పుష్కర తీరంలో 4 లక్షల మందికి శ్రీవారి దర్శనం | Over 4 lakh people visit Tirumala Temple replica in Rajahmundry | Sakshi
Sakshi News home page

పుష్కర తీరంలో 4 లక్షల మందికి శ్రీవారి దర్శనం

Jul 26 2015 9:11 AM | Updated on Aug 28 2018 5:55 PM

గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని మున్సిపల్ మైదానంలో టీటీడీ ఏర్పాటు చేసిన తిరుమల నమూనా ఆలయంలో శ్రీవారిని 4.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

తిరుమల : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని మున్సిపల్ మైదానంలో టీటీడీ ఏర్పాటు చేసిన తిరుమల నమూనా ఆలయంలో శ్రీవారిని 4.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదాలు అందజేసింది. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.35 లక్షల ఆదాయం లభించింది.

తిరుమల తరహాలోనే రాజమండ్రిలో కూడా శ్రీవారికి పూజలు నిర్వహించారు. నమూనా ఆలయం నుంచి సరస్వతీ ఘాట్ వరకూ ప్రతి రోజు నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగింపునకు విశేష స్పందన లభించినట్టు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement