డివిజన్లోని ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు ఇది సదావకాశం. రూ.వేలాది విలువ జేసే నాలుగు రకాల విత్తనాల ప్యాకెట్లను ఉచితంగా పొంది సాగును చేపట్టి, మంచి లాభాలు పొందండి. కూరగాయల సాగును పెంచేందుకు ఇబ్రహీంపట్నం డివిజన్లో 400 మంది రైతులకు పైగా లబ్ధి చేసేలా కృషి చేస్తున్నాం. విత్తనాలతో పాటు ట్రేలు, వర్మీ బెడ్స్, తేనెటీగల బాక్సులను అందజేస్తున్నాం. పూర్తి వివరాలకు 89777 14219 నంబరులో సంప్రదించండి.
– నవీన, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ
డివిజన్ అధికారి, ఇబ్రహీంపట్నం
●


