Telangana News
-
ప్రత్యర్థులపై దూకుడు.. రేవంత్ సెల్ఫ్ గోల్స్?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఏదో తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఎన్.టి.ఆర్ విహ్రహ ఆవిష్కరణ సభలో ఇందిరాగాంధీతో పాటు ఎన్.టి.ఆర్ స్పూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రసంగం చేయడం, తదుపరి మరో సందర్భంలో హిట్లర్ స్పూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించడం చూస్తే, రేవంత్లో ఏదో భయం వెన్నాడుతుందేమోనన్న అనుమానం కలుగుతుంది.అవసరం ఉన్నా, లేక పోయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రస్తావించి సవాళ్లు విసరడం, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదం అవుతోంది. రేవంత్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక తెలియకుండానే అవేవో సాధారణ విమర్శలు అన్నట్లు మాట్లాడుతున్నారా అన్నదానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సభలో రేవంత్ ఉపన్యాసం ఇస్తూ కేసీఆర్ను ఉద్దేశించి.. 'కేసీఆర్ రాసిపెట్టుకోండి.. మీ పార్టీని పాలమూరులో మళ్లీ మొలకెత్తనీయం.. మీ పదేళ్ల పాలన.. మా రెండున్నర ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా? చర్చలో ఓడితే అక్కడికక్కడే క్షమాపణ చెబుతా.. లేదంటే మీరు ఫామ్ హౌస్కే పరిమితం కండి' అని అన్నారు. ఇదో చిత్రమైన సవాల్ కదా!అధికారంలో ఉన్నప్పుడు తిరిగి గెలుస్తామన్న విశ్వాసం ఉండటం తప్పు కాదు. దానిపై ప్రచారం చేయడం కూడా అభ్యంతరకరం కాదు. కానీ, దాని గురించి చెప్పిన తీరు మాత్రం బాగోలేదు. గతంలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తిరిగి పవర్లోకి రావడం అసాధ్యమేమో అన్న అభిప్రాయం ఉండేది. కాని రేవంతే పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ అధికారాన్ని సాధించింది. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్నది నానుడి. అది బీఆర్ఎస్ కైనా, కాంగ్రెస్ కైనా మరే పార్టీకైనా వర్తిస్తుంది.కేసీఆర్ను చర్చకు సవాల్ చేసినా ఆయన పట్టించుకోరన్న సంగతి తెలిసందే. అదేదో కేటీఆర్ కో, హరీష్ రావుకో సవాల్ విసిరి ఉంటే వారేమైనా స్వీకరించేవారేమో! అయితే, వారితో తనకు పొంతన ఏమిటి అని అనుకుని ఉండవచ్చు. నిజంగా కేసీఆర్ చర్చకు సిద్ధమైతే అది రసవత్తరంగా ఉంటుందని చెప్పవచ్చు. కేసీఆర్కు ఉన్న భాష, ప్రసంగ సామర్ద్యంతో పోల్చితే రేవంత్కు కాస్త తక్కువే అని చెప్పక తప్పదు. అయినా పోటీపడటంలో తప్పు లేదు. కాకపోతే ఈ చర్చకు ఎవరు మధ్యవర్తిగా ఉండాలి? బయట ఇలాంటి చర్చలు నిర్వహించే రోజులు గతంలో అయితే ఉండేవి కానీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలలో అది సాధ్యం కాదు. తాను చర్చలో ఓడిపోతే క్షమాఫణ చెబుతానని అనడమే వింతగా ఉంటుంది. సవాల్ అన్నది ఇరువైపులా సమాన స్థాయిలో ఉంటుంది. కాని ఇలా ఒకరు క్షమాపణతో, మరొకరు రాజకీయాల నుంచి తప్పుకోవడం జరగదు కదా!ఈ ప్రసంగం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది హిట్లర్ గురించి రేవంత్ మాట్లాడడం. హిందూ దినపత్రిక నిర్వహించిన సెమినార్లో ఆయన హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నిరోధం, ప్రభుత్వ భూములను కాపాడడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన హైడ్రా గురించి గొప్పగా చెప్పారు మంచిదే. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్ కు షార్ట్ కట్ లో హైడ్రా అంటున్నారు. దీనికి, జర్మని నియంత హిట్లర్ సమయంలో పిలిచిన హైడ్రా పేరుకు అసలు పోలికే లేదు. మరి ఎవరి సలహాతో ఆయన ఈ పదాన్ని వాడి హిట్లర్ ను పొగిడారో అర్థం కాదు. బహుశా హిట్లర్ చరిత్రను రేవంత్ సరిగా అధ్యయనం చేయలేదేమో అన్న అభిప్రాయం కలుగుతుంది.మన దేశంలో గతంలో హిట్లర్ పాలన రావాలి అని కొందరు అనేవారు. దానికి కారణం నియంతృత్వానికి భయపడి అంతా క్రమశిక్షణగా ఉంటారన్న ఉద్దేశం కావచ్చు. ఎమర్జెన్సీ పాలనలో డిక్టేటర్ షిప్ చూసిన తర్వాత హిట్లర్ని ప్రశంసించేవారు లేకుండా పోయారు. ఎమర్జెన్సీ వల్ల ఇందిరాగాంధీకి ఎనలేని అప్రతిష్ట వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పాలనలో జరిగిన అరాచకాలతో జనం అల్లాడారు. నాజీల వంటి కొంతమంది అతివాదులు, మూర్ఖులు మినహా ఎవరూ హిట్లర్ ను సమర్ధించేవారు కారు. చివరికి యుద్ధం ముగింపులో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా రేవంత్ గమనించి ఉండాల్సింది. ఇది ఒక అంశం అయితే హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్స్ ను ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో జరుగుతున్న విధ్వంసంతో పోల్చుకోవడం ఏ మాత్రం సెన్సిబుల్గా లేదని చెప్పాలి. దారుణమైన రీతిలో అక్కడ విధ్వంసం జరుగుతుంటే దానిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సమర్థిస్తున్నారా? అన్న ప్రశ్న వస్తుంది. అంతేకాదు. నిజంగానే యుద్ధాన్ని మించిన విధ్వంసం సృష్టించానని ఆయన భావిస్తుంటే అది పెద్ద తప్పు అవుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించడానికి రేవంత్ను ఎన్నుకున్నారు తప్ప మరొకటి కాదు. యుద్ధ విధ్వంసంతో పోల్చుకోవడం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తుందా? అన్న చర్చ కూడా వస్తుంది.హైదరాబాద్లో హైడ్రా టీమ్ యాక్టివిటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్నిసార్లు చెరువుల ఆక్రమణలు తొలగించినప్పుడు, ప్రభుత్వ భూములను పరిరక్షించినప్పుడు మంచిపేరే వచ్చి ఉండవచ్చు కాని అదే టైమ్ లో అవసరం ఉన్నా, లేకపోయినా పేద, మధ్య తరగతివారి ఇళ్ళలను కూల్చిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. హైడ్రా తీరును పలుమార్లు హైకోర్టు తప్పు పట్టింది. ఆ సంగతి బహుశా రేవంత్ మర్చిపోయారేమో తెలియదు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తనను తాను హిట్లర్తో పోల్చుకోవడానికి ఇష్టపడరు. దానికి కారణం మన దేశం ప్రజాస్వామ్య దేశం కావడమే. హిట్లర్ ది నియంతృత్వం. ఆయన పాలనలో ఎన్ని ఘాతుకాలు జరిగాయో చెప్పనలవి కాదు. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేదు. అలాంటి వ్యక్తి రేవంత్ కు ఎలా స్పూర్తి అవుతారు?అసలు హిట్లర్ టీమమ్కు హైడ్రా పేరు లేదట. ఒకవేళ రేవంత్ అనుకున్నట్లు అలాంటిది ఉన్నా, ఎట్టి పరిస్థితిలోను దానిని ఆదర్శంగా తీసుకోవడం తెలివైన లక్షణం కాదని చెప్పాలి. నిజంగానే హైడ్రా అంత నిష్పక్షపాతంగా ఉండడం లేదన్న అభిప్రాయమూ ఉంది. అంతదాకా ఎందుకు? ఈ మధ్య వివాదం ఏర్పడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూమి వివాదంపై హైడ్రా పరిశీలన చేయడానికి కూడా వెళ్లలేదే! అది వాస్తవమా? కాదా? అన్నది చెప్పలేదే! అందువల్లే బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తన కామెంట్లో హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు చేస్తున్నారని, హైడ్రా ఒక హంతక ముఠా అని ధ్వజమెత్తారు.రేవంత్ నిరంకుశ, పాష్టిస్ట్ మనస్తత్వం దేశం అంతటికి అర్థం అయిందని కేటీఆర్ ఎద్దేవ చేశారు. తమకు మాత్రం మహాత్మా గాంధీజి, అంబేద్కర్, జయశంకర్లు స్పూర్తి అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దీనిని రాజకీయ విమర్శగా చూడవచ్చు. అది వేరే సంగతి. రేవంత్ కు మిగిలిఉన్న ఇమేజీని కూల్చివేసే మాటలు ఇవి అని ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ అన్నారు. ఏది ఏమైనా రేవంత్ కు స్పూర్తి నివ్వవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటివారు కాని హిట్లర్ కాదన్న సంగతి తెలుసుకుంటే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కమలం గూటికి మల్లారెడ్డి
-
తెలంగాణకు వచ్చి పరువు తీసుకున్న పవన్
-
తెలంగాణకు భారీ వర్ష సూచన
-
ఏపీలో దమ్ము లేదు కానీ తెలంగాణలో పోటీ.. TGలో చీప్ పాలిటిక్స్
-
సికింద్రాబాద్ లో యువకుడు దారుణ హత్య.. షాకింగ్ వీడియో
-
బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి
-
ప్రేమించడం లేదని యువతి గొంతుకోసిన యువకుడు..
-
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం
-
మా అక్కను ఇలా చూస్తా అనుకోలేదు.. పొడిచి పొడిచి చంపారు.. చెల్లి ఆవేదన
-
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బిడ్డ పుట్టాక
-
బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్
-
జడ్జి ముందు బండి భగీరథ్ లొంగిపోతాడా..?
-
బండి భగీరథ్ కు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ ను నిరాకరించిన హై కోర్టు
-
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్
-
పోలీసులకు బండి భగీరథ్ మెయిల్
-
బండి భగీరథ్ కోసం ప్రత్యేక బృందాలతో రాష్ట్రమంతా గాలింపు
-
వరుస ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ బైపాసులు
-
మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు
-
బండి భగీరథ్ కేసుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్
-
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
-
దుండగులు లోపలికి ఎలా వచ్చారంటే..?
-
ఖమ్మం రాము మర్డర్ కేసులో చిన్న కూతురు రితిక మృతి
-
ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ
-
హైదరాబాద్ లో మంచు వర్షం.. భారీ విపత్తు రాబోతోందా..!
-
మహిళతో వివాహేతర సంబంధం.. రోడ్డుపై తన్నుకున్న యువకులు
-
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
-
ఎర్రవెల్లి - హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్
-
రోడ్డెక్కిన బస్సులు.. డిమాండ్లు సాధించిన RTC కార్మికులు
-
రేపటి నుంచి చూస్తరు.. నా పని ఎట్లా ఉంటదో.. కవిత మాస్ వార్నింగ్
-
కవిత కొత్త పార్టీ పేరు TRS
-
కవిత కొత్త పార్టీ ప్రకటన.. మేడ్చల్ లో కీలక సభ
-
స్వస్థలానికి శంకర్ గౌడ్ భౌతికకాయం
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన
-
సమ్మెపై కొత్త టెన్షన్.. నాగిరెడ్డికి జేఏసీ నేతలు కౌంటర్
-
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
-
నాయకుడంటే జగన్ లా ఉండాలి..
-
మాతో పెట్టుకుంటే గద్దె దింపుతాం.. సర్కార్ కు RTC కార్మికుల వార్నింగ్
-
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
-
సమ్మె విరమించండి.. డిమాండ్లకు నేను హామీ..!
-
ఆర్టీసీ సమ్మెతో హైదరాబాదీల కష్టాలు.. మెట్రో, ప్రైవేట్ వాహనాలే ఆధారం
-
ప్రైవేట్ డ్రైవర్ నడపడంతో డివైడర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
-
బస్సులు లేక జేబీఎస్ నిర్మానుష్యం.. ప్రైవేట్ వాహనాల నిలువు దోపిడీ
-
డిపోలకే పరిమితమైన బస్సులు.. ప్రయాణికుల అవస్థలు
-
అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
-
తెలంగాణలో భానుడి భగభగలు
-
మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు
-
తెలంగాణలో తేలిన కులాల లెక్క
-
తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులు వీచే అవకాశం
-
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
-
ఇంటర్ ఫలితాలు విడుదల
-
యాదగిరిగుట్టలో సిబ్బంది చేతివాటం.. ప్రసాదం కవర్లో కాజు పకోడీ
-
కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ
-
అదృష్టవంతుడు.. ఇరాన్ దాడి నుంచి తపించుకున్న నిర్మల్ జిల్లా వాసి
-
మంత్రి కుమారుడే భూ కబ్జాకు పాల్పడ్డాడు: కేటీఆర్
-
తెలంగాణలో ఆగని వంటగ్యాస్ పానిక్ బుకింగ్స్
-
కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా.. ఈ రూల్స్ మీకోసమే!
-
జీవన్ రెడ్డి మరో షాక్.. BRS పార్టీలోకి జంప్!
-
BRS గూటికి..!? జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
-
భార్య కాపురానికి రావట్లేదని మూడేళ్ల కూతురిని..
-
కాంగ్రెస్ విడిచి వెళ్లడం అంటే జీవన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
-
చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
-
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
-
ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
-
భార్య, మామను కొట్టి చంపిన అల్లుడు
-
హైదరాబాద్ లో భారీ వర్షం.. తెలంగాణలో పలు చోట్ల వడగళ్ల వాన
-
తెలంగాణలో IAS-IPSల కొరత
-
కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు
-
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
-
10 ఎగ్జామ్స్ షురూ.. పరీక్ష కేంద్రాల వద్ద టెన్షన్ టెన్షన్
-
Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి
-
ప్రైవేటు బస్సు బోల్తా.. ప్రమాదంలో నలుగురు మృతి
-
కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు పిల్లల్ని హతమార్చిన కన్న తండ్రి
-
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం కట్?
-
భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్గా ఎవరంటే?
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు. -
గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్గా ఎంపిక చేసింది. ఈ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావు లతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. -
ఆమనగల్లు ఉత్సవాల్లో విషాదం.. నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
-
TS: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ
-
నన్ను చంపేందుకు యత్నాలు.. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
-
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
-
ప్రేమిస్తే చంపేస్తారా..? కూతురితో బలవంతంగా పురుగుల మందు తాగించి
-
బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు
-
కామారెడ్డిలో హైటెన్షన్.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
గద్వాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
-
తోర్రూరులో కొట్టుకున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్
-
కరీంనగర్ మేయర్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
జనగామలో హైటెన్షన్.. కౌన్సిలర్ల కిడ్నాప్
-
కరీంనగర్ కార్పొరేషన్ లో చక్రం తిప్పిన బండి సంజయ్
-
రూ. 8 కోట్ల పన్ను చెల్లించా.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
-
నా టార్గెట్ సీఎం సీటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
20 వేల మందితో కౌంటింగ్.. కరీంనగర్ లో BJP జోష్
-
Watch Live: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
-
నేడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల ఫైట్
-
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్
-
జగిత్యాలలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
నెక్స్ట్ గవర్నమెంట్ మారితే హైడ్రా ఫ్యూచరేంటి?
-
కాలువలో పడ్డ కారు వెలికితీత
-
లేగదూడలపై దాడి.. తప్పించుకు తిరుగుతున్న పెద్ద పులి
-
KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం
-
వరాలిచ్చే వనదేవతలు.. 2 కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ
-
కేసీఆర్ అడిగిన చోటే.. సిట్ విచారణ
-
గద్దెపైకి సమ్మక్క తల్లి
-
తెలంగాణ కుంభమేళా.. పోటెత్తిన భక్తులు
-
రీల్స్ చేయను క్షమించండి..
-
కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..
-
రంగారెడ్డి జిల్లాలో దారుణం... పోలీసును కారుతో గుద్దేసి..
-
BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN
-
ఒక్కరు కూడా మిగల్లేదు.. నాంపల్లి ప్రమాదం విషాదాంతం
-
గ్రేటర్ సిటీ స్లో పాయిజన్ జోన్? ఐఐటీ కాన్పూర్ షాకింగ్ రిపోర్ట్
-
మీకు.. మాకు సై.. తెలంగాణలో కక్ష రాజకీయాలు?
-
మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సేవలు
-
ఆదాయానికి మించి ఆస్తులు.. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
చోరీ చేసిన ఇంట్లోనే.. నిద్రపోయిన దొంగ
-
వైన్ షాపుల విషయంలో తగ్గేదేలే.. కోమటిరెడ్డి వార్నింగ్
-
అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం
-
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి
-
వైయస్సార్, ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు
-
హైవేపై ప్రమాదాలు..ఒకరు మృతి..
-
ABN రాధాకృష్ణ తప్పుడు రాతలపై భట్టి సీరియస్..
-
మా కారునే ఆపుతారా? టోల్ గేటు వద్ద మందుబాబుల వీరంగం
-
కాళ్లకు GPS స్టిక్కర్స్ తో పంట పొలంలో రాబందు
-
ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
-
తెలంగాణలో జర్నలిస్టులను ఉగ్రవాదులు, నేరగాళ్ల లాగ అరెస్టు చేస్తున్నారు
-
స్పీకర్పై సుప్రీం కోర్టు సీరియస్
-
ముస్తాబైన మేడారం.. పోటెత్తిన భక్తులు
-
ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా...రేవంత్ రెడ్డి వరాల జల్లు
-
మున్సిపల్ హీట్.. కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ ఫుల్ ఫోకస్
-
పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
-
మేడారం జాతర షురూ.. పోటెత్తిన భక్తులు
-
200 మందితో అటాక్.. 9 ఎకరాల భూ కబ్జా!
-
తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి
-
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి: సీఎంకు విజ్ఞప్తి
సాక్షి: హైదరాబాద్: రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్ -1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ సీఎంను కలిశారు. స్థానిక సంస్థల్లో అనుభవం గల పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్ -1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ను కోరారు.అలాగే పాలనా అనుభవం గల సీనియర్ గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని తెలిపారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలో అన్ని గ్రూప్ -1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అతి త్వరలో గ్రూప్-1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి,అరవింద్ రెడ్డి,నూతనకంటి వెంకట్, పద్మావతి,భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ ఉన్నారు. -
పార్టీ నుంచి వస్తుండగా.. అతివేగమే ప్రాణం తీసింది..
-
ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. తాజాగా కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా.. గతేడాది సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021లో నిజామాబాద్ స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా విజయం సాధించారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. అంతేకాకుండా సోమవారం తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి శాసనమండలి ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో మండలి ఛైర్మన్ తాజాగా కవితి రాజీనామాను ఆమోదించారు. -
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూనియర్ డాక్టర్ మృతి
-
లౌడ్ పార్టీకి అడ్డొచ్చాడని.. ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి!
-
మేడారంకు పోటెత్తిన భక్తులు
-
గొంతులో మందు పోసి పిసికి కిరాతకంగా.. గద్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
-
ఇళ్ల మధ్యలో పెద్ద పులి.. అర్ధరాత్రి టెన్షన్ టెన్షన్
-
ప్రమాదం ఎలా జరిగిందంటే? ప్రత్యక్ష సాక్షి మాటల్లో
-
నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
-
2026 కొత్త ఏడాది.. కొత్త జోష్.. మందుబాబుల వీరంగం
-
కానిస్టేబుల్ చెంప మీద కొట్టిండు.. రోడ్డుపై పడుకుని యువకుడి రచ్చ రచ్చ
-
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్
-
అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్


