breaking news
Ranga Reddy District Latest News
-
ఎన్నికల నిబంధనలు పాటించాలి
మంచాల: గ్రామాల్లో ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివా స్ అన్నారు. మండలంలోని ఆరుట్ల ఆదర్శ పా ఠశాలలో శుక్రవారం మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయనముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన నియమాలు, నిబంధనలు అమలు పర్చాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతోప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలశంకర్, తహసీల్దార్ వెంకటప్రసాద్,ఎంఈఓ రాందాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ మీర్పేట: మనం అమెరికా వెళ్లడం కాదు.. అమెరికాలో ఉన్న వారిని మన దేశ అభివృద్ధికి తీసుకురాగల స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆకాంక్షించారు. మీర్పేట సర్కిల్లోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమా ల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి శుక్రవా రం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యార్థులు అదృష్టవంతులని, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఉన్నత విద్యావకాశాలు కల్పించామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ఏటీఏ సభ్యుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఏటీఏ అధ్యక్షులు చల్లా జయంత్రెడ్డి, చల్లా బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలపై శిక్షణ కందుకూరు: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. కొత్తగూడ పరిధిలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిసైడింగ్, స్టేజ్–2 అధికారులకు పంచాయతీ ఎన్నికల పై శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..ఎన్నికల నియమావళి ప్రకా రం విధులు నిర్వర్తించాలన్నారు. మాస్టర్ ట్రైన ర్లు ఇమాన్యూల్, మల్లేశం విధి విధానాలపై శిక్ష ణ ఇచ్చారు.కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారి సుధారాణి, ఎంపీడీఓ సరిత పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక– సంగీత కార్యక్రమం మొయినాబాద్: ఆధ్యాత్మిక గంభీరత, భావరసం, రాగబంధం, సాహిత్య సౌందర్యంతో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయంలో శుక్రవారం తెలంగాణ భక్తి సంగీత సంపదలో విశిష్ట స్థానం సంపాదించిన రాకమచర్ల వెంకటదాసు కీర్తనలు, శేషులతా విశ్వనాథ్ స్వరరచనలో సంప్రదాయ భజన శైలిలో చేపట్టిన ఆధ్యాత్మిక–సంగీత కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఆలయ అర్చక ధర్మకర్తలు ఎంవీ సౌందరరాజన్, గోపాలకృష్ణస్వామి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కీర్తనల్లోని రాగభావం, ఆధ్యాత్మికత, వాగ్గేయకార శైలి వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. -
● వలస ఓటర్లకు గాలం
ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని సైతం వదులుకోకుండా గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఎలాగైనా పోలింగ్రోజు రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేసుందుకు ఊరికి రావాలని కోరుతున్నారు. కొంతమంది స్వయంగా కలిసి ఎన్నికల్లో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు భరిస్తామని, ఓటుకు కొంతమొత్తం ముట్టజెపుతామని బేరసారాలు సాగిస్తున్నారు. ఓటర్లంతా ఒకే దగ్గర ఉంటే వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్కూ స్వస్తిక్ మార్కు ఇవ్వాలి
శంకర్పల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా రహస్యంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నా అది బహిర్గతం అవుతోందని టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో పెన్నుతో రైట్ మార్కు ఇచ్చి తమ ఓటును వేస్తారని, దీంతో ఓట్ల లెక్కింపు సమయంలో ఓటు ఎవరు వేశారు అనే విషయం బహిర్గతమవుతోందని అన్నారు. సాధారణ పౌరులు స్వస్తిక్ మార్కు ద్వారా ఓటు వేసినట్లే, తమకూ అవకాశం ఇవ్వాలని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను విడిగా కాకుండా, అందరితో పాటే లెక్కించాలని కోరారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. -
ముగిసిన రెండో విడత ప్రచారం
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు పోటాపోటీగా గడపగడపనూ చుట్టేశారు. ఈనెల 14న పోలింగ్ జరగనున్న డివిజన్లోని అన్ని పంచాయతీల్లో వారం రోజులుగా హామీల వర్షం కురిపించారు. భారీ ర్యాలీలతో తమ బలం చాటుకున్నారు. బలాబలాల ప్రదర్శన ముగియడంతో ఇక అసలు రాజకీయం మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లెపారు. మందు, విందు, తాయిలాల పంపిణీ మొదలు పెట్టారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నగరానికి అతీ సమీపంలో ఉన్న జిల్లాలో రియల్ ప్రభావంతో భూముల రేట్లు పెరిగినట్లుగానే ఎన్నికల్లో ఓటర్లకు ఓటు రేటు కూడా పెరిగిపోయింది. చిన్నచిన్న పంచాయతీల్లో సైతం ఓటుకు రూ.3వేల నుంచి రూ.10వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో, ఎంతిస్తున్నాడో తెలుసుకొని అంతకు మించి పంపకాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు తీసిపోని విధంగా స్థాయికి మించి ఖర్చు చేస్తున్నారు. -
● బరిలో బ్రదర్స్
మహేశ్వరం: బంధుత్వాలను పక్కనపెట్టి పలువురు పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగారు. నిన్నమొన్నటివరకు కలిసున్న వారు కాస్తా ప్రత్యర్థులుగా మారి ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. మహేశ్వరం మండలం పెండ్యాల సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వు అయింది. ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ పదవి కోసం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా అన్న జైత్వారం జగన్మోహన్రెడ్డి, బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా తమ్ముడు జైత్వారం శ్రీధర్రెడ్డి పోటీలో నిలిచారు. ఇద్దరి మధ్య తీ వ్ర పోటీ నెలకొంది. కు టుంబసభ్యులు సైతం విడివిడిగా వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికీ గతంలో ఉపసర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో తాము చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న సం‘గ్రామంలో’ రాజకీయం వెడెక్కింది. వీరి తండ్రి జైత్వారం శాయిరెడ్డి గతంలో సర్పంచ్గా చాలా కాలం పని చేశారు. ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో ఈ నెల 17తో తేలనుంది. -
అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోండి
మొయినాబాద్రూరల్: గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని బాకారంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్యాదవ్ తరఫున వారు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలతో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే అభ్యర్థులను ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధితో పాటు ఎలాంటి సమస్యలు ఉండవని సూచించారు. బాకారంలో శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
● తల్లి సర్పంచ్గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి తల్లి సర్పంచ్ అభ్యర్థిగా, తనయుడు వార్డు సభ్యుడి గా పోటీ చేస్తున్నారు.మండలంలోని గొల్లగూడ సర్పంచ్ స్థానం జనరల్ మహిళగా రిజర్వ్ అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా పసూలాది లక్ష్మి పోటీలో ఉండగా అదే పంచాయతీలో 7వ వార్డు సభ్యుడిగా ఆమె కు మారుడు పి.మన్మోహన్ పోటీ పడుతున్నారు. స్పరంచ్గా తల్లికి, వార్డు సభ్యుడి గా తనకు అవకాశం కల్పించాలని తన వార్డులో కొడు కు ప్రచారం చేస్తున్నాడు. సర్పంచ్గా గెలిస్తే తల్లికి మద్దతుగా ఉండాలన్న ఆలోచనతో పోటీకి దిగారు. సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి వార్డు అభ్యర్థి మన్మోహన్ -
అక్రమ మైనింగ్పై
నిమ్స్ పరిధిలోకి వెల్నెస్ కేంద్రాలుభద్రతా ఏర్పాట్ల పరిశీలన ఉక్కుపాదం!సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గుట్టుగా తవ్వకాలు జరిపి.. రాయల్టీ ఎగవేతకు పాల్పడిన అక్రమార్కుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణ యించింది. ఈ మేరకు ఆయా మైనింగ్/ సెల్లార్ యజమానులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్, సరూర్నగర్, హయ త్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, గండిపేట, శంషాబాద్ మండలాల్లో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఈ అంశంపై స్థానికుల నుంచి జిల్లా మైనింగ్ అధికారికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐలు క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్రమాలను గుర్తించడమే కాకుండా భారీ పెనా ల్టీలతో డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అక్రమ తవ్వకాలు, రాయల్టీ చెల్లించకుండా గుట్టుగా మట్టిని తరలించే లారీలపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఇటీవల ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, పహడీషరీఫ్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేయకపోగా, పరోక్షంగా వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ నోటీసులతోనే సరి.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ రెవెన్యూ సర్వే నంబర్ 167/2లో ఓ నిర్మాణ సంస్థ భారీగా తవ్వకాలు చేపట్టినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో రూ.9.5 కోట్లకుపైగా ఫైన్ వేశారు. తట్టి అన్నారం సర్వే నంబర్ 121/పీలోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. రూ.3.39 కోట్ల జరిమానా విధించారు. ఒక్క పైసా కూడా వసూలు చేయలేదు. సరూర్నగర్ మండలం మన్సూరాబాద్ సర్వే నంబర్ 38లో ఓ కన్స్ట్రక్షన్ సంస్థ ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారీ సెల్లార్ తవ్వుతోంది. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ.రెండు కోట్లతో డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఇప్పటి వరకు పైసా వసూలు చేయలేక పోయారు. గతంలో సెల్లార్ తవ్వుతుండగా, మట్టి కూలి నలుగురు కూలీలు మృతి చెందిన ప్రదేశంలోనూ యథావిధిగా తవ్వకాలు మొదలయ్యాయి. ఈ అక్రమ తవ్వకాల వెనుక కొంత మంది పెద్దల హస్తం ఉన్నట్లు తెలిసింది. శ్రీనగర్ రెవెన్యూ సర్వే నంబర్ 185,188, 189లోనూ ఓ మైనింగ్ ఏజెన్సీ అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపట్టి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. తవ్వకాలను ఆపాలంటూ రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులకు లేఖ రాసినా ఫలితం లేకపోయింది. తాజాగా మన్సూరాబాద్, హయత్నగర్ రెవెన్యూ పరిధిలోనూ అక్రమ సెల్లార్లను గుర్తించి, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంగం హోటల్ ఎదురుగా కృపా కాలనీలోనూ సెల్లార్ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బయటికి అమ్ముతున్నట్లు గుర్తించి, నోటీసులు జారీ చేశారు. అడ్డగోలు తవ్వకాలు, మైనింగ్ అమ్మకాలపై ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు తనిఖీలకు వెళ్లడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం మినహా పైసా కూడా వసూలు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. సీరియస్గా తీసుకున్న రెవెన్యూ యంత్రాంగం ముక్కుపిండి రాయల్టీవసూలు చేయాలని నిర్ణయం రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుకు సన్నాహాలు ఆర్ఆర్ యాక్ట్తో ఆదాయంనగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఓఆర్ఆర్కు అటు ఇటుగా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. గండిపేట్, మంచిరేవుల, కోకాపేట్, బుద్వేల్, నార్సింగి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, శంషాబాద్, వనస్థలిపురం, తుర్కయంజాల్ కేంద్రంగా భారీగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగు తున్నాయి. ఈ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బహిరంగ మార్కెట్లో టిప్పర్కు రూ.5 వేల నుంచి రూ.6 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో గ్రానేట్ను సైజును బట్టి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఇక నిర్మాణాల్లో ఉపయోగించే రోబోశాండ్ టన్నుకు రూ.600 నుంచి రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రషర్లు ఏర్పాటు చేసి, ఎత్తయిన గుట్టలు, సెల్లార్ తవ్వకాల్లో భాగంగా వచ్చిన రాళ్లను క్రషర్లలో వేసి డస్ట్గా మారుస్తున్నారు. కనీస చర్యలు చేపట్టక పోవడంతో దుమ్ము, ధూళి సమీప కాలనీలను ముంచేస్తోంది. ప్రతి నెలా అడిగినంత ఇచ్చే వాళ్లకు రాచమర్యాదలు చేస్తూ.. నిరాకరించిన వాళ్ల టిప్పర్లపై కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్ తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.ఆరు వేల కోట్ల ఆదాయం వస్తే.. ఆర్ఆర్ యాక్ట్తో ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే మొండి బకాయిలు వసూలు చేయడం సహా రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,800 కోట్లు సమకూరే అవకాశం లేకపోలేదు. కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు రెవెన్యూ వాళ్లపై.. రెవెన్యూ వాళ్లు పోలీసులపై నెట్టేసి తప్పించుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ సీరియస్గా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్ఆర్ యాక్ట్ను అమలుతో ఇప్పటి వరకు తిన్నదంత కక్కించొచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ఈ ఫెనాల్టీల వసూళ్ల కోసం దీన్ని పకడ్బందీగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లక్డీకాపూల్: ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో వెల్నెస్ కేంద్రాల పరిపాలన, నిర్వహణ బాధ్యతలు ‘నిమ్స్’ పరిధిలోకి వచ్చాయి. ఈ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంతో పాటు లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలో ఉన్న వెల్నెస్ కేంద్రాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత అధిగమించే క్రమంలో నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నిమ్స్కు అప్పగించింది. దీంతో ఖైరతాబాద్, కూకట్పల్లి వెల్నెస్ కేంద్రాల్లో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చే దిశగా నిమ్స్ చర్యలు చేపట్టింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వైద్యులు సేవలను అందిస్తున్నారు. అవసరమైన శస్త్రచికిత్సలు నిర్వహించడం గమనార్హం. శంకర్పల్లి: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్గౌతమ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండలంలోని మహాలింగాపురం, గాజులగూడెంలో ఈనెల 14న ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమణగౌడ్, ఎస్హెచ్ఓ శ్రీనివాస్గౌడ్, డీఐ సమరం, ఎస్ఐ సురేశ్తో కలిసి ఆయా గ్రామాల్లో పోలింగ్ జరిగే కేంద్రాలను, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. పోలింగ్ రోజు ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మద్యం, మత్తు పానీయాల పంపిణీని అరికట్టేందుకు పర్యవేక్షణ, పహారాలు, చెక్పోస్ట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా పరిస్థితులు కల్పించేందుకు సమగ్ర ప్రణాళికలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
సందడిగా ‘సమ్మిట్’ ప్రాంగణం
కందుకూరు: ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం శుక్రవారం మూడో రోజు విద్యార్థులు, సందర్శకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లనుఆసక్తిగా తిలకించారు. రోబోలతో స్వాగతం, ఏఐ ఫొటో ఇమేజ్లు తీసుకోవడం, స్టాళ్లలో ఏర్పాటు చేసిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదికలో ఎమర్జింగ్ టెక్నాలజీ అనే థీమ్తో రియల్ లైఫ్లో రిజిలియెన్స్ అనే అంశంపై చర్చ నిర్వహించారు. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జి.సత్యనారాయణ, ఛీప్ డెలివరీ ఆఫీసర్ జితేంద్ర పుచ్చ, మాస్టెక్ డిజిటల్ శ్రీనివాస్ ఆత్రేయ, సీటీఓ అవికా, క్యూవైఎల్ఐఎస్ సీఈఓ కిషోర్ ఉప్పలపాటి చర్చా వేదికలో పాల్గొన్నారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ యొక్క ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సిద్ధత తదితర అంశాలపై విద్యార్థుల సమక్షంలో విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించారు. అనంతరం కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్శనకు శనివారం చివరి రోజని, ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
మామిడిలో సస్యరక్షణ
పూత నిలిస్తేనే లాభాల పంట ● ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు చలి అనుకూలమే.. మొగ్గ దశలో చలి ఎక్కువ గా ఉండడం మొక్కకు చాలా ఉపయోగమే. నాకు 20 ఎకరాల మామిడి తోట ఉంది. అధికారుల సూచన లు, యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా. సకాలంలో మందులు పిచికారీ చేస్తున్నా. రాత్రి వేళల్లో చలి తీవ్రత 15 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే పూత బాగా నిలుస్తుంది. – పిట్ల మల్లేశ్, మామిడి రైతు, హస్నాబాద్ సూచనలు పాటించాలి మామిడి రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి. క్రమం తప్పకుండా తోటల ను పరిశీలించాలి. వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏ సమస్య ఉన్నా వెంట నే అధికారులను సంప్రదించాలి. ప్రతీ క్లస్టర్కు ఒక ఉద్యాన శాఖ అధికారి అందుబాటులో ఉంటారు. – ఎంఏ సత్తార్, ఉద్యాన శాఖ అధికారి దుద్యాల్: మామిడిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో 13 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పండే ప్రధాన పంటల్లో మామిడి కూడా ఒకటి. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. వాతావరణం అనుకూలంగానే ఉందని ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తోటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నారు. పూమొగ్గ బయటకు వచ్చే వరకు నీటి తడి ఇవ్వరాదు. మొగ్గ పగిలే దశలో పొటాషియం నైట్రేట్ (13:0:45) 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో మొగ్గ పడిలి పూత వచ్చే అవకాశం ఉంటుంది. జూన్– జూలై మాసంలో ఎరువులు వేయని మామిడి రైతులు ప్రస్తుత దశలో అరకిలో యూరియా, అరకిలో పొటాష్ను వేసువేసుకోవాలి. నీటి వసతి లేనివారు పిందె దశలో ఒక శాతం యూరియా ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. పూత ఆలస్యమైతే తోటలో కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవాలి. మామిడిపై చీడపీడల యాజమాన్యం.. ఆకులపై బూడిద మచ్చలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా సాఫ్ 2 గ్రాములను ఒక లీటర్ నీటికి కలిపి చెట్టుపై పిచికారీ చేసుకోవాలి. ఆకుపై నల్ల మచ్చలు ఉంటే పైకొమ్మలకు సోకి పూత రాలిపోతుంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 3 గ్రాముల ఆక్సీక్లోరైడ్ మందును కలిపి స్ప్రే చేయాలి. పూత, పిందె దశలో ఆకుమచ్చ పురుగు వ్యాప్తి చెందితే నివారణకు ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి 15 రోజు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. మొగ్గ తొందరగా విచ్చుకోవడానికి, పూల కాడ పొడవుగా పెరగడానికి పొటాషియం నైట్రేట్(13:0:45) 10 గ్రాముల మందును ఒక లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు అధికంగా ఉన్నప్పుడు లీటరు నీటికి ఫిఫ్రోనిక్ 2 మి.లీ లేదాఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోపాడ్(ట్రెసర్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సిన్(అక్టరా) 0.3 గ్రాముల మందులను లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. పిండినల్లి పురుగు నేల నుంచి చెట్టు పైకి పాకకుండా చెట్టు ప్రధాన కాండంపై గ్రీసు పూసిన ప్లాస్టిక్ పేపర్లను భూమి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు కాండం చుట్టూ చుట్టాలి. -
పంచాయతీ ప్రచారంలో సినీ నటుడు శివారెడ్డి
ఆమనగల్లు: ఆకుతోటపల్లి గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి నాలపట్ల నరేందర్రెడ్డికి మద్దతుగా శుక్రవారం సినీ నటుడు శివారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థికి బంధువైన ఆయన ప్రచారంలో భాగంగా తన హాస్యంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. నరేందర్రెడ్డిని గెలిపించి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన యాలాల: మతిస్థిమితం లేని మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం జెట్టూరుకు చెందిన రమేశ్ ఈనెల 10న ఇందిరమ్మ కాలనీలో మతిస్థిమితంలేని ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం యా లాల పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● కాంగ్రెస్ను విశ్వసించని ప్రజలు ● స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం ● మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు: ‘మోసపూరిత వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. అందుకే ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్రహ్మరథం పట్టారు. ఈ ఫలితాలతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అధ్యాయం ముగిసింది. మరో మూడేళ్లలో తిర్మలాపూర్ వెళ్లేందుకు మూటముల్లె సర్దుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన నివాసంలో పార్టీ మండల అధ్యక్షులు, నాయకులతో కలసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఇరు పక్షాల నుంచి పోటీ ఉంటుందని, అయితే బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెధిరింపులకు గురిచేశారని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. నియోజవకర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ బలపర్పించిన 70 మంది సర్పంచ్గా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉందని అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ స్థానాలను గెలిచి, జెడ్పీపీఠాన్ని కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను గెలిచి, ఎంపీపీలను దక్కించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు నర్సిరెడ్డి, వీరెందర్రెడ్డి, పంజుగుల శ్రీశైల్రెడ్డి, రాంలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నాయకులపై దాడి
బషీరాబాద్: మండల పరిధిలోని కుప్పన్కోట్తండాలో గురువారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన ప్రకారం.. గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాంశెట్టి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఓటమిని జీర్ణించుకోలేక విచక్షణరహితంగా దాడి చేశారని బాధితులు శారుబాయి, శంకర్, మన్యనాయక్, లక్ష్మణ్ నాయక్ శుక్రవారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండాకు చెందిన కుల నాయకులు ఇరువర్గాల వారితో మాట్లాడి రాజీ కుదిర్చారు. -
గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించండి
కొడంగల్: నూతన సర్పంచ్లు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్, మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ముఖ్యమంత్రి నివాసంలో మొదటి విడతలో కొత్త సర్పంచ్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. మండలంలో 25 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని అన్నారు. కొడంగల్కు రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందన్నారు. హుస్సేన్పూర్ సమీపంలో 300 ఎకరాల భూమి సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అప్పాయిపల్లిలో వ్యవసాయ వర్సిటీ, లగచర్ల పరిసరాల్లో 6 వేల ఎకరాల భూమిని సేకరించి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మెడికల్ కళాశాల, అనుబంధంగా 450 పడకల టీచింగ్ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతీ గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నయీమ్, సంజీవరెడ్డి, ఆసిఫ్ఖాన్, మహేశ్రెడ్డి, దీపక్రెడ్డి, బాల్రెడ్డి, అరిగె ఓం, సర్పంచ్లు దత్తాత్రేయరావు, చెన్ బస్కుమార్, అంజయ్య, నర్సప్ప, గడ్డం నర్సమ్మ, బెన్నూరు లక్ష్మమ్మ, సునీత, యాసర్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్ -
గులాబీలో జోష్
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలు గు లాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి మెజార్టీ జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పాగా వేయడంతో ఆ పార్టీ శ్రేణులు, నేతల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. మండలంలో 39 జీపీలు ఉండగా బాబునాయక్తండా, హంక్యానాయక్తండా, నంద్యానాయక్తండా, మంతన్గౌడ్, బాద్లాపూర్ ఏకగ్రీవమై, కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. మిగిలిన 34 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించగా, 17 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. ఇందులో మేజర్ జీపీలైన జీవన్గీ, నీళ్లపల్లి, పర్వత్పల్లి, దామర్చెడ్, నవల్గా, మంతట్టితో పాటు గొట్టిగకలాన్, కొర్విచెడ్, కొర్విచెడ్గని, గంగ్వార్, క్యాద్గీరా, ఇందర్చెడ్, అల్లాపూర్, కొత్లాపూర్, కుప్పన్కోట్, మల్కన్గిరి, కంసాన్పల్లి(ఎం)ఉన్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన బలమైన నాయకులు ఉన్న మేజర్ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డినా పరాజయం పాలవడంపై నేతల్లో నైరాశ్యం అలుముకుంది. జీవన్గీలో అధికార పార్టీ అభ్యర్థి కే.నర్సిములు, బీఆర్ఎస్ అభ్యర్థి రామని బసప్ప మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండు పార్టీల మద్దతుదారులు ఐదేసి చొప్పున వార్డులను గెలుచుకోగా, సర్పంచ్ స్థానం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి రామని బసప్ప కై వసం చేసుకున్నారు. అలాగే నీళ్లపల్లిలో దశాబ్దాలుగా అనేక పదవులు అలంకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల సుధాకర్రెడ్డిని బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వేణుగోపాల్రెడ్డి అనే యువకుడు ఓడించాడు. అలాగే పర్వత్పల్లిలోనూ అధికార పార్టీ అభ్యర్థి జనార్దన్రెడ్డిని గులాబీ పార్టీ మద్దతుదారుడైన పాండురంగారెడ్డి చిత్తు చేశాడు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచును మాజీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. వేరు కుంపట్లే పుట్టిముంచాయా..? అధికార పార్టీలో ఎమ్మెల్యే మహనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి వర్గాలుగా.. పార్టీ నాయకులు, శ్రేణులు రెండుగా విడిపోయాయి. ఎమ్మెల్యే వర్గంలోనూ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో రెండు బలమైన సామాజికవర్గాల నాయకులు వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. దీంతోనే బషీరాబాద్ మండల కేంద్రంలో ఇద్దరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ పడ్డారు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి తప్పుకోవడంతో వెంకటేశ్ మహరాజ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ ఖాతాలో 21 జీపీలు మండలంలోని 34 పంచాయతీల్లో 17 గ్రామాలు బీఆర్ఎస్ కై వసం చేసుకోగా, 16 జీపీల్లోనే అధికార కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవమైన 5 పంచాయతీలు కలిపి ఆ సంఖ్య 21కి చేరింది. వీరు శుక్రవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇదిలా ఉండగా కంసాన్పల్లి(బి)లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బీజేపీ నాయకురాలు సునీతా గ్రామాభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. బషీరాబాద్ మండలం మేజర్ జీపీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల పాగా ‘పైలెట్’ మద్దతుతో కారెక్కిన 17 మంది గ్రామ ప్రథమ పౌరులు వర్గపోరుతో దెబ్బతిన్న అధికార పార్టీ కాంగ్రెస్ గూటికి కంసాన్పల్లి(బి) సర్పంచ్? -
యాలాల అభివృద్ధికి సహకారం
యాలాల: నూతన సర్పంచ్లను శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఘనంగా సన్మానించారు. యాలలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, జెడ్పీటీసీ మాసీ భ్యుడు సిద్రాల శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిపై పేరి రాజేందర్రెడ్డి బలపరిచిన సీహెచ్ శివయ్య 244 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శివయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. యాలాల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.యాలాల సర్పంచ్, నాయకులతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు
పరిగి: బీఆర్ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరయ్యామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమంతోనే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగామన్నారు. జైలుపాలు చేసిన ప్రజల కోసం నిలబడినందుకే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, జగన్, సోయాబ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు మాజీలు మళ్లీ సర్పంచ్లు
బషీరాబాద్: సొంతూరుకు స ర్పంచ్గా సేవలు అందించడానికి అందరికీ అవకాశాలు రావు. రిజర్వేషన్తో పాటు అదృష్టం కలిసి రావాలి. మండల పరిధిలోని ముగ్గురు సర్పంచ్లకు మాత్రం రెండో సారి ఈ అదృష్టం వరించింది. 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మైల్వార్, గొట్టిగ కలాన్, బోజ్యానాయక్తండాకు సర్పంచ్లుగా ఎన్నికై న సీమాసుల్తానా, సాబేర్, శాంతిభాయి రిజర్వేషన్లు కలిసి రావడంతో రెండోసారి పోటీచేసి గెలుపొందారు. గతంలో పంచాయతీల్లో వారు చేసిన పనులకు నేటికీ బిల్లులు రాకపోయినా వారు చేసిన అభివృద్ధిని చూసి వారికే మళ్లీ పట్టం కట్టారు. తమకు మరింత బాధ్యత పెరిగిందని.. మరింత అభివృద్ధి చేసే బాధ్యత రెండో సారి సొంత గ్రామానికి సర్పంచ్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. అలాగే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. కుప్పన్కోట్ సర్పంచ్గా రెండో సారి పోటీ చేసిన మాజీ సర్పంచ్ పద్మ పరాజయం చెందారు. సీమాసుల్తానా, సర్పంచ్, మైల్వార్ శాంతిభాయి, సర్పంచ్, బోజ్యానాయక్తండా ఎఫ్ సాబేర్, సర్పంచ్, గొట్టిగకలాన్ -
రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
తాండూరు రూరల్: ప్రజలు బీజేపీని గ్రామాల నుంచి బలోపేతం చేసేందుకు నడుంకట్టారని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి అన్నారు. మండల పరిధిలోని వీర్శెట్టిపల్లి సర్పంచ్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి తూర్పు లక్ష్మి విజయం సాధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నూతన సర్పంచ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. మోదీ సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీజేపీని అధిక స్థానాల్లో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మిని సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫిరంగి జర్నప్ప నాయకులు నర్సింలు, హరి, శ్రవణ్, పాల పరుశురాం, వాకిటి పరుశురాం, శంకర్, ఆనంద్ పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి -
తొలి విడత ప్రశాంతం!
తొలి విడత ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇలా..సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాద్నగర్: చెదురు ముదురు ఘటనలు మినహా తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం ఏడు గంటల కే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. తెల్లవారుజామున చలితీవ్రత దృష్ట్యా.. ఓటింగ్ ప్రక్రియ ఉద యం కొంత మందకొండిగా సాగినా.. 11 తర్వాత ఊపందుకుంది. పోలింగ్ కేంద్రాల ఎదుట ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరడం కన్పించింది. అభ్యర్థు లు, వారి మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల ముందు గుంపులుగా నిలబడి ఓటర్లను అభ్యర్థించడం, వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్లపై తీసుకొచ్చి ఓటేయించిన దృశ్యాలు కన్పించాయి. మధ్నాహం ఒంటి గంట లోపు వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటింగ్ అవకాశం కల్పించారు. భోజన విరామం తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. తొలుత వార్డుల ఓట్లను, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించారు. అనంతరం ఫలితాలు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడిన మద్దతుదారులు తమ అభ్యర్థుల విజయంతో పెద్దఎత్తున బాణసంచా కాల్చి, రంగులను చల్లుకుంటూ డీజే హోరులో సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత జులూస్ నిర్వహించారు. 168 స్థానాల్లో పోటీ జిల్లాలో 168 సర్పంచ్, 1340 వార్డులకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 2,11,544 మంది ఓటర్లకుగాను 1,87,573 మంది (88.67 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 225 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2,66,252 మంది ఓటర్లకు గాను.. 2,16,212 మంది (81.21శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురు ముదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చివరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయిన వాళ్లు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి మౌనంగా తప్పుకోగా, గెలుపొందిన అభ్యర్థులు సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు విజయోత్సవాల్లో ముగిని తేలారు. ఓటేసిన ప్రముఖులు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన స్వగ్రామమైన నందిగామ మండలం వీర్లపల్లిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట్లో ఓటేశారు. ఎమ్మెల్సీ నవీన్రెడ్డి నందిగామ మండలం మొదళ్లగూడలో ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి ఫరూఖ్ నగర్ మండలం దూస్కల్లో, మరో మాజీ ఎమ్మెల్యే బొక్కని నరసింహులు లింగారెడ్డిగూడలో ఓటేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామమైన వీర్లపల్లిలో తన మద్దతుదారు ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాత్రం తన గ్రామంలో మళ్లీ తన పట్టు నిలుపుకోవడం విశేషం. ప్రశాంతంగా పోలింగ్ మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమసంఖ్య సరి చూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఓటింగ్ శాతం నమోదును ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు. కేశంపేట: సిరా చుక్కను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఎలికట్టలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడికి సహాయం చేస్తున్న కానిస్టేబుల్ నందిగామ వీర్లపల్లిలో ఓటేయడానికి వచ్చిన శతాధిక వృద్ధురాలు పుల్లమ్మ రంగారెడ్డిలో 88.67 శాతం మండలం మొత్తం ఓటర్లు 9 గంటల వరకు 11వరకు ఒంటిగంట వరకు పోలింగ్శాతం ఫరూఖ్నగర్ 50,557 13,359 28,539 44,820 88.65 చౌదరిగూడ 25,869 7,077 15,602 22,632 87.49 కేశంపేట్ 36,250 6,933 17,666 32,588 89.09 కొందుర్గ్ 22,243 5,114 12,137 19,711 88.62 కొత్తూరు 16,813 4,102 10,448 15,346 91.27 నందిగామ 26,499 5,828 14,715 23,549 88.87 శంషాబాద్ 33,313 5,850 15,898 28,934 86.85 -
తొలిపోరులో హస్తం హవా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు.. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. మెజార్టీ స్థానాల్లో వారికి ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. షాద్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, కేశంపేట్, నందిగామ, కొత్తూరు మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండల పరిధిలోని మొత్తం 168 సర్పంచ్ స్థానాలు, 1,340 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. ఇక వికారాబాద్ జిల్లాలో 262 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, 35 పంచాయతీల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగినప్పటికీ మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రెండు సార్లు రీకౌంటింగ్ ఫరూఖ్నగర్ మండలం శేరిగూడ పంచాయతీ ఎన్నికల్లో రెండుసార్లు రీ కౌంటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ శారద, బీఆర్ఎస్ బలపరిచిన సమీప ప్రత్యర్థి విజయమ్మపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు -
ఎత్తుకు పైఎత్తు!
షాద్నగర్: ఎన్నికలు అంటేనే అంచనాలకు అందవు.. ఎన్ని వ్యూహాలు రచించినా చివరికి తలకిందులు కాక తప్పదు. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అచ్చంగా అదే జరిగింది. కాంగ్రెస్ అంచనాలను తారుమారు చేస్తూ కొన్ని చోట్ల బీఆర్ఎస్ సత్తా చాటగా.. బీఆర్ఎస్ కోటగా భావించే గ్రామాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఇలా ఒక్కో చోట ఒక్కో ఆట.. పల్లెల్లో సర్పంచ్ స్థానాల వేట.. అత్యంత రసవత్తరంగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో జరిగిన పోరును ఓ సారి పరిశీలిస్తే అవగతం అవుతోంది. బీఆర్ఎస్దే ఎక్లాస్ఖాన్పేట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామమైన ఎక్లాస్ఖాన్పేటలో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి హరిశేఖర్ విజయం సాధించారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డి మద్దతులో బరిలో దిగిన ప్రవీణ్యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్యాదవ్లు ఓటమి పాలయ్యారు. దూసకల్ హస్తగతం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి స్వగ్రామమైన ఫరూఖ్నగర్ మండలం దూసకల్ గ్రా మంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి జ్యో తి విజయం సాధించారు. ఆ గ్రామం మొ దటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. స్వగ్రామంలో ఎమ్మెల్సీ హవా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి స్వగ్రామమైన నందిగామ మండలం మొదళ్లగూడలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి అభ్యర్థి పెండ్యాల అరుణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామమైన వీర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థితో పాటుగా, కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ రెబల్గా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి బలపర్చిన అభ్యర్థి పాండు సర్పంచ్గా విజయం సాధించారు. మొదటి నుంచి ఎమ్మెల్యే శంకర్కు పట్టున్న స్వగ్రామంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అనుచరుడు విజయం సాధించడం విశేషం. ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్, టీడీపీ బలపర్చిన అభ్యర్థి ఎంసీ రాజు సమీప బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి భీష్వ రామకృష్ణపై విజయం సాధించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్యలు ఉన్న ఈ గ్రామంలో రెండు పార్టీలు బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఎమ్మెల్యే ఊరిలో ఎదురుదెబ్బ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థి విజయం -
గ్లోబల్ కిటకిట
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం గురువారం విద్యార్థులు, సందర్శకులతో కిటకిటలాడింది. నగరంతో పాటు చుట్టు పక్క ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన స్టాళ్లను వీక్షించారు. వీరికి రోబోలు స్వాగతం పలికాయి. విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నెట్ జీరో స్టాల్, పోలీస్, డీఆర్డీఓ, హ్యాండ్లూమ్స్, స్కిల్స్ యూనివర్సిటీ, అగ్రికల్చర్, ఎయిరోస్పేస్, విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను, వాటి విశేషాలను తెలుసుకున్నారు. ప్రధాన వేదికపై నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజన్ సాధిద్దాం.. సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ ఆధ్వర్యంలో జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, యునిసెఫ్ సలహాదారు డేవిడ్రాజ్, ప్రజ్వల సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ సునీతకృష్ణన్, సైకాలజిస్టు డాక్టర్ గీత చల్లా తదితరులు మహిళా సాధికాతరపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. యువత క్రీడలను ఓ వృత్తిగా ఎంచుకోవాలని గుత్తా జ్వాల సూచించారు. పోరాట పటిమతో ముందుకు సాగాలని సునీతాకృష్ణన్ సూచించారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, రీల్ లైఫ్కు, రియల్ లైఫ్కు తేడాను గుర్తించాలని డేవిడ్రాజ్ వివరించారు. తెలంగాణ చరిత్రకారుడు, సాంస్కతిక శాఖ మాజీ డైరెక్టర్ డా.మామిడి హరికృష్ణ, పి.పద్మావతి, బిరాద్ రాజారాం యాజ్ఞిక్, గోపి బైలుప్పల తదితరులతో చర్చాగోష్టి నిర్వహించారు. -
ప్రచారం జోరు.. నేతలే లేరు
● పంచాయతీ ఎన్నికల్లో కనిపించని రాజకీయ నాయకులు ● చేవెళ్లలో సర్పంచ్ అభ్యర్థులకుదక్కని మద్దతు చేవెళ్ల: గ్రామ పంచాయతీ ఎన్ని కల ప్రచారాల జోరు మీదుంటే రాజకీయ నాయకులు మాత్రం మౌనముని పాత్రలో ఉండి పోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కడా ఏ పార్టీ నాయకులు తమ మద్దతుదారులను ఈ సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రకటించటం కానీ, ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కనిపించటం లేదు. అభ్యర్థులు మాత్రం జోరుగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో రెండో విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఆయా గ్రామాల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు పోటీలో ఉన్నప్పటికీ ఎక్కడా మాది పలాన పార్టీ అని స్పష్టంగా చెప్పుకోవటం లేదు. గ్రామంలో మాకు అన్నివర్గాల వారు మద్దతు ఇస్తున్నారని అభ్యర్థులు సైతం తమ పార్టీలను పక్కన పెట్టారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిశబ్దంలో ఉండిపోయాయి. కొన్ని గ్రామాల్లో మాత్రం తమ అభ్యర్థులుగా చెప్పుకొంటున్నా వారి వెంట ప్రచారం మాత్రం పార్టీ నాయకులు చేయడం లేదు. నిశ్శబ్దంలో రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి, జిల్లా, మండలాల నాయకులుగా ఎంతోమంది ఉన్నా గ్రామాల్లో ప్రచారం చేయక పోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం ఇదే పరిస్థితిలో మౌనం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను మాత్రం తమ పార్టీ వ్యక్తిగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలను మాత్రం ముందుగానే వెళ్లి తమ పార్టీ అభ్యర్థులే అని ప్రకటించుకొని శాలువాలు కప్పి సన్మానించారు. పోటీలో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని గుసగుసలాడుతున్నారు. ప్రజలకు తమ పార్టీల పేరు చెబితే ఓట్లు పడవనే భయంలో అభ్యర్థులు ఉండిపోయారని చర్చించుకుంటున్నారు. -
ప్రలోభ పెట్టి.. ప్రాధేయ పడి
● వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థులు ● నిత్యం గ్రామాల్లో మందు, విందులతో సందడి చేవెళ్ల: ‘నమస్తే అన్నా, అక్కా, తమ్మీ, చెల్లి నేను మన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న మీ ఓటు నాకే వేయాలి’ అని వలస ఓటర్లను ప్రసన్నం చేసుకొని పనిలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. రెండో విడతలో జరుగుతున్న చేవెళ్ల డివిజన్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఓటరు జాబితాలో తిరగేసి మరీ ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఉన్న ఓటర్లను ఉదయం సాయంత్రం వేళల్లో కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మండల కేంద్రం, హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉన్న వారి కోసం వాకబు చేస్తూ ఫోన్ నంబర్లు తీసుకొని, అడ్రస్లు కనుక్కొని వారి ఎదుట ప్రత్యేక్షమవుతున్నారు. మన గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. 14వ తేదీన గ్రామానికి వచ్చి ఓటు వేసేందుకు రావాలని తాయిలాలు, వాగ్దానాలు ఇవ్వటంతోపాటు రవాణా సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు తీస్తూ దండాలు పెడుతూ కాళ్లు పట్టుకొని మరీ గెలిపించాలని కోరుతున్నారు. ఊరి బయట ఉండే ఓటర్లకు వారికి తెలిసిన వారితో ఫోన్లు చేయించి ఓట్లు రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు ఓటర్లకు మందు, విందులతో దావత్లు ఇస్తున్నారు. -
అపార్ట్మెంట్లోభారీ చోరీ
రూ. 70 లక్షల నగదు, నగలు మాయం మలక్పేట: ఓ కుటుంబం విహార యాత్రకు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళాలు పలుగొట్టి లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేశారు. అల్మారాలోని రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు, బంగారు అభరణాలు 15 తులాలు, 4 కిలోల వెండిని దోచుకెళ్లారు. ఈ సంఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..అక్బర్బాగ్ డివిజన్ ప్రొఫెసర్స్ కాలనీలోని మానస అపార్ట్మెంట్లో మంత్రవాది వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.గతనెల 13న కుటుంబం విహార యాత్రకు వెళ్లి ఈనెల 10న రాత్రి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తరువాత చోరీ జరిగినట్లు గమనించారు. వెనుకవైపు బాల్కనీ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బాధితుడు బీరువాలో చూడగా పగులగొట్టి ఉంది. అల్మారాలో ఉన్న రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు 10 తులాలు, బంగారు గాజులు 2 తులాలు, బంగారు నాణేలు 3 తులాలు, 4 కిలోల వెండి కన్పించలేదు. దీంతో మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. వాచ్మెన్పై అనుమానం.. నేపాల్కు చెందిన అర్జున్ ఐదు నెలలు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేశాడు. భార్య నిర్మల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోదరి ఇంటికి వెళ్తున్నామని చెప్పి భార్యభర్తలు కలిసి బయటికి వెళ్లారు. భార్య అక్కడే ఉండి పోయింది. ఆ తరువాత వచ్చిన అతను నవంబర్ 25 తేదిన వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. నేపాల్కు వెళ్లిపోతున్నాని చెప్పి మరో వ్యక్తిని వాచ్మెన్గా కూడా పెట్టాడని అపార్ట్మెంట్ వాసులు పేర్కొంటున్నారు. అతడే దొంగతనానికి పాల్పడి ఉంటాడని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులమంటూ సైబర్ మోసం రూ.20వేలు టోకరా కీసర: పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ను మోసం చేశారు. ఈ సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు.. బోగారంలోని ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ హన్మంతుకి సైబర్ మోసగాడు ఫోన్ చేసి తాను సబ్ ఇన్స్పెక్టర్నని కీసర ఇన్స్పెక్టర్కు ఆన్లైన్లో అర్జెంటుగా నగదు కావాలని, నగదును పెట్రోల్ బంక్ వద్దకు పంపిస్తానని చెప్పాడు. కాగా ఆ ఫోన్ నెంబర్ను ట్రూ కాలర్, వాట్సాప్లో చూడగా సీఐగా రావడంతో నమ్మి ఆ సైబర్ మోసగాడి స్కానర్కి రూ.20 వేలు పంపించాడు. అయితే బుధవారం సాయంత్రం వరకు చూసినా డబ్బు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి మేనేజర్ హన్మంతు కీసర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
షాద్నగర్లో రాజకీయ గూడుపుఠాణి
కొత్తూరు: షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గూడుపుఠాణి రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి ఆరోపించారు. నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని, కేవలం మాజీ ఎమ్మెల్యే తనయులు రవియాదవ్, మురళీకృష్ణయాదవ్లు చేసిన అరాచకాల కారణంగానే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందన్నారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తనయులు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలకు అతీతంగా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే కుట్రతో సొంత పార్టీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. నందిగామ మండలంలో ఓ ట్రస్ట్కు సంబంధించిన పొలంలో మాజీ ఎమ్మెల్యే తీరుపై ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ అదే వ్యవహారంలో చేస్తున్న లీలలు అందరికి తెలుసన్నారు. మాజీ ఎమ్మెల్యే తనయులు చేస్తున్న అరాచకాలకు ఎమ్మెల్యే వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. సీఐ క్షమాపణ చెప్పాల్సిందే నందిగామ సీఐ ప్రసాద్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ అనుచరులు, వార్డు సభ్యులుగా బరిలో ఉన్న వారిపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. మొదళ్లగూడలో శాంతియుత వాతావరణంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను లాఠీచార్జి చేసి భయోత్పాతంగా సీఐ చేసినట్లు ఆరోపించారు. అకారణంగా దాడి చేసిన వారికి సీఐ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై సీఐను వివరణ కోరగా ఓటర్లను వాహనాల్లో తరలించొద్దని మాత్రమే సూచించానని చెప్పారు. గుంపులుగా ఉన్న జనాలను వెళ్లాలనే మాత్రమే చెప్పా, లాఠీచార్జి చేయలేదని వివరించారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి -
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు
చేవెళ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎలాగైనా సర్పంచ్ పీఠం ఎక్కాలనే కోరికతో బంధాలను లెక్క చేయకుండా ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులుగా మారుతున్నారు. చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్ గ్రామంలో 20 ఏళ్లుగా మాజీ సర్పంచ్ తిప్పని వెంకట్రెడ్డి కుటుంబానిదే రాజకీయంగా పైచేయి. వారు లేదా వారి తరఫు అభ్యర్థులే ఇన్నాళ్లు సర్పంచ్లుగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆ గ్రామం జనరల్ మహిళ రిజర్వేషన్ వచ్చింది. అయితే వెంకట్రెడ్డి కుటుంబం నుంచే ఇద్దరు పోటీలో ఉండడం గమనార్హం. ఒకరు వెంకట్రెడ్డి కొడుకు రాంరెడ్డి భార్య మాధవి ఉండగా, మరొకరు వెంకట్రెడ్డి అక్క కొడుకు రఘువీర్రెడ్డి(చింటు) భార్య చిరోషా బరిలో ఉన్నారు. రఘువీర్రెడ్డి చిన్నప్పటి నుంచి మేనమామ వెంకట్రెడ్డి ఇంట్లో ఉండే పెరిగారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీలో ఉండడంతో గ్రామస్తులు సైతం ఎవరికి మద్దతు తెలపాలో అని అయోమయంలో పడ్డారు. సర్పంచ్ పీఠం కోసం తీవ్ర కసరత్తు -
రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు
షాద్నగర్రూరల్: రాజకీయంగా ఎదుర్కోలేకే మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అనుచరులు తమపై దాడిచేశారని బీఆర్ఎస్ నేత దినేశ్సాగర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన ప్రవీణ్యాదవ్పై మాజీ ఎమ్మె ల్యే అనుచరులు గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న విష యం తెలుసుకొని.. తాము అక్కడికి వెళ్లే క్రమంలో గ్రా మంలో తమపై మూకుమ్మడిగా దాడి చేశారని, కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. తాము గ్రామానికి డబ్బులు, మద్యం పంచేందుకు వెళ్లలేదన్నారు. ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి పంపిస్తేనే గ్రామానికి వచ్చినట్లు తాము చెప్పాలని వారు బలవంతం చేశారన్నారు. సొంత పార్టీ నాయకులపైనే మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాత్రి జరిగిన ఘ టనతో తాము వారి గ్రామం నుంచి బ్రతికి బయటికి వస్తామని అనుకోలేదన్నారు. గత ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ గెలుపు కోసం శ్రాయశక్తులా ప్రయత్నించామన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతిని తాము ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నారు. తమపై దాడులకు పాల్పడటం సరికాదని, ఎవరి సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా దినేశ్సాగర్ తనకు దాడిలో తగిలిన దెబ్బలను మీడియాకు చూపించారు. సమావేశంలో నాయకులు శివాచారి, గోపాల్, జీజో జాన్సన్, మహేశ్గౌడ్, అనిల్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత దినేశ్సాగర్ -
అహంకారంతో మాట్లాడటం సరికాదు
షాద్నగర్: ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి అహంకారంతో మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు ఎన్నికై న ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి ఏమాత్రం గౌరవం లేకుండా ఎమ్మెల్యే పట్ల అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం సరికాదన్నారు. ఎక్లాస్ఖాన్పేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా ఎమ్మెల్సీ మాట్లాడటం సరికాదన్నారు. ఎవరు ఎలాంటి వారో, ఎవరు పేదలను భూములను కబ్జాచేసి గుండాగిరి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యేపై, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక సహించేది లేదన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిని బట్టలూడదీసి కొడతా అనడం సరికాదన్నారు. సమావేశంలో నాయకులు బాబర్ఖాన్, తిరుపతిరెడ్డి, బస్వం, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్ రఘునాయక్ -
రూ.వెయ్యి కోట్లు..
భవిష్యత్కు బాటలులాలాపేట: అంతర్జాతీయ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర కూర్పు కోసం రూ.1000 కోట్ల నిధుల మంజూరు జీఓతో ఈ గడ్డపై అడుగు పెట్టినట్లు బుధవారం ఇక్కడి బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఓయూ అభివృద్ధికి కేటాయించిన నిధులు డబ్బుగా కాకుండా భవిష్యత్ పెట్టుబడిగా చూస్తున్నానన్నారు. అధునాతన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలన్నదే తన అభిమతమన్నారు. చేపట్టబోయే పనులివీ.. కొత్త అకడమిక్ బ్లాక్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక లైబ్రరీ భవనం, రెండు కొత్త మెగా హాస్టళ్లు. స్టూడెంట్ ఎమినిట్స్ సెంటర్, హెల్త్ సెంటర్, జీవ వైవిధ్య ఉద్యాన వనం, కన్వెన్షన్ సెంటర్, యూనివర్సిటీలో రోడ్ల నిర్మాణం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ల నిర్మాణం. మారనున్న ఓయూ సమగ్ర రూపం -
జోరుగా ‘పంచాయతీ’ ప్రచారం
● మహిళలకు నిత్యం రూ. 300, పురుషులకు రూ.500 కూలీ ● మద్యంతో పాటు మాంసం భోజనం యాచారం: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థులు ప్రజలను కలిసి తమకే ఓటు వెయ్యాలని వేడుకుంటున్నారు. నామినేషన్ల విత్డ్రాతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు మంగళవారం సాయంత్రం అధికారులు గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, పుట్బాల్ వంటివి కేటాయించగా, అదే వార్డు సభ్యులకు గౌను, గ్యాస్పొయ్యి, స్టూల్, సిలిండర్ లాంటివి ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ క్లస్టర్ కేంద్రాల్లో అధికారులు ఏ పోటీదారుడికి ఏ గుర్తు కేటాయించారో ముందస్తుగానే సమాచారం అందజేశారు. గుర్తుల కేటాయింపుతో అభ్యర్థుల ప్రచారం సామగ్రి కోసం నగరంలోని ప్రింటింగ్ ప్రెస్, ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఇక కేటాయించిన గుర్తులతో ప్రజల వద్దకు వెళ్లి మద్దతు కూడగట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రచార సామగ్రిని అధిక సంఖ్యలో తెచ్చేందుకు గాను పోటీ అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కూలీలకు భలే డిమాండ్.. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూలీలకు భలే డిమాండ్ ఏర్పడింది. నిత్యం ఉదయం, సాయంత్రం ప్రజలను కలిసి గుర్తులపై గుర్తుండేలా ప్రచా రం నిర్వర్తించడానికి పోటీ అభ్యర్థులు కూలీలను ఉపయోగించుకుంటున్నారు. ర్యాలీలు కూడా తీస్తున్నారు. మహిళలకై తే నిత్యం రూ.300, అదే పురుషులకై తే రూ. 500 అందజేస్తున్నారు. పంచా యతీ ఎన్నికల సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. కూలీ లు లేక పత్తి తీత పనులు నిలిచిపోయాయి. పత్తి తీయకపోవడంతో చెట్లపైనే రూ. లక్షలాది విలువ జేసే పత్తి వృథావుతోంది. పత్తి తీత పనులతో పాటు మిగితా వ్యవసాయ పనులకు కూడా కూలీ లు వెళ్లడం లేదు. రైతులు వ్యవసాయ పనులకు రావాలని ప్రాదేయపడిన స్పందన వెళ్లడంలేదు. మద్యం, మాంసం భోజనం.. ప్రచార హోరులో పాల్గొనేందుకు వెళ్లే కూలీలకు నిత్యం మద్యంతో పాటు మాసంతో కూడిన విందు భోజనం అందజేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న ప్రచారానికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మద్యం పంపిణీ చేస్తున్నారు. మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, మాల్, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, యాచారం తదితర గ్రామాల్లో కొద్ది రోజులుగా విందు భోజనం నిర్వహిస్తున్నారు. పోలింగ్కు ఒక రోజు ముందు పంపిణీ చేసే డబ్బు కంటే నామినేషన్ వేసినప్పటి నుంచి విందు భోజనాలకు రూ. లక్షల్లో ఖర్చవుతోంది. మొండిగౌరెల్లి, మల్కీజ్గూడ, గునుగల్, మాల్, మంతన్గౌరెల్లి, నందివనపర్తి తదితర గ్రామాల్లో పోటాపోటీగా అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
పోరాటయోధుడు పండుగ సాయన్న
చేవెళ్ల: తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న అని ముదిరాజ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. పట్టణ కేంద్రంలో బుధవారం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటయోధుడు సాయన్న అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. ముదిరాజ్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేశ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి పామెన భీంభరత్, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పేదల గుండె చప్పుడు ఆర్టీసీ
● రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ● 65 నూతన ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం బన్సీలాల్పేట్: తెలంగాణలో ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో బుధవారం 65 నూతన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఎం.డి నాగిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా ఈవీ పాలసీతో పాటు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయో అనే విషయాన్ని ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలపాలని సూచించారు. ప్రజలకు అవసరమున్న ప్రాంతాల్లో బస్సులు నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజు ఆర్టీసీలో 60 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులేనన్నారు. ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారన్నారు. కొత్తగా 2400 బస్సులు వచ్చాయని.. 800కుపైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే రెండేళ్లలో మొత్తం 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఈవీ ట్రాన్స్ సీఈఓ సందీప్ రైజాడ, స్థానిక కార్పొరేటర్ సుచిత్రా శ్రీకాంత్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పీవీ మునిశేఖర్, సీహెచ్ వెంకన్న, ఎం. రాజశేఖర్, రాణిగంజ్ డిపో మేనేజర్ ఎ. శ్రీధర్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, నార్త్జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తదితరులు పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ కోసమే మూసీ సుందరీకరణ
హిమాయత్నగర్ : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును వెంటనే ఆపివేయాలని ‘సేవ్ మూసీ మూవ్మెంట్’ సంస్థ డిమాండ్ చేసింది. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ సుందరీకరణ చేపడుతున్నారని, ఇది అవసరం లేదని, మూసీని శుద్ధి చేయాలని డిమాండ్ చేసింది. మూసీ నిజమైన పునరుజ్జీవం కోసం నిపుణులు, పౌర సమాజంతో కలిసి ప్రజలకు, పర్యావరణానికి మేలు చేసే ప్రణాళిక రూపొందించాలని కోరింది. గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కై ్లమేట్ఫ్రంట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సొండే అన్సార్, సేవ్ మూసీ మూవ్మెంట్ ప్రతినిధులు జాన్ మైఖేల్, రుచిత్ ఆశా కమల్, డీబీఎఫ్ ప్రతినిధి పులి కల్పన, హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి సయ్యద్ బిలాల్, డీబీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్, తెలంగాణ క్రాంతిదళ్ ప్రతినిధి పృథ్వీరాజ్, తెలంగాణ విఠల్, పిట్టల శ్రీశైలం, ఫిల్మ్ డైరెక్టర్ సయ్యద్ రఫీ తదితరులు మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ పెట్టుబడిదారులకు మెరిసే రివర్ ఫ్రంట్ కలను చూపిస్తూ..ప్రభుత్వం ఎన్నో సామాజిక కోణాలను విస్మరించిందని ఆరోపించారు. ● డీపీఆర్ విడుదల చేయకుండా, ప్రజలతో సమావేశాలు నిర్వహించకుండా, పర్యావరణ–సామాజిక ప్రభావ అధ్యయనాలు పంచుకోకుండానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును దూకుడుగా ప్రచారం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జమ్మూ, అహ్మదాబాద్, పూణేలో విఫలమైన రివర్ ఫ్రంట్ మోడళ్లను గుర్తుచేస్తూ, అక్కడ నది సుందరీకరించే పనులు కాలుష్యాన్ని, వరద ముప్పును మరింత పెంచాయని వారు హెచ్చరించారు. ● అనంతరం గత ఏడాది నుంచి సేవ్ మూసీ మూవ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం చేపడుతున్న మూసీ నది శుభ్రత, అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన ‘మూసీ క్లీనప్ డ్రైవ్’ చిత్రాలను విలేకరులకు ప్రదర్శించారు. సేవ్ మూసీ మూవ్మెంట్ సంస్థ ఆరోపణ -
బలమైన సంస్థల నిర్మాణం ముఖ్యం
చేవెళ్ల: శాంతి, న్యాయం, సమగ్రత, పర్యావరణ బాధ్యత తదితర అంశాలే బలమైన సంస్థల నిర్మాణానికి మూలమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, రాష్ట్రపతి కార్యాలయం మాజీ ఓఎస్డీ సత్యనారాయణసాహు అన్నారు. చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థికశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న భారతదేశం ఎస్డీజీ–16 రోడ్మ్యాప్ శాంతి, న్యాయం, బలమైన సంస్థలు అనే అంశంపై జాతీయ సెమినార్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు సుస్థిర అభివృద్ధి కోసం 17 లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఇందులో ఒకటి న్యాయం, శాంతి, బలమైన సంస్థల నిర్మాణాలు అన్నారు. దీని ప్రధాన ఉద్దేశం అన్ని స్థాయిల్లో స్వేచ్ఛ, సురక్షితంగా జీవించడానికి అవకాశం కల్పించడం, న్యాయ సమీకరణం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత సురక్షితమైన సమాజాలను నిర్మించటమే అన్నారు. దీనిపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు. అనంతరం 94 పరిశోధనా పత్రాలతో కూడిన ఐదు సంపాదిత గ్రంథాలను విడుదల చేశారు. ఈ సదస్సులో ప్రొఫెసర్లు ఎం.రాములు, కె.ముత్యంరెడ్డి, నరేందర్రెడ్డి, బి.నాగేశ్వరావు, శ్రీనివాస్, ఎం.గంగాధర్, అలీంఖాన్ ఫలాకీ, నర్సయ్య తదితరులు ఎస్డీజీ–16పై ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చీఫ్ మెంటర్ డాక్టర్ కాంచనలత, కన్వీనర్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్, అధ్యాపకులు కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన సెమినార్ -
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
● ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ● చింతలపల్లి, సింగంపల్లిలో ఎన్నికల ప్రచారం ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చింతలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పు శ్రీశైలం, సింగంపల్లిలో రాంబాబుకు మద్దతుగా ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమలో పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడే తొలి సంగ్రామం
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్నగర్: వారం రోజుల పాటు నువ్వా నేనా అనే రీతిలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఊగిపోయారు. అభ్యర్థులు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లు ఆకట్టుకునేందుకు ముమ్మరం ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టి.. సాయంత్రం లోపు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. తొలి విడతలో షాద్నగర్ డివిజన్లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్ మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండల పరిధిలోని మొత్తం 174 సర్పంచ్ స్థానాలకు, 1,530 వార్డులకు నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో ఆరు సర్పంచ్ స్థానాలు సహా 190 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 168 సర్పంచ్ స్థానాలకు 536 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1,340 వార్డులకు 3,538 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 2,35,506 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తొలి విడత ఎన్నికల్లో భాగంగా 42 సమస్యాత్మాక కేంద్రాలను గుర్తించి, వాటిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. నిఘా కోసం 32 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం 1,989 పోలింగ్ ఆఫీసర్లు, 2,314 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను వినియోగిస్తున్నారు. వీరితో పాటు 55 మంది జోనల్ ఆఫీసర్లను, 21 మంది ఎఫ్ఎస్టీలు, 21 మంది ఎస్ఎస్టీలు, ఎంసీసీ, వ్యయ బృందాలను కూడా నియమించారు. 2,100 బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు. సిబ్బందిని 62 బస్సుల్లో ఆయా పోలింగ్ స్టేషన్లకు పంపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రానికి 120 మీటర్ల దూరం నుంచే ఆంక్షలు అమలు చేయనున్నారు. షాద్నగర్ డివిజన్ పరిధిలో ఐదుగురు ఏసీపీలు, 16 మంది సీఐలు, 54 మంది ఎస్ఐలు, 150 మంది హెడ్కానిస్టేబుళ్లు, 800 మంది కానిస్టేబుళ్లతో పాటు ఏఆర్ పోలీసులు ఎన్నికల బందోబస్తులో విధులు నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండలంలో అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, పది మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 500 మందికి పైగా పోలీసులతో గ్రామాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం ఏమర పాటుగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం శంషాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు సహా బాక్సులను పరిశీలించారు. ఏవైనా లోపాలు దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి సమస్య లేకుండా చూడాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత ఎన్నికల ఏర్పాట్లను మరోసారి పరీశీలించాలని కోరారు. తాగునీరు, లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ మున్సి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి రాజేంద్రనగర్లోని ఈవీఎం గోడౌన్ను సందర్శించారు. పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సాయంత్రంలోపే ఫలితాల విడుదల గ్రామాల్లో పోలీసుల పటిష్ట బందోబస్తు 168 సర్పంచ్, 1340 వార్డు స్థానాలకు పోటీ విధుల్లో నాలుగు వేల మంది సిబ్బంది ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి -
నేటినుంచి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ
డీసీఎం టైరు పేలడంతో చిలుకూరులో ఘటన శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని బుధవారం పీసీసీ జనరల్ సెక్రెటరీ గోవిందరావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మళ్లీ వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆలయ కమిటీ సభ్యులు గోవిందరావు దంపతులకు ఆలయ ప్రతిమ, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు దయాకర్రాజు, దర్శన్గౌడ్, అర్చకులు సాయిశివ తదితరులు పాల్గొన్నారు. -
మహా ప్రగతికి పరుగులు
● సమగ్ర రవాణా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ● తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో హెచ్ఎండీఏ కార్యాచరణ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు, భారీ టౌన్షిప్లుసాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రైజింగ్ సమ్మిట్ వేదికగా హైదరాబాద్ మహానగర భవిష్యత్ అభివృద్ధిపై హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రకటించింది. రీజినల్ రింగ్రోడ్డు వరకు మహానగరం పరిధిని విస్తరించిన దృష్ట్యా ఇందుకు తగిన విధంగా మహానగర విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను హెచ్ఎండీఏ ఆవిష్కరించింది. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న సమగ్రాభివృద్ధి ప్రణాళికలను కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేసింది. ఈ మేరకు రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు, భారీటౌన్షిప్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబించేలా హెచ్ఎండీఏ, మెట్రోరైల్ లోగోలను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఔటర్రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధిని పెంచిన దృష్ట్యా ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు చేపట్టనున్న కార్యకలాపాలను సమ్మిట్లో వివరించారు. ట్రిపుల్ ఆర్ వరకు టౌన్షిప్లు.. తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఔటర్ నుంచి ట్రిపుల్ఆర్ వరకు భారీ టౌన్షిప్లను నిర్మించనున్నారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణ, లే అవుట్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 2047 నాటికి రీజినల్ రింగ్రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ఈ వేదిక నుంచి స్పష్టం చేసింది. అలాగే లాజిస్టిక్ హబ్లు, ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ ఎకనామికల్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా సుమారు 30 ఆర్థిక మండలాల ఏర్పాటుపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. మరోవైపు గ్రీన్ బ్లూ డెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా మూసీ ప్రక్షాళన, పడమటి వైపు నుంచి తూర్పున మూసీ చివరి వరకు రహదారుల విస్తరణ. చెరువులు, ఇతర జలవనరుల సంరక్షణ, పచ్చదనం, పర్యావరణాభివృద్ధి కార్యక్రమాలను సైతం బ్లూగ్రీన్ డెవలప్మెంట్ ప్లాన్లో హెచ్ఎండీఏ ప్రస్తావించింది. సమగ్ర పట్టణ రవాణా ప్రజా రవాణా ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా రహదారులు, రవాణా సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. ప్రస్తుతం ఔటర్ నుంచి ట్రిఫుల్ ఆర్ వరకు కనెక్టివిటీని కల్పిస్తూ.. రావిర్యాల– ఆమన్గల్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు తరహాలో వివిధ ప్రాంతాల్లో మరో 18 రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో నగరానికి అన్ని వైపులా ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఇందులో భాగంగానే శంషాబాద్ కొత్వాల్గూడ నుంచి పరిగి సమీపంలోని చిట్యాల వరకు రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. హైదరాబాద్ మహా నగరాన్ని 7250 చ.కి.మీ నుంచి సుమారు 10,050 చ.కి.మీ వరకు పెంచిన దృష్ట్యా అందుకు అనుగుణంగా వచ్చే 2047 నాటికి మాస్టర్ప్లాన్ రూపకల్పనకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. -
గూడు చెదిరె.. గోడు మిగిలె!
● సరూర్నగర్లో మూతపడిన నైట్ షెల్టర్ ● రోడ్డున పడిన ఒంటరి, వృద్ధ మహిళలు ● అధికారుల నిర్ణయంతో ఇబ్బందులు హుడాకాంప్లెక్స్: గూడు చెదిరిన పక్షుల్లా అనాథ, ఒంటరి మహిళలు చెల్లా చెదురయ్యారు. అప్పటివరకు ఒకే గొడుగు కింద ఉన్న ఆయా మహిళలంతా.. ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ రోడ్డున పడ్డారు. ఏళ్లుగా అనాథ మహిళలకు ఆశ్రయం కల్పించిన సరూర్నగర్ చౌడిలోని నైట్షెల్టర్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో నేడు మూతపడింది. అప్పటివరకు అక్కడ వసతి పొందిన 22 మంది మహిళలు చెట్టుకొక్కరు.. పుట్టకొక్కరు అన్నట్లుగా వెళ్లిపోయారు. 12 ఏళ్లుగా సేవలు అనాథ, ఒంటరి మహిళలకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో 2013లో అప్పటి ప్రభుత్వం చౌడిలోని ఓ భవనంలో నైట్ షెల్టర్ ఏర్పాటు చేసింది. చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ ఏ దిక్కు లేని వాళ్లకు ఆశ్రయం కల్పించి.. మూడు పూటలా భోజనం కూడా పెట్టేది. ముఖ్యంగా పిల్లలు వదిలేసిన వృద్ధ మహిళలు ఎక్కువగా ఉండేవారు. భర్త చనిపోయిన అతివలు కూడా ఇక్కడే ఉంటూ పగటి పూట పనులు చేసుకుని, రాత్రి వేళ ఆశ్రయం పొందేవారు. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఖాళీ చేయించారు. ప్రత్యామ్నాయంగా మరో భవనం కేటాయించకపోవడంతో అప్పటివరకు దీన్నే నమ్ముకున్న వాళ్లు మళ్లీ అనాథలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయం కల్పిస్తుండగా, మిగిలిన వారంతా పార్కులు, ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్నారు. పట్టెడు అన్నం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. -
300
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ముచ్చటగాజీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్సాక్షి, సిటీబ్యూరో: శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ముఖ్యంగా భౌగోళిక ప్రాంతాలు, నియోజకవర్గాల పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ జనాభా ఉన్నప్పటికీ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ చేసినట్లు చెప్పారు. విస్తరించిన పరిధితో 300 వార్డులుగా డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించారు. వివరాలు జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోనూ చూడవచ్చన్నారు. ప్రజలు, పార్టీల సభ్యులు 7 రోజుల్లోగా తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయంలోనూ వీటిని స్వీకరిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల సూచనలూ పరిగణనలోకి తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చాలా వార్డులకు సరిహద్దులు మారాయి. కొన్ని పాత వార్డులు రెండు వార్డులయ్యాయి. కొన్ని గల్లంతయ్యాయి. ఇదీ ప్రాథమిక నోటిఫికేషన్.. కాలానుగుణంగా సవరించి 6.11.1996న ప్రభుత్వం జారీ చేసిన జీఓ (నెంబర్ 570), తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996లోని నిబంధన 8 మేరకు, ఈ నెల 8న జారీ అయిన జీఓ (నెంబర్ 266) ననుసరించి జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 300 ఎన్నికల వార్డులుగా విభజించినట్లు హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ స్థానికులకు తెలియజేయడమైనదంటూ ప్రాథమిక నోటిఫికేషన్ పేరిట వెలువరించిన ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దు వివరణల వివరాలను జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయంలో నోటీసు బోర్డులపై ఉంచినట్లు తెలిపారు. వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్ (www.ghmc.gov.in)లో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ నివాసితులు ఏవైనా సూచనలు లేదా అభ్యంతరాలుంటే ఈ నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ (9.12.2025) నుంచి 7 రోజుల్లోపు దాఖలు చేయాల్సిందిగా కమిషనర్ కోరారు. ఇంతింతై.. మహా నగరమంతై.. హైదరాబాద్ నగర పరిపాలన నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఒక చరిత్ర. ఒక పరిణామ క్రమం. 1800 కాలంలో చిన్నపాటి మున్సిపల్ బోర్డులతో మొదలైన వ్యవస్థ.. ప్రస్తుతం 27 స్థానిక సంస్థల విలీనంతో మరింతగా విస్తరించింది. బల్దియా పరిణామ క్రమమిలా.. చారిత్రక దశలు 1869: నిజాం కాలంలో కొత్వాల్– ఎ–బల్దియా ఆధ్వర్యంలో నగర పరిపాలన. 1886: చాదర్ఘాట్ ప్రత్యేక మున్సిసిపాలిటీ. 1921–1933: హైదరాబాద్ బోర్డు + చాదర్ఘాట్ బోర్డు కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా మార్పు. 1934: తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు. 1942–1951: ిసకింద్రాబాద్ మున్సిపాలిటీ.. అనంతరం కార్పొరేషన్గా మార్పు. జీహెచ్ఎంసీ ఏర్పాటు.. 2007: శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ). పరిధి: 650 చ.కి.మీ. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు. ప్రస్తుతం: శివార్లలోని 12 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్ఎంసీలోని 150 నుంచి 300 వార్డులకు పెరుగుదల. ఈ పరిణామ క్రమంలో ఒకప్పటి నిజాం రాజధాని, ఇప్పుడు గ్లోబల్ మెట్రోపాలిటన్గా మారింది. నగర పరిపాలన మరింత విస్తరించింది. ఇది కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు. హైదరాబాద్ భవిష్యత్ దిశలో ఇది ఒక నూతనాధ్యాయం. ప్రజల ముందుకు ప్రాథమిక నోటిఫికేషన్ 7 రోజుల వరకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణ బల్దియా కార్యాలయాలు, వెబ్సైట్లో వివరాలు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి -
తొలి విడతకు తెర
షాద్నగర్: వారం రోజులుగా గ్రామాల్లో హోరెత్తిని మైకులు మూగబోయాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్, వార్డు ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలతో పాటు సామగ్రిని బుధవారం ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి అందజేయనున్నారు. 7 మండలాలు.. 168 పంచాయతీలు ఈనెల 11న (గురువారం) షాద్నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల్లో 168 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరులో 12 పంచాయతీల్లో 110 వార్డులకు, నందిగామలో 18 పంచాయతీల్లో 170 వార్డులకు, కేశంపేటలో 28 పంచాయతీల్లో 260 వార్డులకు, కొందుర్గులో 19 పంచాయతీల్లో 186 వార్డులకు, జిల్లేడు చౌదరిగూడలో 24 పంచాయతీల్లో 204 వార్డులకు, ఫరూఖ్నగర్లో 46 పంచాయతీల్లో 405 వార్డులకు, శంషాబాద్లో 21 పంచాయతీల్లో 190 వార్డులకు, సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందించే సామగ్రి ఇవే.. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, ఓటర్ల జాబితా, సిరా బుడ్డి, బ్యాలెట్ బాక్సులు సీల్ చేసే సీళ్లు, అడ్రస్ బ్యాగులు, రబ్బరు స్టాంపులు, అగ్గిపెట్టె, అట్ట పెట్టెలు, పోలింగ్ ఏజెంట్ నియామకం, బ్యాలెట్ పేపర్ అకౌంట్, రసీదు పుస్తకం, వయస్సు నిర్ధారణ డిక్లరేషన్, ప్రిసైడింగ్ అధికారుల రోజు వారీ పుస్తకం, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు, సీల్డు కవర్లు, పెన్నులు, పెన్సిళ్లు, డ్రాయింగ్ పిన్నులు, లక్క, జిగురు, బ్లేడు, కొవ్వొత్తులు, ట్విన్ దారం, వైరు, కార్బన్ పేపర్, గోనె బస్తా, చెక్ లిస్టు వంటి సామగ్రి పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో అవసరం ఉంటుంది. వీటన్నింటినీ సిబ్బందికి అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అదనంగా బ్యాలెట్ పేపర్లు ప్రతి గ్రామానికి కావాల్సిన బ్యాలెట్ పత్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు కావాల్సిన పేపర్లను వేర్వేరుగా తీసి ఉంచారు. ఓటర్ల సంఖ్య కంటే బ్యాలెట్ పత్రాలు పదిశాతం అదనంగా ఉండనున్నాయి. ఎన్నికల్లో టెండర్ ఓట్లు వేసే అవకాశాలు ఉండటంతో బ్యాలెట్ పేపర్లను ప్రతి కేంద్రంలో అధికంగా ఉంచనున్నారు. మండల కేంద్రాల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, సామగ్రిని తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సిబ్బంది నియామకం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ను కేటాయించారు. ప్రతి మండలంలో పోలీసులు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ల జారీ కోసం ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పత్రాలను స్వీకరించి ఓటు వేసి సీల్డ్ కవర్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తున్నారు. ముగిసిన ప్రచార పర్వం ఎన్నికల సామగ్రి అందజేతకు ఏర్పాట్లు పూర్తి నేడు మండల కేంద్రాల్లో సిబ్బందికి పంపిణీ చేయనున్న అధికారులు -
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (కలెక్టరేట్) ఆవరణలో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. మలి విడత తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మమేకమయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అధికారులు ప్రత్యేక రాష్ట్ర ఫలాలను అందేలా చూడాలన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతోపాటు సాంస్కృతిక కళాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, డీపీఓ సురేష్ మోహన్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి చేవెళ్ల: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని బీఎస్ఐటీ కళాశాలలో జరుగుతున్న పీఓ, ఏపీఓల శిక్షణ తరగతులను మంగళవారం మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి తనిఖీ చేశారు. శిక్షణ తరగుతులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సందేహాలు వచ్చినా ఇక్కడే నివృత్తి చేసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ రోజు పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమనిబంధనలను వివరించారు. పోలింగ్ రోజునే కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, ట్రైనర్స్ ఆశీర్వాదం, బాలాజీ, శ్రీధర్, ఎంఈఓ పురన్దాస్ పాల్గొన్నారు. ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ మొయినాబాద్రూరల్: పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్ రైతు వేదికలో మంగళవారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రొసీడింగ్ అధికారి, 19 గ్రామాలకు 19 ఆర్వోలను కేటాయించడం జరిగిందని తెలిపారు. 14న జరిగే పోలింగ్లో పాల్గొనే ప్రొసీడింగ్ అధికారులు, ఆర్వోలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ను ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సీల్ చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
తటస్థులే టార్గెట్
తొలివిడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియడంతో అభ్యర్థులు తటస్థ ఓటర్లపై దృష్టి సారించారు. వార్డుల వారీగా ఓట్లు లెక్కగడుతూ ఓట్లు రాబ్టేందుకు తాయిలాలుసమర్పించుంకుటున్నారు. షాద్నగర్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు గంటల సమయమే ఉంది. అభ్యర్థులు తమ ప్రచారాలను మమ్మరం చేశారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన ప్రచారాల్లో పలు వర్గాల మద్దతు కూడగట్టుకున్న నేతలు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. వేల సంఖ్యలో తటస్థ ఓటర్లు యువకులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పలు రకాల వ్యాపారవర్గాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పరిశ్రమల్లో పనులు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఓటు హక్కు పొందారు. వేల సంఖ్యలో ఉన్న ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు చెబితే వారి ఓట్లు రాబట్టుకోవచ్చో తెలుసుకుని వారిని ఆశ్రయిస్తున్నారు. తాయిలాలతో ఎర ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు పగలు, రాత్రి లేకుండా ప్రతీ గల్లీ తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడుగా రాజకీయాలకు అతీతంగా ఉండే వారిని, పెద్ద కుటుంబాల వారిని, ఉద్యోగులను అభ్యర్థులు కలుస్తూ పాట్లు పడుతున్నారు. సామాజిక వర్గాల వారి ఓట్లను గంపగుత్తగా దండుకునేందుకు అభ్యర్థులు శత విధాలా యత్నిస్తున్నారు. కుల సంఘాల ఓట్లు కోసం అభ్యర్థులు తాయిలాలు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. కుల పెద్దలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. వలస ఓటర్లపై ఫోకస్ షాద్నగర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, హరియాణా, ఛత్తీస్ఘడ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ప్రముఖ ఫార్మా కంపెనీల్లో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పెయింటింగ్, ఉడ్వర్క్, మార్బుల్, సీలింగ్, డిజైనింగ్ తదితర నైపుణ్య పనులు చేసే వారు సైతం ఈ ప్రాంతంలో ఓటు హక్కు పొందారు. వీరంతా పార్టీలకు అతీతంగా తమ పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నిక ఏదైనా వీరి ఓట్లు కీలకంగా మారుతున్నాయి. ఈ ఓట్లు రాబట్టేందుకు నేతలు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతల తటస్థ ఓటర్లపై వల విసురుతున్నారు.పల్లె ఓటర్లకు పట్నంలో దావత్ ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని శివారులో ఈ హడావుడి కనిపిస్తోంది. ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రీత్యా పలువురు నగరంలో నివసిస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఓట్లను రాబట్టుకునే పనిలో పడ్డారు. నేరుగా నగరంలో వారు నివసిస్తున్న అడ్రస్లకు వెళ్లి ట్రాన్స్పోర్టు ఖర్చులు భరిస్తామని ఓటుకు సైతం కొంతమొత్తం ముట్టజెప్పుతామని హామీ ఇస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు నేరుగా యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరిని ఒకచోట చేర్చి దావత్లు సైతం ఇస్తున్నట్లు సమాచారం. మండలంలోని చింతలపల్లికి చెందిన ఓ అభ్యర్థి ఇటీవల దావత్ ఇచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఆకుతోటపల్లికి చెందిన పలువురు అభ్యర్థులు ఓటర్లను కలుసుకుని వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. -
అన్నం పెట్టిన ఇంటికే కన్నం
● యజమానిని నమ్మించి రూ.7.50లక్షల నగదు చోరీ ● నిందితుడికి రిమాండ్ షాద్నగర్రూరల్: అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసాడు ఓ దుండగుడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను ఏసీపీ లక్ష్మినారాయణ వెల్లడించారు. వివరాలు.. హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన రాజ్కుమార్ షాద్నగర్ పరిధి ఎలికట్ట శివారులో దుర్గాస్టీల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణంలో ఎలికట్టలో నివాసం ఉంటున్న రాజస్థాన్కు చెందిన కమల్కిషోర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న దుకాణంలో వచ్చిన కలెక్షన్ నగదు రూ.7.50లక్షలు ఆఫీస్ కేబిన్లోని టేబుల్ డెస్క్లో పెట్టి సెంట్రల్ లాక్ వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు దుకాణానికి వచ్చిన మేనేజర్ యజమానికి ఫోన్ చేసి నగదు కనిపించడం లేదని సమాచారం ఇచ్చాడు. దీంతో యజమాని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నగదుతో పాటు సీసీ కెమెరా డీవీఆర్ దొంగిలించినట్లు గుర్తించారు. అక్కడ వాచ్మెన్గా పనిచేసే బబ్లూను విచారించగా అదే రోజు రాత్రి మేనేజర్ వచ్చి తాళాలు తీసుకున్నట్లు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందుతుడు చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో మంగళవారం మేనేజర్ కమల్కిషోర్ను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ విజయ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మద్యం బాటిళ్లు సీజ్ మొయినాబాద్ రూరల్: నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్న ఆటోను మొయినాబాద్ పోలీసులు సీజ్ చేశారు. సీఐ పవన్కుమార్ రెడ్డి తెలిపిన మంగళవారం కనకమామిడి నుంచి వెంకటాపూర్ వైపు ప్రయాణిస్తున్న ఆటోలో మద్యం తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో కనకమామిడి సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టి మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఆటోను గుర్తించారు. కాటన్ బీర్లు, 16.44 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి చాకలిగూడకు చెందిన డ్రైవర్ మహ్మద్అలీని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. షాద్నగర్: రేషన్ డీలర్ వద్ద లంచం తీసుకుంటూ సివిల్ సప్లయ్ డీటీ మంగళవారం ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పౌరసరఫరాల శాఖ జిల్లా కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న హనుమరవీందర్నాయక్ గత నెల 30న షాద్నగర్ పరిధి అన్నారంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. రెండు క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించి, డీలర్ యాదగిరిపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కేసును తొలగించి, తిరిగి దుకాణాన్ని తెరిచేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. షాద్నగర్లోని రాఘవేంద్ర హోటల్లో డీలర్ నుంచి డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. డీటీని అదుపులోకి తీసుకుని, నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
● ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ● పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలెల్లో సంబురాలు అలుగుపారుతున్నాయి. ఓ వైపు పార్టీలు, నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఓట్ల వేటలో ఉండగా.. మెజార్టీ గ్రామాలు ఏకగ్రీవాలకే జై కొడుతున్నాయి. మహేశ్వరం: మండల పరిధిలోని 30 పంచాయతీలలో ఉప్పుగడ్డతండా, దిలావార్గూడ పంచాయతీల సర్పంచ్లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 28 పంచాయతీల్లో 101 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎంపీడీఓ శైలజ తెలిపారు. 258 వార్డు స్థానాలకు 12 వార్డులు ఎకగ్రీవమవగా ప్రస్తుతం 246 వార్డు స్థానాలకు 665 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు ఇప్పటికే గుర్తులను కేటాయించారు. ఉప్పుగడ్డ తండాలో నేనావత్ రాజునాయక్ ఒక్కరే నామినేషన్ వేయగా దిలావర్గూడలో ప్రత్యర్థి సభావత్ అనిత నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో సభావత్ మంజుల ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. ముగ్గురు సర్పంచులు, 33 వార్డులు కందుకూరు: మండల పరిధిలో ముగ్గురు సర్పంచ్లతో పాటు 33 వార్డులు ఏకగ్రీవమైయ్యాయి. మంగళవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే వచ్చాయి. దీంతో ఆ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. సార్లరావులపల్లి నుంచి విస్లావత్ శ్రీను, దావూద్గూడతండా నుంచి ముడావత్ హనుమంత్, దాసర్లపల్లితండా నుంచి వాంక్డావత్ బుజ్జి ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నికై య్యారు. కాగా దాసర్లపల్లి తండాలో ఆరు వార్డులు ఏకగ్రీవమైయ్యాయి. గత పర్యాయం ఆ తండాలో సర్పంచ్తో పాటు వార్డులు అన్ని ఏకగ్రీమైయ్యాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 33 వార్డులకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఆ వార్డులను ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. పిగ్లీపూర్ సర్పంచ్ ఏకగ్రీవం అబ్దుల్లాపూర్మెట్: మండల పరిఽధిలోని పిగ్లీపూర్ సర్పంచ్ పీఠం ఏకగ్రీవమైంది. మూడవ విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఉపసంహరణకు చివరి రోజున ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకోవడంతో కోటా ప్రభాకర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గ్రామంలోని ఎనిమిది వార్డు స్థానాలకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఏకగ్రీవంతో ఐక్యత మాడ్గుల: మండల పరిధిలోని కొర్రతండా, పల్లెతండా, సండ్రల గడ్డ తండా ఏకగ్రీవంతో ఐక్యతను చాటి అందరికి అదర్శంగా నిలిచాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తమ గ్రామపంచాతీ అభివృద్ధి కొరకు సర్పంచ్, ఉప సర్పంచ్లను, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేశారు. సభావత్ మంజుల, దిలావార్గూడ బుజ్జి, దాసర్లపల్లితండా శ్రీను, సార్లరావులపల్లి హనుమంత్, దావూద్గూడతండా జబ్బర్లాల్ నాయక్, కొర్రతండా సరిత దేవిలాల్, పల్లెతండా కోటా ప్రభాకర్రెడ్డి, పిగ్లిపూర్ జైపాల్నాయక్, సండ్రల గడ్డ తండా ఏకగ్రీవమైన వార్డులు గ్రామం వార్డుల సంఖ్య దావుద్గూడ తండా 5 పెద్దమ్మతండా 7 దాసర్లపల్లితండా 6 మురళీనగర్ 4 జైత్వారం 3 బేగంపేట 2 కొలన్గూడ 2 ధన్నారం 1 సార్లరావుపల్లి 1 బాచుపల్లి 1 మీర్ఖాన్పేట 1 -
చీకటి కోణం.. ఓటుకు బాణం!
● పగలు ప్రచార పథం ● రాత్రిళ్లు ప్రలోభాల పర్వం ● గెలుపే అభ్యర్థుల లక్ష్యంషాద్నగర్: గెలుపువేటలో అభ్యర్థులు అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. పొద్దంతా ప్రచారం సాగించి.. పొద్దుగుంకితే చాలు మందు, విందులతో ముంచేస్తున్నారు. పోలీసులు ఎంతా నిఘా పెట్టినప్పటికీ.. అధికారులు నిబంధనల కొరడా ఝలిపిస్తున్నప్పటికీ డబ్బుల పంపిణీ.. మద్యం సీసాల గలగలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గెలవాలంటే ఇదే ప్రధానమని బాహాటంగానే చెబుతున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పర్వం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపారు. పోలింగ్కు ఒక్క రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో పూర్తిగా దీనిపైనే దృష్టి సారించారు. గ్రూపులుగా ఏర్పడి.. అడ్డాలు ఏర్పాటు చేసుకుని.. ఎన్నికల ఆరంభం నుంచే ప్రచారంలో జనాలను తమ చుట్టూ తిప్పుకొనేందుకు అభ్యర్థులు రోజువారీగా వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. బిర్యానీ ప్యాకెట్లు, మద్యం సీసాలు అదనం. ఇక తాజాగా రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లి నగదు సమర్పణలు షురూ చేశారు. పరిశ్రమలు ఉన్న గ్రామాలు, స్థిరాస్తి వ్యాపారులు ఉన్న గ్రామాల్లో ప్రలోభాల పర్వం రసవత్తరంగా సాగుతోంది. పగలంతా సాధారణంగా ప్రచారంలో కనిపించే నాయకులు రాత్రి అయ్యే సరికి అడ్డాలు ఏర్పాటు చేసుకొని గ్రూపులుగా ఏర్పడి డబ్బుల పంపిణీ చేస్తున్నారు. దొడ్డిదారుల్లో మద్యం తరలింపు సాధారణంగా మద్యం దుకాణాల వద్ద సివిల్ దుస్తుల్లో పోలీసులు నిఘా వేసి ఉంచారు.. పెద్ద ఎత్తున మద్యం తరిలితే అది ఎక్కడికి చేరుతుందో తెలుసుకొని పట్టుకోవడం వారి బాద్యత. గ్రామాల్లో కూడా ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దొడ్డిదారుల్లో పెద్ద ఎత్తున గ్రామాలకు మద్యం తరలిస్తున్నారు. మద్యం ప్రియులను ఖుషీ చేసి ఎన్నికల రోజు వరకు ఓటును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది ముందుగానే వైన్షాప్లతో మాట్లాడుకొని చిట్టీల రూపంలో నేరుగా ఓటర్లను దుకాణాలకు పంపిస్తున్నారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా ఇప్పటిదాకా ఎక్కడా పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్న దాఖలు, డబ్బులు దొరికిన దాఖలాలు గానీ లేవు. అభ్యర్థుల ఆట ముందు పోలీసుల మద్యం, డబ్బుల వేట చిన్నబోతోంది. తీపి ‘గుర్తు’గా కానుకలు మద్యం, డబ్బులు మాత్రమే కాదు. కొంత మంది అభ్యర్థులు తమ గుర్తులు అని కానుకలుగా ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెండి ఆభరణాలను పంపిణీ చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగు, ఫుట్ బాల్, బ్యాట్, కత్తెర, గౌను తదితర గుర్తులు వచ్చిన అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి గుర్తులను కానుకలుగా ఇస్తున్నారు. దీని ద్వారా ఓటు వేసేటప్పుడు తమ గుర్తు వారికి బాగా గుర్తుండిపోతుందని నమ్ముతున్నారు. మొదటి విడత ఎన్నికలకు ఒక్కరోజే మిగిలి ఉండడంతో చీకటి పంపకాల మీదే అభ్యర్థులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పోలీసులు దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి. -
వైద్య విద్యార్థుల ధర్నా విరమణ
సమస్యల పరిష్కారానికి డీఎంఈ హామీ ఇబ్రహీంపట్నం రూరల్: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులు డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) శివరామప్రసాద్ హామీతో శాంతించారు. రెండో రోజైన మంగళవారం వీరు నిర్వహించిన ధర్నాకు జూడాల సంఘం, ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఇక్కడి పరిసరాలు అడవులను తలపిస్తున్నాయని, కనీసం తాగునీరు, బస్సు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొడంగల్లో సకల ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, ఇక్కడి పరిస్థితిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డీఎంఈ శివరామప్రసాద్ కాలేజీకి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. క్యాంపస్లోనే హాస్టల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల రక్షణ కోసం సెక్యూరిటీ, పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ మొబైల్ తనిఖీలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా సౌకర్యం కోసం క్యాంపస్ నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. మరో ఆరు మాసాల్లో సొంత భవన నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పేరెంట్స్ కమిటీ, జూడాలతో కలిసి విద్యార్థులను శాంతింపజేసి, సమ్మెను విరమింపజేశారు. పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50వేల మంది పేరెంట్స్తో మహేశ్వరం మెడికల్ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పొడిశెట్టి రమేష్ కుమార్, కోశాధికారి రవికుమార్, సంయుక్త కార్యదర్శి రత్నప్రసాద్ ఉన్నారు. -
గ్లోబల్ సమ్మిట్ను సందర్శించేలా చూడండి
సాక్షి, సిటీ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సదస్సులో ప్రదర్శిస్తున్న అన్ని అంశాల పై యువత అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ జి.ముకుంద రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ను విద్యార్థులు, యువతకు తిలకించే విధంగా అవగాహన కల్పించేందుకు చేపట్టవలసిన చర్యలపై వివరించారు. ఈ నెల 10 నుండి 13 వరకు సందర్శించేందుకు ప్రభుత్వం అవ కాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులను సమకూర్చుతున్నామని తెలిపారు. నోడల్ అధికారులను, కాలేజీలవారీగా ఇన్చార్జీ అధికారులను నియమిస్తునట్లు ఆయన తెలిపారు. సంక్షేమ శాఖ అధికారులు కోటాజి, ఆశన్న ,డీఎం పరిశ్రమల శాఖ ప్రవీణ్, విద్యా శాఖ అధికారి రోహిణి, ఆర్టీసీ ఆర్ఎం సుచరిత తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి ప్రదాతను ఎన్నుకోండి
కొత్తూరు: గ్రామాభివృద్ధికి పాటుపడే వారినే సర్పంచ్లుగా ఎన్నుకోవాలని ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డి సూచించారు. మండల పరిధిలోని తీగాపూర్లో సోమవారం ఆయన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జయప్రద జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చే నాయకులను గమనించాలన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులే అధికరంగా గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు. తీగాపూర్ ప్రజలు, ఓటర్లు జయప్రద జగన్మోహన్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, నర్సింహ, రమేశ్, శ్రీనివాస్రెడ్డి, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డి -
ఐదేళ్లకు.. అమ్మదయ
● ఒకే వ్యక్తికి రెండు గ్రామాల్లో ఓటు హక్కు ● ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు ● భూదాతను వరించిన సర్పంచ్ పదవి ● ఏకగ్రీవానికి తీర్మానించిన మక్తవెంకటాపూర్ గ్రామస్తులు కుల్కచర్ల: పంచాయతీ ఎన్నికల్లో ఓ వైపు విచిత్రమైన పొత్తులు పొడుస్తుండగా.. మరో వైపు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటూ పలు గ్రామాల పెద్దలు తీర్మానిస్తున్నారు. చౌడాపూర్ మండలం మక్తవెంకటాపూర్ పంచాయతీ పరిధిలో గతేడాది అమ్మవారు, సేవాలాల్ ఆలయాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయాల నిర్మాణానికి గ్రామానికి చెందిన జరుప్ల కవిత కుటుంబీకులు ఐదేళ్ల క్రితం 26 గుంటల భూమిని ఆలయానికి ఇచ్చారు. ఆసమయంలో గ్రామస్తులు మీ కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా ఉంటామని మాటిచ్చారు. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. గ్రామ నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కవిత తనను ఏకగ్రీవం చేయాలని కోరింది. దీంతో గ్రామ పెద్దలు ఆయా పార్టీల నాయకులతో మాట్లాడి సహకరించాలని కోరారు. ఈ క్రమంలో సోమవారం కవిత మినహాయిస్తే మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నేడు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఓ‘టు’ దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల ఓటరు జాబి తాలు తప్పుల తడకగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో జాబితాను అస్తవ్యస్తంగా తయారు చేశారు. దీంతో మూడేళ్ల క్రితం చెందిన వారి పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు వీటిని చూసి తలలు పట్టుకుంటున్నారు. దౌల్తాబాద్ మండలం బిచ్చాలకు చెందిన చెన్నకేశవులుగౌడ్కు బిచ్చాలతో పాటు దౌల్తాబాద్ ఇంటి నంబర్ 2–24లో ఓటు ఉంది. దేశాయిపల్లికి చెందిన లోకపల్లి సంగీతకు స్వగ్రామంతో పాటు దౌల్తాబాద్ 19–20లోనూ ఓటు హక్కు కల్పించారు. -
నిరుపేదల సొంతింటి కల సాకారం
ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్లో సోమవారం సద్దుల ఈశ్వరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రా రంభించి, అనంతరం వార్డులో 10లక్షల నిధులతో వేస్తున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబసభ్యలను శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ము న్సిపాలిటీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
నూతన విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలి
తుర్కయంజాల్: విత్తన బిల్లు 2025ను రైతులంతా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పిలుపునిచ్చారు. విత్తన బిల్లును వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చి న పిలుపు మేరకు సోమవారం తుర్కయంజాల్లో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం 1966 విత్తన చట్టాన్ని రద్దు చేసి తీసుకువస్తున్న కొత్త చట్టంతో విత్తన సరఫరాలో బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ శక్తుల నియంత్రణ పెరుగుతుందని అన్నారు. ఆహార భద్రత, విత్తన స్వావలంబన, రాష్ట్రాల హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. వ్యవసాయ సంక్షోభానికి దారితీసే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, ఎలీషా, రాము, ముత్తయ్య, యాదగిరి, అండాలు, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గండిచెరువులో ఇద్దరి నామినేషన్లు తిరస్కరించండి
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని రైతు ఫిర్యాదు అబ్దుల్లాపూర్మెట్: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చి రిటర్నింగ్ అధికారులను తప్పుదోవ పట్టించిన గండిచెరువుకు చెందిన జక్క వెంకట్రెడ్డి, జక్క పాపిరెడ్డి నామినేషన్లను తిరస్కరించాలని గ్రామానికి చెందిన రైతు రొక్కం జనార్ధన్రెడ్డి సోమవారం కలెక్టర్, అబ్దుల్లాపూర్మెట్ ఎంపీడీఓ, ఎంపీఓలకు ఫిర్యాదు చేశాడు. గండిచెరువు సర్వే నంబర్ 185, 186, 188, 190, 192, 196, 197లలోని పట్టా భూమి తనకు చెందినదని, దాంట్లో ఎలాంటి లేఅవుట్లు, ప్లాట్లు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సర్పంచ్ పదవి కోసం జక్క వెంకట్రెడ్డి, జక్క పాపిరెడ్డి తన భూమిలో వారిద్దరికీ ప్లాట్లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చి, నామినేషన్లను దాఖలు చేశారన్నారు. తప్పుడు సమాచారాన్ని నమోదు చేసిన ఇద్దరి నామినేషన్లను తక్షణమే తిరస్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు జనార్ధన్రెడ్డి తెలిపారు. ఓటు బహిర్గతం చేయొద్దు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంల అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్కుమార్ అనంతగిరి: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయు లు వేసిన పోస్టల్ బ్యాలెట్ను సైతం సాధారణ ఓటు హక్కు వినియోగించుకునే బ్యాలెట్ బాక్స్లోనే కలిపిన తర్వాతే కౌంటింగ్ చేయాలని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంల అసోసియేషన్ అధ్యక్షుడు తుప్పలి ఆనంద్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. గతంలో అధికారులు సాధారణ బ్యాలెట్ను లెక్కించి అనంతరం చివరగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించడంతో తాము వేసిన ఓటు బహిర్గతమయ్యే అవకాశం ఉందన్నారు. ఓటు బహిర్గతం కావడంతో గ్రామాల్లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కల్పించుకుని తాము వేసిన పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల రోజు ఓటర్లు వేసిన బ్యాలెట్లోనే కలిపి కౌంటింగ్ చేయాలని కోరారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు ఎంపీడీఓ సృజనాసాహిత్య మోమిన్పేట: పంచాయతీ ఎన్నికలను పక్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ సృజనాసాహిత్య సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల(పీఓ)కు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఓలు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే ఇబ్బందులుంటాయని చెప్పారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్కు అనుమతులు ఇవ్వాలని ఆమె తెలిపారు. క్యూలో నిలబడితే ఎక్కువ సమయం కేటాయించాలని ప్రతీ విషయంపై ఉన్నాతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు, వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలను చేతులేత్తే సంస్కృతితో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదగిరి, మండల వ్యవసాయాధికారి రామకృష్ణారెడ్డి, ఎన్నికల పీఓలు పాల్గొన్నారు. -
నాడు స్నేహ ‘హస్తం’.. నేడు గులాబీ నేస్తం
సర్పంచ్ బరిలో మాజీ వైస్ ఎంపీసీ ఆనంద్ కడ్తాల్: మండల కేంద్రానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019 కడ్తాల్–2 ఎంపీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందాడు. మండల వ్యాప్తంగా పది ఎంపీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి నలుగురు చొప్పున, బీజేపీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఆనంద్ గెలుపొందాడు. నాడు ఆనంద్ మద్దతుతో కాంగ్రెస్కు ఎంపీపీ పదవి వరించగా.. అదే పట్టుదలతో ఆయన వైస్ ఎంపీపీ పదవిని దక్కి ంచుకున్నాడు. తదనంతర రాజకీయ సమీకరణా ల్లో ఆయన బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కడ్తాల్ మేజర్ పంచా యతీకి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలోదిగి మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. -
మెడికల్ విద్యార్థుల ఆందోళన
ఇబ్రహీంపట్నం రూరల్: కళాశాలలో సరైన సౌకర్యాలు లేవని.. చదువులు సక్రమంగా సాగడం లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రస్తుతం ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతోంది. సరైన సౌకర్యాలు లేక సతమతమవుతున్నామని, బస్సు, హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ సోమవారం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. హాస్టల్ వసతి లేకపోవడంతో నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేలు వెచ్చించాల్సి వస్తోందన్నారు. పేద విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉండి చదవలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లు, కాలేజీలో విద్యార్థినులకు రక్షణ కరువైందన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నూతన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ వార్డులు
300 ● పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ● ముందే చెప్పిన ‘సాక్షి’ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీక్యూర్) వరకు విస్తరించిన నేపథ్యంలో వార్డుల సంఖ్యను ప్రభుత్వం 300గా నిర్ణయించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా–అర్బన్ డెవలప్మెంట్ శాఖ గురువారం జీవో(నెంబర్266), నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యయనం మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన ‘వార్డ్ రీ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్’ నివేదికను పరిశీలించిన అనంతరం, ఇటీవల విలీనం చేసిన 27 అర్బన్ లోకల్ బాడీల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వార్డులను 300కు పెంచుతూ నిర్ణ యం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం– 1955లోని నిబంధనల ప్రకారం దఖలు పడ్డ అధికారంతో, జీహెచ్ఎంసీ వార్డుల మొత్తం సంఖ్యను 300గా నిర్ణయిస్తూ అసెంబ్లీకి, అలాగే ప్రజలకు తెలియజేస్తూ ప్రభు త్వం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ను తెలంగాణ ఎక్స్ట్రార్డినరీ గెజిట్లో ప్రచురించాలనీ, 500 ప్రతులను ముద్రించి ప్రభుత్వానికి అందజేయాలనీ ప్రింటింగ్ స్టేషనరీ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ వార్డులు 150 నుంచి 300 వరకు పెరగనున్నాయని గత నెల 29వ తేదీనే ‘సాక్షి’ ప్రచురించిన విషయం తెలిసిందే. -
ప్రపంచానికి తెలంగాణ ఘనత
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ మహేశ్వరం నియోజకవర్గంలో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నట్లు కేఎల్ఆర్ ఇండస్ట్రీస్ అధినేత, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఘనతను ప్రపంచానికి చాటేలా సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచంలోని పెట్టుబడిదారులకు సందేశం ఇచ్చినట్లయిందన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతాల్లో ఇకపై తెలంగాణ ముందు నిలుస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ -
ఆదరించండి.. అభివృద్ధి చూపిస్తా
కడ్తాల్: బాలాజీనగర్ తండా సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరించి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి నేనావత్ అమర్సింగ్ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. గ్రామానికి చెందిన అమర్సింగ్ 15 ఏళ్ల క్రితం వ్యవసాయ పొలంలో పంపుసెట్ వద్ద జరిగిన ప్రమాదంలో తన కుడిచేతిని కోల్పోయాడు. అధైర్య పడకుండా డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామ యువత విద్యావంతుడిని సర్పంచ్ చేయాలనే పట్టుదలతో అమర్సింగ్కు మద్దతు తెలుపుతోంది. తన గెలుపుతో తండాను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నాడు. బాలాజీనగర్ తండా సర్పంచ్ అభ్యర్థి అమర్సింగ్ -
క్రైం కార్నర్..
దోపిడీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష శంకర్పల్లి: ఓ దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు సోమవారం చేవెళ్ల జిల్లా కోర్టు ఐదు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన జల్పేట్ శ్రీకాంత్(28), జల్పేట్ అలివేలు(26) బంధువులు. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచించారు. ఇద్దరూ కలిసి 2023 నవంబర్ 12న పటాన్చెరులో శంకర్పల్లికి వెళ్లేందుకు రూ.2 వేలకు ఆటో మాట్లాడుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్ మొయినొద్దీన్తో కలిసి మండలంలోని టంగటూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్పై దాడి చేసి, అతని వద్దనుంచి ఆటో, రూ.11వేల నగదు, సెల్ఫోన్ దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 14న నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి ఆటో, సెల్ఫోన్, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి, వాదనలు విన్న చేవెళ్ల ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి యు.విజయ్ కుమార్ నిందితులిద్దరికీ 5నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సోమవారం నిందితులకు శిక్ష పడడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను నార్సింగి ఏసీపీ రమణగౌడ్ అభినందించారు. మహిళతో అసభ్య ప్రవర్తన: వ్యక్తికి రిమాండ్ కడ్తాల్: మహిళతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన విస్లావత్ శంకర్ వ్యక్తి, ఈనెల 2న రాత్రి సమయంలో, అదే తండాకు చెందిన మహిళతో అసభ్యంగా వ్యవహరించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం గ్రామంలో శంకర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. మహిళలు, బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 19 లీటర్ల మద్యం సీజ్ యాచారం: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ మధు తెలిపిన ప్రకారం.. పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా సోమవారం మాల్–మంతన్గౌరెల్లి మధ్య యాచారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భాను తండాకు చెందిన జర్పుల హరికిషన్ మాల్లోని రేణుక ఎల్లమ్మ వైన్స్ నుంచి 19 లీటర్ల మద్యాన్ని ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మద్యం, ఆటో సీజ్ స్వాధీనం చేసుకుని హరికిషన్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తాళం వేసిన ఇంటికి కన్నం
● ఇద్దరు పాత నేరస్తులకు రిమాండ్ ● వివరాలు వెల్లడించినఏసీపీ లక్ష్మీనారాయణ షాద్నగర్రూరల్: జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు రిమాండ్కు తరలించారు. సోమవారం ఏసీపీ లక్ష్మీనారాయణ పట్టణంలోని పీఎస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా రామయ్యగూడకు చెందిన సురేందర్, తాండూరు మండలం నారాయణపూర్కు చెందిన నర్సింలు జైలులో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడిన వీరు మల్లీ చోరీల బాటపట్టారు. పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే కొండె కృష్ణయ్య ఈ నెల 3న తన స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం, చిన్నరేవళ్లికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం కృష్ణయ్య భార్య ఇంటికి తాళం వేసి టైలర్షాప్నకు వెళ్లింది. ఇది గమనించిన సురేందర్ తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బంగారం, నగదు దోచుకెళ్లాడు. చోరీ విషయంపై బాధితుడు కృష్ణయ్య అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నారు. సురేందర్ చోరీ చేసిన సొత్తును నర్సింలు కుదువపెట్టి ఇద్దరూ కలిసి జల్సాలు చేసేవారు. వీరు గతంలో ఎల్బీనగర్, మేడిపల్లి, సరూర్నగర్, చైతన్యపురి, బాలనగర్, చంద్రాయన్గుట్ట, భువనగిరి, గద్వాల, విజయనగర్, విరాకాబాద్, ఘట్కేసర్, సంగారెడ్డి, తిరుపతి, సైదాబాద్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. నిందితుల వద్ద ఒక బైక్, 3.2 తులాల బంగారం, రూ.62,600 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, డీఎస్ఐ శివారెడ్డి, సిబ్బంది రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పై దృష్టి సారించండి
కందుకూరు: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ సుశీందర్రావు సూచించారు. మండల పరిధిలోని నేదునూరు జిల్లా పరిషత్ పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, ఐఎఫ్పీ ప్యానెల్, పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ, మొక్కల పెంపకం, నీటి వసతి తదితర అంశాలను పరిశీలించారు. చదవడం, రాయడం సరిగ్గా రాని వెనకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, టీఎల్ఎం ద్వారా విద్యాబోధన నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్శర్మ, ఉపాధ్యాయులు గ్లోరి, శాంతకుమారి, కరుణాకర్, శ్రీవాణి, గిరిజ, డాక్టర్ ఎండీ బషీర్, అబ్దుల్లా, హసనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారంలో అభ్యర్థికి గుండెపోటు
శంకర్పల్లి: గ్రామంలో వార్డు మెంబర్ పదవికి నామినేషన్ దాఖలు చేసి ప్రచారం చేస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి శంకర్పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మాసానిగూడ అనుబంధ గ్రామం మంచర్లగూడెంకి చెందిన పల్లె నర్సింలు, లత(42) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డు పదవికి పల్లె లత నామినేషన్ దాఖలు చేశారు. నిత్యం గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రచారం చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే శంకర్పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శేరిగూడలో వివాహిత.. శంకర్పల్లి: గుండెపోటుతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన ప్రకారం.. శేరిగూడ గ్రామానికి చెందిన వడ్డె రాజు, లావణ్య(25) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. రాజు పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం లావణ్య ఇంట్లో పనులు చేసుకుంటూ ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో హుటాహుటినా శంకర్పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతి -
‘గుర్తు’ంచుకోండి.. గెలిపించండి
షాద్నగర్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమకు కేటాయించిన గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తెల్లవారింది మొదలు రాత్రి వరకు గడగడపనూ చుట్టేస్తున్నారు. మొదటి విడత షాద్నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల్లో 168 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరులో 12 పంచాయతీల్లో 110 వార్డులకు, నందిగామలో 18 పంచాయతీల్లో 170 వార్డులకు, కేశంపేటలో 28 పంచాయతీల్లో 260 వార్డులకు, కొందుర్గులో 19 పంచాయతీల్లో 186 వార్డులు, జిల్లేడు చౌదరిగూడలో 24 పంచాయతీల్లో 204 వార్డులు, ఫరూఖ్నగర్లో 46 పంచాయతీల్లో 410 వార్డులు, శంషాబాద్లో 21 పంచాయతీల్లో 190 వార్డులకు, సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి మిగిలింది ఒక్కరోజే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే ప్రచార పర్వం ముగియనుంది. ఒక్కరోజే మిగిలుండడంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. సర్పంచ్, వార్డు సభ్యులు వారికి కేటాయించిన గుర్తులను పోస్టర్లు, కండువాలపై ముద్రించి వాటిని ఇంటింటికీ వెళ్లి చూపిస్తూ ఒకటికి రెండుసార్లు గుర్తు చేస్తున్నారు. ఆటోలకు మైకులు అమర్చి, పాటలు, మాటల రూపంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నమూనా బ్యాలెట్ పేపర్లను ఇంటింటికీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. సామాజిక మాద్యమాల్లో.. ఈసారి సామాజిక మాద్యమాల్లో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందుకు గాను వాట్సాప్లో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారు. ఫేస్బుక్, ఇస్ట్రాగామ్లను సైతం వినియోగించుకుంటున్నారు. అభ్యర్థుల గుర్తులతో కూడిన ఫొటోలు, వీడియోలు రూపొందించుకొని సామాజిక మాద్యమాల ద్వారా ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రచారం చేస్తున్నారు. హామీలు గుప్పిస్తూ.. ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాము విజయం సాధిస్తే గ్రామాన్ని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీలు గుప్పిస్తున్నారు. గతంలో పదవులు చేపట్టి తిరిగి ఎన్నికల్లో నిలిచిన వారు గ్రామానికి ఐదేళ్ల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. తమకు మద్దతు తెలుపుతున్న పార్టీ అధికారంలో ఉందని, గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అఽధికార పార్టీ మద్దతుదారులు హామీలు ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధికి సొంత ఎజెండాను రూపొందించారు. పల్లెల్లో ప్రచార జోరు గెలుపే లక్ష్యంగా పావులు ఓటర్లకు ఒకటికి రెండు సార్లు ‘గుర్తు’ చేస్తున్న అభ్యర్థులు మొదటి విడత ఎన్నికలకు నేటితో ముగియనున్న ప్రచార పర్వం -
ఓవర్ లోడింగ్పై చర్యలు తీసుకోండి
తుర్కయంజాల్: ఓవర్ లోడింగ్ పేరుతో భారీ స్థాయిలో అక్రమ రవాణ జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సుశీల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. ఆర్టీఓ పరిధిలో జరుగుతున్న అక్రమ రవాణాతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరుతోందని అన్నారు. రహదారులపై మట్టి, కంకర పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదం నుంచి కూడా అధికారులు గుణపాఠం నేర్చుకోలేదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.శివకుమార్ గౌడ్, మున్సిపాలిటీ కార్యదర్శి కాటం రాజు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ నుంచి శాసనసభ్యులుగా
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వగ్రామంలో సర్పంచ్లుగా ఎన్నికై ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చేరారు. అదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలుగా రాణించారు. వీరు ఇద్దరూ 1980లో సర్పంచ్లుగా గెలుపొంది ఇద్దరూ మూడుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. నిర్మల్ పురస్కార్ అవార్డు ఘనత నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిది అబ్దుల్లాపూర్మెట్ మండలం, తొర్రూర్ స్వగ్రామం. విద్యార్థిదశ నుంచే చురుగ్గా ఉండడంతో ఆయనకు ఓటు హక్కు వచ్చిన ఏడాది 1980లోనే తొర్రూర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించారు. ఆయన సర్పంచ్గా పని చేసిన కాలంలో గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఘనత దక్కింది. తదనంతరం నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీలో చేరి 1994లో మలక్పేట్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2004లో కాంగ్రెస్ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచాడు. తదనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు సార్లు పొటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2023లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లుగా సేవలందిస్తున్నారు. బాబాయ్పై గెలుపు ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్రెడ్డి. నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతుండగా గ్రామానికి చెందిన పెద్దలు ఆయన్ను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. 1980లో సర్పంచ్ ఎన్నికల్లో సొంత బాబాయ్పై గెలుపొందాడు. సర్పంచ్గా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాడు. తదనంతరం టీడీపీలో చేరి వివిధ పదవులను అలంకరించాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 2014లో రెండో సారి టీడీపీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో టీఆర్ఎస్ నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి ఇబ్రహీంపట్నం ప్రజలకు సేవలందించాడు. 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు. మంచిరెడ్డి, మల్రెడ్డి తొలుత ప్రథమపౌరులే.. ఇద్దరూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేలు తొలి ఓటు తనకే వేసుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యం కష్టపడి పని చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. రాజకీయాల్లో స్థిరత్వం అవసరం. టీడీపీ రాజకీయ భవిష్యత్ ఇస్తే కాంగ్రెస్ జీవితం ఇచ్చింది. పార్టీని నమ్ముకుని ఉండటం వల్లే నేడు మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచాను. స్థిరత్వంగా, నిలకడగా ఉండాలి. ప్రజలను నమ్ముకుని ఉండాలి. స్వార్థం లేకుండా పని చేశాం. అప్పట్లో ఓట్ల కోసం ఖర్చులు సైతం తక్కువే. ఇప్పుడు రాజకీయాలు ఫిరం అయ్యాయి. – మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం నిస్వార్థంగా సేవలందించాం ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి సర్పంచ్గా 1980లో పని చేశాను. అప్పట్లో యువకుడిగా ఉన్న సమయంలో ప్రజలు అవకాశం కల్పించారు. నిస్వార్థంగా సేవలందించి ప్రజల మన్ననలు పొందాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నిరంతరం ప్రజలతోనే ఉండటం వల్ల మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. స్వార్థం లేని జీవితంతో ముందుకు పోతే అవకాశాలు వస్తాయి. – మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం -
చివరి దశకు పనులు
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సమ్మిట్కు గంటల వ్యవధే మిగిలి ఉండటంతో వేగంగా పనులు చేపడుతున్నారు. ప్రధాన వేదిక పనులు పూర్తవగా ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేసిన స్టాళ్ల ఏర్పాటు ఫైనల్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన వేదిక పక్కనే అతిథులు రాష్ట్ర ప్రగతి తిలకించేలా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన వివరాలు తెలియజేసేలా స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. మీడియా పాయింట్ పరిశీలన ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మీడియా సెంటర్ ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక పరిశీలించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆ శాఖ అధికారులు ఉన్నారు. -
గ్రామస్థాయిలో బలోపేతం
చేవెళ్ల: బీజేపీ గ్రామ స్థాయి వరకు బలోపేతం అవుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అనంత్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లి నుంచి పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలం పెంచుకుంటుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో బీజేపీ మద్దతుతో అభ్యర్థులు ఎక్కడ గెలిచినా ఆ గ్రామానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, బీఎస్ఎన్ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డి, శర్వలింగం, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, రా జు, శ్రీకాంత్రెడ్డి, వెంకటేశ్, అభిషేకర్రెడ్డి, మాణ య్య, చంద్రకాంత్, రవి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్‘గా ప్రచారం
షాబాద్: ఒకప్పుడు ఎన్నికలంటే వారం, పది రోజుల ముందు నుంచే మైక్ల ద్వారా ప్రచారం.. గోడలపై రాతలు ఉండేవి. అభ్యర్థుల తరఫున పోల్ చీటీలు ఇంటింటికీ పంచేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పటి ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పల్లె పోరులో సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా గ్రామాల వారీగా పదుల సంఖ్యలో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారానికి అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అవి నిమిషాల వ్యవధిలోనే ఓటర్లకు చేరువవుతున్నాయి. సెల్ఫోన్లే ప్రచార సాధనాలు.. ప్రస్తుతం సెల్ఫోన్లే ప్రచార సాధనాలుగా మారాయి. మండల పరిధిలోని ఒక గ్రామంలో ఒక పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా, సదరు పార్టీ నాయకుడు పోటీలో ఉన్న అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీంతో సదరు అభ్యర్థి తమ నాయకుడితో ఫోన్ మాట్లాడిన విషయాలను రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆయా పార్టీల సోషల్ మీడియా ఇన్చార్జిలు ఓటర్లకు సంబంధించి ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా వారితో సంప్రదింపులు చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ పేరిట పాటలు రూపొందించుకొని గ్రామాల వారీగా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ప్రగతి ధర్మారంలో సర్పంచ్ అభ్యర్థి ఒకరు తనను గెలిపిస్తే చేసే పనుల గురించి బాండ్ రాయించి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. పనిలో పనిగా అభ్యర్థులు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు సోషల్ మీడియా వేదికగా అస్త్రాలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థుల విశ్వప్రయత్నాలు -
భారత్ ఫ్యూచర్ సిటీ
భద్రతా వలయంలో.. సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025’ మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వెయ్యి సీసీ కెమెరాలతో 2,500 మంది పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక చుట్టూ వెయ్యి మంది పోలీసులతో మూడంచెల భద్రత, మరో 1,500 మందితో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టనున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం ఉదయం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు పరిశీలించారు. విద్యుత్, మంచి నీరు, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ సహా ఏసీలు, 3డీ ఎల్సీడీ ప్రొజెక్టర్లు, లైటింగ్, సౌండ్ సిస్టం సహా రిసెప్షన్ కౌంటర్, ప్రధాన వేదికకు వచ్చిపోయే మార్గాలను పరిశీలించారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన మూడు హెలీప్యాడ్లు సహా వచ్చి పోయే మార్గాలను మరోసారి చెక్ చేశారు. ఇదే వేదికగా తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కృతం కాబోతున్న నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. సచివాలయం, అసెంబ్లీ సహా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన మార్గాలు, మెట్రో పిల్లర్లతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల ముందు వీటిని ఏర్పాటు చేశారు. ఇటు శంషాబాద్ నుంచి తుక్కుగూడ, శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా మీర్ఖాన్పేట వరకు భారీ పోలీసు బందోబస్తును సిద్ధం చేశారు. సిటీ ముస్తాబు మహా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముస్తాబైంది. సమ్మిట్కు హాజరయ్యే దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, తెలంగాణ సాంస్కృతిక ఆకర్షణల, రంగురంగుల జెండాలు మేళవింపుతో నగరం స్వాగతం పలకనుంది. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు, చెరువులు, ప్రధాన రహదారులు. కూడళ్లు తదితర అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, కటౌట్లు, ఫ్లెక్సీలు, హైటెక్ ప్రొజెక్టర్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో నగరం తళతళా మెరిసిపోతోంది. ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం.. ఇలా నగరమంతటా ప్రత్యేక లైటింగ్తో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు.. ప్రత్యామ్నాయ మార్గాలు సాక్షి, సిటీబ్యూరో: మీర్ఖాన్పేటలో నిర్వహించ నున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఈమేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంత రాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో.. ప్రధానంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్హెచ్–765)లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ (ఎగ్జిట్ నంబరు–14), హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్ ఎగ్జిట్–15 మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కాబట్టి వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఔటర్ నుంచి ఎన్హెచ్–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ (ఎగ్జిట్ నంబరు–14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ (ఎగ్జిట్–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు. స్కాన్ చేసి.. పార్కింగ్ చేయ్.. భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. కోడ్ను స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు. విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తు శంషాబాద్: గ్లోబల్ సమ్మిట్కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్, లాంజ్ సిద్ధం చేశారు. ఆర్జీఐఏ ఔట్పోస్టు ఇన్స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో 24 గంటల పాటు అన్ని పాయింట్ల వద్ద బందో బస్తు కొనసాగుతోంది. అతిథుల కోసం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లలో భాగంగా భద్రతా బలగాల మోహ రింపు హాజరు కానున్న దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సమాలోచనలు, సదస్సులు -
అభ్యర్థులారా.. ఆలకించండి
‘నాపేరు.. పల్లెటూరు దేశానికి మరో పేరు..’ ఈ పాట ఎవరు రాశారో కానీ ప్రపంచానికి మేమంటే ఏమిటో చాటాం.. పచ్చదనం.. ప్రకృతి అందాలు.. గలగల పారే సెలయేళ్లు.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల సేవలు నా ప్రత్యేకతలు.. కానీ నేడు తీరు మారిపోయింది. నష్టాల ఏటిని కష్టంగా ఈదుతున్నా.. అభ్యర్థు లుగా కొత్త ఆశలు రేపి ముందుకు వస్తున్న మీలో ఎవరైనా రేపు గెలిచాక ప్రథమ పౌరులుగా.. ప్రజా సేవకులుగా మా సమ స్యలు పరిష్కరిస్తారని.. మాగోడు వెల్లబో సుకుంటున్నా. ఆలకించండి ఓసారి’.. – షాద్నగర్ పల్లె సీమ దేశానికి అన్నం పెట్టే భాండాగారం అన్నది మీ అందరికీ తెలుసు.. కానీ అదే పల్లెను ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నది ఎంత మందికి తెలుసు. షాద్నగర్ నియోజకవర్గాన్నే తీసుకుంటే.. ఇక్కడ 50 శాతం పల్లెలకు రహదారులు కూడా సక్రమంగా లేని పరిస్థితి.. ఏళ్లు గడుస్తున్నా గతుకుల రోడ్లే గతయ్యాయి. చాలా చోట్ల బస్సులు కూడా రావడం మానేశాయి. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.. ఇక సీజన్ వచ్చిందంటే పారిశుద్ధ్య లేమి.. దుర్గంధంతో రోగాలు ముందుకు మమ్మల్నే తాకుతున్నాయి. మరో వైపు రియల్ ఎస్టేల్ వ్యాపారులు ఉన్న భూములను వెంచర్లుగా మార్చేశారు.. వ్యవసాయ క్రమంగా తగ్గుతోంది. వ్యవసాయదారులు, కూలీలకు కూడా పని లేకుండా పోతోంది. విద్యా వ్యవస్థ సరిగాలేదు. అభివృద్ధి కాగితాల్లో తప్ప మా ముంగిటకు చేరలేదు. మా జీవన శైలిలో మార్పు రాలేదు. సంక్షేమ పథకాలు తెస్తున్నారు.. కానీ అవి అర్హులకు సరిగా అందడం లేదు. మమ్ములను ఎన్నుకున్న సర్పంచులు మాగోడు పట్టించుకోకుండా కేవలం సొంత పనుల మీదే దృష్టి పెడుతున్నారు. ఇలాగైతే ఎలా బాగు పడాలి.. ఎప్పటికి ఈ పరిస్థితులు మారాలి. కొత్త అభ్యర్థులైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా. కాలుష్య భూతం కాలుష్య భూతం ప్రజలను వెంటాడుతోంది. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.. స్థానికులకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. వేర్వేరు రాష్ట్రాల నుంచి పని చేసే వాళ్లను తెచ్చుకుంటున్నారు. ఇక్కడి వాళ్లకు మాత్రం కాలుష్యాన్ని కానుకగా ఇస్తున్నారు. సుమారు 30 శాతం గ్రామాలు ఇబ్బందులకు గురువుతున్నాయి. పంటలు కాలుష్యంతో పాడైపోతన్నాయి. వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. వ్యవసాయం, పరిశ్రమల్లో ఉపాధి లేక చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఎక్కడ చూసినా సగానికిపైగా తాళం వేసి ఉన్న ఇళ్లే కనిపిస్తున్నాయి. మరి ఈ పరిశ్రలతో ఎవరికి ఉపయోగం. ఈ ఎన్నికల్లో చాలా మంది వలస పోయిన ఓటర్లను ఫోన్ల ద్వారా పిలిపించుకొని ఓటు వేయించుకుంటున్నారు. బాగానే ఉంది.. మరి వాళ్లు ఎందుకు వలస వెళ్లారు. ఇన్ని పరిశ్రమలు ఉన్న వాళ్లకి ఇక్కడ ఎందుకు ఉపాధి దొరకడం లేదు. ఎప్పుడైనా ఆలోచించారా. కొత్త అభ్యర్థులైనా కనీసం దీనిపై ఆలోచించండి. స్థానికులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించే దిశగా పోరాటం చేయండి.. వలస పోకుండా ఇక్కడే ఉండి పల్లె సీమ నిండుదనాన్ని కాపాడండి.. పూర్వ వైభవం తెచ్చేలా .. ప్రగతివైపు అడుగులు వేసేలా మీరైనా చూడండి.. చూస్తారని.. చేస్తారని ఆశిస్తూ.... – ఇట్లు మీ షాద్నగర్ నియోజకవర్గంలోని పల్లెలు పాలకులు మారినా మా తలరాత మారలేదు దశాబ్దాలు దాటినా ప్రగతికి నోచుకోలేదు ఏళ్ల తరబడి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం కొత్తగా ఎన్నికయ్యే ప్రథమ పౌరులారా మీరైనా పట్టించుకోండి మా పల్లె వేదన -
దైవ చింతన అలవర్చుకోవాలి
కేశంపేట: మానవుడు దైవ చింతనతో మాధవుడిగా మారాలని కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మెంతాల మహేశ్వర్ అన్నారు. మండల పరిధిలోని నిర్ధవెళ్లి గ్రామంలో కిషన్ప్రభు ధర్మప్రచార సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా మద్భగవద్గీతా జయంతి మహోత్సవాలను నిర్వహించారు. ఆదివారం మహేశ్వర్తో పాటుగా తొమ్మిదిరేకుల గ్రామ ఆశ్రమ స్వామి అమృతానందగిరి స్వామి, అష్టలక్ష్మి దేవాలయం జడ్చర్ల నుంచి కృష్ణానందస్వామి, భూమనందస్వామి, ముక్తేశ్వరనందగిరి స్వామిలు పాల్గొని భగవద్గీతపైన భక్తులకు ప్రవచలను అందించారు. వారం రోజులుగా గ్రామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామం, భగవద్గీత యజ్ఞంతో పాటుగా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణయ్య, అయ్యపురెడ్డి, శివరాములు, యుగందర్రెడ్డి, హరికిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
మొయినాబాద్రూరల్: పంచాయతీ ఎన్నికల్లో స ర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఐ పవన్కుమార్రెడ్డి, మండల ఎన్నికల పరిశీలకుడు ఫిరోజ్ఖాన్ అన్నారు. ఆదివారం మండలంలో అభ్యర్థులతో ఎన్నికల ఖర్చులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎన్నికల పరిశీలకుడు మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. వాల్పోస్టర్, బ్యానర్లు, మైక్ స్పీచ్లు, ర్యాలీలు అన్నింటికి పర్మిషన్లు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి..
ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ఇబ్రహీంపట్నం రూరల్: కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సైదయ్య కథనం ప్రకారం.. నందిహిల్స్ అల్మాస్గూడలో నివాసం ఉండే నారాయణస్వామి(30), వంశీకృష్ణతో పాటు మరో ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నానికి వచ్చారు. అక్కడే క్రికెట్ మ్యాచ్ చూసి రాత్రి హైదరాబాద్కు కారులో బయలుదేరారు. తుర్కయంజాల్ మసాబ్ చెరువు కట్ట వద్దకు వెళ్లగానే ఎదురుగా కుక్క అడ్డు రావడంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారులో వెనకాల కూర్చున్న ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన నారాయణస్వామి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
శంకర్పల్లి: మండలంలో సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్క అభ్యర్థి సహకరించాలని ఎంపీడీఓ వెంకయ్య అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాయలంలో సర్పంచ్ అభ్యర్థులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులంతా స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. శంకర్పల్లి, మోకిల సీఐలు శ్రీనివాస్గౌడ్, వీరబాబు మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగిన కఠిన చర్యలుంటాయని, ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం చేయొద్దన్నారు. ప్రచార వాహనాల కోసం తహసీల్దార్ అనుమతి తీసుకోవాలని, సౌండ్ సిస్టం కోసం తమను సంప్రదిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా పోటీలో గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు తీసేవారు 48 గంటల ముందు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ వెంకయ్య -
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
కొత్తూరు: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. ఆదివారం మండలంలోని గూడూరు, తీగాపూర్, మల్లాపూర్, నందిగామ మండలంలోని అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, వెంకమ్మగూడ, చేగూరు, నందిగామ గ్రామాల్లో పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి కోసం కృషి చేసే అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు అభ్యర్థులు, నాయకులు శివశంకర్గౌడ్, సుదర్శన్గౌడ్, సురేందర్, శ్రీనివాస్, బాబార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
రిజర్వేషన్ల సాధనకు సమష్టి పోరు
మీర్పేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు దాసరి బాబు పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారికి ఆదివారం మీర్పేట కూడలిలో సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. అనంతరం బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడాన్ని తట్టుకోలేకనే ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. అతని మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ఇకనైనా బీసీలంతా ఐకమత్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించుకుని రాజ్యాధికారి సాధించాలన్నారు. కార్యక్రమంలో బహుజన ఐక్య వేదిక కార్యదర్శి రాజలింగం, విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరిచారి, నాయకులు రఘు, శేఖర్రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకయ్య, మల్లికార్జున్, నవీన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థుల గెలుపే లక్ష్యం
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం షాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో కూతురు గోపాల్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రం ప్రజ లకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజే యాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త శ్రమిస్తే విజయాన్ని అందుకుంటామన్నా రు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మద్దూరు మాణయ్య, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి, నా యకులు కూతురు మహేందర్, సంజీవ, రవీందర్రెడ్డి, క్యామ నారాయణ, వైభవ్రెడ్డి ఉన్నారు. -
ఊరి సిత్రాలు చూడయా!
యాచారం: రాజకీయాల్లో బద్ధ శత్రువులు.. శాశ్వత మిత్రులుండరని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరోసారి రుజువవుతోంది. పార్టీలో ఏళ్లుగా ఉంటూ పదవులు, గుర్తింపు పొందిన నేతలు స్వలాభం కోసం క్షణాల్లో మారిపోతున్నారు. డబ్బులు, అధికార ఆశతో పార్టీలో మర్యాద ఇవ్వడం లేదని, గుర్తింపు ఇవ్వడం లేదనే సాకుతో బద్ధ శత్రువులకు మద్దతు ప్రకటిస్తున్నారు. యాచారం మండలంలోని మాల్, మొండిగౌరెల్లి, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, చింతపట్ల తదితర గ్రామాల్లో విచిత్ర పొత్తులతో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తర ంగా మారుతున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రధాన ప్ర త్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని సర్పంచ్ బరిలో నిలుపగా, మరికొన్ని ఊర్లల్లో పదేళ్లు అధికారంలోకి ఉన్నప్పటికీ సర్పంచ్ అభ్యర్థులు లేక ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తున్న ఉదంతాలున్నాయి. కొన్నింటిలో బీజేపీ, సీపీఎంలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపడం గమనార్హం. ప్రత్యర్థులకు మద్దతు ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారన్న కారణంతో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, ఆమె భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాట్ టాఫిక్గా మారింది. మొండిగౌరెల్లి గ్రామంలో అధికార పార్టీకి వింత అనుభవం ఎదురైంది. సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఎవరూ పోటీ చేయకపోవడంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పటికీ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో లేకపోవడంపై ఆదివారం ఎమ్మెల్యే మండిపడ్డారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలి బీజేపీ సానుభూతిపరులకు మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం సర్పంచ్ ఎన్నికల్లో తటస్థంగా ఉంది. సర్పంచ్ బరిలో విద్యావంతులు కడ్తాల్: గ్రామ పంచాయతీ పోరులో విద్యావంతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కేతావత్ పద్మమోహన్ బరిలో ఉన్నారు. ఆమె పాలిటెక్నిక్ డిప్లామా పూర్తి చేశారు. గ్రామాభివృద్దే లక్ష్యంగా అందరి సహకారంతో బరిలో దిగినట్లు తెలిపారు. గ్రామంలో విద్యా, వైద్యానికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ పెద్దవేములోని బావితండాకు చెందిన రమావత్ గోపీనాయక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. చదువుకున్న యువకుడిగా తండా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే తండాలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. క్షణాల్లో కండువాలు మార్చేస్తున్న నాయకులు తమ పార్టీలకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్న వైనం విచిత్ర పొత్తులకు వేదికగాగ్రామ పంచాయతీ పోరు -
ఓటమి.. గెలుపునకు నాంది
శంకర్పల్లి: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది కావాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్లో హెచ్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ టూ ఆల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించగా.. సంగారెడ్డికి చెందిన విశాల్, శివ విన్నర్గా, శంకర్పల్లికి చెందిన ప్రభాకర్, తిరుపతిరెడ్డిలు రన్నరప్గా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సురేశ్, రఘునందన్రెడ్డి, నర్సింహారెడ్డి, మాణిక్రెడ్డి, రాంరెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రమోహన్ -
బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సస్పెండ్
యాచారం: స్థానిక జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, ఆమె భర్త యాదయ్యను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ ప్రకటించారు. మండలంలోని మంతన్గౌరెల్లి గ్రామంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా గులాం సుభానీ పేరును అధిష్టానం ప్రకటించినప్పటికీ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు జంగమ్మతో పాటు ఆమె భర్త యాదయ్య కాంగ్రెస్ పార్టీ బలపర్చిన శేఖర్గౌడ్కు మద్దతు ప్రకటించారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వివరించారు. -
క్రికెట్లో ‘అరుణతేజం’
● జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న కొండారెడ్డిపల్లి యువకుడు ● స్పాన్సర్షిప్ అందిస్తే సత్తాచాటుతానని ధీమా కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్నెకోట అరుణ్తేజ్ ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 24 నుంచి 27 వరకు ఢిల్లీలో జరిగే అండర్– 19 జట్టుకు (ఆల్ రౌండర్) ఎంపికయ్యాడు. అరుణ్తేజ్ ప్రస్తుతం బెంగళూర్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. గతంలో అండర్– 12, అండర్– 14, అండర్– 19 విభాగాల్లో నిర్వహించిన పలు టోర్నీల్లో తెలంగాణ తరఫున పాల్గొ న్నాడు. అనంతరం తెలంగాణ నుంచి మా ్యచ్లు ఆడే అవకాశాలు రాకపోవడంతో, నా లుగేళ్లుగా ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎపీలోని ఒంగోలుకు చెందిన రంజీ ప్లేయర్ షేక్ హఫీజ్ సారథ్యంలో ఏపీ తరఫున హైదరాబాద్లోని ఉప్పల్ శిక్షణను పొందుతున్నాడు. 2021నుంచి ఏపీ తరఫున ఆడుతున్నా డు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యలో తెలంగాణ సీఎం పేషీలో స్పాన్సర్ షిప్ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు అరుణ్ తెలిపా డు. స్పాన్సర్స్ ఎవరైనా చేయూతనిస్తే అంతర్జాతీయ క్రికెట్ టీంలో స్థానం సాధించి, దేశం తరఫున తలపడుతానని పేర్కొంటున్నారు. -
గ్రామ పోరుపై ప్రత్యేక నిఘా
● అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల అప్రమత్తం ● ఏడు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు కడ్తాల్: స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తమ గుర్తులతో గ్రామ పోరులో పోటీ చేయకున్నా మద్దతుదారులు, సానుభూతిపరులతో పల్లెల్లో పట్టు కోసం ఆరాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంతో గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచారు. అలాగే ప్రలోభాలకు సైతం అడ్డుకుట్ట వేయడానికి చర్యలు చేపట్టారు. కడ్తాల్ మండలంలో శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై ముచ్చర్ల గేట్ కూడలి వద్ద ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమంగా మద్యం, నగదు తరలకుండా నిఘా ఉంచారు. మండల పరిధిలో 24 గ్రామ పంచాయతీల్లో రెండో దఫా పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కడ్తాల్, మైసిగండి, ముద్వీన్, చరికొండ, చల్లంపల్లి, రావిచేడ్, సాలార్పూర్ గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను నియమించారు. ఎనిమిది మంది రౌడీషీటర్లు, 10 మంది సస్పెక్ట్స్, ట్రబుల్ మంగర్స్ 26 మొత్తం 44 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ప్రజలు సహకరించాలి మొయినాబాద్రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని మొయినాబాద్ సీఐ పవన్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం అమ్డాపూర్, శ్రీరామ్నగర్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయకులు, ప్రజలు కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. శాంతియుత ఎన్నికలకు కవాతు చేవెళ్ల: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు పూర్తి సహకారం అందించాలని చేవెళ్ల ఇన్స్పెక్టర్ ఉపేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని కోరారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో అనుచిత కార్యకలాపాలు, బెదిరంపులు, గొడవలు సహించేది లేదన్నారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వనం శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉందామా.. తప్పుకొందామా!
● గ్రామ పోరులో పోటీపై అభ్యర్థుల డైలమా ● కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పోటీలో ఉందామా.. తప్పుకొందామా అంటూ సందిగ్ధంలో పడ్డారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండలాలలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పెద్ద ఎత్తున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరించుకోవడానికి ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. దీంతో సర్పంచ్ పదవిలో కూర్చుందామనుకునే వారు పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. కొంతమంది నాయానో బయానో ఇచ్చి ప్రత్యర్థులతో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు పోటీలో ఉందామా.. తప్పుకొందామా అనే డైలమాలో పడ్డారు. నేడు ఉపసంహరణకు అవకాశం సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ వేసిన అభ్యర్థులు శనివారం మధ్యాహ్నం 3 లోపు ఉపసంహరించుకోవడానికి అ వకాశం ఉంది. నామినేషన్ ఉపసంహరణకు ఎ న్నికల సంఘం ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది. అ భ్యర్థి సంబంధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు అందించాలి. తానే స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, డబ్బు ప్రలోభాలు లేవని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి దానికి సంతృప్తి చెందినట్లయితే నామినేషన్ ఉపసంహరణ చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రక్రియ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను అధికారులు ప్రకటిస్తారు. -
దళితుల భూములు లాక్కోవద్దు
మొయినాబాద్: జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను లాక్కోవద్దని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన మొయినాబాద్లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వేనంబర్ 218లో యాభై ఏళ్ల క్రితం 36 మంది దళిత కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు 6.14 ఎకరాల భూమిని కేటాయించింది. ఈస్థలంలో కోళ్ల ఫారాలు నిర్మించుకున్న పలు దళిత కుటుంబాలు ఉపాధి పొందాయి. ఫారాలు శిథిలావస్థకు చేరడంతో కొంతకాలం క్రితం వీటిని తొలగించారు. అయితే సర్వే నంబర్ 218లో ఉన్న భూమిని ప్రభుత్వం ఇటీవల హెచ్ఎండీఏకు అప్పగించింది. ఇందులో దళితులకు కేటాయించిన స్థలాన్ని సైతం కలుపుకొని చదను చేస్తుండటంతో సదరు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. సెల్టవర్ ఎక్కి హల్చల్ ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని గుంజుకోవద్దంటూ పెద్దమంగళారానికి చెందిన భూ బాధితుడు ముడిమ్యాల రాములు మున్సిపల్ కేంద్రంలోని సెల్టవర్ ఎక్కాడు. వారం రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. భూములు గుంజుకుంటే టవర్ పైనుంచి దూకి చస్తానని హంగామా సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో కిందికి దిగాడు. తహసీల్దార్ గౌతమ్కుమార్ స్పందించి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళి ్లసమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతించిన యువకుడు కిందికి దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్కు వినతిపత్రం అందజేత పెద్దమంగళారంలో దళిత కుటుంబాలకు కోళ్ల ఫారాలకోసం కేటాయించిన భూములను తిరిగి తీసుకోవద్దంటూ శుక్రవారం తహసీల్దార్ గౌతమ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. యాభై ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన సర్టిఫికెట్లను తహసీల్దార్కు చూపించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ భూబాధితులకు తెలిపారు. వినతిపత్రం అందజేసినవారిలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ డప్పు రాజు, నాయకులు సంజీవరావు, భూబాధితులు ఉన్నారు. మొయినాబాద్లో సెల్ టవర్ ఎక్కిన యువకుడు సముదాయించి కిందికి దింపిన పోలీసులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన భూ బాధితులు -
సీఐపై ఎస్సీ, ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు
మంచాల: తమ భూమి విషయంలో జోక్యం చేసుకుని, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ మధుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబం శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మంచాలకు చెందిన గడ్డం సరోజ భర్త లక్ష్మయ్య గ్రామంలోని 44 సర్వే నంబర్లో ఉన్న 2.17 ఎకరాల భూమిని, 1978 నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి గతంలో ప్రభుత్వం వీరికి అసైన్డ్ పట్టా ఇచ్చింది. ఇదిలా ఉండగా పలువురు అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన వారు తమ భూమిని ఆక్రమించారని, ఈ విషయమై సీఐ వారితో కుమ్మకై ్క తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
క్రైం కార్నర్..
భారీగా మద్యం పట్టివేత శంకర్పల్లి: గ్రామ ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని శుక్రవారం శంకర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన సురేశ్, శేఖర్లు శంకర్పల్లిలో 340 లీటర్ల మద్యాన్ని తీసుకొని మహాలింగాపురం గ్రామానికి కారులో వెళ్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారెడ్డిగూడెం వద్ద కారుని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం, కారుని సీజ్ చేశారు. మరోఘటనలో మోకిలతండాలో నగేశ్ అనే వ్యక్తి కిరాణ దుకాణంలో అక్రమంగా మద్యం అమ్ముతుండగా.. పోలీసులు దాడులు చేసి, 9 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మోకిల సీఐ వీరబాబు తెలిపారు. మోసగాడికే మోసం.. పోలీస్స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం మూసాపేట: ఓ మోసగాడిని మరో మోసగాడు మోసం చేశాడు. దీంతో మొదటి మోసగాడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. భీమవరానికి చెందిన ఆనంద్ వరప్రసాద్ (28) ఆర్టీసి క్రాస్రోడ్డులో బాయ్స్ హాస్టల్ ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొంతమంది నుంచి ఆనంద్ డబ్బు తీసుకున్నాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవటంతో డబ్బుల కోసం బాధితులు వేధించసాగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తాను కానిస్టేబుల్ అంటూ పరిచయం అయ్యాడు. దీంతో ఆనంద్..కానిస్టేబుల్ను సహాయం కోరాడు. ఈ క్రమంలో గురువారం సచివాలయం వద్దకు వచ్చిన ఆ వ్యక్తి వర ప్రసాద్ను కారులో హయత్నగర్, పెద్ద అంబర్పేట వరకు తీసుకువెళ్లాడు. మధ్యలో రూ.1.37 లక్షలు అతనికి ఇచ్చాడు. ఆ తరువాత పెద్ద అంబర్ పేటలోనే వదిలివేసి వెళ్లిపోయాడు. ఆనంద్ వరప్రసాద్ అక్కడి నుంచి మెట్రో ట్రైన్లో కూకట్పల్లికి వచ్చాడు. ఇంటికి వెళ్లలేక కూకట్పల్లి పోలీస్స్టేషన్ వద్దకు వచ్చి యాప్ ద్వారా పురుగుల మందును ఆర్డర్ చేసుకుని స్టేషన్ ముందే తాగాడు. అతనే 100కు డయల్ చేసి పోలీసులకు తానే సమాచారం ఇచ్చాడు. పోలీసులు స్టేషన్ ముందు ఉన్న ఆనంద్ వరప్రసాద్ని గుర్తించి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు కేసును సైఫాబాద్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. -
విజ్ఞాన దీపిక.. చేవెళ్ల వేదిక
సైన్స్ ఫెయిర్కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ చేవెళ్ల: తెలంగాణ మోడల్ స్కూల్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మోడల్ స్కూల్స్ సైన్స్ ఫెయిర్కు చేవెళ్ల మోడల్ స్కూల్ వేదికై ంది. ఇగ్నైట్ –2025 పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమం శనివారం ప్రారంభం కానుంది. సైన్స్ ఫెయిర్లో రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం చేరుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని తమకు కేటాయించిన స్టాల్స్ నంబర్లను పరిశీలించుకొని ప్రదర్శనలకు సిద్ధం చేసుకున్నారు. వచ్చినవారికి అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. 42 స్టాళ్లలో 388 శాసీ్త్రయ నమూనాలను ప్రదర్శించనున్నారు. ఏర్పాట్ల పరిశీలన చేవెళ్ల మోడల్ స్కూల్లో ఏర్పాట్లను శుక్రవారం తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్చారి, జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, ఎంఈఓ పురన్దాస్ పరిశీలించారు. స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఐఏఎస్ డాక్టర్ నవీన్ నికోలస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరవుతారని చెప్పారు. సైన్స్ ఫెయిర్ను వీక్షించేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎవరైనా రావచ్చని సూచించారు. ఇలాంటి విజ్ఞాన వేదికలు విద్యార్థుల మేధోశక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. నేటినుంచి రాష్టస్థాయి సైన్స్ ఫెయిర్ ఇగ్నైట్ –2025 పేరుతో నిర్వహణ ఆవిష్కరణలకు సిద్ధమైన విద్యార్థులు రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ నుంచి హాజరు ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ -
గెలుపుపై గురి
షాద్నగర్: తొలివిడత ఎన్నికల బరిలో ఎవరు ఉన్నారనే లెక్క తేలిపోయింది. సర్పంచ్, వార్డు పదువులే లక్ష్యంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించడంతో ప్రచారంలో తలమునకలవుతున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. నిబంధనల ప్రకారం 9న సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులు గ్రామాల్లోని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులతో కరపత్రాలు ముద్రించి ప్రచార పర్వానికి తెరలేపారు. ఓ వైపు గ్రామ పెద్దలు, నాయకులతో మంతనాలు సాగిస్తూనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమ వారి గెలుపునకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆరుగురు సర్పంచులు ఏకగ్రీవం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి సర్పంచ్గా గోపాల్రెడ్డి, కొందుర్గు మండలం పాత ఆగిర్యాల సర్పంచ్గా యాదమ్మ, చెర్కుపల్లి సర్పంచ్గా యాదయ్య, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్గా మంచాల అనూష, కేశంపేట మండలం దేవునిగుడితండా సర్పంచ్గా సుజాత ఏకగ్రీవం అయ్యారు. నందిగామ మండలం కన్హా సర్పంచ్గా మధుసూదన్తో పాటు వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు తెలిపారు. చెక్‘పవర్’కోసం ప్యానల్స్ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్, కార్యదర్శి, ఉప సర్పంచ్లకు కలిపి చెక్ పవర్ను అందించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికోసం వార్డు సభ్యులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా కొన్ని చ్లోట్లనే ఫలించాయి. సర్పంచ్గా పోటీ చేస్తున్న వారు అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులనే బరిలో దించి ప్యానల్గా పోటీ చేస్తున్నారు. గెలిచిన పక్షంలో ఉప సర్పంచ్ పదవిని సైతం కై వసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వార్డు సభ్యుల ప్రచార ఖర్చును సైతం సర్పంచ్ అభ్యర్థులే భరిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ప్యానల్ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు సర్పంచ్గా సత్తా చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తొలివిడత ప్రచారం ముమ్మరం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న అభ్యర్థులు ఉపసర్పంచ్ పదవి కోసం వార్డు సభ్యుల ఆరాటం పల్లెపోరుతో గ్రామాల్లో కోలాహలం పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పల్లెల్లో హడావుడి చేస్తున్నారు. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. సర్వశక్తులు ఒడ్డుతూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మద్దతుదారులకు మందు, విందులు ఇవ్వడం.. నయానో భయానో ప్రత్యర్థి వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. -
ఎన్నికల నిర్వహణపై ర్యాండమైజేషన్
ఇబ్రహీంపట్నం రూరల్: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమక్షంలో పూర్తి చేశారు. జిల్లాలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా విధులు నిర్వర్తించే 4,458 మంది ప్రిసైడింగ్, ఇతర అధికారులతో కూడిన బృందాలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. వీరికి ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు. వారికి కేటాయించిన మండల కేంద్రాల్లో రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించినట్టు చెప్పారు. ఎవరైనా విధులకు గైర్జాజరైతే ఎన్నికల నిబంధనలను అనుసరించి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఉప్పుగడ్డ తండా.. ఏకగ్రీవానికి అండ
మహేశ్వరం: మండలంలోని ఉప్పుగడ్డ తండాలో సర్పంచ్తోపాటు ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ జనరల్కు రిజర్వు అయింది. సర్పంచ్ అభ్యర్థిగా నేనావత్ రాజు నాయక్ ఒక్కరే నామినేషన్ వేశారు. రాజునాయక్ పీజీ వరకు చదువుకున్నాడు. విద్యావంతుడు కావడంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడన్న విశ్వాసంతో గ్రామస్తులంతా కలిసి సమావేశమై ఏకగ్రీవమయ్యేలా చేశారు. తండాలో ఉన్న ఆరు వార్డులకు సైతం ఏకగ్రీవానికి ఒక్కటిగా నిలిచారు. 1వ వార్డు కేతావత్ మోహన్, 2వ వార్డు కేతావత్ సాలి, 3వ వార్డు బాధవాత్ పరమేష్ నాయక్, 4వ వార్డు వర్ాత్యవత్ సరిత, 5వ వార్డు పాల్త్యావత్ విజయ, 6వ వార్డు సభ్యులుగా నేనావత్ రవీందర్ నాయక్ ఒక్కో నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్తో పాటు ఆరు వార్డులు సైతం -
చివరి రోజు జోరు
మండలం జీపీలు దాఖలైనవి మొత్తం ఇబ్రహీంపట్నం 14 58 95 మంచాల 23 116 141 యాచారం 24 115 168 అబ్దుల్లాపూర్మెట్ 14 40 84 మహేశ్వరం 30 99 192 కందుకూరు 35 132 223ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్లలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు కావడంతో ఆశావహులంతా పెద్ద సంఖ్యలో సర్పంచ్, వార్డు మెంబర్స్ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. తమ అనుచరులు, బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి రావడంతో ఆయా క్లస్టర్లలో సందడి వాతావరణం కనిపించింది. పలుచోట్ల డప్పు వాయిద్యాలతో ర్యాలీగా తరలివచ్చారు. నామినేషన్లు వేసే వారికి సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఆయా క్లస్టర్స్ వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. క్లస్టర్ లోపల సాయంత్రం 5 గంటల లోపు ఉన్నవారికి టోకెన్లు ఇచ్చి క్యూలైన్లో కూర్చోబెట్టారు. రాత్రివరకు నామినేషన్లు స్వీకరించారు. ఆయా క్లస్టర్లలో నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. మహేశ్వరం మండలంలో 258 వార్డులకు 815, యాచారం మండలంలో 232 వార్డులకు 780, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 134 వార్దులకు 449, ఇబ్రహీంపట్నం 144 వార్డులకు 458, మంచాల మండలంలో 216 వార్డులకు 565, కందుకూరు మండలంలోని 312 వార్డులకు 962 నామినేషన్లు చివరి రోజు వరకు దాఖలైనాయి. మూడోవిడతలో ముగిసిన నామినేషన్ల పర్వం పలుచోట్ల డప్పు వాయిద్యాలతో ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు క్లస్టర్లలో సందడి వాతావరణం -
రైతులకు రసీదులు తప్పనిసరి ఇవ్వాలి
చేవెళ్ల: రైతులకు అమ్మే ఎరువు, విత్తనాలకు సంబంధించి రసీదులు తప్పనిసరి ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మండలంలోని పలు ఎరువులు, విత్తనాల, పురుగు మందుల దుకాణాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిస్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను విక్రయించాలని సూచించారు. మోసం చేసినట్లు తెలిస్తే దుకాణాల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండలంలోని పలువురు రైతుల పొలాలను పరిశీలించి సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి శంకర్లాల్ ఉన్నారు. యాచారం: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో లోపాలుండొద్దని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మాల్ క్లస్టర్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి పాల్గొన్నారు. బ్యాలెట్ బాక్స్ల పరిశీలన మాడ్గుల: మండల పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను శుక్రవారం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి సందర్శించారు. బ్యాలెట్ బాక్స్ల్లో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే సరి చేయించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎంపీడీవో చాంబర్లో ఎన్నికల నిర్వహణపై ఎంపీడీవో విజయలక్ష్మి, సీఐ వేణుగోపాల్ రావుతో చర్చించారు. ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. సానుభూతి కంటే సమాన అవకాశాలు కల్పించడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డీసీ నాయక్, హౌసింగ్ పీడీ బోజప్ప తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ పరిగి: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పరిగి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జడ్చర్లలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో పరిగి పట్టణంలోని గ్లోబల్ స్కూల్ నాలుగో తరగతి విద్యార్థి ఆష్నా సాదియాబేగం, మూడో తరగతి విద్యార్థులు ఆఫ్మిన్రహామత్, జునైరా షేక్ ప్రథమ స్థానంలో నిలిచారు. శుక్రవారం విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
ఇక ‘ఢీ’లిమిటేషన్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీక్యూర్) వరకు ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో ఇక వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న వార్డులు, జీహెచ్ఎంసీలో కలిసిన 27 పురపాలికల్లోని వార్డులతో కలిపి కొత్తగా వార్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం డీలిమిటేషన్ ఖరారుకు ముందస్తుగా ప్రజాభిప్రాయ సేకరణకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించనున్నారు. నిబంధనల మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల కోసం వారం రోజుల గడువిచ్చి.. వాటిని పరిగణనలోకి తీసుకొన్న అనంతరం దాదాపు పదిరోజుల్లో డీలిమిటేషన్ పూర్తి చేయనున్నారు. డీలిమిటేషన్ పూర్తయితేనే మొత్తం గ్రేటర్ పరిధిలో ఎన్ని సర్కిళ్లు, ఎన్నివార్డులు ఉంటాయో వెల్లడి కానుంది. పరిపాలన సౌలభ్యం కోసమే.. ప్రస్తుతం 27 పురపాలికలను ఆయా జోన్ల పరిధిలోకి తేవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తుర్కయాంజాల్, బడంగ్పేట్ పురపాలికలు చార్మినార్ జోన్లో ఉండటంతో, తమకు ఎల్బీనగర్ జోన్ దగ్గర, సదుపాయం అంటూ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే పోచారం రికార్డులు ముషీరాబాద్ సర్కిల్, బోడుప్పల్ రికార్డులు అంబర్పేట్ సర్కిల్, పీర్జాదిగూడ రికార్డులు గోషామహల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దగ్గరలోని సర్కిళ్లను కాదని దూరప్రాంతాల అధికారులకు బాధ్యతలప్పగించడం అంతుచిక్కడం లేదంటున్నారు. ● ఇవి కేవలం తాత్కాలిక చర్యలేనని, పరిపాలన సౌలభ్యం కోసం చేసుకున్న ఏర్పాట్లని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విలేకరులకు చెప్పారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాక, వాటిని పరిష్కరిస్తూ వార్డులు ఖరారవుతాయన్నారు. బుధవారం కమిషనర్ నుంచి రికార్డుల స్వాధీనం ప్రొసీడింగ్స్ అందిన తక్షణమే చాలామంది డిప్యూటీ కమిషనర్లు ఆయా పురపాలికల కార్యాలయాలకు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి 2 గంటల వరకు ఈ పనులు జరిగాయి. గురువారం చాలా పురపాలికలకు వాటి బోర్డులు తొలగించి జీహెచ్ఎంసీ బ్యానర్లు, బోర్డులు ఏర్పాటు చేశారు. ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్లుగా మారిన పురపాలికల కమిషనర్లు శుక్రవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పనుల్లో భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఈ నెల చివరి వారంలో డీలిమిటేషన్ పూర్తి కానున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీహెచ్ఎంసీ బడ్జెట్ను కొత్తగా కలిసిన పురపాలికలతో కలిపి రూపొందించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ వరకే ఆమోదం పొందాలని భావించినప్పటికీ, అన్నింటికీ కలిపే కొత్త బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమయ్యారు. బడ్జెట్ ముసాయిదాను ఈ నెల 11న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుంచనున్నారు. దాని ఆమోదం అనంతరం పాలకమండలి ముందుంచుతారు. వార్డుల విభజన కోసం రెండ్రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటన విలీన మున్సిపాలిటీలు సహా టీసీయూఆర్ వరకు కొత్త బడ్జెట్ ప్రస్తుత జోన్ల పరిధి తాత్కాలికమే.. ఫైనల్ కాదు -
కబడ్డీ పోటీల విజేత మన జట్టే
హాలియా: నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలోని టైం స్కూల్లో నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2న ప్రారంభమైన 51వ అంతర్ జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 33 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా.. నల్లగొండ జట్టు ద్వితీయ స్థానంలో, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు తృతీయ స్థానంలో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు అనిల్, సత్యనారాయణ, చంద్రమౌళిగౌడ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కారదర్శులు భూలోకరావు, కర్తయ్య, డీఎస్పీ శంకర్రెడ్డి, సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, టైం స్కూల్ డైరెక్టర్ మందా నరేందర్రెడ్డి, శ్లోక స్కూల్ గ్రూప్ డైరెక్టర్ కుకుడాల ఆంజనేయులు, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు యడవెల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన అంతర్ జిల్లా స్థాయి పోటీలు -
విలీనం.. గందరగోళం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురపాలక సంఘాల రికార్డుల అప్పగింతలో గందరగోళం నెలకొంది. సమీప జోన్లకు కాకుండా సుదూర ప్రాంతాల్లోని జోనల్ అధికారులకు స్వాధీన బాధ్యత అప్పగించడంపై దుమారం చెలరేగుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు భిన్నంగా కేటాయింపులు ఉండడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచే కాకుండా అధికార పార్టీ నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో అధికార యంత్రాంగం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇదే అంశంపై సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాయడం గమనార్హం. అనాలోచిత నిర్ణయాలతో అయోమయం రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ ఆయా పురపాలికల రికార్డుల స్వాధీనానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీల రికార్డులను చార్మినార్ జోన్ కమిషనర్కు అప్పగించడం, మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట రికార్డులను చార్మినార్ జోన్కు, ఇదే నియోజకవర్గంలోని మీర్పేట్ రికార్డులు సహా తుక్కుగూడ రికార్డులను ఎల్బీనగర్ జోనల్కు అప్పగించాలని ఆదేశించడం చర్చకు దారి తీసింది. పరిపాలనా సౌలభ్యం కోసం తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నా భవిష్యత్తులో జోన్ల కేటాయింపు ఇలాగే ఉంటే రాజకీయ దుమారం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయా పురపాలక సంఘాల ప్రజలకు అనువుగా ఉండేలా కేటాయింపు ఉండాల్సి ఉండగా, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అప్పగింతలు చేయడం తగదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అసంబద్ధంగా రికార్డుల స్వాధీన ప్రక్రియ భౌగోళిక ప్రాంతానికి భిన్నంగా నిర్ణయం చర్చనీయాంశంగా జోన్ల కేటాయింపు ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు స్థానికుల అభ్యంతరాలతో పునరాలోచనలో సర్కార్ జిల్లాలోని 11 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ ఉద్యోగులు నగరంలో ఉంటూ శివారు మున్సిపాలిటీలు, గ్రామాల్లో పని చేస్తున్నారు. కొంగరలోని ఒక్క కలెక్టరేట్లోనే 600 మందికిపైగా ఉన్నారు. ఇక ఉపాధ్యాయులు, తహసీల్దార్, ఎంపీడీఓ కేంద్రాలు సహా ఇతర ప్రభుత్వ విభాగాల్లో మరో 2,400 మంది వరకు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం వీరికి 12 శాతం హెచ్ఆర్ఏ మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై జీహెచ్ఎంసీలోని ఉద్యోగుల మాదిరే విలీన మున్సిపాలిటీల్లోని ఉద్యోగుల హెచ్ఆర్ఏ 24 శాతానికి పెరిగే అవకాశం ఉంది. మూడువేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు అంచనా. జిల్లాను సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దని ఒకవైపు జిల్లా ప్రజలు ఉద్యమిస్తుంటే దానికి విరుద్ధంగా ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం తుగ్లక్ నిర్ణయమే. తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను చార్మినార్ జోన్ పరిధిలోకి చేర్చడం తలతిక్క చర్య. జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శాసీ్త్రయత లేకుండా అడ్డగోలుగా జోన్ల విభజన చేయడం సరి కాదు. తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను చార్మినార్ జోన్లో కలపడం దివాలా కోరుతనానికి నిదర్శనం. తుక్కుగూడను ఎల్బీనగర్ జోన్లో కలిపి ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలను చార్మినార్ జోన్లో కలపడం ఏ విధంగా సరైందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా విభజన జరగాలి. అప్పటివరకు ప్రొసీడింగ్ను నిలిపేయాలి. – ఓరుగంటి యాదయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు -
సర్పంచ్లకు 235 వార్డులకు 1,350
● రెండో రోజు కొనసాగిన మూడో విడత నామినేషన్లు ● రాత్రి వరకు క్యూలో నిలబడి దాఖలు చేసిన అభ్యర్థులుఇబ్రహీంపట్నం: మూడో విడత నామినేషన్ల పర్వం గురువారం రెండో రోజు కొనసాగింది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మహూర్తం బాగుందని అభ్యర్థులు సాయంత్రం 4గంటల తర్వాత క్లస్టర్ కార్యాలయాలకు తరలివచ్చారు. రాత్రి కావడంతో టోకెన్లు తీసుకుని క్యూలో నిల్చున్నారు. ఆయా మండలాల పరిధిలోని పంచాయతీల్లో సర్పంచ్లకు 235 నామినేషన్లు, వార్డులకు 1,350 దాఖలయ్యాయి. వార్డులకు దాఖలైనవి.. ఇబ్రహీంపట్నం మండలంలోని 144 వార్డులకు 130 నామినేషన్లు, మంచాలలోని 216 వార్డులకు 94, యాచారంలో 232 వార్డులకు 230, అబ్దుల్లాపూర్మెట్లోని 134 వార్డులకు 185, కందుకూరులోని 312 వార్డులకు 388, మహేశ్వరంలోని 258 వార్డులకు 323 నామినేషన్లు గురువారం దాఖలయ్యాయి.మండలం జీపీలు దాఖలైనవి మొత్తం ఇబ్రహీంపట్నం 14 25 37 మంచాల 23 25 40 యాచారం 24 52 66 అబ్దుల్లాపూర్మెట్ 14 28 42 మహేశ్వరం 30 53 93 కందుకూరు 35 52 91 -
పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం 27 పంచాయతీలకు 75 మంది పోటీ తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మండలంలో 33 పంచాయతీలకు 6 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 27 జీపీల్లో 75 మంది సర్పంచు అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. 290 వార్డులకు 96 ఏకగ్రీవం కాగా.. 194 వార్డులకు 426 మంది బరిలో ఉన్నారు. పెద్దేముల్లో 100 మంది పెద్దేముల్ మండలంలో 38 గ్రామాలకు 5 ఏకగ్రీవమయ్యాయి. 33 పంచాయతీలకు 100 మంది సర్పంచు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 308 వార్డుల్లో 74 ఏకగ్రీవంకాగా.. 234కు 529 బరిలో ఉన్నారని ఎంపీడీఓ రతన్సింగ్ తెలిపారు. -
సిత్రమైన పొత్తులు
● పంచాయతీల్లో సర్పంచ్ పీఠం కోసం ఏకమవుతున్న ప్రధాన పార్టీలు ● ఉపర్పంచ్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తున్న బీజేపీ ● కడ్తాల మండలం సాలార్పూర్ అభ్యర్థికి మూడు పార్టీల మద్దతు ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్ర పొత్తులు పొడుస్తున్నాయి. సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటవగా.. మరో చోట అధికార కాంగ్రెస్ సైతం స్నేహ హస్తం అందించడం విశేషం. నోటిఫికేషన్కు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పంచాయతీ పోరులో ఒంటరిగా బరిలో ఉంటామని ప్రకటించినా.. ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల మండలాల్లలో కమలం నేతలు కారు పార్టీతో పొత్తు పెట్టుకుని పంచాయతీ ఎన్నికల పోటీకి దిగారు. ఒక్కో అభ్యర్థికి రెండు పార్టీల మద్దతు ● మంగళపల్లిలో ఎస్టీ మహిళకు కేటాయించారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా మౌనిక బరిలో దిగారు. మరో ఇద్దరు సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ● శెట్టిపల్లి సర్పంచ్ పదవికి జంగమ్మ బీఆర్ఎస్, బీజేపీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలిచింది. ● మేడిగడ్డతండాలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా హేమిబాయ్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా రాజేశ్వరి పోటీ పడుతున్నారు. ● కడ్తాల ఎస్సీ రిజర్వ్ స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బావండ్లపల్లి ఆనంద్కు బీజేపీ నేతలు మద్దతు పలికారు. మద్దతుకు ప్రతిఫలంగా బీజేపీ పార్టీకి ఉపసర్పంచ్ పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. ● కడ్తాల మండలం చరికొండలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మహేందర్కు బీజేపీ మద్దతు తెలుపుతూ ఉపసర్పంచ్ పదవి తమకు ఇవ్వాలని షరతు పెట్టినట్లు సమాచారం. ● మాడ్గుల మండలం కొల్కులపల్లిలో మాజీ సర్పంచ్ అనురాధకు కాంగ్రెస్ బలపరచగా బీజేపీ, బీఆర్ఎస్లు ధర్మారెడ్డిని పోటీలో ఉంచారు. ● కడ్తాల మండలం సలార్పూర్ పంచాయతీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సంయుక్తంగా పద్మ నామినేషన్ వేయగా.. బీఆర్ఎస్లోని మరోవర్గం నుంచి సర్పంచ్ పదవికి ప్రియ నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జెండాలతో నేతలు కనిపించారు. పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏ ఏ పార్టీలు కలుస్తాయో చూడాలి. -
నేను చనిపోతున్నా.. పాప జాగ్రత్త
● భార్యకు వీడియో పంపి ఫోన్ స్విచాఫ్ చేసిన భర్త ● ఆచూకీ దొరక్క కుటుంబ సభ్యుల ఆందోళన షాద్నగర్ రూరల్: ‘మనీలా నన్ను క్షమించు.. నాకు ఏ పనీ చేయాలనిపించడం లేదు. నేను చనిపోతున్నా.. నా చావుకు ఎవరూ కారణం కాదు.. పాపను జాగ్రత్తగా చూసుకో’అంటూ ఓ వ్యక్తి భార్యకు వీడియో పంపి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు.. అతడి ఆచూకీ లభించక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని రాఘవేంద్రకాలనీకి చెందిన సుందరాచారి, మనీల దంపతులు. సుందరాచారి ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళుతున్నానంటూ బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ చెరువు వద్ద ఓ వీడియో రికార్డు చేసి మనీలకు పంపించాడు. పాపను జాగ్రత్తగా చూసుకో, అప్పులు ఇచ్చిన వాళ్లు నన్ను క్షమించాలి, నా భార్యాపిల్లలను ఇబ్బంది పెట్టొద్దు అని అందులో పేర్కొన్నాడు. వీడియోలో కనిపించిన ముళ్లపొదలతో నిండిన చెరువు ఎక్కడ ఉంది, ఆ తరువాత కనిపించిన రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంది..? అనే విషయం తెలియకపోవడం, సుందరాచారి ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై సుందరాచారి భార్య మనీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పాలకులకు ‘పట్టా’
షాద్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్, వార్డు సభ్యులకు గురువార ం ఆయా క్లస్టర్లలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియామక పత్రాలను అందజేశారు. ఫరూఖ్నగర్ మండలం అయ్యవారిపల్లి సర్పంచ్గా గోపాల్రెడ్డి, కొందుర్గు మండలం పాత ఆగిర్యాల సర్పంచ్గా యాదమ్మ, చెర్కుపల్లి సర్పంచ్గా యాద య్య, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్గా మంచాల అనూష, నందిగామ మండలం కన్హా సర్పంచ్గా మధుసూధన్, కేశంపేట మండలం దేవునిగుడితండా సర్పంచ్గా సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశంపేట: మండల పరిధిలోని దేవునిగుడితండా సర్పంచ్తో పాటు ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి డాక్టర్ నివేదిత గురువారం వీరికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్గా రవిని ఎన్నుకున్నారు. అలాగే, తూర్పుగడ్డతండాలో 07, పొల్కోనిగుట్టతండా 03, పాటిగడ్డ 02, చింతకుంటపల్లి, ఇప్పలపల్లి, లేమామిడి, ఎక్లాస్ఖాన్పేట, దత్తాయపల్లి గ్రామాల్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.ఏకగ్రీవ ప్రజాప్రతినిధులకు నియామక పత్రాలు -
పల్లె పోరు.. యువత జోరు
షాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే రెండు విడతల నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా.. శుక్రవారంతో మూడో విడత ముగియనుంది. ఇప్పటికే దాఖలు చేసిన నామినేషన్లలో ఉన్నత విద్యావంతులే అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యులుగా యువత 60 శాతానికి పైగా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. యువత క్రీడలు, ఉద్యో గాలు, వ్యాపారాలతో పాటు రాజకీయాల్లోనూ చైతన్యం ప్రదర్శిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన వారితో పాటు పలువురు ఉద్యోగాలను వదులుకుని సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. గతంలో పెద్దలు పోటీచేస్తే ప్రచారంలో భాగస్వాములయ్యే యువత.. ప్రస్తుతం పెద్దల సహకారంతో ప్రత్యక్షంగా పోటీలో నిలుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం... పంచాయతీ ఎన్నికలలో యువత పోటీ చేయడమే కాకుండా గెలుపే లక్ష్యంగా తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. సాంకేతికతతో పోటీపడుతున్న ప్రపంచంలో సోషల్ మీడియాలో ఆకట్టుకునే విధంగా తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థి పేరు, గ్రామం పోటీ చేస్తున్న పదవితో పాటు తదితర వివరాలతో పోస్టర్లు తయారు చేస్తున్నారు. అదేవిధంగా వీడియోలో రూపొందించి వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుస్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా60 శాతానికి పైగా యూత్ -
మంచి ముహూర్తం ఎంచుకుని!
ఒకేసారి తరలివస్తున్న అభ్యర్థులు ● నామినేషన్ల ప్రక్రియకు ఎక్కువ సమయం ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ముహూర్తం చూసుకుని వస్తుండటంతో నామినేషన్లకు ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగుతోంది. రెండో రోజైన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మహూర్తం బాగుందని భావించిన పోటీదారులు సాయంత్రం 4గంటల తర్వాత క్లస్టర్ ఆఫీసుకు క్యూ కట్టారు. వీరికి టోకెన్లు ఇచ్చిన అధికారులు, లైన్లో కూర్చోబెట్టి రాత్రి 8గంటల వరకు నామినేషన్లు స్వీకరించినా.. ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఎన్నికల అధికారులు సైతం ఇబ్బంది పడ్డారు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని, అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరారు. రాత్రిపూట నామినేషన్లు కందుకూరు: మండల పరిధిలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 35 గ్రామ పంచాయతీల్లో రెండో రోజు గురువారం సర్పంచ్ స్థానాలకు 52, వార్డులకు 388 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ సరిత తెలిపారు. రెండు రోజులు కలిపి మొత్తం సర్పంచ్లకు 91, వార్డులకు 458 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలిపారు. -
‘పంచాయతీ’ సందడి
షాబాద్: పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఏ నలుగురు కలిసినా సర్పంచ్, వార్డు సభ్యుల పోటీపైనే చర్చ జరుగుతోంది. నేటితో మూడో విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వర్గాల వారీగా మంతనాలు జరుపుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్గా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రిజర్వేషన్లు మినహాయిస్తే జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువత పోటీలో ఉండడంతో ఓటరు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారో తెలియని పరిస్థితి. యువత ఆసక్తి ఎన్నికల బరిలో నిలిచేందుకు యువతరం ముందుకు వచ్చింది. గతంలో పెద్దలకు అవకాశం ఇస్తూ వెంటతిరిగిన యువకులు.. పంచాయతీల మార్పునకు అంటూ ప్రథమ పౌరుడి బరిలో నిలుస్తున్నారు. బంధుమిత్రులు, యువజన సంఘాల సభ్యుల మద్దతు కూడగట్టుకుంటూ సామాజిక మాధ్యమాల్లో సాధరణ ఎన్నికలను తలపిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ప్రచారంతో పల్లెల్లో కోలాహలం బరిలో నిలిచిన యువతరం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు -
నాడు చెత్త ప్రదేశం.. విజ్ఞాన కేంద్రం..
పారిశుద్ధ్య కార్మికుల ఆలోచనకు అధికారుల అభినందనసాక్షి, సిటీబ్యూరో: అది చెత్త పోగుపడ్డ ప్రదేశం. అక్కడకు వెళ్లాలంటే దుర్గంధం భరించలేక తల్లడిల్లే పరిస్థితి. ఇది ఒకప్పటి దుస్థితి. ప్రస్తుతం అది ప్రశాంత ప్రదేశంగా మారింది. దినపత్రికలు చదువుకునేందుకు అనువైన ప్రాంతంగా రూపాంతరం చెందింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు చదువుకునేందుకు వీలుగా దినపత్రికలు ఉంచుతున్నారు. చదువుకునేందుకు ప్రశాంత వాతావరణంతో పాటు వివిధ అంశాల గురించి తెలుసుకునేందుకు, స్థానిక ప్రజల మధ్య సత్సంబంధాలకు ఉపకరిస్తోంది. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లోని పారిశుధ్య కార్మికులు.. ముఖ్యంగా వారిలో ఒకరైన సుదర్శన్ ప్రయత్నంతో ఈ ప్రాంతం రూపాంతరం చెందింది. ఒక చిన్న ఆలోచన పలు ప్రాంతాలకు స్ఫూర్తిమంతంగా మారడంతో పారిశుధ్యకార్మికుల బృందాన్ని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం–పారిశుధ్యం) సీఎన్ రఘుప్రసాద్ అభినందించారు. పారిశుధ్య కార్మికులు కేవలం ప్రదేశాల్ని శుభ్రం చేయడమే కాక సమాజాన్ని ఆరోగ్యకరంగా మారుస్తున్నారని ప్రశంసించారు. -
రోడ్డుపై దగ్ధమైన కారు
కడ్తాల్: ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని మక్తమాధారం గేట్ సమీపంలో కడ్తాల్–షాద్నగర్ ప్రధాన రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండాకు చెందిన నలుగురు యువకులు హైదరాబాద్కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో మక్తమాధారం గేట్ సమీపంలోకి చేరుకోగానే కారులో నుంచి పొగలు రావడంతో గమనించారు. వెంటనే కారును నిలిపి అందరూ కిందికి దిగారు. ఒక్కసారిగా మంటలు వ్యాప్తించి కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావొచ్చని స్థానికులు భావిస్తున్నారు. శేఖర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి షాద్నగర్ రూరల్: అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ఆవ శేఖర్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిశాయి. మంగళవారం రాత్రి షాద్నగర్ పరిధిలోని అన్నారం వై జంక్షన్ వద్ద రైలు పట్టాలపై అతని మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మృతుడు కంసాన్పల్లిలో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేశాడు. కొందరు నాయకులు నామినేషన్ను విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే తన కొడుకు చనిపోయాడని మృతుడి తండ్రి వెంకటయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా శేఖర్ మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇదిలా ఉండగా శేఖర్ మృతిచెందడంతో అతని పేరును పోటీ చేసే అభ్యర్థుల జాబితానుంచి తొలగించినట్లు ఎంపీడీఓ బన్సీలాల్ తెలిపారు. ప్రజాసేవలో పట్లూరి ఫ్యామిలీ ● అరవై ఏళ్లుగా రాజకీయక్షేత్రంలో ఆ కుటుంబం ● ప్రస్తుత బరిలో మూడోతరం అభ్యర్థిని కేశంపేట: మండలంలోని కొత్తపేటలో ఓ కుటుంబం దాదాపు అరవై ఏళ్లుగా ప్రజలకు రాజకీయ సేవలందిస్తోంది. స్థానిక సంస్థలు ఏర్పాటైన నాటి నుంచి 2006 వరకు పట్లూరి కుటుంబం ప్రజాసేవలో భాగమైంది. గ్రామ మొదటి సర్పంచ్గా పట్లూరి శివలింగప్ప ప్రస్థానం ప్రారంభించి పాలనలో తమదైన ముద్ర వేయడంతో ఏళ్లుగా గ్రామస్తులు వారికే పట్టం కట్టారు. 2006 వరకు శివలింగప్ప వారసులు సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించగా.. ఆ తరువాత రిజర్వేషన్ మారింది. దీంతో ఆ కుటుంబం మద్దతుతో 2006–2011 వరకు గ్రామ సర్పంచ్గా వేరే వారు పనిచేశారు. 2011లో మళ్లీ జనరల్ స్థానంలో పోటీ చేసి ఆ కుటుంబ సభ్యుడైన పట్లూరి జగదీశ్వర్ 2016 వరకు గ్రామ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. తరువాత గ్రామంలోని సమీకరణాల కారణంగా ఐదేళ్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పట్లూరి జగదీశ్వర్ సతీమణి హైమావతి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గ్రామస్తుల తీర్పుపై మండలవాసులు ఉత్కంఠగా ఉన్నారు. శంషాబాద్: సిద్ధాంతి బస్తీలో జరిగిన వృద్ధుడి హత్య కేసును ఆర్జీఐఏ పోలీసులు ఛేదించారు. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. సిద్ధాంతి బస్తీలోని సౌడయ్య(70) మంగళవారం అర్ధరాత్రి హత్యకు గురై ఉండటంతో భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి స్థానికంగా ఉండే అబ్దుల్ జావేద్(35)తో పాటు ఓ మైనర్ బాలుడి(14)ని అరెస్ట్ చేశారు. వృద్ధుడు తమను తరచూ తిడుతుండటంతో అతడిని అంతమొందించినట్లు నిర్ధారించుకున్నారు. యువకుడిని రిమాండ్కు తరలించగా మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. -
సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం
మీర్పేట: రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి హిందూ దేవుళ్లపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీజేపీ మీర్పేట కార్పొరేషన్–1, 2 అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి, ముఖేశ్ ముదిరాజ్ అన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మీర్పేట ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ధర్నా చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల్లోనూ ఓ వర్గంవారి ఓట్ల కోసం ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడారని, రాష్ట్రంలోని హిందువులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీఎం అహంకారాన్ని తగ్గించుకుని వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాలో పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సోమేశ్వర్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్ముదిరాజ్, నాయకులు మధు, భీంరాజ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్, హైందవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతల డిమాండ్ -
వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని పచ్చని తోరణాలు, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ చైర్మన్ జిల్లెల పవన్కుమార్రెడ్డి, ఈఓ స్నేహలతల ఆధ్వర్యంలో స్వామివారి కల్యణ క్రతువును వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ గీత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, స్వామిగౌడ్, వెంకటయ్య, యాదయ్య, జంగయ్య తదితరులు తదితరులు పాల్గొన్నారు. -
గృహిణి ఆత్మహత్య
మీర్పేట: గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నూజివీడుకు చెందిన ఎం.సురేష్, శబరి (27)లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం బడంగ్పేట సాయినగర్కు వచ్చి నివాసముంటున్నారు. శబరి గృహిణి కాగా, భర్త పహాడీషరీఫ్లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్లో పనిచేస్తున్నాడు. మంగళవారం భార్యాభర్తల మధ్య చిన్న తగాదా జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ యాచారం: మెదక్లో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే సీఐటీయూ రాష్ట్ర మహా సభలకు సంబంధించి బుధవారం యాచారంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సీఐటీయూ మండల కన్వీనర్ చందునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ హాజరై వాల్ పోస్టర్లను విడుదల చేశారు. సీఐటీయూ రాష్ట్ర మహా సభలకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్: పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి.. చదువుకో అన్నందుకు ఓ విద్యార్థి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్ సర్కిల్ భాగ్యలక్ష్మి కాలనీలో ఓం ప్రకాష్ , కమలాదేవి దంపతులు నివాసముంటున్నారు. పదవ తరగతి చదువుతున్న వీరి కుమారుడు రాజకుమార్ బిష్నోయి(14) బుధవారం సాయంత్రం ఇంటికి రాగానే గేమ్స్ ఆడేందుకు బటకు వెళ్తానని మారాం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పరీక్షలు దగ్గర పడుతున్నాయి..చదువుకో అని చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకొని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ వెంటనే సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరి వివరాలు సేకరించారు. మామ మనోహర్ రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, సిటీ బ్యూరో: విద్య, గృహ రుణాలకు బ్యాంక్ అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకర్లు వార్షిక ప్రణాళిక ప్రకారం టార్గెట్ ను అమలు చేయాలని ఆదేశించారు. కొన్ని బ్యాంకుల పనితీరు అసంతృప్తిగా ఉందన్నారు. అకౌంట్ లేని విద్యార్థులకు జీరో అకౌంట్ కు అన్ని బ్యాంకులు సహకరించాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీ్ఓ రెహమాన్, నాబార్డ్ డీడీ ఎం హర్ష రఘురామ్, ఎల్డీఎం నరసింహ మూర్తి, పాల్గొన్నారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
రెండు పత్రాల తిరస్కరణ ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం 3 రోజులుగా ఎన్నికల అధికారులు స్వీకరించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు దాఖలైన నామినేషన్లను ఎంపీడీఓలు కుసుమమాధురి, సుజాత, శ్రీకాంత్లు పరిశీలించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం సక్రమంగా ఉన్న నామినేషన్ వివరాలను ఆయా కేంద్రాల వద్ద ప్రదర్శించారు. ఆమనగల్లు మండలంలో 13 సర్పంచ్ పదవులకు 86 నామినేషన్లు, 112 వార్డు సభ్యులకు 336 దాఖలవ్వగా అన్ని సక్రమంగానే ఉన్నట్లు ప్రకటించారు. కడ్తాల్ మండలంలో 24 సర్పంచ్ పదవులకు 153, 210 వార్డు సభ్యులకు 703 నామినేషన్లు వచ్చాయి. ఇందులో వాస్దేవ్పూర్ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన పాత్లావత్ లక్ష్మణ్ నామినేషన్ను తిరస్కరించారు. ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తుండటంతో లక్ష్మణ్ నామినేషన్ను తిరస్కరించారు. తలకొండపల్లి మండలంలో 32 సర్పంచ్ పదవులకు 205 నామినేషన్లు, 272 వార్డు సభ్యులకు 742 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా వార్డు సభ్యుడు పదవి కోసం వెంకటాపూర్తండాలో మూడావత్ భాస్కర్ నామినేషన్ వేయగా ప్రతిపాదితుడు మరోవార్డు చెందిన వ్యక్తి కావడంతో నామినేషన్ను తిరస్కరించారు. బలుసులపల్లి సర్పంచ్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో సర్పంచ్గా విజయపాత్లావత్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అలాగే వార్డు సభ్యులు కూడా ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం కానున్నారు. -
ఓఆర్ఆర్ దాకా ఇక జీహెచ్ఎంసీనే
సీఎం వ్యాఖ్యలు.. సీఎం దేవుళ్లపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.డీసీలకు స్థానిక సంస్థల రికార్డులుసాక్షి, సిటీబ్యూరో: విలాసం.. మెట్రో నగరాల్లో జీవనశైలిలో భాగమైపోయింది. ఇల్లు, తిండి, దుస్తులే కాదు.. తిరిగే ప్రాంతం కూడా ఖరీదుగా, విలాసవంతంగా ఉండాల్సిందేనంటోంది యువతరం. ఫుడ్ నుంచి షాపింగ్ వరకూ ప్రతీది గ్లోబల్ బ్రాండ్లు కావాల్సిందేనంటోంది. అందుకే దేశంలోని మెట్రో నగరాలలో అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లు రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన షాపింగ్ వీధులేంటని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 50 అత్యంత విలువైన షాపింగ్ వీధులు–2025ను ప్రకటించగా.. మన దేశం నుంచి 15 ప్రాంతాలకు చోటు దక్కింది. ఇందులో హైదరాబాద్ నుంచి బంజారాహిల్స్, హిమాయత్నగర్లు హై స్ట్రీట్స్ జాబితాలో నిలిచాయి. 48వ స్థానంలో మన హై స్ట్రీట్లు.. ప్రీమియం హై స్ట్రీట్ ఏరియాలు, మార్కెట్ ఆక్యుపెన్సీ స్థాయి, ధరలు, బ్రాండ్లు, స్థిరమైన జన సమూహం, కొనుగోలు వ్యయం, కస్టమర్ల ప్రవర్తన వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు. లండన్లోని న్యూ బ్రాండ్ స్ట్రీట్ ప్రపంచంలోనే హై స్ట్రీట్గా నిలిచింది. ఇండియాలో అత్యంత ఖరీదైన రిటైల్ కారిడార్గా న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్ నిలిచింది. ఏషియా పసిఫిక్ రీజియన్లోని టాప్–50 ఖరీదైన షాపింగ్ స్ట్రీట్లలో ఖాన్ మార్కెట్ 24వ స్థానంలో ఉంది. ఇక్కడ అద్దెలు చదరపు అడుగుకు 223 డాలర్లు లేదా రూ.19,940లుగా ఉన్నాయి. మన దేశం నుంచి ముంబై, బెంగళూరు నగరాల నుంచి మూడేసి హై స్ట్రీట్స్ ఉండగా.. న్యూఢిల్లీ, హైదరాబాద్, పుణె నగరాల్లో రెండు, కోల్కతా, చైన్నె, గుర్గావ్ నగరాల్లో ఒకటి చొప్పున హై స్ట్రీట్ ప్రాంతాలున్నాయి. బౌగోళిక రాజకీయ అస్థిరత, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ లగ్జరీ రిటైల్ మార్కెట్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతుండటంతో పాటు సాంకేతికత, ఆర్థిక వృద్ధి, ఈ–కామర్స్ రంగం అభివృద్ధే ఈ డిమాండ్కు కారణం. అత్యంత విలువైన షాపింగ్ వీధుల్లో బంజారాహిల్స్, హిమాయత్నగర్ ప్రాంతాలు 48వ స్థానంలో నిలిచాయి. ఈ రెండు ప్రాంతాలు ఏడాదికి అద్దె చదరపు అడుగుకు 30 డాలర్లు లేదా రూ.2,680గా ఉన్నాయి. ఏషియా పసిఫిక్ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి స్థానం సంపాదించిన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గమనార్హం. లగ్జరీ బ్రాండ్ల టెస్టింగ్ ఇక్కడే.. జీవనశైలి, డిజైన్ ఆధారిత దుకాణాలు బంజారాహిల్స్ బాగా ఫేమస్. మరోవైపు హిమాయత్నగర్ నమ్మకమైన రిపీటెడ్ కస్టమర్లతో విలువ ఆధారిత లేబుల్స్కు పెట్టింది పేరు. బంజారాహిల్స్ ప్రశాంతమైన కేఫ్లతో కూడిన వాతావరణంతో ప్రసిద్ధి చెందింది.సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంకతో కలిసి పరిశీలించారు. నిర్ధేశించిన పనులు ఏ మేరకు పూర్తయ్యాయని సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సమ్మిట్కు రానున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏడీజీ మహేష్ భగవత్ కందుకూరు: గ్లోబల్ సమ్మిట్కు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అదనపు డీజీ మహేష్ భగవత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రాచకొండ సీపీ సుధీర్బాబు, ఐజీపీ రమేష్రెడ్డితో కలిసి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు. బందోబస్తు విషయంలో పొరపాట్లకు తావివొద్దని, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్కు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత, వెయ్యికి పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల వనరుల జిల్లా అధికారి రమేశ్ షాద్నగర్రూరల్: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని దివ్యాంగుల వనరుల జిల్లా అధికారి రమేశ్ అన్నారు. పట్టణంలోని ఎంఆర్సీ భవనంలో ఎంఈఓ మనోహర్ అధ్యక్షత బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, ఉపాధ్యాయులకు, భవిత కేంద్రాల్లోని విద్యార్థులకు మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. దివ్యాంగ విద్యార్థులు వారానికి రెండు సార్లు విధిగా ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. సదరం ధ్రువపత్రాలు తీసుకుంటే ప్రభుత్వ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో అధికారులు వెంకటేశ్, రమేశ్, ఉపాధ్యాయులు స్వప్న, శివకుమార్, స్రవంతి, వెంకటేశం, ఈశ్వర్, రమాదేవి, సరిత తదితరులు పాల్గొన్నారు. ఎన్పీఆర్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు భుజంగరెడ్డి షాద్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగరెడ్డి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన భుజంగరెడ్డి మాట్లాడుతూ.. సమాజం దివ్యాంగులను బాధితులుగా కాకుండా సమాజంలో భాగస్వామ్యులుగా గుర్తించాలన్నారు. దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వాలు గుర్తిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్, శంకర్, మూర్తి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అగ్నివీర్ పాసింగ్ అవుట్ పరేడ్ బుధవారం గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లోని పళని పరేడ్ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీర్ 6వ బ్యాచ్ పరేడ్ను ఆర్టిలరీ సెంటర్ డైరెక్టర్ జనరల్ అథోష్ కుమార్ వీక్షించారు. అంతకు ముందు ఆయన ఆర్టిలరీ సెంటర్లోని వార్ మెమోరియల్ వద్ద దేశం కోసం పోరాడుతూ అమరులైన సైనికులకు నివాళులర్పించారు. –గోల్కొండఅదరహో.. అగ్నివీర్నగర ముఖచిత్రం మారింది. నయా బల్దియాకు దారి పడింది. శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో సదరు స్థానిక సంస్థలకు సంబంధించిన రికార్డులు, బాధ్యతలు జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీలోని ఏ డిప్యూటీ కమిషనర్ ఏ స్థానికసంస్థ రికార్డులు స్వాధీనం చేసుకోవాలో పేర్కొంటూ.. తక్షణమే ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ స్థానిక సంస్థల్ని విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఈ స్థానికసంస్థల రికార్డుల్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు మినిట్స్ బుక్స్ నిలిపివేయాలని, ప్రస్తుత బ్యాంకు ఖాతాలను జీహెచ్ఎంసీ బ్యాంక్ ఖాతా (అకౌంట్ నెంబర్ (52082155599)కు బదిలీ చేయాలని ఆయన ఆదేశించారు. –సాక్షి, సిటీబ్యూరోనయా బల్దియా! మారిన నగర ముఖ చిత్రంఇన్చార్జి డిప్యూటీ కమిషనర్లుగా స్థానిక సంస్థల కమిషనర్లుసిబ్బంది వివరాలివ్వండి ఔటర్ వరకున్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో వాటిలో పని చేస్తున్న సిబ్బందికి సంబంధించిన వివరాలు అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మున్సిపల్ పరిపాలనశాఖ కమిషనర్ను కోరారు. సదరు స్థానిక సంస్థలకు మంజూరైన మొత్తం పోస్టులెన్ని.. ప్రస్తుతం ఎందరున్నారు.. వారిలో రెగ్యులర్తో పాటు ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ల వివరాలు కూడా పొందుపరచాలని సూచించారు. బోర్డుల మార్పు ● 27 స్థానిక సంస్థల కార్యాలయాలపై జీహెచ్ఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో పాటు దిగువ వివరాలు సమర్పించాలని సూచించారు. ● స్థానిక సంస్థ ప్రొఫైల్. ● మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాల జాబితా. ● స్థిర, చర ఆస్తుల వివరాలు ● బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు ● ట్యాక్స్లు, నాన్ ట్యాక్స్లకు సంబంధించి. డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ వివరాలు. ● అమలవుతున్న స్కీమ్లు ● పనులు, సామగ్రికి సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు ● గత మూడేళ్లలో జారీ చేసిన భవననిర్మాణ, లే ఔట్ల అనుమతులు. ● వీటిని సంబంధిత ప్రొఫార్మా రూపంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకు వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ● ఈ విలీన ప్రక్రియలో సహకరించాల్సిందిగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కోరారు. ఈ పనులు ఈ నెల 5వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పర్యవేక్షణాధికారులుగా ఆయా జోనల్ కమిషనర్లకు బాధ్యతలప్పగించారు. ఓఆర్ఆర్ వరకు, ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్గా పేర్కొంటూ జీహెచ్ఎంసీ పరిధి విస్తరణతో నగర అభివృద్ధి ప్రణాళికలు సమగ్రంగా అమలు చేసేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ వివరాలు ఇవ్వాలి ఆయా ప్రొఫార్మాల మేరకు సదరుస్థానిక సంస్థల్లో నివాసాలు, వార్డులు, స్లమ్స్, జనాభా, గత మూడేళ్లలో ఆదాయం(గ్రాంట్స్తో సహ), వ్యయం, రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా వివరాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, మార్కెట్లు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లు పరిశ్రమలు, చెత్త డంపింగ్ ప్రాంతాలు, భవనాలు, ఖాళీ ప్రదేశాలు, పార్కులు, స్థానికసంస్థకు చెందిన వాహనాలు, ఫర్నిచర్, దుకాణాలు, సెల్ప్హెల్ప్ గ్రూప్లు, స్వచ్ఛందసంస్థలు, కాలనీ అసోసియేషన్లు, ఎన్జీవోలు, ఇటీవల నియమించిన ఔట్సోర్సింగ్ కార్మికులు తదితరాలు. సంవత్సర క్యాష్బుక్స్, పేబిల్స్ పరిశీలించాలని సూచించారు. విలీనమిలా.. రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న విలీన నిర్ణయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. విస్తీర్ణం, జనాభా పెరుగుదల: దీంతో ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ దాదాపు 2000 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా దాదాపు 1.3 కోట్లు ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ముంబై ఇలా .. ● 1865: మున్సిపల్ పరిపాలన బాంబే మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో ప్రారంభం ● 1888: బాంబే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ద్వారా అధికారికంగా ఏర్పడింది ● 1990లలో: బాంబే ముంబైగా మారడంతో బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)గా పేరు మారింది. ● గ్రేటర్ ముంబై పరిధిలోని అన్ని ప్రాంతాలను కలిపి ఒకే కార్పొరేషన్. మున్సిపాలిటీల విలీనంతో ఏర్పడిన దీనిని ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) అని కూడా పిలుస్తున్నారు. ● ప్రస్తుత పరిధి 603 చ.కి.మీ. జనాభా 2.2 కోట్లు (అంచనా) ● ఐఏఎస్ అధికారి కమిషనర్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. హైదరాబాద్ ఇలా.. జీహెచ్ఎంసీ అంతకు ముందు ఎంసీహెచ్గా ఉండేది. 12 మున్సిపాలిటీలతో ఏర్పడింది. ప్రస్తుతం 27 స్థానికసంస్థలు విలీనం కావడంతో ముంబై మాదిరిగా గ్రేటర్ అర్బన్ బాడీగా మారింది. విస్తరించిన ప్రాంతం వరకు తెలంగాణ అర్బన్ కోర్ రీజియన్ (టీక్యూర్)గా పిలుస్తున్నారు. జనాభా 1.3 కోట్ల నుంచి 1.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విస్తీర్ణం దాదాపు 2వేల చదరపు కిలోమీటర్లు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలోనే పని చేస్తోంది. ప్రపంచ నగరాల సరసన.. జనాభా పెరుగుదలతో హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద నగరాల సరసన చేరే దశకు చేరుకుంది. ప్రపంచంలోని కొన్ని పెద్దనగరాలు. వాటి జనాభా దాదాపుగా. పాలన విభాగం వివరాలిలా. ఏషియా పసిఫిక్ రీజియన్లో ఈ ప్రాంతాలకు చోటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన షాపింగ్ వీధులు 48వ స్థానంలో నిలిచిన బంజారాహిల్స్, హిమాయత్నగర్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదికలో వెల్లడి ఏషియా పసిఫిక్ రీజియన్లో ఇండియాలోని హై స్ట్రీట్లు ఇవేహై స్ట్రీట్ ర్యాంక్ ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ 24 కన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ 26 గల్లెరియా మార్కెట్, గుర్గావ్ 26 లింకింగ్ రోడ్, ముంబై 34 పార్క్ స్ట్రీట్, కోల్కతా 36 ఫోర్ట్/ఫౌంటేన్, ముంబై 39 కెంప్స్ కార్నర్, ముంబై 40 బ్రిగేడ్ రోడ్, బెంగళూరు 41 విట్టల్ మల్యా రోడ్, బెంగళూరు 42 ఎంజీ రోడ్, పుణె 44 ఇంద్రానగర్ 100 ఫీట్ రోడ్, బెంగళూరు 45 ఎఫ్సీ రోడ్, పుణె 46 బంజారాహిల్స్, హైదరాబాద్ 48 హిమాయత్నగర్, హైదరాబాద్ 48 పాండీ బజార్, చైన్నె 50మెట్రోపాలిటన్ ప్లానింగ్, సమర్థమైన పాలన కోసం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఏ జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో ఏవి చార్మినార్: ఆదిభట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్. శేరిలింగంపల్లి: బండ్లగూడ జాగీర్, మణికొండ, నార్సింగి, అమీన్పూర్, తెల్లాపూర్. ఎల్బీనగర్: మీర్పేట్, పెద్ద అంబర్పేట్, తుక్కుగూడ, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పీర్జాదిగూడ, పోచారం. కూకట్పల్లి: దుండిగల్, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, మేడ్చల్, నిజాంపేట్, బొల్లారం. సికింద్రాబాద్: బోడుప్పల్, జవహర్నగర్, నాగారం, తూముకుంట. రికార్డులు స్వాధీనం ఏ స్థానిక సంస్థది.. ఏ డిప్యూటీ కమిషనర్కు.. వివరాలిలా.. స్థానికసంస్థ డిప్యూటీ కమిషనర్ పెద్ద అంబర్పేట్ హయత్నగర్ జల్పల్లి చాంద్రాయణగుట్ట శంషాబాద్ రాజేంద్రనగర్ తుర్కయాంజాల్ సంతోష్నగర్ మణికొండ కార్వాన్ నార్సింగి మెహదీపట్నం ఆదిభట్ల మలక్పేట్ తుక్కుగూడ ఎల్బీనగర్ మేడ్చల్ అల్వాల్ దమ్మాయిగూడ కాప్రా నాగారం మల్కాజిగిరి పోచారం ముషీరాబాద్ ఘట్కేసర్ ఉప్పల్ గుండ్లపోచంపల్లి యూసుఫ్గూడ తూముకుంట సికింద్రాబాద్ కొంపల్లి కుత్బుల్లాపూర్ దుండిగల్ గాజులరామారం బొల్లారం చందానగర్ తెల్లాపూర్ శేరిలింగంపల్లి అమీన్పూర్ పటాన్చెరువు బడంగ్పేట్ చార్మినార్ బండ్లగూడ జాగీర్ ఖైరతాబాద్ మీర్పేట్ సరూర్నగర్ బోడుప్పల్ అంబర్పేట్ పీర్జాదిగూడ గోషామహల్ జవహర్నగర్ బేగంపేట్ నిజాంపేట్ కూకట్పల్లి ప్రపంచంలోని కొన్ని పెద్దనగరాలు.. నగరం పరిపాలన విభాగం విస్తీర్ణం (చ.కి.మీ) టోక్యో టోక్యో మెట్రోపాలిటన్ 2,194 మెక్సికో సిటీ సీడీఎంఎక్స్ 1,485 షాంఘై మున్సిపల్ గవర్నమెంట్ 6,340 బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ 16,410 కై రో గవర్నరేట్ 3,085 నగరం జనాభా పరిపాలన టోక్యో (జపాన్) 3.7 కోట్లు టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఢిల్లీ (ఇండియా) 3.4 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్లు+రాష్ట్ర ప్రభుత్వం షాంఘై (చైనా) 3.0 కోట్లు మేయర్+ పీపుల్స్ కాంగ్రెస్ ఢాకా (బంగ్లాదేశ్) 2.4 కోట్లు నార్త్+ సౌత్సిటీ కార్పొరేషన్లు ముంబై (ఇండియా) 2.2 కోట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ (ఇండియా) 1.5కోట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ -
ఆ కుటుంబమంతా ప్రజాప్రతినిధులే
● సింగిల్విండో డైరెక్టర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీగా బాధ్యతల నిర్వహణ ● నేడు సర్పంచ్ బరిలోకి.. కడ్తాల్: మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన పాలకూర్ల బుగ్గయ్యగౌడ్తో పాటు, ఆయన సతీమణి ఉమావతి, బుగ్గయ్యగౌడ్ సోదరుడు వీరయ్యగౌడ్లు ప్రజా ప్రతినిధులుగా గ్రామానికి, ఉమ్మడి ఆమనగల్లు మండలానికి అనేక రకాలుగా సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ 1987లో సింగిల్విండో డైరెక్టర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 1988లో సర్పంచ్గా పనిచేశారు. అనంతరం 1990లో ఆమనగల్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాల రైతాంగానికి సేవలందించారు. అనంతరం 1995లో ఎంపీటీసీగా గెలుపొందారు. దీంతో ఆమనగల్లు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడంతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్గా సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ సతీమణి ఉమావతి కూడా ఎక్వాయిపల్లి ఎంపీటీసీగా 2019లో గెలుపొంది 2024 వరకు గ్రామాభివృద్ధికి సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ సోదరుడు వీరయ్యగౌడ్ కూడా 1995లో ఎక్వాయిపల్లి సర్పంచ్గా సేవలందించారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో బుగ్గయ్యగౌడ్ పెద్ద కుమారుడు పాలకూర్ల కరుణాకర్గౌడ్ ఎక్వాయిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. చిన్న కుమారుడు రవికాంత్గౌడ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. -
మంత్రాలు పనిచేయలేదని వ్యక్తి దారుణ హత్య
సెల్ఫోన్ ఆధారంగా కేసును ఛేదించిన ఓయూ పోలీసులులాలాపేట: తార్నాక ఎర్రకుంట చెరువులో లభ్యమైన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు చేధించారు. మృతుడు మంగళ్హాట్కు చెందిన మాగూ సింగ్(58)గా గుర్తించారు. మృతదేహం లభ్యమైన చోట లభించిన సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం ఏసీపీ కార్యాలయం వద్ద డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు.చిలకలగూడ కింది బస్తీ ప్రాంతానికి చెందిన షేక్ గౌస్(43), అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ షోయబ్లకు ధూల్పేట్కు చెందిన మాగూ సింగ్తో పరిచయం ఏర్పడింది. మంత్రాలతో వ్యాపారం వృద్ధి చేస్తానంనటూ మాగూసింగ్ వీరిని నమ్మించాడు. ఈ ఇద్దరి నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. అయితే మంత్రాలతో ఎటువంటి లాభం జరగలేదు. అంతేకాక షేక్ గౌస్ ఇంట్లోని పిల్లల్లో ఒకరికి పెరాలసిస్ వచ్చిందనీ, రెండో నిందితుడికి వ్యాపారంలో నష్టం వచ్చిందని కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో షేక్ గౌస్, సయ్యద్ షోయబ్లు మాగూ సింగ్ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 1న సయ్యద్ షోయబ్ ధూల్పేట్ వెళ్లి మాగూ సింగ్ను తన ద్విచక్ర వాహనంపై చిలకలగూడలోని ఇంటికి తీసువచ్చాడు. అప్పటికే మాటు వేసి ఉన్న షేక్ గౌస్ స్టీల్ రాడ్తో మాగూ సింగ్ తలపై బలంగా కొట్టాడు. అతన్ని కారులో ఎక్కించుకుని సిటీ శివారులోకి తీసుకెళ్లి చంపేయాలనీ అనుకున్నారు. అయితే ట్రాఫిక్ వలన తార్నాకలోని నిర్మానుష్య ప్రాంతమైన ఎర్రకుంట చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేసి అక్కడే పడవేసి వెళ్లారు. ఎర్రకుంటలో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు సెల్ ఫోన్ లభించింది. దాని ఆధారంగా నిందితును అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. కేసును చేధించిన ఇన్స్పెక్టర్ అప్పల నాయుడు, క్రైం టీంను డీసీపీ అభినందించారు. -
లోటుపాట్లు లేకుండా చూడండి
● ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా పూర్తి చేయాలి ● జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డిఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా పూర్తి చేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించి బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. మూడో విడత ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయా క్లస్టర్స్ వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ఆర్ఓలకు ఎన్నికల సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ నవీన్కుమార్రెడ్డి, ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ ఉషాకిరణ్, సూపరింటెండెంట్ యెల్లంకి జంగయ్యగౌడ్, ఎస్ఐ చందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పొరపాట్లకు తావివ్వొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ఎలాంటి పొరపాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ నారాయణరెడ్డి నిశితంగా పరిశీలించారు. రెవెన్యూ డివిజన్లలోని ఒక్కో మండలం వారీగా ఆయా పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని స్థానికేతర సిబ్బందిని విధుల కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రిసైడింగ్ అధికారులు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, నోడల్ అధికారి శ్రీలక్ష్మి, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పక్కాగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి -
నేటి నుంచి ‘తీన్’మార్
● మూడో విడత నామినేషన్ల పర్వం ● ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్లలో సందడిఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల పర్వం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో 14 పంచాయతీల చొప్పున ఉండగా, యాచారం మండలంలో 24, మంచాల మండలంలో 23, మాడ్గుల మండలంలో 34 పంచాయతీలున్నాయి. కందుకూరు డివిజన్ పరిధిలోని మహేశ్వరం మండలంలో 30, కందుకూరు మండలంలో 35 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేసే ఆశావహులు ఆయా క్లస్టర్లలో తమ నామినేషన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. 17న పోలింగ్ అనంతరం ఆయా గ్రామ పంచాయతీల వద్దనే ఓట్ల లెక్కింపు చేపడతారు. మూడో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ పంచాయతీ ఏ క్లస్టర్లో ఉంటే అక్కడే సర్పంచ్లకు, వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి. ఎన్నికల నిబంధనలు, కోడ్ను తప్పక పాటించాలి. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. శాంతియుతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అభ్యర్థులు, ఆయా రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలి – అనంతరెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
అదృష్టం వరించి.. అభివృద్ధిని కాంక్షించి
ఆమనగల్లు: మండలంలోని కోనాపూర్ సర్పంచ్గా శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. గ్రామంలో ఇద్దరే మహిళా ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఇందులో శ్రీలత సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసింది. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రేఖ్యతండా, గోవిందాయిపల్లి తండాలు ఏకగ్రీవం కడ్తాల్: మండల పరిధిలోని రేఖ్యతండా, గోవిందాయిపల్లి తండా సర్పంచ్ పదవులు ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఆయా పంచాయతీల్లోని పెద్దలు అంతా కలిసి రాజకీయాలకతీతంగా.. అభివృద్ధిలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చర్చించుకున్నారు. ఈ మేరకు రేఖ్యతండా సర్పంచ్ అభ్యర్థిగా పాత్లావత్త్ లక్ష్మి , గోవిందాయిపల్లి తండా సర్పంచ్ అభ్యర్థిగా సభవట్ జాను ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేఖ్యతండా పంచాయతీ పరిధిలోని 8 వార్డు స్థానాలకు సైతం ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యారు. అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏకగ్రీవమైన పలు పంచాయతీలు -
బరిలో మిగిలేదెవరో!
గ్రామ పంచాయతీలు 174 , వార్డులు 1,530 సర్పంచ్ కోసం దాఖలైన నామినేషన్లు – 846 వార్డు కోసం దాఖలైన నామినేషన్లు – 4,123 షాద్నగర్: డిసెంబర్ 3.. సరిగ్గా 3 గంటల సమయం.. అప్పటిదాకా ఆలోచించుకోవాల్సిన తరుణం.. బరిలో ఉంటారా.. తప్పుకొంటారా.. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఉపసంహరణకు బుధవారం మూడు గంటలలోపు గడువు ముగియనుంది. పోటీలో తమకు అడ్డుగా ఉన్న వారిని తప్పించే ఆఖరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందరిలో ఉత్కంఠ షాద్నగర్ పరిధిలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, రాజేంద్రనగర్ పరిధిలోని శంషాబాద్ మండలాల్లో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పర్వం ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో.. తప్పుకొనేదెవరో బుధవారంతో తేలిపోనుంది. సర్పంచ్, వార్డులకు ఎవరు బరిలో నిలుస్తారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. పెరుగుతున్న ఒత్తిడి రెబల్స్గా బరిలో దిగిన వారిని నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీల నేతలు ఒత్తిడి చేస్తున్నారు. తాయిలాలు ఇచ్చి పోటీ నుంచి తప్పించేందుకు చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థులను తప్పించి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగు అక్షర క్రమంలో గుర్తుల కేటాయింపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. వెంటనే వారికి గుర్తులను కేటాయిస్తారు. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లలో తెలుగు అక్షర క్రమంలో గుర్తులు కేటాయింపు ఉండనుంది. నామినేషన్ పత్రాల్లో పేర్లు ఎలా రాసారో అలాగే తెలుగు అక్షరాల క్రమాన్ని గుర్తిస్తారు. కొందరు తమ ఇంటి పేరును ముందుగా, మరికొందరు చివరగా రాస్తారు. ఏ పేరు ముందు ఉంటుందో దాని తెలుగు అక్షరం ఆధారంగా గుర్తులు కేటాయిస్తారు. నిలిచేదెవరో.. తప్పుకొనేదెవరో కీలక ఘట్టానికి చేరిన తొలి విడత ఎన్నికలు నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ తేలిపోనున్న ఫైనల్ అభ్యర్థుల జాబితా -
రంగరాజన్కు వివేకానంద పురస్కారం
మొయినాబాద్: మునివాహన సేవ ఉత్సవ పరంపర పునరుద్ధరణ చేయడంతోపాటు రాజ్యాంగ రామరాజ్య స్థాపనకు కృషి చేసినందుకుగాను చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్కు వివేకానంద పురస్కారం దక్కింది. గీతా జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని పుణేలో సోమవారం రాత్రి వేదశ్రీ తపోవన సంస్థ నిర్వహించిన విశిష్ట కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఆచార్య దేవ్వరత్ చేతులమీదుగా రంగరాజన్కు సన్మానం చేసి పురస్కారాన్ని అందించారు. శతాబ్దాలుగా సమానత్వం, భక్తి, సామాజిక అడ్డంకులను తొలగించే సందేశాన్ని అందిస్తున్న మునివాహన ఉత్సవాన్ని 2018 ఏప్రిల్ 16న చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ చేపట్టారు. ఇబ్రహీంపట్నం: ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని గురునానక్ విద్యాసంస్థ వద్ద ప్రభుత్వ భూమిలో (గ్యాప్ ఏరియా)లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి ఆదేశానుసారం ఆర్ఐ సువర్ణ, సర్వేయర్ సాయి కృష్ణారెడ్డి, గ్రామపాలన అధికారులు శ్రీనివాస్, రాజు, మణికుమార్, వీఆర్ఏ మహేశ్తోపాటు రెవెన్యూ సిబ్బంది జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ భూమిలో, గ్యాప్ ఏరియాల్లో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే సహించేదిలేదని తహసీల్దార్ హెచ్చరించారు. చేవెళ్ల: కాంక్రీట్ మిల్లర్ లేబర్ అసోసియేషన్ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి.గోపాల్ అన్నారు. మండలకేద్రంలో మంగళవారం కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్లర్ మేసీ్త్రలకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల అకాల మరణం చెందిన పవన్కుమార్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంఘం మిల్లర్ లేబర్కు అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ట్రాఫిక్ సీఐ సతీష్ మాట్లాడుతూ.. ప్రతి కార్మికుడికి లేబర్కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. రోడ్డుపైకి వచ్చే కార్మికులు లైసెన్స్లు పొంది ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం సౌత్జోన్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, స్టేట్ జాయింట్ సెక్రెటరీ భరత్కుమార్, ఏఐటీయుసీ జిల్లా నాయకులు కె. రామస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం వికారాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సభలకు సంబంధించిన వాల్పోస్టర్ను మంగళవారం సీఐటీయూ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారంలో సీఐటీయూ ముందుంటుందని అన్నారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి చంద్రయ్య, ఉపాధ్యక్షురాలు నర్సమ్మ, మైపాల్, సుదర్శన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘రెండు’లో చివరి రోజు జోరు
● రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల స్వీకరణ ● పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభ్యర్థులుచేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో సాయంత్రం 5 దాటిన తరువాత కూడా నామినేషన్ల పర్వం కొనసాగింది. కేంద్రాల వద్ద టోకెన్లు ఇచ్చి కూలైన్లో నిలబెట్టారు. చివరి రోజున సర్పంచ్ స్థానాలకు 300, వార్డు సభ్యులకు 1,261 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. చేవెళ్లలో సర్పంచులకు 75, వార్డు సభ్యులకు 267, శంకర్పల్లిలో సర్పంచులకు 46, వార్డు సభ్యులకు 202, మొయినాబాద్లో సర్పంచులకు 64, వార్డు సభ్యులకు 339, షాబాద్లో సర్పంచులకు 117, వార్డు సభ్యులకు 453 నామినేషన్లు వచ్చాయి. కందుకూరు డివిజన్లో.. ఆమనగల్లు: కందుకూరు డివిజన్లోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని కోనాపూర్ కేంద్రంలో సమయం ముగిసినప్పటికీ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వారికి సీరియల్ నంబర్ ఇచ్చి సాయంత్రం 7 గంటల వరకు స్వీకరించారు. ఆమనగల్లు మండలంలో సర్పంచ్ పదవులకు 49, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు వచ్చాయి. తలకొండపల్లి మండలంలో సర్పంచ్లకు 116, వార్డు సభ్యులకు 441 నామినేషన్లు వచ్చాయి. కడ్తాల్ మండలంలో సర్పంచ్ పదవులకు 75, వార్డు సభ్యులకు 387నామినేషన్లు దాఖలయ్యాయి. -
అన్నా తమ్మీ
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025హలో..షాద్నగర్/షాబాద్: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు అన్ని అస్త్రాలు సంధిస్తున్నారు. వార్డులన్నీ జల్లెడ పడుతున్నారు. కనిపించినవారినల్లా ఆత్మీయంగా పలుకరిస్తున్నారు. ఏకంగా వరుసలు కలిపేస్తూ ఓట్ల గాలం వేస్తున్నారు. కచ్చితంగా తమకు పడే ఓట్లు ఎన్ని.. మిగతా వారు ఎవరు చెబితే వింటారు అన్నదానిపై వాకబు చేస్తున్నారు. ఏ ఒక్క ఓటునూ వదలకూడదని ఓటర్ల జాబితా ముందేసుకుని మరీ ఎక్కడ ఉన్నారో వెతికేస్తున్నారు. చిరునామా, ఫోన్ నంబర్ తెలుసుకునే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాలను వదలి ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేసి.. వరుసలు కలిపేసి.. మాటలతో మస్కా కొడుతున్నారు. ఇంతకాలం తాము ఎక్కడ ఉన్నామో.. ఏమైపోయామో కూడా పట్టించుకోని వారు ఒక్కసారిగా ఫోన్లు చేసి ఆప్యాయంగా పలుకరిస్తుండడంతో ఆశ్చర్చపోవడం ఓటర్ల వంతవుతోంది. ఇదీ వలస ప్రతి గ్రామ నుంచి వందల సంఖ్యలో జనం వివిధ పనుల నిమిత్తం వలస పోయారు. ముఖ్యంగా తండావాసులు ముంబైలాంటి ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక వివిధ ఉద్యోగాల నేపథ్యంలో చాలా మంది హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లారు. మరోవైపు చాలా మంది తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకునేందుకు నగరాలకు వెళ్లారు. ఒక్కో పల్లె నుంచి కనీసం 30 శాతం మంది ఇలా వేరే ప్రాంతాలకు జీవనాన్ని వెతుక్కుంటూ వెళ్లిన వారే. వీళ్ల ఓట్లు మాత్రం ఇప్పటికీ గ్రామాల్లోనే ఉన్నాయి. ఒక్కో గ్రామంలో అభ్యర్థుల గెలుపు, ఓటములను శాసించగలిగే స్థాయిలో బయట ఓట్లు ఉండడంతో చాలామంది అభ్యర్థులు వీటిపై ఫోకస్ పెట్టారు. హలో.. అన్నా.. నేనే.. గుర్తుపట్టినవా.. బాగున్నావె.. ఎన్ని రోజులైందే కలవక.. వారం రోజుల సంది నిన్ను యాదిజేస్తున్నా.. నా తానున్న నంబర్ కలుస్తలే.. మనోళ్ల దగ్గర అడిగి ఈ నంబర్ తీసుకున్న.. పిల్లలు, మీరంతా మంచిగున్నరా.. ఏంలేదన్నా.. నేను మనూళ్ల సర్పంచ్గా నిలబడిన.. నువ్వు, వదిన వచ్చి ఓటెయ్యాలె.. జర యాది మర్చిపోవద్దే.. ఏం తమ్మీ ఎట్లున్నవ్.. మంచిగున్నవా.. అసలు గీమధ్య ఊరి దిక్కే రాకుండా అయినవ్.. ఎప్పుడొస్తావ్.. నీ ఓటు గీడనే ఉన్నది తెలుసు కదా.. ఓటేసేందుకు వస్తున్నావ్ కదా.. తప్పకుండా రావాలె తమ్మీ.. మీ అన్నను గెలిపియ్యాలె.. అక్కా బాగున్నవా.. బావగిన్న మంచిగుండా.. పిల్లలు ఏం సదువుతుండ్రు.. మీ ఈ తమ్ముడు సర్పంచ్గా పోటీ చేస్తున్నడు.. మీ ఆశీస్సులుండాలె.. తప్పకుండా అందరూ ఓట్ల రోజు ఊరికి రావాలె.. నీ తమ్ముడిని గెలిపించుకోవాలె.. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు వరుసబెట్టి ఫోన్లు కొడుతున్నారు. ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం ఇదో పనిగా పెట్టుకున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి నేరుగా వాళ్లు ఉన్నచోటికే వెళ్లి కలిసి కచ్చితంగా గ్రామానికి వచ్చి ఓటు వేయాలని కోరుతూ రవాణా ఖర్చులకోసమంటూ చేతిలో ఎంతోకొంత పైసలు పెట్టి వెళ్తున్నారు. రాష్ట్రాలు దాటి వెళ్లిన వారికి ఆన్లైన్ చెల్లింపులు సైతం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషుల ద్వారా చెప్పించడం, నేతల ద్వారా మాట్లాడించడం వంటివి కూడా చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా వరుసగా ఫోన్లు చేస్తుండడంతో ఎవరికి ఓటు వేయాలో అర్థం కాక ఓటర్లు అయోమయంలో పడుతున్నారు. మరి ఎంతమంది గ్రామాలకు వస్తారో.. ఎందరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో వేచి చూడాలి. -
భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు
మొయినాబాద్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్యచేసిన భర్తకు జీవిత ఖైదు శిక్ష పడింది. మొయినాబాద్లో 2023లో జరిగిన ఈ హత్యకేసును విచారించిన ఎనిమిదో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరిచింది. హంతకుడికి జీవిత ఖైదుతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్కు చెందిన మహ్మద్ హుస్సేన్ కుటుంబం 2023కు ముందు బతుకుదెరువు నిమిత్తం మొయినాబాద్కు వలస వచ్చింది. పట్టణ సమీపంలో గుడిసెలు వేసుకుని ఉంటూ కూలీ పనిచేసేవారు. 2023 ఫిబ్రవరి 20న హుస్సేన్ మద్యానికి రూ.80 ఇవ్వాలని భార్య హుస్సేన్బీని అడిగాడు. తన వద్ద లేవని ఆమె చెప్పడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు కర్రతో కొట్టాడు. వదినపై దాడిని అడ్డుకోబోయిన తన సోదరి సఫియా బేగంను నెట్టేసి.. హుస్సేన్బీని గుడిసెలోకి లాక్కెళ్లాడు. అనంతరం రుబ్బురోలు, రాయితో ఛాతి, ముఖంపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి మొయినాబాద్ ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక ఆధారాలు సేకరించి నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఎల్బీనగర్లోని ఎనిమిదో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడైన మహ్మద్ హుస్సేన్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించారు. అల్లర్లు సృష్టిస్తే రూ.లక్ష జరిమానా తహసీల్దార్ గాయత్రి దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, బీఆర్ఎస్ నాయకులు బాల్రాజు, అశోక్ను మంగళవారం పోలీసులు తహసీల్దార్ ఎదుట బరైండోవర్ చేశారు. గ్రామాల్లో శాంతిభధ్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేదిలేదని తహసీల్దార్ గాయత్రి హెచ్చరించారు. ప్రచారంలో అల్లర్లు, గొడవలు సృష్టించినా అరెస్టుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. -
వార్డు మెంబర్ అభ్యర్థి అనుమానాస్పద మృతి
కంసాన్పల్లిలో భారీ పోలీసు బందోబస్తు షాద్నగర్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన అభ్యర్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఫరూఖ్నగర్ మండలం కంసాన్పల్లికి చెందిన శేఖర్(25) వార్డు సభ్యుడిగా నామినేషన్ వేశాడు. బీజేపీ మద్దతుదారుడిగా నామినేషన్ వేసిన శేఖర్ను విత్డ్రా చేసుకోవాలని అదే గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు ఒత్తిడిని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇది తట్టుకోలేక శేఖర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ విజయ్కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శేఖర్ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్ల్యూటీఐటీసీ జాయింట్ సెక్రటరీగా రాహుల్ రెడ్డి
లక్డీకాపూల్: ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) ఇంటర్నేషనల్ స్టూడెంట్ చాప్టర్ జాయింట్ సెక్రటరీగా చుక్కా రాహుల్ రెడ్డి నియమితులయ్యారు. డబ్ల్యూటీఐటీసీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం మేరకు ఈ నియామకం జరిగింది. ఖండాలకు అతీతంగా తెలుగు విద్యార్థులు, ఆవిష్కర్తలు, ఔత్సాహిక నిపుణులను అనుసంధానించే డబ్ల్యూటీఐటీసీ లక్ష్యాన్ని ఈ నియామకం మరింత బలోపేతం చేస్తుందని కౌన్సిల్ పేర్కొంది. ఈ సందర్భంగా డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ: ‘రాహుల్ రెడ్డి గ్లోబల్ తెలుగు నాయకత్వానికి కొత్త తరం ప్రతినిధి. ఆవిష్కరణలు, అంట్రప్రెన్యూర్షిప్పై ఆయనకున్న అంకితభావం, విద్యార్థులను ప్రోత్సహించే తత్వం ఆయన్ను గ్లోబల్ స్టూడెంట్ కమ్యూనిటీకి నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తిగా నిలబెట్టాయన్నారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగే డబ్ల్యూటీఐటీసీ 2025 సదస్సులో ఆయన బాధ్యతలు చేపడతారన్నారు. దీంతో పాటు ’గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. తన నియామకంపై రాహుల్ రెడ్డి స్పందిస్తూ: ‘డబ్ల్యూటీఐటీసీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ చాప్టర్ జాయింట్ సెక్రటరీగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థులను అనుసంధానించడం, వారికి అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం, బలమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను నిర్మించడం తమ లక్ష్యమన్నారు. దుబాయ్ వేదికగా జరగబోయే సదస్సు విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తుందన్నారు. -
పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ
నవాబుపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని నవాబుపేట, ఎక్ మామిడి గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. సర్పంచ్, వార్డు స్థానాల నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ సెంటర్ల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి సహకరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. నిర్ణీత గడువు లోపు నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, డిప్యూటీ కలెక్టర్ పూజ, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓలు నవీన్కుమార్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా -
ఫ్యూచర్లో పనికొస్తుందని!
యాచారం: గ్రామ ప్రథమ పౌరుడిగా పేరొందిన సర్పంచ్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. గతంలో ఉన్నత పదువులు అనుభవించినా సరే.. ప్రస్తుతం రిజర్వేషన్ కలిసొచ్చిన వారు తిరిగి సర్పంచ్ పీఠంపై కూర్చునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పార్టీల మద్దతు లేకపోయిన సరే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. యాచారం, మంచాల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కడ్తాల్, మహేశ్వరం తదితర మండలాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుండటంతో భవిష్యత్తులో సర్పంచ్ పోస్టు కీలకమవుతుందనే ఉద్దేశంతో పోటీకి సై అంటున్నారు. మిగిలిన గ్రామాల్లోనూ.. పెద్ద పదవులు చేసిన సీనియర్ నాయకులు సైతం సర్పంచ్ పోటీకి మొగ్గు చూపుతున్నారు. ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించి.. యాచారం గ్రామానికి చెందిన కొప్పు సుకన్య మొన్నటి వరకు యాచారం మండల పరిషత్ అధ్యక్షురాలిగా(బీజేపీ నుంచి) ఐదేళ్లు పదవిలో కొనసాగారు. తాజా రిజర్వేషన్లల్లో యాచారం జీపీ ఎస్సీ మహిళకు కేటాయించడంతో తిరిగి సర్పంచ్గా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. బుధవారం నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. పీఏసీఎస్ చైర్మన్గా ఉంటూనే.. గునుగల్కు చెందిన తోటిరెడ్డి రాజేందర్రెడ్డి యాచారం పీఏసీఎస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. గునుగల్ పంచాయతీ జనరల్ రిజర్వేషన్ రావడంతో బీఆర్ఎస్ మద్దతుదారుడిగా బరిలో ఉండేందుకు డిసైడయ్యారు. బుధవారం నామినేషన్ దాఖలు చేస్తానన్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ సైతం.. మంతన్గౌరెల్లికి చెందిన కారింగ్ యాదయ్యగౌడ్ యాచారం పీఏసీఎస్ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసివచ్చిందని, పోటీకి సై అంటున్నారు. ఉన్నత పదవులు చేపట్టినా.. మళ్లీ సర్పంచ్పై కన్ను రిజర్వేషన్లు కలిసి రావడంతో పోటీకి సిద్ధమవుతున్న నేతలు ఫ్యూచర్సిటీ గ్రామాల్లో ప్రథమ పౌరుడి పదవికి భలే క్రేజ్ -
గీతతో వ్యక్తిత్వ వికాసం
అనంతగిరి: భగవద్గీత సర్వ మానవాళికి శిరోధార్యమని, ఆచరణాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మానవ ధర్మ శాస్త్రమని కాళోజీ పురస్కార గ్రహీత గంటా మనోహర్ రెడ్డి అన్నారు. కమలానగర్లోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో సోమవారం రాత్రి పద్య పదభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా జయంతి కార్యక్రమానికి ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. భారతీయ జీవన విధానం సనాతన ధర్మం పై ఆధారపడి కొనసాగిందన్నారు హృదయాంతరంగ ప్రేరణ రామాయణం అని, మేధో మదన భరితం మహాభారతం అని, భగవద్గీత ఉన్నచోట భయానికి, సంశయానికి, అనవసరమైన ఆవేశానికి తావుండదన్నారు. అన్ని సమస్యలకు ఏకై క పరిష్కారం భగవద్గీత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు బందప్పగౌడ్, మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి, పద్య పదభారతి ఉపాధ్యక్షుడు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మున్నూరు రాజు, సహకార్యదర్శి సుధాకర్ గౌడ్, కోశాధికారి రెడ్యా రాథోడ్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసాచారి, దివాకర శాస్త్రి, నవీన్, ఉదయరావు, సతీశ్గౌడ్, రమేశ్, సుభాష్ రెడ్డి, శ్రీలత రెడ్డి, విజయలక్ష్మి, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కాళోజీ పురస్కార గ్రహీత మనోహర్ రెడ్డి -
నేరమే!
మౌనమూసాక్షి, సిటీబ్యూరో: నేరుగా తప్పు చేయడమే కాదు... తప్పు జరుగుతోందని, జరిగిందని తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. ఈ కారణంగానే జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన పోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇరువురు మహిళలు నిందితులుగా మారారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు ఇటీవల కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) లైంగికదాడి చేసిన వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉండగా... అభియోగపత్రాల్లో మాత్రం ఆ విషయం తెలిసీ మిన్నకుండిపోయిన మహిళలూ నిందితులుగా మారారు. ఐదు రోజులు నిర్భంధించి ఘాతుకం.. జూబ్లీహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మహిళ వద్ద ఆర్.రాజిరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్గా పని చేసేవాడు. అదే అపార్ట్మెంట్లో మరో మహిళ సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన బాలికతో రాజిరెడ్డికి పరిచయం ఉండేది. అతను గత ఏడాది అక్టోబర్ 31న ఓ శుభకార్యానికి తీసుకువెళ్తానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో అతడి యజమాని సైతం వారితో ఉంది. వీరు సదరు బాలికను షాపింగ్కు తీసుకెళ్లి వస్త్రాలు కొనిపెట్టారు. ఆపై అపార్ట్మెంట్కు తీసుకువచ్చిన రాజిరెడ్డి రెండో అంతస్తులోని తన గదిలో నిర్భంధించి నవంబర్ 5 వరకు సదరు బాలికపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో చెప్పని ఆ ఇరువురూ.. ఇదిలా ఉండగా... బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి గత ఏడాది అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి పలువురిని విచారించగా ఎవరి నుంచి సరైన సమాచారం లభించలేదు. సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మహిళతో పాటు రాజిరెడ్డి యజమాని సైతం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఐదు రోజుల నిర్భంధం తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ అన్నీ చెప్పిన బాలిక.. భరోసా కేంద్రంలో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా కోరారు. దీంతో రాజిరెడ్డి తనను నిర్భంధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తాను నిర్భంధంలో ఉండగా రాజిరెడ్డి యజమాని ఆహారం అందించిందని, ఆ అపార్ట్మెంట్కు సెక్యూరిటీ గార్డు గా పని చేస్తున్న మహిళకూ తన విషయం తెలు సని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధా రాలను బట్టి నేరం జరిగినట్లు నిర్థారించారు. బాలిక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వీరు ఇరువురినీ ప్రశ్నించినా నోరు విప్పకపోకపోవడాన్నీ సీరియస్గా తీసుకున్నారు. ఆ ఇద్దరినీ నిందితులుగా చేరుస్తూ.. దీంతో బాలిక అదృశ్యం కావడంపై నమోదైన మిస్సింగ్ కేసులో పోక్సో యాక్ట్తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఈ కేసులో రాజిరెడ్డి ఒక్కడే కాకుండా ఇద్దరు మహిళల్నీ నిందితులుగా చేర్చారు. బాలికపై దారుణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం, జరిగిందని తెలిసీ బయటకు చెప్పకపోవడం నేరాలేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) సెక్షన్ 211 (ఓ నేరానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం), భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 33 (నేరం జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసు లేదా మేజిస్ట్రేట్కు చెప్పకపోవడం) కింద అభియోగాలు మోపారు. అప్పట్లో ఈ ఘాతుకానికి ఒడిగట్టిన కారు డ్రైవర్ విషయం తెలిసీ దాచి పెట్టిన ఇరువురు మహిళలు దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా చేరుస్తూ చార్జ్షీట్ దాఖలుగత ఏడాది జూబ్లీహిల్స్లో మైనర్పై లైంగికదాడిదర్యాప్తునకు సహకరించకున్నా దండనేఏదైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు లేదా మేజిస్ట్రేట్కు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నిరోధంతో పాటు చట్టాల అమలుకు పాటుపడాలి. ఏదైనా నేరం జరిగిందని తెలిసీ మిన్నకుండిపోవడం నేరమే అవుతుంది. తమ కళ్ల ముందు నేరం జరిగితే నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించే అధికారమూ పౌరులకు ఉంటుంది. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు పోలీసులు కోరితే దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీఎన్ఎస్ఎస్లోని 31, 33, 40 సెక్షన్లు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అలా చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. బీఎన్ఎస్లోని 211, 239లతో పాటు పోక్సో యాక్ట్లోని 19 సెక్షన్ ప్రకారం అభియోగాలు ఎదుర్కోవాల్సిందే. – పి.వెంకటగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ -
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
● మీర్పేట పీఎస్ పరిధిలో ఘటన ● మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మీర్పేట: భర్తతో గొడవపడిన భార్య ఇద్దరు కుమార్తెలతో ఇంటి నుంచి బయటకు వెళ్లి, కనిపించకుండాపోయిన ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం. బిహార్ రాష్ట్రానికి చెందిన మహబూబ్పాషా, ప్రీతికుమారి(23) భార్యాభర్తలు. బతుదుదెరువు కోసం నగరానికి వచ్చి మూడేళ్లుగా బడంగ్పేట న్యూబృందావన్ నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఇద్దరు కుమార్తెలు నబా (3), సూఫీ (2)లు ఉన్నారు. నవంబరు 26న భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ప్రీతి తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. స్థానికంగా ఉండే బంధువులకు, బిహార్లోని స్వగ్రామానికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో మహబూబ్పాషా సోమవారం మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
లారీ కింద పడి యువకుడి దుర్మరణం
శంకర్పల్లి: లారీ కింద పడిన ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన సోమవారం రాత్రి మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శుభం హల్సే(22) ప్రైవేటు ఉద్యోగి. తన తల్లిదండ్రులతో కలిసి నగరంలోని దూల్పేట్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విధులు ముగించుకొని బైక్పై కొల్లూర్ వైపు వెళ్తుండగా.. ఇంద్రారెడ్డినగర్ వద్ద పక్కపక్కనే వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. శుభం హల్సే అక్కడే కింద పడిపోగా.. వెనక నుంచి వచ్చిన లారీ అతని పైనుంచి వెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. -
ఏఐనీ తప్పుదోవ పట్టిస్తున్నారు!
కంపెనీల డేటాకు పొంచి ఉన్న ‘ప్రాంప్ట్’ గండంసాక్షి, సిటీబ్యూరో: ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) విస్తృతి పెరుగుతోంది... చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు అంతా దీనిపై ఆధారపడుతున్నారు... ప్రతి ఒక్కరూ అన్ని అంశాలకు ‘ఏఐ చాట్బోట్’ సహాయం తీసుకుంటున్నారు. తనలో పోస్టు చేసే సందేహాలకు క్షణాల్లో సమాధానాలు ఇవ్వడం, పని వేగం పెంచడం, ఖర్చు తగ్గించడం ఇలా అనేక ప్రయోజనాలు ఉండటంతో అనేక సంస్థలు దీనిపై ఆధారపడుతున్నాయి. ఇదంతా నాణానికి ఒక కోణమే... మరో కోణంలో ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ రూపంలో పెను ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి కీలక సూచనలు, సలహాలను ఆయన సోమవారం విడుదల చేశారు. ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటే ఏమిటి? సాధారణంగా ఏఐ పని చేయడానికి వినియోగదారుడు ఇచ్చే ఆదేశాలను ప్రాంప్ట్ అంటారు. ఈ ప్రాంప్ట్లనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఏఐ మోడల్ను తప్పుదోవ పట్టించేలా, ట్రిక్ చేసేలా ‘మలీషియస్ ప్రాంప్ట్స్’ వాళ్లు ఇస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు ఏఐని సైతం తమ మాటలతో మాయ చేస్తున్నారు. ఇలా ఐఏ ద్వారానే ఆయా సంస్థలు సాధారణంగా బయటపెట్టకూడని అంతర్గత పత్రాలు, కస్టమర్ల రికార్డులు, సిస్టమ్ వివరాలను రాబట్టేస్తున్నారు. దీన్నే సాంకేతిక పరిభాషలో ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్స్ అని పిలుస్తున్నారు. పెను సవాల్గా మారిన డేటా భద్రత ప్రస్తుతం పలు సంస్థలు తమ ఏఐ మోడల్స్, చాట్బోట్లను సంస్థలోని కీలకమైన డేటా సిస్టమ్లకు అనుసంధానిస్తున్నాయి. సీఎంఆర్ డేటా, హెల్ప్డెస్క్ టికెట్లు, ఉద్యోగుల సమాచారం, ఫైనాన్షియల్ రికార్డులు ఇన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఎండ్ యూజర్కు ఈ సమాచారం పొరపాటున కూడా కనిపించకూడదు. కానీ, హ్యాకర్లు వేసే ఒకే ఒక్క ‘ట్రిక్కీ ప్రాంప్ట్’ వల్ల ఈ గోప్య సమాచారం అంతా బయటపడే ప్రమాదం ఉంటుంది. ఒకసారి హ్యాకర్లు కంపెనీల సిస్టంలోకి ప్రవేశించిన తర్వాత కీలక డేటాకు యాక్సస్ దొరక్కపోయినా... మలీషియస్ ప్రాంప్ట్స్ ద్వారా తమ పని కానిచ్చేస్తున్నారు. దీనికి ‘గార్డ్రెయిల్స్’తోనే చెక్ సాధ్యం ఇలాంటి మలీషియస్ ప్రాంప్ట్స్ ముప్పును పసిగట్టి, నిరోధించడానికి ఆయా సంస్థలు ‘ప్రాంప్ట్ గార్డ్రెయిల్స్’ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాళ్లకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పడానికి కేవలం సింగిల్ లేయర్ భద్రత సరిపోదు. ఇలాంటి వాటిని సైబర్ నేరగాళ్లు తేలిగ్గా బ్రేక్ చేస్తారని, అలా కాకుండా ఉండటానికి మల్టీ–లేయర్ డిఫెన్స్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు నిపుణుల సహాయంతో ఏఐకి సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం, హార్డ్ గైడ్లైన్సెస్ విధించడం ద్వారా ఎవరికిపడితే వారికి కీలక సమాచారం చేరకుండా ఇవ్వకుండా నియంత్రించాలి. తమకు అనుకూలమైన కమాండ్లతో భారీ స్కామ్స్ దీనికి ప్రాంప్ట్ గార్డ్రెయిల్స్ వినియోగమే పరిష్కారం అప్రమత్తత జారీ చేసిన నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ఇలాంటి జాగ్రత్తలు సైతం అనివార్యండేటాకు హానికలిగించే ప్రాంప్ట్లను గుర్తించే వ్యవస్థలను కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని ప్రాంప్ట్–లెవల్ సెక్యూరిటీ అంటారు. అలాగే సిస్టమ్–లెవల్ సెక్యూరిటీగా పిలిచే ఏఐకి యాక్సెస్ ఇచ్చే డేటా, ఏపీఐలపై కఠిన నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్స్ నిర్వహిస్తూ డేటా యాక్సెస్ను అవసరమైన మేరకు పరిమితం చేయాలి. ఇలాంటి సరైన భద్రతా చర్యలు తీసుకోకపోతే సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోవడంతో పాటు, విలువైన డేటా నేరగాళ్ల చేతికి చిక్కి కోలుకోలేని నష్టం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. -
షార్ట్ సర్క్యూట్తో పత్తి దగ్ధం
కొందుర్గు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పత్తి దగ్ధమైన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జనార్దన్రెడ్డి ఇదే ఊరికి చెందిన బుగ్గేశ్వర్, నారాయణలకు సంబంధించిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. సుమారు70 క్వింటాళ్ల పత్తిని తీయించి, పొలం సమీపంలో ఉన్న అజ్జు ఫామ్హౌస్లో నిల్వచేశాడు. సోమవారం ఉదయం ఫామ్హౌస్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వెళ్లి చూడగా పత్తికి మంటలు అంటుకున్నాయి. చుట్టు పక్కల వారి సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ సంఘటనలో దాదాపు 20 క్వింటాళ్ల పత్తి కాలిబూడిదైంది. దీంతో తనకు రూ.1.60 లక్షల నష్టం వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
పెళ్లికి ఒప్పుకోవడం లేదని..
● ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు ● మృతులిద్దరూ బిహార్ రాష్ట్రానికి చెందిన వారు కొత్తూరు: తమ ప్రేమను అంగీకరించని పెద్దలు, పెళ్లికి సైతం నిరాకరిస్తారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన నవనీత్దత్త తన ఇద్దరు కూతుళ్లు అనామిక(21), అనీషదత్తతో కలిసి నాలుగేళ్ల క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు. నవనీత్దత్త ఐఓసీఎల్ ప్లాంట్లో డ్రైవర్గా, ఇద్దరు కూతుళ్లు పట్టణ సమీపంలోని ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కాగా, అనామికకు ఇదే పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్కు చెందిన ధనుంజయ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడు రోజులుగా అనామిక పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నవనీత్ సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి తలుపులు పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి వెళ్లి చూడగా, అనామిక కింద పడి మృతిచెంది ఉండగా, ధనుంజయ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనామిక పనికి వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్కు ఉరేసుకోవడంతో, ఆమెను కిందికి దింపి, అదే ఫ్యాన్కు తాను ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతురాలి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
ఇండస్ స్కూల్ వద్ద ఎమ్మెల్యేల ఆందోళన
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. అనుమతులు లేకుండా సీజ్ చేసిన ప్రైవేటు బస్సుల్లో విద్యార్థులను తిప్పుతున్నారని, అదే విధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమీప బంధువు బస్సులకు సంబంధించి రూ.3 కోట్ల మేర బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం స్కూల్ వద్ద తమ అనుచరులతో ఆందోళన చేపట్టారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ కిరణ్ కుమార్రెడ్డి ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించి, వారితో మాట్లాడారు. ఈ సంభాషణ అంతా వాడివేడిగా జరుగుతున్నా క్రమంలో.. స్కూల్ యాజమాన్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫోన్లో సంప్రదించి, ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. నగరానికి వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందామని కేటీఆర్ సూచించడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. బయటకు వచ్చిన అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ స్కూల్ యాజమాన్యం ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తోందని ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యేలతోనే ఈ విధంగా ప్రవర్తిస్తే, సామాన్య ప్రజలకు ఇంకేలా ఉంటుందని అందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ సూచనతో వెనుదిరిగిన నేతలు -
సిమెంట్ ట్యాంకర్ బోల్తా
శంకర్పల్లి: సిమెంటు లోడ్తో వెళ్తున్న ట్యాంకర్(లారీ) బోల్తా పడిన సంఘటన శంక్పల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నుంచి సిమెంటు లోడుతో వస్తున్న ట్యాంకర్ శంకర్పల్లి మీదుగా బాచుపల్లి వెళ్తోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎల్వర్తి మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడటంతో, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. అశోక్కే నా మద్దతు.. ● స్పష్టం చేసిన మాజీ సర్పంచ్ ● కొలిక్కి వచ్చిన కరన్కోట్ ‘పంచాయితి’ తాండూరు రూరల్: రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొన్న కరన్కోట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి బోయ అశోక్కుమార్కు తన మద్దతు ఉంటుందని మాజీ ఉప సర్పంచ్ హేమంత్కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయలేదని చెప్పారు. అశోక్ గెలుపు కోసం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తానన్నారు. మా హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. 600 ఉన్న రేషన్ కార్డులను 2 వేలు చేశామమని, 300 ఏళ్లక్రితం నాటి సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. గ్రామంలో ప్రతి వార్డుల్లో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, స్మశాన వాటికలకు ప్రహరీలు నిర్మించామని వివరించారు. ఇందులో సుధాకర్గౌడ్ స్వామి, రవిందర్రెడ్డి, అఫ్రోజ్లు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన దుర్గా భవానికి, ఏడాదిన్నర క్రితం పినిశెట్టి రాజేశ్కుమార్(35)తో వివాహం జరిగింది. వీరు జల్పల్లిలోని శ్రీరాం కాలనీలో నివాసం ఉంటున్నారు. చిట్ఫండ్ వ్యాపారం చేసే రాజేశ్కుమార్కు డబ్బులు ఇచ్చే వారు సకాలంలో ఇవ్వకపోవడంతో, చిట్టీ ఎత్తిన వారికి సమయానికి నగదు ఇవ్వలేక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇతని భార్య పురుడు పోసుకునేందుకు పుట్టింటికి వెళ్లగా, బావమరిది దూసనపూడి వెంకటేశ్ కొంతకాలంగా బావతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా నవంబర్ 29న శ్రీశైలం వెళ్లి వస్తానని బావమరిదికి చెప్పి వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాలేదు. ఒత్తిడి భరించలేకే ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడని భావించిన వెంకటేశ్ సోమవారం పహాడీషరీఫ్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్లో లేదా, 87126 62367 నంబర్కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. ‘లగచర్ల’ ముద్దాయి సురేశ్ బైండోవర్ దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల గ్రామానికి చెందిన బోగమోని సురేశ్ను సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. లగచర్ల ఘటనలో ఏ–2 ముద్దాయిగా ఉన్న సురేశ్ను పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘా తం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని తహసీ ల్దార్ కిషన్, పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో గొడవలు సృష్టించినా, అల్లర్ల కు పాల్పడినా అరెస్టు చేయడంతో పాటు రూ. లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
మీర్పేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. నవంబరు 13న బీఎన్రెడ్డినగర్ టీచర్స్కాలనీలోని పావని ఆస్పత్రి ఎదుట తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గుర్తు తెలియని వృద్ధుడు (70) పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు వృద్ధున్ని నాదర్గుల్లోని మాతృదేవోభవ వృద్ధాశ్రమంలో చేర్పించారు. సోమవారం అతను మృతి చెందాడని, మృతుడికి సంబంధించి తెలిసిన వారు మీర్పేట పీఎస్లో సంప్రదించాలని ఎస్ఐ పేర్కొన్నారు. -
కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య
కొందుర్గు: కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముట్పూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పార్వతమ్మ(55)కు శోభారాణి, మంజుల ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్నతనంలోనే పార్వతమ్మ భర్త కిష్టయ్య మృతిచెందాడు. దీంతో అన్నీ తానై కష్టపడి ఇద్దరినీ పెంపి, పోషించి వివాహాలు చేసింది. ఇదిలా ఉండగా చిన్న కూతురు మంజుల తన భర్తతో ఏర్పడిన విభేదాలతో ఇటీవలే విడాకులు తీసుకుంది. దీంతో పార్వతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఈనెల 28న చిన్న కూతురు మంజుల చెక్కలోనిగూడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న పార్వతమ్మ పెద్ద కూతురు శోభారాణికి ఫోన్ చేసి, మంజుల గురించి బాధపడింది. అనంతరం మూడు రోజుల తర్వాత పార్వతమ్మ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం, ఆమె ఫోన్ స్విచాఫ్ ఉండటంతో స్థానికులు శోభారాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. కూతుళ్లు వచ్చి చూడగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. పెద్దకూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గొడవలు చేస్తే కేసులు పెడతాం ● సీఐ ప్రవీణ్కుమార్ రెడ్డి ● 71 మంది పాత నేరస్తుల బైండోవర్ తాండూరు రూరల్: స్థానిక ఎన్నికల సమయంలో గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ ప్రవీణ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కరన్కోట్ ఠాణా సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా గొడవలు జరిగితే 100కు కాల్ చేయాలని చెప్పారు. రూరల్ పోలీస్ సర్కిల్లో నాలుగు మండలాలు పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ ఠాణాలు కలిపి 71 మంది పాత నేరస్తులు, హత్య కేసుల్లో నిందితులను తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశామని తెలిపారు. 26 సమస్యాత్మకమైన గ్రామాలు తాండూరు మండలంలో సంగెంకలాన్, కరన్కోట్, మల్కాపూర్, చెంగోల్, సిరిగిరిపేట్, అల్లాపూర్, జినుగుర్తి గ్రామాలు. యాలాలలో అగ్గనూర్, జుంటుపల్లి, దెవనూర్, రాస్నం, కోకట్ గ్రామాలు. పెద్దేముల్లో మంబాపూర్, హన్మపూర్, ఇందూర్, జనగాం, తట్టెపల్లి, పెద్దేముల్, నాగులపల్లి. బషీరాబాద్లో దామర్చెడ్, నవల్గా, ఎక్మాయి, మైల్వార్, పర్వత్పల్లి సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించామని సీఐ పేర్కొన్నారు. కఠిన చర్యలు యాలాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విఠల్రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని చెప్పారు. అనవసర పోస్టులు చేస్తే.. గ్రూపు అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శంషాబాద్: హైదరాబాద్ నుంచి జైపూర్ విమానం అర్ధరాత్రి మూడుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం అర్థరాత్రి 6ఈ–913 జైపూర్ ఎళ్లేందుకు ప్రయాణికులు ఎక్కి కూర్చునున్నారు. నిర్వహణ పరమైన సమస్యల కారణంగా విమానం టేకాఫ్ తీసుకోకుండా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఎయిర్లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు కిందకు దిగారు. మూడు గంటల తర్వాత విమానం తిరిగి 235 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని బయలుదేరింది. ప్రయాణికుడికి అస్వస్థత.. హైదరాబాద్ నుంచి ఈతేహాద్ ఎయిర్లైన్స్ అబుదాబి వెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున చెక్ఇన్ కౌంటర్ వద్దకు వచ్చిన ప్రయాణికుడు(36) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం ప్రయాణానికి అనుకూలంగా లేదని వైద్యులు స్పష్టం చేయడంతో అతడితోపాటు అతడి సహాయకారిగా ఉన్న వ్యక్తి ప్రయాణాన్ని రద్దు చేసిన తర్వాత విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని బయలుదేరింది. -
పనులు షురూ
‘రేడియల్’ రహదారి ఫ్యూచర్ సిటీ మీదుగా చేపట్టిన పనులుకందుకూరు: ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 330 అడుగుల రేడియల్ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఓఆర్ఆర్ 13 ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాంతం పరిధిలోని మీర్ఖాన్పేట మీదుగా ఆమన్గల్లు మండలం ఆకుతోటపల్లి వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర 330 అడుగుల విస్తీర్ణంతో రహదారిని నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట రెవెన్యూ స్కిల్స్ యూనివర్సిటీ మీదుగా గతంలో నిర్మించిన 200 అడుగుల రహదారి వరకు సుమారు 19.2 కిలోమీటర్ల మేర ఏపీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రహదారి కాంట్రాక్టును ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుంది. రెండు రోజుల క్రితం నుంచి మీర్ఖాన్పేట 200 అడుగుల రహదారి నుంచి ఉత్తరం వైపు స్కిల్స్ యూనివర్సిటీ మీదుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ వైపు రహదారి నిర్మాణ పనులను రిత్విక్ సంస్థ ప్రారంభించింది. సోమవారం దక్షిణం వైపు కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎల్అండ్టీ సంస్థ పనులు మొదలు పెట్టింది. జేసీబీ యంత్రాలతో ప్రస్తుతం రెండు వైపులా భూమి చదును చేసే పనులు చేపట్టారు. టీజీఐఐసీ గతంలో సేకరించిన భూముల నుంచే ప్రస్తుతం పనులు ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలో ఓవైపు గ్లోబల్ సమ్మిట్ పనులు, స్కిల్స్ యూనివర్సిటీ, ఎఫ్సీడీఏ కార్యాలయం నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ప్రస్తుతం రేడియల్ రహదారి నిర్మాణం పనులు షురూ కావడంతో అన్ని వైపుల నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన పనులు వేగాన్ని పుంజుకున్నట్లయింది. కుర్మిద్దలో పనులను అడ్డుకున్న రైతులు యాచారం: మండల పరిధిలోని కుర్మిద్దలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు విస్తరణ పనులను రైతులు అడ్డుకున్నారు. ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులు, ఇంజీనిరింగ్ విభాగం సిబ్బంది సోమవారం అసైన్డ్, పట్టా భూముల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాడానికి వచ్చారు. సమాచారం అందుకున్న రైతులు అక్కడికి వెళ్లి భూములే ఇవ్వలేదు, పరిహారం ఇవ్వని భూముల్లో రోడ్డు విస్తరణ పనులెలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. చేసేది లేక సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పంచాయతీ ఎన్నికలకు
పకడ్బందీ ఏర్పాట్లుఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మకరంద్ మంద ఐఏఎస్ వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయిల్లో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు రాండమైజేషన్ ద్వారా సిబ్బందికి అవసరమైన బ్యాలెట్ బాక్సులు కేటాయించడం జరిగిందని, విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. స్వేచ్ఛాయుత వాతవరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతవరణంలో జరిగేలా ఆయా శాఖల సిబ్బంది, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సీపీఓ సౌమ్య, జిల్లా ఆడిట్ అధికారి వెంకట్రెడ్డి, డీఎం సివిల్ సప్లయ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
సర్పంచ్లకు
1,775407,వార్డులకుఆమనగల్లు: రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. కందుకూరు, చేవెళ్ల డివిజన్లలో సోమవారం సర్పంచ్లకు 407, వార్డు సభ్యుల కోసం 1,175 నామినేషన్లు దాఖలయ్యాయి. కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు సంబంధించి సర్పంచ్ పదవులకు 157 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు మెంబర్ పదవులకు 635 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఆమనగల్లు మండలంలో సర్పంచ్ పదవులకు 26, వార్డు సభ్యులకు 91 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ కుసుమమాధురి తెలిపారు. తలకొండపల్లి మండలంలో సర్పంచ్ పదవులకు 77, వార్డు సభ్యులకు 286 దాఖలైనట్లు ఎంపీడీఓ శ్రీకాంత్ తెలిపారు. కడ్తాల మండలంలో సర్పంచ్ పదవులకు 56, వార్డు సభ్యులకు 258 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ సుజాత తెలిపారు. చేవెళ్ల డివిజన్లో.. చేవెళ్ల: డివిజన్లోని నాలుగు మండలాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు 250, వార్డు సభ్యులకు 1,140 దాఖలైనట్లు అధికా రులు తెలిపారు. చేవెళ్లలో సర్పంచులకు 58, వార్డు సభ్యులకు 294, శంకర్పల్లిలో సర్పంచులకు 53, వార్డు సభ్యులకు 273, మొయినాబాద్లో సర్పంచులకు 32, వార్డు సభ్యులకు 209, షాబాద్లో సర్పంచులకు 107, వార్డు సభ్యులకు 364 వచ్చాయి. రెండో విడత, రెండో రోజు కొనసాగిన నామినేషన్లు కందుకూరు డివిజన్లో సర్పంచులకు 157, వార్డు సభ్యులకు 635 చేవెళ్ల డివిజన్లో సర్పంచులకు 250, వార్డు సభ్యులకు దాఖలైనవి 1,140 -
ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు సిద్ధం
యాచారం: ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రైతులకు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. యాచారం, కందుకూరు మండలాల పరిధిలో ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులకు మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో 620 ఎకరాల్లో అన్ని హంగులతో టీజీఐఐసీ వెంచర్ను అభివృద్ధి చేసింది. రైతులు ఇచ్చిన భూముల ప్రకారం 60, 121, 181, 242, 302, 363, 484, 544 గజాల చొప్పున ప్లాట్లు చేశారు. రైతులకు ఇచ్చిన ఫార్మా ప్లాట్ల సర్టిఫికెట్ల ప్రకారం అభివృద్ధి చేసిన వెంచర్లో గత జూలైలో లాటరీ తీసి కబ్జాలు చూపించారు. ప్లాట్ల నంబర్ల ప్రకారం డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేశారు. పంపిణీకి అధికారుల ఏర్పాట్లు ఫార్మా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసిన అధికార యంత్రాంగం డాక్యుమెంట్లను మాత్రం ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారని వారు అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8, 9 తేదీల్లో మీర్ఖాన్పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. గ్లోబల్ సమ్మిట్లో సీఎం చేతుల మీదుగా పంపిణీ ! -
ఇన్చార్జి కమిషనర్గా సత్యనారాయణ రెడ్డి
తుర్కయంజాల్: మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్గా ఇబ్రహీంపట్నం కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కమిషనర్గా పనిచేసిన కె. అమరేందర్ రెడ్డి నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం: శేరిగూడ గ్రామంలోని ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీజీఎం డా. అజయ్ కే సూద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ నిర్వహణ, లావాదేవీలు, పనితీరు ఎలా ఉందో పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ పాడురంగారెడ్డి, సీఈవో గణేశ్ ఆయనకు ఆయా విషయాలను వివరించారు. కార్యక్రమంలో టీఎస్సీఏబీ ఎండీ వైకే రావు, జీఎం ప్రభాకర్రెడ్డి, డీజీఎం కిరణ్కుమార్, సంబంధిత అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్రూరల్: గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరి పాటించాలని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్గౌతమ్ అన్నారు. మండల పరిధిలోని బాకారం క్లస్టర్ సెంటర్ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, నియమనిబంధనల అమలుపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్కుమార్రెడ్డి, ఎస్ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని చర్చి కాంపౌండ్ గ్రౌండ్లో మూడ్రోజుల పాటు నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. ఉమ్మడి పది జిల్లాల జట్లు పాల్గొన్న రగ్బీ పోటీల్లో చివరి రోజు ఫైనల్లో బాలుర విభాగంలో రంగారెడ్డి మొదటి స్థానం, నల్లగొండ రెండో స్థానం, మెదక్ మూడో స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో రంగారెడ్డి మొదటి, మహబూబ్నగర్ రెండో స్థానం, మెదక్ మూడో స్థానానికి పరిమితమయ్యాయి. డోర్నకల్ డయాసిస్ బిషప్ డాక్టర్ కె.పద్మారావు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన పీఈడీలు రవికుమార్, విజయచందర్ను బిషప్ అభినందించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ పరిశీలకులు యూనూస్పాషా, శ్రీనివాసులు, సెయింట్ ఆగ్నేస్ పాఠశాల కరస్పాండెంట్ ఆంటోని పసాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంపటి సీతారాములు, తలారి విద్యాసాగర్, పీఈడీలు పాల్గొన్నారు. రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకలను పురస్క రించుకొని, డిసెంబర్ 31న వివిధ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవెంట్లకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈనెల 21 లోపే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. -
ఎస్టీపీ నిర్మాణం చేపట్టొద్దు
అబ్దుల్లాపూర్మెట్ : పెద్దఅంబర్పేట పురపాలక సంఘం కేంద్రంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సోమవారం ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండెం రాజశేఖర్రెడ్డి కాలనీవాసులతో కలిసి ప్లాంట్ నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేసి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్కు తరలించారు. అంతకు ముందు ఉదయమే మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు పండుగుల జయశ్రీరాజు, మాజీ వైస్ చైర్మన్ సిద్దెంకి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ యూత్ నాయకుడు పాలడుగు నాగార్జున, బీజేపీ నాయకులు పిల్లి శ్రీనివాస్, చంటి, బీఆర్ఎస్ నేత దండెం రాంరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద అంబర్పేట సర్వేనంబర్ 292లో 3 ఎకరాల విస్తీర్ణంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం అన్యాయమని అన్నారు. హైడ్రా ద్వారా చెరువులు, కుంటలు కాపాడుతుండగా ఇక్కడ మాత్రం చెరువు భూమిలో ఎస్టీపీ ప్లాంట్ చేపట్టడం సరికాదన్నారు. ఎస్టీపీ నిర్మాణంతో భూగర్భ జలాలు సైతం పూర్తిగా కలుషితమయ్యే అవకాశాలున్నాయని, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీంటాయని అన్నారు. నిర్మాణ పనులను అధికారులు విరమించుకోవాలని, నివాస ప్రాంతాలకు దూరంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దఅంబర్పేట నుంచి తరలించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వ్యతిరేకించిన నేతలు అరెస్టు చేసిన పోలీసులు -
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆదివారం జింక మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గునుగల్ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను సాగర్ రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కళేబరాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. జింక మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎయిడ్స్.. నివారణే మార్గం
బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలుహెచ్ఐవీ ఉన్నవారికి మద్దతు ఇచ్చేందుకు, ఎయిడ్స్తో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళికి ఎయిడ్స్ డే ఒక సందర్భం. వ్యాధి తొలికేసు నమోదై దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ సందేహాలు, అపోహలు తొలగలేదు. అవగాహనతో ప్రశాంతమైన జీవనం కొనసాగించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.● వ్యాధిగ్రస్తులకు ఉచిత మందుల పంపిణీ ● జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కేసులు ● నేడు ప్రపంచ ఎయిడ్స్ డే నవాబుపేట: జబ్బులు అనేక రకాలు. అందులో ప్రాణాంతకరమైనవి, భయంకరమైన వ్యాధుల్లో ప్రపంచాన్నే వణికిస్తోంది హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునో వైరస్). వైరస్ చివరి దశ ఎయిడ్స్(హ్యూమన్ ఇమ్యునో డెఫిసియెన్సీ సిండ్రోమ్) వ్యాధి. వైరస్ సోకిన నాటి నుంచి ఇది వ్యాధిగా మారేందుకు కొన్ని ఏళ్లు పడుతుందని డబ్ల్యూహెచ్ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) చెబుతోంది. కానీ వైరస్ సోకిన వారు మానసికంగా కుంగిపోతూ వ్యాధ/కి దగ్గరవుతారు. వ్యాధికి చికిత్స లేదు. వైరస్ను అదుపు చేస్తూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే మార్గాలున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ఏఆర్టీ (యాంటీ వైరల్ థెరపీ)ని సమర్థవంతమైన చికిత్సగా ప్రామాణీకరించింది. మందులు, మంచి జీవన శైలితో వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టే మందులున్నాయి. ఇవేమీ తెలియక, బయటకు చెప్పుకోలేక ఎంతోమంది తనవు చాలించారు. హెచ్ఐవీ సోకిన వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆస్పత్రుల్లో ఐసీటీసీ కేంద్రాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి సోకిన వారికి ఉచిత చికిత్సలు, మందులు అందజేస్తున్నారు. డిసెంబర్ 1న ఎయిడ్స్ డే సందర్భంగా వైద్య నిపుణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్దతులను ‘సాక్షి’కి వివరించారు. తాండూరు, వికారాబాద్లో ఏఆర్టీ కేంద్రాలు హెచ్ఐవీ బారిన పడిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్, అనంతగిరి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆరు మాసాల పాటు చికిత్స పొందిన రోగులకు ప్రతీనెల మందులను అందించేందుకు తాండూరు, వికారాబాద్లలో సహాయక ఏఆర్టీ కేంద్రాలు పని చేస్తున్నాయి. శిశువులకు డీఎస్ఏ–పీసీఆర్ హెచ్ఐవీ సోకిన తల్లుల నుంచి బిడ్డలకు హెచ్ఐవీ సోకింది లేనిది తెలుసుకునేందుకు కనీసం 18 నెలల సమయం పడుతుంది. ఇటీవల డీఎస్ఏ–పీసీఆర్ పరీక్ష అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో శిశువు ఏడు రోజుల వయస్సులో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించి చికిత్సను ప్రారంభించి పూర్తిగా వైరస్ లేకుండా నివారించే అవకాశం ఉంది. సంక్రమణ ఎలా? ● రక్షణ లేకుండా సెక్స్ చేయడం, వ్యాధి సోకిన వారి రక్తం ఎక్కించడం, హెచ్ఐవీ ఉన్నవారికి వాడిన సూదులు, సిరంజిలు ఇతరులకు వాడడం, వారికి వాడిన సూదితో మరొకరికి పచ్చబొట్లు వేయడం. తలనీలాలు, షేవింగ్ చేసేప్పుడు బ్లేడ్లు వాడడం తదితర కారణాలు. ● తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు ● కండోమ్ వాడడం ● సుఖవ్యాధులు రాకుండా చూసుకోవడం, హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ ● పౌష్టికాహారం, విశ్రాంతి, వ్యాయామం ● సమయానికి మందులు అపోహలు ● దోమకాటు, కుక్కకాటు, దగ్గు, తుమ్ములతో సంక్రమించదు ● వ్యాధిగ్రస్తుని దుస్తులు ధరించడం, కలిసి జీవించడం, పనిచేయడం -
పక్కాగా లెక్క!
● పంచాయతీ ఎన్నికల వ్యయ పరిమితి ఖరారు ● జనాభా ప్రాతిపదికన ప్రచారానికి ఖర్చు ● క్షుణ్ణంగా పరిశీలించనున్న అధికారులు షాద్నగర్: పంచాయతీ సంగ్రామం మొదలైంది. బరిలో నిలబడే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వీలు లేదు. ఇందుకుగాను ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని విధించింది. అభ్యర్థుల ఖర్చులను అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. లెక్కకు మించి ఖర్చు చేస్తే వేటు పడే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన అభ్యర్థులు ప్రచారానికి డబ్బులు ఖర్చు చేయాలి. సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు బరిలో నిలబడే అభ్యర్థులు బ్యాంకు ఖాతా వివరాలను నామినేషన్ పత్రాలతో పాటే సమర్పించాలి. నూతన పంచాయతీరాజ్ పట్టం ప్రకారం ఐదువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ 2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలకు మించి ఖర్చు చేయకూడదు. ఐదు వేల లోపు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేలకు మించి ఖర్చు చేయకూడదు. వివరాల నమోదు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ప్రచారానికి ఖర్చును ఏ రూపంలో నిల్వ చేసుకున్నారో వివరాలను పొందుపరుస్తూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయాలి. అయితే రిటర్నింగ్ అధికారి ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రచార, వ్యయ పుస్తకాలను అందించడం, ఆ పుస్తకాల్లో ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయించాల్సి ఉంటుంది. మూడు విడతలుగా తనిఖీలు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచార ఖర్చుకు సంబంధించి ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు లెక్కలను పరిశీలిస్తుంటారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు అధికారులు వ్యయాన్ని మూడు దఫాలుగా తనిఖీలు చేస్తారు. ఇందుకు అభ్యర్థులు ఖర్చులను పుస్తకాల్లో ఏ రోజుకారోజు నమోదు చేసుకోవాలి. ఎన్నికల్లో ధన ప్రవాహన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో అభ్యర్థుల ప్రచార శైలిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. ఇందుకు ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనుంది. ఖర్చు మించితే వేటు తప్పదు బరిలో నిలబడే అభ్యర్థులు ఎన్నికల సంఘం సూచించిన విధంగా ప్రచారానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడానికి వీలులేదు. ప్రచార ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు చూపించాలి. అభ్యర్థులు వ్యయ పరిమితి మించినా, ప్రచార ఖర్చుల లెక్కలు చూపించకపోయినా వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో గెలిచినా పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులూ జర జాగ్రత్త. నిబంధనలు పాటించాలి ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి. జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం ఖర్చును నిర్ణయించింది. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేయడానికి వీలు లేదు. ఎప్పటికప్పుడు లెక్కలు చూయించాలి. – బన్సీలాల్, ఎంపీడీఓ, ఫరూఖ్నగర్ -
ఇద్దరు వ్యక్తుల అదృశ్యం
మరో ఘటనలో.. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య మైలార్దేవ్పల్లి: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అబ్దుల్లా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాసీ్త్రపురం డైమండ్ హిల్స్లో ఉంటున్న షేక్ ఇమ్రాన్(38) అప్పులు ఎక్కువ కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన అతను ఆదివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాద మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోడిపందేల స్థావరంపై దాడి మేడిపల్లి: కోడిపందేల స్థావరాలపై మేడిపల్లి పోలీసులు దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెంగిచెర్ల మేకల మండి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దాడిచేసి 15మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారినుంచి రెండు పందెం కోళ్లు, రెండు కోడి కత్తులు, రూ.18వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి
అనంతగిరి: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ మేరకు వికారాబాద్ మండలంలో 21 సర్పంచ్ స్థానాలకు గాను 30 నామినేషన్లు రాగా, 182 వార్డు సభ్యుల స్థానాలకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సుధీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఆర్ఓలకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటిరోజు మదన్పల్లి, అత్వెల్లి, పెండ్లిమడుగు, పీలారం, రాళ్ల చిట్టంపల్లి, ద్యాచారం, పాతూర్ గ్రామాల నుంచి నామినేషన్ దాఖలు కాలేదు. వికారాబాద్ అదనపు కలెక్టర్ సుధీర్


