హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్గా ఎంపిక చేసింది. ఈ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావు లతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.



