సంజీవయ్య ఆలయ ధర్మకర్త పార్థసారథి
పరిగి: దోమ మండలంలో సంజీవయ్య ఆలయ పరిరక్షణ కోసం తమ తాతముత్తాల నుంచి కాపాడుతూ వచ్చామని ధర్మకర్త పార్థసారథి పంతులు అన్నారు. సంజీవయ్య ఆలయ భూములపై బుధవారం పట్టణ కేంద్రంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్మాణం కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామన్నారు. సొంత ఖర్చులతో ఆలయం నిర్మిస్తామని చెబితే దేవాదాయ శాఖ ఒప్పుకోలేదన్నారు. తమ వందల ఎకరాల భూమి సీలింగ్లో పోయిందని, కానీ దేవాలయ భూములు తామే అన్యాక్రాంతం చేశామని కొందరూ అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. జనవరిలోనే దేవాలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుంచి అనుమతి వచ్చిందని, ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రారంభించలేదని చెప్పా రు. దేవాలయ పరిరక్షణ సమితి పేరుపై కొందరు చేస్తున్న దీక్షలు ఉత్తవేనని అది పరిరక్షణ సమితి కాదని భూ భక్షసమితి అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పరిగిలోని 383 సర్వే నంబర్లో 16 ఎకరాల భూమిలో 9 ఎకరాలు దేవాలయ భూమి ఉందన్నా రు. ఆ భూమి ఎలా మరిందనే విషయం తమకు తెలియదని తెలిపారు. భూములు అన్యాక్రాంతం అవుతుంటే తాను తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆలయం పేరుపై ఖాతాలో రూ.19లక్షలు జమ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, నాయకులు వెంకటేష్, శివకుమార్, చిన్ననర్సింహులు, ఆంజనేయులు, మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


