హక్కులు కల్పించండి | - | Sakshi
Sakshi News home page

హక్కులు కల్పించండి

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

హక్కులు కల్పించండి

హక్కులు కల్పించండి

హక్కులు కల్పించండి

యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములపై హక్కులు కల్పించి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని కౌలు రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో కౌలు రైతులు యాచారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఓంకారేశ్వరాలయ భూములను టీజీఐఐసీకి తీసుకోవడాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా సాగులో ఉన్నాం.. 37 ఏ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయని కౌలు రైతులు తెలిపారు. 38ఈ సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వకుండా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని యాచారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య, నస్దిక్‌సింగారం సర్పంచ్‌ బోడ కృష్ణ, కౌలు రైతులు పాల్గొన్నారు.

ఓంకారేశ్వరాలయ భూములకు పాసుపుస్తకాలు ఇవ్వాలి

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కౌలు రైతుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement