షాద్నగర్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో గ్రీన్ ఎనర్జీ రీసోర్సెస్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఇండియా పేరుతో నల్లగొండలో శుక్రవారం జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు షాద్నగర్కు చెందిన అర్ధశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పర్యావరణ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అంశంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ సదస్సుకు దేశంలోని విఽవిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల ప్రొఫెసర్లు హాజరయ్యారు.


