కనుల పండువగా శ్రీవారి కల్యాణం
పరిగి: పట్టణ కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు భక్తు లు అందించిన సహకారం మరువలేనిది అన్నా రు. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
కనుల పండువగా శ్రీవారి కల్యాణం


