Ranga Reddy District Latest News
-
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
మాడ్గుల: మండల పరిధి కొల్కులపల్లిలో వైన్ షాప్లో చోరీకి పాల్పడిన నేనావత్ సాయికుమార్ను సోమవారం అరెస్టు చేశామని సీఐ వేణుగోపాలరావు తెలిపారు. జనవరి ఒకటిన మద్యం దుకాణంలో దొంగతనం చేశాడని, నిందుతున్ని మాడ్గుల ఎక్స్ రోడ్ వద్ద అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచామని సీఐ వివరించారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య కేశంపేట: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధి వేములనర్వ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె అనంత(44), భర్త గతంలో మరణించడంతో కుమారుడితో కలిసి ఉంటోంది. మృతురాలు కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో పాటు.. ఆర్థిక సమస్యలతో బాధపడుతోంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి మామ వడ్డె కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. వ్యర్థాలకు నిప్పు షాద్నగర్రూరల్: పట్టణ శివారులోని అన్నారం వై జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలకు నిప్పు పెట్టారు. బుధవారం మధ్యాహ్నం వై జంక్షన్ సమీపంలోని ఉడిపి హోటల్ వెనకాల ఉన్న చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, వారు మంటలను ఆర్పారు. కారు, డీసీఎం ఢీ.. ఇద్దరికి గాయాలు కేశంపేట: ఎదురెదురుగా డీఎసీఎం, కారు ఢీకొన్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కార్తీక్, కీర్తన్లు కంటి ఆస్పత్రికని షాద్నగర్కు వచ్చారు. తిరిగి గ్రామానికి రాత్రి వెళ్తున్న క్రమంలో మండల పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారు ఐరన్ ఫ్యాక్టరీ వద్ద ఎదురుగా వచ్చిన డీసీఎం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు క్షతగాత్రులను షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం బాధితుడి తండ్రి కరుణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. కందుకూరులో.. ఆరుగురికి కందుకూరు: కారు, డీసీఎం ఢీకొన్న సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి శ్రీశైలం రహదారి అలిఖాన్పల్లి గేట్ వద్ద కల్వకుర్తి వైపు నుంచి వస్తున్న కారు, కడ్తాల్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు, డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా వారి వివరాలు తెలియరాలేదు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మహేశ్వరంలో.. ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు మహేశ్వరం: ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండల పరిధి తుమ్మలూరు– మహేశ్వరం రోడ్డులో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన ఉండెల శివకుమార్(23) డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి మహేశ్వరం నుంచి గుమ్మడవెళ్లి గ్రామానికి పల్సర్ బైక్పై వెళ్తుండగా, మహేశ్వరం గ్రామానికి చెందిన రెవేళ్ల యాదగిరి రాయుడు, సురేష్ ఇద్దరు బైక్పై తుమ్మలూరు నుంచి మహేశ్వరం వస్తున్నారు. ఈ క్రమంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివకుమార్కు తీవ్రగాయాలై నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
లారీ, బైక్ ఢీ.. యువకుడి మృతి
చేవెళ్ల: లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధి ఖానాపూర్ బస్స్టేజీ సమీపంలోని హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై సోమ వారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన భగిర్తి వెంకటయ్య, సుమిత్రలకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు బి.సాయికుమార్(20) ఉన్నారు. ఇద్దరు కూతుర్ల వివాహం చేశారు. కుటు ంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాయి పదో తరగతితోనే చదువు ఆపేసి, ప్రైవేటు పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటి లాగే యువకుడు పనికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ యువకుడు నడుపుతున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను ఎగిరి కిందపడగా.. బైక్తో పాటు యువకుడి తలపై నుంచి లారీ ముందుకు దూసుకుపోయింది. దీంతో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. లారీని డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయాడు. మృతుడు సాయికుమార్గా గుర్తించిన పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలచివేశాయి. -
ప్రాణం పోయినా భూములివ్వం
● మొండిగౌరెల్లి రైతుల తీర్మానంయాచారం: పారిశ్రామిక పార్కుల పేరుతో అసైన్డ్, పట్టా భూములను బలవంతంగా తీసుకుంటామంటే ఊరుకునేది లేదని, ప్రాణం పోయినా భూములిచ్చేది లేదని మొండిగౌరెల్లి గ్రామ రైతులు స్పష్టంచేశారు. నేలతల్లిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న తమ భూములను గుంజుకుంటామంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. పారిశ్రామిక పార్కులకోసం గ్రామంలోని పలు సర్వేనంబర్లలోని 822 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రైతులు సోమవారం జీపీ కార్యాలయం ఎదుట సమావేశం అయ్యారు. సర్కారు భూములు తీసుకోకుండా అడ్డుకుందామని, సమష్టిగా పోరాటం చేద్దామని తీర్మానించారు. ఇందులో భాగంగా టి.రవీందర్, బి.కృష్ణ, సందీప్రెడ్డి, సంగెం రవి, ప్రవీణ్కుమార్లతో పాటు మరో 30 మందితో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, కలెక్టర్కు వినతిపత్రాలు, న్యాయపరంగా కోర్టుకు వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. మాజీ సర్పంచ్ అంజయ్య యాదవ్, రైతులు మేకల యాదగిరిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, బాలరాజ్, జంగయ్య, శ్రీకాంత్రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
జ్వరమని వెళ్తే.. ప్రాణం తీశారు!
షాద్నగర్రూరల్: జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్తే.. వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం కోనాయపల్లి గ్రామ పంచాయతీ పరిధి లచ్యానాయక్తండాకు చెందిన సామ్యనాయక్(50)కు జ్వరం వచ్చిందని కుటుంబ సభ్యులు ఈ నెల 14న పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకువచ్చారు. అతన్ని పరీక్షించిన ఆర్ఎంపీ.. తాను నిర్వహిస్తున్న బాలాజీ ఆస్పత్రికి రిఫర్ చేశాడు. అనంతరం అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. సామ్యనాయక్కు డెంగీ ఉందని చెప్పారు. చికిత్స పొందుతున్న వ్యక్తికి.. ప్లేట్లెట్స్ క్రమంగా తగ్గుతుండటంతో.. మెరుగైన వైద్యంకోసం నగరానికి తీసుకెళ్తామని ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబీకులు చెప్పినా.. వినిపించుకోలేదు. ఇక్కడ మంచి వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. గమనించిన వైద్యులు సీపీఆర్ చేశారు. రోగి మృతి చెందాడని నిర్ధారించుకున్న వైద్యులు, యాజమాన్యం ఆస్పత్రి షట్టర్స్ను మూసి వేశారు. మృతుడి కుటుంబీకులు కిందకు వెళ్లి తిరిగి పైకి వచ్చే సరికి.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఆందోళన సామ్యనాయక్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆదివారం అర్ధరాత్రి బాలాజీ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా తరలించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బందోబస్తు నిర్వహించారు. సోమవారం ఉదయం మరోసారి ఆందోళన చేశారు. ‘మా నాన్న చావుకు ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే’ కారణమని మృతుడి కుమారుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ రాంచందర్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కుటుంబీకులు,బంధువుల ఆరోపణ ఆస్పత్రి ఎదుట ధర్నా -
‘ప్రజావాణి’ దండగ
సమస్యలు తీరవు, బాధలు పట్టవు ● కాగితాలు తీసుకొని పొమ్మంటున్నారు ● ఫిర్యాదుదారుల ఆవేదన ● ప్రజావాణికి 72 దరఖాస్తులు ఇబ్రహీంపట్నం రూరల్: ‘సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రజావాణి దండగ’ అని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితం తీసుకునే వరకు లైన్లో ఉండాలని, మేడమ్ వద్దకు వెళ్లగానే ఏం మాట్లాడకుండా కాగితం తీసుకొని పోలీసుల చేత వెనక్కి పంపిస్తున్నారని పేర్కొంటున్నారు. సమస్యలు తీరవు, మా బాధలు ఎవరికీ పట్టవు. ఇక మాకు చావేదిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 72 ఫిర్యాదులు ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రెవెన్యూ, ఇతర సమస్యలపై చేవెళ్ల, కొందుర్గు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, షాబాద్, ఆమనగల్లు తదితర ప్రాంతాల నుంచి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 72 ఫిర్యాదులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకే ఏకంగా 40 అర్జీలు రాగా, ఇతర శాఖలకు 32 వచ్చాయి. ఈ దరఖాస్తుల స్వీకరణలో అదనపు కలెక్టర్తో పాటు డీఆర్ఓ సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, మండల తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేస్తే సహించం
ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్ కేంద్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని సీఐటీయూ జిల్లా కమిటీ హెచ్చరించింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజ్యలక్ష్మి, కవితల ఆధ్వర్యంలో సోమవారం 48 గంటల దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, చంద్రమోహన్లు మాట్లాడుతూ.. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసి, పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను తీసుకురావాలని చూస్తుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతెచ్చిన నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మూత పడనున్న ఐసీడీఎస్లు పీఎం శ్రీ పథకం కింద ప్రీ ప్రైమరీ కేంద్రాలను 28 జిల్లాల్లో 56 కేంద్రాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మొబైల్ అంగన్వాడీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి తెరలేపిందని ఆరోపించారు. తద్వారా ఐసీడీఎస్లు పూర్తిగా మూతపడే అవకాశం లేకపోలేదని, దీంతో పేద పిల్లలకు పౌష్టికాహారం దూరం కానుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అనేక హామీలను ఇచ్చి నేడు, విస్మరిస్తుందని విమర్శించారు. టీఏ, డీఏలు పెంచాలని, అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల బలోపేతానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, జగన్, జిల్లా నాయకులు కిషన్, దేవేందర్ పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్దే రాత్రి బస 48 గంటలు దీక్షకు పిలుపునివ్వడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రాత్రి కలెక్టరేట్ కార్యాలయం వద్దే బస చేశారు. అక్కడే వంటావార్పు చేశారు. రోడ్డుపైనే టెంట్ల కింద పడుకున్నారు. ఆట పాటలతో బతుకమ్మలు ఆడి సరదాగా గడిపారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని స్పష్టంచేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ కలెక్టరేట్ ఎదుట 48 గంటల దీక్ష -
సామాన్యుడికి అందుబాటులో..
‘సాండ్ బజార్’లో తక్కువ ధరకే లభ్యం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్మెట్: దళారీ వ్యవస్థను అరికట్టి, సామాన్యుడికి తక్కువ ధరకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కార్పొరేషన్ చైర్మన్ అనిల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో ఇసుక విక్రయకేంద్రాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో టీఎస్ఎండీసీ ఎండీ.సుశీల్కుమార్, జనరల్ మేనేజర్ రాజశేఖర్రెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ నర్సిరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీవాణి పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ దండగ
సమస్యలు తీరవు, బాధలు పట్టవు ● కాగితాలు తీసుకొని పొమ్మంటున్నారు ● ఫిర్యాదుదారుల ఆవేదన ● ప్రజావాణికి 72 దరఖాస్తులు ఇబ్రహీంపట్నం రూరల్: ‘సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రజావాణి దండగ’ అని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితం తీసుకునే వరకు లైన్లో ఉండాలని, మేడమ్ వద్దకు వెళ్లగానే ఏం మాట్లాడకుండా కాగితం తీసుకొని పోలీసుల చేత వెనక్కి పంపిస్తున్నారని పేర్కొంటున్నారు. సమస్యలు తీరవు, మా బాధలు ఎవరికీ పట్టవు. ఇక మాకు చావేదిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 72 ఫిర్యాదులు ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రెవెన్యూ, ఇతర సమస్యలపై చేవెళ్ల, కొందుర్గు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, షాబాద్, ఆమనగల్లు తదితర ప్రాంతాల నుంచి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 72 ఫిర్యాదులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకే ఏకంగా 40 అర్జీలు రాగా, ఇతర శాఖలకు 32 వచ్చాయి. ఈ దరఖాస్తుల స్వీకరణలో అదనపు కలెక్టర్తో పాటు డీఆర్ఓ సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, మండల తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఏక కాలంలో రూ.2 లక్షలు మాఫీ చేసిన ఘనత మాదే ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ● మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహేశ్వరం: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమ ని ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్చార్జి మంత్రిదుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కిందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో కొంత మందికి రుణమాఫీ కాలేదని, వాటిని పరిశీలించి అర్హులందరికీ మాఫీ అయ్యేలా చూస్తామని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నామని, వాటిని పార్టీ శ్రేణులు తిప్పి కొట్టి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూ బాధితులను ఆదుకుంటాం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. మార్కెట్ కమిటీ పాలకవర్గంలో ఎస్టీ గిరిజన, బీసీ రజక సామాజిక వర్గాలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కాయని మంత్రి అన్నారు. అంతకు ముందు పాలకవర్గ సభ్యులు చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, డైరెక్టర్లుగా పుష్ప, ప్రశాంత్ కుమార్, కె.యుగేందర్, సురేందర్, విష్ణువర్ధన్రెడ్డి, వెంకట్రెడ్డి, ఎంఏ.జావీదు, బోధ పాండు రంగారెడ్డి, యాదయ్య, ధన్పాల్రెడ్డి, పాండు మార్కెటింగ్ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జెడ్పీ చైర్పర్సన్ మాజీ సభ్యురాలు అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు భాస్కర్రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్లీడర్ జంగారెడ్డి, ఎస్సీసెల్ కన్వీనర్ నర్సింహ, మాజీఎంపీపీ రఘుమారెడ్డి పాల్గొన్నారు. -
డబుల్రోడ్డుకు అనుమతివ్వండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు: రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలను కలిపే కడ్తాల్ నుంచి కొట్ర ఎక్స్రోడ్డు వరకు ఉన్న రోడ్డులో.. అటవీ భూమిలో డబుల్రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం రెండు వరుసలుగా రహదారిని నిర్మించారని తెలిపారు. మాదారం దాటిన తరువాత అటవీశాఖ భూమిలో 1.5 కిలో మీటర్ల రోడ్డు ఉందని, ఆ శాఖ అనుమతి లేకపోవడంతో రోడ్డు నిర్మించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. సింగిల్ రోడ్డును డబుల్రోడ్డుగా నిర్మించాలని కోరారు. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతకు ముందు కల్వకుర్తి ఆర్టీసీ డిపోనకు నూతనంగా 16 కొత్త బస్సులను కేటాయించడంపై ఎమ్మెల్యే కసిరెడ్డి మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం ● అర్బన్ అధ్యక్షుడిగా వి.శ్రీనివాస్రెడ్డి ● రాజ్భూపాల్గౌడ్కు రూరల్ జిల్లా బాధ్యతలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: బీజేపీ రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షుడిగా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన పంతంగి రాజ్భూపాల్గౌడ్, జిల్లా అర్బన్ అధ్యక్షుడిగా వి.శ్రీ నివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ జిల్లా ఎన్నికల అధికారి కట్ట సుధాకర్రెడ్డి వీరికి నియామకపత్రం అందజేశారు. 1970లో జన్మించిన రాజ్భూపాల్గౌడ్ బాల్య స్వయం సేవక్గా పని చేశారు. 1995లో బీజేపీ పాలమాకుల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, 1997లో యువమోర్చా మండల అధ్యక్షుడిగా, 2000లో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, 2007లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2015లో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. 2009లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. మూడు దశాబ్దాలుగా బీజేపీతో ఆయనకు అనుబంధం ఉంది. ప్రస్తు తం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంపై ఆయన సన్నిహితులు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాలకు చెందిన శ్రీనివాస్రెడ్డికి డ్రాగన్ ఫ్రూట్ రైతుగా పేరుంది. ప్రస్తు తం ఆయన వనస్థలిపురంలో ఉంటున్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా గోవిందమ్మ శంకర్పల్లి: మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్గా శంకర్పల్లి పట్టణానికి చెందిన చంద్రమోహన్తో పాటు మరో 16మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ సందర్భంగా గోవిందమ్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి, ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే యాదయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గం ప్రమాణస్వీకారం తేదీ ఖరారు కావాల్సి ఉంది. సిటీ హీటెక్కుతోంది! మరో మూడ్రోజులు భానుడి భగభగలు సాక్షి, సిటీబ్యూరో: నగరం గరం అవుతోంది. ఉదయం 7 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలాఖరులోగా 45 డిగ్రీలకు చేరి వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఒంటి పూట బడులు ప్రారంభం కావడంతో మధ్యా హ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో విద్యా ర్థులు ఎండలకు తల్లడిల్లుపోతున్నారు. సోమ వారం గోల్కొండ, ముషీరాబాద్, చార్మినార్, బహదూర్పురా, బండ్లగూడ, అంబర్పేట, మారేడుపల్లి, హిమాయత్ నగర్, షేక్పేట్, ఖైరతాబా ద్, సైదాబాద్లలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్టోగ్ర తలు నమోదయ్యాయి. -
ఆన్లైన్లో ఇసుక
● టీజీఎండీసీ ఆధ్వర్యంలోప్రభుత్వ సాండ్ బజార్లు ● సన్న ఇసుక టన్నుకు రూ.1,800, దొడ్డుది రూ.1,600 ● అందుబాటులోకి అబ్దుల్లాపూర్మెట్ సాండ్బజార్.. ● నేడు మేడ్చల్ జిల్లా బౌరంపేటలో, ● రేపు వట్టినాగులపల్లిలోనూ ప్రారంభం సాక్షి, రంగారెడ్డి: ఇసుక అక్రమ దందాకు ప్రభు త్వం చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇసుక బుకింగ్, తరలింపులో దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా నాణ్యమైన ఇసుకను నిర్మాణదారులకు అందజేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సాండ్ బజార్లను ప్రారంభించాలని తీర్మానించింది. ఈ మేరకు సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో సాండ్ బజార్ను ప్రారంభించింది. మంగళవారం మేడ్చల్ జిల్లా బౌరంపేటలో, బుధవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో మరో రెండు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వమే స్వయంగా క్వారీల నుంచి ఇసుకను లారీల్లో ఇక్కడికి తరలించి, నిర్మాణదారులకు సరఫరా చేయనుంది. సన్న ఇసుక టన్నుకు రూ.1800, దొడ్డు ఇసుక టన్నుకు రూ. 1600 ధరగా నిర్ణయించింది. భవన నిర్మాణదారులు మీ సేవ కేంద్రాల్లో/టీజీఎండీసీ వెబ్సైట్లో నేరుగా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. రోజుకు 50 వేల టన్నులు.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ సంఖ్యలో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వ్యక్తిగత నివాసాలతో పాటు అపారు్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణం కోసం ఇసుక అవసరం. నగరంలో రోజుకు సగటు 50 వేల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా. కాళేశ్వరం, కరీంనగర్, భద్రాచలం, జాజిరెడ్డిగూడెం నుంచి గత నెల వరకు రోజుకు సగటున 1,400 లారీల్లో ఇసుకను తరలించగా, ప్రస్తుతం ప్రభుత్వ లోడింగ్పై విధించిన ఆంక్షలతో ఇసుక తరలించే లారీల సంఖ్య రెండు వేలకు చేరుకుంది. గతంలో ఒక్కో లారీలో 50 టన్నులకుపైగా ఇసుక తరలిస్తే.. ప్రస్తుతం 25 టన్నులే వస్తోంది. ఫలితంగా ఇసుకను తరలించే లారీల సంఖ్య ప్రస్తుతం రెండు వేలకు చేరింది. ఆయా లారీల యజమానులు ప్రభుత్వ క్వారీల నుంచి ఇసుకను లోడ్ చేసుకుని వచ్చినగర శివారు ప్రాంతాల్లోని ఆటోనగర్, ఉప్పల్, మంద మల్లమ్మ చౌరస్తా, ఉప్పరిగూడ, శివరాంపల్లి, ఉప్పల్ రింగ్రోడ్డు, బోడుప్పల్ ప్రధాన రహదారి వెంట ఉన్న ఖాళీ స్థలాల్లో నిలిపి అమ్ముతుంటారు. దళారులకు ఇక చెక్.. దళారులు ఆయా లారీల యజమానులతో ముందే కుమ్మకై ్క ఇసుక ధరను అమాంతం పెంచేస్తున్నారు. అంతేకాదు.. ఏకధాటి వర్షాలకు వాగుల్లో వరదలు పోటేత్తే సమయంలో కృత్రిమ కొరత సృష్టించి, అప్పటికే డంపింగ్ కేంద్రాల్లో నిల్వ చేసిన ఇసుకకు భారీ ధరలు నిర్ణయించి అమ్ముతున్న విషయం తెలిసిందే. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో టన్ను రూ.1200 లోపే దొరికే ఇసుక.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఏకంగా రూ.2500 నుంచి రూ.3000 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక లేకపోతే పని ఆగిపోయే ప్రమాదం ఉందని భావించి ఇష్టం లేకపోయినా నిర్మాణదారులు వారు చెప్పిన ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వారీలపై నిఘా పెంచింది. ప్రస్తుతం ఆయా ఇసుక క్వారీలన్నింటిని తమ చేతుల్లోకి తీసుకుంది. ఓవర్లోడు కారణంగా రహదారులు దెబ్బ తినకుండా చెక్ పెట్టేంది. అంతేకాదు బహిరంగ మార్కెట్లో ఇసుక అధిక ధరలకు కళ్లెం వేసినట్లయింది. -
ఎస్సీ వర్గీకరణపైప్రభుత్వం ద్వంద్వ వైఖరి
షాద్నగర్: ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ స్పష్టం చేశారు. వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల పరీక్ష ఫలితాలను నిలుపుదల చేయా లని డిమాండ్ చేస్తూ పట్టణంలో చేపట్టిన దీక్షలు ఆదివారం ఏడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై గత ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్రెడ్డి స్వాగతించారని, ఈ మేరకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు వర్గీకరణ వర్తింజేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేశారన్నారు. అసెంబ్లీలో ఈనెల 18న చట్టం చేస్తామని చెబుతూనే మరోవైపు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, చెన్నగళ్ల శ్రావణ్, పాండు, యాదగిరి, జోగు శ్రీశైలం, శ్రీను, హరీష్, వినోద్, మధు, శివశంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి షాద్నగర్: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంగుడ్ల బిల్లులు, మూడు నెలల నుంచి గౌరవ వేతనం, మెనూ చార్జీలు చెల్లించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బిల్లులు ఇవ్వకుంటే విద్యార్థులకు ఎలా భోజనం అందిస్తారని ప్రశ్నించారు. రోజు రోజుకూ నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను ఏవిధంగా సరఫరా చేస్తుందో అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు, కార్మికులు శ్రీలత, శ్రీనివాస్, వసంత, సంతోష, సత్తెమ్మ, వెంకటమ్మ, అనిత, షాహినీబేగం తదితరులు పాల్గొన్నారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలి ఇబ్రహీంపట్నం: ఈనెలాఖరులోగా వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని డీఎల్పీఓ సాధన పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండలంలోని ముకునూర్లో వివిధ రకాల టాక్స్ల వసూళ్లను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 31లోగా వంద శాతం పన్నులు వసూలు చేయాలన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట పంచాయతీ సిబ్బంది శ్రీకాంత్, ఉస్మాన్, అశోక్ ఉన్నారు. నేడు ఓయూ బంద్కు పిలుపు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఆందోళనలపై అధికారులు విధించిన నిషేధంపై విద్యార్థి సంఘాల నేతలు, ప్రొఫెసర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్వీ, ఎంఎస్ఎఫ్, దళిత, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట సమావేశమై అధికారుల తీరుపై మండిపడ్డారు. యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించలేని, పాలన చేతకాని వీసీ ప్రొ.కుమార్ విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధించడం సిగ్గుచేటన్నారు. ఆందోళనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వీసీ ప్రొ.కుమార్ నియంతృత్వ పోకడలకు, ఆందోళనలపై నిషేధాలకు వ్యతిరేకంగా సోమవారం ఓయూ బంద్కు ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. -
పారిశుద్ధ్య సిబ్బంది కొరత
ఆమనగల్లు: విఠాయిపల్లి గ్రామాన్ని కలిపి ప్రభుత్వం ఆమగల్లు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా అవసరమైన సిబ్బందిని మాత్రం నియమించలేదు. పట్టణంలో పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. ప్రతిరోజూ ప్రధాన రహదారిని మాత్రం శుభ్రం చేస్తుండగా కాలనీల్లో మాత్రం రెండుమూడు రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు. మున్సిపాలిటీలో 48 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. చెత్త సేకరణకు ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. నిత్యం 1.8 టన్నుల తడిచెత్త, 2.1 టన్నుల పొడిచెత్తను సేకరించి పట్టణ సమీపంలోని డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 17 కిలోమీటర్ల భూగర్భ మురుగు కాలువలు ఉన్నాయి. పలు కాలనీల్లో మురుగు కాలువలు లేకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. మరో రెండు కిలోమీటర్ల మురుగు కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. -
సేకరిస్తున్నా పేరుకుపోతోంది
బడంగ్పేట్: మున్సిపల్ కార్పొరేషన్లో 32 డివిజన్లు ఉన్నాయి. నిత్యం 50 టన్నులకు పైగా చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడలో నిర్మించిన డీఆర్సీకి, అక్కడి నుంచి జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయినా రాత్రివేళ రోడ్లకు ఇరువైపులా, ఓపెన్ ప్లాట్లలో, కాలనీల మలుపుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. దీంతో కుప్పలుగా పేరుకుపోతోంది. ఎప్పటికప్పుడు పడేసిన చెత్తను డంపింగ్యార్డుకు తరలిస్తున్నామని శుభ్రం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదని అంటున్నారు. రంగులతో ముగ్గులు, జరిమానా మలుపులు, కూడళ్ల వద్ద చెత్తను నిర్లక్ష్యంగా పడేస్తున్నారు. మహిళా సిబ్బందితో చెత్త వేయొద్దని రంగురంగుల ముగ్గులు వేయిస్తున్నాం. చెత్త వేస్తే జరిమానా సైతం విధిస్తున్నాం. ప్రజల్లోనూ మార్పు రావాలి. – వి.యాదగిరి, శానిటరీ ఇన్స్పెక్టర్ -
అపరిశుభ్రంగా రోడ్లు
తుక్కుగూడ: పురపాలక సంఘం పరిధిలోని తుక్కుగూడ నుంచి బాసగూడతండాకు వెళ్లే రోడ్డు, రావిర్యాల నుంచి ఆర్సీఐ రోడ్డు, ఔటర్ రింగు సర్వీసు రోడ్లు పూర్తిగా అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, ప్లాస్టిక్ కాగితాలు పేరుకుపోయాయి. అధికారులు స్వచ్ఛ వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలను ఉపయోగించి గృహాలు, వ్యాపార సముదాయులు, పరిశ్రమల నుంచి రోజుకు 9 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించినప్పటికీ నగరం నుంచి రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు, కొంత మంది స్థానికులు చెత్తను తెచ్చి ప్రధాన రోడ్లపై వేస్తున్నారు. ఇందులో జంతు వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. చెత్తను ఆరుబయట వేయకుండా అవగాహన కల్పించాలని, చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆగని పొగలు.. తీరని వెతలు
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025శంకర్పల్లి: ఐదు గ్రామాల కలయికతో 2018లో మున్సిపాలిటీ ఆవిర్భవించింది. ఇక్కడ డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా ఉంది. స్థలం కోసం అన్వేషిస్తున్నప్పటికీ దొరకడం లేదు. గతంలో రెవెన్యూ అధికారులు సింగాపురం సమీపంలో అసైన్డ్ భూమిని కేటాయించగా.. అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అడుగు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు మున్సిపాలిటీ అవసరాలను తగినంత లేకపోగా.. దానిపై నుంచి 400 కేవీ విద్యుత్ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. ఆకతాయిలు, చెత్త సేకరించే వారు నిప్పు వేయడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయి. కిలో మీటర్ల మెర పొగలు వ్యాపిస్తుండడంతో సమీపంలోని ఆదర్శనగర్, సింగాపూర్, బొప్పన్న వెంచర్వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తడి, పొడి చెత్త సేకరణ ముందుకు సాగడం లేదు. సమస్యలు పరిష్కరిస్తాం మున్సిపాలిటీలో 52మందితో నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయిస్తున్నాం. డంపింగ్ యార్డు సమస్య ఉన్న మాట వాస్తవమే. స్థల సమస్యపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి త్వరలోనే కొత్తది నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నిప్పు వేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. – యోగేశ్, మున్సిపల్ కమిషనర్, శంకర్పల్లి న్యూస్రీల్ -
మద్యం మత్తులో భార్యను తోసేసిన భర్త
శంషాబాద్ రూరల్: మద్యం మత్తులో భార్యను తోసేయడంతో బస్సు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివీ.. దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన బద్దన్న, పద్మ దంపతులు మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో నివాసముంటున్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు శంషాబాద్ బస్టాండ్కు వచ్చారు. షాద్నగర్ వైపు వెళ్లే మార్గంలో బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న బద్దన్న భార్యను తోసేశాడు. ఇదే సమయంలో అఫ్జల్గంజ్ నుంచి శంకరాపురం వెళ్తున్న బస్సు పద్మను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బద్దన్నను చితకబాదారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కొత్త కాలనీల్లో సమస్యలు
కొత్తూరు: మున్సిపాలిటీలో ప్రస్తుతం 12 వార్డులు, సుమారు 20 వేల మంది జనాభా ఉన్నారు. కొత్తగా విస్తరించిన వింటేజ్, శ్రీరామ్నగర్, తిరుమల కాలనీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేవు. నిత్యం మున్సిపాలిటీలో 35 మంది సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, హోటళ్ల నుంచి సేకరించి చెత్తను నాలుగు ట్రాక్టర్లు, మూడు ఆటోల్లో పారిశ్రామికవాడ సమీపంలో ఉన్న డంప్యార్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీలో 42 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. -
భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని శ్రీనిరంజన మఠంలో ఆదివారం వీరశైవ సమాజం భక్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు మఠం మల్లికార్జునస్వామి, గడ్డం చంద్రశేఖర్స్వామి, మఠం విజయకుమార స్వామిలు వీరశైవ సమాజం సభ్యులచే ఆరాధనోత్సవాల్లో భాగంగా శ్రీస్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, సుగంధ ద్రవ్యాలతో బసవలింగేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా నమక చమక అధ్యాయాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. బిల్వాష్టకం, శివాష్టకం, అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహించారు. దూప, దీప నైవేద్యాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి వారికి వీరశైవ సమాజం భక్తులు పాదపూజ చేశారు. నిరంజన మఠంలో బసవలింగేశ్వర స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవ ముందు భక్తులు ఖడ్గాలు వేస్తూ స్వామివారిని స్మరించుకున్నారు. పురోహితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తూ ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్రెడ్డి శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతులు శ్రీజగద్గురు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామివారు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్రెడ్డిని సన్మానించారు. పట్టణంలోని శ్రీమహాదేవుని ఆలయ భజన మండలి సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నియోజకవర్గ అధ్యక్షుడు కొవూరు విజయవర్దన్, సమా జం సభ్యులు బిఆర్ విజయకుమార్, గంతల సంఘమేశ్వర్, బాలప్రకాశ్, తారాపురం రవి, గంటి సర్వేష్, రాకేష్, నాగభూషణం పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరశైవ సమాజం భక్తులు స్వామివారి సేవలో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి ఆధ్యాత్మిక చింతన అవసరం ప్రతిఒక్కరూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం కేటాయించాలని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని శ్రీజగద్గురు నిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీజగద్గురు నిరంజన మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ప్రవచనాలు అందించారు. ప్రతిఒక్కరూ భక్తి, ధ్యానం, భగవత్ చింతన అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. భక్తితో దేన్నైనా సాధించొచ్చన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, ధర్మాన్ని పరిరక్షిస్తూ సమాజ అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు. నిర్మలమైన మనసుతో భగవంతుడిని ఆరాధిస్తే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన వ్యక్తిమృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో లభ్యమైంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సింగారం మధు(24), శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద కుటుంబీకులు ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి జ్ఞానేశ్వర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం స్థానిక పెద్ద చెరువు తూము వద్ద మధు చెప్పులు, పర్సు, ఐడీ కార్డు, సెల్ఫోన్ను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలించి మధు మృతదేహాన్ని వెలికితీశారు. అవివాహితుడైన యువకుడి మరణానికి కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుడు రెండు నెలలుగా విధులకు హాజరు కావడంలేదని మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ తెలిపారు. -
నిశ్చితార్థం రద్దు చేయించి..
మీర్పేట: ప్రేమించానని ఏడేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, యువతి నిశ్చితార్థాన్ని సైతం రద్దు చేయించాడు. ఆపై ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి, మహిళా సంఘాల సహాయంతో కుటుంబ సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడకు చెందిన ఓ యువతి(28) ని మీర్పేట ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీకి చెందిన పూర్ణేశ్వర్రెడ్డి(28) ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేయించాడు. ఆమెతో చనువుగా ఉంటూ.. ఇంట్లో వారికి, బంధువులకు పరిచయం చేశాడు. కానీ ఆ తరువాత యువకుడికి గుట్టుచప్పుడు కాకుండా.. మరో యువతితో పెళ్లి చూపులు జరిగాయి. విషయం తెలుసుకున్న యువతి నిలదీయడంతో కులం వేరు కావడంతో మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని సమాధానం చెప్పాడు. దీంతో సదరు యువతి న్యాయం చేయాలంటూ ఆదివారం పూర్ణేశ్వర్రెడ్డి ఇంటి ఎదుట బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెళ్లిచేసుకుంటానని మోసం చేసిన ప్రేమికుడు యువకుడి ఎదుట ధర్నా, అట్రాసిటీ కేసు నమోదు -
లింకురోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి
చేవెళ్ల: పెండింగ్ రేగడిఘనాపూర్–చనువెళ్లి లింక్రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి సూచించారు. మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు రఘువీర్రెడ్డి కాలికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న చీఫ్ విప్.. ఆదివారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పట్నంను కలిసి, సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. గ్రామం నుంచి చనువెళ్లి లింక్రోడ్డుకు మంత్రిగా ఉన్న సమయంలో రూ.80 లక్షల నిధులు మంజూరు చేశారని, ఆ పనులు ఆలస్యమవుతున్నాయని వివరించారు. వెంటనే ఆయన పంచాయతీ రాజ్ ఎస్ఈకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ రోడ్డుపై ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిధులు రిజెక్ట్ అయ్యాయని, మరోసారి ప్రతిపాధనలు పంపాలని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆయన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మాట్లాడి మంత్రి శ్రీధర్బాబుతో చర్చించి ఈ ప్రాంతంలో ఇలా మిగిలిపోయిన బ్రిడ్జిలకు సంబంధించి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరామ్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రయ్య తదితరులు ఉన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
పంచాయతీ కార్మికుడి మృతి
వాటర్ ట్యాంక్లో పడితాండూరు రూరల్: ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్లో పడి ఓ పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కరన్కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మప్ప(42) ఏడేళ్లుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్గా పని చేస్తున్నారు. అప్పుడప్పడు ఆయన వాటర్ ట్యాంక్ను శుభ్రం చేసేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి.. రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఆదివారం ఉదయం గ్రామంలోని పంచాయతీకి చెందిన బంగారమ్మ తాగునీటి ట్యాంక్పైన లక్ష్మప్ప బట్టలు కనిపించాయి. వెంటనే వెళ్లి చూడగా వాటర్ ట్యాంక్లో విగతజీవిగా పడున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే లక్ష్మప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఓ కూతురు ఉంది. శుభ్రం చేయించాం కరన్కోట్ గ్రామంలోని బంగారమ్మ గుడి వద్ద ఉన్న తాగునీటి వాటర్ ట్యాంక్ 60 వేల నీటి సామర్థ్యం కలదని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ ట్యాంక్ నుంచి జయశంకర్ కాలనీతో పాటు సీసీఐ కాలనీకి నీటి సరఫరా అవుతుంది. శనివారం రాత్రిపంచాయతీ కార్మికుడు ట్యాంకులో పడి మృతిచెందాడు. మృతదేహం నిల్వ ఉన్న నీరు ఆదివారం ఉదయం సరఫరా కావడంతో కాలనీవాసులుఆందోళన చెందుతున్నారు. ఈ విషయమైపంచాయతీ కార్యదర్శి ఆనంద్రావును వివరణ కోరగా.. ట్యాంక్ను శుభ్రం చేయించామన్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆ నీటిని తాగామని గ్రామస్తుల భయాందోళన కరన్కోట్లో ఘటన -
హైవేపై కూలిన మర్రిచెట్లు
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై రెండు చోట్ల ప్రమాదవశాత్తు రెండు మర్రిచెట్లు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలు చేవెళ్ల మండలం ఖానాపూర్ బస్టేజీ సమీపంలో ఒకటి, ఆలూరు బస్టేజీ సమీపంలో మరొకటి చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప వ్యవధిలో రెండు చోట్ల చెట్లు కూలిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు పరుగు తీయకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మరోమార్గం లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ శంకరయ్య, ఏఎస్ఐ చందర్నాయక్లు సిబ్బంది, స్థానికుల సహాయంతో జేసీబీతో చెట్లను పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఈ మర్రి చెట్లు మొదళ్లు కాలిపోయి ఉండటంతో గాలి వీచిన సమయంలో ఇలా రోడ్డుపై పడిపోతున్నాయని, వాహనదారులు చెట్ల కింద ప్రయాణం చేసే సమయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని పోలీసులు సూచించారు. తప్పిన ప్రమాదం, ట్రాఫిక్ అంతరాయం -
బైక్ దొంగకు రిమాండ్
ఆమనగల్లు: బైక్ను చో రీ చేసిన వ్యక్తిని శనివారం రిమాండ్కు తరలించినట్లు ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన సబావత్వాల్య గత ఏడాది డిసెంబర్లో తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని సరూర్నగర్కు చెందిన హాజీ బైక్ను చోరీ చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హాజీని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్కు తరలించారు. చికిత్స పొందుతూ గర్భిణి మృతి వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆరోపణ శంషాబాద్ రూరల్: ఛాతి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణి మృతి చెందింది. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం అమీర్పేట్ నివాసి బుషమోని ప్రమీల(33) 9 నెలల గర్భిణి. మొదటి నుంచి ముచ్చింతల్ శివారులోని జిమ్స్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతుంది. నెలలు నిండడంతో ప్రమీలను ఈ నెల 11న జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 13వ తేదీ వరకు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమెను వైద్యులు ఇంటికి పంపించారు. 18న ఆస్పత్రికి రావాలంటూ డాక్టర్ పూజిత కొన్ని మందులు రాసిచ్చారు. శుక్రవారం రాత్రి ప్రమీల భోజనం తర్వాత వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుంది. కాసేటి తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో భర్త సాయిబాబు ఆమెను రాత్రి 10.30 గంటలకు జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఆమెను పరిశీలించారు. 12.15 గంటలకు డాక్టర్ రామారావు ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయింది. సకాలంలోవైద్యం అందక తన భార్య మృతి చెందిందని, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రేపు మార్కెట్ పాలకవర్గం ప్రమాణస్వీకారం
మహేశ్వరం: మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణానాయక్ తెలిపారు. కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణస్వీకారం అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 7 గంటలకు తుక్కుగూడ ఔటర్రింగ్ రోడ్డు ఎగ్జిట్ నుంచి మంత్రి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంబాలపల్లి విష్ణువర్ధన్రెడ్డి, మహేశ్వరం టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంగరిగళ్ల లాజర్, నాయకులు చంద్రమోహన్, ఈశ్వర్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. హాజరుకానున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్సభావత్ కృష్ణానాయక్ -
గ్రామసభలు తూతూ మంత్రం!
దౌల్తాబాద్: పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో ఇవి తూతూమంత్రంగా కొనసాగుతున్నాయి. అవగాహన కల్పి ంచాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీల అభివృద్ధిలో గ్రామసభలు ఎంతో కీలకం. ఆయా శాఖల అధికారులతో పాటు పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ప్రజలు ఇందులో పాల్గొని సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలపై చర్చిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమ లు తీరు, లబ్ధిదారుల వివరాల నమోదును గ్రామ సభల ద్వారా నిర్వహిస్తారు. ప్రభుత్వాలు చేపట్టే కొత్త పథకాలు, పనులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. నిర్వహణ ఇలా.. పంచాయతీల్లో ప్రతీ రెండు నెలలకు ఒకసారి సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలి. అయితే ఏడాదిన కాలంగా సర్పంచ్లు లేకపోవడంతో కార్యదర్శులే నిర్వహి స్తున్నారు. సంబంధిత జీపీతో పాటు అనుబంధ గ్రా మాల్లో సభలు నిర్వహించే తేదీలను ముందుగానే ప్రకటించాలి. ఈ విషయమై సిబ్బందితో టాంటాం(దండోరా) వేయించాలి. నిబంధనల ప్రకారం విధిగా 17శాఖల అధికారులు జనాభాలో సుమారు 20శాతం మంది ప్రజలు గ్రామసభకు హాజరయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. కనీసం 50 మందితో గ్రామసభ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నా పది మంది తో కానిచ్చేస్తున్నారు. పంచాయతీ ఆదాయ, వ్యయాలపైన కార్యదర్శులు నివేదికలు చదివి వినిపించాల్సి ఉన్నా ఎక్క డా అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసక్తి చూపని గ్రామస్తులు.. జిల్లాలోని చాలా చోట్ల నిర్వహించే గ్రామసభలకు కనీసం పది నుంచి ఇరవై మంది కూడా రావడంలేదు. ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, వీఓఏలు, వైద్యసిబ్బంది మాత్రమే సభలకు హాజరవుతున్నారు. ప్రజలు, నాయకులకు సరైన సమాచారం ఉండటం లేదు. గ్రామ సభల్లో చర్చకు వచ్చే సమస్యలకు పరిష్కారం చూపితే వీటిపై గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ గ్రామాల్లో సమస్యలు పేరుకుపోవడం, సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకపోవడం వంటి కారణాలతో సభలకు ఆదరణ తగ్గుతోంది. కనిపించని ప్రజల భాగస్వామ్యం అవగాహన కల్పించని అధికారులు ప్రజల భాగస్వామ్యం పెరగాలి గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలి. సభల నిర్వహణపై కార్యదర్శులతో గ్రామాల్లో దండోరా వేయిస్తున్నాం. సమాచారం తెలుసుకుని స్వచ్ఛందంగా సభకు రావాలి. దీంతో సమస్యలు పరిష్కరించే వీలు కలుగుతుంది. – శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్ -
ఘనంగా కాన్షీరాం జయంతి
ఆమనగల్లు: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం డీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందే విధంగా ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరు పుకొన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమేశ్, బాలరాం, హరి, మహేశ్, సురేశ్, యాదగిరి, శ్రీశైలం, జంగయ్య, నాగేశ్ పాల్గొన్నారు. తుర్కయంజాల్లో.. తుర్కయంజాల్: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని ఇంజాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు పట్నం రమేష్, ఉపాధ్యక్షుడు రాజులు మాట్లాడుతూ.. రాజకీయాలకు దూరంగ ఉన్న వర్గాలకు సైతం పదవులు దక్కేలా చేసిన ఘనత కాన్షీరాందేనని కొనియాడారు. రఘు, డాక్టర్ యడవల్లి శ్యామ్, రమణ, సైదులు, బాలకృష్ణ పాల్గొన్నారు. -
అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయండి
సీపీఎం మండల కార్యదర్శి శేఖర్ మహేశ్వరం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట నిర్వహిస్తున్న ధర్నా, వంటావార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల శేఖర్ కోరారు. శనివారం మండల కేంద్రంలో సీడీపీఓ ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, వంటావార్పు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యా విధానం చట్టాన్ని అమలు చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో ప్రతీ అంగన్వాడీ టీచర్, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మండల కేంద్రంలో ఐసీడీఎస్ కార్యాలయంలో అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. -
చెరువును చెరబట్టి
పట్టాలు అడ్డుపెట్టి మొయినాబాద్: చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షించాలని ఓ వైపు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తుంటే కొందరు మాత్రం చెరువులనే మాయం చేసేస్తున్నారు. చెరువు కట్టను పూర్తిగా తొలగించి, ఆనవాళ్లు లేకుండా చేసే పనిలో ఉన్నారు. మొయినాబాద్ మండలంలోని బాకారం జాగీర్ రెవెన్యూలో ఈ తతంగం సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బాకారం జాగీర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 11, 12లో జంబులకుంట చెరువు ఉంది. 21 ఎకరాల్లో విస్తరించిన ఉన్న చెరువు భూమిలో శిఖం పట్టాలున్నాయి. చెరువులోని నీళ్లు ఇంకిపోయినప్పుడు మాత్రమే సంబంధిత వ్యక్తులు ఇందులో పంటలు సాగు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఇతర అవసరాలకు సైతం వాడుకోవద్దు. కానీ కొంతమంది ఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శిఖం పట్టాలను అడ్డం పెట్టుకుని కొందరు చెరువు ఆనవాళ్లకే ఎసరు పెడుతున్నారు. ఈ క్రమంలో కట్టను పూర్తిగా తొలగించారు. ఈ విషయం గుర్తించిన స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నారుజంబులకుంట చెరువులో నిబంధనలకు విరుద్ధంగా పనులు శిఖం పట్టాలను అడ్డం పెట్టుకుని కట్టను ధ్వంసం చేస్తున్న వైనం చెరువు ఆనవాళ్లను మాయం చేసేలా కుట్ర ఇరిగేషన్ అధికారులకుఫిర్యాదు చేసిన స్థానికులు -
మట్టి.. కొల్లగొట్టి!
మొయినాబాద్: అక్రమార్కులకు మట్టే బంగారమవుతోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో నుంచి తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో మట్టిని తీసుకెళ్లి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఫాంహౌస్లకు విక్రయిస్తున్నారు. ఇలా నిత్యం వందలాది టిప్పర్ల మట్టి తరలిపోతోంది. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న మొయినాబాద్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. టిప్పర్ల యజమానులు నిత్యం ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్లో మట్టి తవ్వి విక్రయిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం పెద్ద చెరువులో నుంచి కొద్ది రోజులుగా నల్లమట్టిని తరలించుకుపోతున్నారు. రాత్రి వేళటిప్పర్ల ద్వారా తీసుకెళ్లి ఒకచోట డంప్ చేసుకుంటున్నారు. ఆతర్వాత ఫాంహౌస్లకు అమ్ముతున్నారు. మండలంలోని నాగిరెడ్డిగూడ సమీపంలో ఉన్న హిమాయత్సాగర్ చెరువులో నుంచి సైతం నల్లమట్టిని తరలిస్తున్నారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల నుంచి ఎర్రమట్టి, మొరం తవ్వుతున్నారు. పెద్దమంగళారం, అప్పోజీగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో ఎర్రమట్టి, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, నక్కపల్లి, తోలుకట్ట ప్రాంతాల నుంచి మొరం తరలిస్తున్నారు. ఇలా నిత్యం వేలాది రూపాయల దందా నిర్వహిస్తున్నారు. సెలువు రోజుల్లోనే అధికంగా.. సెలవు రోజులను ఎంచుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు ఎవురూ అందుబాటులో ఉండరనే వ్యూహంతో హాలీ డేస్ను ఇలా వినియోగించుకుంటున్నారు. చెరువులు, కుంటలను కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్నారు. ఆతర్వాత నిఘా పెట్టడంలేదనే విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ శా ఖలో గ్రామస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలు అధికారులకు తెలియడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే ఇవి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేసులు నమోదు చేశాం పెద్దమంగళారం పెద్ద చెరువులో నల్ల మట్టి తవ్వుతున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తీస్తున్నవారిపై అప్పట్లోనే కేసులు నమోదు చేశాం. మళ్లీ ఎవరైనా మట్టి తీస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. మండలంలోని అన్ని చెరువులపై ప్రత్యేక నిఘా పెడతాం. – ప్రియాంక, ఇరిగేషన్ ఏఈ, మొయినాబాద్ యథేచ్ఛగా అక్రమ దందా చెరువులు, కుంటల నుంచితరలిస్తున్న అక్రమార్కులు ప్రభుత్వ భూములే లక్ష్యంగా తవ్వకాలు రాత్రి వేళ, సెలవుదినాల్లోటిప్పర్ల ద్వారా తరలింపు ఫాంహౌస్లలో పోసి సొమ్ముచేసుకుంటున్న వైనం -
పాండురంగ.. సేవలు వరంగా
కుల్కచర్ల: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సరదాగా గడపడంతో పాటు ఇతర వ్యాపకాల వైపు దృష్టిసారిస్తారు. వారికి ఇష్టమైన వ్యాపారం, వ్యవసాయం, మొక్కల పెంపకం.. ఇలా తమ అభిరుచులకు తగిన పనులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసి, రిటైరైన ప్రధానోపాధ్యాయుడు పాండురంగయ్య విద్యార్థుల శ్రేయస్సు కోసం పాఠాలు కొనసాగిస్తున్నారు. ఈయన సేవలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వరంగా మారాయి. ప్రతిరోజూ బడికి.. హెచ్ఎం పాండురంగయ్య గత నెల 24న ఉద్యోగ విరమణ పొందారు. కానీ ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో మంచి ఫలితాలు రావాలనే లక్ష్యంతో నిత్యం బడికి వస్తున్నారు. ఎప్పటిలాగే సమయానికి స్కూల్కు చేరుకుని పిల్లలకు గణితం బోధిస్తున్నారు. అంతేకాకుండా దోమ, షాద్నగర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మ్యాథ్స్పై ప్రత్యేక తరగతులు చెప్పడంతో పాటు పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను వివరిస్తూ మోటివేషనల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ ఆదర్శమే షాద్నగర్ ప్రాంతానికి చెందిన పాండురంగయ్య 13జూన్ 2024లో ఇప్పాయిపల్లి ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా విధుల్లో చేరారు. అనతికాలంలోనే విద్యార్థుల నడవడికలో మార్పులు తీసుకురావడంతో పాటు వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తూ మౌలిక వసతుల కల్పన కోసం తన సొంత డబ్బులు వెచ్చించారు. తాను పనిచేస్తున్న పాఠశాలలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తమవంతు సాయం అందించేందుకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాసవి క్లబ్కు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇప్పాయిపల్లి స్కూల్ విద్యార్థులకు వైట్ అండ్ వైట్ దుస్తులు, టై, బెల్టు, షూస్ అందజేయడంతో పాటు వాటర్ ప్యూరిఫయర్ వంటి సౌకర్యాలను కల్పించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేస్తున్న గురువు ఉద్యోగ విరమణ పొందినా నిత్యం విధులకు హాజరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకుసొంత డబ్బులతో వసతుల కల్పన ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్గెజిటెడ్ హెచ్ఎం పాండురంగయ్య ఉన్నతిలోకి రావాలి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు నావంతు కృషి చేస్తున్నా. ఉద్యోగ విరమణ అనేది నా ఉద్యోగ జీవితంలో ఒక భాగమే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అవసర నిమిత్తం నా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా. పేద పిల్లలు ఉన్నతిలోకి రావాలనేదే నా సంకల్పం. – పాండురంగయ్య, రిటైర్డ్ హెచ్ఎం -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మంచాల: అర్హులందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధి ఆరుట్ల గ్రామంలో కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలో 755 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని, రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, చెరుకు నర్సింహ, కృష్ణ, బుగ్గరాములు, అంతటి రాజు, మార సురేష్, బాషయ్య, రమేష్, చంద్రయ్య, వస్పరి కుమార్, శ్రీనివాస్గౌడ్, అశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు. -
అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
కడ్తాల్: రాగి అంబలి కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ చెన్నకిషన్రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం మండల కేంద్రంలో మహ్మద్ బాసిత్అలీ– ఖైరున్నీసా బేగం జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో బాటసారుల కోసం అన్నదానం, అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జావ తీసుకోవడం వలన చల్లదనంతో పాటు, పౌష్టికాహారం అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో జహంగీర్అలీ, లాయఖ్అలీ, అజ్గర్అలీ, ఆసీఫ్అలీ, హిమాయత్అలీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, క్లబ్ సభ్యులు గోవర్ధన్రెడ్డి, రాజేందర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ సర్సంచ్ వేణుగోపాల్, నాయకులు నేతిప్రభు, లింగం, ఇమ్రాన్బాబా, లక్ష్మయ్య ఉన్నారు. -
వర్గీకరణ తరువాతే ఉద్యోగాల భర్తీ
ఆమనగల్లు: ఎస్సీ వర్గీకరణ చేసిన తరువాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ తలకొండపల్లి మండల కేంద్రంలో సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం ఐదో రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతయ్య ప్రారంభించారు. శిబిరంలో నాయకులు బాలస్వామి, రాములు, శివ, పెంటయ్య, ప్రదీప్, మహేశ్, శంకరయ్య, జగన్లు కూర్చున్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు కుమార్, నారాయణ, సంపత్, మహేశ్, శేఖర్, సురేశ్, జంగయ్య, గిరి, ఉపేందర్ పాల్గొన్నారు. -
ఉత్సవాలకు ఆహ్వానం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు.. రాష్ట్ర మత్స్య సహ కార సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్కు ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. శని వారం నగరంలోని ఆయన నివాసంలో మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలం, నాయకులు భిక్షపతి, రాజు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వైభవంగా ఉత్సవాలు ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. మూడో రోజు శనివారం స్వామివారికి ఆలయ అర్చకులు రామాచార్యులు ఆధ్వర్యంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కార్య క్రమంలో మాజీ సర్పంచ్ శ్రీశైలం, నాయకులు శంకర్, రవి, యాదయ్య, శ్రీను, జంగయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో రూ.15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఎస్డీఎఫ్ కింద రోడ్డు నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరయ్యాయని వారు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గుజ్జల మహేశ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు చెన్నకేశవులు, నాయకులు వెంకట్రెడ్డి, వెంకట్రాజిరెడ్డి, కృష్ణయ్య, రఘుపతి, జంగయ్య, శ్రీశైలం, పెంటయ్య, మల్లేశ్గౌడ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, సత్యనారాయణ స్వామి సన్నిధిలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 17వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని వ్యవస్థాపకుడు హనుమాన్ దీక్షితులు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం క్షేత్రపాలకుల ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రేవంత్ ప్రతిష్టతను దెబ్బతీసేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టడం దారుణమన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కిషోర్తో పాటు ఆ సంఘం నేతలు అయ్యాన్,సచిన్, వెంకట్ ఉన్నారు. -
ఫ్యూచర్ సిటీలో కలిపేందుకు కృషిచేస్తా
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో చేర్చాలని కోరుతున్న గ్రామాల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కలిపేలా తనవంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో తమ గ్రామాలను చేర్చాలని కోరుతూ మండల పరిధిలోని నేదునూరు, బాచుపల్లి, జైత్వారం, ధన్నారం, పులిమామిడి, చిప్పలపల్లి, మురళీనగర్, దావూద్గూడ, పెద్దమ్మతండాలకు చెందిన అఖిలపక్ష నాయకులు శనివారం ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబును కలవడానికి మినిస్టర్ క్వార్టర్లకు వెళ్లారు. కాగా అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన వారితో కలవలేదు. అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ వారితో మాట్లాడారు. ఆయా గ్రామాల అభిప్రాయాన్ని మంత్రితో పాటు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఫ్యూచర్ సిటీలో కలిపేలా చూస్తానని వారికి ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ -
సిబ్బంది లేక.. సమస్యలు తీరక
మాడ్గుల: సిబ్బంది లేమితో ఎంపీడీఓ కార్యాలయం వెలవెలబోతోంది. ఫలితంగా వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. సకాలంలో పనులు గాక.. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మాడ్గుల మండలంలో 34 గ్రామ పంచాయతీలున్నాయి. ఇంత పెద్ద మండల ప్రజలకు సేవలందించాల్సిన ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్, ఆపరేటర్, టైపిస్ట్, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉండటం శోచనీయమని మండల ప్రజలు పేర్కొంటున్నారు. కష్టంగా కార్యాలయ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న విషయం విధితమే. అయితే పలు కారణాల వలన అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇలాంటి వాటి పరిష్కారం కోసం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే.. సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో ప్రజలు బారులు తీరుతున్నప్పటికీ.. ఆపరేటర్ లేక పోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. పనులు మానుకొని 10, 15కిలో మీటర్ల దూరం నుంచి వస్తే.. తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజా సౌకర్యార్థం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. సూపరింటెండెంట్ లేక.. కార్యాలయ నిర్వహణ కష్టంగా మారిందని ఉద్యోగులు పేర్కొనడం గమనార్హం. మండల పరిషత్కార్యాలయంలో అన్నీ ఖాళీలే! పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఇబ్బంది పడుతున్న ప్రజలు జీతాలు రాక ఇబ్బంది ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఆపరేటర్గా ప్రజలకు సేవలు అందిస్తున్నా. కానీ ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో వేతనాలు వచ్చేలా చూడాలి. – శివ, ఔట్సోర్సింగ్ ఉద్యోగి -
లక్ష్యం.. నిర్లక్ష్యం
మిల్క్చిల్లింగ్ యంత్రాల్లో వినియోగించిన జలాలతో పాటు, నీటి వృథాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈటీ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. రూ.23 లక్షలు వెచ్చించి నిర్మించిన ఎఫిలియంట్ ట్రీట్మెంట్.. అధికారుల నిర్లక్ష్యానికి తప్పుపట్టిపోయింది. ఫలితంగా లక్ష్యం నీరుగారిపోయింది. కడ్తాల్: మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో నీటి వృథాను అరికట్టేందుకు పాడిపరిశ్రమాభివృద్ధి పథకం, రాష్ట్రీయ కర్షక్ వికాస్ యోజన పథకం కింద 2017లో రూ.23 లక్షలతో ఈటీ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీంతో కేంద్రంలోని మిల్క్ చిల్చింగ్ చేసే సమయంలో యంత్రాలకు ఉపయోగించిన నీటిని శుద్ధి చేయడంతో పాటు, మురుగు సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. రీసైక్లింగ్ చేసిన నీటిని ఇతర అవసరాలతో పాటు.. చెట్లు, గడ్డి పెంచేందుకు వినియోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అలా నిత్యం 15 వేల లీటర్ల నీటిని శుద్ధి చేసి వినియోగించారు. నాలుగైదు సంవత్సరాలు ప్లాంట్ను ఉపయోగించారు. ఆ తరువాత నిర్లక్ష్యం చేయడంతో ఆ యంత్రం తుప్పుపట్టిపోతోంది. నిత్యం 30వేల లీటర్లు మండల కేంద్రంలో ఆరున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పాలశీతలీకరణ కేంద్రం.. అత్యధిక పాల ఉత్పత్తిలో సమైక్య రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు పొందింది. ప్రస్తుతం నిత్యం 30వేల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోంది. మండలంతో పాటు, కేశంపేట్, తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల, కందుకూర్ తదితర మండలాల నుంచి 100కు పైగా సొసైటీల నుంచి సేకరించిన పాలను.. ఈ కేంద్రంలో చిల్లింగ్ చేస్తారు. ఈ సమయంలో.. యంత్రాలకు పెద్ద మొత్తంలో నీటిని వాడుతుంటారు. అలా వాడిన నీరు.. మురుగు జలాలుగా మారి వెలుపలికి వస్తుంటాయి. తీవ్ర దుర్వాసన గతంలో మండల కేంద్రంలో నివాసాలు పెద్దగా లేక పోవడంతో మురుగు జలాలను అలాగే వదిలేసేవారు. పదేళ్ల క్రితం కేంద్రం సమీపంలోనే పాఠశాల ను ఏర్పాటు చేయగా.. వ్యర్థ జలాలతో వస్తున్న దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఇదే విషయమై పలుమార్లు ఉపాధ్యాయులు అప్పట్లో మేనేజర్, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాలశీతలీకరణ కేంద్రం నుంచి పాఠశాల మీదుగా కుంటకు మురుగునీటిని తరలించేందుకు పైప్లైన్ వేశారు. ఆ లైన్ తరచూ పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వచ్చేది. అది భరించలేనంతగా ఉండటంతో.. అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2017లో ఈటీ ప్లాంట్ ఏర్పాటును ఏర్పాటు చేశారు. నిరుపయోగంగా ఈటీ ప్లాంట్ నీటి వృథాను అరికట్టేందుకు ఏడేళ్ల క్రితం ఏర్పాటు పట్టించుకోని అధికారులు.. తుప్పుపట్టిన యంత్రం చర్యలు తీసుకోవాలి పాలకేంద్రంలో వాడిన నీరు వృథా కాకుండా శుద్ధి చేసి, ఇతర అవసరాలకు వినియోగించాలని స్థానికులు, పాడి రైతులు కోరుతున్నారు. ఈటీ ప్లాంట్ నుంచి వచ్చే నీటితో పాల కేంద్రంలో చొప్ప, గడ్డి సాగు చేయాలని, మొక్కలకు నీటిని అందించాలని పేర్కొంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. -
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
కేసు నమోదు చేసిన పోలీసులుమాడ్గుల: బెల్ట్షాప్లో విక్రయిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మండల కేంద్రంలోని అంబాల యాదయ్యకు చెందిన మణికింఠ కిరాణం, ఈర్ల శ్రీనివాస్కు చెందిన జై హనుమాన్ కిరాణం, నాగిళ్ళ గ్రామంలోని అగిర్ చంద్రశేఖర్ కిరాణం దుకాణల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రూ.50వేల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.6 వేల విలువ..యాచారం: అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. మండల పరిధిలోని తమ్మలోనిగూడలో రాములు అనే వ్యక్తి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం యాచారం పోలీసులు వెళ్లి దుకాణంలో తనిఖీ చేయగా రూ.6 వేల విలువ జేసే లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
నేటి నుంచి ధ్యానోత్సవం
ఇబ్రహీంపట్నం: హార్ట్ఫుల్నెస్ సంస్థ, శ్రీ రామచంద్ర మిషన్ సంయుక్తంగా శని, ఆది, సోమవారాల్లో ఇబ్రహీంపట్నంలోని ఓసీ కమ్యూనిటీ హాల్లోఽ ధ్యానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 సంవత్సరాలు దాటిన వారంతా ఈ ధ్యానోత్సవానికి హాజరు కావొచ్చని తెలిపారు. ధ్యానంతో కలిగే భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఈ కార్యక్రమంలో వివరించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్లీడర్గా గీతావనజాక్షి మొయినాబాద్: పెద్దమంగళారం మాజీ సర్పంచ్, న్యాయవాది గీతావనజాక్షి అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్గా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారానికి చెందిన గీతావనజాక్షి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2013 నుంచి 2018 వరకు ఆమె గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మహిళలకోసం లీగల్ క్లినిక్ను సైతం నడుపుతున్నారు. చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టు, ఇతర కోర్టులకు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్గా ఆమెను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్గా నియమితులైన సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలి షాద్నగర్: ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్స్తో పాటు అన్ని రకాల పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ ఐదు రోజులుగా షాద్నగర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన దీక్షలు చేపడుతున్నారు. దీక్ష శిబిరానికి శుక్రవారం గోవింద్ విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్గీకరణ అమలులో లేకపోవడంతో కొన్ని దశాబ్దాలుగా విద్య, ఉద్యోగ రంగాల్లో మాదిగలకు ఎంతో అన్యాయం జరుగుతోందని అన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 17న అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించిన నేపథ్యంలో మాదిగలు అప్రమత్తంగా ఉండి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ, నాయకులు భిక్షపతి, శివ, పరుశరాం, చిర్ర శ్రీను, చెన్నగళ్ల శ్రావణ్కుమార్, పాండు, సురే ష్, బాల్రాజ్, శేఖర్, నాగేష్ పాల్గొన్నారు. కుల్ఫీ ఐస్క్రీమ్, బర్ఫీ స్వీట్లలో గంజాయి స్పెషల్ టాస్క్ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి..సాక్షి, సిటీబ్యూరో/అబిడ్స్: హోలీ సంబరా లను సొమ్ము చేసుకొనేందు కు గంజాయి విక్రేతల ముఠా కొత్త పన్నాగం పన్నింది. హోలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం లోయర్ ధూల్పేట్లో కుల్ఫీ ఐస్క్రీమ్లు, బర్ఫీ స్వీట్లకు సిల్వర్ కోటెడ్ బాల్స్ను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎకై ్సజ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 100 కుల్ఫీ ఐస్క్రీమ్లు, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి కుల్ఫీ ఐస్క్రీమ్ల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నట్లు సమా చారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకుని, సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీక్ష చేపట్టిన ఎమ్మార్పీఎస్ నాయకులు -
హత్య చేసిన నిందితుడికి రిమాండ్
షాబాద్: మద్యం దుకాణంలో దొంగతనం చేస్తూ, అడ్డొచ్చిన ఓ యువకుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి ఓ ఆగంతకుడు షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్లో దూరి పర్మిట్ రూమ్లో పడుకున్న వ్యక్తిని హత్య చేసిన సంగతి విదితమే. శుక్రవారం రాజేంద్రగనర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పుడుగుర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి నరేందర్ జల్సాలకు అలవాటు పడి చోరీలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12న అర్ధరాత్రి అతడు దుర్గా వైన్స్లో చోరీకి యత్నించాడు. వెనుక వైపు గోడకు సుత్తెతో రంధ్రం చేస్తుండగా.. శబ్దం విని అక్కడే పనిచేసే భిక్షపతి(35) పర్మిట్ రూమ్ నుంచి బయటకు వచ్చి గట్టిగా అరిచాడు. దీంతో నరేందర్ పారతో భిక్షపతి తలపై కొట్టాడు. విలవిలలాడుతూ అక్కడే అతడు మృతి చెందాడు. ఆ తర్వాత వైన్స్లో దూరి సుమారు రూ.40వేల నగదు, కొన్ని మద్యం బాటిళ్లను తీసుకొని పరారయ్యాడు. సీసీ కెమెరా ఆధారంగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి నరేందర్గా గుర్తించారు. అతడిని శుక్రవారం ఉదయం సీతారాంపూర్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్ను నిలుపుదల చేసి కొంత సొత్తును రికవరీ చేశారు. కాగా నరేందర్పై గతేడాది బహుదూర్పురా, అత్తాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీల కేసులో నేరస్తుడిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ నెల 3న నాగర్గూడ వైన్స్లో దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ హత్య కేసును 24 గంటల్లోగా ఛేదించినందుకు రాజేంద్రగనర్ జోన్, చేవెళ్ల ఏసీపీలు ప్రశాంత్, కిషన్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ కె.శశాంక్రెడ్డి, షాబాద్ సీఐ కాంతారెడ్డి బృందాలను డీసీసీ అభినందించారు. గతంలోనూ పలు కేసుల్లో ఉన్నట్లు నిర్ధారణ రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ -
గ్రూపు–3లో మెరిసిన గిరిపుత్రుడు
మహేశ్వరం: ఉద్యోగం చేస్తూనే ఉన్నత స్థాయికి వెళ్లాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివాడా యువకుడు. పేద కుటుంబంలో పుట్టి గ్రూప్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి సత్తా చాటాడు. మహేశ్వరం మండలం పెద్దమ్మ తండా గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న నల్లచెర్వు తండాకు చెందిన కాట్రావత్ దేవేందర్ నాయక్ శుక్రవారం వెల్లడించిన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో శంషాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. సంతోషంలో తల్లిదండ్రులు ఇటీవల విడుదలైన గ్రూప్–2, గ్రూప్–1, గ్రూప్–3 ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. అంతకుముందు గ్రూప్–2 ఫలితాల్లో జోనల్ ఎస్టీ కేటగిరిలో 2వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 171వ ర్యాంకు సాధించాడు. గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో 433 మార్కులు సాధించారు. గ్రూప్–3 పరీక్ష ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో 2వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించి మెరిశాడు. దీంతో ఏదైనా ఉన్నతోద్యోగం తమ కుమారుడికి వస్తుందని దేవేందర్నాయక్ తల్లిదండ్రులు లక్ష్మి, రాములు నాయక్ సంతోష పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు -
శివారు ప్రాంతాలు.. చోరీలకు నిలయాలు
అబ్దుల్లాపూర్మెట్: హైదరాబాద్ నగర శివారులో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని అందిన కాడికి దోచుకొని పరారవుతున్నారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల ఈ తరహా ఘటనలు కలవరం పెడుతున్నాయి. ప్రతి నిత్యం గ్రామాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నా వారి కళ్లను కప్పి కేటుగాళ్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మండలంలోని రెండు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడగా, ఈ నెలలో ఇప్పటి వరకూ పలుచోట్ల ఇళ్లలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయి సవాల్ విసురుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు ● గత నెల 18వ తేదీన పిగ్లీపూర్లోని అభయాంజనేయస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని విగ్రహానికి అమర్చిన 15 కిలోల వెండి తొడుగును అపహరించుకుపోయారు. వాహన తనిఖీల్లో ఈ నెల 4వ తేదీన ఆలయంలో దోపిడీకి పాల్పడిన ఇద్దరు దుండగులను పోలీసులు పట్టుకుని, వారి నుంచి 20 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ● అనాజ్పూర్ గ్రామంలో గత నెల 27వ తేదీన శివాలయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని రెండు హుండీలతోపాటు ఎల్ఈడీ లైట్లను అపహరించుకుపోయారు. ● మండల పరిధిలోని కవాడిపల్లి గ్రామంలోని ఉదయ్గార్డెన్స్లో ఈ నెల 10వ తేదీన ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 4 తులాల బంగారు, 80 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష మేర నగదును దోచుకెళ్లారు. ● బలిజగూడ గ్రామంలోనూ ఇదే తరహాలో ఓ ఇంట్లో ఈ నెల 10వ తేదీన దొంగతనం జరగగా.. 3 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, రూ.38 వేల నగదు అపహరించుకుపోయారు. ● తాజాగా గురువారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్లోని సాయినగర్ కాలనీలో నివాసముండే కొత్త రమేశ్ ఇంట్లోకి చొరబడిన దుండగులు 2.5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, 10 వేలు నగదును తస్కరించారు. రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు తరచూ ఇళ్లలో చోరీలు భయాందోళనలో ప్రజలు -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పహాడీషరీఫ్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బాలాపూర్ పోలీస్ష్టేషన్ పరిధిలో శుక్రవారం లభ్యమయింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామ పరిధి వీఐపీ కాలనీ బహిరంగ ప్రదేశంలో ఓ వ్యక్తి పడున్నాడన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. కానీ అతను అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 52–55 ఏళ్ల మధ్య ఉంటుందని, సంబంధికులెవరైనా ఉంటే పోలీస్స్టేషన్ లేదా.. 87126 62366 నంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. చెరువులో పడి మేసీ్త్ర మృతి కొడంగల్ రూరల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం రుద్రారం పరిధిలోని పాటిమీదిపల్లి భీరం చెరువులో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బషీరాబాద్ మండలం బాదులాపూర్తండాకు చెందిన రాథోడ్ మోహన్(46) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మద్యం తాగి బీరం చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత సరిగ్గా రాకపోవడంతో చెరువులో మునిగి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి భార్య సాలీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. వరకట్న వేధింపులకు యువతి బలి అత్తాపూర్: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బీదర్కు చెందిన స్వప్న(27)కు అత్తాపూర్ పాండురంగ నగర్కు చెందిన అమరేష్కు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కొద్దిరోజులుగా అమరేష్ అదనంగా కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. పెళ్లి సమయంలో పెట్టిన బంగారాన్ని తన అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టడంతో పాటు అదనంగా డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ వేధించసాగాడు. ప్రతిసారి ఇంటి నుంచి డబ్బులు తేలేక..వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీ, వ్యక్తి మృతి పరిగి: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి రంగంపల్లి కాటన్మిల్లు సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి నుంచి రంగంపల్లి వైపు హైదారాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి, గురువారం రాత్రి 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలై దుర్మరణం చెందాడు. -
త్వరతగతిన న్యాయం..
రాష్ట్రంలోని వినియోగదారులకు త్వరితగతిన న్యాయ సేవలు అందుతున్నాయి. న్యాయం కోసం కమిషన్ను ఆశ్రయించిన వారికి సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం. వివిధ కంపెనీల నుంచి నష్టపోయిన వినియోగదారులు కేసులు వేసేవరకు రాకముందే ఆయా కంపెనీల యాజమన్యాలు వారి సమస్యలు పరిష్కరిస్తున్నాయి. ఇక కొత్తగా అమల్లోకి వచ్చిన జాగృతి ఆన్లైన్ సర్వీస్ ద్వారా వినియోగదారులు కేసులు ఆన్లైన్లోనే దాఖలు చేయవచ్చు. – మీనా రామనాథన్, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్చార్జి అధ్యక్షురాలు ● -
పల్లె గొంతెండుతోంది!
దుద్యాల్: మండుటెండులు ముదురుతున్న తరుణంలో ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి ఆరు రోజులు గడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కనీస అవసరాలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని మండలంలోని ఆలేడ్ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా ఆరు రోజులుగా బంద్ కావడంతో అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకొని కాలం వెళ్లదీస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అదే మాటే మిషన్ భగీరథ నీటి సరఫరా ఈ నెల 9 నుంచి బంద్ కావడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కొందరు గ్రామానికి సరఫరా అయ్యే బోరును తమ వ్యవసాయ పొలాలకు వాడుతున్నారనే ఆరోపణ కూడా వ్యక్తం అవుతోంది. గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే సంబంధిత వ్యక్తిని ఫోన్ ద్వారా సంప్రదించగా... పైపు లైన్ పగిలిపోయిందని, మరమ్మతులు చేస్తున్నారని సెలవిచ్చారు. గ్రామస్తులకు సైతం ఇదే సమాధాన్ని ఆరు రోజులుగా చెబుతుండడం గమనార్హం. మరోవైపు గ్రామంలోని పాఠశాలలో వేసిన బోరు నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో కొందరు ఉపశమనం పొందుతున్నారు. ధర్నా చేపడతాం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో తాగునీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. లేకుంటే అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపడుతామని హెచ్చరిస్తున్నారు. ఊరిలో తాగునీటి సరఫరా ఇబ్బందిగా మారినప్పుడు గ్రామ పంచాయతీ ట్యాంకర్ సహాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల హస్నాబాద్లో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికార యంత్రాంగం స్పందించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అదే మాదిరి తమ గ్రామంలో చర్యలు తీసుకోవాలని ఆలేడ్ గ్రామస్తులు క‘న్నీటి’తో విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. మొన్న హస్నాబాద్.. ఇవాళ ఆలేడ్ గ్రామాలలో మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగు నీటికి అరిగోస పడుతున్నారు. ఆరు రోజులుగా భగీరథ సరఫరా బంద్ తీవ్ర అవస్థలు పడుతున్న ఆలేడ్ గ్రామస్తులు స్పందించని అధికార యంత్రాంగం -
నిర్మాణం.. అయోమయం!
మొయినాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారులు వింత తీరును అవలంబిస్తున్నారు. ప్లింత్ భీంల వరకే పిల్లర్లు వేసి ఆ తరువాత గోడలు నిర్మిస్తున్నారు. గోడలపైనే స్లాబ్ వేసే విధంగా ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. లబ్ధిదారులకు మాత్రం వారి ఇష్టానుసారంగా నిర్మించుకోవచ్చని చెబుతున్నారు. దీంతో ఇంటి నిర్మాణంపై స్పష్టత లేక లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. సొంతింటికోసం కలలు కంటున్న నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. గత జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపికచేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసింది. అవగాహన కోసం మండల కేంద్రాల్లో నమూనా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నమూనా ఇంటి నిర్మాణం చేపట్టారు. గోడలకు సిమెంట్ బ్రిక్స్ మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 60 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మిస్తున్నారు. ఇందుకోసం మొదటగా గుంతలు తీసి పిల్లర్లు వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా పిల్లర్లను బేస్మింట్ లెవల్ వరకే నిర్మించారు. వాటిపై ప్లింత్ భీంలు వేశారు. అక్కడి నుంచి స్లాబ్ లెవల్కు ప్లిలర్లు వేయలేదు. ప్లింత్ భీంలపై గోడల నిర్మాణం చేపట్టి.. వాటిపైనే స్లాబ్ వేసేలా నిర్మిస్తున్నారు. గోడలకు సైతం సిమెంట్ బ్రిక్స్ వినియోగిస్తున్నారు. బెడ్రూం, కిచెన్, హాలు, బాత్రూం ఉండేలా ఇంటిని నిర్మిస్తున్నారు. పైకి ఎక్కడానికి మెట్లు ఉండవు. ఈ నిర్మాణాన్ని ఇటీవల వెంకటాపూర్కు చెందిన కొందరు లబ్ధిదారులు పరిశీలించారు. స్లాబ్ లెవల్ వరకు పిల్లర్లు లేకుండా సిమెంట్ బ్రిక్స్తో నిర్మించే గోడలపై స్లాబ్ వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని అయోమయానికి గురువుతున్నారు. అధికారులు మాత్రం లబ్ధిదారులకు ఇష్టం వచ్చిన విధంగా నిర్మించుకోవచ్చని చెబుతున్నారు. నాలుగు విడతల్లో బిల్లులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల్లో బిల్లులు చెల్లించనుంది. మొదట బేస్మింట్ లెవల్ నిర్మాణం పూర్తయిన తరువాత రూ.లక్ష, లెంటల్ లెవల్ నిర్మాణం పూర్తయి తరువాత రూ.2 లక్షలు, స్లాబ్ వేసిన తరువాత రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అవగాహన కోసం నమూనా ప్లింత్ భీంల వరకే పిల్లర్లు.. గోడలపైనే స్లాబ్ లబ్ధిదారులు ఇష్టానుసారంగా కట్టుకోవచ్చని సూచన అధికారుల తీరుతో గందరగోళం రూ.5 లక్షల్లో పూర్తి కాదు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. మాకు నచ్చినట్టు కట్టుకుంటే రూ.5 లక్షలు సరిపోవు. అధికారులు చెప్పినట్లు నిర్మించుకుంటే గదులు చిన్నవిగా వస్తాయి. కాస్త విశాలంగా నిర్మించుకోవాలంటే సొంత డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. – ఎల్గుల రేణుక, లబ్ధిదారు, వెంకటాపూర్గోడలపై స్లాబ్ వేసినా దృఢమే.. ఇందిరమ్మ ఇంటిని 400 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మించుకోవచ్చు. బేస్మింట్ లెవల్ వరకు పిల్లర్లు వేస్తే భవిష్యత్తులో కుంగకుండా ఉంటుంది. గోడలపై స్లాబ్ వేసినా దృఢంగానే ఉంటుంది. లబ్ధిదారులు వారికి నచ్చినట్లుగా నిర్మించుకోవచ్చు. – అబ్దుల్ హకీం, హౌసింగ్ ఏఈ, మొయినాబాద్ -
నవ వధువు ఆత్మహత్య
కొందుర్గు: కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొందుర్గు మండల పరిధిలోని వెంకిర్యాలలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం ఎన్కెపల్లికి చెందిన కప్పరి మన్యం, సుగుణమ్మల కూతురు సుజాత(21)ను , మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం లింగంపల్లికి చెందిన రాములుకు ఇచ్చి గత నెల 7న వివాహం జరిపించారు. ఈ సమయంలో వరకట్నం కింద అరతులం బంగారు అభరణాలు, స్కూటీ కొనుక్కునేందుకు రూ.70 వేల నగదుతోపాటు వంట సామగ్రి అందజేశారు. అయితే పెళ్లి జరిగిన రోజునుంచి భర్త రాములుతో పాటు మామ పోచయ్య, బావ సైదులు ఆమెను మానసికంగా బాధపెడుతున్నారు. పెళ్లికి రూ.6 లక్షలు ఖర్చు అయ్యిందని, ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుంచి తేవాలని సుజాతను ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మన్యం, సుగుణమ్మ వెంకిర్యాలలోని తమ సమీప బంధువు రామకృష్ణకు చెందిన టీ స్టాల్లో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నారు. గురువారం వెంకిర్యాలకు వచ్చిన సుజాత రాత్రి వేళ వద్ద బాత్రూమ్లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మన్యం ఫిర్యాదు మేరకు తహసీల్దార్ రమేశ్కుమార్ సమక్షంలో షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బాలస్వామి తెలిపారు. ఇదిలా ఉండగా సుజాత అంత్యక్రియలను అత్తగారి గ్రామమైన లింగంపల్లిలో నిర్వహించారు. వరకట్న వేధింపులతో మనస్తాపం ఉరేసుకుని బలవన్మరణం -
వైన్స్లో చోరీ.. వ్యక్తి హత్య
షాబాద్: వైన్ షాపులో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు.. అడ్డు వచ్చిన వ్యక్తిని హత్య చేశారు. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్కు చెందిన చేగూరి భిక్షపతి అలియాస్ ప్రవీణ్(35) మండల కేంద్రంలోని దుర్గావైన్స్ పక్కన ఉన్న కూల్ పాయింట్(కూల్ డ్రింక్స్ షాప్)లో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి పని ముగించుకుని వైన్షాపు పక్కన పర్మిట్ రూమ్లో పడుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత వైన్స్ వెనక గోడను పగులగొట్టిన దుండగులు లోనికి ప్రవేశించి, క్యాష్కౌంటర్లోని రూ.40 వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా డివైజ్ను తీసుకుని బయటకు వచ్చారు. వీరి అలికిడితో మెలకువ వచ్చిన ప్రవీణ్ దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేయగా బలమైన ఆయుధంతో అతని తలపై మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చేవెళ్ల ఏసీపీ కిషన్, క్రైమ్ ఏసీపీ శంశాక్రెడ్డి, సీసీఎస్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు ప్రశాంత్, రమణారెడ్డి, డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు ఆయా ప్రదేశాల్లోని సీసీ కెమెరా పుటేజీలు పరిశీలిస్తున్నారు. వారం రోజుల క్రితం నాగర్గూడ వైన్స్లో చోరీ ఘటనను మరవకముందే షాబాద్ వైన్స్లో ఈ ఘటన జరగడం గమనార్హం. మృతుడికి వివాహం కాలేదు. తల్లి బాలమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గోడకు కన్నం వేసి లోనికి చొరబడిన దుండగులు రూ.40 వేలు, మద్యం బాటిళ్లు, సీసీ కెమెరాల డివైజ్ చోరీ అడ్డుకునేందుకు వెళ్లిన వ్యక్తిపై ఆయుధంతో దాడి అక్కడికక్కడే మృతిచెందిన బాధితుడు షాబాద్లో ఘటన వివరాలు వెల్లడించిన సీఐ కాంతారెడ్డి -
పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలి
షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బీస సాయిబాబ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గురువారం సీఐటీయూ నాయకులతో కలిసి సీడీపీఓ షబానా బేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబ మాట్లాడుతూ.. విద్యారంగంలో మార్పుల పేరుతో కేంద్రం తెచ్చిన పీఎంశ్రీ పథకంతో ఐసీడీఎస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని అన్నారు. మొబైల్ అంగన్వాడీ సేవల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని, దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు అందించే సేవలు దూరం అవుతాయని తెలిపారు. పిల్లలు, పేదలకు నష్టం కలగించేలా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారం చేపట్టి పదిహేను నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటా వార్పు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలు సహించేది లేదు షాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనులు సక్రమంగా జరిగేలా చూడాలని డీఆర్డీఓ శ్రీలత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ భవనంలో 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులను ఎంపిక చేసుకోవాలన్నారు. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ, వ్యవసాయ పొలాల్లో కాలువలు తవ్వడం, పొలాలను చదును చేయడం, గట్లు పోయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అపర్ణ, ఏపీడీ చరణ్గౌతమ్, ఏఈవో కొండయ్య, అంబుడ్స్మెన్ సునీతామూర్తి, క్యూసీ సునీత, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ వీరాసింగ్, ఎస్ఆర్పీ రంజిత్, డీఆర్పీలు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిసెంట్లు పాల్గొన్నారు. గ్రూప్–2లో ప్రతిభ ఇబ్రహీంపట్నం రూరల్: గ్రూప్–2 ఫలితాల్లో మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన రాకేష్ సత్తా చాటాడు. రాష్ట్రంలో 177వ ర్యాంకు సాధించాడు. మల్టీజోన్లో 78వ ర్యాంకు, ఆరో జోన్లో 33వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. రాకేష్ ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం హెచ్ఏండీఏలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాకేష్ సోదరి కీర్తన కూడ 2023లో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం సాధించింది. తండ్రి మరణించడంతో తల్లి కూలి పని చేస్తూ పిల్లలను చదివించింది. గ్రూప్–2కు ఎంపికై న రాకేష్ను పలువురు అభినందిస్తున్నారు. తొలి రోజు 15 ఫిర్యాదులు సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాప్తంగా ఉన్న గుర్తు తెలియని వాహనాలపై సమాచారం ఇవ్వాలంటూ సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ప్రకటించారు. దీనికి సంబంధించి తొలి రోజైన గురువారం పోలీసులకు 15 ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన అధికారులు ఐదు వాహనాలు తొలగించగా.. మిగిలిన వాటిని తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాలపై 90102 03626, 87126 60600 నంబర్లకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని జోయల్ డెవిస్ సూచించారు. -
ఎదురెదురుగా బైక్లు ఢీ
ఆర్టీసీ డ్రైవర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు షాబాద్: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామానికి చెందిన మొగిలిగిద్ద సుధాకర్, కొత్తపల్లి బాలయ్య బైక్పై ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన తిమ్మక్క రజినీకాంత్ తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో అంతారం స్టేజీ వద్ద ఈ రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుధాకర్, రజనీకాంత్ తీవ్రంగా గాయపడడంతో షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిగి డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న సుధాకర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బాలయ్య స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారు డున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. బైక్ను ఢీకొట్టిన ఆటో ద్విచక్ర వాహనదారుడి మృతి మొయినాబాద్: బైక్ ను ఆటో ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చిలుకూరు గ్రామానికి చెందిన బక్క రాజు(35) బాలాజీ ఆలయం వద్ద టెంకాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో రాజు తన బైక్పై హిమాయత్నగర్ వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా చిలుకూరు మహిళ ప్రాంగణ సమీపంలో ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ ఆటో అతివేగంగా బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్రగాయాలవడంతో గమనించిన స్థానికులు స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కకు చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారలు సంతానం. కేసు దర్యాప్తులో ఉంది. టీచర్స్కు ఏఐపై శిక్షణ శంషాబాద్ రూరల్: ఉపాధ్యాయులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎంఈఓ వి.కిషన్నాయక్ అన్నారు. మండల విద్యా వనరుల కేంద్రంలో గురువారం ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా వెబ్ టూల్లో విద్యార్థులకు స్వీయంగా అభ్యసించే అవకాశా న్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎంఈఓ అన్నారు. -
భవనం పైనుంచి పడి వృద్ధుడి మృతి
మొయినాబాద్: మొదటి అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలైన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కనకమామిడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దింటి గోవింద్రెడ్డి(75) కుటుంబం మొదటి అంతస్తులో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి బయట ఏదో గొడవ జరుగుతుందని చూడటానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మొదటి అంతస్తుకు రేలింగ్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డిన ఆయన్ను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం సాయంత్రం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
వర్గీకరణ చేపట్టే వరకు పోరాటం
ఆమనగల్లు: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణమాదిగ అన్నారు. వర్గీకరణ చేపట్టే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలనే డిమాండ్తో చేపట్టిన దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరాయి. దీంతదీక్షలో కిశోర్కుమార్మాదిగ, సురేశ్, విజయ్కుమార్, సాయి, విజేందర్, మహేశ్, సచిన్, పవన్లు కూర్చున్నారు. ఈ సందర్భంగా పి.కృష్ణమాదిగ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా పోరాడుతున్నా వర్గీకరణ చట్టబద్దత కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నారాయణ, కుమార్, శ్రీను, మహేశ్, సురేశ్, బాలరాజు, శ్రీకాంత్, కృష్ణ, శివ, నర్సింహ, కుమ్మరసంఘం నాయకులు నాగేశ్, బాలకృష్ణ, రమేశ్, తిరుపతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పి.కృష్ణమాదిగ -
సినీ దర్శకుడిపై కర్రలతో దాడి
బంజారాహిల్స్: ప్రమాదకరంగా బైక్లపై దూసుకెళ్తున్న యువకులను ఎందుకలా డ్రైవ్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన సినీ డైరెక్టర్పై స్కూటరిస్టులు కర్రలతో దాడి చేసి గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్నెంబర్–5లో నివసించే సినీ దర్శకుడు మీర్జాపురం అశోక్తేజ బుధవారం రాత్రి మాదాపూర్ నుంచి కృష్ణానగర్ వెళ్తుండగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10 నుంచి రెండు బైక్లపై నలుగురు యువకులు మద్యం మత్తులో ర్యాష్ డ్రైవ్ చేస్తూ ఓవర్టేక్ చేస్తూ న్యూసెన్స్కు పాల్పడుతున్నారు. దీనిని గుర్తించిన అశోక్ తేజ ఎందుకలా స్పీడ్గా వెళ్తున్నారని ప్రశ్నించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు అతడిని చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. వారి బారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. దీనిని గుర్తించిన వాహనదారులు అక్కడికి చేరుకోవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. సదరు యువకులు పల్సర్, ఎఫ్జెడ్ బైక్లపై రాత్రిళ్లు ఆవారాగా తిరుగుతూ, దారిన పోయేవారిని వేధిస్తూ ప్రశ్నిస్తే కొడుతూ అందినకాడికి డబ్బులు లాక్కుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భార్యను కడతేర్చిన భర్త రహమత్నగర్ : కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్నగర్ డివిజన్ రాజీవ్గాంధీ నగర్కు చెందిన నరేందర్ స్ధానికంగా మిల్క్ బూత్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య పద్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా వారి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన నరేందర్ పద్మ(50)ను గొంతు నులిమి హత్య చేఽశాడు. గురువారం ఉదయం బోరబండ పోలీసుల ఎదుట లొంగి పోయాడు. సంఘటనా స్ధలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్కుమార్, ఎస్ఆర్నగర్ ఏసీపీ వెంకటరమణ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిలిండర్తో మోది.. ● తల్లిని దారుణంగా హత్య చేసిన తనయుడు ● ఆస్తి వివాదాలే కారణం శంషాబాద్: ఆస్తి కోసం ఓ వ్యక్తి కన్న తల్లిని దారుణంగా హత్యచేసిన సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రాళ్లగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన చంద్రకళ(60)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రకాష్ (35) ఆవారాగా తిరిగేవాడు. గతంలో అతను రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు భార్యలు అతడిని విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం మూడో భార్యతో కలిసి ఉంటున్న అతడికి ఇద్దరు కుమార్తెలు. రాఘవేంద్రకాలనీలోని వంద గజాల ఇంటిలో తన వాటా తనకు ఇవ్వాలని ప్రకాష్ గత కొన్నాళ్లుగా తల్లిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి పత్రాలు తనకు ఇవ్వాలని వేధిస్తున్నా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో తల్లి నిరాకరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పలుమార్లు తల్లితో గొడవ పడటంతో ఆర్జీఐఏ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. మద్యం మత్తులో ఘాతుకం బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ప్రకాష్ ఆస్తి పత్రాల కోసం మరోమారు తల్లితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అతను పక్కనే ఉన్న కర్రతో పాటు గ్యాస్ సిలిండర్తో తల్లిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ చొరవతోనే అభివృద్ధి
చేవెళ్ల: మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల అన్నారు. గురువారం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనభాలో సగభాగం ఉన్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను సైతం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 20శాతం మహిళలు పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనతతో భాదపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య నాయకురాలు వెంకటమ్మ, నాయకురాళ్లు లలిత, విజయమ్మ, రమాదేవి, వినోద, సుగుణమ్మ, అంజమ్మ, జయమ్మ, యాదమ్మ, రాములమ్మ, చంద్రకళ, సీపీఐ నాయకులు కె. రామస్వామి, వడ్ల సత్యనారాయణ, బాబురావు, యాదగిరి, శ్రీకాంత్, పెంటయ్య, తదితరులు ఉన్నారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల -
కేసులపేరు చెప్పికాసులు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని (65) టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు కేసుల పేరు చెప్పి కాసులు దండుకున్నారు. దుర్భాషలాడిన ఆరోపణలపై కేసు నమోదయ్యిందంటూ మొదలెట్టిన కేటుగాళ్లు మనీలాండరింగ్, మనుషుల అక్రమ రవాణా వరకు తీసుకెళ్లారు. మధ్యలో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి పంపారు. రిఫండ్ చేస్తామంటూ ఆమె నుంచి రూ.23 లక్షలు కాజేశారు. నాలుగు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించిన బాధితురాలు ఎట్టకేలకు తాను మోసోయినట్లు గుర్తించి గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..బాధితురాలికి ఇటీవల టెలికాం డిపార్ట్మెంట్ అధికారి పేరుతో ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్కార్డు వినియోగించి సిమ్కార్డు ద్వారా అనేక మందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ కాల్స్ చేశారని ఈ మేరకు కేసు నమోదైందని చెప్పారు. కాల్ను బెంగళూరుకు చెందిన ఎస్సై అంటూ మరో వ్యక్తికి బదిలీ చేశాడు. కొన్ని ప్రత్యేక విభాగాలను మినహాయిస్తే దేశంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ను దాని సీరియల్ నెంబర్/ఏ ఏడాది విధానంలో నమోదు చేస్తారు. అయితే బాధితురాలికి మాత్రం బీకే354ఏ/0125 నెంబర్తో ఎఫ్ఐఆర్ నమోదైందంటూ చెప్పిన నకిలీ ఎస్సై తక్షణం తమ వద్ద హాజరుకావాలని చెప్పాడు. దీంతో షాక్కు గురైన ఆమె తాను ఎలాంటి నేరాల్లోనూ పాలు పంచుకోలేదని, వయస్సు రీత్యా బెంగళూరు వరకు ప్రయాణం చేయలేనని వేడుకున్నారు. దీంతో సదరు సైబర్ నేరగాడు ఈ కేసు సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ అయ్యిందని, అక్కడ నుంచి ఓ ఉన్నతాధికారి సంప్రదిస్తారని చెప్పాడు. ఆపై బాధితురాలికి కాల్ చేసిన వ్యక్తి తాను ఐపీఎస్ అధికారినంటూ మాట్లాడాడు. తాము ఢిల్లీలో సదాసత్ ఖాన్ అనే నేరగాడిని పట్టుకున్నామని, అతడి విచారణలోనే బాధితురాలి పేరుతో ఉన్న ఆధార్కార్డు, దానికి లింకై ఉన్న బ్యాంకు ఖాతా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. ముంబైలో తెరిచిన ఆ బ్యాంకు ఖాతాను మనీ లాండరింగ్ కోసం వాడినట్లు చెప్పి భయపెట్టాడు. అదే ఖాతాను మనుషుల అక్రమ రవాణా ముఠాలు వినియోగించాయని చెప్పాడు. ఇన్ని కేసులు నమోదైన నేపథ్యంలో బాధితురాలి పేరును వాటి నుంచి తొలగించడానికి కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ చెల్లింపు అనివార్యం అంటూ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పేరుతో రూపొందించిన నకిలీ లేఖ పంపాడు. తన ఖాతాల్లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని మూడు రోజుల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి రిఫండ్ చేస్తామని నమ్మబలికాడు. దీంతో ఆమె కొంత మొత్తం బదిలీ చేశారు. ఆపై తన డబ్బు రిఫండ్ చేయమంటూ పదేపదే ఫోన్లు చేశారు. ఈసారి సైబర్ నేరగాళ్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరుతో సృష్టించిన మరో లేఖ పంపారు. అందులోనూ నగదు చెల్లించాలని, రిఫండ్ అవుతుందని ఉంది. నిజమని నమ్మిన బాధితురాలు మరికొంత మొత్తం చెల్లించారు. ఇలా నాలుగు దఫాల్లో మొత్తం రూ.23 లక్షలు బదిలీ చేశారు. కొన్ని రోజుల రిఫండ్ విషయం ఆరా తీస్తూ బాధితురాలు ఫోన్ చేయగా... నగదు రిఫండ్ వస్తుందని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో కుటుంబీకులతో సహా ఎవ్వరికీ చెప్పద్దని చెప్పాడు. ఎవరికి చెప్పినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపెట్టాడు. ఎట్టకేలకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దూషణ నుంచి మనుషుల అక్రమ రవాణా వరకు వినియోగం రీఫండ్ చేస్తామని బాధితురాలి నుంచి రూ.23 లక్షలు స్వాహా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, సీజేఐ పేర్లతో నకిలీ లేఖలు సీసీఎస్లో కేసు నమోదు -
15 రోజులు..4 చోరీలు
లాలాపేట: బీఫార్మసీ పూర్తి చేసినా..జల్సాల కోసం చోరీలకు తెగబడుతున్న కరడుగట్టిన దొంగ శంకర్నాయక్ను మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఓయూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతన్ని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అనంతరం ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి తదితరులు మాట్లాడుతూ శంకర్ నాయక్ దొంగతనాల చిట్టా విప్పారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలపై అందిన పలువురి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా విశ్వసనీయ సమాచారంతో శంకర్ నాయక్తో పాటు మరో దొంగను ఎల్బీనగర్లో అరెస్ట్ చేసి రూ.9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వందకు పైగా దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి..ఈ మధ్యనే బెయిల్పై బయటకు వచ్చిన శంకర్నాయక్..15 రోజుల వ్యవధిలోనే 4 చోరీలకు పాల్పడిన్నట్లు పోలీసులు వివరించారు. ఓయూ పీఎస్తో పాటు పటాన్చెరు, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. శంకర్నాయక్ నుంచి 11 తులాల బంగారు ఆభరణాలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దొంగిలించిన వస్తువుల వివరాలను పేపర్పై రాసి గోడకు అతికించడంతో పాటు..ఏ ఇంట్లో ఎలా..ఏమేం చోరీ చేశాడో కూడా శంకర్ నాయక్ తన డైరీలో రాసుకుంటాడని పోలీసులు వివరించారు. ● కరడుగట్టిన దొంగ శంకర్నాయక్ అరెస్టు ● ఇప్పటికే వందకుపైగా దొంగతనాలు.. పలుమార్లు జైలుకు సైతం.. -
నేడు డయల్ యువర్ డీఎం
షాద్నగర్రూరల్: బస్సు ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు షాద్నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఉష బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9959226287 నంబర్కు ఫోన్ చేసి ప్రజలు, ప్రయాణికులు సమస్యలు, సూచనలు, సలహాలను అందజేయాలని కోరారు. ‘పల్లె’కు నేతల పరామర్శహుడాకాంప్లెక్స్: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ను బుధవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో ప్రమాదవశాత్తు జారి పడడంతో కాలికి తీవ్రగాయమైంది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి రవికుమార్ను ఆయన నివాసంలో పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థినతి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన్ను పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాచం సత్యనారాయణ, కాచం సుష్మ, హైదరాబాద్ జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ సుశీలరెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బొల్ల శివశంకర్ నేత, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్రెడ్డి, జీవీ సాగర్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, నాయకులు ఆడాల రమేష్, కొండల్రెడ్డి, మాధవరం నర్సింహరావు తదితరులు ఉన్నారు. ఇంటి నుంచే సదరం స్లాట్స్ ● దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు ● డీఆర్డీఓ శ్రీలత ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీఆర్డీఓ శ్రీలత అన్నారు. బుధవారం కలెక్టరేట్లో దివ్యాంగులకు యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డు (యూడీఐడీ) జారీపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సదరం సర్టిఫికెట్ల జారీకి గతంలో ఏడు రకాల వికలత్వాలకు మాత్రమే అవకాశం ఉండేదని.. ప్రస్త్తుత ప్రభుత్వం మరో 14 వికలత్వాలను కలిపి మొత్తం 21 రకాలను చేసిందన్నారు. గతంలో సదరం స్లాట్స్ బుకింగ్ మీ సేవలో మాత్రమే వెసులుబాటు ఉండేదన్నారు. యూడీఐడీ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే ఇంటినుంచే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో వనస్థలిపురం ఆస్పత్రి, గాంఽధీ ఆస్పత్రిని యూడీఐడీకి కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా వాసులు ఆయా ఆస్పత్రుల్లో మాత్రమే తమ దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. యూడీఐడీ కార్డులు స్పీడ్ పోస్టులో నేరుగా ఇంటికే వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూయూఓ సంధ్యారాణి, డీపీఎం విజయశ్రీ, ఏపీఎం జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఓయూలో ఉమెన్స్ డే వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బుధవారం జరిగిన మహిళా దినోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో ప్రమోటింగ్ ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొ.కాశీం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క మాట్లాడారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి సెక్రటరీ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్, వీసీ ప్రొ.కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ ప్రొ.సుధాకర్ రెడ్డి, యూజీసీ డీన్ ప్రొ.లావణ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాగా.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్కకు జార్జిరెడ్డి పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు వర్సిటీ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన అమీర్పేట శ్రీశైలం(55) వారం రోజుల కింద తన వ్యవసాయ పొలం నుంచి బైక్పై ఇంటికొస్తున్నాడు. రోడ్డు దాటుతుండగా చౌదర్పల్లి గేట్ కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీశైలంను పోలీసులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. -
చికెన్ సెంటర్లో గంజాయి
2.5 కిలోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మొయినాబాద్: చికెన్ సెంటర్లో గంజాయి విక్రయం కలకలం రేపింది. పోలీసుల తనిఖీలో 2.5 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి తీసుకొచ్చిన వ్యక్తి పరారు కాగా విక్రయించే యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మహబూబ్ అనే యువకుడు అజీజ్నగర్లో ఓ గదిలో అద్దెకు ఉంటూ అదే ప్రాంతంలోని ఏజీఆర్ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. చికెన్ సెంటర్లో పనిచేస్తూనే అదనపు సంపాదన కోసం తాను అద్దెకు ఉండే గదిలో గంజాయి విక్రయిస్తున్నాడు. కాగా బుధవారం నగరంలోని ధూల్పేట్ నుంచి ఓ వ్యక్తి రూ.20 వేలు విలువ చేసే 2.5 కిలోల గంజాయి తీసుకొచ్చి చికెన్ సెంటర్లో మహబూబ్కు విక్రయించాడు. ముందుగానే పసిగట్టిన పోలీసులు చికెన్ సెంటర్ వద్దకు రాగానే గంజాయి తీసుకొచ్చిన వ్యక్తి పారిపోయాడు. పోలీసులు చికెన్ సెంటర్లో తనిఖీ చేయగా 2.5 కిలోల గంజాయి లభించింది. అక్కడే ఉన్న మహబూబ్ను అదుపులోకి తీసుకుని విచారించగా ధూల్పేట్ నుంచి తెచ్చే గంజాయిని తాను గదిలో పెట్టి అవసరమైనవారికి విక్రయిస్తానని అంగీకరించాడు. గంజాయిని స్వాదీనం చేసుకున్న పోలీసులు పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత యాచారం: అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని యాచారం పోలీసులు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కడ్తాల్ మండలం ఎక్వాయ్పల్లి గ్రామానికి చెందిన ఎదుల నర్సింహ మండల పరిధిలోని పలు గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇటుక బట్టీలు, పౌల్ట్రీఫాంల్లో పనిచేసే కార్మికులకు అధిక ధరకు అమ్ముకుంటాడు. అదే మాదిరిగా గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని బుధవారం తెల్లవారుజామున వాహనంలో 30 ప్లాస్టిక్ బ్యాగుల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు. చింతపట్ల గ్రామ సమీపంలో అనుమానాస్పందంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ వాహనాన్ని పోలీసులు నిలిపి చూడగా అందులో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ తోడ్పాటు భేష్సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముకలాంటిదని, సేవాదళ్ సేవలు ప్రశంసనీయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ కార్యనిర్వహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర నాయకులు అయూబ్ఖాన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సేవాదళ్ తెలంగాణలో విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సేవాదళ్ కీలక పాత్ర పోషించిదన్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తిస్తుందన్నారు. సేవాదళ్ కమిటీలను జిల్లాల వారీగా నియమిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల పార్టీ భర్తీ చేస్తున్న పలు పదవులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సేవాదళ్ కర్తవ్యం కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవడమన్నారు. జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు సేవాదళ్ జై బాపు, జై భీం, జై సంవిధానన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ని అవమానిస్తూ చేస్తున్న కుట్రలను సేవాదళ్ కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సిటీకోర్టులు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై నమోదైన పలు కేసుల విచారణ బుధవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది. ఈ కేసుల విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాజాసింగ్తోపాటు పలువురు సాక్షులను రాజాసింగ్ తరుఫు న్యాయవాది కరుణసాగర్ ఆధ్వర్యంలో ఎగ్జామిన్ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. గత ఎన్నికల్లో చేపట్టిన ప్రచార ర్యాలీల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై కేసులు నమోదైన సంగతి విదితమే. -
ఫ్యూచర్ అథారిటీలో చోటు కల్పించాలి
యాచారం: ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మంతన్గౌరెల్లి, మంతన్గౌడ్, సుల్తాన్పూర్ రెవెన్యూ గ్రామాలను కలిపేందుకు కృషి చేయాలని మంతన్గౌరెల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు. బుధవారం మంతన్గౌరెల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొర్ర అరవింద్ నాయక్ ఆధ్వర్యంలో నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. మండల పరిధిలోని 20 రెవెన్యూ గ్రామాలకు గాను 17 రెవెన్యూ గ్రామాలను యూడీఏలోకి తీసుకుని మిగిలిన మూడు రెవెన్యూ గ్రామాలను వదిలేశారని తెలిపారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, మంతన్గౌడ్ రెవెన్యూ గ్రామాలను సైతం యూడీఏలోకి తీసుకునేలా కృషి చేయాలని కోరారు. యూడీఏలోకి తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మంతన్గౌరెల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు దెంది రాంరెడ్డి, కె.శ్రీనివాస్రెడ్డి, నల్లవెల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీపతిగౌడ్, నాయకులు లిక్కి రాజారెడ్డి, కారింగ్ యాదయ్య, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. నేదునూరు గ్రామస్తుల ధర్నా కందుకూరు: ఫ్యూచర్ సిటీ అథారిటీలోకి తమ గ్రామాన్ని సైతం చేర్చాలని నేదునూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు స్వచ్ఛందంగా శ్రీశైలం హైవేపై నేదునూరు గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ అథారిటీలోకి మేజర్ గ్రామ పంచాయతీ నేదునూరును విస్మరించడం బాధాకరమన్నారు. శ్రీశైలం రహదారికి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే తమ గ్రామం ఉందన్నారు. ఆ రహదారికి వంద మీటర్ల దూరం నుంచే తమ రెవెన్యూ పరిధి ప్రారంభమవుతుందన్నారు. తమ గ్రామంపై వివక్ష చూపడం సరికాదన్నారు. అథారిటీలో కలిపే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కె.రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కె.బాలరాజ్, మాజీ ఉప సర్పంచ్లు బి.శ్రీనివాస్, జి.ప్రభాకర్రెడ్డి, యు.సాయిలు, వివిధ పార్టీల నాయకులు ఐ.రాకేష్గౌడ్, ఎస్.అమరేందర్రెడ్డి, ఎ.కుమార్, ఎస్.వెంకటేష్, పి.సురేందర్రెడ్డి, బి.సురేష్, శ్రీనివాస్రెడ్డి, మహిపాల్రెడ్డి, కృష్ణనాయక్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు మూడు రెవెన్యూ గ్రామాల వినతి -
భగీరథ.. నీటివృథా!
చేవెళ్ల: మిషన్ భగీరథ పైప్లైన్కు రంధ్రం పడి తాగునీరు వృథాగాపోవడంతో పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపల్లి సమీపంలో బుధవారం కేబుల్ వైర్ల కోసం జేసీబీతో కాల్వ తీస్తుండగా భగీరథ ప్రధాన పైప్లైన్కు తగిలింది. దీంతో పైల్లైన్ ధ్వంసమై నీళ్లు ఎగిసిపడ్డాయి. రహదారి మొత్తాన్ని ఆక్రమించి వెదజిమ్మిన నీటితో ఈ రూట్లో రాకపోకలు సాగించిన ద్విచక్రవాహనదారులు తడిసి ముద్దయ్యారు. నీటి వృథాతో ఈప్రాంతమంతా బుదరదమయమైంది. కొద్దిసేపటి తర్వాత మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందడంతో సరఫరాను నిలిపేశారు. -
చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలి మృతి
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు... పట్టణంలో నివాసం ఉంటున్న జ్యోతి(40) స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఈ నెల 11న మధ్యాహ్నం పని నిమిత్తం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారిని కాలినడకన దాటే క్రమంలో మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలవ్వడంతో పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందారు. ఈ సంఘటనపై పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయిన వ్యక్తి మాడ్గుల: ఇంట్లో గొడవ పడి ఓ వ్యక్తి ఎటో వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరోజ్నగర్ గ్రామానికి చెందిన బన్నె మల్లయ్య మంగళవారం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు అతని భార్య అనురాధ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హోలీ సందర్భంగా సిటీలో ఆంక్షలు సాక్షి, సిటీబ్యూరో: హోలీ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు విధిస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. బహిరంగ ప్రదేశాలు, రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే రోడ్లపై గుంపులుగా తిరగ వద్దని స్పష్టంచేశారు. వీటిని అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. హెబ్రోను చర్చి ట్రస్టు వ్యవస్థాపకుడు బ్రదర్ ఎఫ్సీఎస్ పీటర్ కన్నుమూత చిక్కడపల్లి: గోల్కొండ క్రాస్రోడ్డులోని హెబ్రోను చర్చి ట్రస్టు వ్యవస్థాపకుడు బ్రదర్ ఎఫ్సీఎస్ పీటర్(82) బుధవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముషీరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. గాంధీనగర్లో నివసించే పీటర్కు భార్య రాజేశ్వరి, కుమారుడు ఇమ్మాన్యుయెల్, కుమార్తె ఎస్తేరు ఉన్నారు. -
గురుకులం..
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025ఏకీకృత గురుకులాలకు నిధుల మంజూరు నవ్యాక్షర పథం8లోu● ఒక్కోటి 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం ● అక్కడే వసతి గృహాల సముదాయాలు ● జిల్లాలో షాద్నగర్, చేవెళ్ల, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఏర్పాటుషాద్నగర్: కులం లేదు.. మతం లేదు.. బీద, ధనిక భేదం లేదు.. చదువులమ్మ చెట్టు నీడలో అందరూ ఒకేచోట అక్షరాలు దిద్దొచ్చు.. సర్కారు అందించే సాయంతో బంగారు భవితకు బాటలు వేసుకోవచ్చు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమీకృత ఏకీకృత పాఠశాలలతో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో అక్షర కేంద్రాలకు శ్రీకారం చుడుతోంది. జిల్లాలో షాద్నగర్, చేవెళ్ల, కల్వకుర్తి, ఇబ్రహీపట్నం నియోజకవర్గాలకు మంజూరు చేసింది. ఆరంభం ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా.. నిరుపేదలకు అక్షరాన్ని అందుబాటులోకి తేచ్చేలా ప్రభుత్వం ఏకీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి అంకురార్పణ చేస్తోంది. షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గులో గత ఏడాది అక్టోబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఈ పాఠశాలలను అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని, గ్రామీణ నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేలా ఈ బడులను తీర్చిదిద్దుతామని సీఎం బహిరంగ సభలో ప్రకటించారు. ఇదీ ప్రయోజనం.. ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చదువుతో పాటు ఆసక్తి కలిగిన రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా కులాలు, మతాల వారీగా పాఠశాలలు, వసతి గృహాలు ఉన్న నేపథ్యంలో అందరినీ ఒకే గొడుగు కిందకు తేనున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఈ గురుకులాల్లో కంప్యూటర్లు, ల్యాబ్లు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల ఆసక్తి మేరకు ఆయా రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులను అందుబాటులో ఉంచనున్నారు. ఇంటిగ్రేటెడ్లో ఇవీ ప్రత్యేకతలు.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రతి నియోజకవర్గంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలను సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. విద్యార్థులకు తరగతి గదులే కాకుండా అంతర్జాతీయ స్కూళ్లతో సమానంగా క్యాంపస్లను అధునాతనంగా నిర్మించనున్నారు. విద్యార్థులకు ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధించనున్నారు. అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందించనున్నారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు ఐదు వందల మంది ఉపాధ్యాయులు బోధన చేయనున్నారు. పాఠశాల భవనాన్ని అంతర్జాతీయ పాఠశాలలతో సమానంగా నిర్మించనున్నారు. సౌర, వాయు విద్యుత్ను వినియోగించేలా, వాన నీటిని సంరక్షించేలా డిజైన్ చేశారు. విద్యార్థులకు క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులు, ఔట్ డోర్ జిమ్ను ఏర్పాటు చేస్తున్నారు.న్యూస్రీల్హర్షనీయం ఏకీకృత గురుకుల పాఠశాలను మంజూరు చేయడం హర్షనీయం. ఉన్నత విద్య కోసం పిల్లలను దూర ప్రాంతాలకు పంపించాల్సిన అవసరం తగ్గుతుంది. అత్యాధునిక వసతులతో నిర్మించే గురుకులాలు పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. – సుజాత, విశ్వనాథ్పూర్, కొందుర్గు మండలం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రపంచంతో పోటీ పడే విధంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం కోసం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దనుంది. – వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్నగర్ -
ఉపాధి పనుల్లో వేగం పెంచండి
యాచారం: ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పర్యటనలో భాగంగా ఎంపీడీఓ నరేందర్రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీలత, ఈజీఎస్ ఏపీఓ లింగయ్యతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జాబ్ కార్డు ఉన్న ప్రతీ కూలీ ఉపాధి పనులకు హాజరయ్యేలా చూడాల ని సూచించారు. వేసవి నేపథ్యంలో కూలీలు పని చేసే చోట అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరం, జెడ్పీ అతిథి గృహాన్ని పరిశీలించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మార్చి 25 వరకు 24 పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు కు కృషి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయమే పనులు చేసుకోవాలి కందుకూరు: ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి కూలీలకు సూచించారు. బుధవారం కందుకూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీర్ఖాన్పేట పరిధిలో కొనసాగుతున్న ఉపాధి పనులను పర్యవేక్షించి కూలీలతో మాట్లాడారు. ఉదయమే త్వరగా వచ్చి పనులు చేసుకోవాలని కోరారు. కొలతల ప్రకారం పనులు చేసి రూ.300 చొప్పున కూలీ పొందాలన్నారు. పని ప్రదేశంలో తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమీపంలో కొనసాగుతున్న నర్సరీని పరిశీలించారు. అంకురోత్పత్తి రాని బ్యాగుల్లో మళ్లీ విత్తనాలు లేదంటే నారు నాటాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ సరిత, పంచాయతీ కార్యదర్శి రాజేశ్, ఏపీఓ రవీందర్రెడ్డి, టీఏలు గోపాల్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలి జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి -
బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యమివ్వాలి
చేవెళ్ల: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.మహిపాల్ డిమాండ్ చేశారు. బుధవారం చేవెళ్లలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మరిచిపోయిందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90 శాతం మంది విద్యార్థులు పేద, మధ్య తరగతికి చెందినవారే ఉన్నారన్నారు. వారికి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అధిక ఫీజుల వసూళ్ల నియంత్రణపై చర్యలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో దాదాపు 83 మంది విద్యార్థులు మృతి చెందారని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవటం బాధాకరమన్నారు. గురుకులాలలో ప్రవేశపెట్టిన కామన్ మెనూ అటకెక్కిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు ప్రేమ్, శివ, సంధ్య, పూజిత తదితరులు ఉన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహిపాల్ -
పరీక్షల కోసం ప్రైవేటుకు..
కాంట్రాక్టు, ఔట్సోర్సింగే దిక్కు ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం మండలం, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలో బస్తీ దవాఖాన, పల్లె దవాఖానాల్లో పర్మినెంట్ ఉద్యోగులు లేరు. వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో, సపోర్టింగ్ స్టాఫ్, ఏన్ఎన్ఎం, జీఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్లను ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వైద్యులు రాని చోట ఏకంగా స్టాఫ్ నర్సులే దిక్కవుతున్నారు. రక్తం, మూత్ర పరీక్షల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వైద్యం సరిగా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బడంగ్పేట్లో ఓపీ సేవల్లో వైద్యుడు శేరిగూడ బస్తీ దవాఖానాలో సపోర్టింగ్ స్టాఫ్ సెలవుపై వెళ్లడంతో స్వయంగా మందులు ఇస్తున్న డాక్టర్ -
సొంతూరికి వెళ్లొచ్చే సరికే..
అబ్దుల్లాపూర్మెట్: ఇంటి తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, నగదును అపహరించుకుపోయిన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని కవాడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉదయ్ గార్డెన్ కాలనీలో నీరుడు సతీష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నాడు. ఆయన సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరులో జరిగే జాతరకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోపలి ప్రవేశించినట్లు గుర్తించాడు. బీరువాలో ఉన్న 4 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులు, నగదు దొంగిలించినట్లు నిర్ధారించుకున్నాడు. దాదాపు రూ.6.5 లక్షల విలువగల సొత్తును తస్కరించారని సతీష్ విలపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి తాళాలు పగులుగొట్టి బంగారం, వెండి ఆభరణాల చోరీ -
వైద్యుల కోసం నిరీక్షణ
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 202510లోuకందుకూరు: కందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంలేదు. ఉదయం 10 గంటలకు ఆయూష్కు చెందిన అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నాడు. బయట కొందరు రోగులు నిరీక్షిస్తున్నారు. వైద్యులు కానీ నర్సులు కానీ ఇతర ఉద్యోగులు కానీ ఎవరూ అందుబాటులో లేరు. పది గంటల తర్వాత ఒక్కొక్కరుగా వచ్చారు. ఉదయం 8.20 గంటల నుంచి.. మా కుమారుడిని కుక్క కరిచింది. కడ్తాల్ నుంచి కందుకూరుకు ఉదయం 8.20 గంటలకు వచ్చాము. 10 గంటలకు కూడా చికిత్స చేయడానికి ఎవరూ లేరు. డాక్టర్ల కోసం ఎదురుచూస్తున్నాం. కందుకూరు పీహెచ్సీ ఎదుట వైద్యుల కోసం నిరీక్షిస్తున్న రోగులు, వారి కుటుంబీకులున్యూస్రీల్– రూప్సింగ్, కడ్తాల్ -
ఫార్మాసిటీనా.. ఫ్యూచర్ సిటీనా?
యాచారం: ఫార్మాసిటీనా.. ఫ్యూచర్ సిటీనా.. సర్కార్కు దేనిపైనా స్పష్టత లేదని, ఫార్మాసిటీని రద్దు చేసినట్లయితే సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ భూ బాధితుల సమస్యలపై మంగళవారం కుర్మిద్ద గ్రామంలో నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీ ఏర్పాటు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసిందన్నారు. రైతుల అంగీకారం లేకుండానే నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 800 మందికి చెందిన 2,200 ఎకరాల పట్టా భూములను ఫార్మా కోసం తీసుకుంటున్నట్లు ప్రకటించి, రాత్రికి రాత్రే ధరణి పోర్టల్లో టీఎస్ఐఐసీ అని మార్చారని గుర్తుచేశారు. ఈ విషయమై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ధరణి పోర్టల్లో టీఎస్ఐఐసీ పేరు తీసేసి రైతుల పేర్లు నమోదు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు యంత్రాంగం స్పందించడం లేదని మండిపడ్డారు. ఫార్మా భూ బాధితుల విషయాన్ని అసెంబ్లీలో చర్చించి, న్యాయంచేయాలని సీఎం రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు. ఇందుకోసం వారం రోజులు గడువు ఇస్తున్నామని, లేదంటే ఈనెల 20న ఫార్మా గ్రామాల నుంచి పాదయాత్ర ప్రారంభించి, 21న కలెక్టరేట్ను ముట్టడిస్తామని ప్రకటించారు. తర్వాత ఏం జరిగినా సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫార్మాసిటీకి భూములు తీసుకున్నందుకు గాను ఎకరాకు 121 గజాల ప్లాటు బదులు ఎకరాకు 500 గజాల ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను సేకరించాలని చూస్తున్న సర్కార్.. వీటిని కోట్లాది రూపాయలకు బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవడం ఖాయమన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా రైతులకేమీ ఉపయోగం ఉండదని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు రాంచందర్, పి.అంజయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్రెడ్డి, న్యాయవాది అరుణకుమార్, నాయకులు పెద్దయ్య, జగన్, బ్రహ్మయ్య, తావునాయక్, విప్లవ్కుమార్, ఆలంపల్లి జంగయ్య తదితరులు పాల్గొన్నారు. తుక్కుగూడ: దేశంలో ఆర్థిక లేని వ్యవస్థ కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆపార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం తుక్కుగూడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సెమినార్ నిర్వహించారు. అంతకు ముందు కార్మికులు, కర్షకులతో కలిసి ఔటర్ రింగు రోడ్డు హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుపేదల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందన్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ శక్తుల ఆదాయం వంద రెట్లు పెరిగిందని ఆరోపించారు. దేశంలో జీఎస్టీ వసూలు పేరుతో పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజ సంపదను పూర్తిగా బడా కంపెనీలకు దోచి పెడుతున్నారన్నారు. మతతత్వ బీజేపీపై పోరాడేందుకే తాము కాంగ్రెస్ పార్టీతో జత కట్టామని స్పష్టంచేశారు. దేశంలోని నిరుపేదలు, కార్మికులు, కర్షకుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని వెల్లడించారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులపై దాడులు, హత్యలు జరుగుతునయన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకులు జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, నాయకులు పుస్తకాల నర్సింగ్రావు, పానుగంటి పర్వతాలు, యాదిరెడ్డి, దత్తునాయక్, నర్సింహ్మ, యాదయ్య, పార్టీ శ్రేణులు, కార్మికులు, పాల్గొన్నారు. అసమానతలు లేని ఆర్థిక వ్యవస్థ కావాలిసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఏది ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
సిబ్బంది కొరతతో ఇబ్బంది
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి ప్రాథథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ సెలవుపై వెళ్లగా ఇన్చార్జి డాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్పత్రిలో సీహెచ్ఓతో పాటు ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒంటి నొప్పులు, బలహీనత, సాధారణ జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. తీవ్ర జ్వరంతో బాధపడే రోగులకు రక్త పరీక్షల కోసం రక్తాన్ని సేకరించి టీహబ్కు పంపిస్తున్నారు. రిపోర్టుల కోసం మరుసటి రోజు వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కరే వైద్యులు ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. -
బేజారు
సేవలు అంతంతే.. ● సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది ● అరకొర మందుల పంపిణీ ● పరీక్షలకు విషమ ‘పరీక్షే’.. ● గంటల తరబడి రోగుల నిరీక్షణసర్కారు దవాఖానాల్లో రోగులకు పాట్లు తప్పడం లేదు.. మంగళవారం ఉదయం జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో ‘సాక్షి’ విజిట్ చేసింది.. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకే వైద్యులతోపాటు సిబ్బంది రావాల్సి ఉండగా తీరిగ్గా 10 గంటల తరువాతే వస్తున్నారు.. వైద్యుల కోసం బాధితులు గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది.. మరికొన్ని చోట్ల సిబ్బంది కొరత వేధిస్తోంది.. ఇక మందుల కొరత.. టెస్టులు సరేసరి.. 10.30 గంటల తర్వాతయాచారం: మండల కేంద్రంలోని సీహెచ్సీ కేంద్రానికి ఉదయం 10.30 గంటల తర్వాత ముగ్గురు వైద్యులు వచ్చారు. అప్పటికే రోగులు వచ్చి వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం వరకు 140 మంది వరకు కాళ్లు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించి కావాల్సిన మందులు ఇచ్చి పంపించారు. వైద్య పరీక్షలకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యురాలు రాజ్యలక్ష్మి తెలిపారు. -
మైసమ్మ సన్నిధిలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు కడ్తాల్ మండల కేంద్రంలో హుస్సేన్నాయక్కు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు దోనాదుల మహేశ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో లయన్స్క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాగి అంబలి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాన్నాయక్, జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు సాయిలాల్నాయక్, జిల్లా నాయకులు రాందాస్నాయక్, భగీరథ్, శ్రీశైలంగౌడ్, కుమార్, మునేశ్, రెడ్యానాయక్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి ఆమనగల్లు: పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ సూచించారు. పోలీసు స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మసలుకోవాలని అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని పోలీసుస్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను, పోలీసుస్టేషన్లో కేసుల రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ ప్రమోద్కుమార్, ఎస్ఐలు వెంకటేశ్, సీతారాంరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాటసింగారంలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయండి అబ్దుల్లాపూర్ మెట్: మామిడి సీజన్ దృష్ట్యా బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు మంగళవారం రాచకొండ సీపీ జి. సుధీర్బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడి సీజన్ కావడంతో దిగుమతులు భారీగా ఉంటాయని, క్రయ విక్రయాలు, నగదు లావాదేవీలు అధికంగా జరుగుతాయని తెలిపారు. మార్కెట్లో చోరీలు జరిగే ఆస్కారం ఉందన్నారు. అంతే కాకుండా కొంత మంది బ్రోకర్లతో కుమ్మకై మార్కెట్ బయట వ్యాపారం చేస్తూ పండ్లు అక్రమంగా అమ్ముతున్నారని, మార్కెట్ ఆదాయానికి గండి పడుతోందని అన్నారు. ఇలాంటి వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరచారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు వన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేశ్ నాయక్, రఘుపతిరెడ్డి, దోమలపల్లి, అంజయ్య, వెంకటేశ్వర్లు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సింబయాసిస్లో విద్యార్థి మృతి
నందిగామ: అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని మోదళ్ల గూడ శివారు సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ గోపాల కృష్ణ కథనం ప్రకారం వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్, సంఘంనగర్కు చెందిన శాగనిక్బాసు (21) యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ బీఏ ఎల్ఎల్బీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో తన గదిలోని బాత్రూంలోకి వెళ్లి, చాలా సేపైనా బయటకు రాలేదు. దీంతో స్నేహితులు రోహిత్, హర్షిత్ పాండేలు బాత్రూం వెంటిలేటర్ నుంచి చూడగా అపస్మారక స్థితిలో కిందపడిపోయి ఉన్నాడు. దీంతో తలుపును బద్ధలు కొట్టి అతన్ని క్యాంపస్లో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాసు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి పార్థబాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్థానికుల ఆందోళన.. విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థాని కులు మంగళవారం వర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో మత్తు పదార్థాలు తీసుకుని బయటకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయన్నారు. ఈ విష యమై వర్సిటీ డైరెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడని ప్రాథమిక సమాచారం అందిందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి విషయాలు తెలుస్తాయని చెప్పారు. యూనివర్సిటీ ఎదుట స్థానికుల ఆందోళన యాజమాన్యం విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆరోపణ -
గ్రూప్ ఫలితాల విడుదల సరికాదు
షాద్నగర్: ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు గ్రూప్ పరీక్షల ఫలితాలను నిలుపుదల చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టారు. రెండో రోజు మంగళవారం దీక్షా శిబిరానికి విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండానే ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సరికాదన్నారు. లోపాలను సవరించకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం తగదన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, నాగభూషణ్, సురేష్, పాండు, మహేందర్, సుదర్శన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ -
మూసీ!
మల్లన్న సాగర్ టు సాక్షి, సిటీబ్యూరో: మూసీ పునరుజ్జీవానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కంపుకొట్టే మూసీ నదిని సుందరీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కార్యాచరణ వేగవంతం చేశారు. మూసీ ఆక్రమణలతో పాటు నది శుద్ధి కోసం కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్కు 20 టీఎంసీల నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 5 టీఎంసీల నీటిని మూసీ నది శుద్ధి కోసం..15 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని సీఎం నిర్ణయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి ప్రత్యేక పైప్లైన్ల ద్వా రా నీటిని మళ్లించేలా పనులు చేపట్టనున్నారు. గోదావరి నుంచి 5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవం కోసం హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు మళ్లించి, శుద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గోదావరి–మూసీ అనుంధానం కోసం కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రూ.14,100 కోట్ల ఆర్థిక సాయం.. ఒకప్పుడు భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలను తీర్చిన మూసీ నది..కాలక్రమంలో గృహ, పారిశ్రామిక వ్యర్థాల పారబోతతో కలుషితమైపోయింది. మూసీ పునరుజ్జీవం చేపట్టాలంటే ముందుగా నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించడంతో పాటు నదిలో పారబోస్తున్న కలుషితాలను అడ్డుకోవడం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే తొలగించాల్సిన ఆక్రమణలను మూసీ రిఫర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) అధికారులు గుర్తించారు. త్వరలోనే వాటిని తొలగించి, బాధితులకు పునరావాసం కల్పించనున్నారు. ఈమేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం రూ.14,100 కోట్ల ఆర్ధిక సాయాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. గోదావరి నుంచి 20 టీఎంసీల నీళ్లు తరలింపు ఇందులో 5 టీఎంసీల నీటితో మూసీ శుద్ధి నదిపై 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం గాంధీ సరోవర్ లాగే బాపూఘాట్ అభివృద్ధి కేంద్రాన్ని రూ.14,100 కోట్ల ఆర్థిక సాయాన్ని కోరిన సర్కారు గాంధీ సరోవర్ లాగా.. కేదర్నాథ్లోని గాంధీ సరోవర్ లాగా బాపూఘాట్ను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కి.మీ., అలాగే హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 8.5 కి.మీ. మూసీ నదీ సుందరీకరణకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆయా మార్గంలో రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు. అలాగే మూసీ నదిపై 11 చోట్ల హెరిటేజ్ బ్రిడ్జ్లను నిర్మించనున్నారు. రూ.1,000 కోట్ల నిర్మాణ వ్యయాన్ని అంచనా వేశారు. ఇప్పటికే బాపూ ఘాట్ వద్ద మూసీ పునరుజ్జీవం పనులకు డీపీఆర్ రూపొందగా.. ఆమోదం కోసం కేంద్రానికి రాష్ట్ర పభుత్వం పంపించింది. ఈ ఏడాది బాపూఘాట్ వద్ద 90 శాతం పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
గ్రూప్ ఫలితాల విడుదల సరికాదు
షాద్నగర్: ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు గ్రూప్ పరీక్షల ఫలితాలను నిలుపుదల చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టారు. రెండో రోజు మంగళవారం దీక్షా శిబిరానికి విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండానే ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సరికాదన్నారు. లోపాలను సవరించకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం తగదన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, నాగభూషణ్, సురేష్, పాండు, మహేందర్, సుదర్శన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ -
గుడిలో చోరీ..12 గంటల్లో దొంగల పట్టివేత
జీడిమెట్ల: గుడిలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను జీడిమెట్ల పోలీసులు 12 గంటల వ్యవధిలో పట్టుకుని రిమాండ్కు తరలించారు. మంగళవారం జీడిమెట్ల పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ కె.సురేష్కుమార్, ఏసీపీ హన్మంత్రావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్, డీఐ కనకయ్యలతో కలిసి వివరాలను వెల్లడించారు. లంగర్హౌజ్, టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఇద్దరు దొంగలు సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గాంధీనగర్లోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించి..గర్భగుడి తలుపులు తెరిచి పంచలోహ విగ్రహాలు, ఇతర పూజా వస్తువులు ఎత్తుకెళ్లారు. ఉదయం గుడికి వెళ్లిన ఆలయ అధ్యక్షుడు కోనేటి వీరవెంకట సత్యనారాయణ దొంగతనం విషయాన్ని తెలుసుకుని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడిన దృశ్యాలను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ సురేష్కుమార్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా విడిపోయి...సీసీ కెమరాల పరిశీలనతో పాటు టెక్నికల్గా విచారణ జరిపి సాయంత్రం 7 గంటల వరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించి ఇద్దరిని రిమాండుకు తరలించారు. వారి నుండి రూ.95 వేలు విలువచేసే పంచలోహ విగ్రహాలు, వస్తువులు, రాగి సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా గుడిలో చోరీ విషయం తెలిసి స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారికి నచ్చచెప్పి శాంతింపజేశారు. కాగా మంగళవారం ఉదయం గాంధీనగర్లో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. హిందూవాహిని ఆధ్వర్యంలో ప్రజలు పెద్దఎత్తున గాంధీనగర్ చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు వెంట వెంటనే అందోళన చేపట్టిన వారిని జీడిమెట్ల స్టేషన్కు తరలించి కొంతమందిని ఇళ్లవద్దనే హౌజ్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఉరుకులు పరుగులు పెట్టడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. -
ఆ లింక్లు ఓపెన్ చేయొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆఫర్ల పేరుతో ఆన్లైన్లో వచ్చే తెలియని లింక్లని ఓపెన్ చేసి మోసపోవద్దని భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్ సూచించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని తులేకలాన్ గ్రామంలో డిజిటల్ లావాదేవిలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజర్వు బ్యాంకు అధికారులు హాజరై మాట్లాడుతూ.. అపరిచిత లింక్లు కలిగి ఉన్న ఎస్ఎంఎస్, ఈమెయిల్ని వెంటనే డిలిట్ చేయాలన్నారు. ఆర్థిక వివరాల ధ్రువీకరణ కోరే వెబ్సైట్ను నిర్ధారించుకోవాలన్నారు. వ్యక్తిగత వివరాలని లేదా బ్యాంకు సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు. తెలియని లింక్లను క్లిక్ చేయడంతో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందన్నారు. డబ్బులు అడిగే అపరిచత వ్యక్తుల కాల్స్, ఈమెయిల్స్లకి సమాధానం ఇవ్వొద్దన్నారు. పెద్ద మొత్తంలో రాబడుల ఆశ చూపేవారి వెబ్సైట్స్ యాప్ల వివరాలని తనిఖీ చేసుకోవాలన్నారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి చెల్లింపులు చేసే సమయంలో స్క్రీన్పై పేరు సరి చూసుకోలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్(ఆపరేషన్స్) మురళికృష్ణ, అధికారులు సుధాకర్, బాలవెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వు బ్యాంకు అధికారులు సావిత్రి, రెహమాన్ తులేకలాన్లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన సదస్సు -
గ్రూప్స్లో సత్తాచాటిన వినయ్, చంద్రకాంత్
చేవెళ్ల: స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న వినయ్కుమార్ గ్రూప్– 1లో 483వ ర్యాంకు, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చంద్రకాంత్ గ్రూప్– 2లో 27వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రకళ, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు వారిని శాలువాలతో సన్మానించారు. చంద్రకాంత్ తీన్మార్.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన ప్రస్తుత సమయంలో చంద్రకాంత్ వరుసగా మూడోసారి సర్కారు కొలువును చేజిక్కించుకున్నాడు. శంకర్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఒగ్గు విఠలయ్య, వినోద దంపతుల రెండు కుమారుడైన ఈయన పీజీ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు, గ్రూప్– 4లో 27వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా గ్రూప్– 2 ఫలితాల్లోనూ 27వ ర్యాంకుతో ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పట్టుదలతో బాగా చదివానని చంద్రకాంత్ తెలిపారు. -
బిల్డర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డ మహిళల అరెస్టు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–22లో నివసించే ప్రముఖ బిల్డర్, జీవీబీఆర్ నిర్మాణ రంగ సంస్థ ఎండీ జీవీ శేఖర్రెడ్డి ఇంట్లో భారీగా నగలు, నగదు చోరీ చేసిన ఘటనలో ఐదుగురు మహిళలను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శేఖర్రెడ్డి ఇంట్లో గత రెండు సంవత్సరాల నుంచి హసీనా, వహీదా, అనూష అనే ముగ్గురు యువతులు పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం యజమాని బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ నుంచి రూ.7.50 లక్షల నగదు, రూ.28.50 లక్షల విలువ చేసే నగలు చోరీ చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి అనుమానితులు హసీనా, వహీదా, అనూషలను విచారించారు. వహీదా తాను చోరీ చేసిన ఆభరణాలను తన తల్లి సలీమాకు పంపించింది. అలాగే అనూష రూ.3 లక్షల నగదు తన తల్లి ఆదిలక్ష్మికి పంపించింది. డబ్బుపై ఆశతో హసీనా తనతో పాటు పనిచేస్తున్న వహీదా, అనూషలను రెచ్చగొట్టి ఈ దొంగతనానికి ఉసిగొల్పింది. ముగ్గురూ కలిసి యజమాని కళ్లుగప్పి చేతివాటం ప్రదర్శించారు. నగలు అమ్ముకుని, తలాకొంత పంచుకుని ఏదైనా వ్యాపారం చేస్తే మరింత మెరుగైన జీవితం గడపవచ్చని హసీనా ఈ ఇద్దరికి నూరిపోసింది. డబ్బులతో తమ బతుకులు మార్చుకుందామని, మరింత బాగా బతకవచ్చని భావించిన వహీదా, అనూషలు కూడా ఈ దొంగతనంలో పాలుపంచుకున్నారు. ఈ ఘటనలో హసీనా, వహీదా, అనూషలతో పాటు సలీమా, ఆదిలక్ష్మిలను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి మొత్తం నగలు, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాత్రికేయులు క్రమశిక్షణతో మెలగాలి
శంకర్పల్లి: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు సైతం క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఐజేయూ ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్లో టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. ఈ జర్నలిస్ట్ యూనియన్ 1957లో ప్రారంభించారని, ప్రస్తుతం ఎన్ని కొత్త యూనియన్లు వచ్చినా.. పద్ధతి ప్రకారం నడిచేది టీయూడబ్ల్యూజే మాత్రమేనని స్పష్టం చేశారు. నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కల్గిస్తోందని, యూనియన్ల ప్రతిష్టను దిగజార్చుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు హామీలు ఇవ్వడం తప్ప.. అమలు చేసింది లేదన్నారు. బీఆర్ఎస్ నేత కార్తీక్రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులతో తనకు అనుబంధముందని, ఇదే ధోరణిని మున్ముందు కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం వివిధ ప్రతికల్లో 25 ఏళ్లకు పైగా సేవలందించిన పాత్రికేయులందరికీ టీయూడబ్ల్యూజే తరఫున సన్మానించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, నాయకులు సలీం పాషా తదితరులు పాల్గొన్నారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా సలీం పాషా టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా శంకర్పల్లి పట్టణానికి చెందిన ఎండీ.సలీం పాషా, ప్రధాన కార్యదర్శిగా మేకల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ద్వితీయ మహాసభల్లో ప్రకటించారు. జర్నలిస్టు నాయకులు సలీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది వరకు అధ్యక్షుడిగా పని చేసిన శ్రీకాంత్రెడ్డిని ఘనంగా సన్మానించారు. -
సొంతూరికి వెళ్లొచ్చే సరికే..
అబ్దుల్లాపూర్మెట్: ఇంటి తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, నగదును అపహరించుకుపోయిన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని కవాడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉదయ్ గార్డెన్ కాలనీలో నీరుడు సతీష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నాడు. ఆయన సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరులో జరిగే జాతరకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోపలి ప్రవేశించినట్లు గుర్తించాడు. బీరువాలో ఉన్న 4 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులు, నగదు దొంగిలించినట్లు నిర్ధారించుకున్నాడు. దాదాపు రూ.6.5 లక్షల విలువగల సొత్తును తస్కరించారని సతీష్ విలపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి తాళాలు పగులుగొట్టి బంగారం, వెండి ఆభరణాల చోరీ -
విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
● కాంగ్రెస్ ఆదివాసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్ షాద్నగర్: విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. షాద్నగర్ పరిఽధిలోని కొందుర్గులో నిర్మించే సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేసినా సీఎం రేవంత్రెడ్డి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ఖాన్, నాయకులు ఇబ్రహీం,బస్వం, వెంకట్రెడ్డి,హైదర్గోరి,నర్సింలుతదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలి
షాద్నగర్: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యేంత వరకు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఈ పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. వర్గీకరణకు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి మాజీ జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీగా వర్గీకరించడం జరిగిందని అన్నారు. ఇందులో కొన్ని లోపాలున్నాయని, సవరించాలని కోరగా మార్చి 10 వరకు గడువు ఇచ్చినట్టు చెప్పారు. లోపాల సవరణ పూర్తి కాకుండానే ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసిందని పేర్కొన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు భూషణ్, బొబ్బిలి పాండు, చెన్నగళ్ల శ్రావణ్, శ్రీనివాస్, జాంగారి జంగయ్య, సురేష్, శ్రీను, దశరథ్, ప్రేమ్కుమార్, కర్రోళ్ల శివకుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల పెంపకంలో వివక్ష వద్దు
ఉస్మానియా యూనివర్సిటీ: ఆడ, మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం జన విజ్ఞాన వేదిక, ఆంధ్రమహిళ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలబాలికలకు చిన్న వయస్సు నుంచే సమాన అవకాశాలు కల్పిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం నేను ఆడపిల్లను –అందుకే తప్పక చదవాలి అనే శీర్షికతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందిచిన పోస్టర్ను సీతక్క ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డా.కరుణాదేవి, జనవిజ్ఞాన వేదిక నాయకులు రాజా, బీఎన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.వసుంధర రచయిత్రి జూపాక సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు మంజూరుకు నిధులు కేటాయించండి
కేశంపేట: మహేశ్వరం మండల పరిధిలోని పెద్ద గోల్కండ (ఓఆర్ఆర్ ఎగ్జిట్) నుంచి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ వరకు డబుల్ బీటీ రోడ్డు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్దగోల్కొండ నుంచి కల్వకోలు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయిందని, దానికి అనుసంధానంగా కల్వకోలు నుంచి మిడ్జిల్ వరకు డబుల్ బీటీ రోడ్డును నిర్మించాలని కోరారు. ఈ రోడ్డు నిర్మాణంపూర్తయితే శ్రీశైలం, బెంగుళూరు హైవేలకు సమాంతరంగా ప్రత్యామ్నాయ రోడ్డు అవుతుందన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 130 కిలో మీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుందని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. రంగారెడ్డి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు నర్సింహారెడ్డి తెలిపారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడుబొక్క నర్సింహారెడ్డి -
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి సంగీత మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం తగదని అన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వారం 62 అర్జీలు అందాయని చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 29, ఇతర శాఖలకు సంబంధించి 33 ఉన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై రాయితీని సద్వినియోగం చేసుకోండి హుడాకాంప్లెక్స్: ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. సరూర్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ ప్లాట్ రిజిస్ట్రేషన్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎల్ఆర్ఎస్ ఫీజును చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకుంటే భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు సులభంగా వస్తాయని తెలిపారు. దళారులను ఆశ్రయించాల్సిన అవవసరం ఉండదన్నారు. డబ్బికార్ శ్రీనివాస్కు అవార్డు ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించడమేగాక ఆధ్యాత్మికత, సామాజిక సేవ, విద్యా, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన ఆరెకటిక సంఘం జాతీయ నాయకుడు డబ్బికార్ శ్రీనివాస్ చేస్తున్న కృషిని గుర్తించి విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు నంది అవార్డును ప్రదానం చేశారు. నగరంలోని రవీంద్ర భారతిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా నంది అవార్డును డబ్బికార్ శ్రీనివాస్ అందుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని శ్రీనివాస్ తెలిపారు. శిక్షలో శిక్షణలు.. ఉపాధికి బాటలు చంచల్గూడ: జైలు శిక్షలో భాగంగా వివిధ అంశాల్లో పొందిన శిక్షణ ఉపాధికి బాటలు వేస్తుందని ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ అన్నారు. చంచల్గూడ మహిళా జైలులో ఖైదీలకు స్వయం ఉపాధి పథకం కింద ప్రవేశపెట్టిన టైలరింగ్ కోర్సును సోమ వారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కోర్సు వృత్తి నైపుణ్యం, ఆర్థిక స్వాతంత్య్రం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. జైళ్లను పునరావాస ప్రదేశాలుగా మారుస్తున్నాయన్నారు. సంకల్ప పథకం కింద నాక్ సంస్థల సహకారంతో ఈ కోర్సును అందిస్తున్నట్లు తెలిపారు. -
మందుబాబులు... మహా ముదుర్లు!
డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు తప్పించుకునే ప్రయత్నాలు● పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు ● ప్రత్యేకంగా కొన్ని వాట్సాప్ గ్రూపులు సైతం ఏర్పాటు ● ప్రాంతాల వారీగా తనిఖీ చేస్తున్న ఏరియాలు గుర్తింపు ● వాటిని లోకేషన్స్తో సహా గ్రూపుల్లో పోస్టు చేస్తున్న వైనంసాక్షి, సిటీబ్యూరో: ‘శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు‘ అన్న నానుడిని నగరంలోని మందుబాబులు బాగా ఒంట పట్టించుకున్నట్లున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ చెప్పడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. వీరికి చిక్కకుండా తప్పించుకోవడానికి ‘నిషా’చరులు అనేక మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవడం ఇటీవల పెరిగిందని పోలీసులు గుర్తించారు. దీనికి చెక్ చెప్పడానికి అవసరమైన మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. 13 ఏళ్ల నుంచి కఠినంగా.. రోడ్డు ప్రమాదాలను సీరియస్గా తీసుకున్న ఐక్యరాజ్య సమితిలోని అంతర్భాగమైన డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ రోడ్ సేఫ్టీ పార్ట్నర్ షిప్ (జీఆర్ఎస్పీ) పేరిట అధ్యయనం చేపట్టింది. బ్లూమ్ బర్గ్ యూనివర్సిటీ, జాన్ హాకింగ్ వర్సిటీలతో కలిసి అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 10 దేశాలను గుర్తిచడంతో పాటు వాటి నివారణకు ఆర్ఎస్–10 పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. ఆయా దేశాల్లో కొన్ని నగరాలను ఎంపిక చేసుకుని ప్రమాదాల నివారణకు అసరమైన ఉపకరణాలు అందించడంతో పాటు సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలు ఇచ్చింది. భారత్ నుంచి హైదరాబాద్తో పాటు జలంధర్ ఎంపికయ్యాయి. దీంతో 2011 నవంబర్లో సిటీ పోలీసులకు బ్రీత్ అనలైజర్లు 10, డిజిటల్ కెమెరాలు 220, బారికేడ్లు 250, రిఫ్లెక్టివ్ జాకెట్లు 550, ఎల్ఈడీ బేటన్స్ 450 అందాయి. అప్పటి నుంచి డ్రంక్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్స్ మొదలు కావడంతో పాటు ‘నిషా’చరుల్ని కోర్టుకు తరలించడం సాధ్యమైంది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు పడటం మొదలైంది. ‘బ్యాక్’తో మొదలై వాట్సాప్ వరకు.. ఈ స్పెషల్ డ్రైవ్స్లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు‘నిషా’చరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తొలినాళ్లల్లో ఈ మందుబాబులు రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు ముందు తనిఖీలను గుర్తిస్తే వెంటనే తమ వాహనాన్ని వెనక్కు తిప్పుకుని రాంగ్ రూట్లో, లేదా పక్కన ఉన్న సందుల్లోకి జారుకునేవారు. దీనికి చెక్ చెప్పేందుకు ట్రాఫిక్ పోలీసులు ‘ఫీల్డింగ్ టీమ్స్’ ఏర్పాటు చేశారు. వీరు డ్రైవ్ జరుగుతున్న ప్రాంతానికి కాస్తా ముందు నుంచి కాపుకాసి ఇలా ఉడాయించే వారిని పట్టుకోవడం మొదలెట్టారు. దీంతో మందుబాబులు ఏరియాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ వాటిలో తమతమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ డ్రైవ్స్ జరుగుతున్నాయో పోస్టు చేస్తున్నారు. కొందరు గ్రూపు సభ్యులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో దాదాపు అన్ని ఏరియాల సమాచారం ఆ గ్రూపుల్లోకి వచ్చి, మద్యం తాగి ఉన్న వాళ్లు పోలీసులకు చిక్కకుండా జారుకుంటున్నారు. చెక్ చెప్పేందుకు మార్గాల అన్వేషణ ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ డ్రంక్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకోవడానికి చేస్తున్న స్పెషల్ డ్రైవ్స్ సందర్భంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనచోదకులతో పాటు పోలీసులకు ఎలాంటి ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో రహదారి స్థితిగతులు తదితరాలను పరిశీలించి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏరియాలు ఒక్కో ట్రాఫిక్ ఠాణాలో గరిష్టంగా ఐదే ఉంటున్నాయి. మరోపక్క ఈ డ్రైవ్స్ చేపట్టడానికి బారికేడ్లు, టోవింగ్ వాహనం సహా మరికొన్ని సదుపాయాలు అనివార్యం. దీంతో పోలీసులు ఆకస్మికంగా వేర్వేరు ప్రాంతాల్లో ఈ డ్రైవ్స్ చేపట్టడం సాధ్యం కావట్లేదు. ఇవన్నీ మందుబాబులకు కలిసి వస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. పోలీసులతో పాటు మద్యం మత్తులో వాహనం నడిపే వారికీ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ‘నిషా’చరులు ఇలాంటి పై ఎత్తులు వేయడం వల్ల స్పెషల్ డ్రైవ్స్ స్ఫూర్తి దెబ్బతింటోందని చెబుతున్న పోలీసులు వీరిని కట్టడి చేయడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. -
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
చేవెళ్ల: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వారు చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సమీర్, చరణ్గౌడ్, చందు, చారి, వినీత్, ఆదిత్య, విష్ణుగుప్తా, ఇర్ఫాన్, వివేకానంద, శశి, ఆకాశ్, షోఫాయాన్, విష్ణు, శివ, నవీన్, కార్తీక్, మైపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ -
జనం నెత్తిన కాలుష్య భూతం!
● సాయంత్రం సీజ్..ఉదయం కాంక్రీట్ తయారీ ● పీసీబీ ఆదేశాలను లెక్కచేయనిరెడీమిక్స్ ప్లాంట్లు ● శంషాబాద్, కొత్వాల్గూడ, నార్సింగి, కోకాపేట్లో ఇష్టారాజ్యం ● అనుమతుల్లేని ప్లాంట్లకు అడ్డగోలుగా విద్యుత్ కనెక్షన్లు ● తరచూ ఆందోళనకు దిగుతున్న స్థానికులు.. ● పట్టించుకోని అధికారులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారు ప్రాంతాలను రెడీమిక్స్ కాంక్రీట్ రూపంలో కాలుష్యభూతం పట్టి పీడిస్తోంది. ఇళ్ల పక్కనే ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్లు వెదజల్లుతున్న కాలుష్యం స్థానికుల పాలిట శాపంగా మారుతోంది. వాతావరణంలో చేరిన ధుమ్ము, ధూళీ కణాలు, ఘాటు వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆస్తమా బాధితులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రెడీమిక్స్ ప్లాంట్లను జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపాలిటీలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నా బుట్టదాఖలవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థలు జాతీయ హరిత ట్రిబ్యూనల్ను ఆశ్రయించి, వాటి మూసివేతకు ఆదేశాలు జారీ చేయించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. హిమాయత్సాగర్ పరిసర ప్రాంతాల్లో వెలిసిన 21 రెడీమిక్స్ ప్లాంట్లను పీసీబీ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. అయితే ఇలా సీజ్ చేసి... అధికారులు అలా ఇంటికి చేరుకునే లోపే మళ్లీ అవి తెరుచుకోవడం గమనార్హం. 111జీఓ పరిధిలోనూ ఆర్ఎంసీ ప్లాంట్లు సైబరాబాద్ పరిధిలోని నార్సింగి, మణికొండ, వట్టినాగులపల్లి, ఖానాపూర్, కోకాపేట్, శంషాబాద్, కొత్వాల్గూడలో, గండిపేట, హిమాయత్సాగర్ పరిసరాలతోపాటు రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న తారామతిపేట్, పెద్ద అంబర్పేట్, కోహెడ,, ఆదిభట్ల, కొంగర, తుక్కుగూడలోనూ పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, గెటేడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. వీటికి సిమెంట్, కంకర, ఇసుక, స్టీలు పెద్ద మొత్తంలో అవసరమవుతోంది. నిజానికి ఏదైనా నిర్మాణ ప్రదేశంలో కానీ, ఇతర ప్రాంతంలో కానీ ఒక ఆర్ఎంసీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ముందు పరిశ్రమల శాఖ అనుమతి పొందాలి. ఆ తర్వాత రెవెన్యూ శాఖ, మున్సిపాలిటీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించాలి. శంషాబాద్, కొత్వాల్గూడ, గండిపేట్, హిమాయత్సాగర్ పరిసరాలన్నీ 111 జీఓ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కానీ, పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయవద్దనే ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ పలు నిర్మాణసంస్థలు తమకున్న రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఆయా శాఖల నుంచి అనుమతులు పొందకుండానే ఇష్టారాజ్యంగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. అడిగినంత ముట్టజెప్పితే చాలు కరెంటోళ్లు కళ్లు మూసుకుని వాటికి కనెక్షన్లు ఇస్తున్నారు. వీటిని సాకుగా చూపించి... ఏదైనా బహుళ అంతస్థుల నిర్మాణాల ముడిసరుకును ఇతర ప్రాంతాల నుంచి లారీలు, టిప్పర్లలో తరలించాల్సి వస్తుంది. అధికలోడు వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని సాకుగా చూపించి, నిర్మాణ సంస్థలు తమ స్థలంలోనే రెడీమిక్స్ పాంట్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. చాలా రెడీమిక్స్ వాహనాలు నిర్మాణ ప్రాంగణం దాటి బయటికి వచ్చి ఇతర ప్రాంతాల్లోని నిర్మాణాలకు ముడిసరుకును చేరవేస్తున్నాయి. ఈ సమయంలో రోడ్లపై కంకర, సిమెంట్ జారిపడుతున్నాయి. దీంతో ఇతర వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మచ్చుకు కొన్ని ప్లాంట్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి కొంగర కలెక్టరేట్ మార్గమధ్యలో ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్కు వచ్చి వెళ్లే వాహనాల నుంచి కాంక్రీక్ రోడ్డుపై పడుతోంది. నిత్యం ఇదే రోడ్డు నుంచి జిల్లా ఉన్నతాధికారులంతా రాకపోకలు సాగిస్తుంటారు. అయినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ వెంట వెలసిన కాంకీట్ యూనిట్కు వచ్చి పోయే వాహనాలతో సర్వీసు రోడ్డు దెబ్బతింటోంది. ● మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మైహోం అవతార్, హాల్మార్క్ విసినియా అపార్ట్మెంట్ల మధ్య వెలసిన ఆర్ఎంసీ నుంచి వెలువడే కాలుష్యంతో వాతావరణం పూర్తిగా కాలుష్యమవుతోందని, అపార్ట్మెంట్ల పరిసరాలు ధుమ్ము, ధూళితో నిండిపోతున్నాయని, ప్రజారోగ్యానికి హానికరంగా మారిన ఈ ప్లాంట్ను తక్షణమే మూసివేయించాలని ఇటీవల స్థానికులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. ● ఓఆర్ఆర్కు సమీపంలోని కోహెడ–బ్రాహ్మణపల్లి సరిహద్దులో ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్తో ఆ పరిసర ప్రాంతాలన్నీ దెబ్బతిన్నాయి. చుట్టు పక్కన ఉన్న పంటలు, ఖాళీ ప్లాట్ల నిండా సిమెంట్, డస్ట్ పేరుకుపోయాయి. తారమతిపేట, బాకారం, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లోనూ ఈ ప్లాంట్లతోపాటు క్రషర్ మిషన్లు భారీగాఏర్పాటయ్యాయి. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
షాద్నగర్ రూరల్: పట్టణ శివారు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలోని తిరుమల మెగా టౌన్షిప్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన ప్రకారం.. తిరుమల మెగాటౌన్షిప్ కాలనీలో నివాసముండే రాజేష్, ఝాన్సీ దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు, కనకయ్య దంపతులు ప్రైవేటు ఉద్యోగస్తులు. ఉదయం వారు ఇళ్లకు తాళం వేసి తమతమ విధులకు వెళ్లిపోయారు. గమనించిన దుండగులు రాజేశ్ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని వస్తువులు చిందరవందర చేశాడు. ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న కనకయ్య ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నింగా శబ్ధంరావడంతో చుట్టుపక్కల ఇళ్లవారు అక్కడకు వెళ్లే వరకే దుండగుడు పరారయ్యాడు. విధుల నుంచి వచ్చిన రాజేశ్ దంపతులు తాళం పగులగొట్టి ఉండడంతో డయల్ 100 నంబర్కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని సీసీ పుటేజీలు పరిశీలించారు. రాజేశ్, కనకయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు ఒకడే అని గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది. రెండు ఇళ్లలో చోరీకి విఫలయత్నం -
రికవరీ ఫోన్ల అప్పగింత
ధారూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాలు, తండాల్లో పోగొట్టుకున్న సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాధితులకు తొమ్మిది సెల్ఫోన్లను అప్పగించినట్లు ఎస్ఐ అనిత తెలిపారు. నాలుగు టిప్పర్లు, జేసీబీ సీజ్ కడ్తాల్: నిబంధనలకు విరుద్ధంగా మట్టితరలిస్తుండగా పోలీసులు దాడులు చేపట్టి వాహనాలను సీజ్ చేశారు. ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అన్మాస్పల్లి సమీపంలోని సర్వేనంబర్ 321/1లో ఉన్న ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేసి నాలుగు టిప్పర్లు, ఓ జేసీబీని స్టేషన్కు తరలించారు. ఈ మేరకు జేసీబీ, టిప్పర్ డ్రైవర్లతో పాటు ఆయా వాహనాల యజమానులు మునావత్ శ్రీను(గానుగుమార్లతండా), నేనావత్ శ్రీను(పుల్లేరుబోడ్ తండా)పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. కారు, ఆటో ఢీ.. ముగ్గురికి గాయాలు ఇబ్రహీంపట్నం: ఓ కారు, గూడ్స్ ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకారం.. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిలో గురునానక్ విద్యాసంస్థల సమీపంలో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఓ ఆల్టోకారు, టాటాఏస్ గూడ్స్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ఉన్న ఇద్దరు, ఆల్టోకారులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ మహేశ్వర్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. వరద కాల్వను పూడుస్తున్న వారిపై చర్యలు తీసుకోండి మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని సురంగల్ పెద్ద చెరువులోకి వచ్చే వరద కాల్వను పూడుస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సురంగల్కు చెందిన గడ్డం వెంకట్రెడ్డి తహసీల్దార్ గౌతమ్కుమార్ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సురంగల్లోని పెద్ద చెరువులోకి కనకమామిడి వైపు నుంచి వరదకాల్వ వస్తుందని.. నజీబ్నగర్ రెవెన్యూలోని సర్వే నెంబర్ 73, 74 వద్ద న్యాయవాది వలీ వరదకాల్వను పూర్తిగా పూడ్చివేసి తన పొలంలో కలుపుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకుని కాలువ పూడ్చివేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. కుక్కల దాడిలో జింక మృతి అనంతగిరి: వికారాబాద్కు సమీపంలోని అనంతగిరి అడవుల్లో సోమవారం వీధి కుక్కల దాడిలో ఓ జింక(దుప్పి) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఉదయం అడవిలో సంచరిస్తున్న జింక(దుప్పి)పై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. గమనించిన పలువురు వాటిని చెదరగొట్టారు. అనంతరం అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చేలోపు జింకమృతి చెందింది. -
రికవరీ.. ఏమైందో మరి!
ఫార్మాసిటీలో బినామీల పేరుతో ప్రజాధనం లూటీ ● ఇప్పటికే నకిలీలను తేల్చిన అధికారులు ● రికవరీతోపాటు చర్యలు తేసుకోవడంలో సర్కార్ తాత్సారం ● అక్రమార్కులను కాపాడుతున్నదెవరు? యాచారం: ఫార్మాసిటీలో బినామీల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లూటీ చేసిన రూ.కోట్లాది ప్రజాధనాన్ని రికవరీ చేసే విషయంలో ఫైలును ముందుకు కదలనీయకుండా సర్కార్లోని పెద్దలు కొందరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీకి 19,333 ఎకరాలను సేకరించడానికి నిర్ణయించడం తెలిసిందే. అందులో భాగంగా యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను సేకరించడానికి నిర్ణయించగా 7,640 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం అందజేశారు. మొదట్లో జరిగిన భూసేకరణలో అసైన్డ్ పట్టా భూముల్లో సాగు (పట్టాదారు, పాసుపుస్తకాల్లో 5 ఎకరాలుంటే గుట్టలు, రాళ్లు, రప్పలు తీసేసి) యోగ్యమైన భూములకే పరిహారం ఇచ్చారు. తర్వాత అధికారులతో కుమ్మకై ్కన కొందరు నకిలీలు, బినామీల పేర్లతో గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములపై పరిహారం పొందారు. గ్రామాలకు సంబంధం లేనివారు సైతం.. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాటం చేస్తున్న వారిలో అత్యధికులు బినామీల పేర్లతో పరిహారం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సర్కార్లోని ఓ కీలక నేత ఫిర్యాదుతో ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీలు, బినామీల జాబితాను ప్రభుత్వం తెప్పించుకుంది. 2020 నుంచి 2023 వరకు నకిలీలు, బినామీలకు ఫార్మా పరిహారం పేరుతో రూ.కోట్లాది నిధులు మంజూరైనట్లు అధికారులు గుర్తించారు. 250 మందికిపైగా రూ.500 కోట్ల వరకు పరిహారం పొందారని తేల్చారు. పరిహారం పొందిన వారిలో స్థానికులే కాకుండా నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలతో పాటు ఈ గ్రామాలకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు సైతం ఉన్నట్లు తేలింది. నకిలీలు, బినామీల పేర్లతో పరిహారం పొందిన వారే ఇప్పుడు మళ్లీ ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నకిలీలు, బినామీల లిస్టు ఫైనల్ చేసిన అధికారులు నోటీసులు ఇచ్చి, రికవరీ చేసేలా ఫైలు కదిపినా ఏమైందో కానీ దాన్ని కప్పిపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నోటీసులిస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఉన్నతాధికారులు జిల్లా అధికారులను వారిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫార్మా ప్లాట్ల లాటరీ అందుకే ఆలస్యం..ఫార్మాసిటీ నకిలీలు, బినామీలు రూ.కోట్లాది పరిహారంతో పాటు మీరాఖాన్పేటలోని టీజీఐఐసీ మెగా వెంచర్లో ప్లాట్ల సర్టిఫికెట్లు సైతం పొందారు. దాదాపు 500 ఎకరాలకుపైగా పరిహారం పొందిన బినామీలు 121 గజాలు, 242 గజాల చొప్పున ప్లాట్ల సర్టిఫికెట్లు దక్కించుకున్నారు. ముందు జాగ్రత్తగా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. 121 గజాల ప్లాటును రూ.8 లక్షలు, 242 గజాల ప్లాటును రూ.15 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. నెల క్రితమే లాటరీ ద్వారా ఫార్మా ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్లు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లాటరీ ద్వారా ఎంపిక చేసి కబ్జాలిస్తే భవిష్యత్తులో చిక్కులొస్తాయనే భయం వారిలో నెలకొంది. నకిలీల ఏరివేత, డబ్బుల రికవరీ తర్వాతే ఎంపిక ప్రక్రియ, రిజిస్ట్రేషన్లు చేసి కబ్జాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. -
అంగన్వాడీ టీచర్ మృతి
కేశంపేట: అనారోగ్యంతో ఓ అంగన్వాడీ టీచర్ మృతి చెందింది. ఈ ఘటన అల్వాల అనుబంధ గ్రామం తులవానిగడ్డలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎంపీపీ ఎల్గమోని రవీందర్యాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ షబనాహుస్సేన్, ఐసీడీఎస్ మాజీ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, శమంతకమణి , పలువురు అంగన్వాడీ టీచర్లు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం అంత్యక్రియలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం చెక్కును మృతురాలి కుటుంబ సభ్యులకు సీడీపీఓ అందజేశారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
ఇబ్రహీంపట్నం రూరల్: శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకుని బ్యాంకు లావాదేవీలను కొనసాగించాలని రిజర్వ్ బ్యాంకు అధికారి రెహమాన్ అన్నారు. మార్చి 10 నుంచి 16 వరకు డిజిటల్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని ఎల్మినేడు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పేమెంట్స్పై అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రిజ ర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీని సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించారు. థర్డ్ పార్టీ యాప్ల జోలికి పోకుండా నేరుగా బ్యాంకులు సూ చించిన యాప్ల సహకారంతోనే లావాదేవిలు కొనసాగించాలని చెప్పారు. ఆర్థిక అక్షరాస్యతపై అందరికి అవగహన అవసరమన్నారు. నగదు రహిత లావాదేవిలు చేసే సమయంలో సైబర్ మోసాల బారీన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు డిజిటల్ పేమెంట్స్పై ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్ బిజినెస్ మేనేజర్ ఎం.మురళీకృష్ణ, కె.సుధాకర్, బ్యాంక్ మేనేజర్ శిరీష్చంద్ర, ఎస్.నవీన్కుమార్, అనిత, విద్యార్థులు పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలే సురక్షితం రిజర్వ్ బ్యాంకు అధికారి రెహమాన్ -
అమరుల ఆశయాలు సాధించాలి
మంచాల: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల ఆశయాలు సాధించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య అన్నారు. మండలంలోని జాపాల గ్రామంలో శనివారం కర్రె కోటప్ప స్మారక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి సాయుధ తెలంగాణ భూ పోరాటంలో కోటప్ప పాత్ర మరువలేనిదని తెలిపారు. దున్నే వాడికి భూమి కావాలని గ్రామాల్లో ఎర్ర జెండాలు పాతి భూ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. రైతు, కూలీల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్య పర్చిన ఘనత సీపీఎంకే దక్కుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం కావాలంటే పోరాటాలే శరణ్యమన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని మార్పు దిశగా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. ఉద్యమాల్లో ప్రజలందరినీ భాగస్వాములు చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా నాయకుడు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. -
రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి
ఆమనగల్లు: ఇరువర్గాలు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలని, రాజీమార్గం రాజమార్గమని ఆమనగల్లు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కాటం స్వరూప అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రథమశ్రేణి న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు సంబంధించి 126 కేసులు పరిష్కారమయ్యాయి. అంతకుముందు న్యాయమూర్తి కాటం స్వరూప మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్లో ఇరువర్గాలు రాజీపడి చిన్నచిన్న కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు ప్రమోద్కుమార్, శివప్రసాద్, ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్ఐలు వెంకటేశ్, వరప్రసాద్, శ్రీకాంత్, ఏపీపీ కార్తీక్, లోక్ అదాలత్ సభ్యులు ఆంజనేయులు యాదవ్, రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపల్లి జగన్ తదితరులు ఉన్నారు. లోక్ అదాలత్లతో సత్వర పరిష్కారం చేవెళ్ల: లోక్ అదాలత్లతో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని చేవెళ్ల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య అన్నారు. కోర్టు ఆవరణలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 970 కేసులు పరిష్కరించారు. వీటికి సంబంధించి రూ.14,28,280 జరిమానాలు రికవరీ చేశారు. అనంతరం దశరథ రామయ్య మాట్లాడుతూ.. ఇరువరా్ుగ్ల రాజీకి వచ్చి పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్లు దోహదం చేస్తాయని అన్నారు. ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కేసు లను సైతం పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ లోక్ అదాలత్లో ట్రాఫిక్ పోలీస్ కేసులకు సంబంధించి మొత్తం 446 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ సీనియర్ సివిల్ జడ్జి సాంబశివరావు, చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకేటశం, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు. మంత్రి దామోదరను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహను శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తూ రూ.45.50 కోట్లు మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నేడు ఇండియాకు ప్రవీణ్కుమార్ మృతదేహం కేశంపేట: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన గంప ప్రవీణ్కుమార్ మృతదేహం ఆదివారం ఇండియాకు రానుంది. మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్కుమార్ బుధవారం అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో దుండగుల కాల్పులో మృతి చెందిన సంగతి తెలిసిందే. అమెరికాలో పోస్టుమార్టంతో పాటు లాంచనాలు పూర్తికావడంతో మృతదేహాన్ని తానా సభ్యులు, బంధువుల సహకారంతో ఇండియాకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నట్టు బంధువులు, గ్రామస్తులు తెలిపారు. అక్కడి నుంచి కేశంపేటకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మహిళల్ని ఎదగనిద్దాం.. గౌరవిద్దాం
ఖైరతాబాద్: మహిళల్ని ఎదగనిద్దాం.. గౌరవిద్దాం.. ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగనిద్దామని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఉదయం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా ఉమెన్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్ను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ‘మహిళలు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాన్నారు. మహిళల రక్షణకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మత్తు నుంచి మన సమాజాన్ని కాపాడుకుని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకునేలా ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన 5కే రన్ సచివాలయం మీదుగా తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు సాగింది. రన్లో పోలీసు ఉన్నతాధికారులు, హైదరాబాద్ సిటీ సెక్యురిటీ సర్వీసెస్, ఉమెన్సేఫ్టీ వింగ్ అధికారులు, మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి సీతక్క ఉత్సాహంగా 5కే రన్ -
సినిమా షూటింగ్లో అపశ్రుతి
శంకర్పల్లి: ఓ సినిమా షూటింగ్లో అపశ్రుతి చో టు చేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి మండల పరిధిలోని టంగుటూరు శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకా రం.. టంగుటూరుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీజేపీ నేత బద్ధం శంభారెడ్డి(47) సిని ఇండసీ్ట్ర వారికి సుపరిచితుడు. మండల పరిధిలో చేసే షూటింగ్లకు అనుమతులు ఇప్పిస్తుంటాడు. కాగా శుక్రవారం గ్రామ శివారు పంట పొలాల్లో ‘ఓదేల.. ది రైల్వేస్టేషన్’ సినిమా షూటింగ్ ఉంది. షూటింగ్ బృందానికి చెందిన ఓ భారీ క్రేన్ రావడంతో విద్యుత్ వైర్లకు తగులుతుందేమోనని శంభారెడ్డి ట్రాన్స్ఫార్మర్(జంపర్)ను ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. షూటింగ్ బృందం వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాత్రి విధుల్లో ఉన్న పెట్రోలింగ్ వాహనంలో సిబ్బంది, నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి మార్చురికీ తరలించారు. మృతుడికి భార్య లావణ్య, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే మణివర్ధన్రెడ్డి, శిరీష ఉన్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి మోకిల ఠాణాలో మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. రెండు గంటల పాటు ధర్నా కాగా పోలీసులు సినీ ఇండసీ్ట్ర వారితో కుమ్మకై ్క ఆధారాలు లభించకుండా మృతదేహాన్ని మార్చురికీ తరలించారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు ఘటనా స్థలికి వెళ్లగా.. ఎవరికీ చెప్పొద్దంటూ వెనక్కి పంపించారని వాపోతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా తరలిస్తారంటూ శనివారం మోకిల చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాల దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం నార్సింగి ఏసీపీ రమణగౌడ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఎమ్మెల్యే పరామర్శ శంభారెడ్డి మరణవార్త తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మృతుడి ఇంటికి వెళ్లా రు. వారికి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. అనంతరం ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. విద్యుదాఘాతంతో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మృతి మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు సమాచారం ఇవ్వలేదని మృతుడి కుటుంబీకుల ధర్నా ఏసీపీ రమణగౌడ్ జోక్యంతో ఆందోళన విరమణ -
ఆలయంలో విగ్రహాలు మాయం
మొయినాబాద్: ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఆలయంలోని మైసమ్మ, కనకదుర్గ అమ్మవార్ల విగ్రహాలు మాయమయ్యాయి. ఈ ఘటన మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఓ పురాతన ఆలయం ఉంది. అందులో మైసమ్మ, కనకదుర్గ అమ్మవార్ల విగ్రహాలున్నాయి. శనివారం ఉదయం ఆస్పత్రికి వచ్చినవారికి ఆలయంలో విగ్రహాలు కనిపించకపోవడంతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు చేపట్టారు. ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రిలో పనిచేసే ఓ ఏఎన్ఎం కొత కాలంగా మతిస్థిమితం సరిగాలేక పూనకంతో ఊగిపోతోందని.. ఆలయానికి ఉన్న టైల్స్ను కొంత కాలంగా తానే తొలగించిందని.. విగ్రహాన్ని సైతం ఆమె మాయం చేసి ఉండవచ్చని సిబ్బంది చెప్పారు. ఈ విషయంపై బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధి చెప్పారు. బీజేపీ, హిందూ సంఘాల ఆందోళన పోలీసులకు ఫిర్యాదు మతిస్థిమితం సరిగా లేని ఏఎన్ఎం తీసినట్లు చెబుతున్న వైద్య సిబ్బంది మానసిక రోగంతోనే.. పీహెచ్సీలో పనిచేసే గంగా అనే ఏఎన్ఎం మానసిక పరిస్థితి కొంత కాలంగా సరిగా లేదు. ఆలయం వద్ద పూజలు చేస్తూ పూనకంతో ఊగిపోతుంది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెల్లాం. మెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ తెప్పిస్తే సిబ్బందిని బూతులు తిడుతూ కర్రలతో దాడి చేసింది. ఎవరైనా దగ్గరకు వస్తే చనిపోతానని బెదిరిస్తుంది. మతిస్థిమితం సరిగా లేని గంగా విగ్రహాలను తొలగించి ఉంటుందని భావిస్తున్నాం. – అన్నపూర్ణ, వైద్యాధికారి, మొయినాబాద్ -
విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సాధించాలి
మొయినాబాద్ రూరల్: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని జాతీయ వాలీబాల్ ప్లేయర్ బి.జంపన్నగౌడ్ అన్నారు. జేబీ ఇంజనీరింగ్ నిర్వహిస్తున్ను రాష్ట్ర స్థాయి క్రీడలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కార్యదర్శి కృష్ణారావు, ప్రిన్సిపాల్ కృష్ణమాచారి, డైరెక్టర్ సంజయ్, విజయ్ రాఘవ్, పీడీ విఘ్నేష్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ వాలీబాల్ ప్లేయర్ జంపన్నగౌడ్ -
అడ్డాపై కూలీ మృతి
తుర్కయంజాల్: కూలి పనికి వెళ్లిన వ్యక్తి లేబర్ అడ్డాపై మృతి చెందాడు. ఈఘటన తుర్కయంజాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడకు చెందిన వెంకటయ్య(50) దంపతులు తుర్కయంజాల్లో నివాసం ఉంటూ రోజువారి కూలీపనుల కోసం అడ్డామీదకు వెళ్తారు. శనివారం ఉదయం కూలీకోసం దంపతులు అడ్డామీదకు వెళ్లారు. అక్కడ చేరుకున్న కాసేపటికే వెంకటయ్య ఒక్కసారిగా కుప్పకూలాడు. గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు లేకపోవడంతో దాతలు స్పందించి రూ.7వేలు పోగు చేసి ఆటో వారి స్వగ్రామానికి తరలించారు. -
No Headline
విభాగం అధికారి అధనపు కలెక్టర్ (రెవెన్యూ, స్థానిక సంస్థలు) ప్రతిమాసింగ్ జిల్లా రెవెన్యూ అధికారి సంగీత గ్రామీణాభివృద్ధి సంస్థ ఎల్.శ్రీలత జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ విభాగం సంధ్యారాణి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ రామేశ్వరి పరిశ్రమలశాఖ జీఎం శ్రీలక్ష్మి మెప్మా, పీడీ మల్లేశ్వరి అడల్ట్ ఎడ్యుకేషన్ అనిత చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పి.సౌమ్య డీటీసీపీఓ పి.సువర్ణదేవి ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సరూర్నగర్ ఉజ్వలారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డీటీఓ బి.పద్మావతి ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఎస్.రాజేశ్వరి జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.జయశ్రీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇందిరాదేవి మార్కెఫెడ్, డీఎం ఎండీ తమినా -
వందనం.. ‘కందివనం’
షాబాద్: ఒకవైపు బ్రాంచ్ పోస్టుమాస్టర్గా విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు ఇద్దరు ఆడపిల్లలను చదివించి ప్రయోజకులను చేసి వివాహాలు జరిపించారు మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి కందివనం పద్మ. భర్త కై లాస్గౌడ్ 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం ఆమైపె పడింది. భర్త చేస్తున్న ఉద్యోగాన్ని చేపట్టింది. తండ్రి లేని లోటు తెలియకుండా ఇద్దరు ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా పెంచింది. డిగ్రీ వరకు చదివించి పెళ్లిళ్లు చేసింది. ఇప్పటికీ ఇల్లిల్లూ తిరుగుతూ ఉత్తరాలు బట్వాడా చేస్తూ.. పింఛన్లు అందిస్తూ.. ఊరివాళ్లతో కలుపుగోలుగా మెలుగుతూ జీవనం సాగిస్తోంది. ‘ఎన్ని సమస్యలు ఎదురైనా మహిళలు సహనాన్ని కోల్పోవద్దని.. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని.. సహనం, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యమైన చేరుకోగలం’ అని చెబుతోంది. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని అన్నారు. కుటుంబానికి మూలం మహిళ అని గుర్తు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా పెంచాలన్నారు. మహిళా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళలకు ఆర్థికంగా, విద్యాపరంగా సమాన హక్కులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారంతా మహిళా అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీత, జిల్లా టీజీఓ అధ్యక్షుడు డాక్టర్ రామారావు, టీజీఓ కార్యదర్శి శ్రీనేష్కుమార్ నోరి, జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, సీడీపీఓ శాంతిశ్రీ, రేవతి, అలివేలు, అనిత, సుజాత, సైదమ్మ, గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జై
ఆమెకుతల్లిగా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతోంది.. మమతానురాగాలకు చిరునామాగా నిలుస్తోంది.. తోబుట్టువుగా ప్రేమను పంచుతోంది.. ఆలిగా మగవాడి బతుకులో సగపాలు తనదిగా కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటోంది.. ప్రతి పురుషుడి విజయం వెనుక ‘ఆమె’ కీలకపాత్ర పోషిస్తోంది.. ఇంటికి దీపం ఇల్లాలుగా కుటుంబానికి వెలుగులు పంచుతోంది.. సేవకు ప్రతిరూపంగా నిలుస్తోంది.. ఒకవైపు వంటింట్లో గరిటె తిప్పుతూనే మరోవైపు రాజకీయాలు, పాలనలోనూ ‘చక్రం’ తిప్పుతోంది.. ఒకప్పుడు గృహిణులుగానే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ‘రాణి’స్తున్నారు.. ఆకాశంలో సగం కాదు అన్నింట్లోనూ ముందే అని నిరూపిస్తున్నారు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. ● గొప్పశక్తిగా మహిళ ఒకప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతను.. మరోవైపు అధికారిక కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పాలనాపరమైన అంశాల్లో అమెరికా కంటే భారతీయ మహిళలలే ముందున్నారు. 40 ఏళ్ల క్రితమే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా పని చేయడమే ఇందుకు ఉదాహరణ. ఉన్నత చదువులు చదువుకుంటూ.. ఉన్నతంగా రాణిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా గొప్ప శక్తిగా ఎదుగుతున్నారు – ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ -
ఆడపిల్లలే అనుకోకుండా కరాటేలో శిక్షణ
చేవెళ్ల: నలుగురూ ఆడపిల్లలే.. అయినా ఎందులోనూ తీసిపోకూడదనే ఉద్దేశంతో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్నాడు ఆ తండ్రి. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కావలి కృష్ణ, దివ్య దంప తులు. వారికి నలుగురు ఆడపిల్లలు. కృష్ణ చిన్నతనంలో నేర్చు కున్న కరాటే తన కుటుంబానికి జీవనాధారంగా మారింది. కరాటేలో 5వ డాన్ బ్లాక్బెల్టు సాధించిన అతడు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నలుగురు ఆడపిల్లలు అన్న బాధ లేకుండా వారిలో ఆత్మవిశ్వాసం నింపితే సమాజంలో అందరితో సమానంగా రాణిస్తారని నమ్మాడు. దీంతో కూతుళ్లకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. పెద్ద కూతురు జేమిమ్మ ఎనిమిదేళ్ల వయస్సులోనే కరాటేలో వైట్, ఎల్లో, ఆరెంజ్ బెల్టులు సాధించింది. రెండో కూతురు రూతు ఆరేళ్ల వయసులో వైట్, ఎల్లో బెల్టులు సాధించింది. మూడో కూతురు జేరుషా సైతం నాలుగేళ్లకే అక్కలతోపాటు కరాటేలో శిక్షణ తీసుకుంటోంది. ‘నాకున్న అస్తి, ధైర్యం నా నలుగురు అమ్మాయిలే. ఎక్కడా వారు తక్కువ కాకుండా ఉండాలనే కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. వారికి ఇష్టమైన ఏ రంగంలో అయినా రాణించేందుకు పూర్తి సహకారం అందిస్తాను’ అంటున్నాడు. -
వైకల్యాన్ని జయించి..
శంకర్పల్లి: పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ డాక్టర్ కావాలనుకునే లక్ష్యాన్ని సాధించానని అంటున్నారు శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ రేవతిరెడ్డి. అమ్మానాన్నలు రేయింబవళ్లు కష్టపడ్డారని.. తాను, తన అక్క కలలు కన్న లక్ష్యాల కోసం నిరంతరం తాపత్రయ పడ్డారని చెబుతున్నారు. చదువులో చురుగ్గా.. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి, సరళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు మాధవి రెడ్డి, చిన్న కూతురు రేవతి రెడ్డి. వెంకట్రెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. చిన్న కూతురు రేవతిరెడ్డికి చిన్నతనం నుంచే అంగవైకల్యం ఉన్నప్పటికీ చదువులో చురుగ్గా ఉండేది. గమనించిన తండ్రి ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. శంకర్ పల్లి పట్టణంలోని శ్రీ వివేకానంద పాఠశాలలో 7వ తరగతి వరకు, 10వ తరగతి వరకు వికారాబాద్ ఎన్నేపల్లిలోని సంఘం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలలో, ఇంటర్ వరంగల్ హసన్పర్తిలోని ఏపీఆర్జేసీలో చదువుకుంది. ఎంబీబీఎస్లో దివ్యాంగుల కోటాలో సీటు రాకపోవడంతో ఓపేన్ ఎ కేటగిరీలో నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. పొలం అమ్మేసి .. కూతురికి ఎంబీబీఎస్లో సీటు రావడంతో తండ్రి ఎంతో సంతోషించాడు. ఎంత కష్టమైనా చదవించాలనుకున్నాడు. పెద్ద కూతురు ఎంఎస్సీ, చిన్న కూతురు ఎంబీబీఎస్ కోసం సంవత్సరానికి రూ.లక్షల్లో ఖర్చవుతుండడంతో ఊర్లోని ఆరు ఎకరాల పొలం అమ్మి చదివించాడు. 2008లో పెద్ద కూతురు మాధవిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించగా.. 2014లో రేవతిరెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2014 నుంచి 15 వరకు కోస్గి, 2015–18 నవాబ్పేట్, ప్రస్తుతం శంకర్పల్లి పీహెచ్సీల్లో వైద్యురాలిగా సేవలందిస్తోంది. ప్రభుత్వం నుంచి అవార్డులు రేవతిరెడ్డి ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు బాసటగా నిలుస్తోంది. ఆమె వైద్య సేవలను గుర్తించి 2023లో కలెక్టర్ ఉత్తమ వైద్యురాలి అవార్డుకి ఎంపిక చేశారు. జిల్లా వైద్యా, ఆరోగ్య శాఖ వారు సాధారణ ప్రసవాలు, ఉత్తమ సేవలకుగాను రెండు సార్లు అవార్డులు అందించారు. డాక్టర్ రేవతిరెడ్డికి 2017లో పాండురంగారెడ్డి తో వివాహం జరిగింది. ఆరేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నాడు. తండ్రి వెంకట్రెడ్డి 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి సంరక్షణ అక్కాచెల్లెళ్లు చూసుకుంటున్నారు. -
మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళలే అని అన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా గొప్పదన్నారు. వారి రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పని చేస్తోందన్నారు. మహిళల భద్రత కోసం పటిష్ట చట్టాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. షీటీం ఆకతాయిలపై కొరడా జులిపిస్తోందని తెలిపారు. మహిళలను చైతన్యం చేయడం ద్వారానే హత్యలు, అత్యాచారాలు తగ్గుముఖం పడతాయన్నారు. కార్యక్రమంలో గురునానక్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ హెచ్ఎస్ సైనీ, అధ్యాపకులు, పాల్గొన్నారు. ‘స్మయిల్ ఆల్వేస్’కు ఉత్తమ అవార్డు ఇబ్రహీంపట్నం రూరల్: ఆడబిడ్డల చదువుకు అండగా నిలుస్తున్న స్మయిల్ ఆల్వేస్ ఫౌండేషన్ సంస్థ సేవలను ప్రభుత్వం గుర్తించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవా అవార్డును ప్రకటించింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్లో స్మయిల్ ఆల్వేస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు కోడి సుధామనుడుకు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అవార్డు అందజేశారు. శాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సుధామనుడు మాట్లాడుతూ.. 500 మంది ఆడబిడ్డలను చదివించడమే కాకుండా దాదాపు 100 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం మీర్పేట: సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని చేవెళ్ల లోక్సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ప్రపంచ ఔషధ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు శుక్రవారం మీర్పేట రైతుబజార్ వద్ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ (జనరిక్ మెడికల్) కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదుతో కూడుకున్నదని, తక్కువ ధరకే పేదలకు మందులు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ కేంద్రాల్లో 80 నుంచి 90 శాతం వరకు తగ్గింపుతో మందులు లభిస్తాయని తెలిపారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన జనరిక్ మాత్రలను కొనుగోలు చేసి గూగుల్పే ద్వారా బిల్లు చెల్లించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, కొలన్ శంకర్రెడ్డి, మీర్పేట–1,2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఇండియాకు ప్రవీణ్ మృతదేహం కేశంపేట: అమెరికాలో మృతిచెందిన విద్యార్థి ప్రవీణ్కుమార్ మృతదేహం ఆదివారం ఇండియాకు రానుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న అనంతరం స్వగ్రామం కేశంపేటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ తల్లిదండ్రులు గంప రాఘవులు, రామాదేవి దంపతులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య వేర్వేరుగా పరామర్శించారు. ఫోన్ద్వారా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. -
No Headline
పహాడీషరీఫ్: ఆడ, మగ తేడా లేకుండా ఆ దంపతులు ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేశారు. ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇప్పించారు. ఉన్నత చదువులు చదివిస్తూనే.. బుల్లెట్ బండి, కార్ల డ్రైవింగ్ సైతం నేర్పించి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. బాలాపూర్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మద్ది సబిత, రాజశేఖర్ రెడ్డి దంపతులకు మణిదీపా రెడ్డి, సహస్రారెడ్డి ఇద్దరు ఆడ పిల్లలు. వారిని ప్రత్యేకంగా పెంచాలనుకున్నారు. పెద్ద కుమార్తె మణిదీపా రెడ్డికి కరాటేతో పాటు బాస్కెట్ బాల్ నేర్పించారు. ఈమె ఇప్పటికే ఎన్నో టోర్నమెంట్ల్లో ప్రదర్శనలు ఇచ్చి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. ప్రస్తుతం సివిల్స్కు ప్రిపేరవుతోంది. చిన్న కుమార్తె సహస్రారెడ్డి వైద్య విద్యను అభ్యసిస్తోంది. సబిత 2020–25 మధ్య కాలంలో మీర్పేట్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పని చేశారు. రాజశేఖర్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు. వాహనాలు నడుపుతున్న మణిదీపా రెడ్డి, సహస్రా రెడ్డి -
విద్యతో పరిశోధనలను జోడించాలి
మొయినాబాద్: విద్యావ్యవస్థలో బహుముక పరిశోధనలను జోడించడంలో విద్యార్థులు, విద్యావేత్తలు, సామాజికవేత్తల పాత్ర కీలకమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అంగీకృత పరిశోధన, సుస్థిరాభివృద్ధిపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో దీర్ఘకాలిక సవాళ్లను అధిగమించేందుకు పర్యావరణ సుస్థిరత, వనరుల నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో సృజనాత్మకత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వర్సిటీ ప్రొఫెసర్ ఉపద్రస్తా రామమూర్తి, గ్రిట్ కళాశాల డీన్ స్వదేశ్ కుమార్ సింగ్, కేజీరెడ్డి కళాశాల చైర్మన్ కె.కృష్ణారెడ్డి, డైరెక్టర్ రోహిత్ కందకట్ల, ప్రిన్సిపాల్ సాయిసత్యనారాయణరెడ్డి, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి -
లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుని..
నాన్న టీఎస్ నరసింహన్ సహా ఇంట్లో అంతా ఉన్నత చదువులు చదివిన వారే. నాకు ముగ్గురు బ్రదర్స్. వివిధ రంగాల్లో స్థిరపడ్డా రు. నాన్న స్ఫూర్తితో చదువుకున్నా. స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అయినప్పటికీ పుట్టిపెరిగింది మొదలు.. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే. సెంట్రల్ వర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేశా. గ్రూప్స్ రాశాను. తొలి ప్రయత్నంలో రాకపోవడంతో ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పని చేశాను. గ్రూప్–1కు ప్రిపేరయ్యాను. గ్రూప్–2 పరీక్ష రాసి, విదేశాలకు వెళ్లాలని భావిస్తున్న సమయంలో ఫలితం వచ్చింది. హైదరాబాద్లో ట్రైనింగ్.. వరంగల్లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి కలెక్టర్ సుమితా దావ్రా డీఆర్డీఏ పీడీగా నియమించారు. గ్రూప్–2 కేడర్కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని, గ్రూప్–1 కేడర్ పోస్టులో ఎలా కూర్చొబెడతారని జాయినింగ్ రోజే పురుష ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నా. వారి సవాల్ను చాలెంజ్గా తీసుకున్నా. సమర్థవంతంగా పని చేశా. తర్వాత వివిధ జిల్లాల్లో, ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించా. ఒక వైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ప్రభుత్వ అధికారిగా విధులు.. లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగుతున్నా. – టీఎల్ సంగీత, జిల్లా రెవెన్యూ అధికారి -
పాలనలో ‘కీ’లకం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా పరిపాలనా భవనంలో మొత్తం 192 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సహా పలు కీలక విభాగాలకు ఉన్నతాధికారులుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ విభాగంలో 27 మంది, డీఆర్డీఏలో 32 మంది, జిల్లా విద్యాశాఖలో 16 మంది, సివిల్ సప్లయ్లో 13 మంది, పంచాయతీరాజ్ విభాగంలో 12 మంది, కో ఆపరేటివ్ విభాగంలో తొమ్మిది మంది, ఉద్యాన వన శాఖలో ఆరుగురు, ట్రెజరీలో 8 మంది, సీపీఓలో ఆరుగురు, అర్బన్ సీలింగ్ లాండ్స్లో ఆరుగురు, డీ సెక్షన్లో ఐదుగురు, సీ సెక్షన్లో ముగ్గురు, లాండ్ ప్రొటెక్షన్స్లో నలుగురు, భూసేకరణ విభాగంలో ముగ్గురు, హౌసింగ్ కార్పొరేషన్లో ముగ్గురు, మత్స్యశాఖలో నలుగురు చొప్పున పని చేస్తున్నారు. పరిశ్రమల శాఖలో నలుగురు, గిరిజన, మైనార్టీ విభాగాల్లో ఆరుగురు, లాండ్స్ రికార్డ్స్ విభాగంలో నలుగురు, బీసీ సంక్షేమశాఖలో నలుగురు, మెప్మాలో ఒకరు చొప్పున మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక వైద్య ఆరో గ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖల్లో పూర్తిగా వారిదే ఆధిపత్యం. అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో మెజార్టీ మహిళలే. -
లింగసమానత్వ సాధనకు..
అనంతగిరి: బాలికలు ఉన్నత విద్యనభ్యసించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ఆడపిల్లల సమానత్వ సమాఖ్య పనిచేస్తోంది. ఉన్నత విద్యతోనే లింగసమానత్వం సాధ్యమనే ఉద్దేశంతో ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో ఈ సమాఖ్య పోరాడుతోంది. గతేడాది మే లో ఏర్పడిన ఈ సంఘం కన్వీనర్గా కృప, జిల్లా కన్వీనర్గా జ్యోతి ఉన్నారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. ఆరు జిల్లాల్లో ఆక్టివ్గా పనిచేస్తోంది. జిల్లా కమిటీలో 30మంది బాలికలున్నారు. బాలికలను విద్యాలక్ష్మిని చేయడమే సంఘం ఆశయం. -
చిన్నచూపు వద్దు
మాది పూర్వ నల్లగొండజిల్లా హుజూర్నగర్. నాన్నకు నలుగురం సంతానం. పేద, మధ్య తరగతి కుటుంబం. ముగ్గురు అమ్మాయిలే అయినామా నాన్న మమ్మల్ని చదువు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదివించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా సొంతూరిలోనే. విజయవాడలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఎకనామిక్స్లో పీజీ చేశాను. బీఈడీ పూర్తి చేసి, స్కూల్ అసిస్టెంట్గా ఎంపికయ్యాను. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ రిక్రూట్మెంట్లో భాగంగా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా వచ్చాను. మిర్యాలగూడలో తొలి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డిలో ఏడీ చైల్డ్ వెల్ఫేర్గా పని చేశాను. ఆ తర్వాత ఇక్కడికి బదిలీపై వచ్చా. నా భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఆయన రెవెన్యూ విభాగంలో పని చేస్తారు. మాకు ఇద్దరు పిల్లలు. ఇటు ఆఫీసు, అటు ఇంటికి సమప్రాధా న్యత ఇస్తాను. మహిళలను చిన్నచూపు చూడొద్దు. ప్రోత్సహిస్తే.. మగవాళ్లుకు దీటుగా రాణిస్తారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ముందు చదువుకోవాలి. ఇందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ హాస్టళ్లను కూడా ఏర్పాటు చేసింది. – సంధ్యారాణి, సీ్త్ర, శిశు సంక్షేమ సంఘం అధికారి -
వహ్వా.. వాకా లక్ష్మీశైలజ
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025‘మద్ది’ సిస్టర్స్.. అదుర్స్ మీర్పేట: తల్లి వృద్ధాప్యం.. సోదరుడు అనారోగ్యంతో జీవితకాలం మంచానికే పరిమితం.. అన్నీ తానై అటు ఇంటి బాధ్యతను చూస్తూ.. ఇటు ఉద్యోగం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది వాకా లక్ష్మీశైలజ. మీర్పేట జిల్లెలగూడకు చెందిన వాకా లక్ష్మీశైలజ సౌత్సెంట్రల్ రైల్వే విభాగం సికింద్రాబాద్ డివిజన్ లాలాగూడలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తోంది. సాధారణంగా ఈ విభాగంలో పురుషులే ఎక్కువగా పనిచేస్తుంటారు. శైలజ గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పటికీ మానేసి రైల్వేలో ఉద్యోగం సాధించింది. విధి నిర్వహణలో కఠినమైన మెకానికల్ పనుల్లో భాగంగా మగవారికి దీటుగా రైల్వే వీల్స్కు సంబంధించిన పనులు చేస్తోంది. ఉద్యోగంతో పాటు కుటుంబ పోషణ భారమంతా తనపైనే వేసుకుని తల్లి, సోదరుడి ఆలనా, పాలనా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉద్యోగంతో పాటు రైల్వే అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటోంది. రైల్వే ఉన్నతాధికారుల నుంచి పలుమార్లు ప్రశంసా పత్రాలు అందుకుంది. ‘మహిళలు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. అన్ని రంగాల్లో రాణించాలని’ అంటోంది. ఇబ్రహీంపట్నం రూరల్: నిరుపేద కుటుంబానికి చెందిన వారికి నలుగురు కూతుళ్లు.. అంతా ఆడ పిల్లలే అని ఏనాడూ బాధపడలేదు. బాగా చదివిస్తే వారే కుటుంబానికి వెలుగవుతారని నిర్ణయించుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ అనుబంధ గ్రామం ఎర్రగుంటకు చెందిన కత్తుల అండాలు దేవదాసు దంపతులకు శ్వేత, నిఖిత, మేఘన, దీక్షిత నలుగురు సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చేర్పించారు. అనంతరం పెద్ద కూమార్తె శ్వేత తమిళనాడులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రెండో కుమార్తె నిఖిత బీటెక్ చదివి, బెంగళూర్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మూడో కూతురు మేఘన కరీంనగర్లోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చిన్న కుమార్తె దీక్షిత చిన్నప్పటి నుంచి ఆటల్లో మేటి. అథ్లెటిక్స్, ఖోఖోలో రాష్ట్ర స్థాయిలో అనేక పతకాలు సాధించింది. ప్రస్తుతం బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నలుగురూ ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదురైనా చదువును కొనసాగిస్తున్నా రు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత చదువులు చదువుతూ న లుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. న్యూస్రీల్ -
అతివలే అధికారులు
ఆమనగల్లు: సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందిస్తున్నారు. వ్యాపారం, క్రీడా రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుతునర్నారు. ప్రజాప్రతినిధులుగా తామేమీ తీసిపోలేదంటూ ప్రజా మన్ననలు పొందుతున్నారు. మండల పరిధిలో ప్రభుత్వ శాఖల అధికారులంతా మహిళలే. ఆమనగల్లు ప్రధమశ్రేణి న్యాయమూర్తిగా కాటం స్వరూప, ఎంపీడీఓగా కుసుమమాధురి, తహసీల్దార్గా లలిత, వ్యవసాయ శాఖ ఏడీగా శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. -
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
శంకర్పల్లి: హైదరాబాద్ నుంచి నాగపూర్కు గంజాయికి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మోకిల ఠాణా పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. గురువారం సా యంత్రం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు మోకిల పోలీసులు శంకర్పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి నాగపూర్కు స్విఫ్ట్ కారులో వెళ్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ మత్రు(35), నేనావత్ తేజ(29), మహారాష్ట్రకు చెందిన నీలేశ్ బాబన్ కాలే(22)ను అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీ చేయగా 52 కిలోల గంజాయి పాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం(ఆంధ్రా–ఒడిశా బార్డర్) నుంచి గంజాయి తీసుకు వచ్చామని.. పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నాక కొంత కారులో.. మిగిలినది సెప్టిక్ ట్యాంక్ వాహనంలో ఉంచి తరలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా పోలీసులు సెప్టిక్ ట్యాంకు వాహనం కోసం గాలింపు చేపట్టారు. నిందితుల వద్ద 52 కిలోల గంజాయి, కారు, నాలుగు ఫోన్లు సీజ్ చేశారు. శుక్రవారం నిందితులను చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు. ముగ్గురికి రిమాండ్ -
తెలిసిన వారితోనే ఇబ్బంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్: సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షపై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సాక్షి ప్రత్యేక సర్వే నిర్వహించింది. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు, 18నుంచి 25 ఏళ్ల వయసున్న యువతులు, 25 నుంచి 35 సంవత్సరాలున్న అతివలు, 35 నుంచి 50 ఏళ్ల వయసున్న వంద మంది మహిళలను (25 మంది చొప్పున) నాలుగు విభాగాలుగా చేసి సర్వే నిర్వహించగా.. వారి నుంచి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నప్పటికీ పలు చోట్ల వివక్ష కొనసాగుతోందని, స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాల్లో ఇతరుల నుంచి కొంత ఇబ్బంది ఎదురవుతోందని, బస్టాప్లు, ఆఫీసుల్లో పురుషాధిక్యం ఉందని, సెల్ఫోన్లలో వచ్చే మెసేజ్లు తమను ఎక్కువగా బాధ పెడుతున్నాయని, వీరిలో తెలియని వారికన్నా తెలిసిన వారే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని సర్వే వెల్లడిస్తోంది. మహిళలపై పలుచోట్ల కొనసాగుతున్న వివక్ష బస్టాప్లు, కాలేజీల్లో పురుషాధిక్యం ఇబ్బంది పెడుతున్న సెల్ఫోన్ మెసేజ్లు -
యువకుడి అదృశ్యం
చేవెళ్ల: ఫ్లైవుడ్ షాపులో పనిచేసే ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో రాజస్థాన్కు చెందిన హీర్ సింగ్మాసింగ్ రాందేవ్ ఫ్లైవుడ్ దుకాణం నడిపిస్తున్నాడు. ఆయన వద్ద వారి దూరపుబంధువైన జస్వంత్సింగ్ (18) మూడు నెలలుగా పనిచేస్తున్నాడు. గురువారం పనికి వచ్చిన యువకుడు సాయంత్రం 4గంటల ప్రాంతంలో రూమ్కు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. దుకాణం బంద్ చేసిన హీర్ సింగ్మాసింగ్ జస్వంత్సింగ్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో షాప్ యజమాని ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పెండింగ్ వేతనాలు చెల్లించండి
కేశంపేట: పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంఘం నాయకులతో కలిసి పంచాయతీ రాజ్ డిప్యూటీ డైరెక్టర్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన రామారావు వచ్చే బడ్జెట్ నుంచి గ్రీన్ చానల్ ద్వారా ప్రతీ నెల 1న వేతనాలు అందేలా చూస్తామన్నారు. టీస్బీఎస్ ద్వారా ఫిబ్రవరి వరకు ఉన్న వేతనాలను మంగళవారం వరకు చెల్లిస్తామన్నారు జనరల్ ఫండ్స్లో జనరేట్ చేసిన వేతనాల చెక్కులను క్లియర్ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజ్యం, మల్లయ్య, జిల్లా నాయకులు రాంచంద్రయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
ఇబ్రహీంపట్నం రూరల్: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి వెంటనే గ్రౌండింగ్ చేయడంలో వేగం పెంచాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నా రు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మార్చి 15 వరకు మిషన్ భగీరథ, గ్రిడ్ ఇంట్రా పనులకు గ్రౌండింగ్ చేపట్టి 20 వరకు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరకాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోపు పూర్తి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రామాణాభివృద్ధి అధికారి శ్రీలత, పంచాయతీ అధికారి సురేష్ మోహన్, మిషన్ భగీరథ ఈఈ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీపైఅవగాహన కల్పించండి గ్రామాల్లో తాగునీటిఎద్దడి తలెత్తకుండా చూడాలి కలెక్టర్ నారాయణరెడ్డి -
డీజేతో ఇబ్బందిపెట్టిన వారికి రూ.18 వేలు జరిమానా
చేవెళ్ల: డీజే సౌండ్లతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చేవెళ్ల ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఈనెల 4న చేవెళ్లకు చెందిన నాయక్ తన ఇంట్లో చిన్న విందు ఉండగా డీజే పెట్టించాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా సౌండ్లతో హోరెత్తించడంతో భరించలేని చుట్టుపక్కల వారు 100 డయల్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో నాయక్తో పాటు డీజే అపరేటర్ హరీశ్వర్, డీజే ఓనర్ శివపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం వారిని న్యామూర్తి డి.ధీరజ్కుమార్ ఎదుట హాజరుపర్చగా ముగ్గురికీ కలిపి రూ.18 వేలు జరిమానా విధించారు. ఒక్కొక్కరు రూ.6 చొప్పున ఫైన్ చెల్లించాలని లేదంటే ఏడు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు. చిన్నారిపై వీధికుక్కల దాడి అంబర్పేట: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి గోల్నాక కమలనగర్లో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే లక్ష్మణ్, మమతల కుమార్తె శ్రీలక్ష్మి (19 నెలలు) శుక్రవారం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే సమయంలో అటుగా వచ్చిన వీధికుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. -
ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం
కేశంపేట: అమెరికాలో మృతి చెందిన విద్యార్థి ప్రవీణ్కుమార్ మృతదేహానికి భారతకాలమానం ప్రకారం గురువారం అక్కడి అధికారులు పోస్టుమార్టం పూర్తిచేశారు. మృతుడి తలలోని బుల్లెట్ను తొలగించి, మృతదేహాన్ని తానా సభ్యులకు అప్పగించగా, వారు ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తానా సభ్యులకు అప్పగించినట్లు సమాచారం ఇండియా పంపేందుకు ఏర్పాట్లు మృతుడి తల్లిదండ్రులకు పలువురి పరామర్శసెక్రటేరియట్ నుంచి వివరాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేసిన అధికారులు రాఘవులుతో మాట్లాడారు. మృతదేహాన్ని తెప్పించేందుకు ప్రవీణ్ వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆన్లైన్లో వివరాలు పంపించారు. కేటీఆర్ పరామర్శ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ప్రవీణ్ తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. కేశంపేటలో మృతుడి తల్లిదండ్రులు రాఘవులు, రమాదేవిని కలిసిన ఆ పార్టీ నేతలు ఎల్గనమోని రవీందర్యాదవ్, మురళీధర్రెడ్డి, నర్సింగ్రావు తదితరులు కేటీఆర్తో ఫోన్ మాట్లాడించారు. బాధితులను ఓదార్చిన ఆయన ప్రవీణ్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
అంగన్వాడీల్లో అక్రమాలకు చెక్!
హుడాకాంప్లెక్స్: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకులు, లబ్ధిదారుల జాబితాను మరింత పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తోంది. ప్రత్యేక ఆన్లైన్ యాప్ను తయారు చేసి, అర్హుల ముఖ చిత్రాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో బాలామృతం, కోడిగుడ్లను సరఫరా చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వీటిని అందించాలని ప్రత్యే యాప్ను రూపొందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి ముఖ చిత్రాలను తీసి రికార్డు చేస్తున్నాం. – శోభాలత, అంగన్వాడీ టీచర్, సరూర్నగర్ సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక యాప్ అర్హుల ముఖ చిత్రాల నమోదు ఈనెల నుంచే అమలులోకిఅందించేవి ఇవే.. జిల్లాలో 1,600 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, మరో ఏడు ఐసీడీఎస్ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 1,16,142 మంది చిన్నారులు సహా 24,432 మంది గర్భిణులు, బాలింతలు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా కేంద్రాలకు వచ్చే నిరుపేద పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం అందజేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు నెలకు 2.50 కిలోల బాలామృతం సహా రోజుకు ఒక గుడ్డును అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పుతో భోజనం వడ్డిస్తున్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు 50 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పుతో భోజనం వడ్డిస్తున్నారు. తొలి దశలో టీహెచ్ఆర్ లబ్ధిదారులకు.. అంగన్వాడీ కేంద్రాలకు రాని వాళ్లకు టీహెచ్ఆర్ (టేక్ హోం రేషన్) అందిస్తున్నారు. మెజార్టీ అంగన్వాడీల్లో ఈ సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెట్టి, పారదర్శకతకు పెద్దపీట వేయడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో టీహెచ్ఆర్ లబ్ధిదారుల ముఖ చిత్రాలు నమోదు చేయాలని నిర్ణయించి, ఈ మేరకు ఈనెల నుంచి అమలు చేస్తోంది. చిన్నారుల తల్లుల ముఖ చిత్రం సహా ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ యాప్లో నమోదు చేస్తున్నారు. సరుకులు తీసుకున్న వెంటనే ఫోన్కు మెసేజ్ వస్తోంది. -
మహా నగర విస్తరణకు ఓకే
సాక్షి, సిటీబ్యూరో: మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది. ● హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్షిప్పుల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్ధత నెలకొన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా. ఔటర్రింగ్రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్గా, ఔటర్రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం ద్వారా నల్లగొండ, నాగర్కర్నూల్, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ వరకూ హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం -
జీహెచ్ఎంసీ టార్గెట్ 68,478 గ్రూపులు
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే వివిధ బాధ్యతలతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ యూసీడీ విభాగానికి మున్సిపల్ పరిపాలన శాఖ మరో పెద్ద బాధ్యత అప్పగించింది. కాగా.. ఇప్పటికే తమ విభాగం చేయాల్సిన పనులు సజావుగా ముందుకు సాగకుండా.. కుటుంబ సర్వే, రేషన్ కార్డుల సర్వేతో సహా స్ట్రీట్ వెండర్ల ఇబ్బందుల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాలకు జనసమీకరణ.. ఇలా ఎన్నో పనులను అప్పజెప్పుతుండటంతో.. వాటిని పూర్తి చేయలేక ఆ విభాగం సతమతవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మహిళాశక్తి క్యాంటీన్ ఏర్పాటుతో పాటు ఇతరత్రా బాధ్యతలను అప్పగించారు. కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తుండటంతో మహిళా దినోత్సవం నుంచి వారికి సంబంధించిన కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాలని బల్దియా భావిస్తోంది. సెల్ఫ్హెల్ప్ గ్రూపులనూ భారీ సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం దాదాపు 50 వేల సెల్ఫ్హెల్ప్ గ్రూపుల్లో దాదాపు 5 లక్షల మంది సభ్యులున్నారు. బీపీఎల్ పరిధిలోకొచ్చే పేద మహిళల్లో ఇంకా గ్రూపు సభ్యులు కాని వారిని గుర్తించి 68,478 గ్రూపులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంటే.. ప్రస్తుతమున్న గ్రూపుల కంటే ఇంకా ఎక్కువ గ్రూపుల్ని ఏర్పాటు చేయాలన్న మాట. ● మహిళా ఓటర్ల లెక్కలు, గ్రూపుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు తదితరాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీలో ఇన్ని గ్రూపుల ఏర్పాటు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో సగం గ్రూపుల్ని ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేసి మిగతా సగం గ్రూపుల్ని జూన్ వరకు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకుగాను ప్రతి మంగళవారం వార్డుల్లోని బస్తీల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ బోర్డు, శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పురపాలికల్లోనూ కొత్త గ్రూపుల్ని ఏర్పాటు చేయాల్సిందిగా టార్గెట్లను విధించింది. మేడ్చల్ జిల్లా పరిధిలో.. గుండ్ల పోచంపల్లి (36), పోచారం (68), తూంకుంట (4), జవహర్నగర్(301), ఘట్కేసర్ (60), కొంపల్లి (121), దమ్మాయిగూడ(255), నిజాంపేట (1214), బోడుప్పల్ (254), దుండిగల్ (38), నాగారం(155), మేడ్చల్ (96), పీర్జాదిగూడ (314). రంగారెడ్డి జిల్లా పరిధిలో.. బండ్లగూడ జాగీర్ (528), మీర్పేట (583), మణికొండ(493), శంషాబాద్ (130), నార్సింగి (61), తుర్కయాంజాల్ (123), బడంగ్పేట (502), పెద్దఅంబర్పేట (162), ఆదిభట్ల (11), తుక్కుగూడ (14), జల్పల్లి (511), ఇబ్రహీం పట్నం (20), కొత్తూరు (7). కొత్తగా ‘సెల్ఫ్హెల్ప్’ కోసం.. మహిళా దినోత్సవం నేపథ్యంలో.. ఏర్పాటు చేయాల్సిన గ్రూపుల లక్ష్యం ఇలా.. జీహెచ్ఎంసీ: 68,478 కంటోన్మెంట్ బోర్డు: 1845 -
చెరువుల అభివృద్ధికి నిధులు అందించాలి
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో చెరువుల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని, వాటికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు సుందరీకరణకు కార్పొరేట్ సంస్థలు సీఎస్సార్ నిధులు అందించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. గురువారం నానక్రామ్గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు నెక్నాంపూర్లో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువును ఆయన పరిశీలించారు. ఖాజాగూడ చెరువు అభివృద్ధికి ఆటంకంగా మారిన అంశాలను ఆ పనులు చేపట్టిన ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రా, దివ్యశ్రీ ఇన్ఫ్రా సంస్థల ప్రతినిధులు రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఆయా చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా కాలువల మళ్లింపు పనులు చేపట్టాలని సూచించారు. పర్యాటకుల్ని ఆకర్షించేలా చెరువుల పరిసరాలను సుందరీకరించాలని, ఈ క్రతువులో పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా భాగస్వామ్యం కావాలని తన వెంట ఉన్న ఈ శాఖ ఏజీఎం వరప్రసాద్కు రంగనాథ్ సూచించారు. నెక్నాంపూర్లోని ఇబ్రహీంబాగ్ చెరువు ఆక్రమణల్ని ఇటీవలే తొలగించామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఒకప్పుడు దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువు, ఫిలింనగర్ చెరువుల నుంచి వరద నీరు ఇబ్రహీంబాగ్ చెరువుకు చేరేదని స్థానికులు అఽధికారులకు తెలిపారు. నివాస ప్రాంతాలు పెరిగిపోవడంతో చెరువులు, మురుగుతో నిండిపోయాయన్నారు. 88 ఎకరాలకు పైగా ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువు చుట్టూ తిరిగిన రంగనాథ్ స్థానికులతో మాట్లాడారు. -
నిరుపేద కుటుంబానికి తీరని కష్టం
కొందుర్గు: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి తీరని కష్టమొచ్చింది. రోజంతా కూలి పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితిలో విధి చిన్నచూపు చూసింది. ఇందుకు సంబంధించి బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం ఆగిర్యాలకు చెందిన బేగరి నవనీత, ఆంజనేయులు దంపతులకు ఐదేళ్లలోపున్న లక్కీ, చింటూ ఇద్దరు కుమారులు సంతానం. వ్యవసాయ భూమి లేకపోవడంతో భార్యాలిద్దరూ నిత్యం కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. రోజూమాదిరిగానే ఆంజనేయులు గత ఫిబ్రవరి 18న వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో ఓ ఇంటికి రంగులు వేయడానికి కూలికి వెళ్లాడు. పని చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని 108 అంబులెన్స్లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులు రెండు చేతులకు తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో మరుసటి రోజైన 19న అతని రెంతు చేతులను మోచేతి వరకూ తొలగించారు. మరో మూడు రోజుల తర్వాత కాళ్లకు కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో కుడి కాలును తొలగించారు. ఎడమ కాలి వేళ్లు తీసేశారు. రెండు రోజుల క్రితం కుడి చేయిని భుజం వరకు తొలగించారు. ప్రస్తుతం ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ ఎక్కువైందని, కాలును తీసేయకపోతే శరీరం మొత్తం విషం పాకుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నవనీత ఆస్పత్రిలోనే ఉంటూ అతనికి సపర్యలు చేస్తోంది. అక్కడే ఉన్న ఇద్దరు చిన్నారులు సైతం తండ్రి పరిస్థితిని చూసి రోదిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఆస్పత్రిలో పెడుతున్న ఆహారంతో పాటు ఇతర పేషెంట్లను చూసేందుకు వచ్చిన వారు ఇస్తున్న ఆహార పదార్థాలు తింటూ కాలం వెల్లదీస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక నవనీత గుండెలు బాదుకుంటోంది. ప్రభుత్వ చేయూతతో పాటు దాతల సాయం కోసం అర్థిస్తోంది. కూలి పనులకు వెళ్లి విద్యుత్ షాక్కు గురైన వ్యక్తి ఇన్ఫెక్షన్ సోకడంతో రెండు చేతులూ, కుడి కాలు తొలగింపు ఎడమ కాలిని సైతం తీసేయాలని చెబుతున్న వైద్యులు దిక్కుతోచని స్థితిలో కుటుంబసభ్యలు ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురుచూపు -
హీరో నాగార్జున పరువునష్టం కేసు వాయిదా
సిటీ కోర్టులు: రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతోపాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. సినీ అగ్రహీరో నాగార్జున కుమారుడైన హీరో నాగాచైతన్య–సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె చేసిన వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబంపై అసాధారణమైన వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేయగా గత విచారణలో ఆమె వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీంతో కొండా సురేఖ వ్యక్తిగత బాండ్తోపాటు రూ.10 వేలు పూచీకత్తు కోర్టులో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అయితే గురువారం జరిగిన విచారణకు ఆమె హాజరుకాకపోవడమే కాకుండా పూచీకత్తులు కూడా దాఖలు చేయలేదు. వచ్చే వాయిదా లోపు పూచీకత్తులు దాఖలు చేసుకోవాలని కొండ సురేఖ తరుఫు న్యాయవాదికి కోర్టు సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున గైర్హాజరు విచారణ మార్చి 12కు వాయిదా -
క్రీడలతో శారీరక దారుఢ్యం
మొయినాబాద్రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు స్నేహ బంధాలు పెంపొందుతాయని ఇండియన్ కబడ్డీ ప్లేయర్ గంగాధరి మల్లేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని జేబీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యాసంస్థల కార్యదర్శి కృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణామాచారి, డైరెక్టర్ సంజయ్, డీన్ క్రటిజ్ఞాన్, స్టూడెంట్ ఎంపైర్స్ డాక్టర్ సలావుద్దీన్, ఫిజికల్ డైరెక్టర్ విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ కబడ్డీ ప్లేయర్ మల్లేశ్ -
ఆమోదం
అగ్నికి ఆహుతైన కంది ఓ రైతు వేసిన కంది పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండలం కొండన్నగూడలో చోటు చేసుకుంది.అద్భుత నగరికి శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 20258లోuఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుసాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ పేరుతో మరో అద్భుత నగరం ఆవిష్కరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపిపంది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా కొత్త గా ఏర్పాటు చేసే ఎఫ్డీసీఏలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది. ఫ్యూచర్సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను సృష్టించడమే కాకుండా, వాటి భర్తీకి ఆమోదం కూడా తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించతలపెట్టిన 300 ఫీట్ల గ్రీన్ఫీల్డ్ (రతన్టాటా) రోడ్డుకు భూసేకరణ చేపట్టింది. తొలి దశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు కేటాయించింది. అదే విధంగా రెండో విడతలో 22.30 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రూ.2,365 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఫ్యూచర్ సిటీ స్వరూపం ఇలా..న్యూస్రీల్ ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలు కొత్తగా 90 పోస్టులు సృష్టి మంత్రిమండలి ఆమోదం -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
జగద్గిరిగుట్ట: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ కు చెందిన రాజు (40) ఆస్ బెస్టాస్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన రాజు నెల రోజులుగా పనికి వెళ్లడం లేదు. గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న అతను సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాండూరు ఇన్చార్జ్ డీఎల్పీఓగా రతన్సింగ్ తాండూరు రూరల్: తాండూరు డివిజన్ ఇన్చార్జ్ డీఎల్పీఓగా రతన్సింగ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన శంకర్నాయక్ నల్లొండ జిల్లా దేవరకొండకు బదిలీపై వెళ్లారు. దీంతో పెద్దేముల్ ఎంపీఓగా పని చేస్తున్న రతన్సింగ్ తాండూరులోని డీఎల్పీఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఎంపీడీఓ విశ్వప్రసాద్ సన్మానించారు. -
దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలు
కొడంగల్ రూరల్: బాటసారుల దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలని తహసీల్దార్ విజయకుమార్ పేర్కొన్నారు. పెరుగుతున్న ఎండలకు బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ విజయకుమార్ తెలిపారు. గురువారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బందితో కలిసి చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బాటసారులకు చలివేంద్రాలు కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. వడ దెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవె న్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.తహసీల్దార్ విజయకుమార్ -
అగ్నికి ఆహుతైన కంది పంట
షాద్నగర్: ఓ రైతు వేసిన కంది పంట అగ్నికి ఆహుతయింది. ఈ ఘటన గురువారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కొండన్నగూడలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పాపయ్య యాదవ్ తన వ్యవసాయ పొలంలో నాలుగు ఎకరాల్లో కంది పంట వేశాడు. పక్క పొలంలో రైతు పొలాన్ని చదును చేసి వ్యర్థాలకు నిప్పటించాడు. అగ్గి రవ్వలు ఎగిసి పడి కందిపంటకు నిప్పంటుకుంది. గమనించిన రైతులు మంటలార్పేందుకు యత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పంటమొత్తం అగ్నికి ఆహుతయింది. దీంతో సుమారు రూ.1.50లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. -
పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
మైలార్దేవ్పల్లి: ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ పైడి నాయుడు సమాచారం మేరకు... బాగ్లింగంపల్లి ప్రాంతానికి చెందిన సోను(21) డిగ్రీ చదువుతున్నాడు. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీ, బృందావన్ కాలనీకి చెందిన అంబిక(21) ఎల్ఎల్బీ చదువుతుంది. ఇద్దరు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ప్రియడిని కాదనండంతో మనస్థాపానికి గురై గురువారం ప్రియురాలు ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఈ సమయంలో తన వెంట తెచ్చుకున్న బ్లెడ్తో కోసుకొని ఫ్లోర్ క్లీనర్ను తాగాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. బిల్డింగ్ మొదటి అంతస్తు ఎక్కి దూకుతానని హల్చల్ -
ఔటర్పై ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. రావిర్యాల వండర్లా సమీపంలోని ఎగ్జిట్ నంబరు 13 దాటిన అనంతరం 200 మీటర్ల దూరంలో డివైడర్పై ఉన్న మొక్కలకు హెచ్ఏండీఏ ట్యాంకర్ ద్వారా కొంగరకలాన్కు చెందిన చెనమోని రాములు (55) నీళ్లు పోస్తున్నాడు. ఉప్పల్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఘట్కేసర్ వద్ద ఔటర్ ఎక్కిన నాగర్కర్నూల్ జిల్లా, చిన్నాంబాయి మండలం బెక్కం గ్రామానికి చెందిన కోషిక రవీందర్రెడ్డి, బత్తిని కృష్ణారెడ్డి (టీఎస్07జెఎం 1210) కారులో అతివేగంగా వెనుక నుంచి వచ్చి ట్యాంకర్తో నీరు పోస్తున్న రాములును ఢీకొట్టారు. దీంతో అతడు గాల్లో ఎగిరి డివైడర్పై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కారు.. ట్యాంకర్ వెనుకభాగం కిందికి దూసుకెళ్లింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న కోషిక రవీందర్రెడ్డి (50) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారు నడుపుతున్న బత్తిని కృష్ణారెడ్డి (45) పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120– 140 స్పీడ్లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ట్యాంకర్ కిందికి దూసుకెళ్లడంతో రవీందర్రెడ్డి మృతదేహంతో పాటు కృష్ణారెడ్డిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సీఐ రాఘవేందర్రెడ్డితో పాటు ఎస్ఐ వెంకటేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వచ్చి ట్యాంకర్ను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం మరొకరి పరిస్థితి విషమంఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదానికి గురైన కృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. కృష్ణారెడ్డి కొండాపూర్లో ఉంటూ స్వీట్ షాప్ నిర్వహిస్తుండగా, రవీందర్రెడ్డి బోరబండలో ఉండేవాడు. వీరి మృతితో బెక్కంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూలి కోసం వెళితే.. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన రాములు ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు . -
యాసంగి సీజన్కు యూరియా కొరత లేదు
కందుకూరు: యాసంగి సీజన్కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, ఇతర ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆయన ఏఓ లావణ్యతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఎంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలాఖరు వరకు యూరియా డిమాండ్ ఉన్నందున దానికి అనుగుణంగా నిల్వలను తెప్పించుకోవాలని ఏఓకు సూచించాచారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు నిల్వలను చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు కృషి చేయాలి ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అప్పుడే వారిలో సృజనాత్మకత పెంపొందుతుందని ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాతీయ స్థాయి సాంకేతిక, క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం, ఆవిష్కరణలు వెలికితీయటానికి అవకాశం ఉంటుందన్నారు. యువత క్రమశిక్షణతో కూడిన విలువైన విద్యను అభ్యసించాలని తెలిపారు. వివిధ కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆవిష్కరణలు, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, సెక్రెటరీ నవీన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ నబి, ఏఓ డాక్టర్ సుధీర్రెడ్డి, కన్వీనర్ సురేష్, కో కన్వీనర్లు డాక్టర్ జయరాం, డాక్టర్ రమేష్బాబు, డాక్టర్ మధు, డాక్టర్ హరిబాబు, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి మీర్పేట: సమస్యాత్మక ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు అన్నారు. మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని నందనవనం వద్ద గురువారం చేపట్టిన విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో కమిషనర్ స్వయంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి స్పందన అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రల ద్వారా నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగించే సాంకేతిక పరికరం పాప్లాన్ను ఆయన పరీక్షించారు. అనంతరం నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలు, రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ పనితీరుపై ఆరా తీశారు. సీసీటీవీల నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, శాంతి భద్రతల నిర్వహణకు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐలకు సూచించారు. సీపీ వెంట వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి ఉన్నారు. రేపు ఉచిత వైద్య శిబిరం చేవెళ్ల: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో ఉచిత రొమ్ము, సైర్వెకల్ కేన్సర్ స్క్రీనింగ్ ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో మమ్మోగ్రామ్, పాప్ స్మియర్ టెస్టులు ఉచితంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
అదుపు తప్పి కారు బోల్తా
కొడంగల్ రూరల్: మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలైన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన ఆరుగురు వ్యక్తులు మహబూబ్నగర్లో జరిగే పెళ్లి కోసం గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. పర్సాపూర్ సమీపంలో ఓ మలుపు దగ్గర ఇన్నోవా కారు అదుపుతప్పి రోడ్డు కింది భాగంలోకి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు సలహా మేరకు తాండూర్ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఇద్దరికి గాయాలు -
ఎలుకల సమస్య ఉండొద్దు
ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: పాఠశాలలో ఎలుకల సమస్య ఉండరాదని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సిబ్బందికి సూచించారు. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయమై గురువారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పిల్లల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఎలుకలు ఉండడానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటే సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, నాయకులు, పాఠశాల సిబ్బంది నాగిరెడ్డి, ప్రశాంత్గౌడ్, సుధాకర్రెడ్డి, రాజ్శేఖర్రెడ్డి, ఖదీర్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముద్ర లోన్ పేరిట మోసం
యాచారం: ఇటీవల అపరచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్కాల్స్, మెసేజ్లకు స్పందిస్తూ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.5లక్షల ముద్రలోన్ మంజూరైందని చెప్పిన వెంటనే బాధితుడు అపరిచిత వ్యక్తిన చెప్పిన విధంగా విడతల వారీగా రూ.45,490 పంపించాడు. ఆతరువాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి గురువారం యాచారం పోలీసులను ఆశ్రయించాడు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గునుగల్ గ్రామానికి చెందిన రామన్నకు ఈ నెల 4న అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. నీకు రూ.5 లక్షల ముద్రలోన్ మంజూరైందని తాను పంపే స్కానర్కు రూ.50వేలు పంపించాలని రామన్న వాట్సాప్కు స్కానర్ పంపించాడు. దీంతో విడతల వారీగా రూ.45,490 పంపాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. సివిల్సప్లై అధికారుల ఆకస్మిక దాడులు రేషన్ దుకాణం సీజ్ శంకర్పల్లి: మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ రేషన్ దుకాణంపై గురువారం సివిల్సప్లై అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. యాదయ్యగౌడ్ నిర్వహిస్తున్న రేషన్ దుకాణంలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలున్నాయని.. వీటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడని పలువురు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన సివిల్సప్లై అధికారులు ఆకస్మికంగా దాడి చేసి దుకాణం సీజ్ చేశారు. ఎన్ని క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంచారో శుక్రవారం లెక్కించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ సురేందర్ను వివరణ కోరగా సివిల్ సప్లై అధికారుల ఆదేశాల మేరకు రేషన్ దుకాణం వద్దకు ఆర్ఐను పంపామన్నారు. బిర్యానీ సెంటర్లో మంటలు షాబాద్: ప్రమాదవశాత్తు ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లో మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని, చుట్టు పక్కల వారు నీరు పోసి మంటలార్పారు. అప్పటికే హోటల్లోని సామగ్రి కాలిబూడిదైంది. దూరదర్శన్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కన్నుమూత లక్డీకాపూల్: దూరదర్శన్ మాజీ డైరెక్టర్ దేవళ్ల.బాలకృష్ణ ( 92) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం సంచాలకుడిగా పని చేయక ముందు ఆయన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ఆకాశవాణి , దూరదర్శన్ కార్యక్రమ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్ అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శుక్రవారం ఉదయం అంబర్పేట శ్మశానవాటికలో బాలకృష్ణ అంత్యక్రియులు నిర్వహించనున్నట్లు ఆయన బంధువు సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్కు ఊరట మూడు కేసులను కొట్టివేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సిటీ కోర్టు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై నమోదైన మూడు కేసులను కొట్టివేస్తున్నట్లు నాంపల్లి లోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీరామనవమి ర్యాలీ, గత ఎన్నికల్లో చేపట్టిన ప్రచార ర్యాలీల సందర్భంగా సిటీలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని, దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సోషల్ మీడియాలో తప్పుడు స్పీచ్లు ఇచ్చారని ఆయనపై పలువురు సిటీలోని ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా రాజాసింగ్ తరుఫు న్యాయవాది కరుణసాగర్ గతవారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు వినిపించారు. పోలీసుల తరుఫున అదనపు పబ్లిక్ ప్రాసీక్యూటర్ ఆర్.శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీంతో గురువారం చేపట్టిన విచారణలో రాజాసింగ్ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయనపై నమోదైన మూడు కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
మణికొండ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగానే నేరాలు, కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఏకంగా సంవత్సరానికి దాదాపు 2 వేల కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందులో ఎక్కువగా భార్యాభర్తల తగాదాలతో పాటు ఆర్థిక, సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగుల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. జనాభాకు అనుగుణంగా ఇప్పటికే నార్సింగి కేంద్రంగా ఏసీపీ డివిజన్ను ఏర్పాటు చేశారు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న జన్వాడ, మిర్జాగూడలను కొత్తగా వచ్చిన మోకిల స్టేషన్ పరిధిలోకి మార్చారు. ప్రస్తుత నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఒకటి, పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలోని కొంత భాగంతో ఐటీ జోన్ కేంద్రంగా మరో కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ● కోకాపేట నియోపోలీస్లో శరవేగంగా నిర్మాణాలు, ఐటీ సంస్థలు వస్తుండటంతో జనాభా పెరిగిపోతుంది. అనేక రాష్ట్రాల వారే కాకుండ ఇతర దేశాల వారు సైతం వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో కొత్తగా కోకాపేట పేరుతో పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ● పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలో ఔటర్ రింగ్ అవతలి ఐటీ జోన్ను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ఓ పోలీస్ స్టేషన్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితో పాటు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బండ్లగూడ పోలీస్స్టేషన్, అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సులేమాన్నగర్ కేంద్రంగా మరో పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. ● దాంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కొత్తగా మరో నాలుగు పోలీస్స్టేషన్లు రాబోయే బడ్జెట్లో మంజూరు అయ్యే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ● ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ఉన్న ఔట్పోస్టును పూర్తి స్థాయి పోలీస్స్టేషన్గా ప్రకటించి ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి త్వరలోనే మరిన్ని పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మారనున్న పరిధి ● నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న కోకాపేట, గండిపేట, ఖానాపూర్ గ్రామాలు కొత్తగా వచ్చే కోకాపేట పోలీస్స్టేషన్ పరిధిలోకి తేనున్నట్టు సమాచారం. గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న వట్టినాగులపల్లి, నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడ ఐటీ జోన్ ప్రాంతంతో కలిపి గౌలిదొడ్డి, సైబరాబాద్ ఐటీ జోన్ పోలీస్స్టేషన్ పేరుతో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఇక నార్సింగి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, హిమాయత్సాగర్లతో బండ్లగూడ కేంద్రంగా మరో పోలీస్స్టేషన్ ఏర్పాటు కానుంది. ● అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న సులేమాన్నగర్, శాస్త్రీపురం డివిజన్లను కలిపి కొత్త పోలీస్స్టేషన్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. త్వరలోనే కొత్తగా పోలీస్ సిబ్బంది నియామకం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుందని, అందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరో నాలుగు పోలీస్స్టేషన్లఏర్పాటుకు సన్నద్ధం ప్రభుత్వానికి ప్రతిపాదించినపోలీసు ఉన్నతాధికారులు వచ్చే బడ్జెట్లో మంజూరుకు సన్నాహాలు జూన్ వరకు ఏర్పాటుకు రంగం సిద్ధం? -
‘చెత్తవేస్తే ఈ–చలాన్’పై అధికారులకు శిక్షణ
సాక్షి,సిటీబ్యూరో: ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ.. కూల్చివేతల(సీఅండ్డీ) వ్యర్థాలు వేసేవారిని గుర్తించి ఈ–చలాన్ ద్వారా పెనాల్టీలు విధించి, యూపీఐ ద్వారా వసూలు చేసేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ సంబంధిత ఏఎంఓహెచ్లు, డీఈఈలు, ఏసీపీలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్, ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ వారికి శిక్షణ ఇచ్చారు. ఈ–చలాన్ విధించేందుకు టీసీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన విధానాన్ని, యాప్ను కాంప్రహెన్సివ్ చలాన్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీసీఎంఎస్) యాప్గా వ్యవహరిస్తున్నారు. వారితోపాటు యాప్ను నిర్వహించే టీజీ ఆన్లైన్ ప్రతినిధులు యాప్ ఎలా పనిచేస్తుందో, ఎలా వాడాలో వివరించారు. తొలుత పైలట్గా చెత్త డబ్బాల్లో కాకుండా బయట చెత్తవేసే వాణిజ్య ప్రాంతాల్లోని వ్యాపారులు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నవారు, సీఅండ్డీ వేస్ట్ వేస్తున్న వారికి పెనాల్టీలు విధించాలని సూచించారు. సంబంధిత అధికారులు జారీ అయిన చలాన్లు, చెల్లింపులు జరిగినవి, పెండింగ్లో ఉన్నవి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చునన్నారు. చెత్త వేసేవారికి ఎస్ఎంఎస్ వెళ్తుందని, స్వచ్ఛ నిబంధనలు ఉల్లంఘించి వేసిన వ్యర్థాల ఫొటో అక్షాంక్ష, రేఖాంశలతో వస్తుందన్నారు. దేనికి ఎంత పెనాల్టీయో సాఫ్ట్వేర్లోనే పొందుపరిచి ఉంటుందని వారు వివరించారు. -
మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ
చిలకలగూడ: మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అనుదీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మహ్మద్గూడ, శ్రీనివాసనగర్ ప్రాంతాలకు చెందిన పాస్టం నగేష్ (25), నర్సింగ్, శబరి, సాయికిరణ్ స్నేహితులు. నగేష్ శుభకార్యాల్లో బ్యాండ్ వాయించేవాడు. ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి మహ్మద్గూడలోని ఓ ఫంక్షన్కు వెళ్లిన అతను రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. అదే సమయంలో స్నేహితుల నుంచి ఫోన్ రావడంతో పది నిమిషాల్లో వస్తానని చెప్పి బయటికి వెళ్లిన అతను తన స్నేహితులు నగేష్, నర్సింగ్, శబరి, సాయికిరణ్తో కలిసి పార్శిగుట్టలోని ఓ వైన్షాపు వద్ద మద్యం తాగారు. వైన్షాపు మూసివేసే సమయంలో మరికొంత మద్యాన్ని కొనుగోలు చేసి మహ్మద్గూడలోని ముత్యాలమ్మ ఆలయం వద్దకు వచ్చిన వారు మద్యంతో పాటు గంజాయి సేవించారు. ఈ క్రమంలో పచ్చబొట్టు విషయమై నగేష్, శబరి మధ్య గొడవ జరగడంతో నర్సింగ్ కలుగజేసుకున్నాడు. దీంతో వారు ఒకరినొకరు దూషించుకుంటు గల్లాలు పట్టుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో నర్సింగ్ చేతికి అందిన కర్రతో నగేష్పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో శబరి, సాయికిరణ్ అపస్మారకస్థితిలో పడి ఉన్న నగేష్ను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిందితుడు నర్సింగ్, మృతుడు నగేష్ బంధువులు కావడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నర్సింగ్తోపాటు మిత్రులు శబరి, సాయికిరణ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఒకరి మృతి పది నిమిషాల్లో వస్తానని చెప్పి..తిరిగిరాని లోకాలకు.. -
సద్దుమణిగిన గోశాల వివాదం
మీర్పేట: జిల్లెలగూడలోని మత్స్యావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలోని గోశాల వివాదం సద్దుమణిగింది. గోపాలకృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఆలయంలో గోశాల నిర్వహిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలు ఆలయ అధికారులకు తెలపకపోవడంతో గోశాలను తిరిగి అప్పగించాలని అధికారులు, మాజీ ధర్మకర్తలు పలుమార్లు కోరినా ఆయన నిరాకరించాడు. దీంతో బుధవారం గోపాలకృష్ణ, అతనికి మద్దతుగా స్థానిక బీజేపీ నాయకులు ఆలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోశాలను తిరిగి అప్పగిస్తున్నట్లు గోపాలకృష్ణ ఒప్పంద పత్రం ఇవ్వడంతో వివాదం సమసింది. -
ఊడ్చిన నిధులెన్నో ?
రెండు నెలల్లోనే రూ.6 లక్షల పెనాల్టీలుసాక్షి, సిటీబ్యూరో: ప్రజల నుంచి వివిధ పన్నుల రూపాల్లో వసూలు చేస్తున్న సొమ్మును జీహెచ్ఎంసీ కొందరు బడా కాంట్రాక్టర్ల పాల్జేస్తున్న వైనమిది. ఏళ్ల తరబడి ఎన్ని కోట్లు వారికి ధారాదత్తం చేశారో కానీ.. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో సదరు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్న స్వీపింగ్ మెషీన్ల పనితీరు బట్టబయలవుతోంది. ప్రధాన రహదారులను శుభ్రపరిచేందుకు జీహెచ్ఎంసీ అద్దె ప్రాతిపదిక స్వీపింగ్ మెషీన్లను నిర్వహిస్తోంది. వాటి కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు ఊడ్చాల్సినంత దూరం ఊడ్చకుండానే, శుభ్రం చేయాల్సిన మేర రోడ్లను శుభ్రం చేయకుండానే ఏడెనిమిదేళ్ల క్రితం రూ.30 కోట్ల నుంచి మొదలు పెట్టి ప్రస్తుతం ఏటా దాదాపు రూ. 47 కోట్లు జీహెచ్ఎంసీ నుంచి పొందుతున్నారు. కానీ.. ఒప్పందం మేరకు పనులు చేయకుండా పైకి కనిపించేందుకు మాత్రమే రోడ్లపై స్వీపింగ్ మెషీన్ల వాహనాలను తిప్పుతూ తూతూమంత్రంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాటి పని తీరుపై అనుమానం వచ్చిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సైతం తనిఖీలు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించిన నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీలతో వాటి పనితీరు బట్టబయలవుతోంది. 2 నెలలు.. రూ.6 లక్షల పెనాల్టీలు ఈ సంవత్సరం జనవరి నుంచి నిర్వహించిన తనిఖీల్లో రెండు నెలల్లోనే స్వీపింగ్ మెషీన్లు సరిగ్గా పని చేయకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.6 లక్షల పెనాల్టీలు విధించారు. పలుమార్లు హెచ్చరికల తర్వాత సైతం ఇంతటి ఉల్లంఘనలు జరిగాయంటే.. అంతకుముందు ఎలాంటి పట్టింపు లేని సమయంలో అసలు పనిచేశాయో, లేదో అంచనా వేసుకోవచ్చు. ఆ లెక్కన ఎన్ని కోట్లు కాంట్రాక్టర్ల పరమయ్యాయో ఊహించుకోవచ్చు. గత పాలక మండళ్లలోని కీలకస్థానాల్లో ఉన్న వారి వల్లే.. సదరు కాంట్రాక్టర్లకు ఆ పనుల దక్కాయనే ఆరోపణలు గుప్పుమన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. వాటి పనితీరునూ పట్టించుకోలేదు. తిలాపాపం.. తలా పిడికెడు స్వీపింగ్ మెషీన్ల పని తీరు, తనిఖీలు, వాటి బిల్లుల చెల్లింపులు జోన్ల స్థాయిలో జరుగుతున్నాయి. సంబంధిత సర్కిళ్ల డీసీలు, ఏఎంఓహెచ్ల పాత్ర కూడా చెల్లింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సరైన తనిఖీలు చేయకుండా, నిబంధనల ఉల్లంఘనలకు పెనాల్టీలు విధించకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క నిధులు చెల్లించారనే ఆరోపణలున్నాయి. కొన్ని సర్కిళ్లలో గత రెండునెలల్లోనూ ఎలాంటి పెనాల్టీలు లేకపోవడం విశేషం. అంటే.. ఆ సర్కిళ్లలో స్వీపింగ్ మెషీన్లు కచ్చితంగా పని చేస్తున్నాయో, లేక సంబంధిత తనిఖీల అధికారులు మిలాఖాత్ అయ్యారో వారికే తెలియాలి. 38 మెషీన్లు.. రూ.47 కోట్లు ప్రస్తుతం 38 స్వీపింగ్ మెషీన్లకు ఏటా దాదాపు రూ.47 కోట్లు చెల్లిస్తున్నారు. అయినా రోడ్లపై చెత్త ఉంటోంది. స్వీపింగ్ మెషీన్లతో ఊడిస్తే రోడ్లపై ఎలాంటి చెత్త కనిపించరాదు. కానీ.. పని చేయని చీపుర్లతో ఊడ్చాల్సినంత దూరం ఊడ్చకుండా మమ అనిపిస్తున్నారు. పేరుకు జీపీఎస్ ట్రాకింగ్ అయినా సిస్టమ్ సరిగ్గా లేదని భావించిన కమిషనర్ వాహనాలకు ముందు, వెనుక సీసీ కెమెరాలు అమర్చి పరిశీలించాల్సిందిగా ఆదేశించడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ చర్యలు ప్రారంభించినట్లు సంబంధిత విభాగం పేర్కొంది. రెండు నెలల్లో ఆయా సర్కిళ్లలో విధించిన పెనాల్టీలు సర్కిల్ పెనాల్టీ (రూపాయలు) శేరిలింగంపల్లి 3,80,000 మల్కాజిగిరి 64,000 రాజేంద్రనగర్ 85,000 ఉప్పల్ 25,000 కాప్రా 10,000 హయత్నగర్ 10,000 ఫలక్నుమా 10,000 కార్వాన్ 15,000 గోషామహల్ 11,000 అల్వాల్ 10,000 బట్టబయలవుతున్న స్వీపింగ్ యంత్రాల పని తీరు ఏళ్ల తరబడి దోచుకున్న ప్రజా ధనమెంతో? -
ఎల్ఆర్ఎస్ రాయితీపై ప్రచారం చేయండి
ఆస్తిపన్ను వసూలు టార్గెట్ చేరుకోవాలి ● అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పహాడీషరీఫ్: ఎల్ఆర్ఎస్ రాయితీ విషయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. బుధవారం ఆమె జల్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, టీపీఓ హబీబున్నీసాలతో పలువిషయాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్కు ఎన్నిదరఖాస్తులు వచ్చాయని ప్రశ్నించారు. ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వస్తుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని చెప్పారు. ఆస్తిపన్ను వసూలుకు 25 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో లక్ష్యాలను చేరుకునేలా బిల్కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సూచించారు. అనంతరం 2025–26 సంవత్సరానికి గాను రూ.36 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ జ్యోతి, అకౌంటెంట్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిశీలన జల్పల్లి మున్సిపాలిటీలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను బుధవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సందర్శించారు. షాహిన్నగర్లోని ఓ.ఎస్.జూనియర్ కళాశాల, గ్లోరీ జూనియర్ కళాశాలలకు విచ్చేసిన ఆమె ఆయా కేంద్రాల్లో వసతులను పరిశీలించారు. మాస్ కాపీయింగ్కు తావులేకుండా చూడాలని ఇన్విజిరేటర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల వద్ద వసతులు పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్కు సూచించారు. ట్రాఫిక్, ఇతర సమస్యలు లేకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
● అపురూప వేడుక
చరికొండ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. రుక్మిణీసత్యభామా సమేత గోవిందుడి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను బ్యాండు మేళాలతో గ్రామంలో ఊరేగించారు. వేదపండితులు చక్రవర్తి శ్రీనివాసచార్యులు, రామచార్యులు, కృష్ణమాచార్యుల బృందం వేదమంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు మహిళలు, భక్తులు భారీగా తరలివచ్చారు. డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మాజీ సర్పంచ్ నర్సింహ్మగౌడ్, మాజీ ఎంపీటీసీ పాలకూర్ల రాములుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. – కడ్తాల్