చామంతి పూలకు గిరాకీ అంతంత మాత్రమే ఉంది. మహారాష్ట్ర, బెంగళూరు నుంచి హైదరాబాద్ మార్కెట్కు పెద్ద మొత్తంలో పూలు దిగుమతి అవుతున్నాయి. దీంతో స్థానికంగా సాగు చేసిన రైతులకు సరైన ధర దక్కడం లేదు. ఎకరా పొలంలో తోట సాగు చేసేందుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చవుతోంది.
– గుంటం సైపాల్రెడ్డి, రైతు, అమ్డాపూర్
వాణిజ్య పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయనే ఆశతో పూల సాగు చేశా. ఇటీవల కురిసిన అకాల వర్షంతో తోటలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రకాల మందులు స్ప్రే చేశాం. దీనికి తోడు ధరలు లేకపోవడంతో పెట్టబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. కనీసం మొక్కలనైనా సబ్సిడీపై ఇవ్వాలి.
– భూపాల్రెడ్డి, కాశీంబౌలి, పూల రైతు


