షాద్నగారా మోగేదెవరిదో
షాద్నగర్: పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. పుర బరిలో ఎవరు నిలిచారన్నది ఖరారైంది. అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించడంతో, గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు గెలిచేదెవరో వేచి చూడాల్సిందే.
ఆరు రోజులు కీలకం
పురపాలిక ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఈనెల 9న సాయంత్రం ఐదుగంటలకు ప్రచారం ముగించాలి. ఈలెక్క మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అభ్యర్థులందరూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ కేండెట్లు..
1 వార్డు మహ్మద్ ఇర్ఫాన్, 2– బచ్చలి నరేష్, 3– ఆలోనిపల్లి రాజుగౌడ్, 4– చేగూరి పుష్పమ్మ, 5– సింగపాగ శిరీష, 6– రాజునాయక్, 7– కొప్పునూరి ప్రవీణ్, 8– జయప్రకాశ్గౌడ్, 9– గోద మాధవులు, 10– నడికూడ శ్రావణి, 11– గుడిపల్లి వినోద, 12– కలంకార్ దిలీప్, 13– రిజ్వాన్ బేగం, 14– అందెమోహన్, 15– మరియా బేగం, 16– వన్నాడ లావణ్య, 17– నాజియా బేగం, 18– సంతోషిబాయి, 19– ఆఫ్రీన్ బేగం, 20– డాకన్నగారి మనీష్, 21– నాగమణి, 22– దిద్యాల శోభ, 23– అగ్గునూరు బస్వం, 24– అగ్గునూరు విశాల, 25– పెంటయ్య, 26– జామ మంజుల, 27వ వార్డు మురళీమోహన్, 28వ వార్డు కాటం భాగ్యలక్ష్మి,
బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
1వ వార్డు గౌస్ జానీ, 2– చెట్ల నర్సింహ్మ, 3–నందారం అశోక్, 4– పాండురంగారెడ్డి, 5– అశ్విన్, 6– రాజేందర్సింగ్, 7– ఈశ్వర్ రాజు, 8– భిక్షపతి, 9– చేగూరి వేణుగోపాల్, 10– చెర్క అఖిల, 11– పిల్లి శారద, 12– ఎంఎస్ నట్రాజన్, 13– కొండ లక్ష్మి, 14– బచ్చలి నర్సింహ్మ, 15 కొందూటి మహేశ్వరి, 16– ఒగ్గు జయలక్ష్మి, 17– గౌసియా బేగం, 18– ప్రేమలత, 19– అల్ఫాబేగం, 20– పినమోని గోపాల్, 21– జీటీ వసంత, 22– నడికూడ అనిత, 23– ఈగ వెంకట్రాంరెడ్డి, 24– జయంతి, 25– నక్కల వెంకటేశ్, 26– ఎస్పీ శివ, 27– జూపల్లి శంకర్, 28వ వార్డు చేగూరి లక్ష్మీప్రసన్న.
నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తి
పార్టీ బీఫాంలు అందజేసిన అభ్యర్థులు
స్వతంత్ర అభ్యర్థులకు
గుర్తుల కేటాయింపు
ప్రచారానికి మిగిలింది ఆరు రోజులే
వ్యూహాలకు పదును పెడుతున్న నేతలు
షాద్నగారా మోగేదెవరిదో


