ్రిల్, డోర్ లాక్లను పగలగొట్టి అల్మారాలో ఉన్న దాదాపు రూ.1.07 కోట్ల నగదును చోరీ చేశారు. కాలేజీ ఉన్న సీసీ కెమెరాల్లోని రికార్డులను సైతం ఎత్తుకెళ్లారు. చోరీ అనంతరం డబ్బులు వాటాలు వేసుకుని తీసుకున్నారు. కొంత డబ్బును కళాశాల సమీపంలోని ఒక పాడుబడిన గదిలో ఉంచారు. తర్వాత జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు ఎక్కి సిటీకి చేరుకున్నారు. అక్కడి నుంచి నాగార్జున సాగర్కు క్యాబ్లో..అక్కడి నుంచి విజయవాడకు ఆటోలో వెళ్లారు. అనంతరం స్లీపర్ బస్సులో విజయవాడ నుంచి ముంబైకి వెళ్లారు. కాలేజీలో చోరీ జరిగిన సంఘటన తెలుసుకున్న ప్రిన్సిపాల్ వీరన్ పోలీస్లకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్మెట్, సీసీఎస్, ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో గాలించి పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలోని కొత్తగూడ చౌరస్తా వద్ద రాజ్ మనోహర్ పవార్, రితిక్, బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.


