-
అవినీతి ఫైలు అటకెక్కించేశారు
సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా హాలోజన్ బల్బుల పేరుతో జరిగిన గోల్మాల్ను గత టీడీపీ ప్రభుత్వం విచారణ దశలోనే అటకెక్కించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల అవినీతి వెలుగులోకి రాకుండా ఈ పనిచేశారని ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పుడు ఓ ఫిర్యాదు అందింది. దీంతో ఏపీ విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయని ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ వెంకటేశ్వరరావు వివరించారు. అప్పుడేం జరిగిందంటే? ► పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద హాలోజన్, రంగుల విద్యుద్దీపాలు అమర్చాలని 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రూ.1,71,82,836లను మంజూరు చేసింది. నిజానికి రూ.5 లక్షలు దాటిన ప్రతీ కాంట్రాక్టుకు టెండర్ పిలవాలి. ఇదేమీ లేకుండా ఈ మొత్తాన్ని ఇష్టానుసారం ఖర్చుచేశారు. ► రూ.99 లక్షలతో హాలోజన్ ల్యాంపులు, డెకరేషన్ బల్బులు అద్దెకు తెచ్చినట్లు రూ.72 లక్షలతో హాలోజన్ ల్యాంపులు, కేబుల్, జీఐ వైర్, ఇన్సులేషన్ టేపులు, పిన్స్, ఎంసీబీలు, బల్బులు, ల్యాంపులు, హోల్డర్లు కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపించారు. ► అలాగే, ఒక్కో ల్యాంపు రూ.824 చొప్పున 654 ల్యాంపులు కొన్నామని, వీటి విలువ దాదాపు రూ.5.4 లక్షలని, మరో 500 వాట్స్ హాలోజన్ ల్యాంపులు ఒక్కొక్కటీ రూ.588 చొప్పున.. 553 కొనుగోలు చేశామని, వీటి విలువ రూ.3.25 లక్షలని అధికారులు లెక్కలు చెప్పారు. లేబర్ ఛార్జీల కోసం రూ.10,32,500 ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. ► కానీ, రికార్డుల్లో చూపించిన షాపులన్నీ హాలోజన్ బల్బులు అద్దెకిచ్చే పరిస్థితే లేదని, బల్బుల నాణ్యతా ప్రమాణాలు కూడా ఏమాత్రం లేవని ఆరోపణలు వచ్చాయి. అసలు కొనుగోలు చేసిన హాలోజన్ బల్బులు ఆ తర్వాత మాయమవ్వడం, ఆ తర్వాత తుక్కుగా చూపించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ► ఈ నేపథ్యంలో.. ‘సాక్షి’ 21–8–2015న ఈ బాగోతంపై ‘హలోజన్ హాంఫట్’ పేరుతో అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని, అవినీతినీ ఆధారాలతో బయటపెట్టింది. దీంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముత్యాలరాజు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ► మాయమైన బల్బులు, కొనుగోలులో అక్రమాలు, అద్దెకు తేవడం బూటకమని ప్రాథమిక ఆధారాలు లభించడంతో అప్పట్లోనే పదిమంది అధికారులకు సీఎండీ నోటీసులు జారీచేసి సమగ్ర విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ► కానీ, ఆ తర్వాత 2016లో ఈపీడీసీఎల్ సీఎండీగా వచ్చిన ఎంఎం నాయక్పై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో 2016 ఏప్రిల్లో విచారణలో ఉన్న ఈ కేసును మూసేశారు. ► ట్రాన్స్కో విజిలెన్స్ అప్పట్లో ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈపీడీసీఎల్కు సిఫార్సు చేసింది. అయితే, ఈ ఆదేశాలు డిస్కమ్ సీఎండీ పక్కనపెట్టారు. ఇప్పుడా ఫైలే కన్పించకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అవినీతికి పాల్పడిన వారిపై చర్యలే లేకుండా ఫైలు మూసేయడం ఆశ్చర్యంగా ఉంది. ట్రాన్స్కో సిఫార్సుల ఫైలే ఈపీడీసీఎల్లో లేకపోవడం మరో విడ్డూరం. అందుకే లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో వివరాలు తెలుస్తాయి. – కె. వెంకటేశ్వరరావు (ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ) దోషులకు శిక్ష తప్పదు హాలోజన్ బల్బుల కొనుగోళ్లలో అనేక అనుమానాలు వస్తున్నాయి. అవినీతి జరిగిందనే తెలుస్తోంది. అందుకే తిరిగి విచారణ చేపట్టాం. దోషులను శిక్షించి తీరుతాం. – శ్రీకాంత్ నాగులాపల్లి (ట్రాన్స్కో సీఎండీ) -
గోదావరి పుష్కర ఘటనకు ఐదేళ్లు
-
బోయపాటికి షూటింగ్ చేయమని చెప్పింది ఎవరు?
సాక్షి, అమరావతి : పుష్కరాల పేరిట గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాలయను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జోగి రమేశ్ విమర్శించారు. గోదావరి పుష్కరల్లో 29 మంది అమాయకపు భక్తులు చనిపోవడానికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయంలో పుష్కరాల నిర్వహణపై జోగి రమేశ్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన టీడీపీ ప్రభుత్వం.. అందుకు సరిపడ ఏర్పాట్లు చేయలేకపోయింది. పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు?. దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు?. బోయపాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్ చేశారా అనేది టీడీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఎందుకు సామాన్య ఘాట్లో పుష్కర స్నానం చేయాల్సి వచ్చింది?. అంత పెద్ద ఘటన జరిగిన కూడా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు. గోదావరి పుష్కరాల ఘటనపై సభాసంఘం వేయాలి. అసలైన దోషులను గుర్తించాల్సిన అవసరం ఉంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇబ్రహీం గాంధీ సెంటర్లో ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించి మురికి కాలువలో వేశారు. కృష్ణా పుష్కరాల కోసం వేలాది మంది పేదల ఇళ్లను అక్రమంగా తొలగించార’ని తెలిపారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే 29 మంది చనిపోయారు.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్కు రూ. 64 లక్షలతో డాక్యుమెంటరీ చిత్రీకరించే యత్నం చేశారు. బోయపాటి శీనుతో ఆ షూట్ చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. 29 మంది చనిపోవడానికి చంద్రబాబు కారణమని విమర్శించారు. పైగా భక్తుల తొక్కిసలాట వల్లే ప్రమాదం జరిగిందని గత ప్రభుత్వం సమర్ధించుకుందని గుర్తుచేశారు. ఈ ఘటనకు సోమయాజులు కమిషన్ నివేదనకు పట్టించుకోలేదన్నారు. బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు గోదావరి పుష్కరాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల ఘటనపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సబ్కమిటీతో విచారణ చేయిస్తాం సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వెళ్లిన పుష్కర ఘాట్ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని మండిపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్కు చంద్రబాబు రావడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు వెల్లడించారు. కేబినెట్ సబ్కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. -
‘టీడీపీ అధర్మ పాలన వల్లే 29 మంది మృతి’
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి టీడీపీ ప్రభుత్వం, జస్టిస్ సోమయాజులు కమిషన్పై నిప్పులు చెరిగారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కొసలాటకు మీడియా అత్యుత్సాహం, భక్తుల అవగాహనాలేమి కారణమని తేల్చిన సోమయాజులు కమిషన్కు భారతరత్న, ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అధర్మపాలన సాగుతోంది కనుకనే అంతటి ఘోరం జరిగిందని వాపోయారు. పుష్కరాల్లో చనిపోయిన 29 మంది కుటుంబాల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. టీడీపీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు.. తిరుమల శ్రీవారి ఆభరణాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శివస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోలీసులు తనపై మూడు అక్రమ కేసులు పెట్టారని, విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. కేసుకు సంబంధించిన విషయాలను విచారించాల్సిందిపోయి.. శైవక్షేత్ర ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ బ్యాలెన్స్లు అడుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు మంచి తీర్పునిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : దోషం భక్తులది.. పాపం మీడియాది -
సోమయాజులు కమిషన్పై మండిపడుతున్న పండితులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement