రసీదులు తప్పనిసరి
షాబాద్: రైతులకు కావాల్సిన యూరియా, నాణ్యమైన విత్తనాలు విక్రంచాలని షాబాద్ మండల వ్యవసాయశాఖ అధికారి దండెం విజయచంద్ర అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణాంలో యూరియా సేల్స్ రిజిస్టర్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలకు రసీదులు ఇవ్వాలన్నారు. ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి షాపు ముందు స్టాక్ బోర్డు పెట్టాలని, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. కాలంతీరిన పురుగు మందు, విత్తనాలు విక్రయించొద్దన్నారు.
రసీదులు తప్పనిసరి


