మిషెల్ తన ఫ్యాషన్ అభిరుచికి పేరుగాంచిన మహిళ. ఎప్పటికప్పడు విలక్షణమైన స్టైలిష్ వేర్లతో ఫ్యాషన్కి సరికొత్త అర్థమిస్తారామె. ఆమె దృష్టిలో ఫ్యాషన్ అంటే మన వ్యక్తితత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే వస్తాలని అర్థం. అయితే ఈసారి మాత్రం ఒబామా అత్యంత విలక్షణమైన స్కర్ట్ టాప్లో మెరిశారామె. పైగా ఈ దుస్తులు అత్యంత ప్రత్యేకం కూడా. చికాగోలో ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఒక రెసెప్షన్లో మిషెల్ ఈ బ్రాండెడ్ దుస్తులతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు సైతం ఆమె డ్రెస్ని చూసి ఒక్క క్షణం తత్తరపడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ మిషెల్ ఒబామా దుస్తుల్లో అంత స్పెషాల్టీ ఏంటంటే..
చికాగోలో ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఒక రిసెప్షన్లో, మిషెల్ ఒబామా వినూత్నమైన డ్రెస్లో మెరిసి అందర్నీ విస్తుపోయాలా చేశారు. ఒబామా ధరించిన స్కర్ట్పై ఆమెకెంతో ఇష్టమైన తన అమ్మ ఫోటోతో ఉన్న స్కర్ట్ ధరించి ఆ కార్యక్రమానికి హాజరవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరికి మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం ఆశ్చర్యపోయారు.
From an early age, my mom, Marian Robinson, taught me how to think for myself, use my own voice, and understand my own worth.
Ahead of #MothersDay, I’m proud to announce that the “Opening the White House” exhibit at the Obama Presidential Center will be named after her. 💕 pic.twitter.com/QDhSSRRet0— Michelle Obama (@MichelleObama) May 6, 2022
ఆమె తన వస్త్రధారణతో దివంగత తల్లికి నివాళులర్పించేందుకు ఇలా వచ్చినట్లు వెల్లడించారు. తన తల్లి మరియన్ రాబిన్స్ ఫోటోతో ఉన్న పెన్సిల్ స్కర్ట్ డిజైన్ కోసం మెరెడిత్ కూప్, ఆక్నే స్టూడియోస్తో కలసి పనిచేశానని తెలిపారు. స్కాండేనేవియన్ లేబుల్ ఆటం కలెక్షన్స్కు చెందిన ఈ స్కర్ట్కి బ్రౌన్ రంగు టాప్ని జత చేశారామె. ఆ వేడుకలో ఒబామా తన దుస్తులు గురించి మాట్లాడుతూ..తన భర్తను చూసి తనకెంతో గర్వంగా ఉందన్నారు.
అతను నిజంగా చాలా కంగారు పడుతున్నాడు. ఎందుకంటే మెరెడిత్ కూప్ డిజైన్ చేసిన ఈ స్కర్ట్ గురించి ఒబామాకు అస్సలు తెలియదు. అందుకే ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కంగారుపడుతున్నట్లు తెలిపారు. అలాగే తాను ఈ స్కర్ట్కి అలవాటుపడటానికి చాలా సమయం పట్టిందన్నారు. నిజంగా తన తల్లి ఇది చూసుంటే గర్వపడేది కదా అని ఉద్విగ్నంగా అన్నారామె.
దీని గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు తన ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుకొచ్చారు. 'ఈ రాత్రి నా అత్తగారు మరియన్ రాబిన్స్ గురించి ఆలోచిస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయ్. ఆమె తన పిల్లలు మిషెల్, క్రెయిగ్ల కోసం ఎంతో కష్టపడింది. తన భర్త ఫ్రేర్ రాబిన్సన్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి నేవీ పియర్ సమీపంలోని నీటి పునరుద్ధరణ ప్రాంతంలో పనిచేసేవారు. ఆయన వల్లే కష్టపడి పనిచేయడం, కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం గురించి తెలుసుకున్నా.
వాళ్లిద్ద్దరూ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులని, నిమ్న వర్గాలతో సహా అందర్నీ గౌరప్రదంగా చూస్తూ..తమ పనులను తాము చక్కబెట్టుకునే వ్యక్తులు. భూమికి పునాది రాళ్లలాంటి మనుషులు ఆ ఇద్దరూ. చికాగో సౌత్ అంతటా, యావత్తు అమెరికా దేశంలోనూ ఉన్నారు" అంటూ తన పోస్ట్ని ముగించారు.
(చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..)


