breaking news
Ranga Reddy District Latest News
-
సదస్సును జయప్రదం చేయండి
వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య కొడంగల్ రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘాలు, డీవైఎఫ్ఐ, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కొడంగల్లో నిర్వహించనున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య కోరారు. బుధవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక పోరాటం స్ఫూర్తితో మార్చి 01వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8వ తేదీన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఐద్వా, సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అనిల్, హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు సాంకేతిక నైపుణ్యం
● డ్రోన్ల ద్వారా పంటల సస్యరక్షణ ● వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుధాకర్ చౌరట్ తాండూరు: ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సాంకేతిక నైపుణ్యం జోడించడం ద్వారా పంట పెట్టుబడులను ఆదా చేసుకోవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. సుధాకర్ చౌరట్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చారు. డీజీసీఏ అడ్వాన్స్డ్ సర్టిఫైడ్ డ్రోన్ల నిర్వహణపై లవ్లీ వుడ్ బిజినెస్ ఇన్కూబేటర్ సంస్థ జిల్లాలోని ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. అనంతరం డ్రోన్ నడిపే విధానాన్ని తిలకించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. విమానయాన మౌలిక సూత్రాలు, ఏటీసీ విధానం, రేడియో టెలీఫోన్ తోపాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని డ్రోన్ శిక్షణ తీసుకున్న వారికి సూచించారు. త్వరలో డ్రోన్ పైలెట్లకు డీజీసీఏ లైసెన్సులు జారీ చేయనున్నట్లు వారు తెలిపారు. -
సదావకాశం
డివిజన్లోని ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు ఇది సదావకాశం. రూ.వేలాది విలువ జేసే నాలుగు రకాల విత్తనాల ప్యాకెట్లను ఉచితంగా పొంది సాగును చేపట్టి, మంచి లాభాలు పొందండి. కూరగాయల సాగును పెంచేందుకు ఇబ్రహీంపట్నం డివిజన్లో 400 మంది రైతులకు పైగా లబ్ధి చేసేలా కృషి చేస్తున్నాం. విత్తనాలతో పాటు ట్రేలు, వర్మీ బెడ్స్, తేనెటీగల బాక్సులను అందజేస్తున్నాం. పూర్తి వివరాలకు 89777 14219 నంబరులో సంప్రదించండి. – నవీన, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ డివిజన్ అధికారి, ఇబ్రహీంపట్నం ● -
ప్రభుత్వ పాఠశాల భూమిపై సర్వే
ఎకరం ఆక్రమణకు గురైనట్లు అధికారుల వెల్లడి దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భూమిని బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. దాదాపు ఎకరం భూమి ఆక్రమణకు గురైనట్లు వెల్లడించారు. వందేళ్ల క్రితం పాఠశాలకు 4.29 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో పాఠశాల భవనం, క్రీడా ప్రాంగాణం ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా పాఠశాలకు చెందిన భూమిలో నుంచి హస్నాబాద్–పెద్దనందిగామ వెళ్లే రోడ్డును నిర్మించారు. దీంతో పాటు గ్రామస్తులు భూమి చివర భాగంలో పెంట కుప్పలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొంత భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల పాఠశాలకు ప్రహరీ మంజూరు కావడంతో నిర్మాణానికి భూమి పూజ చేశారు. పూర్తి స్థాయి భూమిని సర్వే చేసి హద్దులు గుర్తించి ప్రహరీ నిర్మించాలని హెచ్ఎంకు సూచించారు. దీంతో రెవెన్యూ సిబ్బందితో బుధవారం సర్వే చేయించారు. దాదాపు అర ఎకరం రోడ్డు నిర్మాణానికి, మరో అర ఎకరం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. త్వరలో పూర్తి స్థాయి నివేదికను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ మహేశ్, గ్రామ పాలన అధికారి గోపాల్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
హోలీ.. దుండ్తో కేళి
● గిరిజన సంప్రదాయంలో సంబురాలు ● ఏళ్ల నుంచి వస్తున్న ఆచారానికి తిరిగి జీవం బొంరాస్పేట: ఎన్నో ఏళ్లుగా కనుమరుగైన గిరిజనుల హోలీ సంబురాల్లో భాగమైన ‘దుండ్’ మళ్లీ ఆదరణకు నోచుకుంది. ఈ వేడుక గిరిజన తండాల్లో కొత్తదనాన్ని నింపింది. యువతకు నైతిక విలువలు నేర్పి, ఆడపడచుల్లో ఆనందాన్ని నింపిలే ఈ పండుగ చేస్తుంది. ఇది బంజారా తెగలోని రమావత్ గోత్రం వారు ప్రత్యేకంగా జరుపుకొంటారు. హోలీ పండుగ సందర్భంగా ఉదయం నుంచే గిరిజన ఆచారం ప్రకారం సామూహికంగా చేరి ఇళ్ల ముందట బెల్లం బువ్వతో ప్రసాదం వండుతారు. దాని చుట్టూ యువకులు కోలాటం ఆడుతారు. మరోవైపు తండాపెద్ద యువతులు తీసుకొచ్చిన కుండల్లో ప్రసాదాన్ని వడ్డిస్తారు. అనంతరం తిరిగి నెత్తిన ప్రసాదాన్ని పెట్టుకొని సంతోషంగా ఆడి పాడుతారు. చివరన హోలీ రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకొంటారు. పెళ్లికాని యువతీయువకులకు దుండ్ చాలా ప్రత్యేకం. దుండ్ అంటే? దుండ్ అంటే లంబాడ మాండలికంలో వెతుకు, శోధించు అని అర్థం. ముఖ్యంగా పెళ్లికాని యువకులను సామాజికీకరణ కోసం ఇలా చేస్తారు. పండుగకు వారం రోజుల ముందే గ్రామపెద్దలు సమావేశమై తండాలో ఉన్న యువకులను లెక్కిస్తారు. ఐక్యత కోసం పిల్లవాడి ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం ప్రార్థించడం చేస్తారు. తండాలో సామాజిక ఐక్యతను పెంచడం కోసం చేస్తారు. ప్రతి కుటుంబానికి సంతోషం కలగాలని కోరుకుంటారు. లంబాడా సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించడం దీని ఉద్దేశం. బెల్లం బువ్వ, అగ్నిని పూజిస్తారు. తరాల నుంచి వస్తోంది దుండ్ అనేది తరతరాలుగా వస్తున్న ఒక గిరిజన సంప్రదాయం పండుగ. ఆ రోజు మా యువతను మంచివైపు నడిపించే ముఖ్యమైన ఘట్టం ఇది. ఆడపడుచులు కూడా ఆనందంతో పూజలు చేస్తారు. – కమ్లీబాయి, బొట్లోనితండా యువతకు నైతిక విలువలు ఈ దుండ్ పండుగ గిరిజన ఆచార సంప్రదాయాల మీద పరిశోధన చేస్తూ వారి జీవితంలో మార్పునకు మార్గం వేయడం. అలాగే చెడు వ్యసనాలకు దూరం చేసే వాతావరణం కల్పించడమే ముఖ్య ఉద్దేశం. – రాథోడ్ నాని, ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృతిని కాపాడాలి చదువుకున్న యువకుడిగా మా తండాలో దుండ్ సంప్రదాయాన్ని మళ్లీ పరిచయం చేశాను. బంజారాల్లో ఉన్న మునుపటి మంచి సంస్కృతిని కాపాడి, నైతిక విలువలు పెంపొందించాం. తండాకు ప్రత్యేక బంధాన్ని ముడి వేశాం. – బాలునాయక్, సర్పంచ్, బొట్లోనితండా రమావత్ గోత్రం అంతటా మా గిరిజన జాతిలో ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే పండుగ. ప్రతి రమావత్ గోత్రంలో ఈ దుండ్ పండుగ చేస్తాం. ముఖ్యంగా పురుషుల జీవితానికి పట్టాభిషేకం లాంటిది ఈ వేడుక. – రుక్మానాయక్, తండాపెద్ద, బొట్లోనితండా -
విధులపై నిర్లక్ష్యం తగదు
మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కొడంగల్: వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. బుధవారం పట్టణంలోని బస్తీ దవాఖానను సందర్శించారు. వైద్యురాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సంతకాలు చేసే రిజిస్టర్ చూపించాలని అక్కడున్న సిబ్బందిని అడిగారు. జనవరి నెల నుంచి రిజిస్టర్ లేదని సమాధానం చెప్పారు. మూడు నెలలుగా సంతకాలు చేయడం లేదన్నారు. దీంతో అసహనానికి గురైన చైర్మన్ వైద్యురాలు ఎక్కడికి వెళ్లారని అడిగారు. పట్టణంలోని సబ్ సెంటర్కు వెళ్లారని సిబ్బంది తెలిపారు. బస్తీ దవాఖాన నుంచి సబ్ సెంటర్కు వెళ్లిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్లు డాక్టర్తో మాట్లాడుతూ రిజిస్టర్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సంతకాలు చేసే రిజిస్టర్ కొడంగల్లో దొరకలేదని ఆమె సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైర్మన్ జిల్లా వైద్యాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వైద్యశాలల్లో రోగులకు సేవలందించంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వెంటనే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ముందుండాలన్నారు. -
సీఐ విజయ్కుమార్ బదిలీ కొత్త సీఐగా సీతారాం
షాద్నగర్ రూరల్: షాద్నగర్ పట్టణ సీఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు అటాచ్ చేస్తూ బుధవారం ఆశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్కుమార్ ఇక్కడ దాదాపు 20 నెలల పాటు పనిచేశారు. ఇతని స్థానంలో కందుకూరు సీఐ సీతారాం నూతన సీఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాత్కాలిక నియామకాలకు దరఖాస్తులు అనంతగిరి: జనాభా–2027 లెక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లాలో పొరుగు సేవల ప్రాతిపదికన(17 నెలల కాల పరిమితితో)సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకుంటున్నట్లు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చీఫ్ ప్లానింగ్ కార్యాలయం, 20 మండలాలు, 4 మున్సిపల్లలో పనిచేయటకు మొత్తం 26 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు (20 మండలాలకు ఒక్కొక్కటి, 4 మున్సిపల్లకు ఒక్కొటి చొప్పున, చీఫ్ ప్లానింగ్ కార్యాలయానికి 2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 1 మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టు భర్తీ చేయబడుతుందన్నారు. ఈ నియామకాలు ఈనెల 20 నుంచి 2027 జూన్ 30 వరకు ఉంటుందన్నారు. టెక్నికల్ అసిస్టెంట్కు నెలకు రూ.25 వేలు, మల్టీ టాస్కింగ్ స్టాప్నకు నెలకు రూ.18వేలు కన్సాల్టెడ్ వేతనం చెల్లించ బడుతుందన్నారు. ఈ పోస్టులకు కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ, నిమిషానికి 25–30 పదాల టైపింగ్ వేగం, ఎంఎస్ ఆఫీస్లో డేటా ఎంట్రీ అనుభవం, డిజిటల్ మొబైల్ అప్లికేషన్లపై పరిజ్ఞానం అవసరమన్నారు. అర్హులైన వారు తమ బయోడెటాను అన్ని ధ్రువపత్రాలతో కలిపి 2 సెట్ల జిరాక్స్ కాపీలను వికారాబాద్లోని మెప్మా కార్యాలయంలో ఈనెల 7వ తేది సాయంత్రం 5గంటలలోపు ఇవ్వాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9177933822, 9398003089లో సంప్రదించాలన్నారు. టిప్పర్ బోల్తా డ్రైవర్కు గాయాలు ధారూరు: టిప్పర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన ధారూరు – గట్టెపల్లి బస్స్టేజ్ మధ్య బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ నుంచి కంకర లోడుతో టిప్పర్ తాండూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున ధారూరుకు రాగానే బారికేడ్ను ఢీకొట్టింది. వంద మీటర్ల వరకు వాహనం అలాగే వెళుతుండటంతో పోలీసులు గమనించి వెంబడించారు. అయినా వాహనం ఆపకుండా తాండూరు వైపు వేగంగా వెళ్లింది. సోమశంకరప్ప గుడి దాటిన తర్వాత రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి గుంతలో పల్టీ కొట్టింది. డ్రైవర్కు గాయాలు కావడంతో స్థానికులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుకు ఫిర్యాదు అందలేదు. -
ఆలయ పరిరక్షణకు కృషి చేస్తున్నాం
సంజీవయ్య ఆలయ ధర్మకర్త పార్థసారథి పరిగి: దోమ మండలంలో సంజీవయ్య ఆలయ పరిరక్షణ కోసం తమ తాతముత్తాల నుంచి కాపాడుతూ వచ్చామని ధర్మకర్త పార్థసారథి పంతులు అన్నారు. సంజీవయ్య ఆలయ భూములపై బుధవారం పట్టణ కేంద్రంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్మాణం కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామన్నారు. సొంత ఖర్చులతో ఆలయం నిర్మిస్తామని చెబితే దేవాదాయ శాఖ ఒప్పుకోలేదన్నారు. తమ వందల ఎకరాల భూమి సీలింగ్లో పోయిందని, కానీ దేవాలయ భూములు తామే అన్యాక్రాంతం చేశామని కొందరూ అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. జనవరిలోనే దేవాలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుంచి అనుమతి వచ్చిందని, ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రారంభించలేదని చెప్పా రు. దేవాలయ పరిరక్షణ సమితి పేరుపై కొందరు చేస్తున్న దీక్షలు ఉత్తవేనని అది పరిరక్షణ సమితి కాదని భూ భక్షసమితి అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పరిగిలోని 383 సర్వే నంబర్లో 16 ఎకరాల భూమిలో 9 ఎకరాలు దేవాలయ భూమి ఉందన్నా రు. ఆ భూమి ఎలా మరిందనే విషయం తమకు తెలియదని తెలిపారు. భూములు అన్యాక్రాంతం అవుతుంటే తాను తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆలయం పేరుపై ఖాతాలో రూ.19లక్షలు జమ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, నాయకులు వెంకటేష్, శివకుమార్, చిన్ననర్సింహులు, ఆంజనేయులు, మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ బలవన్మరణం
మంచాల: కుటుంబ కలహాలతో ఓ మహి ళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆరుట్లలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మంచాల సీఐ మధు తెలిపిన ప్రకారం.. గ్రామా నికి చెందిన జోగు సుదర్శన్తో ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన సంధ్యారాణి (45)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం. దంపతులు తరచూ గొడవపడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు సర్దిచెప్పారు. వారిలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన సంధ్యారాణి మంగళవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి పిల్లలు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు సుదర్శన్పై కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఇబ్రహీంపట్నం ప్రభు త్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం ఆరుట్లలో అంత్యక్రియలు నిర్వహించారు. బెల్టుషాప్పై దాడులు పహాడీషరీఫ్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్టుషాప్పై పహాడీషరీఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హార్డ్వేర్ పార్కులోని శివ కిరాణ జనరల్ స్టోర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు దాడులు చేయగారూ.17వేల విలువైన 88 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు శివకుమార్(32) అరెస్ట్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. వెంచర్ ప్రహరీకూల్చివేతపై కేసు షాద్నగర్రూరల్: మున్సిపల్ పరిధి చటాన్పల్లి శివారులో ఉన్న ఆర్సిడో లారెల్ స్ప్రింగ్ వెంచర్ ప్రహరీని కూల్చారని వెంచర్ యజమాని మిట్టపల్లి యాదగిరి బుధవారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుశీల, బాధితుడు తెలిపిన ప్రకారం.. సర్వే నంబర్ 529పీ, 530పీ, 554పీ, 556పీ, 557పీ, 558లోని 28 ఎకరాలలో రెరా అనుమతులను తీసుకుని వెంచర్ చేశారు. సంబంధంలేని సర్వే నంబర్ 534లో తనకు భూమి ఉందని చటాన్పల్లికి చెందిన శివకుమార్, రాజుగౌడ్, రామకృష్ణ, భాస్కర్గౌడ్, రాజు, శ్రీశైలం, జంగయ్య, యాదగిరి, అశోక్, చెన్నయ్య, గిరి, రమేశ్, చిన్నచంద్రయ్య వెంచర్లోకి ప్రవేశించి ప్రహరీ కూల్చి వేశారు. ఆ వీడియోలు పంపి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశారని తెలిపాడు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ అన్నిశాఖలనుంచి అనుమతులను తీసుకున్న తరువాతనే వెంచర్చేసి గోడను నిర్మించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మాజీ ఎమ్మెల్యే జైపాల్కు మాతృ వియోగం
కడ్తాల్: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుర్క జైపాల్యాదవ్కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగమ్మ (95) వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీ రాములు, షాద్నగర్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, క్యామ మల్లేశ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మాజీ ఎంపీపీలు, బీజేపీ నాయకులు తదితరులు చల్లంపల్లి గ్రామానికి చేరుకుని మంగమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జైపా ల్యాదవ్ను పరామర్శించారు. జైపాల్యాదవ్కు హరీశ్రావు ఫోన్ మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు జైపాల్యాదవ్కు ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జనసందోహం మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. చల్లంపల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో మంగమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు. నివాళులర్పించిన ఆయా పార్టీల నేతలు -
బెల్టు దుకాణాలపై దాడులు: కేసు నమోదు
శంకర్పల్లి: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మగ్గురు వ్యక్తులపై మోకిల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు మూసి ఉండడంతో కొంత మంది అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. ఠాణా పరిధిలోని మిర్జాగూడ, జన్వాడ, కొండకల్ గ్రామాల్లోని మూడు కిరాణా దుకాణ్లాలో పోలీసులు దాడులు చేశారు. మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి, వారి నుంచి 20 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచలో ప్రమాదవశాత్తు జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ మల్లేశ్ ఎనిమిది ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. పంట కోత దశకు వచ్చింది. మధ్నాహ్నం పంటకు నిప్పంటుకోవడంతో గమనించిన స్థానికులు రైతుకు సమాచారం ఇచ్చారు. మంటలార్పేందుకు పలువురు విఫలయత్నం చేశారు. తాండూరు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటాలార్పే వరకు ఆరు ఎకరాల్లో పంటల పూర్తిగా దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని.. సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. భూ తగాదాల్లో ఘర్షణ ● పలువురికి గాయాలు ● ఇరువర్గాలపై కేసులు పరిగి: మండల పరిధిలోని నస్కల్లో మంగళవారం భూ తగాదాలు భగ్గుమన్నాయి. సర్వేనంబర్ 216లో కాసుల వెంకటయ్య కుటుంబ సభ్యుల పేరున మూడెకరాల భూమి ఉంది. ఇదే సర్వేనంబర్లో దాయాది కాసుల నగేష్ రోడ్డు వేసేందుకు జేసీబీతో చదును చేస్తుండగా, వెంకటయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు కొనసాగుతున్నాయని సమాచారం. 202, 203 సర్వే నంబర్లలోని పొలాల విషయంలోనూ ఇరు కుటుంబాలు తగాదా పడుతున్నాయని తెలుస్తోంది. శ్మశానవాటికలో యువకుడి బలవన్మరణం మర్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య పరిగి: శ్మశాన వాటికలో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ, స్థానికులు తెలిపిన ప్రకారం.. దోమ మండలం మైలారం పంచాయతీ పాశంబండ తండాకు చెందిన కాట్రావత్ దీపక్(23) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం పట్టణంలో ఉండే అక్క నీల వద్దకు వచ్చి పని చూసుకుంటానని చెప్పాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయిన దీపక్ ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న శ్మశాన వాటికలో మర్రి చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ తల్లి పారుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
మహిళ అదృశ్యం
పహాడీషరీఫ్: మానసిక స్థితి సరిగ్గా లేని మహిళ అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన ఫాతిమా బేగం(45) భర్త ఖురేషీ చనిపోవడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. శాసీ్త్రపురంలో నివసించే ఆమె సోదరుడు ముస్తఫా నిత్యం ఆహారం తెచ్చిస్తుంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆమె 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి అబ్దుల్లాపూర్మెట్: ఓఆర్ఆర్పై కారులో ప్ర యాణిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితి లో మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్రోడ్డుపై పెద్దఅంబర్పేట నుంచి బొంగ్లూర్ వెళ్లే మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు ఆగి ఉండడాన్ని గమనించి న పెట్రోలింగ్ సిబ్బంది దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కారులో డ్రైవింగ్ సీటు పక్కనే ఉన్న సీ టులో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు నోట్లో నుంచి నురగ రావడాన్ని గ మనించి 108 వాహనానికి సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అతని వివరాల గురించి ఆరా తీయగా మృతుడు ఎన్టీఆ ర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం వేడ మనూరు గ్రామానికి చెందిన తడపనేని శివరామకృష్ణ(33) అని తేలింది. ఆయన గచ్చిబౌ లిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రాప్ సర్వేకు వలంటీర్లు
పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు సిద్ధమయింది. ఈ సర్వేకు వలంటీర్లను నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది. దుద్యాల్: పంట నమోదు ఏఈఓలకు భారమైంది. దీంతో ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్కో వలంటీరును నియమించారు. స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వలంటీరు సంబంధిత పొలం దగ్గరకు వెళ్లి సాగు చేసిన పంటల వివరాలు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఫొటోకు రూ.7 పంటల వివరాలు నమోదుకు వలంటీర్లకు వ్యవసాయ శాఖ ఒక్కో ఫొటోకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. ఒక్కో సబ్ సర్వే నంబర్కు ఒక్కో ఫోటో తీయాల్సి ఉంటుంది. సబ్ సర్వే నంబర్లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో మాత్రమే నమోదు చేయాలి. ఇలా చేయడంతో ఏ రైతు ఏ సర్వే నంబర్లో ఏ పంటను సాగు చేస్తున్నారో పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. పంటల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయడంతో సాగు వివరాలు పక్కగా ఉంటాయి. పంట విక్రయాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతు ఆధార్ కార్డు, భూమి పాస్బుక్ నంబర్ నమోదు చేసిన వెంటనే పంటల వివరాలు తెలిసిపోతాయి. 12 రెవెన్యూ గ్రామాలు మండల వ్యాప్తంగా హంసంపల్లి, గౌరారం, దుద్యాల్, హస్నాబాద్, కుదురుమల్ల, నాజుఖాన్పల్లి, చిలుముల్ మైల్వార్, మాచన్పల్లి, లగచర్ల, హకీంపేట్, ఈర్లపల్లి, పోలేపల్లిలు రెవెన్యూ గ్రామాలు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ను నియమించుకోవాలనే నిబంధన ఉండగా 12 గ్రామాలకు గాను తొమ్మది మందిని నియమించుకున్నారు. ఇందులో హకీంపేట్, పోలేపల్లి, నాజుఖాన్పల్లి రెవెన్యూ గ్రామాలకు వలంటీర్లను నియమించకుండా ఏఈఓనే పంట వివరాలు నమోదు చేస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు వలంటీర్లను కలిసి మీ సాగు వివరాలు నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్కొక్కరు నియామకం క్షేత్రస్థాయికి వెళ్లి పంటల నమోదు హకీంపేట్, పోలేపల్లి, నాజుఖాన్పల్లిలో ఏఈఓలతో సర్వే సదావకాశం పంటలను సర్వే చేయడా నికి కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. గ్రామాల్లో చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్నాం. ప్రస్తుతం ఈర్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో పంటల వివరాలు నమోదు చేయడానికి వలంటీర్గా ఎన్నికయ్యాను. ఉత్సాహంతో పని చేస్తున్నాం. – మోద్రేచ్చ సంతోష్ కుమార్, వలంటీర్, ఈర్లపల్లి తప్పులకు ఆస్కారం లేదు గతంలో పంటలు సాగు చేయకుండా చేసినట్లు నమోదు చేయించారు. ప్రస్తుతం ఆస్కారం లేదు. వలంటీర్ రైతు సాగు చేస్తున్న పొలం లోకేషన్కు వెళ్లి సర్వే నంబర్ ఆధారంగా సాగు చేస్తున్న పంటలను నమోదు చేస్తారు. తప్పుడు సమాచారం నమోదుకు అవకాశం లేకుండాపోయింది. పంటలు సాగవుతున్న భూ వివరాలు నమోదు అవుతాయి. – నాగరాజు, మండల వ్యవసాయ అధికారి, దుద్యాల్ -
ఆయుష్ పోయరూ!
● పురాతన వైద్యానికి కరువైన ప్రాధాన్యత ● సిబ్బంది లేక మూతపడిన ఆస్పత్రులు ● కళాశాల మంజూరు చేసి వైద్యాన్ని విస్తరించాలని డిమాండ్ కొడంగల్: కొడంగల్ కేంద్రంగా ఆయూష్ కళాశాలను మంజూరు చేయాలని ఆయుర్వేద విద్యార్థులు కోరుతున్నారు. నియోజకవర్గానికి చెందిన వందలాది మంది విద్యార్థులు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లి బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ప్రాంతలో ఆయుష్ కళాశాలను ఏర్పాటు చేస్తే ఇక్కడి విద్యార్థులకు మేలు జరిగడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కొడంగల్కు ఆయుష్ మెడికల్ కళాశాలను మంజూరు చేయించాలని గతంలో ఈ ప్రాంత ప్రజలు కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్కు అనేక కళాశాలలను మంజూరు చేశారు. ఇప్పటికే మెడికల్ కళాశాల, ఇంట్రిగ్రేటెడ్ గురుకులాలు, వృత్తి విద్యా కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, కొత్త మండలాల్లో జూనియర్ కళాశాలలను మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయుష్ మెడికల్ కాలేజీ మంజూరు చేసి ఆసుపత్రుల్లో డాక్టర్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్ ఆయుర్వేదానిదే.. ఇప్పటికే ఆయుర్వేదం, హోమియోపతి వైద్యానికి ప్రాధాన్యత పెరిగింది. దీర్ఘకాలిక రోగాలకు ఈ వైద్యంలోనే నయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆయుర్వేద, హోమియోపతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు రోగులు కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్, యాద్గిర్, గుల్బర్గా, రాయిచూర్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ తీసుకొని కొడంగల్కు ఆయుష్ను మంజూరు చేసి పురాతన వైద్యానికి ప్రాధాన్యత కల్పించాలని కొడంగల్ వాసులు కోరుతున్నారు. మూతపడిన ఆస్పత్రులు నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రులు పని చేయడం లేదు. డాక్టర్లు, వైద్య సిబ్బంది లేక మూతపడ్డాయి. పేదలకు ఆయుర్వేద వైద్యం అందని ద్రాక్షగా మారింది. కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో ఆరు ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. అందులో కొడంగల్ మండలంలో రుద్రారం, అంగడిరాయిచూర్, బొంరాస్పేట మండలంలో బొంరాస్పేట, దుద్యాల మండలంలో దుద్యాల, దౌల్తాబాద్ మండలంలో దౌల్తాబాద్, కోస్గి మండలంలోని గుండుమాల్లో ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. ఒక్కో దవాఖానాలో ఒక డాక్టర్, కంపౌండర్, అటెండర్, వాచ్మెన్ ఉండాలి. ప్రభుత్వం వైద్యులను నియమించక పోవడంతో పాటు కింది స్థాయి సిబ్బంది పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఆస్పత్రులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇన్చార్జిలు ఉన్న చోట మందులు లేవు. వైద్యులను నియమించి ఆస్పత్రులకు పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయుర్వేద విద్యార్థులు కోరుతున్నారు. నియోజకవర్గంలోని ఆయుర్వేద ఆస్పత్రులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. ఆయుర్వేద దవాఖానాల పర్యవేక్షణాధికారి కార్యాలయం హైదరాబాద్లో ఉంది. రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి చూడాల్సి ఉంది. ఆయుర్వేద ఆస్పత్రుల్లో పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ వైద్యం పేదలకు అందే విధంగా కృషి చేయాలి. -
మండుతున్న ఎండలు
● వికారాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ ● గరిష్టంగా 36.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు తాండూరు: ఎండలు మండుతున్నాయి.. నిన్న మొన్నటి వరకు చల్లటి వాతావరణంలో ఉన్న ప్రజలకు ఎండ వేడి చురకలంటిస్తోంది. పక్షం రోజులుగా గ్రీన్ జోన్లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. గత నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. సోమవారం వికారాబాద్ జిల్లా ఎల్లో అలర్ట్ జోన్లోకి వెళ్లింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. గ్రీన్జోన్లో పరిగి, చౌడాపూర్ జిల్లాలో 20 మండలాలు ఉండగా రెండు మండలాలు మినహా 18 మండలాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ధారురు మండలంలో 36.9 డిగ్రీలు, దుద్యాల మండలంలో 36.7 డిగ్రీలు, మర్పల్లి మండలంలో 36.6 డిగ్రీలు నమోదవ్వగా మరో ఏడు మండలాల్లో 36.5 డిగ్రీల వరకు, ఎనిమిది మండలాల్లో 35 డిగ్రీలకు వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పరిగి, చౌడాపూర్ మండలాలు 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో గ్రీన్ జోన్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 17 – 20 డిగ్రీల కనిష్ట్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాండూరు ప్రాంతంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
టిప్పర్, కారు ఢీ
ఒకరికి తీవ్ర గాయాలు చేవెళ్ల: రెండురోజుల్లో పెళ్లి ఉందని స్నేహితులకు పెళ్లికార్డు ఇచ్చేందుకు వచ్చి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్లారీ ఢీకొన్న ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన బస్వ ప్రవీణ్ నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 5న తన వివాహం ఉండటంతో చేవెళ్లలోఉన్న స్నేహితులకు పెళ్లికార్డు ఇచ్చేందుకు మంగళవారం కారులో వచ్చి తిరిగి వెళ్తున్నాడు. మార్గమధ్యలో మీర్జాగూడ సమీపంలో కి రాగానే రోడ్డు పనులకు మట్టిపోస్తున్న టిప్పర్ లా రీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. మరో కారు వెనుక నుంచి వచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కారులో ఇరుక్కుపోయాడు. అతన్ని స్థా నికులు బయటకు తీసి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి త రలించారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హుడాకాంప్లెక్స్: రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో (హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) 2025–26 విద్యా సంవత్సరానికి గాను నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన, క్రీడాధికారి స్వర్ణలత పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు మాత్రమే జిల్లా స్థాయికి అర్హులన్నారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులను రాష్ట్రస్థాయికి పంపిస్తారన్నారు. 8 నుంచి 9 సంవత్సరాల మధ్య (01.09.2017 నుంచి 31.08.2018 మధ్య జన్మించి ఉండాలి) వయస్సు ఉండాలన్నారు. ఈనెల 4వ తేదీ వరకు tgss.telangana.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు మండల విద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. షాద్నగర్రూరల్: ఉద్యోగులు మానసిక ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని షాద్నగర్ డిపో మేనేజర్ ఉష అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం జాతీయ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని జయంచడం ఎలా అన్న అంశంపై డాక్టర్ మహేశ్తో అవగాహన కల్పించారు. అనంతరం డీఎం మాట్లాడుతూ.. మానసిక ఆందోళనతో విధులను సక్రమంగా నిర్వర్తించలేమనే విషయాన్ని ఉద్యోగులు గ్రహించాలని అన్నారు. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామంచేస్తే మానసిక ఆందోళన తగ్గుతుందన్నారు. చిన్నపాటి సమస్యలకు కుంగిపోవద్దని, ఆనందంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు విధులకు హాజరయ్యే ముందు ఇంటి నుంచి ప్రశాంతంగా రావాలన్నారు. సమయానికి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్, మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్ నాగులు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: కార్గోలో వచ్చిన పార్సిల్ సామగ్రిని ఈనెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నం బస్టాండ్లో వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. కార్గో బస్సుల్లో రవాణా చేసిన పలు పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు కొన్నాళ్లుగా తీసుకెళ్లడం లేదన్నారు. ఈ సామగ్రిని వేలం వేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనా లని సూచించారు. -
స్నానానికి వెళ్లి.. నీట మునిగి
షాద్నగర్రూరల్: విద్యార్థులంతా కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు.. స్నానం చేసేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు.. చెరువులోకి దిగిన వారిలో ఓ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు.. గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు.. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామశివారులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఫరూఖ్నగర్ మండలం రాయికల్ శివారులోని ఓ భవనంలో నారాయణపేట, నాగర్కర్నూల్, దేవరకద్రకు చెందిన మహాత్మాజ్యోతిరావుపూలే డిగ్రీ కళాశాల కొనసాగుతోంది. ఈ కళాశాలలో జోగులాంబ గద్వాలజిల్లా, ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు (19) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాలలో విద్యార్థులు హోలీ వేడుకలను జరుపుకొన్నారు. మధ్యాహ్నం దాదాపు ఆరుగురు విద్యార్థులు రాయికల్ సమీపంలోని చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో చెరువులోకి దిగిన రాజు గల్లంతయ్యాడు. విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల అధ్యాపకులకు చెప్పడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయాన్ని తెలుసుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిషన్ ఆధ్వర్యంలో ఫైర్ అధికారులు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెరువులో గురుకుల విద్యార్థి గల్లంతు -
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
హయత్నగర్: పాడి రైతులు, సంస్థ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థను గాడిలో పెట్టేందుకే ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)తో ఒప్పందానికి సిద్ధమయ్యామని నార్ముల్ మదర్డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి అన్నారు. పెండింగ్ పాల బిల్లుల చెల్లింపుకోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని మెజారిటీ సొసైటీల చైర్మన్లు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన హయత్నగర్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సొసైటీల చైర్మన్లు మాట్లాడుతూ.. ఐదున్నర నెలలుగా బిల్లులు చెల్లించలేదని అన్నారు. పాలక వర్గం రాజీనామ చేయాలని, చైర్మన్ స్పందించకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పాలకవర్గం, అధికారుల అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేపట్టాలని, చైర్మన్ను రైతులే నేరుగా ఎన్నుకునే విధంగా బైలా మార్చాలని డిమాండ్ చేశారు. మిజా చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. చిట్యాల భూమి కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాల కోసమే లాభాలు చూపించామని తెలిపారు. పాలక వర్గం సభ్యులకు అవగాహన లేకపోవడం, అనుభవ లేమి కారణంగా సంస్థ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. ఎన్డీడీబీతో ఒప్పందంతో సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చైర్మన్ మధుసూదన్రెడ్డి సమాధానం ఇస్తూ గతంలో ఉన్న పాలక వర్గం నిర్వాకంతోనే సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని, ఎన్డీడీబితో ఒప్పందంలో ఎలాంటి దాపరికం లేదన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వెంటనే రూ.10 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చారని తెలిపారు. సంస్థ ప్రతినిధి మహిపాల్రెడ్డి ఎన్డీడీబి ఒప్పంద వివరాలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. నార్ముల్ మదర్డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
మున్సిపల్ ఆఫీసుకు.. డీసీపీ కార్యాలయానికి
3 ప్రతిపాదనలు పంపించాం మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మున్సిపల్ అధికారులు లేఖరాశారు. చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో అందుబాటులో ఉందని కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించాం. డీసీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు సంబంధించిన లేఖ ఇంకా అందలేదు. లేఖ అందిన వెంటనే కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదిస్తాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ ఎకరాలు మొయినాబాద్: కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ పురపాలిక సంఘం, చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూకేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చిలుకూరు రెవెన్యూలో సర్వేనంబర్ 786లోని ప్రభుత్వ భూమిని కేటాయించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్కు పంపారు. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ భూమి పరాధీనం కాకుండా.. నగర శివారుల్లోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఇందులోని 9 ఎకరాల్లో వేద పాఠశాల ఏర్పాటుకు కేటాయించారు. కానీ వేద పాఠశాల ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వ భూమి ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్న భూమి పరులపాలు కాకుండా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విధంగా చేయాలని రెవెన్యూ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. కలెక్టర్కు ప్రతిపాదనల నివేదిక మొయినాబాద్ మున్సిపాలిటీ ఏడాది క్రితం ఏర్పడింది. మొయినాబాద్, చిలుకూరు, పెద్దమంగళారం, అప్పోజీగూడ, సురంగల్, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్నగర్, హిమాయత్నగర్ పంచాయతీలను విలీనం చేసి మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయానికి సరైన భవనం లేకపోవడంతో అజీజ్నగర్ పంచాయతీ కార్యాలయంలోనే మున్సిపల్ కార్యాలయాన్ని తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో పాలకమండలి ఏర్పడింది. చైర్పర్సన్ కార్యాలయం, వైస్చైర్మన్, కౌన్సిలర్లు కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. కొత్త మున్సిపల్ కార్యాలయం ఏర్పాటుకు సుమారు 3 ఎకరాల స్థలం కేటాయించాలని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. దీంతో చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయం తాత్కాలికంగా మొయినాబాద్లోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో కొనసాగుతోంది. డీసీపీ కార్యాలయం ఏర్పాటుకు సైతం స్థలం కావాలని పోలీసు శాఖ కోరడంతో రెవెన్యూ అధికారులు చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో 3 ఎకరాలు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయం, డీసీపీ కార్యాలయానికి 3 ఎకరాల చొప్పున భూకేటాయింపులకు సంబంధించిన పూర్తి ప్రతిపాదనల నివేదికను రెవెన్యూ అధికారులు కలెక్టర్కు పంపించనున్నారు. ప్రభుత్వం సైతం సానుకూలం మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయం, చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉంది. మొయినాబాద్లోని విలువైన భూములను కాపాడే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. చిలుకూరు రెవెన్యూలోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవడమే మంచిదని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భూకేటాయింపుకు అనుమతిస్తూ నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. చిలుకూరు రెవెన్యూలో భూ కేటాయింపులు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు -
వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపుదాం
నవాబుపేట: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో 30 ఫీట్ల పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని అభివృద్ధి చేసుకోవాలని కార్యకర్తలకు సూ చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కేఎస్ రత్నం, మండల అధ్యక్షుడు చంద్రకాంత్, ఐటీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ శ్రీధర్, నాయకులు జగన్, గాలయ్య, శేఖర్, మల్లేశం, చంద్రశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, భీంరెడ్డి, రత్నం, రాజశేఖర్ రెడ్డి, కల్యాణ్ రావు, రాంరెడ్డి, పద్మా రావు, జైపాల్ రెడ్డి, గోపాల్ గౌడ్ పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
● బంగారు, వెండి ఆభరణాల చోరీ ● ఎల్లకొండలో ఘటన నవాబుపేట: ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపరించిన సంఘటన ఎల్లకొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లిలోని గణేశ్నగర్కు చెందిన మీనపల్లి బాలమణి(45) గృహిణి. ఇరవైఐదేళ్ల క్రితమే భర్తతో విడిపోయి, కొడుకు శేఖర్తో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. శేఖర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా గత 28న ఎల్లకొండలో జాతర ఉందని, తాను బంధువుల వద్దకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. జాతరకు తన అక్క యాదమ్మ, చెల్లెలు భారతమ్మలు కూడా వచ్చారని కొడుకుకు ఫోన్ చేసింది. అదే రోజు రాత్రి శేఖర్ మళ్లీ ఫోన్ చేయగా కల్లు దుకాణంలో ఉన్నామని, రాత్రి వీధి నాటకం చూసి పొద్దున్నే శంకర్పల్లికి వస్తానని చెప్పింది. మరుసటి రోజైన ఆదివారం ఉదయాన్నే శేఖర్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అతను పెద్దమ్మ అయిన యాదమ్మకు ఫోన్ చేయగా, ఉదయం నాలుగు గంటలకే శంకర్పల్లికి బయలుదేరిందని చెప్పింది. కానీ మధ్యాహ్నం దాటినా ఇంటికి రాకపోవడంతో శేఖర్ ఎల్లంకొండకు వెళ్లి, గ్రామంలోని బంధువుల ఇంటి పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా అందులో కనిపించలేదు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు స్థానికులు ఊరి శివారులో ఓ మహిళ మృతదేహాన్ని గమనించారు. ఈ ఫొటోలను చూసిన శేఖర్ తమ అమ్మేనని గుర్తించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీఐ వెంకట్, ఎస్ఐ పుండ్లిక్ డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్లతో ఆధారాలు సేకరించారు. తన తల్లి ఒంటిపై మూడు తులాల బంగారు పుస్తెలతాడు, బంగారు కమ్మలు, వెండి పట్టీలు ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. ఇందులో ఒక చెవి కమ్మ మాత్రమే ఉందని, గొంతు కోసి చంపారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జైభీమ్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జైభీమ్ డైరీ, క్యాలెండర్ను సరూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. సరూర్నగర్ ఎస్ఈ లక్ష్మీనారాయణకు క్యాలెండర్ అందజేశారు. కార్యక్రమంలో సరూర్నగర్ సర్కిల్ కార్యదర్శి పి.రవీందర్, ప్రెసిడెంట్ ప్రవీణ్కుమార్, నాయకులు మహేందర్, అశోక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ పహాడీషరీఫ్: గుట్టు చప్పుడు కాకుండా మూడు ముక్కలాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీలో గరడు రమేష్ (34), పవన్ (24), ఎల్లప్ప (60), సంతోష్ (22), కాశీరాం (22) సోమవారం సాయంత్రం పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దాడి చేసి, ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సెట్ల కార్డులు, ఒక సెల్ఫోన్, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్కు ఏడాది జైలు రూ.6 వేల జరిమానా పూడూరు: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన తోక అంజలిదేవి నారాయణపేట్ బస్సులో హైదరాబాద్కు వెళ్తోంది. పూడూరు గేట్ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపుతూ మామిడి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా అంజలీదేవి అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటి ఎస్ఐ నాగరాజు 2015లో కేసు నమోదు చేసి కోర్డులో పత్రాలు దాఖలు చేశారు. వాదోప వాదనలు విన్న న్యాయమూర్తి నాగుల శిల్ప ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ హరికృష్ణ నాయక్కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 వేలు జరిమానా విధించారు. ఈ కేసులో అధికారి శేఖర్ దర్యప్తు చేయగా ప్రస్తుత ఎస్ఐ భరత్రెడ్డి సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. ప్రభుత్వ తరపున ఏపీపీఓ సమీనాబేగం వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసులు శివకుమార్, తదితరులను అభినందించారు. -
బొత్స సత్యనారాయణకు పరామర్శ
ఇబ్రహీంపట్నం రూరల్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ పరామర్శించారు. సోమవారం నగరంలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఆరోగ్యం, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యమకారుల హామీలు నెరవేర్చండి బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ నవాబుపేట: ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శుభప్రద్ పటేల్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మెనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారులందరికీ 250గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులను స్వతంత్ర సమయోధులుగా గుర్తించి ప్రతీ నెల గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిరెడ్డి, శాంతి కుమార్, మల్లేశం, నరసింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, కావలి శేఖర్, అశోక్ పాల్గొన్నారు. ప్రాణాలు కాపాడిన సీటుబెల్టు తాండూరు రూరల్: ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటన పెద్దేముల్ మండలం మారెపల్లి తండా గేటు వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రశాంత్వర్ధన్ తెలిపిన ప్రకారం.. తాండూరు నుంచి మెహదీపట్నంకు వెళ్తున్న తాండూరు ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సు, వికారాబాద్ నుంచి తాండూరుకు ప్రయాణిస్తున్న కారు మారెపల్లి గేటువద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతినగా.. కారు చక్రాలు ఊడిపోయి నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న హంతేజ్ సీటుబెల్టు ధరించడంతో బెలూన్లు తెరుచుకుని స్వల్పగాయాలతో బయటపడ్డాడు. హంతేజ్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. నా భర్త నుంచి కాపాడండి ● ముగ్గురు ఆడపిల్లల తల్లి ఆవేదన ● పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు బషీరాబాద్: ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. తరచూ నాపై దాడికి పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. మెడలో ఉన్న తాళి బొట్టు తెంపేశాడు. అతనితో నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, పోలీసులు తెలిపసిన వివరాల ప్రకారం.. ఎక్మాయికి చెందిన జోగి అశ్విని, జోగి రవికుమార్ భార్యభర్తలు. వీరికి లావణ్య, వితిక, సుభిక్ష ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డ్రైవర్గా పనిచేసే తన భర్త నిత్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి బాధితురాలికి అండగా నిలిచారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
మనోభావాలు దెబ్బతీయొద్దు
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య హోలీ వేడుకలకు రెడీ ఇబ్రహీంపట్నం: హోలీ వేడుకలకు ఇబ్రహీంపట్నం సిద్ధమైంది. మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ చిల్ల దగ్గర సోమవారం రాత్రి కాముని దహనం నిర్వహించారు. పట్టణంలోని పలు చౌరస్తాల్లో మంగళవారం తెల్లవారుజామున కామ దాహనానికి పలువురు ఏర్పాట్లు చేశారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆమనగల్లులో సందడి ఆమనగల్లు: పట్టణంలో హోలీ సందడి మొదలైంది. వేడుకను పురస్కరించుకొని ప్రత్యేకంగా రంగుల విక్రయ దుకాణాలు వెలిశాయి. సోమవారం స్థానికులు వాటిని కొనుగోలు చేస్తూ కనిపించారు. ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీయొద్దని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య అన్నారు. పట్టణంలో సోమవారం ఆ సంఘం మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరకొర వసతులు, ప్రైవేట్ పాఠశాలలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుల జీతభత్యాలు, పదోన్నతులపై విద్యా కమిషన్ నివేదిక సమర్పించడం యావత్ ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలో చెప్పాల్సిందిపోయి ఇలా నివేదిక ఇవ్వడం సరైందికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యాకమిషన్ సమర్పించిన రిపోర్టుపై అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినేలా నివేదికలు ఉండొద్దన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్ల కాశీరావు, ప్రధాన కార్యదర్శి పూజారి రమేష్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ సత్తారి రాజిరెడ్డి, రాజేందర్, నర్సింహ, కరుణాకర్, జంగయ్య పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపు
హుడాకాంప్లెక్స్: రోడ్లను ఆక్రమించుకొని అక్రమంగా వేసిన షెడ్లను అధికారులు తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా షెడ్లు నిర్మించి చిరు వ్యాపారాలు చేస్తుండడంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు, వాహనదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో సోమవారం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరూర్గర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి అర్చన నేతృత్వంలో కొత్తపేట బాబు జగ్జీవన్ రామ్ భవన్ నుంచి ఓమ్ని ఆస్పత్రి సర్వీసు రోడ్డు, కొత్తపేట నాగోల్ రోడ్డులోని మహాలక్ష్మి థియేటర్ రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన షెడ్లను చైతన్యపురి పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో కూల్చివేశారు. ఈ క్రమంలో తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని చిరు వ్యాపారులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ వ్యాపారం చేసుకునే తమపై ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. దీంతో అధికారులు చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పి పంపించారు. కార్యక్రమంలో చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. చిరువ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదం -
మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు ఘన నివాళి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ నారాయణరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం శ్రీపాదరావు సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు పహాడీషరీఫ్: పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఎల్బీ నగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో 2024లో ఆటోడ్రైవర్ షేక్ ముజీబ్ (24) పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు డీఎన్ఏ ఆధారాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శోభారాణి, సత్యనారాయణ వాదనలు వినిపించారు. కేసు విచారించిన ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి సాధారణ జీవిత ఖైదుతో పాటు రూ.70 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో బాధితురాలికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించారు. యువతి అదృశ్యం పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బీఎల్ఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్కుమార్ కుటుంబంతో కలిసి పదిరోజుల క్రితం జల్పల్లి పిట్టలగూడెంకు వలస వచ్చాడు. తాను పనిచేస్తున్న బిల్డింగ్లోనే నివాసం ఉంటున్నాడు. ఈనెల 1న ఉదయం 10 గంటలకు అతని చిన్న కుమార్తె ముస్కాన్ అహిర్వార్ (20) ఇంట్లో చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో తండ్రి అదేరోజు రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సోమవారం కోరారు. -
గుట్టకాయ స్వాహా!
గుట్టలనూ వదలని అక్రమార్కులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమార్కులు ప్రభుత్వ, అసైన్డ్ భూములే కాదు.. కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. ఒకవైపు గుట్టుగా మైనింగ్ (మట్టి తవ్వకాలు, గ్రానేట్ అమ్మకాలు) చేస్తూనే మరోవైపు చుట్టూ బౌన్సర్లను పెట్టి భూమిని చదును చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, తర్వాత లే అవుట్లు చేసేస్తున్నారు. వీరి వెనుక స్థానికంగా ఉన్న అధికారపార్టీ పెద్దలు ఉండడంతో విషయం తెలిసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కళ్లముందే ఖరీదైన భూములు కరిగిపోతున్నా.. వాటిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. ఏమీ చేయలేక నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హయత్నగర్లోని వీరన్నగుట్ట పూర్తిగా కబ్జాకు గురైంది. బీఎన్రెడ్డినగర్ సమీపంలోని మరో గుట్ట సహా దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి ఇప్పటికే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా బాలాపూర్ మండల పరిధిలోని పలు విలువైన గుట్టలు కరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేవతలగుట్టపై దెయ్యాల పాగా బాలాపూర్ రెవెన్యూ సర్వే నంబర్లు 78, 79, 80,81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90లో దేవతల గుట్ట ఉంది. గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడి విలువైన భూములను ఆక్రమించేస్తున్నారు. అర్బన్ సీలింగ్ నేచర్ సహా మల్టీపుల్ కేసులున్న ఈ భూముల్లో ఇప్పటికే కొంత ఆక్రమణకు గురికాగా.. తాజాగా మరికొంత భూమి కబ్జాకు యత్నిస్తున్నారు. చుట్టూ బౌన్సర్లను పెట్టి.. అటువైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకుంటున్నారు. ఖరీదైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు చేస్తున్నారు. ఆక్రమించిన ఆయా భూములను 400 గజాల ప్లాట్ల చొప్పున విభజించి గుట్టుగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గుట్ట చుట్టూ జిలెటిన్స్టిక్స్తో పెద్ద ఎత్తున పేలుళ్లు చేపడుతున్నారు. సమీపంలోని నివాసాలు దెబ్బతింటున్నా.. మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గ్రానైట్ సహా విలువైన భూములను ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తోంది. అనధికారిక వెంచర్లు.. అడ్డగోలు రోడ్లు శంషాబాద్ మండలం గొల్లపల్లి కేంద్రంగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. బహుదుర్గూడ రెవెన్యూ సర్వే నంబర్ 62లో 500 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, వీటి మధ్య నుంచి 1.5 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. బహుదుర్గూడ–తుక్కుగూడ ఔటర్ సర్వీసు రోడ్డుకు అనుసంధానంగా ఈ రోడ్డును వేశారు. ఎయిర్పోర్టు రన్వేకు అతి సమీపంలోని పొలాలను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నారు. వీటిలో పెద్ద సంఖ్యలో విల్లాలు నిర్మిస్తున్నారు. ఐదు నిమిషాల్లో ఔటర్కు చేరుకోవచ్చని ప్రచారం చేసుకుంటున్నారు. శంషాబాద్ మండలం చౌదరిగూడ సర్వే నంబర్ 34లోని సీలింగ్ భూముల్లోనూ వెంచర్లు వెలిశాయి. శంకర్పల్లి మండలం జన్వాడ రెవెన్యూ సర్వే నంబర్ 192లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. కొందుర్గు మండలం లూర్తునగర్ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వెలిశాయి. బాలాపూర్ మండలం బడంగ్పేట్ సర్వే నంబర్ 161 ఎర్రకుంట ఎఫ్టీఎల్లోని రెండు ఎకరాల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేసినా పట్టించుకున్న నాథుడు లేడు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని దేవతలగుట్ట. ఇక్కడి భూములను ప్రభుత్వం యూఎల్సీ (నిషేధిత) జాబితాలో చేర్చింది. విలువైన ఈ భూములపై స్థానిక అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఇప్పటికే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ భూములను పెద్ద సంఖ్యలో కొల్లగొట్టి.. నిర్మాణాలు సైతం చేపట్టింది. తాజాగా సర్వే నంబర్ 78, 80లోని మరికొంత భూమిని ఆక్రమించి.. ఇల్లీగల్ లే అవుట్ను సిద్ధం చేసింది. వీటిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఇది జల్పల్లి రెవెన్యూ సర్వే నంబర్ 177లో 17 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎత్తయిన గుట్ట. ఇప్పటికే దీనికి ఆనుకుని ఉన్న మెజార్టీ భూమి ఆక్రమణకు గురైంది. ఇది ప్రభుత్వ భూమి అని, అమ్మడం.. కొనడం నేరమని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి, యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతుండటం గమనార్హం. దర్జాగా లే అవుట్లు.. అక్రమ నిర్మాణాలు పట్టించుకోని అధికారులు విలువైన భూముల ఆక్రమణ ప్రభుత్వ బోర్డుల తొలగింపు -
‘ఉపాధి’పై సామాజిక తనిఖీ
చేవెళ్ల: ఉపాధిహామీ పనులతో ప్రజలకు ఉపాధి కల్పించటంతో పాటు ఎలాంటి అవకతవకలు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టేలా ఏటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ ఎల్.శ్రీలత అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం మండలంలో ఏడాది కాలంలో జరిగిన ఉపాధిహామీ పథకం పనులపై 16వ విడత సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు. మండలంలోని 37 గ్రామాల్లో ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు జరిగిన ఏడాది ఉపాధిహామీ పనులపై ఆడిట్ చేపట్టినట్టు తెలిపారు. మొత్తం రూ.1,93,20,661 పనులు జరిగినట్లు చెప్పారు. జిల్లా అధికారి పీడీ శ్రీలత, అడిషనల్ డీఆర్డీఏ సుభాషిణి, అంబుడ్స్మెన్ సునీత, క్వాలిటీ కంట్రోలర్ సునీత, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కొండయ్య, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ కాశన్న సమక్షంలో సామాజిక తనిఖీ నివేదికలు చదివి వినిపించారు. అవకతవకలపై అధికారులు మండిపడ్డారు. రికార్డులు సక్రమంగా లేని గ్రామాల సిబ్బందిని ఏం చేస్తున్నారంటూ మందలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, ఎంపీఓ విఠలేశ్వర్జీ, ఉపాధిహామీ పథకం ఈసీ రాజశేఖర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ పథకం టీఏలు, ఎఫ్ఏలు, సిబ్బంది, ఉన్నారు. -
నైపుణ్యహస్తం
వికారాబాద్: లోక్సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్ర నేత రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం వికారాబాద్లోనే గడిపారు. పది రోజులుగా కొనసాగుతున్న ఉమ్మడి రాష్ట్ర డీసీసీ అధ్య క్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. రాహుల్ ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి 10.15 గంటలకు ఎస్ఏపీ కళాశాల హెలిపాడ్కు చేరుకున్నారు. అనంతరం ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్లు మహేశ్కుమార్గౌడ్, వైఎస్ షర్మిల, శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మన్ టి.రామ్మోహన్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అనన్య పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. పార్టీ పరిస్థితిపై ఆరా అనంతరం రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం, రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కళాశాల ఆవరణలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంలో ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అరగంటపాటు చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, అజహరుద్దీన్, వి.హన్మంతరావు, కేశవరావు, షబ్బీర్అలీ, రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నా రు. అనంతరం అనంతగిరి హిల్స్లోని హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి చేరుకున్నారు. సమర్థవంతంగా శిక్షణ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ హరిత రిసార్ట్స్లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులు, డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్లు మహేశ్కుమార్గౌడ్, వైఎస్ షర్మిల, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్రావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన తదితర అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. ఇరు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు తమ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మాణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీ డీసీసీ అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపారు. అందరితో విడిగా ఫొటోలు దిగారు. సాయంత్రం 4.35 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. డీసీసీ జిల్లా అధ్యక్షులకు ముగిసిన శిక్షణ హంగూ ఆర్భాటం లేకుండా..రాజకీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా రాహుల్గాంధీ పర్యటన కొనసాగింది. వీవీఐపీల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు మినహా ఎలాంటి ఆర్భాటం లేకుండా పర్యటన సాగింది. మీడియాకు సైతం అనుమతి లేకుండా పార్టీ అంతర్గత కార్యక్రమాన్ని కొనసాగించారు. -
నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత
మొయినాబాద్: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి ఆలయాన్ని మూసివేయనున్నట్టు చెప్పారు. గ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 7 గంటలకు సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేస్తామన్నారు. భక్తులకు దర్శన అవకాశం ఉండదన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే వినతులను శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ వారం 51 అర్జీలు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, వివిధ శాఖల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. షాద్నగర్: ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో సోమవారం అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి విధిగా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సాహితి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రవీణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్రావు, గుండుబావి శ్రీనివాస్రెడ్డి, అపోలో ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. షాద్నగర్రూరల్: పట్టణంలోని మిలీనియం టౌన్షిప్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ కార్యాలయాన్ని సోమవారం ఫ్యూచర్సిటీ కమిషనర్ సుధీర్బాబు సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ శిరీష ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిసి సీపీకి స్వాగతం పలికారు. అనంతరం సీపీ సుధీర్బాబు నియోజకవర్గంలోని సీఐలు, ఎస్ఐలతో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నెలకొన్న స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. క్రైం రేటు పెరగకుండా ఉండేందుకు, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కనుల పండువగా శ్రీవారి కల్యాణం
పరిగి: పట్టణ కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు భక్తు లు అందించిన సహకారం మరువలేనిది అన్నా రు. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలి
● వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ● దుద్యాల్ మండలంలో సుడిగాలి పర్యటన దుద్యాల్: నిర్మాణ పనుల్లో వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని దుద్యాల్, హకీంపేట్ గ్రామాల్లో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా దుద్యాల్లో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత భవనాలను పరిశీలించారు. లక్ష్యం మేరకు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులను పెండింగ్లో ఎందుకు పెట్టారని ఆర్అండ్బీ అధికారులను ప్రశ్నించారు. హకీంపేట్ శివారు ఎడ్యుకేషన్ హబ్ ప్రాంతాన్ని పరిశీలించారు. సంబంధిత మ్యాప్ను పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అధికారులు చర్యలు తీసుకోవాలి కొడంగల్: నిధులు మంజూరైన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ఆదివారం ఆయన పట్టణంలోని కడా కార్యాలయంలో వికారాబాద్, నారాయణపేట జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిచారు. కొడంగల్, నారాయణపేటకు సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్, తాగునీరు, మిషన్ భగీరథ పైప్లైన్లు, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, టీజీఈడబ్ల్యూడీసీ, పబ్లిక్ హెల్త్ శాఖల ద్వారా మంజూరైన నిర్మాణ పనులు ప్రారంభించి లక్ష్యం మేరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి.. సమ్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆర్అండ్బీ ద్వారా చేపట్టే పనులు, వెటర్నరీ, వైద్య కళాశాలలకు సంబంధించిన పనులు వేగిరంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు చెప్పారు. అంతకుముందు కడా ప్రకత్యేకాధికారి వెంకట్రెడ్డి వివిధ అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్చౌదరి, పంచాయతీరాజ్ డీఈ సుదర్శన్, ఆర్అండ్బిబీ ఈఈ శ్రీధర్రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ రవిప్రసాద్, కొడంగల్, నారాయణపేట ఇంజనీరింగ్ విభాగం ఈఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఎవరి కోఆప్షన్!
● సభ్యుల ఎంపికకు పైరవీలు ● అధికార పార్టీ నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇక కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అవకాశం దక్కించుకోవడం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని అధికార పార్టీ దక్కించుకుంది. వైస్ చైర్మన్గా స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకున్నారు. 26 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందినవారికే కోఆప్షన్ సభ్యలుగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో ఆశావహులంతా కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నాలుగులో రెండు మహిళలకు.. మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల స్థానాలు నాలుగు ఉన్నాయి. వాటిలో రెండు మహిళలకు కేటాయించనున్నారు. ఇందూలోనూ మైనార్టీ, బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకోసం మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ తదితరులను కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పైరవీల మధ్య ఎవరికి అవకాశం దక్కుతుందో మరికొన్ని రోజులు వేచిచూడాలి. పార్టీకోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా పార్టీకోసం పనిచేసిన వారికే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జొన్నాడ రాజు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నామని.. తనకు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ బలోపేతం, విస్తరణకోసం ఎంతో కృషి చేశామని.. పనిచేసేవారిని అధిష్టానం గుర్తించాలన్నారు. కొత్తగా పార్టీలో చేరినవారికి పదవులు ఇస్తే.. పార్టీ జెండాలు మోసి కష్టపడినవారికి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు గ్రహించాలన్నారు. -
చివరి దశకు సాగు
● బోర్ల కింద ఇప్పటికే 90 శాతం పూర్తి ● ఆయకట్టు కింద మిగిలిన పది శాతం ● జిల్లా వ్యాప్తంగా 93,116 ఎకరాల్లో నాట్లు పూర్తి దుద్యాల్: వానాకాలం సీజన్లో చివరి వరకు వర్షాలు కురియడంతో జలశయాలు కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగడంతో పలువురు రైతులు బోర్ల కింద ఇప్పటికే వరి నాట్లు వేశారు. ఆయకట్టు కింద కొనసాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పూర్తవ్వగా మరో పది శాతం నాట్లు వేసేందుకు పొలాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు నాట్లు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండల పరిధిలోని దుద్యాల్, హస్నాబాద్, లగచర్ల, అల్లిఖాన్పల్లి, లగచర్ల, గౌరారం, చెట్టుపల్లి తండా. చిలుముల్ మైల్వార్, నాజుఖాన్పల్లి, ఆలేడ్, కుదురుమల్ల, హకీంపేట్. పోలేపల్లి, ఈర్లపల్లి, గ్రామాల్లో ఆయకట్టు రైతులు వరి నాట్లు అధికంగా వేస్తున్నారు. ప్రస్తుతం హస్నాబాద్, ఆలేడ్లకు ఒకే చెరువు నీరు అందుతుంది. రెండు గ్రామాల్లో దాదాపు 2వేల ఎకరాలకు పైగా వరి సాగు చేపట్టారు. దుద్యాల్లోనూ రెండు పెద్ద చెరువులు ఉండడంతో దాదాపుగా వేయి ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. ప్రస్తుతం 11 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి 93,116 ఎకరాల్లో వరి నాటు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం తెలిపారు. ఈ నెల చివరి వరకు దాదాపు 1,05,000 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దొడ్డు రకాలతో అధిక దిగుబడి యాసంగి సాగులో రైతులు అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాల వైపు మొగ్గు చూపుతున్నారు. చీడ పీడలను తట్టుకుని అధికంగా దిగుబడి అందించే రకాలను ఎంచుకుని అందుకు తగిన సాగు యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. దొడ్డు రకాలైన వరి ధాన్యం కేఎన్ఎం––118, ఎంటీయూ–1,121, యూటీఆర్–1010 వంటివి సాగు చేస్తున్నారు. సన్న రకాలైన ఆర్ఎన్ఆర్–15,048 ఎక్కువ విస్తీర్ణంలో వేసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అధికంగా లాభాలు పొందేందుకు 90 శాతం మంది దొడ్డు రకాలైన వరి వంగడాలను సాగు చేస్తున్నారు. వీటి దిగుబడిని అధికంగా ఉంటుందని నమ్మకం. -
పదోన్నతుల సంబురం
శంషాబాద్: సీఐఎస్ఎఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ హైదరాబాద్లో పనిచేస్తున్న 217 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. సీనియర్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారికి దానికి సంబంధించిన చిహ్నాలను సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ రిక్రియేషన్ క్లబ్లో ఘనంగా అందించారు. ఈ సందర్భంగా సీనియర్ కమాండెంట్లు చిహ్నాలను వారి దుస్తులకు పెట్టారు. పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు మరింత ఉన్నతంగా రాణించాలని సూచించారు. మృతదేహంతో రోడ్డుపై ధర్నా ప్రమాదకారకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ మోమిన్పేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి శవంతో ధర్నా చేపట్టిన ఘటన మోమిన్పేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్భూషన్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని మొరంగపల్లికి చెందిన రుక్కల పాండు(56) శనివారం సాయంత్రం మోమిన్పేట సంతకు వెళ్లాడు. తిరుగుప్రయాణంలో దేవరంపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ బైక్తో పాండును ఢీకొట్టాడు. దీంతో క్షతగాత్రుడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాగా ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మృతుడి కుమారుడు బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు ఆదివారం సాయంత్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద శవంతో ధర్నా చేపట్టారు. ప్రమాదకారకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడకు చేరుకుని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రమాదకారుకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని డిస్చార్జి చేసిన వెంటనే అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆర్టీసీ డెయిలీ పాస్ ధర పెంపు సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ రోజువారీ (డైలీ) బస్ పాస్ ధర పెరిగింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డైలీ పాస్ చార్జీలను రూ.150 నుంచి రూ.130కి తగ్గించారు. తాజాగా ఈ రాయితీని ఆర్టీసీ ఉపసంహరించుకుంది. దీంతో యథావిధిగా డైలీ పాస్ చార్జీ రూ.130 నుంచి రూ.150 కి పెరిగింది. ఈ పాస్పైన ప్రయాణికులు ఏ బస్సుల్లోనైనా 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చు. -
అసలే అక్రమం.. ఆపై కల్తీ!
సాక్షి, సిటీబ్యూరో: నాసిరకం ముడిసరుకులతో అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ రంగులు వాడుతున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆదివారం రెండు ప్రాంతాల్లో దాడులు చేసి నలుగురిని పట్టుకున్నారు. రూ.10 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ వివరాలు వెల్లడించారు. జల్పల్లి ప్రాంతంలో అబ్దుల్ సత్తార్ అనుమతులు, లేబర్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్రమైన వాతావరణంలో ‘ఓ రాయల్ ఎంటర్ర్పైజెస్’, ‘షాహీ గోల్డ్ ’కంపెనీల పేరిట కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. ఈ పేస్టును స్థానిక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇతడికి జల్పల్లితోపాటు ముస్తాఫానగర్లోనూ కార్ఖానాలు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు వాటిపై దాడి చేసి ప్రధాన నిందితుడు సత్తార్తోపాటు మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ ఇఫ్తేఖర్, నూర్ నబీలను పట్టుకున్నారు. వీరి నుంచి 340 కిలోల విడి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఒక్కోటి 50 కిలోల బరువు ఉన్న 12 పెద్ద టబ్ల అల్లం మిశ్రమం, ఒక్కోటి 25 కిలోల బరువు ఉన్న 20 సంచుల వెల్లుల్లి మిశ్రయం, ఐదు సంచుల ఉప్పు, అజంతా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ బాక్సులు, సిట్రిక్ యాసిడ్ పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు. సింథటిక్ రంగులతో అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు చేసిన శంషాబాద్ టాస్క్ఫోర్స్ -
వర్షాకాలం కంటే తక్కువ
బోరు కింద వర్షాకాలం దాదాపు మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. బోర్లలో నీటి శాతం పెరిగిన వేసవి ఎండల కారణంగా భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. నీటి లభ్యతని బట్టి సాగు చేశా. నెల రోజు క్రితమే నాటు వేశాను. ప్రస్తుతం పిలకు వచ్చి పంట బాగుంది. – ఈరప్ప, రైతు, హస్నాబాద్ అధిక వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండుకోవడంతో బోర్లలో నీరు పెరిగి యాసంగి వరి సాగు శాతం పెరిగింది. ప్రస్తుతానికి 93,116 ఎకరాల వరకు వరి నాటు పూర్తయ్యాయి. దాదాపుగా 1,05,000 ఎకరాల వరకు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. రైతులు యాజమన్య పద్ధుతులు పాటించి సాగు చేస్తే అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చు. సందేహాలు, సలహాలు, సూచనల కోసం ఆయా గ్రామాల వారీగా ఏఈఓలను సంప్రదించాలి. – రాజారత్నం, జిల్లా వ్యవసాయ అధికారి -
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: భర్తతో గొడవపడిన గృహిణి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన కొమిరి యాదయ్య భార్య శారద (38) కూలి పని చేస్తుంటుంది. గత నెల 26న రాత్రి భర్త, పిల్లలతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె భర్త ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. బావిలో పడి మహిళ మృతి ఆమనగల్లు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన తలకొండపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం హర్యనాయక్ తండాకు చెందిన ఇస్లావత్ లలిత (34)కు జాన్యాతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నేళ్లుగా లలితకు ఆరోగ్యం బాగా లేదు. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్తానని చెప్పి లలిత ఇంట్లో నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో బంధువులు, సమీప గ్రామాల్లో వెతికినప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో ఆదివారం తండా సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదస్థితిలో ఉపాధ్యాయుడి మృతి ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని చిలుకానగర్కు చెందిన శంబెళ్ల సతీష్కుమార్ (47) మంచాల మండలం ఆరుట్లలోని టీజీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల బదిలీపై ఇక్కడకి వచ్చిన ఆయన ఇబ్రహీంపట్నంలోని ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఇంటి బాత్రూమ్లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సతీష్కుమార్ను ఇంటి యజమాని గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పరిశీలించి, ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సన్మానం
జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్ రావు ఉద్యోగ విరమణ చేశారు. సరోర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు అధికారులు, క్రీడాకారులు ఆయనను ఘనంగా సన్మానించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిత, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోచ్లు, సిబ్బంది, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. – హుడాకాంప్లెక్స్ -
లారీ చక్రాల కింద నలిగి మహిళ మృతి
● మరో వ్యక్తికి గాయాలు ● బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం అబ్దుల్లాపూర్మెట్: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తార్నాక మాణికేశ్వర్కాలనీ వడ్డెరబస్తీకి చెందిన గండికోట లలిత (41) వృత్తిరీత్యా కూలీ. శనివారం ఉదయం మేసీ్త్ర లింగస్వామితో కలిసి పనికోసం తార్నాక నుంచి బైక్పై అబ్దుల్లాపూర్మెట్ వెళ్తున్నారు. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్సిటీ గేటు వద్ద విజయవాడ మార్గం నుంచి వస్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి, వీరి బైక్ను ఢీకొట్టింది. రోడ్డు పక్కన పడిపోయిన లలిత తల పైనుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. లింగస్వా మి గాయపడ్డారు. మృతురాలి సోదరుడు యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని వ్యక్తి మృతి కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలు.. కడ్తాల్ మండలం గోవిందపల్లికి చెందిన కంబాలపల్లి అంజయ్య(38), భార్య సువర్ణ, పిల్లలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తుమ్మలూరు పరిధిలోని బీటీఆర్లో కూలీ పనులు చేయడానికి వెళ్లిన సువర్ణను తీసుకువచ్చేందుకు శుక్రవారం రాత్రి బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో దెబ్బడగూడ గేట్ వద్ద శ్రీశైలం రహదారిపై ఎదురుగా వచ్చిన కారు అంజయ్య బైక్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బిల్డర్లకు అండగా ఉంటాం
పహాడీషరీఫ్: బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. బిల్డర్స్ డే ను పురస్కరించుకొని మామిడిపల్లిలోని పద్మజా పామ్ గ్రోవ్స్లో ఏర్పాటు చేసిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 4వ నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ సమావేశాలను శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్న ‘బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ కాంట్రాక్టర్లు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తోందని కొనియాడారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన డాక్టర్ మాధవీలత, ఎ.నరేందర్రెడ్డి, బొల్లినేని శీనయ్య, డి.సుధాకర్రెడ్డి, జానపద గాయకుడు నల్గొండ గద్దర్కు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రసింగ్ కాంబో, ఐఎఫ్ఏడబ్ల్యూపీసీఏ బోర్డు మెంబర్ ఎస్ఎన్ రెడ్డి, బీఏఐ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణారావు, బీఏఐ మాజీ చైర్మన్ బి.సీనయ్య తదితరులు పాల్గొన్నారు.మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం అంబేడ్కర్నగర్కు చెందిన భర్తకి శోభన్బాబు(52) బైక్పై నాగన్పల్లి నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆక్టోపస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రామైంది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శోభన్బాబు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ మృతి -
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన
శంకర్పల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోకిల సీఐ వీరబాబు అన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఠాణాలో ప్రైవేటు పాఠశాల రవాణా ఇన్చార్జీలతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి నిత్యం బస్సులు నడిపేందుకు వచ్చే డ్రైవర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, అదే విధంగా బస్సులను ఎప్పటికప్పుడూ తనిఖీ చేయిస్తూ ఉండాలన్నారు. డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు కోటేశ్వర్రావు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదం జరగకముందే స్పందించండి
షాద్నగర్రూరల్: పట్టణంలోని చౌరస్తాలో రోడ్డు ప్రమాదాల బారినపడి మృతి చెందిన వారికి శనివారం ప్రజా సంఘాలు, బీసీసేన ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ముఖ్యకూడలిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. షాద్నగర్ మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయని.. పట్టణంలోని ముఖ్యకూడలి ఇరుకుగా ఉండటంతో ద్విచక్రవాహనదారులు భారీ వాహనాల చక్రాల కింద పడి మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. ముఖ్యకూడలిలో ఇప్పటి వరకు 62 మంది మృతి చెందగా 103 మంది గాయాలపాలయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికే వారి కుటుంబాలకు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయని మరో ప్రమాదం జరగకముందే ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్.రాము, చంద్రశేఖరప్ప, వెంకటేష్, స్రవంతిరాజ్, నర్సింలు, రాములు, రవికుమార్గౌడ్, టీజీ.శ్రీనివాస్, అర్జునప్ప, రవీంద్రనాఽథ్, తిరుమలయ్య, నర్సింలు, రాము తదితరులు పాల్గొన్నారు. -
సైనిక్ ఫలితాల్లో రేయాన్ ప్రభంజనం
నాగోలు: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఫలితాల్లో రేయాన్ సైనిక్ స్కూల్ విద్యార్ధులు ప్రభంజనం సృష్టించారు. తెలంగాణలో నెంబర్–1 ర్యాంక్తో పాటు 3వ ర్యాంక్ సాధించినట్లు కోచింగ్ సెంటర్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. శనివారం నాగోలు రేయాన్ కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా రేయాన్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ లో 9, 6వ తరగతి పరీక్ష ఫలితాల్లో దేవాన్ష్ ఆరవ్, 3వ ర్యాంకుతో పాటు మ్యాథ్స్లో 150/150, ఐటీలో 50/50 సాధించారు. 9 మంది విద్యార్థులు మ్యాథ్స్ లో 150/150, ఐటీలో 50/50 మార్కులు సాధించారన్నారు. మార్కులు సాధించిన వారిలో బాల వర్షిత్ రెడ్డి, రంజిత్ సాయి, జ్ఞాన వీర్ రెడ్డి, కంసికర్, సాయి సజన్, సాయి చరణ్ రెడ్డి, దీక్షిత్ , సోహన్ రెడ్డి, కే. దేవాన్ష్ ఉన్నారు. 63 మంది విద్యార్థుళు 250కి పైగా మార్కులు సాధించారన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందించారు. వేలాదిమంది పిల్లలను ఉన్నత శిఖరాలను చేరేందుకు రేయాన్ సైనిక్ నవోదయ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ కల్పిస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఉమా రెడ్డి అన్నారు. -
రాహుల్ పర్యటనకు పటిష్ట భద్రత
● ఎస్పీ స్నేహ మెహ్ర ● అప్రమత్తంగా ఉండాలని ఆదేశం అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హాజరుకానుండటంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వీవీఐపీల పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బందోబస్తుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను వివరించారు. హెలిప్యాడ్ వద్ద భద్రత, కాన్వాయ్ ప్రయాణించే రూట్ మ్యాప్, సభా ప్రాంగణం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. పర్యటన సాగే మార్గాల్లో ముందస్తుగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పర్యటన ప్రశాంతంగా ముగిసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బీ రాములు నాయక్, డీఎస్పీలు శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాసులు, జానయ్య, వీరేష్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో.. పట్టణంలోని మైదానంలో వారాంతపు పరేడ్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు ఒకరితో ఒకరికి సమన్వయం పెరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. భద్రత ఏర్పాట్లు పరిశీలన జిల్లా కేంద్రం వికారాబాద్లో సోమవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ స్నేహమెహ్ర, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి భద్రత ఏర్పాట్లన పరిశీలించారు. హెలిపాడ్ ప్రాంతం, రూట్మ్యాప్, అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ను సందర్శించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. -
ఆదరణ కోల్పోతున్న జాతీయ పార్టీలు
మహేశ్వరం: బీజేపీ గ్రాప్ రోజురోజుకూ పడిపోయి బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామానికి చెందిన బీజేపీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి కరన్కోట్ నందీశ్వర్, శ్రీవేంకటేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు కరన్కోట్ మల్లికార్జున్, వార్డు సభ్యులు వర్కల సుధాకర్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. సిద్ధాంతాలు, ధర్మం, న్యాయం కోసం కోట్లాడే పార్టీల నాయకుల మనుగడ ప్రశ్నార్థాకంగా మారిందన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ఇదివరకు గెలుపొందిన 10 సర్పంచ్ స్థానాల నుంచి 5 స్థానాలకు పడిపోయిందన్నారు. గ్రామ పంచాయతీ బీజేపీ యువతను హిందూ–ముస్లిం మతాల పేరుతో రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించి చలిమంటలు కాచుకుంటుందన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు కై వసం చేసుకుంటుదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్రెడ్డిని కలిశారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, నాయకులు చంద్రయ్య, రాయప్ప, అశోక్, సర్పంచ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
దారి తప్పిన చిన్నారి.. అరగంటలో తల్లి ఒడికి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆడుకుంటూ దారితప్పిన ఓ చిన్నారి అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నంలో కలకలం రేపింది. స్థానిక యువకుల చొరవ, పోలీసుల సహకారంతో బాలిక అరగంటలోనే తల్లి ఒడికి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, రావుట్ల గ్రామానికి చెందిన అంజలి, రాజు దంపతులకు ఏడేళ్ల కూతురు ఆధ్య ఉంది. ఇబ్రహీంపట్నం హాస్టల్లో ఉంటున్న తన చెల్లిని చూసేందుకు శుక్రవారం అంజలి కూతురుతో కలిసి వచ్చింది. చెల్లితో మాట్లాడుతుండగా ఆధ్య ఆడుకుంటూ బయటకు వెళ్లింది. కొద్ది దూరం రోడ్డుపై నడిచి వెళ్లిన చిన్నారి, ఆతర్వాత అయోమయానికి గురైంది. ఇది గమనించిన పలువురు స్థానికులు, యువకులు వివరాలు అడగగా సమాధానం చెప్పలేకపోయింది. దీంతో చిన్నారిని పోలీసులకు అప్పగించారు. ఆధ్యను వెతుకుతూ ఆందోళనకు గురైన అంజలి పీఎస్ను ఆశ్రయించింది. ఆమె వివరాలు చెబుతుండగానే పోలీసులు పాపను తీసుకుని స్టేషన్కు చేరుకున్నారు. చిన్నారిని చూసిన తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ఎస్ఐ సుమలత, ఏఎస్ఐ సతీష్తో పాటు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు చెప్పింది. -
ప్రజా మన్ననలు పొందాలి
● పాలకులు చిత్త శుద్ధితో పని చేయాలి ● నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ● షాద్నగర్ మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం షాద్నగర్: నూతనంగా ఎన్నికై న మున్సిపల్ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేసి, ప్రజల మన్ననలు పొందాలని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి నూతన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. కష్టపడి పని చేసేవారికి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ బాబర్ఖాన్, రఘునాయక్, శ్రీకాంత్రెడ్డి, బాల్రాజ్గౌడ్, జంగ నర్సింహ్మ, రవికుమార్గుప్త తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రదర్శనలు
కడ్తాల్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయని లయన్స్క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక మేళాను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే కొత్త ఆలోచనలపై దృష్టి సారించి, సాంకేతిక రంగంలో ఎదగాలని అకాంక్షించారు. ప్రకృతిలో ఉన్న ఎన్నో విషయాలను సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన 195 వైజ్ఞానిక ప్రదర్శనలను వివిధ పాఠశాలల విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సువర్ణగోవర్ధన్రెడ్డి, ప్రిన్సిపాల్ జైసన్, లయన్స్ క్లబ్ కేబినెట్ కార్యదర్శి అంజయ్య, లయన్స్క్లబ్ మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, క్లబ్ కార్యదర్శి గంప శ్రీను, మాజీ సర్పంచ్ ఎల్ఎన్రెడ్డి, నాయకులు కడారి రామకృష్ణ, జహంగీర్బాబా తదితరులు ఉన్నారు.లయన్స్క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్కుమార్రెడ్డి -
వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బీఎల్ఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్కు చెందిన మోస్టకిమ్ ఆలం(43) బతుకుదెరువు నిమిత్తం మామిడిపల్లికి వలస వచ్చాడు. ఈ నెల 24వ తేదీన రాత్రి తోటి కార్మికులతో కలిసి మద్యం తాగిన అతడు కిరాణ దుకాణానికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి, ఎంతకి తిరిగి రాలేదు. ఈ విషయమై తోటి కార్మికుడు అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. కేంద్రం నిధులతోనే అభివృద్ధి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్కుమార్ తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం దుగ్గాపూర్లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రతి గ్రామానికీ సీసీరోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు రాము, రాంసాగర్ పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో టిప్పర్ దగ్ధం
చేవెళ్ల: షార్ట్ సర్క్యూట్ కారణంగా టిప్పర్ క్యాబిన్లో అకస్మాత్తుగా అంటుకున్న మంటలతో ముందు భాగం పూర్తిగా కాలిపోయిన సంఘటన షాబాద్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్ నుంచి షాబాద్ వైపు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ షాబాద్ మండలంలోని అంతారం గేట్ వద్దకు రాగానే క్యాబిన్లో షార్టు సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై టిప్పర్ని రోడ్డు పక్కకు ఆపి కిందికి దిగిపోయాడు. మంటలు ఒక్కసారి గా పెద్ద ఎత్తున వ్యాపించి లారీ ము ందు భాగం క్యాబిన్ దగ్ధమైంది. వెంటనే స్థానికులు ఫైర్ ఇంజిన్, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికే లారీ ముందు భాగం టైర్లతో సహా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాసేవకు అంకితమవ్వండి అడిషనల్ కలెక్టర్ సుధీర్బాబు కొడంగల్: సర్పంచులు ప్రజాసేవకు అంకితమవ్వాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్బాబు అన్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలు తెలుసుకోవాలన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. సర్పంచ్ పదవికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఆ గ్రామానికి ఆయనే మొదటి పౌరుడని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మాస్టర్ ట్రైనర్స్ వినయ్కుమార్, రాములు, డీఎల్పీఓ సంధ్య, ఎంపీడీఓలు ఉషశ్రీ, వెంకన్న గౌడ్, జైపాల్రెడ్డి, శ్రీనివాస్ ఎంపీఓలు సుందర్, యాదగిరి, దయానంద్, అంజిరెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కందుకూరు: కులం, మతం, డబ్బుతో రాజకీయం చేయని పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ తరఫున సర్పంచ్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులుగా గెలిచిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులతోనే ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు బాష, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుయాదవ్, కడారి జంగయ్యయాదవ్, అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, జిల్లా కార్యదర్శి తేరటి లక్ష్మణ్ముదిరాజ్, రాష్ట్ర నాయకులు పల్లె కృష్ణగౌడ్, జిల్లా, మండల నాయకులు టి.జగదీశ్వర్రెడ్డి, అనేగౌని అశోక్గౌడ్, సాధ మల్లారెడ్డి, పి.శ్రీనివాస్గౌడ్, కొంతం జంగారెడ్డి, జిట్టా రాజేందర్రెడ్డి, ఎ.బాబురావు, పి.భిక్షపతి, గౌర ప్రభాకర్, అమరేందర్రెడ్డి, చిలకల రఘునందన్, దేశం సత్తిరెడ్డి, బి.మల్లేష్, ఎ.పాండు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణానికి చెందిన 78 మందికి కల్యాణలక్ష్మి, 31మందికి షాదీముబారక్, 23మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ సుధాకర్రెడ్డి, కమిషనర్ విక్రంసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, తహసీల్దార్ లక్ష్మినారాయణ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. దోమ: మండలంలోని శివారెడ్డిపల్లిలో వెలసిన రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, మాజీ సర్పంచ్ నరేందర్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చెన్నయ్య, గ్రామస్తులు సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
డీసీఎంను ఢీకొట్టిన స్కూల్ బస్సు
● 16 మంది విద్యార్థులకు గాయాలు ● మోకిల శివారులో ప్రమాదం ● బస్సు నడిపిన డ్రైవర్పై కేసు నమోదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రమాదానికి గురైన పాఠశాల బస్సు శంకర్పల్లి: నలభై మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు అదుపుతప్పి ముందున్న డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16మంది విద్యార్థులకు స్వల్పగాయాలవగా, పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామ శివారులో చోటు చేసుకుంది. మోకిల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి పట్టణంలోని నారాయణ స్కూల్లో ప్రకాశ్గౌడ్ అనే వ్యక్తి బస్సు డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం ఆయన ఆరోగ్యం బాగో లేకపోవడంతో తన కు మారుడైన అఖిల్గౌడ్(20)ను విధులకు పంపించా డు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి ఆ లస్యంగా సమాచారం ఇచ్చినటు్ల్ తెలిసింది. అ యితే అఖిల్గౌడ్ శుక్రవారం ఉదయం కొండకల్, కొండకల్తండా, మోకిల తదితర ప్రాంతాల నుంచి సుమారు 40మంది విద్యార్థులను తీసుకుని శంకర్పల్లికి వస్తున్నాడు. బస్సు మోకిల గ్రామ శివారు లోని శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి ఆలయం వద్దకు స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో ముందుగా వెళ్తున్న డీసీఎం నెమ్మదించింది. అప్పటికే అతివేగం, అజాగ్రత్తగా ఉన్న డ్రైవర్ బస్సును నియంత్రించలేక డీసీఎంను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే భయాందోళనకు గురైన అఖిల్గౌడ్ తన తండ్రి ప్రకాశ్గౌడ్కు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. బస్సులోని 16మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన మరో పాఠశాల బస్సులో శంకర్పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలే కావడంతో ప్రథమ చికిత్స అందించి, ఇళ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. డీసీఎం డ్రైవర్ మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ అఖిల్గౌడ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మోకిల ఎస్ఐ కోటేశ్వర్రావు తెలిపారు. -
అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి కూల్చివేత
ఇబ్రహీంపట్నం: నిబంధనలకు విరుద్ధంగా నిర్మి స్తున్న ఓ ఇంటిని రెవెన్యూ అధికారులు శుక్రవారం నేలమట్టం చేశారు. మండలంలోని ఖానాపూర్ రెవెన్యూ పరిధిలో ఆరున్నర ఎకరాలకు పైగా గ్యాప్ ఏరియా ఉంటుంది. ఓ వెంచర్ రియల్టర్స్ ఆ గ్యాప్ ఏరియాను ప్లాట్గా చేసి విక్రయించారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారని సమాచారం అందడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నర్సింగ్యాదవ్, సువర్ణ, ట్రైనీ డీటీ శ్రీనివాస్లు సిబ్బందితో వెళ్లి ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు. గ్యాప్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. -
భద్రతా నియమాలు తప్పనిసరి
చేవెళ్ల: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న అరైవ్, అలైవ్ అవగాహన కార్యక్రమంలో డ్రైవర్లకు చేవెళ్లలో ఉచిత వైద్య పరీక్షలు, షాబాద్లో పోలీస్ సిబ్బందికి హెల్మెంట్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం పట్నం మహేందర్రెడ్డి ఆసుపత్రిలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఏసీపీ కిషన్ మాట్లాడుతూ.. డ్రైవర్లు తప్పనిసరిగా కంటి చూపును ఎప్పటికప్పుడు పరిక్షించుకోవాలని చెప్పారు. షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సీఐ కాంతారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి హెల్మెంట్లు పంపిణీ చేశారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు శంకర్పల్లి: ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. ‘అరైవ్–అలైవ్’ రెండో విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని మోకిలలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఏసీపీ మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడంతో రోజురోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. మోకిల ఎస్ఐలు కోటేశ్వర్ రావు, సాయి క్రిష్ణ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతాం
మంచాల: రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడుతామని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య స్పష్టం చేశారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అమలు చేసే విధానంలో స్పష్టత ఇవ్వాలన్నారు. పీఆర్సీ అమలు చేసిన తరువాతే ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ స్వీకరించాలని, అప్పటి వరకు ప్రభుత్వమే భరించాలన్నారు. మోడల్ స్కూల్, గురుకుల, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి సైతం హెల్త్ కార్డులు వర్తింప చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పదో తరగతి పరీక్ష విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్ల రెమ్యునరేషన్ పెంచాలని, స్పాట్లో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోట్ల కాశీరావు, పూజరి రమేష్, రాష్ట్ర మీడియా కో–కన్వీనర్ సత్తారి రాజిరెడ్డి, జిల్లా బాధ్యులు జిల్కపల్లి కరుణాకర్రెడ్డి, పట్నం కృష్ణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు రావుల శివకుమార్, దత్తాత్రేయ, చీర బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య -
ఫలితం పదిపోకుండా..
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం ● నాలుగేళ్లుగా గ్రేటర్లో నిరాశాజనక ఫలితాలు ● విద్యార్థులకు స్టడీ మెటీరియల్.. ● ప్రత్యేక దృష్టి సారించిన విద్యాశాఖ సాక్షి, సిటీబ్యూరో: మహా హైదరాబాద్ పరిధిలో పది ఫలితాల్లో వెనుకబాటుకు చెక్ పెట్టేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విద్యా సంవత్సరం ‘వంద శాతం ఉత్తీర్ణత’ లక్ష్యంగా ‘టార్గెట్.. టెన్త్’ పేరుతో విద్యాశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర గ్రామీణ జిల్లాలు ఫలితాల్లో దూసుకుపోతుంటే, అత్యాధునిక వసతులున్న నగర పరిధిలోని జిల్లాలు మాత్రం వెనుకబడి ఉండటంపై ఆయా యంత్రాంగాలు సీరియస్గా తీసుకున్నాయి. మూడు విభాగాలుగా.. పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధన కోసం విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా వారిని మూడు విభాగాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. పాస్ మార్కులు సాధించడంలో ఇబ్బంది పడే వెనుకబడిన విద్యార్థులకకు కనీస అభ్యసన సామగ్రితో పాటు శిక్షణ, సగటు మార్కులతో ఉత్తీర్ణులయ్యే వారిని పై తరగతికి చేర్చేలా ప్రోత్సాహం, ప్రతిభావంతులైన విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించేలా ఉన్నత స్థాయి ప్రశ్నపత్రాలతో సాధనకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళ్లలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాల విశ్లేషణ, నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తోంది. జిల్లా 2025 2024 2023 2022 హైదరాబాద్ 88.53 86.76 80.92 79.63 రంగారెడ్డి 87.84 91.01 87.35 90.04 మేడ్చల్–మల్కాజిగిరి 90.76 89.61 90.72 86.31 గత ఏడాది ఇలా.. మహా హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు పదో తరగతిలో నాలుగేళ్ల నుంచి వెనుకబాటు తప్పడం లేదు. గతేడాది రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ 30 వ స్థానం, మేడ్చల్–మల్కాజిగిరి 28 వ, రంగారెడ్డి జిల్లా 31వ స్థానానికి దిగజారాయి. -
అడ్డదారిలో.. వ్యాపారులు!
ప్రస్తుత జనాభా అవసరాలకు.. క్షేత్రస్థాయిలో లభిస్తున్న పాలకు మధ్య పొంతన ఉండడం లేదు. డిమాండ్కు, సరఫరాకు మధ్య వ్యత్యాసం ఉండడంతో పలువురు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పసిపిల్లలు తాగే పాలను కల్తీ చేస్తున్నారు. తాజాగా కడ్తాల్ మండలం రావిచేడుకు చెందిన ఓ పాల వ్యాపారి కల్తీపాలను తయారు చేస్తూ పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎప్పటికప్పుడు డెయిరీల్లో తనిఖీలు నిర్వహించి, పాల నాణ్యతను పరిశీలించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నకి‘లీల’ కు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సాక్షి, రంగారెడ్డిజిల్లా: పాల దిగుబడి క్రమంగా తగ్గిపోతోంది. అధిక సంపాదనే లక్ష్యంగా కొంతమంది డెయిరీ వ్యాపారులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. కొంతమంది పరిమితికి మించి కుళాయి నీళ్లు కలుపుతుంటే.. మరికొంత మంది ఏకంగా కృత్రిమ పాలను తయారు చేసి గుట్టుగా మార్కెట్కు తరలిస్తున్నారు. కడ్తాల్, ఆమనగల్లు, కాటేదాన్, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ముచ్చింతల్, పసుమాముల, నాదర్గుల్ తదితర ప్రాంతాల్లో కల్తీపాల దందా జోరుగా సాగుతోంది. మూతపడిన పరిశ్రమలను ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లకు తీసిపోని విధంగా ప్యాకెట్లను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. అధిక దిగుబడి కోసం ఆక్సిటోసిన్ ప్రస్తుతం రైతుల భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. డెయిరీల నిర్వహణ భారంగా మారింది. కూలీలు, పశువుల మేత, దాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. దీంతో చాలా మంది రైతులు పాల డెయిరీలకు దూరమయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన పాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కొందరు అధిక పాల దిగుబడి కోసం తమ గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ప్రమాదకరమైన బీర్దాణాను తాగిస్తున్నారు. ప్రత్యక్షంగా తమ పశువుల ఆయుఃప్రమాణాన్ని తగ్గించడంతో పాటు పరోక్షంగా పాలను తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. కుళాయి నీళ్లు.. పామాయిల్తో కలుషితం సహజంగా గేదె, ఆవు పాలల్లో ఐదు నుంచి ఏడు శాతం వెన్న ఉంటుంది. వీటికి ఆయా డెయిరీలు రైతులకు లీటరుకు రూ.35 నుంచి రూ.40 వరకు చెల్లిస్తుంటాయి. డెయిరీలు చెల్లించే ధరలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో కొంతమంది స్వయం ఉపాధి కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో డబ్బా వాళా అవతారం ఎత్తుతున్నారు. డెయిరీలు సరఫరా చేసే ప్యాకేజ్డ్ పాలతో పోలిస్తే వ్యక్తిగత డెయిరీల నిర్వాహకులు సరఫరా చేసే స్వచ్ఛమైన పాలలో వెన్నశాతం అధికంగా ఉండటంతో చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు. ప్యాక్డ్ ధరతో పోలిస్తే వీరు సరఫరా చేసే పాల ధరే ఎక్కువే అయినప్పటికీ.. తమ పిల్లలకు స్వచ్ఛమైన గేదె, ఆవు పాలు పట్టించాలనే ఉద్దేశంతో చాలామంది వీరిని ఆశ్రయిస్తున్నారు. ప్రజల్లో ఉన్న బలహీనతను కొంత మంది వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పాలలో వెన్నశాతాన్ని పెంచేందుకు అక్రమ మార్గం పడుతున్నారు. రెండు లీటర్ల పాలను తీసుకుని అందులో కొంత యూరియా, పామాయిల్ కలుపుతూ కల్తీ చేస్తున్నారు. ప్రమాదకరమైన కృత్రిమ పాలతో పాటు కలుషిత నీరు, ఈకొలి, కోలిఫాం వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో కూడిన పాలను తాగి చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటిగ్రేడ్ల వద్ద గడ్డకడతాయి. ఈ ఉష్ణోగ్రత మారిందంటే అందులో నీరు కలిసిందని అర్థం. లాక్టోమీటర్ పరికరంలో పాలు పోయగానే అందులో కొవ్వు కాకుండా ఇతర ఘనపదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) ఎంత శాతం ఉందో తెలిసిపోతుంది. పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరితో ఏర్పడే ఘనపు రేణువులు స్పటికాల రూపంలో ఘనీభవిస్తే అందులో యూరియా కల్తీ చేసినట్లు భావించొచ్చు. స్వచ్ఛమైన పాలు బండపైపోస్తే అవి ప్రవహించినంత దూరం తెల్లటి ధార కనిపిస్తుంది. అరచేతిని వెనుక వైపు తిప్పి..మరో చేత్తో కొన్ని చుక్కల పాలను దానిపై పోస్తే నాణ్యమైన పాలైతే సన్నటి ధారలా ప్రవహిస్తుంది. నీళ్లు కలిపినవైతే ధార ఏర్పడకుండా చివర్లో తెల్లటి చుక్క నిలిచిపోతోంది. వేడి చేసినప్పుడు పాలపై పసుపు పచ్చగా మీగడ రూపంలో పేరుకుపోవడం, తోడు వేసినప్పటికీ పెరుగు కాకపోవడం, వంటి లక్షణాలు కన్పిస్తే ఆ పాలలో వనస్పతి ఆయిల్ కలిసినట్లు గుర్తు. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పెరాకై ్సడ్ కలుపుతున్నారు. వీటిని కాగబెట్టి తోడు వేస్తే తర్వాత పెరుగుగా మారకపోగా నీళ్ల రూపంలో కనిపిస్తుంది. దీన్ని యూరియాసే స్ట్రిప్స్ ద్వారా నాణ్యతను గుర్తించొచ్చు. ధనార్జనే ధ్యేయంగా కల్తీమయం మార్కెట్లో యథేచ్ఛగా విక్రయం అనారోగ్యం పాలిట జనం పట్టించుకోని అధికారగణం -
బదిలీ కుదుపు
గ్రేటర్లో తరచూ స్థాన చలనం● పాలనపై తీవ్ర ప్రభావం ● పరిస్థితి గందరగోళం ● ఉలిక్కిపడ్డ ట్రైసిటీ.. గ్రేటర్ జిల్లాలు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా టీ క్యూర్ (కోర్సిటీ అర్బన్ రీజియన్ వరకు), రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పలువురు అధికారులకు స్థానచలనం జరిగింది. గురువారం ఉదయమే వెలుగులోకి వచ్చిన ఈ బదిలీలు అధికార వర్గాల్లో ఓ కుదుపు కుదిపాయి. ఆయా స్థానాల్లో బాధ్యతలు చేపట్టి నెలలు కూడా పూర్తికాని వారు బదిలీల జాబితాలో ఉన్నారు. దీంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకే సమయంలో భారీ సంఖ్యలో ఐఏఎస్ల బదిలీలు, అందులోనూ అనతికాలంలోనే జరిగిన బదిలీలతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, టీ క్యూర్ మూడు కార్పొరేషన్ల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొనగా.. తరచూ ఉన్నతాధికారుల బదిలీలతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతోంది. ముగ్గురు జోనల్ కమిషనర్ల మార్పు ● టీ క్యూర్లోని ట్రైసిటీ పరిధిలో ముగ్గురు జోనల్ కమిషనర్లు మారారు. ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఇద్దరు జోనల్ కమిషనర్లను మార్చి వారి స్థానాల్లో ఇతరులను నియమించారు. అంతర్గత బదిలీల్లో భాగంగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ను తప్పించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా ఉన్న అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో మందా మకరందుకు పోస్టింగ్ ఇచ్చారు. ● సైబరాబాద్ మున్సిపల్ కార్పొషన్ (సీఎంసీ)లోని కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ సందీప్కుమార్ ఝా స్థానే పర్మార్ పింకేశ్కుమార్ లలిత్కుమార్ను నియమించారు. ● జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కార్పొరేషన్లో యూసీడీ, స్పోర్ట్స్ విభాగాల అడిషనల్ కమిషనర్ కె.అలివేలు మంగతాయారును సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా బదిలీ చేశారు. ● సికింద్రాబాద్ జోనల్ కమిషనర్తో పాటు పారిశుద్ధ్య విభాగం అడిషనల్ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన్. రవికిరణ్ను పారిశుద్ధ్యం విభాగం రెగ్యులర్ అడిషనల్ కమిషనర్గా నియమించారు. ● రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా ఉన్న అనురాగ్ జయంతి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్తో పాటు రెవెన్యూ, ఐటీ, ప్రకటనల విభాగాల అడిషనల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆయన బదిలీతో ఈ విభాగాలకు మళ్లీ కొత్తవారిని నియమించాల్సి ఉంది. ● హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా శివేంద్రప్రతాప్ బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్ నియమితులయ్యారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీగా జితేష్ వి పాటిల్ నియమితులయ్యారు. కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూఖీ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా అదనపు (లోకల్ బాడీసీ) కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టర్గా పదోన్నతిపై వెళ్లారు. కుమురంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్గా పని చేసిన దీపక్ తివారి వికారాబాద్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. -
కరివేపాకు సెంచరీ
గౌలిపురా: కరివేపాకు దూకుడు మీదుంది. నగర మార్కెట్లలో కిలో కరివేపాకు రూ.100–120 వరకు పలుకుతోంది. చిన్న కట్ట కావాలన్నా రూ.10 పెట్టాల్సిందే. రెండు నెలల క్రితం కిలో ధర రూ.50–60 ఉండగా.. ప్రస్తుతం రెండింతలైంది. చలి కారణంగా ఆకులు రాలిపోవడంతో నగరానికి దిగుమతి భారీగా తగ్గిపోయింది. అరకొరగా వచ్చే దిగుమతులతో ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్, మాదన్నపేట్, బోయిన్పల్లి, మీరాలంమండి, శంషాబాద్ తదితర హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.80–100 వరకు పలుకుతుండగా.. వారాంతపు సంతలు, ఇతర లోకల్ మార్కెట్లలో కిలో రూ.100–120 ధర పలుకుతోంది. మరో నెల రోజుల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
నాణ్యమైన విద్యను అందించాలి
మంచాల: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శివరతన్ ఆర్టీయస్ అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్, ఆటస్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా నూతన ఆవి ష్కరణలకు కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ప్రయోగశాలల వినియోగంలో తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఒకేషనల్ కోర్సుల్లో ప్రోత్సహించి హైస్కూల్ స్థాయిలోనే ఉపాధి కల్పనకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. ఇక్కడి పాఠశాలలో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఆట స్థలం, గ్రంథాలయం బాగున్నాయన్నారు. కార్యక్ర మంలో జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, రాష్ట్ర మానిటరింగ్ అధికారి నెల్సన్, రాష్ట్ర వయోజన విద్యా డైరెక్టర్ జయ చంద్రారెడ్డి, ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరధర్గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ముహూర్తం ఖరారు
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వెయ్యి పడకల సామర్థ్యమున్న సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. వచ్చే నెల 19న దీనిని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఓపీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ వార్డులు, టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధమవుతున్నాయి. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని 3 నెలల డిప్యుటేషన్పై నియమించారు. గాంధీ, ఉస్మానియా, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 40 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది రోజు నుంచి వైద్య సేవలు షురూ కానున్నాయి. గాంధీ, ఉస్మానియాలకు ఉపశమనం సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వెయ్యి పడకల సామర్థ్యం, అత్యాధునిక శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉగాది నుంచి టిమ్స్లో మొదలవుతున్నాయి. నిత్యం నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల ఓపీ ఉంటోంది. రోగుల తాకిడితో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వైద్య సేవల్లో నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని అభిప్రాయం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మెరుగైన వైద్య సేవలందించే అవకాశం ఉంటుంది. గుండె చికిత్సలు సులువు సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్సలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ కోసం క్యాత్ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్యేకంగా రూపొందించిన 16 ఆపరేషన్ థియేటర్లు, సీటీస్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే, ఇతర అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రారంభం నాటికి 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సనత్నగర్ టిమ్స్ 19న ప్రారంభం ఆ రోజు నుంచే ఓపీ, ఐపీ, ఓటీ సేవలు డిప్యుటేషన్పై 40 మంది సిబ్బంది -
అనుమానం రాకుండా మైనర్ల వినియోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రా–ఒడిశా బోర్డర్ సహా ఒడిస్సాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి ఉత్పత్తి చేసి, నగరానికి సరఫరా చేసే ముఠాలు తెలివి మీరుతున్నాయి. ఈ రవాణాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మైనర్లను క్యారియర్లుగా వినియోగిస్తున్నాయి. చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ముఠాతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ఏడుగురిని అరెస్టు చేయగా వీరిలో ముగ్గురు బాలురు ఉన్నారని అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ప్రకటించారు. వీరి నుంచి రూ.16 లక్షల విలువైన 23 కేజీల గంజాయి, వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్గిరికి చెందిన కిషోర్ తక్రి అక్కడ గంజాయి పండించే వారి నుంచి సరుకు సేకరించి నగరానికి అక్రమ రవాణా చేసి విక్రయిస్తుంటాడు. రెండు మూడేళ్లుగా ఈ దందా చేస్తున్న ఇతడిని 2024, 2025ల్లో ఒడిశాలోని మోటు పోలీసులు పట్టుకున్నారు. గంజాయి ప్యాకెట్లు తీసుకువస్తుండగా అనుమానించిన అధికారులు తనిఖీ చేసి అరెస్టు చేశారు. దీంతో పోలీసులు అనుమానించని పంథాలో సరుకు రవాణా చేయాలని ఇతగాడు నిర్ణయించుకున్నాడు. దీనికోసం మల్కాన్గిరితో పాటు కోరాపుట్కు చెందిన మైనర్లను ఎంచుకున్నాడు. వీరిని ఒక్కో ట్రిప్నకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. రెండుమూడు రోజులు సాగే ఈ ప్రయాణంలో వారికి అయ్యే ఖర్చంతా కిషోరే భరిస్తాడు. తాను అప్పగించిన గంజాయి నింపిన బ్యాగ్స్ లేదా బాక్సుల్ని హైదరాబాద్ వరకు తీసుకువచ్చి అప్పగించడమే వీరి పని. బస్సు, రైళ్లల్లో వీరితో కలిసే, కొద్దిదూరంలో ఉంటూ ప్రయాణించే ఇతడు పోలీసులకు అనుమానం రాకుండా చూసుకుంటున్నాడు. ఒడిశాకు చెందిన ఇంద్ర మాది, సంజయ్ వద్ద కిలో గంజాయి రూ.4 వేలకు ఖరీదు చేస్తున్న కిషోర్ దాన్ని ధూల్పేట్కు చెందిన శంకర్ సింగ్కు రూ.ఏడు వేలు చొప్పున విక్రయిస్తున్నాడు. గతంలో కొన్నిసార్లు ఇలానే ఖరీదు చేసిన శంకర్ ఆ సరుకును స్థానికంగా ఉన్న పెడ్లర్స్కు మరింత రేటుకు విక్రయిస్తున్నాడు. తాజాగా ధూల్పేట్కు చెందిన వినయ్ సింగ్ తనకు 23 కేజీలు కావాలంటూ శంకర్కు చెప్పాడు. దీంతో ఫోన్ పే ద్వారా రూ.1.40 లక్షలు కిషోర్కు చెల్లించి ఆర్డర్ ఇచ్చాడు. కిషోర్ ఈ గంజాయిని అక్కడే ఉండే బలరాం నుంచి ఖరీదు చేసి 11 ప్యాకెట్లుగా పార్శిల్ చేశాడు. దీన్ని బంధువులైన మహిళలు పన్మతి తక్రి, లక్ష్మి తక్రిలతో పాటు ముగ్గురు మైనర్లకు అప్పగించాడు. వీరిని ఓ కుటుంబం మారిదిగా పేర్కొంటూ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సరుకు తీసుకోవడానికి శంకర్ ఎంజీబీఎస్ సమీపంలోకి వచ్చాడు. ఈ దందాపై చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు కె.రామారావు, ఎం.మహేష్, ఎం.మధు, కె.స్వామి, కానిస్టేబుల్ హరీష్ కుమార్ వలపన్ని ఏడుగురినీ పట్టుకున్నారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న సరుకునూ తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. వీరి విచారణలో వినయ్ సింగ్ పేరు వెలుగులోకి రావడంతో అతడి కోసం గాలిస్తున్నారు. వెలుగులోకి గంజాయిస్మగ్లర్ల కొత్త ఎత్తులు ప్యాకెట్లు మోసేందుకు బాలుర వినియోగం రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లింపు ఏడుగురిని అరెస్టు చేసిన చార్మినార్ టాస్క్ఫోర్స్ -
ఓటుదొడుకులు
ఖాతా తెరవని ‘కారు’ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఓట్లలో వ్యత్యాసం వస్తుంది.. ఇది అభ్యర్థులతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుంది. పాలన, హామీల అమలు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని ఓటర్లు తమ ప్రయోజనాలను కాపాడే పార్టీల వైపు మొగ్గు చూపుతారు. జిల్లాలో మూడు ప్రధాన పార్టీలు ఓటింగ్ విషయంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. వికారాబాద్: గడిచిన రెండేళ్లలో పార్టీ గుర్తులపై మూడు ఎన్నికలు జరగ్గా ఓటింగ్ సరళి, ఆయా ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2023 చివరలో ప్రారంభమై ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వరకు తొలుత అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు, తాజాగా మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా నిర్వహించారు. పార్టీ గుర్తులపై నిర్వహించిన మూడు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మాత్రమే తన ఓటు బ్యాంక్ను కాపాడుకుంది. బీజేపీ, బీఆర్ఎస్లు ఓటింగ్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ తారాజువ్వను తలపిస్తూ దూసుకుపోగా మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోరాట పఠిమను కనబర్చగా పార్లమెంట్ ఎన్నికల్లో చేతులెత్తేశారు. కమలం.. పది శాతానికే పరిమితం గడిచిన రెండేళ్లలో బీజేపీ ఓటింగ్ ఒడిదుడుకులకు తీవ్రంగా లోనైనట్టు ఆయా ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఓట్లను పరిశీలిస్తే తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో తారాజువ్వలా దూసుకుపోయిన ఆ పార్టీ ఓటింగ్ అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో చతికిల పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో సుమారు 33 శాతం ఓట్లు ఆ పార్టీ సాధించింది. 6,77,329 ఓట్లు పోలవగా కమలం పార్టీకి 2,11,311 ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో తాండూరు, పరిగిలో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు సాధించగా, కొడంగల్, వికారాబాద్లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో 7,39,414 ఓట్లు పోలవగా కాషాయ పార్టీ 31,800 ఓట్లతో ఐదు శాతానికి పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల్లో కాస్త కోలుకున్నప్పటికీ పదిశాతం దాటలేకపోయింది. నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 1,22,359 ఓట్లు పోలవగా ఇందులో బీజేపీకి 12,091 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అధికార కాంగ్రెస్ మాత్రం రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని వరుస విజయాలు నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలో బరిలోకి దిగిన కాంగ్రెస్ జిల్లాలో పూర్తిస్థాయి ఆధిక్యతను కనబరిచింది. నాలుగు నియోజకవర్గాల్లో 7,39,414 ఓట్లు పోలవగా 3,76,752 అంటే 52 శాతానికి పైగా ఓట్లు సాధించిన హస్తం నాలుగు నియోజకవర్గాల్లో విజయ బావుటా ఎగురవేసింది. పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ తగ్గినా ఆధిపత్యాన్ని కనబరిచింది. పరిగి, తాండూరులో బీజేపీకి మెజార్టీ రాగా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక మెజార్టీ సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ తన ఆదిపత్యాన్ని నిలుపుకొంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 1,22,359 ఓట్లు పోలవగా ఆ పార్టీ 51,899 ఓట్లు సాధించి నాలుగు మున్సిపాలిటీల్లో పాగా వేసింది. నిలకడ ప్రదర్శించలేకపోతున్న ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా .. అసెంబ్లీ, మున్సిపల్ పోరులో చతికిల పార్లమెంట్ ఎలక్షన్లో పాతాళానికి పడిన బీఆర్ఎస్.. అసెంబ్లీ, పురపోరులో మెరుగైన ప్రదర్శన నిలకడగా అధికార పార్టీ మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలు, అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ ఆ పార్టీ పోరాఠ పఠిమను కనబరిచింది. అధికార కాంగ్రెస్కు గట్టి పోటీనే ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఆ పార్టీ పది శాతం ఓట్లు కూడా సాధించలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవరగాల్లో కలిపి 6,77,329 ఓట్లు పోలవగా కారకు గుర్తుకు 63,993 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7,39,414 ఓట్లలో 3,01,010 ఓట్లు అంటే 40 శాతానికి పైగా ఓట్లు సాధించినప్పటికీ జిల్లా ఖాతా తెరవలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 1,22,359 ఓట్లు పోలవగా ఇందులో బీఆర్ఎస్ 42,129 ఓట్లు సాధించింది. 30 శాతానికి పైగా ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చిప్పటికీ ఒక్క మున్సిపాలిటీని దక్కించుకోలేక పోయింది. -
ముగిసిన స్పోర్ట్స్ షూటింగ్ లీడర్షిప్ కాన్క్లేవ్
బంజారాహిల్స్: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్ఏ) ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా నిర్వహించిన స్పోర్ట్స్ షూటింగ్ లీడర్షిప్ కాన్క్లేవ్–2026 విజయవంతంగా ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని టీఆర్ఏ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మాజీ ఎంపీ, క్రీడా సలహాదారు జితేందర్రెడ్డి మాట్లాడుతూ... 2032 నాటికి తెలంగాణ నుంచి కనీసం 2–3 ఒలింపియన్లు తయారుచేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కాలికేష్ నారాయణ్సింగ్ మాట్లాడుతూ... మౌలిక వసతుల మెరుగుదల, శాసీ్త్రయ కోచింగ్, ఏఐ ఆధారిత విశ్లేషణపై దృష్టి పెట్టాలని సూచించారు. టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్ సంఘి మట్లాడుతూ.. షూటింగ్ క్రీడ ప్రశాంతంగా కనిపించినా అత్యధిక ఒత్తిడి, క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమయ్యే క్రీడ అని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్, ఎండీ సోనిబాలదేవి తదితర ప్రముఖులు హాజరయ్యారు. బాధ్యతల స్వీకరణ రాజేంద్రనగర్: జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోన్ జోనల్ కమిషనర్గా గురువారం మంద మకరంద బాధ్యతలు స్వీకరించారు. రాజేంద్రనగర్లోని జోనల్ కార్యాలయంలో ఆయనకు రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్ల ఉప కమిషనర్లతో పాటు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ పని చేసిన అనురాగ్ జయంతిని ప్రభుత్వం యాదాద్రి కలెక్టర్గా బదిలీ చేసింది. సీఎంఆర్ఓ సీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్గా పని చేస్తున్న మంద మకరందను రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించి అధికారులతో సమావేశమయ్యారు. -
ఎన్ఎంఎంఎస్లో విద్యార్థుల సత్తా
మంచాల: నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పథకానికి విద్యార్థులు ఎంపిక కావడం గర్వంగా ఉందని మండలంలోని ఆరుట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియ అన్నారు. మంచాల మండలంలో ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో ఆరుట్ల మోడల్ స్కూల్లోనే నలుగురు విద్యార్థులున్నారు. ఈ మేరకు గురువారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియ స్కాలర్ షిప్ పథకానికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి రూ.12వేల ఉపకార వేతనం వస్తుందన్నారు. ఆరుట్ల మోడల్ స్కూల్లో ఆందోజ్ అక్షయ్, ఉత్తరపల్లి లోకేశ్, దొడ్డి గణేష్, రత్నావత్ దత్త ఈ స్కాలర్ షిప్లు సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో..
వ్యక్తి బలవన్మరణం చేవెళ్ల: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధి తిమ్మారెడ్డిగూడలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దూరి సత్తయ్య(46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఆయనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వాటా కావాలంటూ ఆయన అక్కలు కేసు వేయడంతో కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. తన సోదరీమణులతో మాట్లాడి కొంత భూమి ఇచ్చేందుకు అంగీకరించాడు. కాగా ఆ భూమిలో కబ్జా ఇవ్వాలని కోరారు. దీంతో ఆయన భూమి తగాదాలో ఉందని.. సరిచేసి ఇస్తానని చెప్పాడు. ఉదయం ఇదే విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్థాపం చెందిన సత్తయ్య ఇంటికి వెళ్లిపోయాడు. 11గంటల సమయంలో భోజనానికి రావలంటూ భార్య ఫోన్ చేయగా వస్తానని చెప్పి రాలేదు. పొలం వద్ద ఉన్న చెట్టుకు డ్రిప్ పైపులతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం అటుగా వెళ్లిన మేకల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సావిత్రి, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈనెల 27, 28న విధులకు ఎందుకు రాలేదు!
బషీరాబాద్: ఈ నెల(ఫిబ్రవరి) 27, 28 తేదీల్లో తన అనుమతి లేకుండా విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలంటూ బషీరాబాద్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎండీ షరీఫ్ ఓ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంకు రెండు రోజుల క్రితం జారీ చేసిన మెమో విమర్శలకు దారితీసింది. వివరాలు.. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న కె.శోభ ఈనెల 9 నుంచి 12 వరకు సెలవు మంజూరు చేయాలని కోరుతూ 6న కాంప్లెక్స్ హెచ్ఎం షరీష్కు దరఖాస్తు చేసుకున్నారు. సదరు అధికారి అనుమతితో సెలవుపై వెళ్లారు. తర్వాత 14 నుంచి 16 వరకు వరుస సెలవులు రావడంతో 17న కూడా సెలవును పొడిగించుకుని 18న విధులకు హాజరయ్యారు. బడికి వచ్చిన ఆమె రిజిస్టర్ చూడగా సెలవు పెట్టిన రోజులన్నీ గైర్హాజరైనట్లు షరీఫ్ రాశా రు. ఇదేమిటని ప్రశ్నించగా పొంతనలేకుండా సమాధానాలు చెబుతున్నారని శోభ ఆరోపించారు. తీరా ఈ నెల 23న ఆఫీస్ సిబ్బందితో ఓ మెమో జారీ చేశారు. అందులో తన అనుమతి లేకుండా ఈ నెల 9 నుంచి 13 వరకు, అలాగే గతేడాది ఫిబ్రవరి 20 నుంచి ఈ నెల 27 వరకు విధులకు ఎందుకు హాజరు కాలేదని మెమోలో ప్రశ్నించారు. దీంతో పాటు ఈ నెల 28న తన అనుమతి లేకుండా ఆన్డ్యూటీలో ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వీటికి రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొనడంతో విస్మయానికి గురైన సదరు హెచ్ఎం ఇంకా 27, 28 తేదీలు రాకముందే, తాను గైర్హాజరయ్యానని మెమో ఎలా జారీ చేస్తారని తోటి ఉపాధ్యాయుల వద్ద వాపోయారు. ఈ విషయం, మెమో కాపీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కాంప్లెక్స్ హెచ్ఎం షరీఫ్ను వివరణ కోరగా తాను మెమో జారీ చేశానని, అందులో తప్పులు దొర్లినందున సరిచేస్తానని చెప్పారు. హెచ్ఎంకు కాంప్లెక్స్ హెచ్ఎం మెమో జారీ -
కమనీయం.. రమణీయం
ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం ఆమనగల్లు: పట్ణంలోని వేంకటగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తొలుత స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఆలయ ధర్మకర్త గూడ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అలివేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. ఉత్సవంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు తల్లోజు గీత, పాపిశెట్టి రాము, స్థానికులు బికుమాండ్ల పాండయ్య, దేవేందర్శెట్టి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కల్కిదోన దేవాలయంలో.. తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలోని కల్కిదోన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు కృష్ణస్వామి ఆధ్వర్యంలో సర్పంచ్ వీరేశలింగం దంపతులు క్రతువును జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. -
‘రైతు భరోసా’పై జాప్యం తగదు
అబ్దుల్లాపూర్మెట్: ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం తగదని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంతం మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దఅంబర్పేట, కుంట్లూరు, పసుమాముల గ్రామాల్లో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పెద్దఅంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం కేబినేట్లో రైతు భరోసా ప్రకటన రాకపోవడంతో రైతులకు నిరాశ మిగిల్చిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం రైతు భరోసా వాయిదా వేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నల్లగొండ మీటింగ్లో రైతు భరోసా వేసేందుకు రూ.9వేల కోట్లు నిధులు సిద్ధం చేసామని.. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన తెల్లారే రైతుల ఖాతాలో నిధులు జమచేస్తామని చెప్పిన మాట మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎలాంటి శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండా, కొర్రీలు పెట్టకుండా సాగుభూములున్న రైతులకు భరోసా నిధులు తక్షణమే జమచేయాలని, లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బి.విజయ్, జి.యాదగిరి, జె.నరేందర్, ఇ.రవి, బి.అశోక్, ముత్తయ్య, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి -
పాల కేంద్రం ముసుగులో కల్తీ దందా
● ప్రమాదకర రసాయనాలతో పాల తయారీ ● వ్యాపారి అరెస్ట్ కడ్తాల్: ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యాపారి గుట్టురట్టయింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన ఆనగోని శ్రీశైలం పాలకేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాడు. వ్యాపారం ముసుగులో కొంతకాలంగా కృత్రిమంగా కల్తీపాలు తయారు చేసి ప్రైవేట్ డెయిరీలకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా బుధవారం సాయంత్రం కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ పాల తయారీకి ఉపయోగిస్తున్న 45 డ్రైడ్ టీ కాఫీ క్రీమర్ ప్యాకెట్లు, 12 సాల్డ్ ప్యాకెట్లు, లూజ్ షుగర్, ఆరు క్యాన్లు (240 లీటర్లు) కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలకు తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలు షాద్నగర్లో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కల్తీ పాలతో పాటు వాహనాన్ని సీజ్ చేసి శ్రీశైలంను స్టేషన్కు తరలించారు. పాలను ల్యాబ్కు పంపిస్తామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మహిళ అదృశ్యం
పహాడీషరీఫ్: మహిళ అదృశ్యమైన సంఘట న పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తుక్కుగూడ మంఖాల్ గ్రామానికి చెందిన బైండ్ల ఎల్లమ్మ(58) ఈ నెల 22వ తేదీన ఉస్మానియాలో చికిత్స పొందుతున్న కూతురును చూసాక, అల్లుడు సాయంత్రం తుక్కుగూడలో బైక్పై వదిలేశాడు. అక్కడి నుంచి ఇంటికి రావాల్సిన ఆమె ఎంతకీ రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై ఆమె భర్త నర్సింహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి.. కేశంపేట: విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వేములనర్వకు చెందిన శ్యామల సాయికిరణ్ తుక్కుగూడలో పనిచేస్తూ, కుటుంబంతో కలిసి నగరంలో జీవిస్తున్నాడు. ఈక్రమంలో భూముల విషయాలు మాట్లాడుకునేందుకు ఆదివారం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం తన అమ్మమ్మ గారి గ్రామమైన ఇర్విన్కు వెళ్తున్నట్లు భార్య చంద్రకళకు చెప్పాడు. అదే రోజు రాత్రి ఇర్విన్ నుంచి శ్రీశైలం వెళ్తున్నానని మళ్లీ ఫోన్ చేశాడు. అనంతరం మొబైల్ స్విచ్చాఫ్ వస్తుండటంతో బాధితురాలు బుధవారం కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలించొద్దు యాలాల ఎస్ఐ విఠల్రెడ్డి యాలాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్ఐ విఠల్రెడ్డి హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని కోకట్ గ్రామ శివారులోని కాగ్నా నది నుంచి ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలతో పాటు యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. మండల పరిధిలో ఎక్కడైన ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. కాగా బుధవారం ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డ వాహనాలను పీఎస్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోయిన పర్సు అప్పగింత కేశంపేట: మండల పరిధిలోని లేమామిడి గ్రామానికి చెందిన రాఘవేందర్చారి మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద పర్సు పోగొట్టుకున్నాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ నరహరి ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సిబ్బంది గంటల వ్యవధిలో పర్సును గుర్తించి, అతనికి అందజేశారు. అందులో రూ.4 వేలతో పాటు పలు కార్డులు ఉన్నాయని, పోలీసులు సకాలంలో స్పందించడంతోనే ఇది సాధ్యమైందని బాధితుడు సంతోషం వ్యక్తంచేశాడు. ఓఆర్ఆర్పై ప్రమాదం.. ఒకరి మృతి శంషాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనాలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం బుధవారం తెల్లవారు జామున శంషాబాద్లో ఓఆర్ఆర్పై గచ్చిబౌలి వైపు నుంచి నడుచుకుంటూ వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి(45)ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన అతడి కాలుపై నుంచి మరో వాహనం దూసుకెళ్లింది. రెండు వాహనాలు ఢీ కొనడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
ఎన్ఎంఎంఎస్లో తుమ్మలూరు జెడ్పీహెచ్ఎస్ సత్తా
మహేశ్వరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)కు మండలంలోని తుమ్మలూరు జెడ్పీహెచ్ఎస్ నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రమౌలి తెలిపారు. 8వ తరగతికి చెందిన రాజమోని కుమార్, రాచులూరి రోహిత్, మంచాల బిందుప్రియ స్కాలర్షిప్నకు ఎంపికయ్యారు. వీరికి ఒకొక్కక్కరికి ఏడాదికి రూ.12 వేల చొప్పున రూ.48 వేలు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థల సర్పంచ్ తుమ్మడి అండాలు, పాఠశాల పూర్వ విద్యార్థి, సామాజికవేత్త కటికల యాదగిరి అభినందించారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని చెప్పారు. స్కాలర్షిప్నకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక -
షేడ్నెట్లు ఏర్పాటు చేసుకోవాలి
చేవెళ్ల: నర్సరీల్లో పెంచుతున్న మొక్కల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ప్రతీ నర్సరీలో తప్పనిసరిగా పది ప్రైమరీ బెడ్స్ ఉండేలా చూసుకోవాలని జిల్లా ప్లాంటేషన్ సూపర్వైజర్ రాంచంద్రయ్య అన్నారు. బుధవారం ఆయన షాబాద్ మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ, సంకేపల్లిగూడ, పంచాయతీల్లో ఉన్న నర్సరీలను స్థానిక సర్పంచ్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలను పరిశీలించారు. మొక్కలకు ఎండ వేడి తగలకుండా షేడ్నెట్ వేసుకోవాలని సూచించారు. ఆయన వెంట నాయకుడు గోవర్ధన్రెడ్డి, ప్రోగ్రాం అధికారి వీరాసింగ్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, పవన్ ఉప సర్పంచ్ మానిక్యం, ఫీల్ట్ అసిస్టెంట్ బల్వంత్రెడ్డి, తదితరులు ఉన్నారు. జిల్లా ప్లాంటేషన్ సూపర్వైజర్ రాంచంద్రయ్య -
గంజాయి ముఠా అరెస్ట్
● బీహార్ నుంచి తెచ్చి, కార్మికులకు విక్రయిస్తున్న నిందితులు ● పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు ● ముగ్గురికి రిమాండ్ షాద్నగర్ రూరల్: గంజాయి విక్రయిస్తున్న ముఠాకు చెందిన ముగ్గురిని అధికారులు రిమాండ్కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. ఫరూఖ్నగర్ మండల పరిధి చింతగూడ శివారులోని శ్రీబాలాజీ పౌల్ట్రీఫామ్లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఆత్మమహతో టేకేదార్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను బీహార్ నుంచి గంజాయి తెచ్చి, చిన్నచిన్న ప్యాకెట్లలో నింపి, బూర్గుల, కాశిరెడ్డిగూడ, చింతగూడ, షాద్నగర్ పరిధిలోని పరిశ్రమలతో పాటు మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులకు విక్రయిస్తున్నాడు. ఈ విషయంపై పక్కా సమాచారంతో అందుకున్న డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆయా ఫ్యాక్టరీల వద్ద దాడులు నిర్వహించారు. ఆత్మమహతోను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 1.7 కిలోల ఎండు గంజాయి, రెండు సెల్ఫోన్లు, తూకం మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. కార్మికులకు గంజాయిని విక్రయిస్తున్న ఆత్మమహతో పాటు అతనికి సహకరిస్తున్న బీహార్కు చెందిన సుశీల్కుమార్, ప్రేమ్రామ్ను అరెస్టు చేసి, ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ దాడులలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ బాలరాజు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం
మొయినాబాద్: మున్సిపల్ పాలకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబు సూచించారు. మొయినాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సోనియా దర్శన్ బుధవారం ఆయన్ను కలిసి ఈ నెల 27న జరిగే చైర్పర్సన్, వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం, కౌన్సిలర్ల సన్మానసభకు హాజరవ్వాలని కోరారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్రెడ్డి, మండలి ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి తదితరులను కలిసి ప్రమాణస్వీకారోత్సవం, సన్మాన సభకు ఆహ్వానించారు. శంకర్పల్లి: శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్గా సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్పర్సన్గా జూలకంటి శ్వేత బుధవారం మున్సిపల్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శంకర్పల్లి పట్టణాభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని.. ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో ఆదర్శ మున్సిపల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఎ.వినీష కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్ను కనుగొనడంలో ఆమె చేసిన పరిశోధనలు ఈ ఘనత సాధించిపెట్టాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం (ఈసీఈ)కు చెందిన రీసెర్చ్ స్కాలర్ అయిన ఆమె మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్ రంగంలో చేసిన అత్యుత్తమ పరిశోధనలకు గాను ఈ డిగ్రీ సాధించారు. కేఎల్హెచ్ అజీజ్నగర్లోని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి బోడ మార్గదర్శకత్వంలో డీప్ లెర్నింగ్ పద్ధతులు ఉపయోగించి, సమర్థవంతమైన రీతిలో బ్రెయిన్ ట్యూమర్ కనుగొనడం, క్లాసిఫికేషన్ అల్గోరిథం అభివృద్ధి అనే అంశంపై పరిశోధనలు పూర్తి చేశారు. వీటిద్వారా మొదడు ఎంఆర్ఐ చిత్రాల నుంచి గ్లియోమా, మెనింగియోమా, పిట్యూటరీ కణతులను ఖచ్చితంగా గుర్తించడానికి, వర్గీకరించడానికి ఈ అత్యంత అధునాతన నమూనాను ఉపయోగించారు. పీహెచ్డీ రావడం, తన బాధ్యతను మరింత పెంచిందని వినీష పేర్కొన్నారు. పేదలకు అండగా కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంచాల: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలలకు అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన నగరంలోని నివాసంలో 46 మంది బాధితులకు మంజూరైన రూ.17.49లక్షల విలువైన సీఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలకు మేలు చేసే లా సంక్షేమ పథకాలు అమలుకు కృషి చేస్తున్నా రు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రమాకాంత్రెడ్డి, మండల నాయకులు చంద్రయ్య, సురేశ్, బాలరాజ్, పరమేశ్, అశోక్, బుగ్గ రాములు, జగన్, నాగరాజు, మధు, నవీన్, సాయికుమార్ పాల్గొన్నారు. -
సులువైన బోధనతో మెరుగైన ఫలితాలు
కొత్తూరు: విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమైయ్యే రీతిలో బోధన చేస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని పీఎంశ్రీ కమిటీ నోడల్ అధికారి శివరతన్ అన్నారు. బుధవారం ఆయన తన బృందంతో కలిసి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాలలో అమలు చేస్తున్న అటల్ ల్యాబ్, ఐటీసీ, స్టెమ్, ఏవీఆర్ల్యాబ్లతో పాటు లైబ్రరీలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు కరాటే విన్యాసాలను వీక్షించారు. డిజిటల్ బోధన ద్వార కలుగుతున్న ప్రయోజనాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివరతన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం ద్వార ల్యాబ్లు, ఇతర సామగ్రిని అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ నాగమణి, ఏఎంఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పీఎంశ్రీ కమిటీ నోడల్ అధికారి శివరతన్ -
ఇబ్రహీంపట్నంలో విషాదం
● వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భస్థ శిశువు మృతి ● ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన ఇబ్రహీంపట్నం: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లిగర్భంలోని శిశువు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన ప్రకారం.. బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి భార్య మహేశ్వరి గర్భందాల్చింది. దీంతో ఆమె ఎనిమిది నెలలుగా ఇబ్రహీంపట్నంలోని సాయిహర్ష ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. మహేశ్వరి ముఖం ఉబ్బుగా ఉందని సోమవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో బీపీ ఎక్కువగా ఉందని ట్యాబ్లెట్ ఇచ్చి పంపించివేశారు. మంగళవారం మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్ తీసి నగరంలోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో వారు స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందిందని తెలిపారు. సాయిహర్ష ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు గర్భంలోనే మృతి చెందిందని శ్రీహరి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించండి
ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ సిబ్బంది పెండింగ్ బకాయి వేతనాలు చెల్లించాలని లేదంటే వారం రోజుల్లో ఆందోళన చేపడతామని పంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీఐటీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బందిని 2వ పీఆర్సీ పరిఽధిలోకి తీసుకురావాలన్నారు. జీఓ 51 ను సవరించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరిలన్నింటినీ కొనసాగించాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. పంచాయతీల అవసరాల ప్రతిపాదికన కార్మికుల సంఖ్యను పెంచాలని, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణ, శ్రీనివాస్, పెంటయ్య, దేవదాసు, జ్యోతి, జగన్, శేఖర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాండు -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
మొయినాబాద్: జంట జలాశయాల్లో కాలుష్య నివారణపై జలమండలిలో కదలిక వచ్చింది. ఉస్మాన్సాగర్(గండిపేట), హిమాయత్సాగర్ జలాశయాల్లోకి మురుగు నీరు చేరి కలుషితం అవుతున్న తీరుపై ‘జంట.. కాలుష్యపు కుంట!’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. గండిపేట జలాశయం బఫర్ జోన్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేశారు. హిమాయత్నగర్ సర్వేనంబర్ 17లో నీళ్ల విక్రయం కోసం ఏర్పాటు చేసిన గుంతలను ధ్వంసం చేశారు. జలాశయం ఒడ్డున రెస్టారెంట్ ఏర్పాటు చేసి బఫర్ జోన్లో నిర్మించిన బాత్రూంలను నేలమట్టం చేశారు. రెస్టారెంట్, బాత్రూం వ్యర్థాలు చెరువులోకి చేరకుండా అడ్డుకున్నారు. జలాశయాల్లో కాలుష్య నివారణకోసం ఎస్టీపీల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం కౌన్సిలర్లపై పరస్పర ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కౌన్సిలర్లపై ఫిర్యాదు చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ దారు రాఘవేందర్రావుపై బీజేపీ అభ్యర్థి జక్క రవీందర్రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్గా పలు పనులు చేసి, మున్సిపాలిటీ నుంచి నేరుగా లబ్ధిపొందిన రాఘవేందర్రావు కౌన్సిలర్ పదవికి అనర్హుడని, ఆయనపై వేటు వేయాలని బుధవారం ఆర్డీఓ అనంతరెడ్డికి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఇండియా అబ్బాయి.. నేపాల్ అమ్మాయి
ఆస్ట్రేలియాలో ప్రేమ.. పెద్దఅంబర్పేటలో పెళ్లి అబ్దుల్లాపూర్మెట్: ఇండియాకు చెందిన యువకుడు.. నేపాల్కు చెందిన యువతి మధ్య ఆస్ట్రేలియాలో చిగురించిన ప్రేమ.. ఇరు కుటుంబాలను ఒప్పించి, తెలుగు సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించింది. ఈ వేడుకకు పెద్దఅంబర్పేటలోని తారా కన్వెన్షన్ హాల్ వేదికై ంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్బీనగర్ మన్సూరాబాద్లో నివాసముండే ప్రభుత్వ ఉద్యోగి గుండెగోని యాదగిరిగౌడ్, యశోద దంపతుల కుమారుడు సతీష్కుమార్గౌడ్ ఆస్ట్రేలియాలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అక్కడే ఉద్యోగం చేస్తున్న నేపాల్కు చెందిన సయేషాను ప్రేమించాడు. ఈవిషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పి, అందరినీ ఒప్పించి, వివాహం చేసుకున్నారు. నేపాలీ సంప్రదాయ వస్త్రాలను ధరించిన యువతి తరఫు బంధువులు. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన వేడుకల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
మరో ముందడుగు..
● పరిగిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు దిశగా అడుగులు ● కాళ్లాపూర్, రాపోల్ శివారులో భూ సేకరణకు రంగం సిద్ధం ● ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు ● 1,197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్వికారాబాద్: జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దాదాపు 1,100 పైచిలుకు ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. పరిగి మండలం రాపోల్, కాళ్లాపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, పట్టా భూములను సేకరించనున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 1,197 ఎకరాలు అవసరమని తేల్చారు. ఇందులో 260 ఎకరాల పట్టా భూములు.. 937 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమని నిర్ణయించారు. కాళ్లాపూర్ మండలంలో 159.25 ఎకరాల పట్టా భూమి, 428.05 ఎకరాల ప్రభుత్వ భూమిని.. రాపోల్ రెవెన్యూ పరిధిలో పట్టా భూములు 101.08 ఎకరాలు.. 509 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించనున్నారు. ఈ ప్రాంత సమీపం నుంచే ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్డు వెళ్లనుంది. మరో వైపు పరిగి – షాద్నగర్ రోడ్డును రెండు వరుసల నుంచి నాలుగు లేన్లుగా మార్చేందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. అనుబంధంగా ఏటీఎస్ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు రావాలంటే యువతలో సాంకేతిక నైపుణ్యాలు ఎంతో అవసరంప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పరిగి మండలం నస్కల్ శివారులో ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం రూ.45 కోట్లు వెచ్చించనుంది. ఈ సెంటర్ టాటా సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు పారిశ్రామిక వాడలు జిల్లాలో పలు చోట్ల పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం భూ సేకరణ చేశారు. కొన్ని ప్రారంభం కాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మోమిన్పేట మండలం ఎన్కెతల శివారులో మొబిలిటి వ్యాలి పేరుతో సుమారు వెయ్యి ఎకరాలు సేకరించి రోడ్లు, మౌలిక వసుతులు కల్పిస్తున్నారు. నవాబుపేట మండలం ఆర్కతల గ్రామ శివారులో 250 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాండూరులోనూ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టగా మధ్యలో ఆగిపోయాయి. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలంలో పారిశ్రామిక వాడ పనులు ప్రారంభమయ్యాయి. పూడూరు మండలం రాకంచర్ల సమీపంలో పరిఽశ్రమలు నెలకొల్పారు. వికారాబాద్ సమీపంలోని శివారెడ్డి పేట పారిశ్రామిక వాడలో పలు పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. -
భూమి కేటాయింపు
కోహెడ మార్కెట్కు అబ్దుల్లాపూర్మెట్: కోహెడలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలపడంతో పాటు సర్వేనంబర్ 167లోని 239 ఎకరాల భూమిని కేటాయిస్తున్న ప్రకటించడంపై గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. బాటసింగారంలోని మార్కెట్ కార్యాలయంలో మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్లు, అధికారులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. మరోసారి రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం నిలిచిందని అన్నారు. వీలైనంత త్వరలో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతామని తెలిపారు. మార్కెట్ నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ భాస్కర్చారి, డైరెక్టర్లు జైపాల్రెడ్డి, అంజయ్య, లక్ష్మి, మధుసూదన్రావు, గణేశ్నాయక్, మచ్చేందర్రెడ్డి, నర్సింహ, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో పాలకవర్గం హర్షం సీఎం చిత్రపటానికి పండ్ల రసాలతో అభిషేకం -
కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం
● అనేక పథకాలకు రూపకల్పన చేసిందిమా హయాంలోనే.. ● పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పూడూరు: కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని, బడుగు బలహాన వర్గాలకు అండగా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షులతో కలిసి పూడూరు, మీర్జాపూర్ గ్రామాల్లో మంగళ వారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పేదవాడు తినడానికి తిండి ఉండాలంటే ఏడాదికి వంద రోజుల పని అవసరమనే ఆశయంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తమకు కూలి సరిపోవడం లేదని, పనిచేసే చోట సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా మని కూలీలు ఆయన దృష్టికి తెచ్చారు. కూలీల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. పింఛన్ వ్యవస్థను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తుచేశారు. సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీర్జాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలించి బిల్లులపై ఆరా తీశారు. నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో పరిగి భేష్ అభివృద్ధిలో పరిగి నియోజకవర్గం దూసుకుపోతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కృషితో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అనంతరం అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జరుగుతున్న నాలుగు వరుసల రోడ్డు పనులను పరిశీలించారు. రూ.వెయ్యి కోట్లతో పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 17 నుంచి కోస్గి, బీజాపూర్ వరకు ఆరు లేన్ల రహదారి నిర్మాణం, ట్రిపుల్ ఆర్ పరిగి సమీపం నుంచి పోవడం ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే ఇక్కడి భూములకు విలువ పెరుగుతుందని, పరిశ్రమలు కూడా వస్తాయని తెలిపారు. అనంతరం పూడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి విద్యార్థులకు క్రీడా సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రఘునాథ్రెడ్డి, డీసీసీ కార్యదర్శులు షకీల్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. పేదల కోసమే కాంగ్రెస్ పని చేస్తుంది మోమిన్పేట: పేదల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షుల బృందం పేర్కొంది. మంగళవారం మండలంలోని వెల్చాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. నిరుపేదలు ఆకలితో అలమటించరాదనే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ప్రతి కూలీకి వంద రోజులు పని కల్పించడమే ధ్యేయంగా చట్టం చేసిందన్నారు. ప్రధాని మోదీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కూలీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ (మల్కాజ్గిరి), అంజన్కుమార్ (కరీంనగర్), వంశీకృష్ణ (నాగర్కర్నూల్), గార్లపాటి మద్దిలేటి స్వామి (నంద్యాల), శేక్ అలిబక్షి (నెల్లురు సిటీ), వెంకట వర్మరాజు (విశాఖపట్నం), కొత్తూరి శ్రీనివాస్ (కోనసీమ), పార్టీ మోమిన్పేట మండల అధ్యక్షుడు శంకర్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ మండలంలో.. అనంతగిరి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు మంగళవారం వికారాబాద్ మండలం ఎర్రవల్లి, సిద్దులూర్, గొట్టిముక్కుల, పీలారం గ్రామాల్లో పర్యటించారు. -
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతోమెరుగైన ఉపాధి
కొత్తూరు: స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో యువత, నిరుద్యోగులకు పెద్ద పెద్ద పరిశ్రమల్లో సైతం మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నందిగామ మండలంలోని కన్హాలో మంగళవారం నిర్వహించిన ఇండియా స్కిల్ కాంపిటిషన్స్ 2025–26 దక్షిణ ప్రాంత పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి శాఖను ప్రక్షాళన చేసి అభివృద్ధి శాఖగా మారుస్తామన్నారు. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చుతున్నట్లు వివరించారు. ఆధునిక యంత్రాలు, డిజిటల్ పరికరాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంపిటీషన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్ఛేరి, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో భాగంగా ప్రతిభ కనబర్చిన వారికి బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐఏఎస్ కాంతి వెస్లీ, నవీన్కుమార్, వంశీ, తదితరులు పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి -
‘జంట’.. కాలుష్యపు కుంట!
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండి పేట) జంట జలాశయాలను నిజాం కాలంలో నిర్మించారు. నగర విస్తరణతోపాటు కొన్నేళ్లుగా ఎగువ ప్రాంతాలైన మొయినాబాద్, శంషాబాద్, శంకర్పల్లి, గండిపేట మండలాల్లో కొత్త కాలనీలు, ఫాంహౌస్లు, విల్లాలు, ఇళ్లు, పరిశ్రమలు, హోటళ్లు , విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఆయా ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు జలాశయాల్లోకి చేరుతోంది. హిమాయత్నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, చిన్నమంగళారం, మోత్కుపల్లి, జన్వాడ, ఖానాపూర్ గ్రామాల మురుగునీరు నేరుగా గండిపేట జలాశయంలో కలుస్తోంది. అజీజ్నగర్, నాగిరెడ్డిగూడ, కొత్వాల్గూడ, కవ్వగూడ, శంషాబాద్కు చెందిన మురుగునీరంతా హిమాయత్సాగర్లోకి చేరుతోంది. జలాశయాలను ఆనుకుని నిర్మించిన ఫాంహౌస్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్, కన్వెన్షన్లలోని మురుగునీరు, వ్యర్థాలు సైతం జలాశయాల్లోనే కలుస్తున్నాయి. తద్వారా జలాశయాల్లోని నీళ్లు కలుషితమవుతున్నాయి. ప్రతి రోజు గండిపేట జలాశయంలోకి 29 లక్షల లీటర్లు, హిమాయత్సాగర్లోకి 43.5 లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నట్లు జలమండలి అధికారుల పరిశీలనలోనే తేలడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎస్టీపీల నిర్మాణం ఎప్పటికో.. జంట జలాశయాల్లో శుద్ధ జలమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు ఎస్టీపీల నిర్మాణానికి ఏడాది క్రితం శ్రీకారం చుట్టింది. రూ.82.23 కోట్ల నిధులతో గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాల పరిధిలో నాలుగు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనులు మొదలు పెట్టింది. గండిపేట జలాశయం పరిధిలో మొయినాబాద్ మున్సిపాలిటీలోని హిమాయత్నగర్ వద్ద 5 ఎంఎల్డీ, శంకర్పల్లి మండలంలోని జన్వాడ వద్ద 4 ఎంఎల్డీ, హిమాయత్సాగర్ జలాశయం పరిధిలో మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ వద్ద 5 ఎంఎల్డీ, శంషాబాద్ మున్సిపాలిటీలోని కొత్వాల్గూడ వద్ద 6 ఎంఎల్డీల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మార్చి నాటికి పూర్తిచేయాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకున్నా సాధ్యమయ్యేలా లేదు. ఎస్టీపీల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు సగం మాత్రమే జరిగాయి. నిర్మాణం పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్కు మురుగు ముప్పు జలాశయాల్లోకి నేరుగా చేరుతున్న మురుగునీరు చెంతనే ఇష్టారీతిన వ్యర్థాల పారబోత కలుషితమవుతున్న జలం నత్తనడకన ఎస్టీపీల నిర్మాణం తాజాగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు మురుగు నీరు కలుస్తోంది గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాల్లో నీళ్లు రోజురోజుకూ కలుషితమవుతున్నాయి. కొన్ని గ్రామాల మురుగునీరు నేరుగా వెళ్లి కలుస్తోంది. చెత్తా చెదారం, వ్యర్థపదార్థాలు వాటి పక్కనే వేస్తున్నారు. రక్షణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. – వెంకట్రెడ్డి, మొయినాబాద్ ఎస్టీపీలు పూర్తిచేయాలి జంట జలాశయాల్లో మురుగునీరు చేరకుండా ఎస్టీపీల నిర్మాణం ఏడాది క్రితం మొదలు పెట్టారు. ఇప్పటికి సగం పనులే అయ్యాయి. అధికారులు వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలి. ప్రతి గ్రామం వద్ద ఓ ఎస్టీపీ నిర్మిస్తే మురుగునీరు చేరకుండా ఉంటుంది. – రాజు, చిలుకూరు జీవోలున్నా అమలు శూన్యం జంట జలాశయాల నీటి పరిరక్షణకోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోలు తీసుకొచ్చింది. 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవో తేగా 2023లో తెలంగాణ ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసి 69 జీవోను తెచ్చింది. వీటి ప్రకారం జలాశయాల ఎగువ ప్రాంతాల్లో పది కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు. జీవోలు అమల్లో ఉన్నా ఎక్కడా నిర్మాణాలు ఆగలేదు. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరగడంతో ఇప్పుడు వాటి నుంచి వెలువడే మురుగు, వ్యర్థ పదార్థాలు నేరుగా జలాశయాల్లో చేరుతున్నాయి. జీవోల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత మురుగు ముప్పునకు దారితీసింది. -
సక్రమంగా నిర్వహించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఇంటర్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఆర్సీలు, పోలీస్శాఖ, విద్యుత్, విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాల్లో పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. విధులు నిర్వర్తించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, అనంతరెడ్డి, సరిత, మున్సిపాలిటీ కమిషనర్లు, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి వెంక్యా నాయక్, విద్యాశాఖాధికారి సుశీందర్రావు, వైద్యాధికారి లలితాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ విఫలమై విద్యార్థిని బలవన్మరణం
గచ్చిబౌలి: మూడేళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బీఎస్సీ విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసులు తెలిపిన మేరకు.. వైజాగ్కు చెందిన కోమలి (21)చిత్రపురి కాలనీలో బంధువుల వద్ద ఉంటూ బీఎస్సీ చదువుతూ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వైజాగ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలి మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం కోమలి ఆత్మహత్యా యత్నం చేయడంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. అఖిల్ దూరంగా ఉంటానని చెప్పినా కోమలి వినిపించుకోలేదు. రెండు రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అఖిల్ పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అఖిల్ రెడ్డిని విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తన కూతురు కోమలిని అఖిల్ రెడ్డి మోసం చేయడంతో చనిపోయిందని తల్లి వరలక్ష్మీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వివరణ ఇచ్చినా.. వినరే!
కందుకూరు: గ్రామాల్లో మహిళాభివృద్ధి కోసం ఏర్పడిన సొసైటీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం తలనొప్పిగా మారింది. పెద్ద పెద్ద బడా కంపెనీలను వదిలిపెట్టి రూపాయి, రూపాయి పొదుపు చేయడం, అప్పు తీసుకుని మళ్లీ చెల్లించే తమ సొసైటీపై పన్ను విధించడంతో కందుకూరులోని స్నేహ మహిళా సొసైటీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రూ.1.34 కోట్ల పన్ను విధింపు మండల కేంద్రంలో 2001లో మహిళాభివృద్ధి కోసం స్నేహ మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సొసైటీ లిమిటెడ్ను(స్నేహ మహిళా సొసైటీ) ఏర్పాటు చేశారు. ప్రారంభంలో పది మందికి ఒక గ్రూపు చొప్పున 430 సంఘాలు ఏర్పడ్డాయి. డీఆర్డీఏ నుంచి రూ.12.50 లక్షలు రివాల్వింగ్ ఫండ్ అందించింది. సభ్యులుగా చేరిన ఒక్కొక్కరు రూ.5 వేల చొప్పున డిపాజిట్ చేశారు. ఆ నిధులతో ప్రారంభించి బ్యాంకుల నుంచి అదనంగా రూ.కోటి వరకు రుణం తీసుకుని సంఘాలకు తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి, తిరిగి తీసుకోవడం చేశారు. ఒక్కో సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పులు ఇచ్చారు. దీంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని తిరిగి చెల్లించే వారు. ప్రస్తుతం ఆ సంఘాలు 480కు చేరాయి. 2008 తర్వాత వెలుగు పథకం అమలు చేయడంతో వీరిపై ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేదు. అందులో చేరిన మహిళా సంఘాలే అన్నీ చూసుకుంటున్నాయి. 2022లో తొలిసారి 2016 ఏడాది నోట్ల రద్దు సమయంలో సంఘాల వద్ద ఉన్న పెద్ద నోట్లను సొసైటీలో జమ చేసి తమ అప్పులు తీర్చుకున్నారు. దీంతో ఆదాయపు పన్ను శాఖ సొసైటీలో జరిగిన లావాదేవీలను పరిశీలించకుండానే రూ.1.34 కోట్ల మేర పన్ను చెల్లించాలని పేర్కొంటూ 2022లో నోటీసులు పంపింది. దీనిపై సంఘం ప్రతినిధులు వివరణ సైతం ఇచ్చారు. అప్పటి అధికారులు బదిలీ అవడంతో కొత్తగా వచ్చినవారు మళ్లీ ఇటీవల నోటీసులు జారీ చేశారు. తాము కేవలం మహిళా సంఘాలకు అప్పులు, ఇవ్వడం తిరిగి సేకరించడం, వ్యక్తిగత డిపాజిట్లు సేకరించడం తప్పా మరో లావాదేవీలు అనధికారికంగా చేయలేదని, అయినా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సొసైటీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. స్నేహ మహిళా సొసైటీకి మరోసారి ఆదాయపు పన్ను నోటీసు అనధికార లావాదేవీలు చేయలేదని వెల్లడి గతంలోనే పూర్తి నివేదిక సమర్పణ సమస్యను పరిష్కరించాలని సభ్యుల విజ్ఞప్తి అప్పీలు చేశాం 2022లో ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసుకు జవాబు ఇచ్చాం. మేము చేసేది బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని, సంఘాలకు ఇవ్వడం తప్పా మరొక లావాదేవీ ఏదీ లేదు. అన్ని రికార్డులు పారదర్శకంగానే ఉన్నాయి. అయినా పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడం బాధాకరం. – మణెమ్మ, అధ్యక్షురాలు, స్నేహ మహిళా సొసైటీ, కందుకూరు డీఆర్డీఏ కిందికి రావాలి స్వయం కృషితో మహిళలందరం సంఘాలుగా ఏర్పడి సొసైటీని నడిపించుకుంటున్నాం. ఆదాయ పన్ను చెల్లించాలని నోటీసులు రావడం ఇబ్బందిగా ఉంది. తమ సొసైటీని గతంలో మాదిగి డీఆర్డీఏ అజమాయిషీ కిందకి ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే మాకు భరోసా లభిస్తుంది. – స్వరూప, సలహాదారు, స్నేహ మహిళా సొసైటీ, కందుకూరు -
సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు
న్యాయం చేయాలని కొహెడ రైతుల వినతి తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ సర్వే నంబర్ 582లోని రైతులకు న్యాయం చేయాలని మంగళవారం సీఎం ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. తమకు పరిహారం చెల్లించాలని విన్నవించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. కొహెడలోని శావుకారు గుట్ట వద్ద 1992లో 118 మంది రైతులకు ఎకరం చొప్పున భూమిని కేటాయించగా, అప్పటి నుంచి వర్షాధార పంటలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉండగా 2004లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ భూములకు చెందిన రైతులు కొందరికి పాసు పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. కొన్నాళ్ల తరువాత ఫైరింగ్ రేంజ్కు భూమిని కేటాయించడంతో కొందరు రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందింది. కానీ మిగిలిన 63 మందికి న్యాయం చేకూరలేదు. దీంతో బాధితులు అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నామని పేర్కొన్నారు. అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఒక్కో రైతుకు 300 గజాల చొప్పున ప్లాట్లను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోకపోవడంతో, హైకోర్టును కూడా ఆశ్రయించామన్నారు. 63 మంది రైతులకు ఆరు నెలల్లోగా నష్ట పరిహారం చెల్లించాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరారు. -
కొబ్బరి పీచు+సింథటిక్ కలర్= టీ పొడి
● ‘కుటీర పరిశ్రమ’లో తయారు చేసి విక్రయం ● స్థానిక హోటళ్లతో పాటు డీలర్లకూ సరఫరా ● గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులుసాక్షి, సిటీబ్యూరో: ఎంపిక చేసుకున్న కొబ్బరిపీచు పొడిలో సింథటిక్ కలర్స్ కలిపి నకిలీ టీ పొడి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తికి టాస్క్ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. సనత్నగర్ పోలీసులతో కలిసి ఫతేనగర్లోని ఓ ప్రాంతంపై దాడి చేసి నిందితుడిని పట్టుకున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సోమవారం వెల్లడించారు. ఫతేనగర్లో నివసిస్తున్న జగన్నాథ్ బిష్ణోయ్ కొన్నాళ్లుగా టీ పొడి వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడిని తయారు చేసి విక్రయించడం ప్రారంభించాడు. మార్కెట్లో దొరికే కోకో పీట్ (కొబ్బరి పీచు పొడి) కొనుగోలు చేసి, అందులోని వ్యర్థాలను తొలగించే వాడు. ఆపై వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి సింథటిక్ ఫుడ్ కలర్స్ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి, టీ డస్ట్ కలిపి గ్రౌండింగ్ చేయడం ద్వారా కల్తీ టీ పొడి తయారు చేసే వాడు. ఇతడు తయారు చేసే కిలో కల్తీ టీ పొడిలో 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్తో పాటు 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ ఉండేది. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ విషయంపై వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ సీహెచ్ యదేందర్ నేతృత్వంలో ఎస్సైలు డి.రవిరాజ్ తమ బృందంతో కలిసి జగన్నాథ్ ఇంటిపై దాడి చేశారు. నిందితుడిని పట్టుకోవడంతో పాటు 120 కిలోల కల్తీ టీ పొడి, 30 కిలోల సాధారణ టీ పొడి, 138 కిలోల కోకోపీట్ మిశ్రమం, 800 గ్రాముల సన్సెట్ కలర్, 700 గ్రాములు టార్ర్టాజైన్ కలర్, ఒక్కొక్కటి 500 గ్రాములు బరువున్న 12 బెల్లం బాక్సులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాటు విక్రయం
కొందుర్గు: తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి దేవుడి భూములనే కాజేసేందుకు ప్రయత్నించిన నిందితులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కొందుర్గు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన సర్వేనంబర్ 77లో గల 355 చ.గజాల ఖాళీ స్థలం ఉంది. దీన్ని స్థానికంగా ఉండే బోయ శంకర్, బోయ రామచంద్రయ్య, బోరిగే యాదయ్య, కొమురబండ నర్సింలు, మల్కని నవీన్కుమార్ గౌడ్, బాచరాజు రామారావు, బాచరాజు శ్రీనివాసరావు కలిసి 2020లో షాబాద్ మండలం నాగర్గూడకు చెందిన దేవాసీ జగదీష్ విక్రయించారు. ఆయన సదరు స్థలంలో ఇంటిని నిర్మించేందుకు ప్రయత్నించగా ఎండోమెంట్ అధికారులు ఆక్షేపణ తెలిపారు. దీంతో మోసాపోయానని గ్రహించిన జగదీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాద్నగర్ రూరల్ సీఐ శ్రీనివాసు ఆధ్వర్యంలో నిందితులను రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు. -
అక్రిడిటేషన్కార్డుల్లో కోత పెట్టడం సరికాదు
ఇబ్రహీంపట్నం రూరల్: వర్కింగ్ జర్నలిస్టుందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ప్రస్తుతం ఉన్న కార్డులకు కోత పెట్టడం సరికాదన్నారు. నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండ లాల్లో పని చేసే జర్నలిస్టులతో పాటు డెస్క్లో పని చేసే వారికి కార్డులు ఇవ్వాలని, జీవో 252ను సవరించాకే కమిటీలు నియమించాలని కోరారు. అనంతరం డీఆర్ఓ, డీపీఆర్ఓలకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గణేశ్, కార్యదర్శి సైదులు, నాయకులు చంద్రశేఖర్, సురేష్, ఖాజా పాషా, అజయ్కుమార్, రాజేందర్, వెంకటేశ్, సుదర్శన్, మణి, నర్సింహారెడ్డి, క్రాంతి, అంజి, శ్రీశైలం, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
కొందుర్గు: మద్యానికి బానిసై ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం కొందుర్గులో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేగడిచిల్కమర్రి గ్రామానికి చెందిన బొబ్బని నర్సింలు(38)కి భార్య స్వప్నతోపాటు ముగ్గురు పిల్లలున్నారు. అయితే నర్సింలు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య స్వప్ప పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆయన విపరీతంగా మద్యం తాగుతున్నాడు. పదిహేను రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి రాలేడు. సోమవారం తాగిన మైకంలో కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వెళుతూ అక్కడే పడిపోయాడు. ఇది గమనించిన ఆసుపత్రి సిబ్బంది నర్సింలును పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. జేబులో ఉన్న ఆధార్కార్డు పరిశీలించి సమాచారం అందించారు. మృతుడి తండ్రి జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు సమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మున్సిపాలిటీల అభివృద్ధికి సహకారం
చేవెళ్ల: మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పూ ర్తిగా సహకారం అందిస్తుందని ఐటీశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో సోమవారం నూతన మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, వైస్ చైర్మన్ రాముగౌడ్, కౌన్సిలర్ల సన్మాన సభ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న చైర్పర్సన్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపా రు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన ఉండాలని, అప్పడే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. గెలవడంతో అయిపోలేదని, గెలుపుతో బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్రెడ్డి, నాయకులు దర్శన్, బాల్రాజ్, జనార్దన్రెడ్డి, బల్వంత్రెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వీరేందర్రెడ్డి, మధుసూదన్గుప్తా, శంకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు
యాచారం: మండల పరిధిలోని యాచారం, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఏడుగురిపై సోమవారం వీధి కుక్క లు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఆ యా గ్రామాలకు చెందిన రేణుక, రమేష్, బుగ్గయ్య, జంగయ్య, హర్థిక, అయూష్, పూజను వీధి కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం యాచారం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు వారికి చికిత్స చేసి పంపించారు. బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టండి సాక్షి, రంగారెడ్డిజిల్లా: లైసెన్స్ ఫీజుల బకాయిల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో జిల్లా పరిధిలోని ఎకై ్సజ్ సూపరింటెండెట్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దే శిత మద్యం లక్ష్యాలను ఎస్హెఓలు, ఈఎస్లు పర్యవేక్షించి వాటిని చేరుకోవాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు, డీటీఎఫ్ టీమ్లు లైసెన్స్ కలిగిన మద్యం దుకాణాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని, ఎన్డీపీఎల్, ఫ్యూరియస్ లిక్కర్ అమ్మకాలు జరగకుండా చూడాలన్నారు. వీటితో పాటు గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, రవాణపై నిఘా పెట్టాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ కిషన్, మేడ్చల్, వికారాబాద్, సరూర్నగర్ ఈఎస్లు నవీన్, భాస్కర్ గౌడ్, ఉజ్వలారెడ్డి పాల్గొన్నారు. -
ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం
షాద్నగర్రూరల్: రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఫ్యూచర్సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ఉపాధ్యాయ పిలుపునిచ్చారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ప్లాజాలో సోమవారం పోలీసు, ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్వ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుభద్రత, డ్రంకెన్ డ్రైవ్ అభయ్సారథిపై అవగాహన కల్పించారు. 142 మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శివమ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ఒక క్లిష్టమైన సమస్యగా మారిందని, ప్రతిఒక్కరూ వాహనాలను జాగ్రత్తగా నడిపించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణపై ప్రజలందరినీ చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వాహనాలను నడిపే సమయంలో తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలన్నారు. షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలను నడపడంతో ఎంతోమంది ప్రమాదాల బారిన పడి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్కుమార్, టోల్ప్లాజా ఇన్చార్జి ఎస్డీ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు అక్రిడేషన్ కార్డులివ్వండి
షాద్నగర్రూరల్: అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎండీ ఖాజాపాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం షాద్నగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు వినతిపత్రం అందజేశారు. ఖాజాపాషా మాట్లాడుతూ.. ఈసారి ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నారు. జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రిడేషన్ కార్డులను జారీ చేయాలన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. అక్రిడేషన్ కార్డుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానన్నారు. అనంతరం కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఖాజాపాషా -
స్నేహితుడే హంతకుడై..
తాండూరు రూరల్: చేతబడి చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్యచేశాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరన్కోట్లో సోమ వారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ రాథో డ్ వినోద్, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని లేబర్ కాలనీకి చెందిన మాజీ వార్డు మెంబర్ జట్టూరి డప్పు సాయికుమార్ (45) ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం తాండూరులో ప్రయాణికులను తీసుకుని గ్రామానికి వస్తున్నాడు. పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ వద్ద ఇదే ఊరికి చెందిన టైలర్ బైండ్ల బాలు ఆటోలో ఉన్న సాయికుమార్ను కిందికి లాగి, వెంట తెచ్చుకున్న కత్తి (మా సం నరికే)తో మెడ, తలపైభాగంలో దాడి చేశాడు. ఆ తర్వాత కత్తి పట్టుకుని కొద్దిసేపు ఘటన స్థలంలో హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన సాయికుమార్, బాలు మంచి స్నేహితులు. టైలర్గా పనిచేసే బాలు ఇటీవల తన షాపు సరిగ్గా నడవడం లేదని, సాయికుమార్ చేతబడి చేయడంతోనే ఈదుస్థితి దాపురించిందని తరచూ స్థానికుల వద్ద ప్రస్తావించేవాడు. అయితే, తన తమ్ముడి కుటుంబ పరిస్థితే బాగో లేదని, నీకెందుకు చేతబడి చేస్తాడని సాయికుమార్ సోదరుడు డప్పు నర్సింలు పలుమార్లు బాలుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మనసులో కక్ష పెంచుకున్న బాలు స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. నిందితుడు బాలు కుటుంబ కలహాల నేపపథ్యంలో ఏడాది క్రితం ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పట్లో సాయికుమార్ అతన్ని రక్షించి, ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఆపదలో అండగా ఉండి, ప్రాణాం కాపాడిన స్నేహితుడినే చంపడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ముగిసిన బాల్బ్యాడ్మింటన్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి అండర్–19 బాలబాలికల సీఎం కప్ బాల్బ్యాడ్మింటన్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో బాలుర విభాగంలో కామారెడ్డి, బాలికల విభాగంలో మెదక్ ప్రథమ స్థానాలు దక్కించుకున్నాయి. బాలుర విభాగంలో రెండు, మూడో స్థానాలను రంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, బాలికల విభాగంలో రెండో స్థానం అతిథ్య జట్టు ఖమ్మం దక్కించుకోగా, మూడోస్థానంలో నిజామాబాద్ జట్టు నిలిచింది. ఇక బాలుర డబుల్స్లో కుమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, బాలికల విభాగంలో మెదక్, వరంగల్, ఖమ్మం జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. విజేతలకు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, సీఎం కప్ జిల్లా కోఆర్డినేటర్ కె.ఆదర్శ్కుమార్, పాఠశాలల క్రీడల సంఘం జిల్లా కార్యదర్శి వై.రామారావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబు, బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేజెల్ల సురేష్, బొంతు శ్రీనివాసరావు, సీనియర్ బాల్బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రమణ బహుమతులు అందజేశారు. -
ఎదురొచ్చిన మృత్యువు
చేవెళ్ల: ఎదురుగా వచ్చిన కంటైనర్లారీ బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరగూడ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హైతాబాద్ గ్రామానికి చెందిన హైదరగూడ ఉదయ్కిరణ్ (19), దాసరి అజయ్(19), ఎండీ ఆజమ్ స్నేహితులు. శనివారం బైక్పై చేవెళ్లకు వచ్చి రాత్రి 12 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. నారగూడ సమీపంలో ఎదురుగా వచ్చిన కంటైనర్లారీ వీరిని ఢీకొట్టింది. ఉదయ్కిరణ్, అజయ్ క్షణాల్లో ప్రాణాలు కోల్పోగా, ఆజమ్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఉదయ్కిరణ్ తండ్రి రాజు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అజయ్కు తల్లి లేకపోవటంతో నాన్న దాసరి వెంకటయ్య కూలీ పనులు చేస్తూ కొడుకును చూసుకుంటున్నాడు. చేతికందిన కొడుకులు చనిపోవడంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. గాయపడిన ఆజమ్కు తల్లిదండ్రులు లేకపోవడంతో చికెన్ సెంటర్లో పనిచేస్తూ ఒంటిరిగా ఉంటున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
తెలంగాణ పోలీస్ వాలీబాల్ టీం కెప్టెన్గా మహేశ్
కడ్తాల్: కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న 74వ ఆల్ ఇండియా వాలీబాల్ క్లస్టర్ క్రీడా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీల్లో పాల్గొనే తెలంగాణ పోలీస్ జట్టు కెప్టెన్గా కడ్తాల్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న అంబటి మహేశ్ వ్యవహరించనున్నారు. దీనిపై సీఐ గంగాధర్, ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్, స్థానిక పోలీస్ సిబ్బంది అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ ఇబ్రహీంపట్నం రూరల్: అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పేర్కొన్నారు. మార్చి 7న టీజీఓ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీఓ నాయకులు శాంతిశ్రీ, రేవతి, అలివేలు, మహేశ్వరి, సైదమ్మ, బాలేశ్వరి, నరేందర్, మసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులకు జంకేది లేదు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్ తుర్కయంజాల్: శాంతి భద్రతలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిని ఖండిస్తూ సోమవారం ఆదిబట్ల సర్కిల్ పరిధి తుర్కయంజాల్లో పార్టీ స్థానిక అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని పేర్కొ న్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొత్త రాంరెడ్డి, కందాళ బల్దేవ్ రెడ్డి, పురుషోత్తం, రవీందర్ రెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. జంట జలాశయాల కాలుష్యంపై వివరణ ఇవ్వండి హిమాయత్, ఉస్మాన్సాగర్లపై సర్కార్కు హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు తాగునీరందించే జంట జలాశయాలు హిమాయత్, ఉస్మాన్ సాగర్లలో కాలుష్య కారకాలు పెరిగిపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర పీసీబీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 26కు వాయిదా వేసింది. జంట జలాశయాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిందంటూ వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. జలాశయాల నిర్వహణ విభాగాలు, అధికారులు సమగ్ర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మురుగు శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాలు చేరకుండా తీసుకున్న చర్యలను వివరించాలని స్పష్టం చేసింది. -
ఇజ్జత్కా సవాల్!
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎలాగైనసరే పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ అన్ని అస్త్రాలకు పదనుపెట్టి ప్రయోగిస్తోంది. పది రోజులుగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మధ్య రాజకీయ చదరంగం నడుస్తోంది. హస్తం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండడంతో కారు కుదుపులకు గురవుతోంది. ఇప్పటికే ఒకరు కిడ్నాప్ అంటూ అలజడి సృష్టించగా, మిగిలిన వా రిని రక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీలో 24 వార్డులకుగాను బీఆర్ఎస్ గెలిచిన 13 కౌన్సిలర్లలో ఆకుల యాదగిరిని మినహాయిస్తే 12 మంది వారికున్నారు. ఒక స్వతంత్ర, మరో బీజేపీ కౌన్సిలర్ మద్దతు కూడగట్టుకోవడంతో ఆ పార్టీ బలం 14కు చేరింది. కేవలం 8 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్కు రాష్ట్రంలో అధికారం ఉండడం పెద్ద బలంగా మారింది. ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు, ఒక బీఆర్ఎస్, మరో బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో వారి సంఖ్య 11 వద్దకు వచ్చి ఆగింది. మరో ఇద్దరు కౌన్సిలర్లు అటుఇటైతే మున్సిపల్ పీఠం తలకిందులయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటి పర్యవసానం ఎలా ఉంటుందో వేచిచూడాలి. కానరాని కౌన్సిలర్లు మున్సిపల్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి గెలిచిన కౌన్సిలర్ల జాడ కానరాకుండా పోయింది. కాంగ్రెస్ ఆడుతున్న గేమ్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేజారి పోకుండా కారు నేతలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిలర్లు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, వారి ఆరోగ్య పరిస్థితులు, మంచిచెడులు చివరకు కుటుంబసభ్యులకు సైతం సమా చారం ఇవ్వడంలేదని తెలుస్తోంది. ఆకుల యాద గిరి మాదిరి మరో ముప్పు రావొద్దని గులాబీ నేత లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన వ్యవహారం ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్కు మున్సిపల్ పీఠం ప్రతిష్టాత్మకంగా మారింది. మెజార్టీ కౌన్సిలర్లు గెలిచి చైర్మన్గిరి వదులుకుంటే రాజకీయంగా పరువుపోతుందని బీఆర్ఎస్.. రాష్ట్రంలో అధికారంలో ఉండి మున్సిపల్ కుర్చీని చేజార్చుకుంటే నియోజకవర్గంలో ఒక మాయని మచ్చలా మిగిలిపోతుందనే భావన కాంగ్రెస్ నేతల్లో ఉంది. తగ్గెదేలేదన్నట్లు ఇరుపక్షాలు అన్ని మార్గాలను అన్వేషిస్తూ పావులు కదుపుతుండంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎప్పుడనేది వేచిచూడాల్సిందే. ఏడాది దాటినా అధికారుల పాలనే .. గత ఏడాది జనవరిలో పాలకవర్గం పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి అధికారుల పాలనలోనే కొనసాగుతోంది. తాజా ఎన్నికలతో కొత్త పాలకవర్గం ఏర్పడి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారని భావిస్తే గొడవలతోనే గడిచిపోతోంది. రసకందాయంలో ‘పట్నం’ రాజకీయం -
ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం తగదు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణిలో వచ్చిన అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సత్వరమే పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి ఆయన రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం సమస్యలు విని దరఖాస్తులు స్వీకరించే విధంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఈ వారం మొత్తం 43 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
ట్రేడ్ లైసెన్సులు జారీ చేయాలి
మీర్పేట: బడంగ్పేట సర్కిల్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని వాణిజ్య సంస్థలకు ట్రేడ్ లైసెన్సులు జారీ చేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.చంటి ముదిరాజ్ సోమవారం సర్కిల్ డీసీ సరస్వతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారానికి గుర్తింపు లభించేందుకు ట్రేడ్ లైసెన్సు చట్టపరమైన అధికారిక పత్రమని, లైసెన్సు పొందడం ద్వారా ప్రభుత్వ, వివిధ సంస్థల నుంచి అనేక ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. దీంతో పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే సులభంగా రుణాలు పొందవచ్చన్నారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వ్యాపారులు ప్రమాదాల సందర్భంలో నష్టపరిహారం పొందేందుకు ట్రేడ్ లైసెన్సులు ఎంతో ఉపయోగపడతాయని, పర్మినెంట్ ట్రేడ్ లైసెన్సు తీసుకుంటే ఏటా రెన్యూవల్ మాత్రమే చేయాల్సి ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శి కడమంచి అజయ్కుమార్, జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల మల్లేష్, కన్వీనర్ గుడ్డేటి ప్రవీణ్, ఉపాధ్యక్షులు దీపక్ కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు. -
చిదిమేసిన కారుచీకట్లు
● కనిపించక ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్ ● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు చేవెళ్ల: కారుచీకట్లు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. అప్పటివరకు బంధువులతో సరదాగా గడిపి తమ ఇంటికి బయలు దేరిన వారు ఎడ్ల బండిని ఢీకొట్టారు. మండలంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా.. భార్య త్రీవ గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పూలెపల్లి గ్రామానికి చెందిన భాస్కర్(30) తన భార్య రాణి, నాలుగేళ్ల కూతురు శాన్వితతో కలిసి సోమవారం బైక్పై చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి రాత్రికి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలోని తంగడపల్లి సమీపంలోకి రాగానే రోడ్డుపై ముందు వెళ్తున్న ఎడ్ల బండి కనిపించకపోవటంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భాస్కర్ తల పగిలి అక్కడిక్కడే మృతి చెందారు. రాణి సైతం తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది. కూతురు స్వల్పగాయలతో బయటపడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్లో క్షతగాత్రులను శంకర్పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిగ్రీ విద్యార్థిని అదృశ్యం పహాడీషరీఫ్: కిరాణ దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ ప్రకాశం జిల్లాకు చెందిన మోచే కుటుంబం బతుకుదెరువు నిమిత్తం తుక్కుగూడ మంఖాలకు వలస వచ్చారు. ఇతని కుమార్తె సోని అలియాస్ రీత(19) గుంటూరు నర్సరావు పేటలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యనభ్యసిస్తూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. ఈ నెల 20వ తేదీన మంఖాల్కు వచ్చిన రీత, 22వ తేదీన ఉదయం 11 గంటలకు స్థానికంగా ఉన్న కిరాణ దుకాణానికి వెళ్లొస్తానని బయటకి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ సైతం స్విచ్ఛాప్ చేయబడింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై ఆమె తల్లి జ్యోతి ఆదివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రజక దంపతులపై దాడి హేయం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముషీరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక దంపతులపై దాడి చేయడమే కాకుండా రెండు నెలల చిన్నారి మృతికి కారకులైన గ్రామ పెద్దలు శ్రీనివాస్రెడ్డి, మాధవరెడ్డి, సతీష్రెడ్డిలపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 14 బీసీ సంఘాల నాయకులతో కలిసి మాట్లాడారు. విచక్షణారహితంగా తన్నడంతో చిన్నారి మరణించిందని తెలిపారు. పోలీసు యంత్రాంగం బాధితుల పక్షాన నిలవకుండా వారిపైనే కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ హృదయ విదారక ఘటనను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా బీసీలు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల బీసీలపై దాడులు పెరిగిపోయాయని, నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ జిల్లాల్లో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని విచారం వ్యక్తం చేశారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్కుమార్, నాయకులు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీష్, జి.అనంతయ్య, సి.రాజేందర్, గుజ్జ కృష్ణ, రాందేవ్, కృష్ణుడు, చంద్రశేఖర్ తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రజక కులస్తులపై దాడికి ఖండన సాక్షి, సిటీబ్యూరో: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన జాతరలో రజక కులస్తులపై అగ్రవర్ణాలవారు దాడి చేయడాన్ని అఖిల భారత నవ యువ రజక సంఘం జాతీయ అధ్యక్షుడు ఓరేపల్లి హరికృష్ణ త్రీవంగా ఖండించారు. దర్శనం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారనే నెపంతో రజక కులస్తులపై సర్పంచ్ ఆధ్వర్యంలో అగ్రవర్ణాలు దాడిచేయడంతో రెండు నెలల పాప చనిపోయిందని తెలిపారు. వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాంగ్వార్లో గాయపడ్డ వ్యక్తి మృతి మైలార్దేవ్పల్లి: గ్యాంగ్ వార్లో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మైలార్దేవ్పల్లి ఎస్ఐ షేక్ అబ్దుల్లా తెలిపారు. వివరాలు... బీకే పురానికి చెందిన ఆరీఫ్ శాసీ్త్రపురంలో ఉంటున్న గౌస్ వద్దకు ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీ రాత్రి స్నేహితుడు షర్దీన్ను తీసుకొని వచ్చాడు. వీరి మధ్య జరిగిన గొడవలు కాస్తా గ్యాంగ్ వార్గా మారింది. రెండు వర్గాలవారు అక్కడికి చేరుకొని పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ముజామిల్, రహాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ముజామిల్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. -
నిజమైన రైతులకు పరిహారం ఇవ్వాలి
శంకర్పల్లి: భూమి కోల్పోతున్న నిజమైన రైతులకు ప్రభుత్వం పరిహార ఫలాలు అందించించాలని సీపీ ఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య కోరా రు. కలెక్టరేట్ వద్ద సోమవారం బాధిత రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పొన్నగుట్ట తండాకు చెందిన పలువురు గిరిజన రైతులకు ప్రభుత్వం సాగు చేసుకునేందుకు గతంలో అసైన్డ్ పట్టా భూములు కేటాయించింది. అభివృద్ధి, సంక్షేమ పనుల పేరుతో గతంలో ఇచ్చిన భూమిని తిరిగి తీసుకునేందుకు సిద్ధం కాగా.. పట్టా కలిగిన రైతులకు ఎకరాకు 800 గజాల స్థలం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అసైన్డ్ పట్టా కలిగిన రైతులకు కాకుండా ఇతర వ్యక్తుల పేర్లు అధికారులు రూపొందించిన జాబితాలో ఉన్నాయని, నిజమైన రైతులకు పేర్లు లేవని ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, పట్టా ఉన్న రైతులకే 800 గజాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగ్రావు, పానుగంటి పర్వతాలు, సుధీర్, బాధిత రైతులు శంకర్, కిషన్, అంబ్రియా, రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
బడంగ్పేట్: శ్మశానవాటికలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు బడంగ్పేట్లోని వైకుంఠధామంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని సర్వేనంబర్ 110లో హిందూ శ్మశానవాటికకు గతంలో 6.23 ఎకరాలను కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో శ్మశాకవాటికను అభివృద్ధి చేశారు. కొంతభాగం ప్రహరీ నిర్మించి మిగిలిన భాగం వదిలేశా రు. దీంతో ఆ స్థలంలో గుడి నిర్మాణానికి గిరిజను లు ఆదివారం పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు తాము కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని శ్మశానవాటికకు సోమవారం తరలివచ్చారు. స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, డిప్యూటీ తహసీల్దార్ మణిపాల్రెడ్డి, సిబ్బంది పోలీసులతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనుమతి లేకుండా నిర్మించిన దిమ్మెను కూల్చివేశారు. దీంతో అధికారుల చర్యకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే శ్మశానవాటికకు పకడ్బందీగా ప్రహరీ నిర్మించాలని కోరారు.బడంగ్పేట్ శ్మశానవాటికలో ఉద్రిక్త పరిస్థితులు -
కేసీఆర్ని వెనక్కి తెచ్చుకుందాం
శంకర్పల్లి: తెలంగాణ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే.. సీఎంగా మళ్లీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు హాలులో సోమవారం ఏర్పాటు చేసిన మున్సిపల్, మండల పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ అధ్యక్షుడిగా బద్ధం శశిధర్రెడ్డిని నియమించారు. అనంతరం బీజేపీ నుంచి వాసుదేవ్ కన్నా, దండు రామ్మోహన్, శ్రీకాంత్రెడ్డితో పాటు పలువురు ఆమె సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం సబితారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారని, వారిని ఓదార్చడానికి వెళ్తే.. వాళ్లే తనకు ధైర్యం చెప్పడం సంతోషాన్ని కలిగించిందన్నారు. పార్టీ కోసం ఇదే విధంగా కష్టపడి పని చేయాలని, వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం అవసరం లేకపోయినప్పటికీ హైడ్రా పేరుతో పేదల నుంచి భూములను గుంజుకుంటోందని ఆరోపించారు. సీఎంకి రంగారెడ్డి జిల్లా భూముల మీద ఉన్న ప్రేమ.. ఈ జిల్లా ప్రజలపై లేదని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, నాయకులు నారాయణ, గోవర్ధన్రెడ్డి, మాణిక్రెడ్డి, సత్యనారాయణ, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షించిన చిరుజల్లులు
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ● జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం తుర్కయంజాల్లో కురుస్తున్న వర్షం ఇబ్రహీంపట్నంలో కురుస్తున్న వాన సాక్షి, రంగారెడ్డిజిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. మూడున్నర నెలల విరామం తర్వాత సోమవారం జిల్లాలో పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. మరికొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరికి లోనైన జిల్లా వాసులు అకస్మాత్తుగా కురిసిన ఈ చిరు జల్లులతో ఉపశమనం పొందారు. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తుర్కయంజాల్ సహా పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో ఫీడర్లు ట్రిప్పయ్యాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై.. సరఫరాను పునరుద్ధరించారు. ఆదిబట్లలో భారీ వర్షం ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్లలో భారీ వర్షం కురిసింది. గాలివానతో ఔటర్ సమీపంలో పోలీస్స్టేషన్కు వెళ్లే దారిలో హోర్డింగ్ చినిగిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కల్గించింది. సుమారు అరగంట పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లన్ని జలామయమయ్యాయి. ఇబ్రహీంపట్నంలో.. ఇబ్రహీంపట్నం: ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం ఇబ్రహీంపట్నంలో కురిసింది. గత వారం రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ దశలో గాలులు వీస్తూ చిరుజల్లులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. తెగిపడిన విద్యుత్ లైన్ తుర్కయంజాల్: నిన్నా, మొన్నటి వరకు మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు అకాల వర్షంతో వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచే మబ్బులతో కూడిన వాతావరణంతో ఉండగా, సాయంత్ర నుంచి ఉరుములు, గాలితో కూడిన వర్షం కురిసింది. సుమారు 5 నిమిషాల పాటు వడగళ్లు పడ్డాయి. మంగళవారం కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిబట్ల సర్కిల్ డిప్యూటి కమిషనర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. మన్నెగూడలోని ప్రముఖ్ టౌన్షిప్లో చెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడటంతో లైన్ తెగి పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై కరెంటు నిలిపివేసి మరమ్మతు చేపట్టారు. గాలివాన కారణంగా పలు చోట్ల ఇబ్బంది తలెత్తినట్లు ఏఈ రవీందర్ రెడ్డి తెలిపారు. -
రీజియన్లకు స్వయం ప్రతిపత్తి
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరవాసులకు నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సేవలను మరింత చేరువ చేసేందుకు జలమండలి అడుగులు వేస్తోంది. అధికారాలను కేంద్రీకృతం చేయకుండా క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి వీలుగా మూడు స్వతంత్ర ప్రాంతీయ విభాగాలు (రీజియన్)గా పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రీజియన్లకు మరిన్ని ఆర్థిక, పరిపాలనా అధికారాలను కట్టబెట్టేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఏ చిన్న పని కావాలన్నా ప్రధాన కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ (సెంట్రల్), సైబరాబాద్, మల్కాజిగిరి రీజియన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఈడీ)కు కీలక అధికారాలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు విధి విధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. రూ.లక్ష దాటిన పనులకు రీజియన్ పరిధిలోనే.. ఒక్కో రీజియన్్ పరిధిలో నెలవారీగా రూ.50 లక్షల వరకు విలువైన కొత్త పనులను మంజూరు చేసే అధికారాన్ని ప్రాంతీయ స్థాయిలోనే ఈడీలకు కల్పించనున్నారు. రూ.80వేల లోపు విలువైన అత్యవసర పనులను టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిపై చేపట్టేందుకు, రూ.లక్ష దాటిన పనులకు రీజియన్్ స్థాయిలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు రూపొందిస్తోంది. నల్లా కొత్త కనెక్షన్లు ఇక సులభం సామాన్య వినియోగదారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. కొత్తగా నల్లా కనెక్షన్లు తీసుకోవాలంటే ఇక నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. సాధారణ ఇంటి కనెక్షన్ల నుంచి, 20 ఫ్లాట్లు ఉండే ఎంఎస్బీ (అపార్ట్మెంట్) వరకు కనెక్షన్లను మంజూరు చేసే అధికారాలు రీజియన్న ఈడీలకే అప్పగించాలని జలమండలి పరిశీలిస్తోంది. కేవలం కనెక్షన్లే కాకుండా, నెల వారీ బిల్లుల వసూళ్లు, వాటర్ అండ్ సీవరేజీ లైన్ల ని ర్వహణను కూడా రీజియన్ స్థాయిలోనే పర్యవేక్షించేలా విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వికేంద్రీకరణతోనే సేవల్లో పారదర్శకత ప్రస్తుతం జలమండలి పరిధి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించిన నేపథ్యంలో పెరిగిన పనిభారాన్ని తగ్గించేందుకు వికేంద్రీకరణ అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే చిన్నపాటి పనులు, మరమ్మతులు, పైపులైన్ లీకేజీల వంటి సమస్యలు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారమవుతాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. నెలవారీగా రూ.50 లక్షల విలువైన పనులు సాధారణ ఇంటి నుంచి ఎంఎస్బీ కనెక్షన్ల వరకు మంజూరు త్వరలో వెలువడనున్న అధికారిక ఉత్తర్వులు జలమండలిలో వికేంద్రీకరణ విప్లవం -
ఆర్ఎస్ఎస్ శత జయంత్యుత్సవం
తుర్కయంజాల్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆదిబట్ల సర్కిల్ పరిధి మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ ఉప్పలంచ మల్లికార్జున్ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ వాద భావజాల వ్యాప్తి, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో 0మహేశ్వరం భాగ్ సంఘచాలక్ మల్రెడ్డి బల్వంత్ రెడ్డి, శ్లోకా విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ రైతు మృతి పహాడీషరీఫ్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్నగర్కు చెందిన అంబోజి యాదయ్య(50) ఈ నెల 19వ తేదీన సాయంత్రం పొలం పనులు ముగించుకొని చెతక్ స్కూటర్పై ఇంటికి వెళుతున్నాడు. మార్గం మధ్యలో విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా, నిర్లక్ష్యంగా ఆటో ట్రాలీని నడుపుకొంటూ వచ్చిన డ్రైవర్ అతన్ని ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైన యాదయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందిన ఆయన ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లండి చేవెళ్ల: పుష్కరిణిలో ఈనెల 20న హత్య చేసి పడేసిన మృతదేహం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తోంది. ఈ మేరకు పోలీసులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మృతుడు తమిళనాడుకు చెందిన కర్ణయ్య అలియాస్ కరుణాకర్(60) చేవెళ్లలోని ఆలయ పుష్కరిణిలో అతడు సహజీవనం చేసే మహిళతో బలైన సంగతి తెలిసిందే. మృతుడి కుటుంబసభ్యులు తమిళనాడులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సోదరుడు ఎక్స్ సర్వీస్ మెన్గా హైదరాబాద్లో ఉంటున్నట్లు సమాచారం. వారి వివరాలు లేకపోవటంతో పోలీసులు ప్రకటనలో.. మృతుడి బంధువులు వచ్చి శవాన్ని తీసుకెళ్లాలని కోరారు. మరింత సమాచారానికి 8712663449, 8712680420, 8712568353 నంబర్లను సంప్రదించాలని కోరారు. మృతదేహం రెండు రోజులుగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు షాద్నగర్/కొత్తూరు: కదులుతున్న రైలులో నుంచి జారిపడి ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన నందిగామ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అశ్విన్(20) యువకుడు ఆదివారం సాయంత్రం కాచిగూడ నుంచి తమిళనాడుకు రైలులో వెళుతున్నాడు. మార్గమధ్యలో నందిగామ వద్ద ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది రాంచంద్రయ్య, పైలెట్ మహబూబ్లు క్షతగాత్రుడికి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రంజాన్ మాసం.. పారిశుద్ధ్య లోపం
పహాడీషరీఫ్: పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ జల్పల్లి సర్కిల్లోని ముస్లిం బస్తీలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్తా చెదారాలను అటుంచితే ఏకంగా ఇతర ప్రాంతాల నుంచి ఊర పందులను తీసుకొచ్చి తమ బస్తీలలో వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వాదే హదీస్ బస్తీకి వెళ్లే దారిలోని ఫిరంగి నాలా పరిసరాలలో పెద్ద ఎత్తున చెత్తా చెదారాలు పడేసి నిప్పంటించడం.. ఆపై పందులను కూడా ఆ ప్రాంతంలో వదిలేయడం పట్ల స్థానికులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఖాలేద్ బస్తీ వాసులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంటే.. ఇక్కడ మాత్రం ఇతర ప్రాంతాల నుంచి చెత్తను తెచ్చి పారబోస్తున్నారని వాపోయారు. ఫిరంగి నాలాలో చెత్తా చెదారాలు పడకుండా బస్తీ వాసులు చందాలు వేసుకొని ఇనుప కంచె ఏర్పాటు చేసుకుంటే, దానిని కూడా అధికారులే కత్తరించి చెత్తను డంప్ చేస్తున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు 50కి పైగా పందులను ఫిరంగి నాలాలో వదిలారని, ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే వాటిని అందులోనే వేసి మట్టి పోసి చంపేస్తామని సమాధానాలు ఇస్తున్నారని ఆరోపించారు. సర్కిల్ డీఈ(ఎస్డబ్ల్యూఎం) ఇష్రత్ ఆయేషా, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మోయిన్ బాబాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు పట్టించుకొని ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. జల్పల్లి అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం -
చికిత్స పొందుతూ బాలిక మృతి
మంచాల: రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందారు. పోలీసులు కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం బీ.వీ.పల్లె గ్రామానికి చెందిన ఈడిగ సరస్వతి, రవి దంపతులకు ఓంప్రకాశ్ కుమారుడు, అంజలి(15) కూతురు ఉన్నారు. ఓంప్రకాశ్ మండలంలోని నోముల పరిధిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. శనివారం కుమారుడిని చూసేందుకు తల్లి సరస్వతితో పాటు అంజలి కూడా వచ్చింది. తిరుగు ప్రయాణంలో నోముల వద్దకు రాగానే ఇబ్రహీంపట్నం నుంచి మంచాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అంజలిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలో లిమ్స్ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ వైద్యశాలకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య చేవెళ్ల: భర్తతో తలెత్తిన మనస్పర్ధలతో చెరువులో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన అశిగారి మనీష(28), నర్సింలు భార్యాభర్తలు. శనివారం రాత్రి నర్సింలు మార్కెట్కు వెళ్లాడు. వెంటనే అతడికి ఫోన్ చేసి ఇంటికి రావాలని మనీష కోరింది. ఈ క్రమంలో ఏమైందోగాని నర్సింలు అర్ధరాత్రి వచ్చి చూసే సరికే ఆమె కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం నాగుల చెరువులో మృతదేహం కనిపించినట్లు స్థానికులు చెప్పడంతో పోలీసులు పరిశీలించి మనీషగా నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో న్యాయ విద్యార్థి మృతి మేడ్చల్ రూరల్: రోడ్డు ప్రమాదంలో నల్సార్ న్యాయ విద్యార్థి మృతి చెందిన సంఘటన శామీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలొ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. శామీర్పేట్లోని నల్సార్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రియాంశు కుమార్ మీనా, సాక్షమ్, గోపీచంద్ లు ద్విచక్ర వాహనంపై శనివారం రాత్రి శామీర్పేట్ నుండి నల్సార్ వైపు వెళుతున్నారు. మార్గమధ్యలోని పెద్దమ్మ కాలనీ వద్ద ఎలాంటి సంకేతాలు లేకుండా ఓ ట్రక్ రోడ్డుపై నిలిపి ఉండడంతో గమనించని విద్యార్థులు ట్రక్ను ఢీకొని కిందపడ్డారు. అదే సమయంలో శామీర్పేట్ వైపు వేగంగా వస్తున్న అశోక్ లేలాండ్ ట్రక్ రోడ్డుపై పడి ఉన్న సాక్షమ్(21) తలపై నుండి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థి ప్రియాంశు కుమార్ మీనా గాయాలపాలయ్యాడు. పోలీసులు సాక్షమ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రోడ్డుపై ఎలాంటి సంకేతాలు లేకుండా పార్క్ చేసిన ట్రక్, అతివేగంగా వచ్చి విద్యార్థి పై నుండి వెళ్లిన వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం
బంజారాహిల్స్: వేగంగా దూసుకెళ్తున్న ఓ ఫెరారీ కారు బ్రేక్ ఫెయిలై స్టీరింగ్ లాక్ కావడంతో అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొని మరో కారును ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్లో నివసించే యువ వ్యాపారి ఈమని క్రాంతిరెడ్డి (30) తన భార్య శిరీషతో కలిసి ఆదివారం ఉదయం తన ఫెరారీ కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 మీదుగా ఫ్లైఓవర్ పక్క నుంచి కొండాపూర్ వైపు ఓ పెళ్లికి వేగంగా దూసుకెళ్తున్నాడు. కొద్దిసేపటికే కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో పాటు స్టీరింగ్ లాక్ అయింది. దీంతో కారు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి, మరో కారును బలంగా ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న పీయూష్వర్మ, మరో ఇద్దరు యువతులకు స్వల్ప గాయాలయ్యాయి. క్రాంతిరెడ్డి, ఆయన భార్య శిరీషకు కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. పీయూష్ నడుపుతున్న కారు సడెన్గా ఆగిపోవడంతో వెనుక వస్తున్న సెలోరో కారు ఢీకొట్టింది. సెలోరో కారు వెనుక వచ్చిన బుల్లెట్ బైక్ సెలోరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం క్షణాల్లోనే జరిగిపోయింది. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదంలో ఏడుగురి వరకు గాయపడ్డారు. క్రాంతిరెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా మద్యం తీసుకోలేదని తేలింది. బాధితుడు పీయూష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు క్రాంతిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో మూడు కార్లు, ఒక బుల్లెట్ వాహనం ధ్వంసం కాగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఫెరారీ కారు ఎందుకు ప్రమాదానికి గురైనదో ఎంవీఐకు లేఖ రాస్తున్నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
ఇద్దరు అదృశ్యం
మీర్పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన (మూగ) వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. నాగార్జునసాగర్ సమీపంలోని నాయకునితండాకు చెందిన మేరావత్ శ్రీను(30) మూడు నెలల క్రితం ప్రశాంతిహిల్స్లో నివాసముండే సోదరుడి వద్దకు వచ్చి నందిహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన శ్రీను మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో సోదరుడు ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యతో గొడవ పడి.. అబ్దుల్లాపూర్మెట్: భార్యతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో అనుగుల జయప్రకాశ్రెడ్డి(70) తన భార్య లక్ష్మితో నివాసముంటున్నారు. ఇరువురి మధ్య శనివారం ఉదయం గొడవ జరగడంతో ఇంటి నుంచి జయప్రకాశ్రెడ్డి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీంతో లక్ష్మి ఈ విషయాన్ని కూతుళ్లకు చెప్పడంతో ఆచూకీ కోసం బంధువులు, పరిసరాల్లో వెతికినా లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
● ఐదు రోజుల పాటువేంకటేశ్వరస్వామి ఉత్సవాలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు ఆమనగల్లు: పట్టణంలో వెలసిన శ్రీ వేంకటగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 23 నుంచి 27 వరకు 126వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం ఆలయ ధర్మకర్త గూడ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది పాల్గుణమాసం షష్టి నుంచి ఏకాదశి వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆమనగల్లు మండలంతో పాటు సమీప మండలాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం గాన కై ంకర్యదాసులు శ్రీ వేంకటాచలపతిచే అన్నమయ్య గాన విభావరి నిర్వహించనున్నారు. కార్యక్రమాల వివరాలు ఈనెల 23న సాయంత్రం పుణ్యహావాచనం, విశ్వక్సేన ఆరాధనం, అంకురార్పణ, దేవతాహ్వానంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 24న స్వామి వారికి మహాభిషేకం, ప్రత్యేక పూజలు, అగ్నిప్రతిష్ఠ, హోమం, ధ్వజారోహణం, ఎదుర్కోలు, 25న ఉదయం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు, ఉదయం 11 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, 26న మహాభిషేకం, సుప్రభాతసేవ, ఉదయం 6 గంటలకు రథోత్సవం, 10 గంటలకు సుదర్శన హోమం, దోపోత్సవం, 27న మహాభిషేకం, సుప్రభాత సేవ, అర్చనలు, పూర్ణాహుతి, చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ధర్మకర్త కోరారు. -
వ్యర్థాలు పారబోసిన వాహనం సీజ్
పహాడీషరీఫ్: నగర శివారుగా ఉన్న జల్పల్లి సర్కిల్ పరిధిలో కొందరు అక్రమార్కులు కంపెనీల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను యథేచ్ఛగా పడేస్తూ ఈ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా మారుస్తున్నారు. స్థానికంగా ఉన్న కంపెనీ నుంచి ఓ వ్యక్తి శనివారం పెద్ద ఎత్తున వ్యర్థాలను బొలెరో వ్యాన్లో తీసుకొచ్చి చెరువు ఒడ్డున పారబోస్తున్నాడు. ఈ సమయంలో అటుగా వచ్చిన మున్సిపల్ డ్రైవర్ సురేశ్ అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న హైడ్రా అధికారులు, సర్కిల్ పారిశుద్ధ్య విభాగం సూపర్వైజర్ కుమార్లు వాహనాన్ని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ బి.వెంకట్రామ్ సూచనతో హైడ్రా అధికారులు వాహనాన్ని సీజ్ చేశారు. సర్కిల్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో కంపెనీల వ్యర్థాలు, చెత్త వేసే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. -
ఫీజుల పేరుతో వేధించే కళాశాలలపై చర్యలు
చేవెళ్ల: ఫీజుల పేరుతో పరీక్షలు సమయంలో హాల్టికెట్లు ఇవ్వకుండా వేధించే ప్రైవేట్ కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి బి.అరుణ్కుమార్ అన్నారు. చేవెళ్లలో శనివారం ఎస్ఎఫ్ఐ నాయకులు డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పరీక్షలు సమయం వచ్చిందని కార్పొరేట్ కళాశాల్లో విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తే ఆ కళాశాలలపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ చందు, చరణ్గౌడ్, మణికంఠ, వినోద్, తరుణ్, సంతోష్, వేణు, రిశికిరణ్ తదితరులు ఉన్నారు. -
చైర్మన్ ఫలితాన్ని ప్రకటించండి
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించి, వెంటనే వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి లింగ్యానాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. చైర్మన్ ఎన్నిక ప్రకటనను అక్రమంగా నిలిపివేశారని, వెంటనే ప్రకటించాలని కోరారు. అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక తేదీని ప్రకటించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తదితరులు విన్నవించారు. కోర్టులు, కమిషన్ చుట్టూ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ రాజకీయాలు కోర్టులు, ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి అపహరణ, 23 వార్డులో కుల ధ్రువీకరణ, 21 వార్డులో మూడు నోట్ల నమోదు తదితర అంశాలు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారాలన్నీ కోర్టులు, ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతుండటంతో చైర్మన్ ఎన్నిక సందిగ్ధంలో పడ్డాయి. -
కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం
అనంతగిరి: వికారాబాద్ పట్టణ పరిధిలోని అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్లో శనివారం రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ పట్టణంలోని ఎస్ఏపీ కళాశాల మైదానానికి మధ్యాహ్నం 2.50గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతగిరి హరిత రిసార్ట్స్కు 3.02 గంటలకు వెళ్లారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో పాల్గొని సాయంత్రం 5గంటలకు వికారాబాద్ చేరుకున్నారు. 5.26 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ ప్రత్యేక చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అనంతగిరి గుట్ట వైపు వెళ్లే వాహనాలను బుగ్గ మీదుగా మళ్లించారు. ఘన స్వాగతం హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు రా మ్మోహన్రెడ్డి,మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ప్రతీక్జైన్, డీఐజీ చౌహాన్, ఎస్పీ స్నేహమెహ్ర, ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గ డ్డం అనన్యను సీఎం రేవంత్రెడ్డి అభినందించా రు. కార్యక్రమంలో వైస్చైర్మన్ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. -
ఎవరు.. ఎక్కడ
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మూడు కార్పొరేషన్ల కోసం త్వరలో ‘స్టాఫింగ్ పాటర్న్’ సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి జీహెచ్ఎంసీని విభజించి మూడు కార్పొరేషన్లు చేశాక కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లలో అధికారులు, సిబ్బంది సమస్య వెంటాడుతోంది. అన్ని విభాగాల్లో తగినంత మంది అధికారులు, సిబ్బంది లేక పనుల్లో జాప్యం జరుగుతోంది. అసలే బాలారిష్టాల్లో ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లకు ఇతరత్రా ఇబ్బందులతో పాటు సిబ్బంది లేమి పెద్ద సమస్యగా మారింది. త్వరలో ప్రారంభం కానున్న వందరోజుల ప్రణాళిక కార్యాచరణపై కూడా ఇది ప్రభావం చూపనుంది. పెరిగిన పని భారం.. ఉమ్మడి జీహెచ్ఎంసీలో ఉన్న, విలీనమైన 27 స్థానిక సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బందినే మూడు కార్పొరేషన్లకూ సర్దుబాటు చేశారు. దాంతో జీహెచ్ఎంసీలో ఖాళీ అయిన వారి స్థానాలను ఇతర అధికారులకు అదనపు బాధ్యతలుగా అప్పగించారు. దీంతో వారి పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఏ కార్పొరేషన్లో ఎందరుండాలి? స్టాఫింగ్ పాటర్న్ ఎలా ఉండాలి? అనేది తెలుసుకునేందుకు టాస్క్ఫోర్స్ కమిటీ సిఫార్సుల కోసం వేచి చూస్తున్నారు. టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు.. మూడు కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీ, సిబ్బంది విభజన, తదితరమైన వాటిపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. మూడు కార్పొరేషన్లకు అవసరమైన అధికారులు, సిబ్బందికి సంబంధించి స్టాఫింగ్ పాటర్న్పై కమిటీ సిఫార్సులందాక, ఆ మేరకు సర్దుబాటు చేయడమో, నియామకాలకు ప్రభుత్వం అనుమతించడమో జరగాల్సి ఉంది. అప్పటిదాకా సర్దుబాటు తప్పనిసరి టాస్క్ఫోర్స్కమిటీ సిఫార్సులు అందేవరకు ఉన్నవారితోనే సర్దుబాటు తప్పని పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే కమిటీ నివేదిక అందనున్నట్లు సమాచారం. గతంలో జీహెచ్ఎంసీకి అవసరమైన అధికారులు, సిబ్బంది ఎక్కడ ఎందరు అవసరమో తెలిపేందుకు స్టాఫింగ్ పాటర్న్ కోసం అప్పటి ప్రభుత్వం రిటైర్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రసాదరావు కమిటీని నియమించింది. దానిని ఆధారంగా చేసుకునే ప్రస్తుత టాస్క్ఫోర్స్ కమిటీ కూడా సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. -
24న చలో సెక్రటేరియట్
ఇబ్రహీంపట్నం: పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 24న చేపట్టనున్న చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్ను శనివారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఎదుట ఆ సంఘం జేఏసీ నేతలు ఆవిష్కరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, 2021 వేతన సవరణ, పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, కార్మికులకు ఉద్యోగ భద్రత, యూనియన్ల పునరుద్ధరణ తదితర సమస్యలపై చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు సురేశ్యాదవ్, శ్రీశైలం, అబ్దుల్రజాక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
శంకర్పల్లి: మున్సిపాలిటీ పరిధిలోని రామంతాపూర్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేడుకల్లో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రంగురంగుల పూలతో ముస్తాబు చేసి, పల్లకీపై ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు మున్సిపాలిటీతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రశాంత్, నాయకులు వెంకట్రెడ్డి, ఉపేందర్రెడ్డి, మల్లయ్య, చంద్రశేఖర్రెడ్డి, మహేందర్రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రౌడీయిజాన్ని అణచివేస్తాం
పహాడీషరీఫ్: రౌడీషీటర్ల నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెలగాలని పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి సూచించారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు శనివారం ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్ల గత నేర చరిత్ర, ప్రస్తుతం చేస్తున్న పని, ఇటీవల ఏమైనా నేరాలలో ప్రమేయమున్నారా? అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వారు పనిచేసే ప్రదేశంలో కూడా వ్యవహార శైలిపై పరిశీలిస్తామన్నారు. సామాన్య ప్రజల పట్ల బెదిరింపులకు పాల్పడినట్లయితే ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి పూట రౌడీషీటర్లు ఇంట్లోనే ఉండాలని, ఏ సమయంలోనైనా పెట్రోలింగ్ వాహనం తనిఖీకి వస్తుందని పేర్కొన్నారు. ప్రవర్తన మార్చుకోకుండా క్రమం తప్పని నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ లు దయాకర్రెడ్డి, లక్ష్మయ్య, ఫైజల్ అహ్మద్ పాల్గొన్నారు. -
పసిపాపను తెచ్చి ఇవ్వండి
యాచారం: పసి పాపను ప్రాణాలతో తెచ్చివ్వండి.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, తెలిసి తెలియని వైద్యంతోనే శిశువు మృతి చెందడంతో పాటు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని మండలంలోని మల్కీజ్గూడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల కింద గ్రామానికి చెందిన కల్యాణి పురటినొప్పులతో యాచారం సీహెచ్సీకి వస్తే ప్రసవించే సమయంలో పసిపాప మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం జిల్లా అదనపు వైద్యాధికారి లక్ష్మీప్రసన్న యాచారం సీహెచ్సీకి చేరుకుని బాధిత మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్కీజ్గూడ, యాచారం గ్రామానికి చెందిన పలు రాజకీయ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తెలిసి, తెలియని వైద్య సేవలతో పసిపాప మృతి చెందిందని మండిపడ్డారు. పురటి నొప్పులతో మహిళ ప్రసవం కోసం వస్తే ఆరోగ్య పరిస్థితి అంచనా వేయకుండా ఆస్పత్రి చుట్టూ తిప్పించి తీరా.. అధిక బరువు ఉందని సాకుతో శిశువు మృతి చెందేలా చేశారని సిబ్బందిపై నిప్పులు చెరిగారు. ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సీహెచ్సీకి వచ్చి సముదాయించే యత్నం చేశారు. పసిపాప మృతి చెందడానికి కారణమైన వైద్య సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన జిల్లా అదనపు వైద్యాధికారి లక్ష్మీప్రసన్న వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వైద్యాధికారి లలితాదేవి కూడా యాచారం సీహెచ్సీలో జరిగిన పసిపాప మృతిపై ఫోను చేసి ఆస్పత్రి సూపరెండెంట్ నవీన్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి
షాద్నగర్: విద్యార్థులు చదువుతోపాటుగా సృజనాత్మక పెంపొందించుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి సూచించారు. శనివారం షాద్నగర్ పరిఽధిలోని నందిగామ మండలం కన్హా శాంతి వనంలో కేంద్ర స్కిల్స్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు. ఈ నెల 24 వరకు జరగనున్న ఈ పోటీల్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్ష్యదీప్ల నుంచి వివిధ కళాశాలలకు చెందిన 350 మందికి పైగా విద్యార్థులు 63 విభాగాల్లో పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి హాజరై మాట్లాడుతూ.. యువత విద్యతో పాటుగా, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జీవితానికి అవసరమైన మెళకువలను చదువుతోపాటుగా నేర్చుకోవాలన్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని రాణించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, తద్వారా ఒత్తిడిని ఎదుర్కొనే మనోధైర్యం లభిస్తుందన్నారు. రైజింగ్ తెలంగాణలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ఉన్నత విద్యతో పాటుగా, నైపుణ్యం ఎంతో ముఖ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రధాని మోదీ చెప్పిన విధంగా 2030 వరకు దేశంలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలతో 20లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. -
పోరాటాలతోనే ప్రజల్లో చైతన్యం
యాచారం: పోరాటాలతోనే ప్రజల్లో చైతన్యం వస్తుందని, అధికారంలోని ఉన్నా.. లేకున్నా అన్యాయంపై ఎర్రజెండాకే ఎదురించే శక్తి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పేర్కొన్నారు. శనివారం మాల్ కేంద్రంలో రెడ్ బుక్ డే పుస్తక పఠన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కమ్యూనిష్టులు పుస్తకాల ద్వారానే ప్రజల్లో చైతన్యం అవుతారని, 1848 ఫిబ్రవరి 21న ప్రపంచానికి ప్రణాళిక పుస్తకాలను పరిచయం చేశారన్నారు. సంపద కొందరి చేతుల్లోనే ఉంటుందని, కానీ పుస్తక జ్ఞానం అందరిలో వస్తుందన్నారు. ప్రతి పౌరుడు పూర్వ పుస్తకాలను చదివి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో పుస్తక జ్ఞానం ఎంతో ముఖ్యమన్నారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా సీపీఎం పేదల సంరక్షణ కోసం పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నర్సింహ, నాయకులు పి.అంజయ్య, జంగయ్య, చందునాయక్, వెంకటయ్య, లాజర్, బాలరాజ్, విప్లవ్కుమార్, తావునాయక్ పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య -
స్కూటీని ఢీకొట్టిన లారీ
వ్యక్తి దుర్మరణం కొందుర్గు: స్కూటీని లారీ ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్పహాడ్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలుకు చెందిన చాంద్ పాషా(40) లాల్పహాడ్ వద్ద పాన్షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించేవారు. అతడికి భార్య అమీరా బేగంతోపాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే శనివారం సాయంత్రం తన స్వగ్రామం రాపోలు నుంచి లాల్పహాడ్ స్కూటీపై వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో స్కూటీ నడుతున్న చాంద్పాషాపై నుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయి అక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి భార్య అమీరా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. -
నిజాయతీ చాటుకున్న విద్యార్థి
దొరికిన బంగారు ఉంగరాన్ని ఉపాధ్యాయులకు అప్పగింత యాచారం: ఓ విద్యార్థి తన నిజాయతీని చాటుకున్నాడు. తనకు పాఠశాల ఆవరణలో దొరికిన బంగారు ఉంగారాన్ని ఉపాధ్యాయులకు అందజేసి శభాష్ అనిపించుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కుర్మిద్ద ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం వార్డు సభ్యురాలు సంతోషినిప్రియ సందర్శించే సమయంలో రూ.మూడు లక్షల విలువ జేసే బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఆ ఉంగరం అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దండె విక్రమ్కు దొరికింది. అతడు ఉంగరాన్ని పాఠశాల హెచ్ఎం పాండురంగారెడ్డికి అందజేశారు. ఉంగరాన్ని పోగొట్టుకున్న వివరాలు ఆరా తీయగా వార్డు సభ్యురాలు సంతోషినిప్రియగా తేలింది. హెచ్ఎం పాండురంగారెడ్డి సంతోషినిప్రియకు సమాచారం ఇచ్చి ఉంగరాన్ని అందజేశారు. నిజాయతీగా ఉంగరాన్ని అందజేసిన విక్రమ్ను ఉపాధ్యాయులు, వార్డు సభ్యురాలు అభినందించి, సన్మానించారు. -
యథావిధిగా ప్రజావాణి
కలెక్టర్ నారాయణరెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23న సోమవారం యథావిథిగా కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిందని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎప్పటిలాగే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. బాధితులు స్వయంగా హాజరై, తమ సమస్యలను విన్నవించుకోవచ్చని సూచించారు. మళ్లీ విధుల్లోకి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రతి మా సింగ్ మళ్లీ విధు ల్లో చేరారు. ఆమె కొంతకాలంగా ప్రసూతి సెలవుల్లో వెళ్లారు. మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు శ్రీనివాస్ ఇన్చార్జి కలెక్టర్గా వ్యవహరించారు. ప్రతిమా సింగ్ రాకతో ఆయన తన పూర్వస్థానంలోకి వెళ్లిపోయారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుల ఎంపిక షాద్నగర్: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులుగా పట్టణానికి చెందిన పవన్ చౌహాన్, ఆకాశ్నాయక్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర 4వ మహాసభలను నిర్వహించారు. ఈ సభల్లో సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర సమితి సభ్యులుగా పవన్ చౌహాన్, ఆకాశ్నాయక్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నుకున్నందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయాలని వినతి శంకర్పల్లి: గిరిజన రైతులకు న్యాయం చేయాలని శనివారం సీపీఐ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకుడు పానుగంటి పార్వతాలు మాట్లాడుతూ.. శంకర్పల్లి మండలంలోని పొన్నగుట్ట తండా గిరిజనులకు గతంలో ప్రభుత్వం సాగు చేసుకునేందుకు అసైన్డ్ భూములను కేటాయించిందన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనుల కోసమని ఆ భూములను తిరిగి వెనక్కి తీసుకొని రైతులకు ఎకరానికి 800 గజాల భూమి ఇస్తుందన్నారు. అయితే అధికారులు గుర్తించిన జాబితాలో భూమికి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఉన్నాయని, 800 గజాల భూమిని అసలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన పత్రాలను అదనపు కలెక్టర్కి అందించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేవారు. కార్యక్రమంలో నాయకులు రామస్వామి, ప్రభులింగం, సుధీర్, రాజేందర్, రైతులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు సాక్షి, సిటీబ్యూరో: నిబంధనలు అతిక్రమించే మెడికల్ దుకాణాలు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం హెచ్చరించారు. హేబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అమ్మకాలపై శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 166 మెడికల్ దుకాణాల్లో చట్టవిరుద్ధంగా హెచ్–1, షెడ్యూల్డ్ ఎక్స్ అమ్మకాలు జరుగుతున్నాయని గుర్తించి నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. -
విధులు మరిచి.. చోరులుగా మారి
షాద్నగర్రూరల్: రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని రక్షించే విధులను నిర్వర్తిస్తున్న వారు బంగారం కనిపించగానే చోరులుగా మారారు. ఈ సంఘటన షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పట్టణ సీఐ విజయ్కుమార్ వివరాలను వెల్లడించారు. తుర్కయంజాల్కు చెందిన గంగిరెడ్డి మధుసూదన్రెడ్డి(40), పుల్లగురం పురుషోత్తంరెడ్డి(39) అరుణాచలం క్షేత్రానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ నెల 17న బూర్గుల గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. అప్పుడు విషయం తెలుసుకున్న ఎన్హెచ్ఎఐ(హైవే పెట్రోలింగ్) డ్రైవర్ గోద రవికుమార్గౌడ్, అసిస్టెంట్ లోకేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించేందుకు వాహనంలో ఎక్కించే సమయంలో మృతుడు పుల్లగురం పురుషోత్తంరెడ్డి మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించారు. తరువాత ఎవరికై నా విక్రయించి డబ్బులు తీసుకుందామని మాట్లాడుకున్నారు. తరువాత రోజు మృతుడు పురుషోత్తంరెడ్డి సోదరుడు విజయానంద్రెడ్డి మార్చురీకి వద్దకు వచ్చి చూడగా మృతదేహంపై బంగారు గొలుసు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి రూ.మూడు లక్షల విలువచేసే రెండు తులాల బంగారు గొలుసు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణాధికారి క్రైం ఎస్ఐ శివారెడ్డి సిబ్బంది రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు కేసును ఛేదించడంలో కీలక పాత్రను పోషించారు. ఇద్దరి అరెస్టు, రిమాండ్కు తరలింపు -
ముగిసిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ అండర్–19 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు సాయంత్రం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రికర్వ్ బాలుర విభాగంలో పి.నాగసాయి కృషివ్రెడ్డి(రంగారెడ్డి), ఏ.వెంకటేష్(వరంగల్), టి.వెంకట యోగీశ్వర్(ఖమ్మం) మొదటి మూడు స్థానాల్లో నిలిచి బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. రికర్వ్ బాలికల విభాగంలో కె.లోహితశ్రీ(భద్రాద్రి కొత్తగూడెం), ఎన్.షన్విత(కరీంనగర్), బి.కృపారాణి(వరంగల్), కాంపౌండ్ బాలుర విభాగంలో కె.బూవన్ సాకేత్(మేడ్చల్), ఎన్.కృతిక్ శ్రీవాత్సవ్(మహబూబ్నగర్), వి.సంవర్ధన్రెడ్డి(హైదరాబాద్), బాలికల విభాగంలో ఆర్.హన్సికరావు(పెద్దపల్లి), ఎన్.స్మృతి సన్నిభ(మహబూబ్నగర్), ఎం.శ్రీనిక (నిజామాబాద్) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో కె.రాంచరణ్(భద్రాద్రి కొత్తగూడెం), టి.సునీల్కుమార్(నిర్మల్), ఆర్.భార్గవ్(ఖమ్మం), బాలికల విభాగంలో చిట్టె మాన్య(మేడ్చల్), జి.నిహారిక(నిర్మల్), సీహెచ్.రష్మితరెడ్డి(సిద్ధిపేట) మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు. -
మంత్రి పొన్నంను కలిసిన ఉద్యమకారులు
అబ్దుల్లాపూర్మెట్: తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు శనివారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్తో పాటు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యమకారుల అంశం రాజ్యసభలో ఆమోదం తెలిపిన సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రితో పాటు ఎమ్మెల్సీలను కలిసి వారికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం నాయకులు ఓరుగంటి ఆనంద్, జెనిగె విష్ణువర్ధన్, కారింగుల నరేందర్గౌడ్, కొంతం యాదిరెడ్డి, నక్క జంగయ్యగౌడ్, జోర్క రాముముదిరాజ్, జానకిరెడ్డి, మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి సహకారం
బోడుప్పల్: మన సంస్కృతి సంప్రదాయాలకు ఆలయాలు ప్రతీకలుగా నిలుస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బోడుప్పల్ కేశవనగర్ కాలనీలోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ ఆలయంలో శుక్రవారం పంచముఖ ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పూజలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని, యువత ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయకుమార్రెడ్డి, ఆలయ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లేష్, కోశాధికారి నారాయణరావు, కేశవనగర్ కాలనీ అధ్యక్షులు బసవారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కాలనీవాసులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
రోహిత్రెడ్డికి బెయిల్ మంజూరు
మరో 8 మంది బీఆర్ఎస్ నాయకులకు సైతం తాండూరు: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కోడ్ ఉల్లంఘించిన కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తోపాటు మరో 8 మంది బీఆర్ఎస్ నాయకులకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 13న తాండూరు పట్టణంలోని సెయింట్ మార్కస్ స్కూల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత పలు వార్డుల ఫలితాలు ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు, దీంతో మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సైతం వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పట్టణ సీఐ సంతోష్, పోలీసు అధికారులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోహిత్రెడ్డి పోలీసు ఽఅధికారులపై అనుచితంగా ప్రవర్తించారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంగించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేస్తారనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే తోపాటు మరో 8 మంది బీఆర్ఎస్ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. రోహిత్రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో 5 రోజుల క్రితం బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పైలెట్ అజ్ఞాతం వీడారు. నేడో.. రేపో తాండూరుకు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
మీర్పేట: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఫిర్యాదు మేరకు శుక్రవారం బడంగ్పేట సర్కిల్ ప్రశాంతిహిల్స్ డివిజన్ పరిధిలోని నందిహిల్స్, టీచర్స్కాలనీల్లోని మటన్, చికెన్ షాపులను వెటర్నరీ అధికారి డాక్టర్ రవిచంద్ర ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సైదులు మటన్, చికెన్ సెంటర్లో కుళ్లిపోయిన మటన్ను ఫ్రిడ్జ్లో నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించడంతో పాటు లైసెన్సు లేకపోవడంతో షాప్ను సీజ్ చేశారు. దీంతో పాటు మరో నాలుగు చికెన్ సెంటర్లకు లైసెన్సులు లేకపోవడం, నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నందున జరిమానాలు విధించారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కడైనా నిబంధనలు పాటించకుంటే ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీల్లో కమిటీ రాష్ట్ర కార్యదర్శి కడమంచి అజయ్కుమార్, జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల మల్లేశ్, అరుణ్సింగ్, దుశ్యంత్ బల్బీర్సింగ్ ఉన్నారు. -
పుష్కరిణిలో మృతదేహం లభ్యం
చేవెళ్ల: వలస కూలీని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపి పుష్కరిణిలో పడేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని కందవాడలో కరుణాకర్ అలియాస్ కర్నయ్య(60) అనే తమిళనాడుకు చెందిన వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన కొన్నేళ్ల క్రితమే వలసొచ్చి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉండేవాడు. అతని భార్య గతంలోనే చనిపోవటంతో కందవాడకు చెందిన బాలమణితో పరిచయం ఏర్పడటంతో ఆరేళ్లుగా ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో జరుగుతున్న ఉత్సవాలకు గురువారం ఇద్దరు వచ్చారు. సాయంత్రం కలిసి మద్యం, కల్లు తాగి వెళ్లిపోయారు. రాత్రి ఏం జరిగిందోగాని ఆయన ఉదయం పుష్కరిణిలో శవమై తేలాడు. శుక్రవారం ఉదయం మృతదేహం తేలి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై రక్తగాయలు ఉండటంతో కర్రతో కొట్టి చంపి పుష్కరిణిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రక్తపు మరకలతో ఉన్న కర్ర లభించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్తో వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.కొట్టి చంపి పడేసినట్లు ఆనవాళ్లు -
20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
శంకర్పల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శుక్రవారం మోకిల పోలీసులు పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లకి చెందిన మహబూబ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా గ్రామాల్లో తిరుగుతూ అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నాడు. తర్వాత వాటిని పీఎస్ పరిధిలోని జన్వాడలో నిల్వ ఉంచాడు. పోలీసులు పక్కా సమాచారం అందుకోని దాడులు నిర్వహించి, 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, డీసీఎం వాహనాన్ని సీజ్ చేసి ఠాణాకి తరలించారు. మహబూబ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రెండు ఆలయాల్లో హుండీలు చోరీ
షాద్నగర్రూరల్: ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండల పరిధిలోని కడియాలకుంట తండాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాలోని సేవాలాల్ మహరాజ్ ఆలయం, బూరుగడ్డ తండాలోని ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలను దుండగులు ఎత్తుకెళ్లారు. కానుకలను అపహరించి హుండీలను సమీప పొలాల్లో పడేశారు. ఈ మేరకు సర్పంచ్ రాజునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఎస్ఐ శివారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శంషాబాద్ రూరల్: కుటుంబ సభ్యులు జాతరకు వెళ్లగా.. ఇంటి నుంచి బాలిక అదృశ్యమైన ఘటన రషీద్గూడలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి సమాచారం మేరకు... వనపర్తి జిల్లా వీపనగండ్ల నివాసి ఆలె ఆశన్న తన కుటుంబంతో కలిసి నాలుగేళ్ల కిందట వలస వచ్చి రషీద్గూడలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 19న భార్య, కొడుకుతో కలిసి ఆశన్న కొల్లాపూర్లోని ఈదమ్మ జాతరకు వెళ్లారు. ఈ సమయంలో వారి కూతురు సింధు ఇంట్లోనే ఉంది. ఈమె పట్టణంలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుకుంటుంది. కుటుంబ సభ్యులు జాతర నుంచి అదే రోజు ఇంటికి వచ్చి చూడగా.. సింధు ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో నుంచి దుస్తులు, స్టడీ సరిఫికెట్లు కూడా లేవు. ఆమె కోసం అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం పొలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించాలని ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్లోని జిల్లా కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. దర్యాప్తును వేగవంతంగా చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించడంపై పోలీస్ అధికారులను అభినందించారు. భవిష్యత్లో కూడా ఇదే టీమ్ వర్క్గా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. -
ఈ 20 రోజులే కీలకం
‘పది’లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా కార్యాచరణ వికారాబాద్: ‘పదో తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా టీంవర్క్ చేస్తున్నాం.. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. విద్యార్థులు భయం లేకుండా నేర్చుకున్నది పరీక్షల్లో రాసేలా సంసిద్ధులను చేస్తున్నాం..’ అని డీఈఓ రేణుకాదేవి అన్నారు. మార్చి 14వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ చేస్తున్న కసరత్తు.. తీసుకుంటున్న చర్యలను ఆమె ‘సాక్షి’కి వివరించారు. డీఈఓ మాటల్లో.. పరీక్షలకు మూడు నెలల సమయం ఉన్నప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టాం. ప్రత్యేక తరగతులు, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించడం.. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వంటివి ప్రారంభించాం. మరో 20 రోజుల సమయం మాత్రమే ఉన్నందున మరింత శ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులకు కూడా ఈ సమయం అత్యంత కీలకం. గత ఫలితాలు నిరాశ పరిచాయి కరోనా కంటే ముందు పది ఫలితాల్లో జిల్లా 27వ స్థానంలో ఉండేది. ఆ తర్వాత ఏడాది బాగా కష్టపడటంతో 24వ స్థానానికి చేరుకున్నాం. రెండేళ్ల నుంచి ఫలితాలు నిరాశ పరిచాయి. ఈ పరిస్థితి పునరావృతం కారాదని, శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. కలెక్టర్ హెచ్ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 13,248 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 10,328 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కాగా.. 2,920 మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేశాం పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధంచేసే విషయంలో ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. గతేడాది ఉదయం స్నాక్స్ లేక విద్యార్థులుఇబ్బందులు పడ్డారు. ఈ సారి ప్రభుత్వమే స్నాక్స్ కోసం నిధులు సమకూర్చింది. ఒంటిపూట బడుల సమయంలో కూడా స్పెషల్ క్లాసులు తీసుకునేలా చర్య లు తీసుకుంటాం. ఇందుకోసం ప్రతి పాఠశాలలో రోజూ ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా హెచ్ఎంలను ఆదేశించాం. ఈ సారి విద్యార్థులు సులభంగా చదువుకునేందుకు ప్రభుత్వం అభ్యసన దీపికలు అందజేసింది. వాటి ద్వారా కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ప్రీ ఫైనల్స్ పక్కాగా నిర్వహిస్తున్నాం.. ఒక రోజు ఎగ్జామ్ పెట్టి మరో రోజు వారు రాసిన పరీక్ష పేపర్లపైన ఉపాధ్యాయులు చర్చించేలా ప్లాన్ చేస్తున్నాం. అందులో ఏమైన లోపాలు ఉంటే వారికి అర్థమయ్యేలా ఉపాధ్యాయులు చెబుతారు. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి గ్రూపులుగా విభజించి బోధన చేస్తున్నాం. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు రోజుల వ్యవధి ఉన్నందున ఆ సమయంలో వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాం. విద్యార్థులను స్కూళ్లకు రప్పించి మరోసారి రివిజన్ చేస్తాం. వేకప్ కాల్స్ చేస్తున్నాం విద్యార్థులకు చదువు చెప్పడంతో సరిపెట్టకుండా ఉదయం 5గంటలకే వేకప్ కాల్స్ చేస్తున్నాం. తల్లిదండ్రులతో తరచూ మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించాం. పేరెంట్.. టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. చదువులో వెనుకబడిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యార్థులు ఉంటే వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో చర్చిస్తున్నాం. హెచ్ఎంలు, ఎంఈఓలతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నా.. ప్రధానోపాధ్యాయులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు సూచనలు ఇస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్న స్థానాల్లో సబ్జెక్టు తెలిసిన ఎస్జీటీలతో పాఠాలు చెప్పిస్తున్నాం. టీంవర్క్ చేసి మంచి ఫలితాలు సాధించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం. ఈ సారి మంచి రిజల్ట్ వస్తుందని నమ్మకం ఉంది. విద్యార్థులు కూడా ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
మూసీ భూ సేకరణలో రైతులకు న్యాయం చేస్తాం
శాస్త్రిపురం: మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు సంబంధించి ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం హైదర్గూడలో మూసీ డెవలప్మెంట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము కోల్పోయిన భూములకు నష్ట పరిహారంగా భూములే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల్లో కాయగూరలు, ఆకుకూరలు పండించుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వెంకట్రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు. -
రోజుకో మలుపు
ఇబ్రహీంపట్నం: పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు సీరియల్ డ్రామాను తలపిస్తోంది. ఆయా పదవుల ఎన్నికలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పలేని అయోమయ, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుపార్టీల శ్రేణులు వివిధ అంశాలపై న్యాయస్థానం గడప తొక్కడంతో పీఠముడి ఎప్పటికి వీడుతుందోనన్న సందిగ్ధం నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోపాటు పలువురు కౌన్సిలర్లపై చెలరేగుతున్న దుమారంతో రాజకీయాలు ఆసక్తిగా మారి రసకందాయంలో పడ్డాయి. వివాదాస్పదంగా ఎన్నిక మున్సిపల్ పరిధిలో 24 వార్డులుండగా కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 13, బీజేపీ 2, ఇండిపెండెంట్గా ఒకరు విజయం సాధించారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్తోపాటు ఒక బీజేపీ కౌన్సిలర్ బీఆర్ఎస్కు, మరో బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. ఈ దశలో చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు ఇరుపార్టీలు తమ మద్దతు కౌన్సిలర్లతో క్యాంపులకు వెళ్లాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తిగా వివాదాస్పదంగా మార్చివేశారు. గత సోమవారం మొదటిసారి నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి హాజరుకాలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు చేసిన ఆందోళనలతో ఎన్నిక మరుసటి రోజు మంగళవారానికి వాయిదా పడింది. యాదగిరి అపహరణపై అతని కుమారుడు హరికాంత్ న్యాయస్థానానికి వెళ్లడం.. ఎన్నికలపై స్టే విధించడంతో మరుసటిరోజు అర్ధాంతరంగా సమావేశం ముగిసింది. అప్పటికే చైర్మన్గా టేకుల సుదర్శన్రెడ్డికి మద్దతునిస్తూ మెజార్టీ కౌన్సిలర్లు చేతులెత్తగా కోర్టు స్టే తెరపైకి రావడంతో అధికారిక ప్రకటన వెలువడలేదు. కౌన్సిలర్లపై ఫిర్యాదుల పర్వం మరోవైపు 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ నీలం శ్వేత తప్పుడు కుల ధ్రువపత్రంతో బీసీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీచేసిందని.. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని కలెక్టర్కు ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ బుధవారం ఫిర్యాదు చేశారు. 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బుగ్గరాములుకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్గా నమోదై ఉన్నాడని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్కు చెందిన ఈగల రాములు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నిక చేపట్టాలని.. తన పేరును చైర్మన్గా ప్రకటించేందుకు, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టేందుకు కౌన్సిల్ను సమావేశపరచేలా ఆదేశాలివ్వాలని గురువారం బీఆర్ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శన్రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ నాటకీయ పరిణామాలకు దారితీసాయి. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తారా.. చిక్కుముడి వీడుతుందా.. ఆధిపత్యపోరులో చివరకు గెలిచేదెవరు.. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే. రసకందాయంలో ‘పట్నం’ రాజకీయం సీరియల్ డ్రామాను తలపిస్తోన్న ఆధిపత్య పోరు న్యాయస్థానం గడపలో తగాదాలు పరస్పర ఫిర్యాదుల పర్వం ఎన్నిక ప్రక్రియ ఎప్పటికి పూర్తయ్యేనో..? -
స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టకొట్టొద్దు
హుడాకాంప్లెక్స్ : ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల యూనియన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు గోపాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఇంటి పన్నుతోనే చెత్త సేకరణ డబ్బులు వసూలు చేసే విధంగా మున్సిపల్ అధికారులు రాంకీ సంస్థ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్బీన గర్ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో కార్మికుల సంఘం అధ్యక్షుడు కాట్రవత్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థకు వ్యతిరేకంగా ఈనెల 23న జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. తమ తాత, తండ్రుల నుంచి చెత్త సేకరణ చేసి జీవనం కొనసాగిస్తున్నామని, తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త సేకరించగా వచ్చిన డబ్బులతోనే తమ కుటుంబ పోషణ జరుగుతోందని, వాటిని కూడా ఇంటి పన్నుల్లో వసులు చేసి తమ కడుపు కొట్టాలని చూడడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తన వైఖరి మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వంశ రాజు, అర్జున్, శేఖర్, మచ్చ గిరి, చెక్క శీను, వీరస్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు
శంకర్పల్లి: నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నసో వ్యక్తిని మోకిల, షాద్నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కాచిగూడకి చెందిన మల్లేవాలే జయానంద్ సింగ్(28) పబ్లో డీజే ఆపరేటర్గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఆయన సులభంగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ సరఫరాని ఎంచుకున్నాడు. గత కొంతకాలంగా ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్ని తీసుకొచ్చి, విద్యార్థులు ఉండే ప్రదేశాల్లో విక్రయాలు జరుపుతున్నాడు. గురువారం మండల పరిధిలోని జన్వాడ గేట్ వద్ద డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మోకిల, షాద్నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి జయానంద్ని అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి రూ.1.25 లక్షల విలువ గల 10.18గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ పౌడర్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎండీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రూ.28 లక్షల సొత్తు స్వాధీనం.. బంజారాహిల్స్: నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడ్డ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ టాస్క్ఫోర్స్ (గోల్కొండ జోన్), బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో భాగంగా వారిని అరెస్టు చేసి రూ.28 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తంజీమ్ జాకీర్ అలీ (30), మొహమ్మద్ సద్దాం (32), షానవాజ్ అలియాస్ షానవాజ్ ఖాన్ (29)లు స్నేహితులు. గతంలో ఉత్తరప్రదేశ్లో బట్టల దుకాణంలో పనిచేసే తంజీమ్ అలీ, సద్దాంలకు ఆదాయం సరిపోకపోవడంతో హైదరాబాద్లో చెఫ్గా పనిచేస్తున్న షానవాజ్ఖాన్ సహాయంతో నగరానికి వచ్చారు. వీరు తలాబ్కట్టలో నివాసం ఉంటున్నారు. నగరంలో దొంగతనాలు చేయాలని పథకం వేశారు. తొలుత తుకారంగేట్ పరిధిలో ఒక బైక్ను దొంగిలించారు. ఆపై ఐరన్రాడ్లు, స్క్రూడ్రైవర్ల సహాయంతో బంజారాహిల్స్, ఎస్ఆర్నగర్, డబీర్పురా పోలీస్స్టేషన్ల పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొత్తును కొంత తమ నివాసంలో దాచి, మరికొంత భాగాన్ని విక్రయించడానికి యూపీలోని తమ బంధువు రిజ్వాన్కు పంపేవారు. ఫిబ్రవరి 18న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 160.84 గ్రాముల బంగారు ఆభరణాలు, 666 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3,28,000 నగదు, హీరో స్ప్లెండర్ ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, ఇమిటేషన్ జ్యువెలరీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.28,61, 732లు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
మామిడిలో పూత సమయం కీలకం
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకృష్ణ చేవెళ్ల: మామిడి రైతులు పూత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులను తెలుసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా శాస్త్రవేత్త శ్రీకృష్ణ సూచించారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో రైతు సత్యనారాయణరెడ్డి మామిడి తోటలో గురువారం యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సకాలంలో మామిడిలో వచ్చే తెగుళ్లను గుర్తించి నయం చేసుకుంటే మంచి దిగుబడులు సాధిస్తారన్నారు. రైతులకు మామిడి తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఎలాంటి సమస్యలు ఉన్న రైతులు ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ ఏపీడీ కిషన్రావు, గ్రీన్గ్లో టెక్నాలజీస్ ప్రభు, ఏటీజీసీ డైరెక్టర్ శశిధర్, సెర్ప్ సీఓ రాజశేఖర్, ఉద్యాన అధికారులు కీర్తి, నగేశ్, బలరాం, కృష్ణ, రైతులు శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాసులు, రాజిరెడ్డి, ఇస్మాయిల్, శివ తదతరులు పాల్గొన్నారు. -
జలమండలి బస్తీబాట
నేటి నుంచి క్షేత్రస్థాయిలోకి ఎండీ సహా మేనేజర్లుసాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల తాగునీరు, మురుగునీటి సమస్యల సత్వరమే పరిష్కారమే లక్ష్యంగా జలమండలి సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. ‘బస్తీ బాట’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి వార్డు స్థాయి మేనేజర్ల వరకూ బస్తీబాట పట్టనున్నారు. జల మండలి పరిధిలోని బస్తీ, కాలనీల్లో మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు తాగునీరు, సీవరేజీ సమస్యలు గుర్తిస్తారు. ప్రజలతో మాట్లాడి తాత్కాలిక సమస్యలు తక్షణమే పరిష్కరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు యథావిధిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు. పర్యటనలో ప్రాధాన్య అంశాలివే.. మురుగునీటి సమస్య: మ్యాన్హోల్స్ పరిస్థితి, పైపులైన్ లీకేజీలు, ఓవర్ఫ్లో, డీసిల్టింగ్ పనుల పర్యవేక్షణ. తాగునీటి సరఫరా: నీటి వృథా, లీకేజీలు, లో–ప్రెషర్ సమస్యలు, మోటార్ల అక్రమ బిగింపును అరికట్టడం. నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించడం. అవగాహన: భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్వెల్స్ ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. బస్తీబాట పర్యటన తీరును పరిశీలించేందుకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ ఎండీ, డైరెక్టర్లు, రీజియన్్ ఈడీలు, డైరెక్టర్ (ఆపరేషన్)లు, జోనన్ సీజీఎం, జనరల్ మేనేజర్లు, సర్కిల్ డీజీఎంలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిసారు. రోజువారీ నివేదిక ప్రతి వార్డు మేనేజర్ పర్యటన రోజువారీ కార్యక్రమానికి సంబంధించిన నివేదికను ఆన్లైన్ యాప్లో సర్కిల్ డీజీఎంలకు పంపిస్తారు. సర్కిల్ డీజీఎంలు సర్కిల్ వారీగా జోన్లకు, జోన్్ నుంచి రీజియన్కు, రీజియన్ నుంచి కేంద్ర కార్యాలయానికి ఆన్లైన్ నివేదికలు సమర్పిస్తారు. వీటిపై ప్రతి వారం శనివారం సమీక్ష సమేవేశం నిర్వహిస్తారు. వారంలో నాలుగు రోజులు బస్తీల్లోనే.. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు నీటి సరఫరా, సీవరేజీ లీకేజీ సమస్యలకు తక్షణ పరిష్కారం


