భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్‌గా ఎవరంటే? | Governors Transfers across india including telangana governor | Sakshi
Sakshi News home page

Governors Transfers: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఎవరంటే?

Mar 5 2026 11:00 PM | Updated on Mar 5 2026 11:23 PM

Governors Transfers across india including telangana governor

దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను  మహారాష్ట్రకు బదిలీ చేశారు.  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement