తొక్కిసలాటపై కమిషన్ గడువు మళ్లీ పెంపు | Stampede on commission postpond again hike in Rajamahendravaram | Sakshi
Sakshi News home page

తొక్కిసలాటపై కమిషన్ గడువు మళ్లీ పెంపు

Aug 7 2016 12:45 AM | Updated on Sep 4 2017 8:09 AM

తొక్కిసలాటపై కమిషన్ గడువు మళ్లీ పెంపు

తొక్కిసలాటపై కమిషన్ గడువు మళ్లీ పెంపు

గతేడాది జూలై 14వ తేదీన గోదావరి పుష్కరాల మొదటి రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని...

విచారణను నాన్చుతున్న ప్రభుత్వం
సాక్షి, రాజమహేంద్రవరం: గతేడాది జూలై 14వ తేదీన గోదావరి పుష్కరాల మొదటి రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం మరో ఎత్తుగడకు దిగుతోంది. ఘటనపై విచారణ కోసం నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ గడువును గురువారం రెండోసారి పొడిగించింది. నాటి ఘటనలో 29 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఘటనకు సీఎం చంద్రబాబే కారణమని ఆరోపణలు వెల్లువెత్తడంతో  ఏక సభ్యకమిషన్‌ను నియమించింది.

2016 మార్చి 29న నివేదిక ఇవ్వాలని గడువు విధిస్తూ.. కమిషన్‌కు ప్రభుత్వ శాఖలు ఆధారాలు సమర్పించకుండా జాప్యం చేయించింది. దీంతో కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జూన్ 29 వరకు 3 నెలలు గడువు పెంచుతూ నెల తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ పలుమార్లు  విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేసిన వారు సాక్ష్యాలు కమిషన్‌కు సమర్పించారు. ప్రభుత్వ శాఖలు  సమర్పించ లేదు. విచారణలో ఏఏ శాఖలు ఆధారాలు సమర్పిస్తాయో తెలపాలని కమిషన్ ఆదేశించడంతో కలెక్టర్ తొమ్మిది శాఖల పేర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29 వరకు గడువు పొడిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement