Telangana Government
-
ఆ ఒక్కటీ అడక్కు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి రూపొందించిన నివేదికను 4 సంపుటాలుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జనాభా దామాషా ప్రకారం సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లభిస్తోందా? అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయిన కులాలు ఏవి? వంటి కీలక అంశాలు ఇందులో బహిర్గతమవుతాయని చాలామంది ఎదురు చూశారు. సర్వే ప్రారంభించడానికి ముందు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సైతం పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ మిగిలిన అన్ని అంశాలకు సంబంధించిన గణాంకాలను ఈ నివేదికలో పొందు పరిచిన ప్రభుత్వం కీలకమైన రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన సమాచారం బహిర్గత పరచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 56 రకాల ప్రశ్నలకు సమాచారం సేకరించినా.. సర్వేలో భాగంగా 56 రకాల ప్రశ్నలకు సమాధానాలను ప్రభుత్వం ప్రజల నుంచి సేకరించింది. రాష్ట్రంలోని 3.55 కోట్ల జనాభా సర్వేలో పాల్గొని ప్రభుత్వం కోరిన వివరాలను అందించింది. మొత్తం 242 కులాలు, ఉపకులాల వారితో పాటు ఏ కులానికి చెందనివారు కూడా వీరిలో ఉన్నారు. దాదాపుగా 4 శాతం మంది తాము ఏ కులానికి చెందని వారిగా పేర్కొనగా, మిగిలిన వారు తమ కులం, ఉపకులం వివరాలు ఇచ్చారు. – 46వ ప్రశ్న కింద కుటుంబంలోని వ్యక్తుల రాజకీయ నేపథ్యానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. కుటుంబంలో ప్రజా ప్రతినిధిగా పనిచేసినవారు ఉన్నారా? ప్రస్తుతం/గతంలో ప్రజాప్రతినిధిగా సభ్యత్వం పొందారా? ప్రస్తుతం/గతంలో మంత్రి, మండలి చైర్మన్, స్పీకర్, తదితర ఆఫీస్ బేరర్ పదవుల్లో పనిచేశారా? ఎన్ని దఫాలు పనిచేశారు? ప్రజాప్రతినిధిగా మొత్తం ఎన్నేళ్లు పనిచేశారు? వంటి వివరాలను నమోదు చేశారు. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే 242 కులాలు, ఉప కులాల్లో రాజకీయ ప్రాతినిధ్యం కలిగి ఉన్న కులాలు, ఉప కులాలు ఏవి? వాటి జనాభాతో పోల్చితే ప్రాతినిధ్య నిష్పత్తి ఎంత? ఏ కులాలు, ఉప కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి? వంటి అంశాలపై స్పష్టత వచ్చేది. ప్రధానంగా రాజ్యాధికారాన్ని అందుకోలేకపోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప కులాలు ఏవో తెలిసిపోయేది. – నివేదిక రెండో సంపుటిలో రాజకీయ ప్రాతినిధ్యంపై సంక్షిప్త సమాచారాన్ని మాత్రం పొందుపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గ్రామ, మండల స్థాయి ఎన్నికలు, బహిరంగ సభలు, ఫిర్యాదుల వేదికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మండల స్థాయి కమిటీలు, కుల సంఘాలు, సంక్షేమ కమిటీలు, కుల సంఘాలు వంటి రాజకీయ కార్యకలాపాల్లో ఈ వర్గాలు ప్రాతినిధ్యం కలిగి ఉన్నట్టు నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంత రాజకీయాల్లో మాత్రం ఓసీలు, ఓబీసీల్లోని ఉన్నతవర్గాలు పట్టణ స్థానిక సంస్థలతో పాటు పార్టీ నాయకత్వ పదవుల్లో అధిక ఉనికి కలిగి ఉన్నాయని పేర్కొంది. ఆ సమాచారం ఉపయోగించలేదు? కులాలు, ఉప కులాల వారీగా రాజకీయ నేపథ్యానికి సంబంధించి సర్వేలో సేకరించిన సమాచారాన్ని నివేదిక తయారీలో వినియోగించలేదని ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారవర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు సర్వేలో ఇందుకు సంబంధించిన సరైన సమాచారం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైనట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారంలో అడిగిన ప్రశ్నలు కులాల వారీగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని అంచనా వేయడానికి సరిపోలేదని స్పష్టం చేశారు. అయితే అస్పష్టత, గందరగోళాన్ని నివారించడానికే ఈ గణాంకాలను నివేదికలో బహిర్గతం పర్చలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వే నివేదిక తయారీలో పాల్గొన్న స్వతంత్ర నిపుణుల బృందంలోని సభ్యుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా కులాల వారీ రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవచ్చని, ఉప కులాల ప్రాతినిధ్యం తెలుసుకోవడం సాధ్యం కాదని అన్నారు. రాజకీయ పారీ్టలే తమ పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో ఉపకులాల వారీగా ఇస్తున్న ప్రాతినిధ్యాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
ఆర్టీసీ @ ఎలక్ట్రిక్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకుంటున్న ఆర్టీసీ, ఇక సొంతంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలో 3 వేల లోపు సంఖ్యలో మాత్రమే ఆర్టీసీ బస్సులున్నాయి. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవు. నగర జనాభా ప్రకారం దాదాపు 6 వేల బస్సులు అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న బస్సుల సంఖ్యను కనీసం 5 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పీఎం ఈ–డ్రైవ్ కింద కేంద్ర ప్రభుత్వం నగరానికి 2,300 బస్సులు మంజూరు చేసింది. ప్రస్తుతమున్న ఎలక్ట్రిక్ బస్సులతో కలుపుకొంటే మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 3 వేలకు చేరుకుంటుంది. దీంతో మరో 2 వేల బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2030 నాటికి అందుబాటులోకి కొన్ని సొంత బస్సులు విజన్ 2047 కోసం ఆర్టీసీ కూడా ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందులో 2027 నాటికి గ్రేటర్ నగరం (ఔటర్ రింగురోడ్డు లోపల)లో ఆర్టీసీకి డీజిల్ బస్సులు ఉండకూడదన్నది లక్ష్యం. అంటే వచ్చే ఏడాది నాటికి నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉంటాయి. పీఎం ఈ–డ్రైవ్ కింద వచ్చే ఏడాది చివరి నాటికి అన్ని బస్సులు అందుతాయి. దీంతో అప్పటికి డీజిల్ బస్సులన్నింటిని ఔటర్ వెలుపలి డిపోలకు బదిలీ చేస్తారు. ఇక 2030 నాటికి జనాభా దామాషా ప్రకారం బస్సులను సమకూర్చుకోవాలన్నది రెండో లక్ష్యం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకం కింద గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో బస్సులను సమకూర్చుకుంటుండగా, అవి జనాభా దామాషా పద్ధతిలో కావాల్సిన సంఖ్యలో ఉండవు. దీంతో అదనంగా 2 వేల బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలన్నది ఆ లక్ష్యంలో భాగం. వేయి వరకు మినీ బస్సులు: ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులన్నీ 9 మీటర్ల కంటే పొడవైన పెద్ద బస్సులు. ఇంత పరిమాణంలో బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలకు తిరగలేవు. పాత నగరంలోని రోడ్లపై మరీ కష్టం. దీంతో ఆయా ప్రాంతాల్లో తిరిగే విధంగా మినీ ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీనికి తోడు, ఆర్టీసీ బస్సులను మెట్రో రైలు సర్వీసులతో అనుసంధానించబోతున్నారు. మెట్రో రెండు దశ కూడా రాబోతున్నందున ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫార్ములాను అమలులోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కాలనీలను మెట్రో స్టేషన్లతో అనుసంధానించాలి. అంటే కాలనీల్లో బస్సెక్కి మెట్రో స్టేషన్ వరకు వెళ్లేలా, మెట్రో రైలు దిగి బస్సెక్కి కాలనీల వరకు చేరేలా ఈ అనుసంధానం ఉంటుంది. మినీ బస్సులను ఇందుకు కూడా వాడాలన్నది ప్లాన్. వెరసి ఈ రెండు అవసరాలకు వేయి వరకు మినీ బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు ప్రాజెక్టు లోన్తో అనుసంధానం ఎలక్ట్రిక్ బస్సులు ఖరీదైనవి కావటంతో ఇంతకాలం ఆర్టీసీ సొంతంగా కొనటం కంటే అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవటం మెరుగైన విధానంగా భావిస్తోంది. భవిష్యత్లో మన దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలు తయారు కాబోతున్నందున ఎలక్ట్రిక్ బస్సుల ధరలు కూడా తగ్గనున్నాయి. దీనికి తోడు, మెట్రో రైలు విస్తరణకు ప్రభుత్వం భారీగా రుణాలు పొందబోతోంది. మెట్రో రైలు ప్రాజెక్టులో ఆర్టీసీ బస్సులకు కూడా భాగస్వామ్యం ఉండనున్నందున, మెట్రో ప్రాజెక్టు కోసం తీసుకునే రుణంలో కొంత మొత్తాన్ని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కూడా వాడనున్నారు. ఉద్యోగాలకు భరోసా... ప్రస్తుతం జీసీసీ పద్ధతిలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నందున, డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది ప్రైవేటు సంస్థలే సమకూరుస్తాయి. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ వైపు నుంచి ఉంటారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బందిని నగరం వెలుపలికి బదిలీ చేయనున్నారు. కొంతమందిని ఇతర అవసరాలకు వాడుకోనున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. భవిష్యత్లో ఆర్టీసీ సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నందున, వెలుపలికి వెళ్లే సిబ్బంది తిరిగి నగరానికి వస్తారన్న భరోసాను ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తోంది. -
గిగ్ వర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త
కార్మికుల దినోత్సవం సందర్భంగా.. గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గిగ్ సెక్టార్లో ఉద్యోగ భద్రత కోసం తెచ్చిన తెలంగాణ ఫ్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్) బిల్లు 2026 చట్టరూపం దాల్చింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే 1న తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే చట్టానికి సంబంధించిన గైడ్లైన్స్పై స్పష్టతకు మరో రెండు వారాల టైం పట్టొచ్చు. తాజా పరిణామంతో గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్ అసోషియేషన్లు రేవంత్ సర్కార్కు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఒక అంచనా ప్రకారం.. తెలంగాణలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు.. ఇలా సుమారు ఐదు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వాళ్లందరికీ పని భద్రత(గిగ్ వర్కర్లను రిజిస్టర్ చేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు), ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపు ఇలా సమగ్ర రక్షణ కల్పిస్తుంది. అయితే.. ఈ చట్టంలో కొన్ని అంశాలపై ప్లాట్ఫారమ్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించడం, ప్లాట్ఫామ్ కంపెనీలు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధనలతో పాటు ఇక మీదట సరైన కారణం లేకుండా వర్కర్లను పనిలో నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం చెబుతోంది. అలాగే గిగ్ వర్కర్లను కూడా గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలకు కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. దేశంలో గిగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన రెండో రాష్ట్రం తెలంగాణ నిలవనుంది. గతంలో రాజస్థాన్ గిగ్ వర్కర్ల కోసం ఈ తరహా చట్టం(రాజస్థాన్ ఫ్లాట్ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (Registration and Welfare) యాక్ట్ 2023 తెచ్చింది. ఈ చట్టానికి అదే ఏడాది జులైలో శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినా.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఆ చట్టం అమల్లోకి రాకపోవడంతో అక్కడ లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. -
గోనె సంచులు రాక.. గోదాములు లేక
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా మక్కలను విక్రయించడం పెద్ద సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం మక్కలకు కనీస మద్దతు ధర రూ.2,400 నిర్ణయించగా, బహిరంగ మార్కెట్లో రూ.1,700 మించి రావడం లేదని రైతాంగం ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఒత్తిళ్లు, రైతు సంఘాల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోళ్ల బాధ్యతను మార్క్ఫెడ్కు అప్పగించింది. అయితే మార్క్ఫెడ్కు జిల్లాల్లో పూర్తి స్థాయి యంత్రాంగం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, విక్రయించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్ –ప్యాక్స్) పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల మేనేజర్లు ఇప్పుడు ప్యాక్స్ ద్వారా మక్కల కొనుగోళ్లు చేయించేందుకు ప్రయతి్నస్తున్నా, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొనుగోళ్లు సాగడం లేదు. రికార్డు స్థాయిలో సాగు రాష్ట్రంలో యాసంగిలో మక్కల సాధారణ సాగు వి స్తీర్ణం 4 లక్షల ఎకరాలుగా ఉంటే ఈసారి ఏకంగా 16.25 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున 43.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల ప్రైవేటు విక్రయాలు, సొంత అవసరాలు పోగా 15 లక్షల మెట్రిక్ టన్ను ల మక్కలను విక్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కజొన్న ఉత్పత్తి కావడంతో వాటిని ఎలా విక్రయించాలో తెలియని స్థితిలో మార్క్ఫెడ్ కొట్టుమిట్టాడుతోంది. అన్నీ సమస్యలే... మక్కల కొనుగోళ్లకు అవసరమైన గోనె సంచులను మార్క్ఫెడ్ ముందుగానే సమకూర్చుకోవాలి. ఒకసారి వాడిన (సెకండ్ హ్యాండ్) గోనె సంచులను మక్కల కొనుగోళ్లకు వినియోగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచి, ఒక్కో గోనెసంచికి రూ.22 చొప్పున కాంట్రాక్టులు అప్పగించినా, కాంట్రాక్టర్లు సమయానికి గోనెసంచులు అందించడం లేదు. దీంతో భూపాలపల్లి, నాగర్కర్నూలు, మహబూబాబాద్, వరంగల్ వంటి చోట్ల రైతులే గన్నీ బ్యాగులను సమకూర్చుకొని మక్కలను విక్రయించేందుకు ప్యాక్స్ సెంటర్లకు వస్తున్నారు. ప్యాక్స్ నిర్వాహకులు కూడా గోనెసంచులతో వచ్చిన రైతుల మక్కలనే కాంటా వేస్తున్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డి జిల్లా మేనేజర్లు, కాంట్రాక్టర్లు, గోనెసంచులు సమకూర్చే ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపి అవసరమైన చోటకు గన్నీ బ్యాగులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. మక్కలను సంచుల్లో నింపి, తూకం వేసి, లారీల్లో గోదాములకు తరలించేందుకు అవసరమైన హమాలీల సమస్య కూడా అన్ని జిల్లాల్లో ఎదుర్కొంటున్నారు. మరోవైపు సేకరించిన మక్కలను నిల్వ చేయడం ఇప్పుడు మార్క్ఫెడ్కు ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన గోదాములన్నీ ఇప్పటికే బియ్యం, ఇతర నిల్వలతో నిండి ఉన్నాయి. తాజాగా రబీ పంట మిల్లింగ్కు వస్తుండడంతో కొత్త బియ్యం నిల్వలకే గోదాములు సరిపోని పరిస్థితి ఉంది. పత్తి నిల్వకు సంబంధించిన గోడౌన్లు ఖాళీగా ఉన్నా, ఖరీఫ్లో సాగయ్యే పత్తి పంట సెపె్టంబర్ నాటికి మళ్లీ గోదాముల్లోకి వచ్చి చేరనుంది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్లోగా మక్కల నిల్వలను ఖాళీ చేస్తామని హామీ ఇస్తే తప్ప గోదాములు ఇవ్వలేమని చెబుతున్నట్టు సమాచారం. 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు మక్కల కొనుగోళ్లకు ఇప్పటి వరకు 246 ప్యాక్స్ సెంటర్లను ఎంపిక చేశారు. 74వేలకు పైగా రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించారు. నల్లగొండ, నారాయణపేట, భువనగిరి, మల్కాజిగిరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. నాగర్కర్నూలు, మహబూబాబాద్, భూపాలపల్లి వంటి చోట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
‘రీయింబర్స్మెంట్’లో కీలక మార్పు
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్(ఏపీబీఎస్) ద్వారా నేరుగా విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో ఫీజు మొత్తాన్ని బదిలీ చేయనుంది. వాస్తవానికి 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర డీబీటీ పద్ధతిలోనే ఫీజును చెల్లిస్తుండగా..తాజాగా ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు కూడా డీబీటీ పద్ధతిలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు (జీఓఎంఎస్ నం.7) జారీ చేశారు. కొత్త విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు వైఎస్ భరోసా.. పేదరికం కారణంగా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అప్పట్లో అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. తద్వారా కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ నిబంధన విధించారు. అంతేకాకుండా ఫీజుల విషయంలో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయని భావించారు. విద్యార్థి ఖాతాలోనే వేయాలన్న కేంద్రం కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని, విద్యార్థి ఖాతాలోనే ఫీజును జమ చేయాలని సూచించింది. అప్పుడే తమ వాటా నిధులు వాటా విడుదల చేస్తామనే మెలిక పెట్టింది. కానీ గత ప్రభుత్వం ఈ నిబంధనకు ఒప్పుకోలేదు. దీంతో దాదాపు 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటాను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తొలుత ఎస్సీ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని నేరుగా విద్యార్థులకే ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.ప్రతి కాలేజీలో ప్రత్యేక నోడల్ అధికారి – విద్యార్థుల ప్రోగ్రెస్ ట్రాకింగ్ కోసం ఈపాస్లో ప్రత్యేక మాడ్యూల్ రూపొందించాలి. – స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ప్రతి కాలేజీలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. – ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. – ఆన్లైన్ దరఖాస్తు తర్వాత విద్యార్థులు హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుదమెంట్లు డిజిటల్గా అప్లోడ్ చేయాలి. బకాయిల చెల్లింపు పాత విధానంలోనే.. – జిల్లా సంక్షేమ అధికారి డిజిటల్ వెరిఫికేషన్ తర్వాత స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. – డీబీటీ అమలు కారణంగా అడ్మిషన్ సమయంలో కాలేజీలు ఫీజులు డిమాండ్ చేయకూడదు. విద్యార్థి డీబీటీ పద్ధతిలో వచ్చిన డబ్బుతో ఫీజు చెల్లించాలి. – ఈ మార్గదర్శకాలు 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి వర్తిస్తాయి. – 2025–26 వరకు ఉన్న బకాయిలు పాత విధానంలోనే చెల్లిస్తారు. – సంబంధిత సంక్షేమ శాఖల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈపాస్, ఐఎఫ్ఎంఐఎస్, పీఎఫ్ఎంఎస్ వ్యవస్థల్లో అవసరమైన మార్పులు చేయాలి. ఫీజుల చెల్లింపుపై అస్పష్టత ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల్లో మార్పులతో ఇకపై విద్యార్ధి తాను చదువుతున్న కోర్సు ఫీజును నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. డీబీటీ పద్ధతిలో విద్యార్ధి ఖాతాకు ఫీజు మొత్తం జమ అయిన తర్వాత.. ఆ మొత్తాన్ని కాలేజీలో చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. అయితే ఫీజు డబ్బులను ప్రభుత్వం ఎప్పటిలోగా విద్యార్ధి ఖాతాకు జమ చేస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు. వాస్తవానికి కోర్సు ప్రారంభ సమయంలోనే కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు అందిన తర్వాత చెల్లిస్తానంటే యాజమాన్యం అనుమతించే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజా మార్పులు విద్యార్ధిని గురి చేస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేటిక్ రెన్యువల్.. ⇒ ఆధార్ లింక్ చేసిన విద్యార్థి బ్యాంక్ ఖాతాకే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏ పీబీఎస్ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. ⇒ దరఖాస్తు సమయంలో ఆధార్ వివరాలు ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. ⇒ ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేస్టేషన్ కోసం బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా మాత్రమే సమర్పించాలి. ⇒ బ్యాంక్ ఖాతా వివరాలు ఎన్పీసీఐ ద్వారా ధ్రువీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. ⇒ కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు మీసేవ ద్వారా ఆధార్తో లింక్ చేయాలి. ⇒ రెన్యువల్ అప్లికేషన్లు ఆటోమేటిక్గా కొనసాగుతాయి. కాలేజీలు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపాలి. -
Big Update: ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
-
ఇక సర్కారీ మెట్రో.. పూర్తయిన ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) లిమిటెడ్ అధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) తెలంగాణ ప్రభుత్వం స్వాదీనంలోకి వచ్చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో సర్కారీ మెట్రోగా మారింది. హెచ్ఎంఆర్ఎల్ ఫేజ్–1ను స్వాధీనం చేసుకోవాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం.. ఎల్అండ్టీతో కొద్దిరోజులుగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్టీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈమేరకు ఎల్అండ్టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్)తో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్టీ తరఫున డీకే సేన్, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ హామీతో ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్పై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును (ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి) తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించింది. ఎల్అండ్టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎల్అండ్టీ చైర్మన్, ఎండీ ఎస్ఎన్. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ప్రయాణికులకు అనుకూలంగా.. ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ సంస్థ 2017, నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కి.మీ. నెట్వర్క్తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్– ఐను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్– ఐను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోవడంతో ఫేజ్–1, ప్రతిపాదిత ఫేజ్–2 నెట్వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్లోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధారపడదగిన, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రూ.1000కోట్ల బకాయిలను విడుదల చేసింది. 2025 అక్టోబర్ వరకు రిటైర్డ్ ఉద్యోగల జీపీఎఫ్ బకాయిలను ఆర్థిక శాఖ చెల్లించింది.గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ మార్చి 2026 వరకు ప్రతి నెలా చెల్లింపులు చేసింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచి నెలవారీ కేటాయింపును రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు రూ.1000 కోట్లు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్లో ఉన్న అన్ని జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో పూర్తిగా తీర్చింది. దీని వల్ల పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించింది.ఉద్యోగుల ఆరోగ్య అవసరాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య బిల్లులు ఒక్కరోజు ఆలస్యం లేకుండా, అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ చర్యలతో ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఊరట లభించింది. -
ఆర్టీసీ విలీనానికి ఏపీ నమూనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల వారి జీతాల్లో పెరుగుదల నమోదు కానుంది. అయితే, ఈ మార్పు డిపో మేనేజర్ స్థాయి నుంచే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం అక్కడ చోటుచేసుకున్న మార్పులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా క్లిష్టమైనది. దీనికి సంబంధించిన కసరత్తుకు భారీగా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, ఏపీలో విలీన ప్రక్రియ జరిగినందున, అక్కడి ప్రక్రియనే అనుసరిస్తే జాప్యం జరగదు. గతంలో ఉమ్మడి ఆర్టీసీలో భాగమైనందున, రెండు ఆర్టీసీల్లో పెద్ద తేడా లేదు. దీంతో ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం ఏపీ మోడల్నే అనుసరించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో విలీనం జరిగినప్పుడు ఆర్టీ సీలోని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల కేడర్లో ఫిక్స్ చేస్తారు. ఆర్టీసీ పోస్టుకు సరిసమానమైన ప్రభుత్వ పోస్టుల్లో కలిపేస్తారు. సరిసమాన పోస్టు లేనప్పుడు కాస్త అటూ ఇటూగా ఉన్న కేడర్తో అనుసంధానిస్తారు. ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత, పెద్ద పోస్టు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)దే. ఈ పోస్టును అదనపు కమిషనర్ కేడర్గా మార్చారు. రీజినల్ మేనేజర్ పోస్టును జాయింట్ కమిషనర్ స్థాయిగా, డివిజినల్ మేనేజర్ (డిప్యూటీ మేనేజర్) పోస్టును డిప్యూటీ కమిషనర్ స్థాయిగా, డిపో మేనేజర్ పోస్టును అసిస్టెంట్ కమిషనర్ స్థాయిగా ఖరారు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నుంచి ఆ పైస్థాయి పోస్టులకు గెజిటెడ్ హోదా కల్పించారు. ప్రభుత్వంలో డ్రైవర్ పోస్టు ఉన్నందున ఆర్టీసీ డ్రైవర్ను డ్రైవర్ స్థాయిగానే పరిగణిస్తున్నారు. కానీ, ప్రభుత్వంలో కండక్టర్ పోస్టు లేనందున, కండక్టర్ పోస్టును జూనియర్ అసిస్టెంట్ స్థాయిగా గుర్తించారు. పెద్ద అధికారుల జీతాల్లో తగ్గుదల... కానీ.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ఫిక్స్ చేసిన తర్వాత ఆ స్థాయి స్కేల్ వర్తింపజేస్తారు. దీంతో ప్రభుత్వ స్కేల్కు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. కానీ, ఆర్టీసీలోని ఈడీ, ఆర్ఎం, డీవీఎం, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (సీఎంఈ), చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం), చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం), విజిలెన్స్ డైరెక్టర్, డిప్యూటీ మెకానికల్ ఇంజినీర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్, విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి వరకు జీతాలు ప్రస్తుతం ప్రభుత్వంలోని సమానమైన స్థాయి పోస్టుల కంటే ఎక్కువ ఉన్నాయి. దీంతో ఈ పోస్టుల జీతాల పెరుగుదల ఉండదు. ఆ తర్వాత ఉన్న డిపో మేనేజర్ పోస్టు నుంచి జీతాల పెరుగుదల నమోదవుతుంది. తక్కువ స్కేల్తో ఉన్న ఆర్టీసీ పోస్టుల జీతాలను ప్రభుత్వ స్కేల్కు సమానంగా పెంచుతున్నప్పుడు, ఎక్కువ జీతాలున్న పోస్టులను ప్రభుత్వ స్కేల్కు సమానం చేయాలంటే తగ్గించాల్సి ఉంటుంది. కానీ, ఏపీలో అలా తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టుగా స్థిరీకరించారు. తదుపరి పీఆర్సీలతో ప్రభుత్వ కేడర్ స్కేల్ పెరిగి ఆర్టీసీ అధికారుల జీతాల కంటే ఎక్కువైనప్పుడే పెంచుతారు. అప్పటి వరకు కేవలం ఇంక్రిమెంట్లను మాత్రమే జత చేస్తారు. పే స్కేల్ ఇలా... ⇒ ఏపీఎస్ఆర్టీసీ విలీన సమయంలో డిపో మేనేజర్ వేతనం రూ.57,000–రూ.1,42,500గా ఉంది. దాన్ని రూ.57,100–రూ.1,47,760గా మార్చారు. ⇒ గ్రేడ్–1 డ్రైవర్ ప్రారంభ జీతం రూ.25,480 నుంచి రూ.29,980కు, గ్రేడ్–2 డ్రైవర్ ప్రారంభ జీతం రూ.21,390 నుంచి రూ.27,500కు, గ్రేడ్–1 కండక్టర్ ప్రారంభ జీతం రూ.21,670 నుంచి రూ.28,280కు, గ్రేడ్2 కండక్టర్ ప్రారంభ జీతం రూ.19,580 నుంచి రూ. 25,220కి పెరిగింది. గ్రేడ్2 మెకానిక్ ప్రారంభ జీతం రూ.20,300 నుంచి రూ.25,220కి పెరిగింది. ⇒ ప్రభుత్వ అధికారులతో పోలిస్తే ఆర్టీసీ ఉన్నతాధికారుల గ్రాట్యుటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ అధికారుల గ్రాట్యుటీపై సీలింగ్ ఉంది. ఉన్నతాధికారుల గ్రాట్యుటీ దాదాపు రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువగానే తగ్గుదల నమోదు కావాల్సి ఉంటుంది. దీంతో దాన్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రతిపాదించనున్నారు. ⇒ ప్రస్తుతం ఆర్టీసీలో గ్రేడ్ పే విధానం ఉంది. జీతానికి అదనంగా వారి పోస్టు స్థాయిని బట్టి ఈ మొత్తం జోడిస్తున్నారు. ఇది అసిస్టెంట్ డిపో మేనేజర్ స్థాయి నుంచి మొదలవుతుంది. ప్రభుత్వంలో గ్రేడ్ పే విధానం లేనందున దీన్ని తొలగిస్తారు. -
ఎకరా కనిష్టంగా రూ.6 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు భూముల ప్రభుత్వ విలువల సవరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో సవరించిన భూముల విలువలను అమల్లోకి తేవాలని ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తాజా ఆదేశాల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈసారి భూముల విలువల సవరణను సానుకూలతను బట్టి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో విలువల సవరణకు ఉన్న డిమాండ్ ఆధారంగా కొత్త విలువలను నిర్ధారించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి యంత్రాంగానికి సూచనలిచ్చింది. ఈమేరకు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని థర్డ్ పార్టీ రూపొందించిన అంచనాలతో పోలుస్తున్న ఉన్నతాధికారులు సవరించిన విలువల నిర్ధారణలో తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఉదారంగా... ఉన్నఫళంగా కాకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న చర్చ ప్రకారం ఈసారి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను ఉదారంగానే పెంచనున్నట్టు తెలుస్తోంది. మైదాన ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యవసాయ భూమి ఎకరం కనిష్ట విలువ రూ.3 లక్షలుండగా, దాన్ని 100 శాతం పెంచి రూ.6 లక్షలుగా నిర్ధారించనున్నారు. వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువల పెంపు విషయంలో బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్లను పరిగణనలోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న భూమి రేటులో 50–60 శాతంగా విలువను సవరించాలని నిర్ణయించారు. అయితే, బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి విలువ రూ.20 లక్షలుంటే అందులో 50–60 శాతం అంటే ప్రభుత్వ విలువను కనీసం రూ.10–12 లక్షల వరకు నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ, ఉదారంగా పెంచాల్సిన పరిస్థితుల్లోనూ ఉన్నఫళంగా ఎక్కువ పెంచకుండా, ప్రస్తుతం ఉన్న విలువలకు గరిష్టంగా 100 శాతం మించకుండా సవరించిన విలువలు నిర్ధారించనున్నారు. అంటే బహిరంగ మార్కెట్లో రూ.20 లక్షలున్న ఎకరం భూమి ప్రభుత్వ విలువను గరిష్టంగా ప్రస్తుతమున్న విలువ కంటే 100 శాతం అదనంగా నిర్ధారించనున్నారు. బహిరంగ మార్కెట్లో 50–60 శాతం, ప్రస్తుత విలువ కంటే 100 శాతంలో ఏది తక్కువ ఉంటే దాన్ని నిర్ధారించనున్నారు. కొన్నిచోట్ల 100 శాతం కంటే అనివార్యంగా పెంచాల్సి ఉంటే అందుకు గల కారణాలను ప్రత్యేకంగా ప్రస్తావించి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఓపెన్ ప్లాట్ల విలువలు కూడా భారీగానే సవరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చదరపు గజానికి ఉన్న విలువలో 30–50 శాతం వరకు విలువలు సవరించనున్నారు. 39 చోట్ల భారీగానే.. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల విలువలనూ భారీగానే పెంచనున్నారు. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఎక్కువగా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో అవకాశాన్ని బట్టి కొత్త విలువలను నిర్ధారించనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో సహా రాష్ట్రంలో ప్రస్తుతం అపార్ట్మెంట్ విలువ చదరపు అడుగు రూ.1,300 ఉండగా, దాన్ని రూ.1,600కు పెంచనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో రూ.2 వేల నుంచి రూ.9,800 వరకు అడుగు విలువ ఉండగా, దాన్ని కనీసం రూ.3వేల నుంచి రూ.12వేల వరకు పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏటా రూ. 3వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా ఈసారి రాష్ట్రంలో భూముల ప్రభుత్వ విలువలను సవరించనున్నట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి వారంలో సాధ్యమేనా? రాష్ట్రంలో సవరించిన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలను మే నెల మొదటి వారం నుంచి అమల్లోకి తేవాలని కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన ఆదేశాల అమలు సాధ్యమవుతుందా అనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి, సవరించిన తుది విలువల నిర్ధారణ జరిగిన తర్వాత మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లాల్లో ఏర్పాటు చేసిన కమిటీల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు సబ్కమిటీ ఇచ్చిన ఆదేశాలు రెవెన్యూ మంత్రి దృష్టిలో ఉన్నాయా, లేదా అన్న సందేహాలు కూడా ఆ శాఖలో వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖ కమిషనర్ ఎన్నికల విధుల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో ఉండగా, ఆయన మే 5న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భూముల ప్రభుత్వ విలువల సవరణపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకున్నా, ఆమలుకు మాత్రం మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. -
RTC విలీనానికి ఓకే.. 11% పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్
-
ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం. నేటి ఉదయం నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
-
ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. శనివారం ఉదయం షిఫ్ట్ నుంచే బస్సులు నెమ్మదిగా రోడ్డెక్కడం ప్రారంభించాయి. ఆర్టీసీ జేఏసీ సంఘాలతో నిన్న రాత్రి దాకా మంత్రుల సబ్ కమిటీ భేటీ జరిపింది. కీలకమైన మూడు డిమాండ్లు సహా అన్నింటికీ ప్రభుత్వం అంగీకరించింది. ఆ చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు.తొలుత 32 డిమాండ్లపై ఆర్టీసీ సంఘాల నేతలు సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అనంతరం మంత్రుల సబ్ కమిటీతో భేటీ అయ్యి చర్చించారు. కొన్నింటిపై సులువుగానే సమ్మతి రాగా, ప్రధాన డిమాండ్లపై మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021, 2025 వేతన సవరణలు, ఆర్టీసీలో కార్మీక సంఘాల పునరుద్ధరణ.. ఈ మూడు డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఏకంగా 13 గంటలపాటు చర్చలు జరిగాయి. కొద్దిసేపు మంత్రులు, కార్మిక సంఘాల నేతలు విడివిడిగా వాళ్లలో వాళ్లే చర్చించుకున్నారు. ప్రధాన డిమాండ్లపై సయోధ్య కుదరకపోవటం, వేతన సవరణ ఫిట్మెంట్ శాతం మీద ఏకాభిప్రాయం రాకపోవటంతో చర్చల్లో అర్ధరాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడొంతులు పూర్తయిన... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించారు. 2021 వేతన సవరణకు సంబంధించి ఏడు శాతంతో మొదలై చివరకు 10 శాతం మేరకు మంత్రులు ప్రతిపాదించిన ఫిట్మెంట్కు కార్మీక సంఘాల నేతలు సమ్మతించారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. మిగతా డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారని మంత్రులు పేర్కొనటంతో కార్మిక సంఘాల సమ్మె విరమణకు అంగీకరించాయి. చివరకు రాత్రి 12.30కు సయోధ్య కుదరటంతో సమ్మె విరమణ ప్రకటన చేశారు. దీంతో మూడు రోజులపాటు బస్సుల్లేక అవస్థలు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఊరట లభించినట్లైంది. -
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య కాదు.. రాష్ట్ర ప్రభుత్వ హత్య
-
ముగిసిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ అంతిమయాత్ర
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మెను మరో రూపంలో ముందుకు తీసుకెళ్లాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తున్నట్లు సమాచారం. -
కలకలం.. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్రమత్తమైన తోటి కార్మికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని సమాచారం. -
కేసీఆర్, హరీశ్పై చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. కమిషన్ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ఆక్షేపించింది. నిరర్ధకమైన ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దని స్పష్టం చేసింది. కమిషన్ విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్కు భారీ ఊరట లభించినట్టయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ పూర్తి చేసిన కమిషన్ గతేడాది జూన్ 31న నివేదిక సమర్పించింది. అయితే జస్టిస్ ఘోష్ నివేదిక మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు నెలల పాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీ¯న్ ధర్మాసనం మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. బుధవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు ప్రస్తావిస్తూ తీర్పు వెలువరించింది. 1952 చట్ట ప్రకారమే..: ప్రభుత్వం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తున్నారు కానీ 1952 చట్ట ప్రకారమే దానిని ఏర్పాటు చేశాం. ఇందులో ‘న్యాయ విచారణ’ అనే పదాన్ని వాడటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. కమిషన్ విధులను కూడా ఆ చట్టం పరిధిలోనే నిర్వర్తించింది. కమిషన్ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది. విచారణ అత్యవసరం. విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంది.. 1952 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో జరిగిన లోపాలు, విధి నిర్వహణలో పొరపాట్లు, నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. కమిషన్ ఏర్పాటు చట్ట ఉల్లంఘన కాదు.. చట్టంలోని సెక్షన్ 3 (4) ప్రకారం.. కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఆరు నెలల్లోపు, ఆ నివేదికను, దానిపై తీసుకున్న చర్యల వివరణాత్మక పత్రాన్ని శాసనసభ ముందు ఉంచాలి. టీటీ ఆంటోనీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలు ఏవీ ఈ కమిషన్ నివేదికకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. చట్టానికి అనుగుణంగా తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను తీసుకోవాలి. కమిషన్ ఏర్పాటు 1952 నాటి చట్ట పరిధిని అతిక్రమించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడం కాదు. నిర్లక్ష్యమే కారణమన్న ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు పరిశీలనకు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటయ్యింది. బరాజ్ ప్రణాళిక, రూపకల్పన, నాణ్యతా నియంత్రణ, నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలతో పిల్లర్లు కుంగిపోయాయని అథారిటీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాన్ని నిండుగా ఉంచవద్దని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బరాజ్లు ఒకే రకమైన రూపకల్పన, పద్ధతుల్లో నిర్మించారని, అవి కూడా వైఫల్యాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డ్యామ్ నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. కార్య నిర్వాహకుల పక్షాన కొన్ని లోపాలు, తప్పులు జరిగినట్లు ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది..’ అని వివరించారు. కమిషన్ తీరు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం: పిటిషనర్లు కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ‘1952 నాటి చట్టంలోని సెక్షన్లు 8బీ, 8సీ కింద కల్పించిన చట్టబద్ధమైన రక్షణలను పాటించకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ అంశాలున్నాయి. ఏకపక్షంగా, ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతో ప్రేరేపించినట్లు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం పిటిషనర్లు తమ వాదనలు సమర్థించుకునేందుకుు, కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వీలుగా ఎటువంటి సమన్లు లేదా నోటీసులు జారీ చేయలేదు. అలాగే పిటిషనర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న అంశాలకు ఆధారమైన ఎటువంటి పత్రాలు వారికి అందించలేదు..’ అని వారు కోర్టుకు తెలిపారు. వాదనలకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి: హైకోర్టు ‘ఒక వ్యక్తిపై ప్రతికూల వ్యాఖ్యలు చేసే ముందు వారి వాదనలకు అవకాశం ఇవ్వడం కమిషన్కు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజ న్యాయ సూత్రాలను పాటించడంలో విఫలమైతే, ఆ చర్యతో పాటు దాని పర్యవసానాలు కూడా చెల్లవు. సాక్ష్యాల సమర్పణకు అవకాశం ఇవ్వాలి.. సెక్షన్ 8బీ కమిషన్పై ఒక బాధ్యతను విధిస్తుంది. ఏదైనా వ్యక్తి ప్రవర్తనపై విచారణ జరపడం అవసరమని కమిషన్ భావించినా, లేదా ఆ విచారణతో వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడినా. సదరు వ్యక్తికి విచారణ సందర్భంగా తన వాదన వినిపించుకోవడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి ఒక సహేతుకమైన అవకాశాన్ని కల్పించాలి. వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల నివేదిక అయినా ఇచ్చే ముందే, విచారణ ప్రక్రియలో న్యాయబద్ధత పాటించబడేలా చూసేందుకు ఉద్దేశించిన ’ఆడి ఆల్టెరమ్ పార్టెమ్’ సూత్రంలో ఇదొక ముఖ్యమైన భాగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక పౌరుని జీవించే హక్కులో ఒక అంశమైన పరువు హక్కు.. ఒక అధికారి నిర్ణయంతో ప్రభావితమయ్యే అవకాశం ఉండి, దానికి సివిల్ పర్యవసానాలు కూడా ఉండవచ్చు అనుకుంటే, అటువంటి వ్యక్తికి 1952 చట్టంలోని సెక్షన్ 8బి కింద తప్పనిసరిగా నోటీసు పొందే హక్కు ఉంటుంది. సాక్ష్యాలను సమన్లలో ప్రస్తావించలేదు.. కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు పిటిషనర్ల ప్రవర్తనపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇవి నిస్సందేహంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పిటిషనర్లకు వ్యతిరేకంగా నివేదికలో ప్రస్తావించడానికి కమిషన్ ముందున్న సాక్ష్యాలలో ఏ ఒక్కదానినీ వారికి ఇచ్చిన సమన్లలో ప్రస్తావించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కమిషన్ అనుసరించిన విధానం సహజ న్యాయ సూత్రాలకు, సెక్షన్లు 8బీ, 8సీలో పొందుపరిచిన చట్టపరమైన రక్షణలకు విరుద్ధంగా ఉంది. నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవు.. ప్రజా ఖజానా నుంచి గణనీయమైన వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో లోపాలు, నిర్లక్ష్యం, పొరపాట్లు, తప్పులను గుర్తించడమే కాకుండా, అలాంటి లోపాలను సరిదిద్దడానికి, అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి వీలు కల్పించే వాస్తవ నిర్ధారణలను అందించడం కమిషన్ ఏర్పాటు ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటువంటి వాస్తవ నిర్ధారణ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులకు శిక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. సివిల్, క్రిమినల్ సాక్ష్యంగా నివేదికలు అంగీకరించబడవు. ఇదే సమయంలో కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు..’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు సాధారణ బదిలీల షెడ్యూల్, ఈ బదిలీల్లో పాటించాల్సిన విధివిధానాలను పేర్కొంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం జారీ చేసిన జీవో ఎంఎస్. నం: 38 ప్రకారం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31వరకు బదిలీలు నిర్వహించాలి. మూడేళ్ల పాటు ఒకేచోట (స్టేషన్) పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలి. భార్యాభర్తల విషయంలో ఈ నిబంధనకు సడలింపు ఉంటుంది. డిసెంబర్ 31, 2025 నాటికి ఒకే స్టేషన్లో నాలు గేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. అయితే 2027, మే 31 నాటికి ఉద్యోగ విరమణ చేసే వారిని నాలుగేళ్ల సర్వీసు పూర్తయినా బదిలీలు చేయవద్దని, సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా ఒకే కేడర్లో 40 శాతానికి మించకుండా బదిలీలు చేపట్టాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బదిలీలకు మార్గదర్శకాలు.. ⇒ తమ తమ శాఖల పరిధిలోని ప్రతి ఉద్యోగి ఎక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడనే వివరాలను కేటగిరీ, కేడర్ వారీగా ఆయా శాఖలు ప్రకటించాలి. ⇒ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవడానికంటే ముందే ఆయా శాఖల్లోని స్పష్టమైన ఖాళీలను వెల్లడించాలి. ⇒ ఖచ్చితంగా బదిలీ కావాల్సిన ఉద్యోగుల జాబితాను కూడా ముందే ప్రకటించాలి. ఒక్కో ఉద్యోగి నుంచి ఐదు ఆప్షన్లు తీసుకోవచ్చు. ఆప్షన్ల ప్రొఫార్మాను శాఖల వారీ అవసరాలను బట్టి మార్పులు చేసుకోవచ్చు. ⇒ బదిలీల ప్రక్రియ అనంతరం కష్టతరమైన ప్రాంతాల్లోనూ కనీస సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కష్టతరమైన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వకపోతే లాటరీ పద్ధతి ద్వారా ఆ ప్రాంతాలకు సిబ్బందిని కేటాయించాలి. ⇒ అన్ని బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా పారదర్శక విధానంలో జరగాలి. ఆన్లైన్లో కూడా కౌన్సెలింగ్ చేయొచ్చు. అన్ని దశల వివరాలను ఆన్లైన్తో పాటు ఆఫీసు నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచాలి. ముఖ్య నిబంధనలివి.. ⇒ రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించాలి. ⇒ రెండో స్థాయి నుంచి అత్యున్నత స్థాయిల్లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారుల విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న సొంత జిల్లా నిబంధనను తప్పనిసరిగా పాటించాలి. ⇒ జనగణన సంబంధిత ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఉద్యోగులకు నిబంధనలు వర్తించవు. ⇒ జూన్, 1, 2026 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. ⇒ పోలీసుల బదిలీల కోసం ఆ శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలు తయారు చేసుకోవాలి. ⇒ ఆదాయార్జిత శాఖలు (పన్నుల శాఖ, ఎక్సైజ్, స్టాంపులు–రిజి్రస్టేషన్లు, రవాణా, అటవీ శాఖలు) ఇప్పటికే తమ తమ శాఖల పరిధిలో అమలవుతోన్న నిబంధనల ఆధారంగా బదిలీలు చేపట్టాలి. అవసరమైన చోట మార్పులు చేసుకోవచ్చు. ⇒ టీచర్లు, లెక్చరర్ల బదిలీల కోసం విద్యా శాఖ ప్రత్యేక సవివర మార్గదర్శకాలను రూపొందించుకోవాలి. ⇒ ఉద్యోగ సంఘాల నేతల బదిలీల విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ⇒ ఫోకల్ నుంచి నాన్ ఫోకల్కు, నాన్ఫోకల్ నుంచి ఫోకల్ స్టేషన్లకు బదిలీలు జరగాలి. ఫోకల్, నాన్ ఫోకల్ స్టేషన్లను సంబంధిత శాఖ గుర్తిస్తుంది. ⇒ ఒకే స్టేషన్ను ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఎంచుకున్న పక్షంలో శాఖా పరమైన, న్యాయపరమైన అభియోగాలు లేని భార్యాభర్తలు (ఇద్దరిలో ఒకరికి మాత్రమే వర్తింపు), వచ్చే ఏడాది మే 31నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులు, 70 శాతం అంగవైకల్యం ఉన్నవారు, మానసిక వైక్యలమున్న పిల్లలున్నవారు, వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్ ఉన్నవారు, కష్టమైతరమైన ప్రాంతాల్లో ఎక్కువ సర్వీసు చేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలి. (ఈ ఉత్తర్వులు జారీ అయిన మూడోరోజు నుంచి సదరు ఉద్యోగి ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి రిలీవ్ అయినట్టుగా పరిగణిస్తారు.) రెండేళ్లు పూర్తయిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి: జేఏసీ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడం వల్ల కొంత ఊరట లభించిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ తెలిపారు. అయితే ప్రస్తుత మార్గదర్శకాలలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులకే బదిలీలకు అవకాశం కల్పించారని, దీనిని రెండేళ్లకు కుదించాలని కోరారు. దీనివల్ల మరింత మంది ఉద్యోగుల బదిలీలకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియను కనీసం రెండు నెలల పాటు పొడిగించాలని సూచించారు. అర్హత కలిగిన అందరికీ బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో జరిగిన చర్చ లు విఫలం కావటంతో ఆర్టీసీ కారి్మక సంఘాలు సమ్మె ప్రారంభించాయి. బుధవారం తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి బస్సులను స్తంభింపజేయాలని నిర్ణయించాయి. మరోవైపు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు ప్రారంభించింది. రవాణా శాఖ సహాయంతో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్రత్యామ్నాయ చర్యలు పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చేందుకు సమయం కావాల్సి ఉన్నందున, సమ్మె తొలిరోజైన బుధవారం ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. నాలుగు వారాల గడువుకు ససేమిరా... బుధవారం తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి సమ్మెకు వెళ్తున్నామని ఆరీ్టసీలో ఓ జేఏసీ వారం క్రితమే ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం చర్చలకు సిద్ధం కాలేదు. మంగళవారం సాయంత్రం హడావుడిగా నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కారి్మక సంఘాలతో చర్చించాలని ఆదేశించింది. రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కూడిన కమిటీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సచివాలయంలో కారి్మక సంఘాలతో చర్చలు ప్రారంభించింది. సంఘాల వారీగా దాదాపు మూడు గంటలపాటు వారి డిమాండ్లపై అభిప్రాయాలు సేకరించిన అనంతరం, వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి కొంత సమయం కావాలని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇందుకు నాలుగు వారాల సమయం అవసరమవుతుందని, గడువు నాటికి ప్రభుత్వం నుంచి స్పందన ఉంటుందన్నారు. దీనికి కార్మిక సంఘాలు అంగీకరించలేదు. సమ్మె నోటీసు ఇచి్చన థామస్రెడ్డి, ఈదురు వెంకన్నతో కూడిన జేఏసీ ప్రతినిధులు వెంటనే సమావేశ మందిరం నుంచి వెలుపలికి వచ్చి, చర్చలు విఫలమయ్యాయని, యథావిధిగా సమ్మె ప్రారంభమవుతుందని ప్రకటించారు. అశ్వత్థామరెడ్డి, నరేందర్తో కూడిన రెండో జేఏసీ నేతలు కాసేపు అంతర్గతంగా చర్చించుకుని, చివరకు తాము కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. రెండు జేఏసీల్లో లేని మిగతా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో అన్ని సంఘాలు బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మె ప్రాంభిస్తున్నట్టు రాత్రి పదింటికి ప్రకటించాయి. ప్రభుత్వమే సమ్మెకు వెళ్లేలా చేసింది: థామస్రెడ్డి, ఈదురు వెంకన్న ‘సమ్మె డిమాండ్లలో ఉంచిన 32 అంశాలు చాలాకాలంగా కొనసాగుతూ వస్తున్నవే. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందింస్తుందని చెప్పటంతో వేచి చూశాం. కానీ, ఆయన కూడా స్పష్టమైన హామీకి ముందుకు రాకపోవటంతో విధిలేని పరిస్థితిలో సమ్మెకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం కూడా స్పందించలేదు. సమ్మెకు కొన్ని గంటల ముందు ఆదరాబాదరాగా అధికారుల కమిటీ వేసి ప్రభుత్వం కాలయాపన ప్రయత్నం చేసింది. మా డిమాండ్లపై ఎలాంటి హామీ ఇవ్వకుండా నాలుగు వారాల గడువు కావాలని కోరటం దారుణం. సమ్మె చేస్తే చేస్కోండి అన్న తరహాలో సంస్థ వ్యవహరిస్తోంది. మేం చాలా సమయం ఇచ్చినా స్పందించకుండా ప్రభుత్వమే తమను సమ్మెకు వెళ్లేలా చేసింది. కారి్మకులంతా సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఎంత బెదిరింపులకు దిగినా సమ్మె ఆగదు, కొనసాగుతుంది. ‘ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి కొన్ని ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తే మేం పునరాలోచిస్తాం’ అని రెండో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, నరేందర్ తదితరులు తెలిపారు. వేగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు... డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె విషయంలో గట్టిగా ఉన్నప్పటికీ, మెకానిక్ సిబ్బంది కొంత ఊగిసలాటలో ఉన్నారు. దీంతో శ్రామిక్లు, మెకానిక్లలో ఎక్కువ మంది విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల నుంచి ఎనిమిది వేల మందిని తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు ఆర్టీసీ సమకూర్చుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,100 అద్దె బస్సులు యథావిధిగా తిరగనున్నాయి. మరో 500 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కుతాయి. తాత్కాలిక సిబ్బంది సహకారంతో మరో 2 వేల బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెరసి సగానికిపైగా బస్సులను తిప్పటం ద్వారా ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో 35 లక్షల మంది ప్రయాణించగా, ఈ పథకం ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 60 లక్షలను మించింది. ఇందులో 43 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. గతంలో సమ్మె జరిగినప్పుడు ఆ 35 లక్షల మందికే ఇబ్బంది కలగగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు కానుంది. మళ్లీ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరగనుంది. దీంతో వాటి చార్జీ కూడా పెరగనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడ్డుకునేందుకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ప్రయత్నిస్తున్నారు. -
బడ్జెట్ లెక్క... ఏంటీ తికమక?
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరానికి (2025–26)గాను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన బడ్జెట్ అంచనాలు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలకు పొంతన కుదరలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడులతోపాటు ఖర్చులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తదితర అంశాల్లో ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వం చూపిన అంకెలు, కాగ్ నివేదికలో పేర్కొన్న మొత్తాలను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే అంతర్గత సర్దుబా ట్లు, లెక్కలు తయారు చేసినప్పుడు సమయాభావం తదితర కారణాల వల్ల ఈ వ్యత్యాసం సహజమేనని అంటున్న ఆర్థిక నిపుణులు.. అసహజ వ్య త్యాసం ఉండటం మాత్రం అరుదైన విషయమని అంటున్నారు. దీనికి ఆర్థిక శాఖ అధికారులే సమాధానం చెప్పాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఆదాయం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వరకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సవరించిన బడ్జెట్ అంచనాలు, కాగ్ నివేదికలకు మధ్య అనేక అంశాల్లో వ్యత్యాసం కనిపించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి పన్ను రాబడుల కింద రూ. 1.34 లక్షల కోట్లుకుపైగా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే ఫిబ్రవరి మాసాంతానికే పన్ను రాబడులు రూ. 1.39 లక్షల కోట్ల మేరకు వచ్చినట్లు ‘కాగ్’నివేదికలో పేర్కొంది. అంటే ఒక నెల మిగిలి ఉండగానే రూ. 5 వేల కోట్లు ఎక్కువగా పన్ను రాబడులు వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఇక మార్చిలో పన్ను ఆదాయం మరో రూ. 12 వేల కోట్లకుపైగా వస్తుందని అంచనా వేస్తే ప్రభుత్వ లెక్కలకు, కాగ్ అంకెలకు మధ్య పన్ను రాబడుల విషయంలో సుమారు రూ. 17 వేల కోట్ల మేర వ్యత్యాసం వస్తోంది. అప్పుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2025–26 సవరించిన అంచనాల ప్రకారం ఏడాది మొత్తం మీద రూ. 77,545.92 కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు ప్రభుత్వం చూపింది. కానీ ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికే రూ. 77,111 కోట్ల మేర ప్రభుత్వం రుణాలు సమీకరించినట్లు వెల్లడించింది. అయితే మార్చిలో తీసుకొనే అప్పుల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటే ఆ మేరకు అప్పులు తగ్గే అవకాశముంది కానీ.. ఏ మేరకు చెల్లింపులు జరిగి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘కాగ్’లెక్కల్లో వచ్చిన తేడా మేరకు కనీసం రూ. 6 వేల కోట్లయినా అప్పుల కంటే చెల్లింపులు ఒక్క నెలలోనే చేయడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏడాది మొత్తం మీద రూ. 29,471 కోట్లు వచ్చాయని ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో పేర్కొంటే ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికి రూ. 18,788 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అంటే మార్చి నెలలోనే సుమారు రూ. 9 వేల కోట్లు కేంద్రం నుంచి ఉంటాయా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక గ్రాంట్–ఇన్–ఎయిడ్ విషయానికి వస్తే ఏడాది మొత్తంలో రూ. 11,161 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే ఫిబ్రవరి నాటికి రూ. 6,140 కోట్లు మాత్రమే వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఈ లెక్కన మార్చి నెలలో కేంద్రం నుంచి మరో రూ. 5 వేల కోట్లు రావాలన్నమాట. అయితే ప్రభుత్వ అంచనాలు, ‘కాగ్’లెక్కల్లో తేడాలు సహజమేనని.. లెక్కలు తీసుకొనే నాటికి అందుబాటులో కొన్ని వివరాలు లేకపోవచ్చని.. చెల్లింపులు, సర్దుబాట్ల కారణంగా కూడా కొంత తేడా వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ మేరకు తేడా రావడం మాత్రం పరిశీలించాల్సిన అంశమని అంటున్నారు. అంకెల గారడీ కోసం అంచనాలను రూపొందించకుండా వాస్తవిక దృక్పథంతో వెళ్తేనే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వారు సూచిస్తున్నారు. ఏమిటీ నివేదికలు? వాస్తవానికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలతోపాటు ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక రూపొందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ పంపే వివరాల ప్రకారమే ఈ నివేదికలు తయారవుతాయి. అలాగే ఏటా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అంతకుముందు ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలు, సవరించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఈ సవరించిన అంచనాలను ఏడాది మొత్తానికి (బడ్జెట్ పెట్టే మార్చి నెల రాబడులు, వ్యయాల అంచనాలను లెక్కగట్టి) ప్రతిపాదిస్తుంది. ఇదే తరహాలో గత నెల 20న 2025–26 సవరించిన అంచనాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 28 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తూ శనివారం ‘కాగ్’వెబ్సైట్లో ఓ నివేదిక పెట్టింది. ఈ రెండింటి మధ్య రాబడులు, ఖర్చులు, కేంద్ర నిధుల విషయంలో తేడాలు ఉండటం గమనార్హం. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ(Dearness Allowance)ను 2.1 శాతం పెంచుతూ శుక్రవారం ప్రకటన చేసింది. పెరిగిన అలవెన్స్ ఈ ఏడాది జనవరి నుంచే వర్తించనున్నట్లు తెలిపింది.ఇంతకు ముందు 50.7% డీఏ ఉండగా.. తాజా పెంపుతో అది 52.8 శాతానికి చేరింది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా డీఏను ప్రభుత్వం చెల్లించనుంది. కిందటి ఏడాది జూలైలో కూడా డీఏను 2.1 శాతం పెంచిన సంగతి తెలిసిందే.డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ పనులు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రి అప్గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏను ప్రకటించడం సంతోషమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారాయన. -
రేపే.. ‘పైలట్’ అప్పు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు తీసుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా బాండ్లను తనఖా పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడో తేదీన బహిరంగ మార్కెట్లో రుణం తీసుకోనుంది. ఆర్బీఐ తొలిసారి ప్రవేశపెడుతోన్న బీఐఎస్ అనే పైలట్ పద్ధతిలో ఈ అప్పును తీసుకోనుండడం గమనార్హం. ఈనెల ఏడో తేదీన దేశంలోని 4 రాష్ట్రాలకు రూ. 15,500 కోట్లను ఆర్బీఐ రుణాల రూపంలో సమకూర్చనుంది. అందులో 16–20 సంవత్సరాల కాల పరిమితితో రూ.2 వేల కోట్లు, 25 కంటే ఎక్కువ సంవత్సరాల కాల పరిమితితో రూ.1,900 కోట్లు రుణం తీసుకునేందుకు తెలంగాణకు అనుమతి లభించింది. ఈ మేరకు తొలి మూడు నెలల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో ఇప్పించే రుణాల షెడ్యూల్ను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఏడో తేదీన రూ.3,900 కోట్లతోపాటు అదే నెల 21వ తేదీన మరో రూ.2 వేల కోట్లను రుణం తీసుకోవడం ద్వారా తొలి మాసంలోనే రూ.6 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకోనుంది. ఇక, మే, జూన్ నెలల్లో కూడా రెండు దఫాల్లో రూ.5,250 కోట్ల చొప్పున మొత్తం రూ.16,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాల కింద తీసుకోనుంది. తొమ్మిదింటిలో మనం కూడా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఆర్బీఐ పైలట్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రామాణాత్మక జారీ వ్యూహం (బీఐఎస్) పద్ధతిలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో రుణాలు ఇప్పించనుంది. ఇందులో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. బాండ్లను తనఖా పెట్టుకోవడం ద్వారా అప్పులిచ్చే పెట్టుబడిదారులకు ఈ తొమ్మిది రాష్ట్రాలపై మరింత నమ్మకం కలిగేలా ప్రణాళిక రూపొందించింది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ రుణాల చెల్లింపులకు నిర్ణీత గడువు (మెచ్యూరిటీ బకెట్)ను నిర్ధారించడం ద్వారా దీర్ఘకాలంలో రాష్ట్రాలకు భారంగా మారకుండా చూడడమే దీని ఉద్దేశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారులకు వెంటనే రిటర్న్లు వచ్చే విధంగా ఆయా రాష్ట్రాలు చెల్లింపుల షెడ్యూల్ను ఈ పద్ధతిలో నిర్ణయించనున్నందున అప్పులిచ్చే వారికి కూడా వెసులుబాటు ఉండేలా ఆర్బీఐ ఈ పద్ధతిని ఎంచుకుందని అంటున్నారు. -
అప్పీల్కు అవకాశమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది అవుతున్నా ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆ చట్టంలో పేర్కొన్న విధంగా అప్పీల్ వ్యవస్థ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే అవకాశమే లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. మొదటి అప్పిలేట్ అథారిటీ అయిన ఆర్డీవో నుంచి జిల్లా కలెక్టర్, తర్వాత సీసీఎల్ఏ వరకు అప్పీల్ చేసుకునే మాడ్యూల్ భూభారతి పోర్టల్లో పనిచేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పొరపాటునో, గ్రహపాటునో కింది స్థాయి అధికారులు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నా, తగిన డాక్యుమెంట్లు లభించక తిరస్కరణకు గురైన దరఖాస్తులకు మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించి పరిష్కరించుకోవాలనుకున్నా అవకాశం ఉండడం లేదు. అప్పీల్ కోసం సంబంధిత కార్యాలయాల వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. ఆన్లైన్లో అవకాశమివ్వలేదని, తామేమీ చేయలేమని అధికారులు చెçపుతుండడంతో చేసేదేమీ లేక రైతులు వెనుదిరగాల్సి వస్తోంది. అయితే, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కనీసం ఆ మాడ్యూల్ వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భూభారతి పోర్టల్లో వచ్చే అన్ని సమస్యలకూ ఏకకాలంలో పరిష్కారం చూపే అవకాశం లేకపోయినా కనీసం అప్పీల్ చేసే అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతాంగం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాదాబైనామాలదీ ఇదే పరిస్థితి.. భూముల విషయంలో సాధారణంగా వచ్చే సమస్యలకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా అప్పీల్కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ముఖ్యంగా సాదాబైనామాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, అమ్మినవారు కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనను తొలుత విధించడంతో చాలా దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయి. నోటీసుల గడువు ముగిసినా అఫిడవిట్ ఇచ్చేందుకు అమ్మినవారు ముందుకు రావడం లేదన్న కారణంతో చాలా దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం 9 లక్షలకు పైగా దరఖాస్తుల్లో దాదాపు 30 శాతం వరకు అనేక కారణాలతో తిరస్కరించగా, వాటిలో ఎక్కువగా అఫిడవిట్ విషయంలోనే తిరస్కారానికి గురయ్యాయి. ఇప్పుడు అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో గతంలో అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వలేదనే నిబంధనతో తిరస్కరించిన దరఖాస్తులపై కలెక్టర్లకు అప్పీల్ చేసుకునే వెసులుబాటును భూభారతి చట్టం కల్పిస్తోంది. కానీ, పోర్టల్లో మాత్రం అప్పీల్ మాడ్యూల్ పనిచేయకపోవడంతో దాదాపు 2 లక్షలకు పైగా దరఖాస్తుదారులు ఈ అప్పీల్ వ్యవస్థ కోసం నిరీక్షించాల్సి వస్తోందని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. అప్పీల్ వ్యవస్థను ఆన్లైన్లో ఏర్పాటు చేస్తేనే సాధారణ దరఖాస్తులతో పాటు సాదాబైనామాలకు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని వారంటున్నారు. -
మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ సర్కార్కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) కీలక తీర్పునిచ్చింది. మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిన ఎన్జీటీ.. ప్రక్షాళనపై పటోళ్ల కార్తీక్రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టివేసింది.గాంధీ సరోవర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ పేర్కొన్నగా.. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారన్నది ప్రభుత్వం వాదన. విచారణ జరిపిన ఎన్జీటీ.. పిటిషన్లో సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేసును ట్రిబ్యునల్ డిస్మిస్ చేయడంతో మూసీ ప్రక్షాళన పనులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ తీర్పుతో ప్రభుత్వానికి లీగల్ రిలీఫ్ లభించింది. -
అత్యవసర ఖర్చులకూ దిక్కులేదు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగి అత్యవసర ఖర్చులకూ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మొత్తం 123 రోజులపాటు చేబదులు (ఓవర్ డ్రాఫ్ట్) రుణాలను తీసుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ప్రతిరోజూ రాష్ట్ర ఖజానాలో కనీసం రూ.1.38 కోట్ల నిధుల నిల్వ ఉండాలని ఆర్బీఐ నిర్దేశించగా, 2024–25లో ఏకంగా 123 రోజులపాటు అంతకంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మొత్తం రూ.37,457 కోట్లను చేబదులుగా ఆర్బీఐ నుంచి తీసుకుంది. 2024–25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘అకౌంట్స్ ఎట్ ఎ గ్లాన్స్’ పేరుతో కాగ్ రూపొందించిన నివేదికను సోమవారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యవసర ఖర్చులకూ ఖజానాలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా చేబదులు తీసుకోవచ్చు. ఆదాయం సమకూరగానే ఆర్బీఐకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014–15లో 62 రోజులు మాత్రమే చేబదులు తీసుకోగా, 2022–23లో అత్యధికంగా 328 రోజులపాటు తీసుకున్నారు. 2024–25లో 123 రోజులకి చేబదులు రుణాలు తగ్గడం గమనార్హం. 363 రోజులూ రుణాలే... రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి 2024–25లో ఆర్బీఐ నుంచి ప్రభుత్వం 298 రోజులపాటు రూ.64,188 కోట్ల వేస్ అండ్ మీన్స్ రుణాలను తీసుకోగా, 363 రోజులపాటు రూ.27,730 కోట్ల ప్రత్యేక రుణాలను తీసుకుంది. ఈ తాత్కాలిక రుణాలను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉండగా, రూ.5842 కోట్లను గడువులోగా చెల్లించడంలో విఫలమైంది. రాష్ట్రం 2024–25లో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటు, రూ.48,922 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా, ఆదాయం (రుణాలు మినహాయించి), వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. రూ.46,370 కోట్ల అప్పులను సమీకరించడం ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం అధిగమించింది. ఆ సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.1,67,804 కోట్ల ఆదాయం రాగా, అందులో 45 శాతాన్ని జీతభత్యాల రూపంలో తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులకే ప్రభుత్వం వెచ్చించాల్సి వచ్చింది. జీతాలకు రూ.30,277 కోట్లు, వడ్డీల చెల్లింపులకు రూ.27,803 కోట్లు, పెన్షన్ల చెల్లింపులకు రూ.16,942 కోట్లను ఖర్చు చేసింది. ఏటేటా పెరుగుతున్న అప్పులు రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయి. 2020–21లో రూ.2,78,018 కోట్లు ఉన్న ప్రభుత్వ అప్పులు 2024–25 నాటికి రూ.4,47,493 కోట్లకు ఎగబాకాయి. ఇక ప్రభుత్వ పూచీకత్తు అప్పులు 2020–21లో రూ.1,05,007 కోట్లు ఉండగా, 2024–25 నాటికి రూ.2,41,528 కోట్లకు చేరాయి. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన అప్పుల మొత్తం సైతం రూ.3.83 లక్షల కోట్ల నుంచి రూ.6.89 లక్షల కోట్లకు పెరిగింది. -
భర్తీ చేస్తున్నా.. ఖాళీలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆ ప్రభావం ప్రజారోగ్యం, వైద్యవిద్యపై పడుతోంది. రాష్ట్రంలో పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ఏర్పాటైన ఆస్పత్రులకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకం జరుపుతూ వస్తోంది. రాష్ట్రంలోని వైద్య అవసరాలకు ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, ప్రాథమిక ఆరోగ్యం (డీహెచ్), టీవీవీపీ, డీఎంఈల ద్వారా జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు, మాతా శిశు కేంద్రాలు, పీహెచ్సీలు, సీహెచ్సీ తదితర కేంద్రాల నిర్వహణ ఉంటుంది. ఈ నాలుగు శాఖల పరిధిలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో 51,455 వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పటికీ 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం శాసనమండలి వేదికగా వెల్లడించింది. వాటిలో 7,170 పోస్టుల నియామక ప్రక్రియ పురోగతిలో ఉండగా, మరో 6,759 పోస్టులు ఖాళీగా ఉంటాయని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఆమోదిత పోస్టుల్లో దాదాపు మూడో వంతు ఖాళీగా ఉండటం వల్ల ఆస్పత్రుల సేవలు, వైద్యవిద్య రెండూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులు, నర్సులు, ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్లు జారీ చేసింది. తద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నియంత్రణలోని పీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలోని మొత్తం 2,651 ఖాళీలలో 145 మంది వైద్యులు, 351 మంది నర్సుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. త్వరలోనే ఈ ఖాళీలు నిండుతాయి. అయితే పారా మెడికల్ సిబ్బంది పోస్టుల్లో 2,651 ఖాళీలు ఉంటే వాటిలో 2,016 వరకు మాత్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 635 ఖాళీలు ఉండగా, వాటి నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద 7,769 పోస్టులకు గాను 1,367 ఖాళీలు ఉండగా, వాటిలో 31 మంది నర్సులు, 160 మంది పారా మెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ సాగుతోంది. ఇంకా 315 మంది వైద్యులు, 304 మంది నర్సులు, 557 మంది పారా మెడికల్ సిబ్బంది భర్తీ కావలసి ఉంది. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులలో 9,554 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే... 3,706 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఇటీవలే 1,658 మంది వైద్యుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి కావచ్చింది. మరో 721 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 682 నర్సుల నియామక ప్రక్రియ సాగుతుండగా, 347 పోస్టులు భర్తీ కావలసి ఉంది. అలాగే పారామెడికల్ సిబ్బంది 298 ఖాళీలకు గాను 185 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డీఎంఈ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్లో ఏకంగా 20,585 పోస్టులకు గాను 6,205 ఖాళీలు ఉన్నాయి. అంటే సుమారు 40శాతం పోస్టులు ఖాళీగా ఉండడం వైద్య విద్య నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతోంది. అయితే డీఎంఈ పరిధిలో 607 మంది వైద్యులు, 1,545 మంది నర్సులు, 286 మంది పారా మెడికల్ సిబ్బందితో కూడిన 2,438 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్చలు చేపట్టగా, ఇంకా 3,767 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. అందులో అత్యధికంగా 2,179 వైద్య విద్య బోధించే వివిధ స్థాయిల ప్రొఫెసర్ పోస్టులు ఉండడం గమనార్హం. వైద్యుల పోస్టుల్లోనే భారీగా ఖాళీలు ఈ నాలుగు శాఖల్లో కలిపి 14,633 ఆమోదిత డాక్టర్/ ప్రొఫెసర్ పోస్టుల్లో ప్రస్తుతం 9,008 మాత్రమే భర్తీ కాగా, 5,625 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న నియామకాలు పూర్తైనా ఇంకా 3,200 పైగా పోస్టులు ఖాళీగా మిగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా టీచింగ్ హాస్పిటల్స్లో రెండు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉండడం తృతీయ స్థాయి వైద్యం, వైద్యుల శిక్షణపై ప్రభావం చూపుతోందని హెల్త్కేర్ రిఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టీవీవీపీ పరిధిలోని జిల్లా ఆస్పత్రుల్లో అనేక చోట్ల సగానికన్నా తక్కువ సిబ్బందితోనే నడుస్తున్నాయి. దీని వల్ల గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో రోగులకు సమయానికి చికిత్స అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డాక్టర్లు తయారవుతున్నా.... ఇంకో వైపు రాష్ట్రంలో పెరిగిన వైద్య కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వైద్యులు వైద్యం కోసం సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఏటా సుమారు 9,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఇంటర్న్షిప్ పూర్తి చేస్తున్నారు. 2,500 నుంచి 3,000 మంది పీజీ వైద్యులు సిద్ధమవుతున్నారు. అయితే నియామకాల్లో ఆలస్యం, అసంఘటిత విధానం కారణంగా వీరిలో చాలా మంది నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ఇది ఒక వైపు ఖాళీలు పెరగడం, మరోవైపు యువ వైద్యులకు అవకాశాలు లేకపోవడం అనే విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తోంది. -
ఉద్యోగుల జీతంలో కోత.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు తల్లిదండ్రులకు అందజేసే బిల్లును కేబినెట్ ఆమోదించింది.తెలంగాణ కేబినెట్ నిర్ణయంపై సీనియర్ ఐపీఎస్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికే స్ఫూర్తిదాయకమని, వృద్ధ తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే భరోసా అని ఎక్స్ వేదికగా కొనియాడారు.‘చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.‘దురదృష్టవశాత్తు ఆప్యాయతను పంచాల్సిన చేతులే ఈరోజు కన్నవారిని రోడ్డు పాలు చేస్తున్న సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు.వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే ఒక హెచ్చరిక. అమ్మనాన్నల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక భరోసా.ఈ బిల్లు మన దేశానికి స్పూర్తిదాయకం. యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి. కన్నవారే ప్రత్యక్ష దైవాలనే సత్యాన్ని విస్మరిస్తున్న నేటి తరానికి ఈ నిర్ణయం ఒక గొప్ప పాఠం. వృద్ధాప్యంలో వారు కోరుకునేది విలాసాలు కాదు, కేవలం తమ బిడ్డల ప్రేమని, తోడుని మాత్రమే. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ, వారి కళ్లలో ఆనందాన్ని నింపేలా ఈ సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులను గౌరవిద్దాం.. వారి ఆశీస్సులే శ్రీరామరక్ష!’ అని పేర్కొన్నారు. చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం… pic.twitter.com/jV2LQNRSnx— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 24, 2026 -
ఉద్యోగులకు కొత్త రూల్స్.. తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్!
-
తెలంగాణ బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు.. కొత్త ఆదేశాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు చేస్తూ టీడీఆర్ (Transferable Development Rights) వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయి.తెలంగాణలో నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ - 2012'కు కీలక సవరణలు చేస్తూ G.O.Ms.No.95ను విడుదల చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ పేరుతో వెలువడిన ఈ జీవోలో టీడీఆర్ వినియోగం, హై-రైజ్ భవనాల గుర్తింపు, సెట్బ్యాక్ సడలింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.కొత్త ఆదేశాలు ఇలా.. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై-రైజ్గా గుర్తింపు( పారిశ్రామిక భవనాల్లో ఉండే చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ రూములు, వాటర్ ట్యాంకులు, ఇతర నిర్మాణ ఫీచర్లను ఈ ఎత్తు లెక్కలోకి తీసుకోరు).750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో TDR ద్వారా ఎత్తు పెంపు అనుమతి.నాన్ హై-రైజ్ భవనాలకు సెట్బ్యాక్ సడలింపు అవకాశం.హై-రైజ్ భవనాల్లో 10% వరకు సెట్బ్యాక్ రిలాక్సేషన్కు అనుమతి.మాస్టర్ ప్లాన్ రోడ్లు మారితే TDR లేదా ఛార్జీలు చెల్లించే ఎంపిక.2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అనుమతి.40 ఫీట్ల రోడ్డుపై 3 అంతస్తులు అదనంగా నిర్మాణం.60 ఫీట్ల రోడ్డుపై 4 అంతస్తులు అదనంగా అనుమతి80 ఫీట్ల రోడ్డుపై 5 అంతస్తులు వరకు అవకాశం.10 నుంచి 20 అంతస్తుల హై-రైజ్లో 3% TDR తప్పనిసరి20 అంతస్తులపై భవనాలకు 5% TDR తప్పనిసరిబిల్డింగ్ పర్మిషన్ సమయంలో 50% TDR సమర్పణOC (Occupancy Certificate) ముందు మిగతా 50% సమర్పణ తప్పనిసరి -
తెలంగాణ పోలీస్ బాస్ ఎవరంటే?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనుండటంతో, కొత్త డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. ఆ జాబితాలో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నట్లు సమాచారం. డీజీపీ ఎంపికలో సాధారణంగా అధికారుల అనుభవం, సేవా రికార్డు, రాష్ట్రానికి చేసిన కృషి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సీవీ ఆనంద్కి నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రభాకర్ ఆప్టే వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్య మిశ్రా కూడా తన సేవా కాలంలో అనేక ముఖ్యమైన పదవులను చేపట్టారు. ఈ ముగ్గురిలో ఎవరు కొత్తగా తెలంగాణ పోలీస్ వ్యవస్థకు నాయకత్వం వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.శివధర్ రెడ్డి పదవీ విరమణతో, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో కొత్త నాయకత్వం అవసరం ఏర్పడింది. కొత్త డీజీపీ నియామకం రాష్ట్రంలో చట్టం, శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఈ ముగ్గురు అధికారులలో ఎవరు డీజీపీ? అనేది త్వరలో స్పష్టత రానుంది. -
త్రిముఖ కోణం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి. ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమంతో పాటు విజన్–2034 (ఒక ట్రిలియన్ ఎకానమీ) లక్ష్య సాధన దిశగా 2026–27 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు సర్కారు తుదిరూపు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలను విశదీకరిస్తూ ఆయా ప్రణాళికల అమలుకు తగినట్టుగా అంచనాలను రూపొందించినట్లు సమాచారం. బడ్జెట్ను శుక్రవారం సభలో ప్రవేశపెట్టనుండగా.. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లాబీల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీగా కేటాయింపులు, కొత్త పథకాల ప్రకటన, తుది అంచనాల ఖరారుపై కసరత్తు జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలోని ఆయన చాంబర్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు, పథకాలు, కేటాయింపులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పలుసూచనలు చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకు 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఆర్థిక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. పాత వాటితో పాటు కొత్తగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా ఆరు పథకాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా కిట్స్ పేరుతో సంక్షేమ హాస్టళ్ల నుంచి ఇంటిగ్రేటెడ్ గురుకులాల వరకు అన్ని స్థాయిల్లో చదువుకునే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి అవసరమయ్యే అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందజేసే పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్ల పంపిణీ, పాడి రైతుకు సబ్సిడీపై పశువుల పంపిణీ ఆరు పథకాల్లో భాగంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద మహిళలు, రైతులు, యువత, చిన్నారుల సంక్షేమం, వైద్యరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారత ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. -
Updates : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్మూసి అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సంతృప్తికరంగా లేనందున BRS వాకౌట్మూసి- డీపీఆర్ లేదు అని ప్రకటన చేశారు -మంత్రి డీపీఆర్ రెడీగా ఉన్నదని ప్రకటించారు.మూసిపై డీపీఆర్ ఉంటే అసెంబ్లీలో టేబుల్ చేయాలి.ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?మూసి అభివృద్ధిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు - కేటీఆర్లక్షన్నర కోట్ల దోపిడీకి మేము దూరం - మూసి అభివృద్ధికి కాదు.మొక్కజొన్న రైతుకు మద్దతుగా హరీష్ 8 లక్షల ఎకరాల్లో మొక్కలు రైతులు పండించారు.మద్దతు ధర లేక రైతులు నష్ట పోతున్నారు వర్షాల కారణంగా రైతులు నష్ట పోతున్నారు 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందిపంటల బీమా అమలు చేయడం లేదు వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు..వెంటనే ఇవ్వాలి 2400 మద్దతు ధర..500 బోనస్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతమొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేపట్టిన నిరసనఅసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్ ఈ సమయంలో తోపులాట జరిగి మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి మొక్క జొన్నకు 500 బోనస్ ప్రకటించాలి మొక్క జొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన -
ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై గంగా–జమునా తెహజీబ్ వర్ధిల్లుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే రాష్ట్ర అభివృద్ధికి అసలైన ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దేశంలో మతపరమైన విభజనలకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ అశాంతి నెలకొన్నా, మన రాష్ట్రంలో మాత్రం మత సామరస్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మైనారిటీలకు పెద్దపీట మైనారిటీల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయంగా, పరిపాలనలో పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడిన మహమ్మద్ అజహరుద్దీన్ను మైనారిటీ శాఖ మంత్రిగా నియమించుకున్నామని, అదనంగా 8 మంది మైనారిటీ నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత షబ్బీర్ అలీ సేవలను గుర్తిస్తూ ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నామని తెలిపారు. ఆ 4 శాతం రిజర్వేషన్ల వల్లే వేలాది మంది ముస్లిం యువకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన క్రికెటర్ సిరాజ్, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్లను డీఎస్పీలుగా నియమించడమే కాకుండా, వారికి భారీగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచామని పేర్కొన్నారు. సేవా భావానికి ప్రతీక రంజాన్ రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదు.. అది క్రమశిక్షణ, ఆత్మశుద్ధి మానవతా విలువలను గుర్తు చేసే పవిత్ర మాసం అని రేవంత్రెడ్డి అన్నారు. ఒక నెల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ, తోటి వారికి సహాయం చేయడమే ఈ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో మైనారిటీలకు సింహభాగం దక్కేలా చూస్తున్నామని, తెలంగాణ అభివద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని, మీ దువా (ప్రార్థనలు) రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజహరుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వేలాది మంది మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. -
పేదలకు శత్రువులం కాదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ పథకం అమలులో ఏవైనా లోపాలుంటే సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని, అసలు పథకమే వద్దంటే మాత్రం వినే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు శత్రువు కాదని, వారిని నిరాశ్రయులను చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలం ఉంటే.. అక్కడే ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి ఆస్తులూ గుంజుకునేందుకు కాదని అన్నారు. పేదలతో శత్రుత్వం పెంచుకుంటే మళ్లీ ఎవరైనా అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి అని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. దాదాపు 115 సంవత్సరాల కిందట అప్పటి నిజాం నవాబు ఎంతో దూరదృష్టితో చేసిన మంచి పనుల్లో కనీసం మనం పది శాతం కూడా చేయకుండా ఈ నగరాన్ని అలాగే వదిలేద్దామా? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ‘మూసీ ఇన్వైట్’పేరుతో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తర్వాత ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పర్యావరణవేత్తలు, మేధావులు, పలు సంస్థల కన్సల్టెంట్లను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటూ అసత్యాలు ‘ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేధావులు దానిని సమర్థించేలా మాట్లాడాలి. కొన్ని రాజకీయ పార్టీలు కడుపులో కుళ్లు, మాటల్లో విషం, చూపుల్లో పగతో వ్యవహరిస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపేలా వ్యవహరిస్తున్నాయి. అక్రమ సంపాదనతో ప్రతీనెలా రూ.5 కోట్లు వ్యయం చేస్తూ సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటున్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహానికి రూ.75 కోట్లు మాత్రమే.. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారు. నిజానికి గాంధీ విగ్రహానికి అయ్యే వ్యయం రూ.75 కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టు మొత్తం 55 కిలోమీటర్లు కాగా.. తొలిదశలో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధికి అయ్యే వ్యయం కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే. మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపై లేదా? మన చరిత్రను తిరిగి రాసుకునే అవకాశాన్ని మనం వదులుకుందామా? దేవతలు యజ్ఞాలు చేసినపుడు రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. సుబాహు, మారీచుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం ఆగిందా? లోకకళ్యాణం కోసం చేసే పనులకు సహకరించక పోయినా పరవాలేదు. కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. నది చుట్టూనే నాగరికత అభివృద్ధి: ‘మానవ నాగరికత నది చుట్టూనే అభివృద్ధి చెందింది. 1908 మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తిన తర్వాత.. నగరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పటి నిజాం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను నిర్మించారు. ప్రస్తుతం వందేళ్లు దాటినా ఆ రిజర్వాయర్లు నగర ప్రజలతో పాటు, వలసలు వచ్చిన లక్షలాది మంది దాహార్తి తీరుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎకనామిక్ జోన్గా తీర్చిదిద్దారు. పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదుం. అలాంటి నగరాన్ని కాపాడుకోవడం మనకర్తవ్యం. 1994 నుంచి ఇప్పటివరకు పరిపాలనలో విధా న నిర్ణయాల్లో వెనుకబడటం ఎప్పుడూ లేదు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు? వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? మూసీ పునరుజ్జీవం జరిగితే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి మంచి పేరు వస్తుందని, ఇక వాళ్లకు అధికారం కలగా మిగిలిపోతుందనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేసిన వారే చరిత్రలో గుర్తుంటారు..’అని అన్నారు. సంగమంలో మహాత్ముడి అస్తికలు..: ‘మూసా, ఈసా నదుల సంగమం వద్ద ఆనాడు మహాత్మాగాంధీ అస్థికలు కలిపారు. అంతటి చరిత్ర బాపూఘాట్కు ఉంది. కానీ బాపూఘాట్ను ఎవరైనా సందర్శిస్తున్నారా? ఎందుకది మరుగున పడిపోయింది? ప్రస్తుతం ఈ నదులు పూర్తిగా కాలుష్యంతో విషతుల్యంగా మారాయి. ఈ నీరుతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. విషతుల్యమైన నీరు కారణంగా మహిళలు గర్భవతులు కూడా కావడం లేదు. ఇది కేవలం మూసీ పునరుజ్జీవనం మాత్రమే కాదు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడం. అందులో భాగంగానే నల్ల చెరువు, బతుకమ్మ కుంట బమృక్ ఉద్దౌలా వంటి చెరువులను పునరుద్ధరించాం. అడ్డుకుంటున్న వాళ్లు అక్కడ ఉండగలరా? ఇవాళ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్నవారు మూసీ పరీవాహకంలో నివసించగలరా? వాళ్లు ఉంటానంటే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హౌస్ ఇస్తా. మూడు నెలలు అక్కడ ఉండగలరా? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించొద్దా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొద్దా? పర్యాటక అభివృద్ధి జరగొద్దా? నైట్ ఎకానమీ అభివృద్ధి చెందొద్దా? అభివృద్ధిని అడ్డుకుని ఇంకా వెనక్కి రాతి యుగాల వైపు వెళ్ళిపోదామా? ఓఆర్ఆర్ నిర్మాణం జరిగినపుడు కూడా కొందరు భూములు కోల్పోయారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవనంతో రాష్ట్రం గ్రోత్ ఇంజన్గా మారుతుంది. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెప్పండి. దానిని అమలు చేద్దాం. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇరవయ్యేళ్లు ఇబ్బందుల్లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర భూములు, ఆస్తుల క్రయవిక్రయ లావాదేవీల కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేళ్ల కాలంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య (భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు) నాలుగు రెట్లు పెరిగిన నేపథ్యంలో వచ్చే 20 ఏళ్ల కాలానికి తగిన విధంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పోర్టల్ను నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతోనే మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సాఫ్ట్వేర్ను ఆధునీకరించాలని సర్కారు భావిస్తోంది. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు వచ్చే బడ్జెట్లో కేటాయించనున్నారు. దాదాపు రూ.10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తుండగా, ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఏకీకృత పోర్టల్ తరహాలోనే..! ప్రస్తుతం రాష్ట్రంలో భూముల వివరాలు, సర్వే, రిజిస్ట్రేషన్ల వివరాలు వేర్వేరు డొమైన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మొత్తం డేటా, ఇతర సమాచారాలను సమీకృతం చేస్తూ ఏకీకృత పోర్టల్ తీసుకురావాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా ఏకీకృత పోర్టల్ తరహాలోనే స్టాంపుల శాఖ సాఫ్ట్వేర్ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రానున్న ఇరవై ఏళ్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు, రోజువారీ కార్యకలాపాలను నియంత్రించే సర్వర్లతో సహా ఇతర అంశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోర్టల్కు కొత్త సొబగులు అద్దనున్నారు. ఈ బాధ్యతలు తీసుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్గాంధీ హనుమంతు ఎప్పటికప్పుడు ఇందుకు అవసరమైన సమాచారం తీసుకుంటూ, ఎన్ఐసీతో సమన్వయం చేసుకుంటూ 2047 వరకు ఉపయోగపడేలా సాఫ్ట్వేర్ను ఆధునీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరో ఆరు నెలల్లోపు ఈ ప్రకియ పూర్తవుతుందని, 20 ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహించే క్రయ విక్రయ లావాదేవీలకు ఎలాంటి అవాంతరాలు లేని కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. -
గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది!
సాక్షి, హైదరాబాద్: అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరించే గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. ఆది పుష్కరాల తర్వాత నిర్వహించే అంత్య పుష్కరాలు 2028 జూలై 13 నుంచి 24 వరకు జరుగుతాయి. ఈ మేరకు పండితులు తేదీలు ఖరారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం పుష్కరాల నిర్వహణ ప్రణాళిక ఖరారుపై నిర్వహించిన సమావేశంలో ఈ తేదీలను అధికారికంగా ప్రకటించింది. కుంభమేళాకు చేసే ఏర్పాట్ల తరహాలోనే ఏర్పాట్లు ఉండాలని నిర్ణయించారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాల అనుభవాలను గమనంలో ఉంచుకొని ప్రణాళిక ఖరారు చేయాలని నిర్ణయించారు. వచ్చే పుష్కరాల్లో దాదాపు 8 కోట్ల మంది స్నానాలు ఆచరించే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన జరిగిన ఉప సంఘం సమవేశంలో అంచనా వేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిటీ ఆదేశించింది. భారీ సంఖ్యలో పుణ్యస్నానాలకు వస్తారని భావిస్తున్నందున, వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు 96 ప్రాంతాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో స్నాన ఘట్టాలు, సులభంగా చేరుకునేలా మెరుగైన రోడ్లు నిర్మించాలని ఆదేశించింది. వానాకాలంలో పనులకు ఇబ్బందులుంటాయని, ఈలోపే పనులు మొదలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఈ నెల చివరి నాటికి డీపీఆర్లను పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యమైన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని సూచించగా, రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన 9 ప్రాంతాలను తొలి విడత పనులకు అధికారులు ఎంపిక చేశారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తున్నట్టు కమిటీ పేర్కొంది. -
సీఎస్ పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా, మరో 3 నెలలు పొడిగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీఓపీటీ)కి ప్రభుత్వం లేఖ రాసింది. వాస్తవానికి కె.రామకృష్ణారావు గతేడాది ఆగస్టు 31న పదవీవిరమణ చేయాల్సి ఉండగా, ఆయ న పదవి కాలాన్ని ఏడు నెలలు పొడిగించడాని కి అప్పట్లో కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా రెండోసారి మరో 3 నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, కేంద్రం తీసుకోనున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కేంద్రం అనుమతిస్తే మరో 3 నెలల పాటు రామకృష్ణారావు సీఎస్గా కొనసాగుతారు. లేనిపక్షంలో సీనియారిటీ ప్రకారం ముందంజలో ఉన్న ఐఏఎస్ అధికారులు జయేశ్ రంజన్, వికాస్రాజ్లలో ఒకరిని కొత్త సీఎస్గా నియమించే అవకాశముంది. -
అతివలకే అందలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్హెచ్జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్ టాలెంట్ను గ్లోబల్ టాలెంట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... ‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ఫ్రంట్కు అడ్డుపడుతున్నారు.. 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ నిర్మించిన వారు హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్ జోన్ ఉంది. అందుకే ఆ అపార్ట్మెంట్ నివాసితులను పిలిచి మాట్లాడాం. వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్జోన్లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త ‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తాం’అని సీఎం వివరించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. -
గణపతీ.. లొంగిపోండి
సాక్షి, హైదరాబాద్: ‘గణపతి.. ఆయుధాలు అప్పగించి లొంగిపోండి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచించారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాం«దీజీ మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని.. ఎవరి ప్రాణానికీ నష్టం జరగొద్దన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని చెప్పారు. మావోయిస్టు పారీ్టలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోయారు. 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలోనే భారీ లొంగుబాటు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఆయుధాలు విడిచి లొంగిపోయే మావోయిస్టుల రక్షణ, ఆరోగ్య భద్రత, ఇతర పునరావాసం విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులంతా బయటికి వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారన్నది సమాచారం తమ వద్ద లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కుటుంబ సభ్యలతో శాంతియుత జీవితం గడుపుతారా అనేది వారి ఇష్టమని సీఎం పేర్కొన్నారు. మంత్రి సీతక్క సహా ఎందరో మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్ పారీ్టలో చేరాలనుకుంటే గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. చర్చలే పరిష్కారం.. ‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. ప్రపంచానికి శాంతిమార్గాన్ని చూపారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. తెలంగాణ గడ్డపై హింస కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతియుత మార్గాన్నే అనుసరిస్తోంది. మావోయిస్టుల్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారికి సీఎంగా పిలుపునిస్తున్నా. అందరూ జనజీవన స్రవంతిలోకి రండి. తెలంగాణ ప్రభుత్వం మీతో చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లొంగిపోయేవారు ఆత్మగౌరవంతో బతికేలా సహకరిస్తాం.. ‘ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి సహా అందరూ నన్ను కలిసి ఎన్నో అంశాలపై మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులతోపాటు అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులతో చర్చించి సీపీఎం మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయిలోని అంశాలను పరిష్కరిస్తామని.. నక్సలిజం జాతీయ సమస్య కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని వారికి చెప్పాను. రివార్డుల మొత్తం పెంపు, ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయింపు, వైద్య సాయం కోసం లొంగిపోయిన మావోయిస్టులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సానుకూలంగా ఉన్నాం. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తాం. రివార్డుల మొత్తాన్ని పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం. పునరావాసం మెరుగ్గా అందించే అంశంపై సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో అధ్యయం చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం. చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. లొంగిపోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వారి సొంత గ్రామాల్లో స్థలాలు ఇస్తాం. భూములు అందుబాటులో లేనందున వ్యవసాయ భూమి కేటాయింపులో మాత్రం ఇప్పుడే మాట ఇవ్వలేను. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానం కొనసాగించేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.. ‘లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు కల్పన, నివాస స్థలం, ఇళ్ల కేటాయింపు అంశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మాజీ మావోయిస్టు నాయకుల ప్రతిపాదనలను ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ మేరకు ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత నుంచి 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 250కిపైగా ఆయుధాలు స్వాధీనం చేశారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు’అని రేవంత్ అన్నారు. -
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్ అవార్డుకు సహజనటుడు కమల్ హాసన్ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్ఫ్రెండ్)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్ ఐ మ్యాక్స్ యజమాని రమేష్ప్రసాద్కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్లో ప్రదానం చేయనున్నారు. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్గా వ్యవహరించారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. -
గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్గా ఎంపిక చేసింది. ఈ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావు లతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. -
దేవాదుల 100 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 38 నుంచి 100 టీఎంసీలకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఈ మేరకు వచ్చిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. దేవాదుల సామర్థ్యం పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్కు ఈ బాధ్యతలు అప్పగించారు. తొలుత 50 టీఎంసీలు: గోదావరి ఎత్తిపోతలు పథకం పేరుతో 1995–2000 మధ్య దేవాదుల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. గోదావరి నుంచి జూన్–నవంబర్ మధ్యకాలంలో 150 రోజుల పాటు 50 టీఎంసీలు తరలించి 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలని అప్పట్లో యోచించారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం జరపడానికి 2001లో జీవో జారీ చేశారు. అయితే తొలి దశ కింద 5.18 టీఎంసీలు తరలించి 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2003లో, రెండో దశ కింద 7.25 టీఎంసీలను తరలించి 1.93 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2005లో, మూడో దశ కింద 25.75 టీఎంసీలను తరలించి 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2007లో పరిపాలనపరమైన అనుమతులు జారీ అయ్యాయి. మొత్తం మూడు దశల్లో 38.16 టీఎంసీలను తరలించి 5,56,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్ ప్రభుత్వం 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కింద ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 2005లోనే ప్రాజెక్టుకి పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. మూడు దశలు కలిపి మొత్తం రూ.6,016 కోట్ల వ్యయం అంచనాలతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతులు (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) 2007లో అనుమతులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2015లో దేవాదుల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 నుంచి 60 టీఎంసీలకు పొడిగించింది. కానీ సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 38.16 టీఎంసీలకే పరిమితమయ్యింది. మూడు దశల కింద హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం! ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2005–06లో రూ.6,016 కోట్లుగా ఉండగా.. 2016–17 నాటికి రూ.13,445 కోట్లకు చేరింది. తాజాగా రూ.18,400 కోట్లకు చేరింది. దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించాల్సి ఉంది. అంచనాల పెంపుతో పాటు, తాజాగా ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండు ప్రతిపాదనలపై తదుపరి కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణ! ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలకు పెంచితే ఏడాదిలో 300 రోజుల పాటు నీళ్లను తరలించి దేవాదుల ఆయకట్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణకు వీలుంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.14,359 కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. అయితే భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. మరో రూ.4 వేల కోట్లు అవసరం మొత్తం 34,089 ఎకరాలకు గాను 31,953 ఎకరాలు సేకరించారు. మరో 2,136 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు కింద దాదాపు 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 3.38 లక్షల ఎకరాలకే సాగునీరు అందిస్తున్నారు. మిగతా 2,136 ఎకరాలు సేకరిస్తే మిగిలిన 2.23 లక్షల ఎకరాలకు కూడా నీరందుతుంది. ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేస్తే భూసేకరణ పూర్తికానుంది. పెరిగిన అంచనాల ప్రకారం భూసేకరణతో సహా మిగులు పనుల పూర్తికి మరో రూ.4 వేల కోట్లు అవసరం కానున్నాయి. మొత్తం మీద వచ్చే 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి 2.23 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
కాళేశ్వరాన్ని వదిలేయం వాడుకలోకి తెస్తాం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం మహా అద్భుతం అన్నారని.. తాము వచ్చినప్పటి నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదని చెప్పారు. అయినా దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. ఒక్క కాళేశ్వరం పైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం మిగతా ప్రాజెక్టులను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న మాట వాస్తవమే అయినా, వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును అలాగే వదిలేయలేమని చెప్పారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా నిపుణుల కమిటీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వాడుకలోకి తెస్తామని ప్రకటించారు. ఆదివారం ఉమ్మడి వరంగల్లో పర్యటించిన రేవంత్రెడ్డి.. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్కతో కలిసి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఇంటెక్వెల్ వద్ద మోటార్లను సందర్శించిన ఆయన.. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివామని చెబుతున్న జ్ఞానవంతులు ఆనాడు 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రెండు మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. భూసేకరణే అసలు సమస్య... ప్రాజెక్టులు పూర్తి చేయడానికి భూసేకరణే అసలు సమస్యగా మారిందని, ఫలితంగా ప్రాజెక్టుల అంచనాలు కూడా పెరిగాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లు పాలించిన వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేంది కాదన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని, దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం జూన్ 2లోపు రూ.600 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు 2001లో రూ.6,000 కోట్ల అంచనాతో ప్రారంభమై ప్రస్తుతం రూ.18,500 కోట్లకు పెరిగిందని, ఆ మేరకు బడ్జెట్లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మార్చిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో దేవాదులపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక నెలలోపు దేవాదుల పంపులను మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబుకు సహకరించలే.. తెలంగాణ నీటి హక్కులను కాపాడుతూ అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గత ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని చెప్పారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలు కాకుండా సూచనలు ఇస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. ‘అధికారం, పదవులు వారసత్వంగా రావు.. ప్రజలే నిర్ణయిస్తారు.. పదవులు ఎవరి సొత్తు కాదు.. ప్రజల ఆశీస్సులతోనే పదవులు వస్తాయి’అని రేవంత్రెడ్డి అన్నారు. 2034 వరకు మరో పదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వెన్నం సోదరులకు సీఎం పరామర్శ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం రాఘవేందర్రెడ్డి మృతిచెందగా.. సీఎం రేవంత్రెడ్డి ఆదివారం వెన్నం సోదరులను పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రెడ్యాల గ్రామానికి చేరుకున్న రేవంత్రెడ్డి.. రాఘవేందర్రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు రాష్ట్ర సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్రెడ్డి, బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయకాంత్రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మహానగరం.. 3 కార్పొరేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ముఖచిత్రం మారింది. ఇటీవలే 150 వార్డుల నుంచి 300 వార్డులకు విస్తరించిన జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీ క్యూర్) వరకు (ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం) విస్తరించి ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులతో ఉన్న జీహెచ్ఎంసీని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా విభజించింది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఏయే జోన్లు వస్తాయో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ చట్టం మేరకు ఏర్పాటుచేసిన ఈ కార్పొరేషన్లు వేటికవే ప్రత్యేక సంస్థ హోదాతో పనిచేస్తాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ జీవో (నంబర్ 55) విడుదల చేశారు. గెజిట్ నోటిఫికేషన్కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు లక్ష్యంగా విభజన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. జయేశ్రంజన్కు పర్యవేక్షణ బాధ్యతలు ఈ మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు స్పెషలాఫీసర్గా జయేశ్రంజన్ను నియమించారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులో ఐదు కార్పొరేషన్లకు ఉమ్మడిగా ఒక చీఫ్ కమిషనర్ ఉండటం గమనార్హం. కాగా బుధవారం తెల్లవారేసరికే కార్పొరేషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకాల జీవోలు కనిపించడంతో 8 గంటలకు అటూఇటూగా సంబంధిత అధికారులు బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ ఆఫీసర్గా జయేశ్రంజన్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తులో మేయర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. తార్నాకలో ఏర్పాటైన మల్కాజిగిరి కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ టి.వినయ్కృష్ణారెడ్డి, న్యాక్లోని సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో జి.సృజన కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. పరిధి మారడంతో ఆర్వీ కర్ణన్ సైతం మరోమారు జీహెచ్ఎంసీ కమిషనర్గా తన చాంబర్లోనే బాధ్యతలు స్వీకరించారు. వీరితోపాటు ఆయా కార్యాలయాల్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులు బాధ్యతలు స్వీకరించగా, బదిలీ అయిన సిబ్బంది విధుల్లో చేరారు. కాగా సీఎస్ రామకృష్ణారావును ఆర్వీ కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు వెబ్సైట్లు..త్వరలో టీ క్యూర్ యాప్ మూడు కార్పొరేషన్లకు వేర్వేరుగా వెబ్సైట్లను సైతం రూపొందించారు. ప్రజా ఫిర్యాదుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న‘మై జీహెచ్ఎంసీ యాప్’స్థానే ‘టీ క్యూర్’యాప్ అందుబాటులోకి రానుంది. వికేంద్రీకరణతో ప్రజలకు మేలు అధికార వికేంద్రీకరణ, ప్రజలకు సత్వర సేవలు లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా తొలుత మండల వ్యవస్థ ప్రవేశపెట్టారు. అనంతర కాలంలో ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారు. చిన్న పంచాయతీలనూ ప్రజలు ఆమోదించారు. వికేంద్రీకరణ ప్రజలకు సౌలభ్యంగా, సౌకర్యంగా ఉంటుంది. – జయేష్రంజన్, స్పెషలాఫీసర్ మూడు కార్పొరేషన్లు ఇలా.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: ఐటీ కారిడార్ను కలుపుతూ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్: మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: జీహెచ్ఎంసీ పేరును కొనసాగిస్తూ ..సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో లేని మిగతా ఆరు జోన్లు (శంషాబాద్, రాజేంద్రనగర్, చారి్మనార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్). -
నేడే మున్సి‘పోల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరి«ధిలోని 8,191 పోలింగ్ కేంద్రాల్లో 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 2,981 వార్డులు, డివిజన్లకు గాను 12,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆప్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచారు. కాగా మున్సిపాలిటీల్లో 12 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇద్దరు కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. సిబ్బంది రెడీ.. బుధవారం పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రితో సహా మంగళవారం సాయంత్రానికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 123 పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులతో తరలివెళ్లారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను ముందే ఎంపిక చేసిన 137 స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రపరుస్తారు. నిరంతర పర్యవేక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు తొలిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేశారు. తద్వారా పోలింగ్ కేంద్రాల లోపలా, వెలుపలా పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించనున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిఘాను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ‘టీ పోల్’లో తెలుసుకోండి.. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘టీ పోల్ మొబైల్ ఆండ్రాయిడ్ యాప్’లో ఓటర్లు తమ ఫోటో ఓటరు గుర్తింపు కార్డు నంబరు (ఎపిక్) సహాయంతో ఓటరు స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు. టీ పోల్ యాప్తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లోని ఓటర్ పోర్టల్ నుంచి కూడా ఓటరు స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోలింగ్ ప్రక్రియపై ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరు 9240021456ను ఏర్పాటు చేసింది. కాగా ఈ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి వేతనంతో కూడిన సెలవు వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘హోమ్ ఓటింగ్‘కు అవకాశం ఇవ్వాలి గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కేంద్ర ఎన్నికల కమిషన్ 80 సంవత్సరాలు పైబడిన వారు కానీ, వయసుతో నిమిత్తం లేకుండా తీవ్రంగా జబ్బు పడి మంచంలో ఉండి పోలింగ్ బూత్కు రాలేని పరిస్థితి ఉన్న వారు కానీ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా హోమ్ ఓటింగ్ ప్రొవిజన్ను ప్రవేశ పెట్టింది. తద్వారా ఆయా ఓటర్ల ఇళ్లకు పోలింగ్ అధికారులు స్వయంగా వెళ్లి ఓటు వేయించుకుని వచ్చే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అటువంటి ప్రొవిజన్ లేదని రిటరి్నంగ్ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ ప్రొవిజన్ను ప్రవేశపెట్టాలి. – ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ బండారు రామ్మోహన్రావు. -
గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీకి బారీ ఊరట లభించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం కొట్టేసింది. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాల్లేవు. గ్రూప్-1 నియామకాలు సక్రమమే అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ ధర్మాసనం తుది తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తం 563 మంది అభ్యర్థులు ఇప్పటికే అప్పాయింట్మెంట్ లెటర్లు అందుకున్న సంగతి తెలిసిందే. తాజా తీర్పుతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించినట్లైంది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్ శివనగర్కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. అలాగే..గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి బెంచ్ తేల్చి చెప్పింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు సెలక్ట్ అయిన అభ్యర్థులు మళ్లీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. దీంతో.. ఈ పిటిషన్లంటినీ కలిపి విచారణ జరిపింది సీజే నేతృత్వంలోని ధ్విససభ్య ధర్మాసనం. వాదనలు ఇలా..టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయన్నారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత చేయించారని తెలిపారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్కు, మెయిన్స్కు హాల్టికెట్లను వేర్వేరుగా జారీ చేసిందని చెప్పారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందని ఎలాంటి ఆరోపణలు లేవని వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల్లో అర్హత సాధించలేనివారు కోర్టును ఆశ్రయించారన్నారు. రెండు హాల్టికెట్లు ఉంటాయని పరీక్షలకు ముందే వెల్లడించినా అప్పుడు అభ్యంతరం చెప్పకుండా, ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయడం చెల్లదన్నారు.ఇదిలా ఉంటే.. జనవరి 22నే తీర్పు వెల్లడి కావాల్సి ఉన్నా తీర్పు కాపీ రెడీ కాలేదని చెబుతూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇవాళ్టికి వాయిదా గమనార్హం. తీర్పుపై సీఎం రేవంత్ హర్షంగ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘గ్రూప్ -1 నియామకాల పై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించాం. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు నా అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. గ్రూప్ -1 నియామకాల పై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని… ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా… వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించాం. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు నా…— Revanth Reddy (@revanth_anumula) February 5, 2026 -
సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులు గీత దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని.. వాటిని పోలీసులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగింది? సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల పోస్టుల ఆధారంగా యాంత్రికంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించరాదని సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పాటించాల్సిన మార్గదర్శకాలను తీర్పులో పొందుపరిచింది. అయితే ఈ మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీం ధర్మాసనం ముందు వాడీవేడిగా వాదనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛకు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి: లూథ్రా విచారణ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు మెరిట్స్పై తాము వాదించడం లేదని.. కానీ హైకోర్టు విధించిన కొన్ని షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై మాకు అభ్యంతరం ఉంది. ముఖ్యంగా గైడ్లైన్ నంబర్ 7, 8 పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇది ప్రాసిక్యూషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రాసిక్యూషన్ వేరు, దర్యాప్తు వేరు కదా?. కానీ గైడ్లైన్ నంబర్ 4, 7 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసు క్లోజ్ చేయాలని చెబుతున్నారు. అది కేవలం సాక్ష్యాధారాల లేమి వల్లే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా క్లోజ్ చేయొచ్చు కదా?’అని అన్నారు. తప్పేంటి?: సుప్రీం ధర్మాసనందీనిపై జస్టిస్ పార్దివాలా జోక్యం చేసుకుంటూ ‘అసలు హైకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడీíÙయల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే. మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. చాలా కోర్టులు ఇలాంటి మార్గదర్శకాల కోసమే ఎదురుచూస్తున్నాయి కూడా. హైకోర్టు కేవలం విస్తృతమైన మార్గదర్శకాలనే జారీ చేసింది. వాటిని పాటించండి’అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది. పోలీసులకు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవీ.. ముందస్తు పరిశీలన: సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. న్యాయ సలహా: రాజకీయ విమర్శలు, సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. నిరాధారమైతే రద్దు: విచారణలో ఫిర్యాదు నిరాధారమైనదిగా లేదా దురుద్దేశపూర్వకమైనదిగా తేలితే వెంటనే కేసు మూసేయాలి. -
రాష్ట్రానికి నిర్మలమ్మ నిరాశే మిగిల్చారు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. దేశ వ్యాప్తంగా ప్రకటించిన ఏడు రైల్వే కారిడార్లు ( మూడు హైదరాబాద్ మీదుగా) మినహా ఈసారి బడ్టెట్లో కూడా తెలంగాణ ప్రస్తావన కనిపించలేదు. విజన్–2047కు అనుగుణంగా రీజినల్ రింగురోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన వరకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఏ కార్యక్రమానికీ నిధులు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ తెలంగాణకు ఎలాంటి ఊరట దక్కలేదు. కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అమలు చేసే పథకాల్లో భాగంగానే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలి తప్ప ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాయం అడిగినా చేయలేదు ఈసారి కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అంశాల్లో కేంద్ర సహకారాన్ని ఆశించింది. ముఖ్యంగా 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధులు వస్తాయని, 2014 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలకు మోక్షం కలుగుతుందని, విభజన హామీల్లో కొన్నింటికైనా ఈసారి కేటాయింపులు ఉంటాయని రాష్ట్రం భావించింది. అయితే తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.1.65 లక్షల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇందుకోసం పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర పెద్దలు కలిశారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తోడు రాష్ట్ర ఎంపీలు, తమ శాఖలకు నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్థికమంత్రి, ప్రధాన మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ విజ్ఞప్తులేవీ కేంద్రం పట్టించుకోలేదు. రీజినల్ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టు విస్తరణ, హైదరాబాద్లో సీవరేజి మాస్టర్ ప్లాన్, వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రేడియల్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవే, ఇండ్రస్టియల్ హబ్లు, లాజిస్టిక్, రీక్రియేషన్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు, తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాలకు తోడు రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదలన్నింటినీ కేంద్ర బడ్జెట్ బుట్టదాఖలు చేసింది. రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి సహకారం ఉంటుందని ఆశించినా, అది కూడా దక్కలేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లాంటి సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమాలకు కూడా ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. మిర్చిబోర్డు, స్కిల్ వర్సిటీ లాంటి ఊసు కూడా లేకుండానే పార్లమెంటు ముందుకొచ్చిన కేంద్ర వార్షిక బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశలో ముంచెత్తింది. ఈ బడ్జెట్ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్పై కూడా ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చొరవ తీసుకుంటే ప్రయోజనం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొన్ని పథకాలు, కార్యక్రమాల విషయంలో తెలంగాణ చొరవ తీసుకుంటే... కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్రం కొంతమేర ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైస్పీడ్ రైల్ కారిడార్లకు అనుసంధానంగా రోడ్డు కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయవచ్చని అంటున్నారు. డాటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సహకారం, ఇతర దేశాల నుంచి పెట్టుబడుల సమీకరణ, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం తదితర అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాలు, కేంద్రం అందించే సాయం బట్టి కొంత ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఇక, ఆదాయ పన్ను విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడం, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల విషయంలోనూ విధానాల్లో ఎలాంటి మార్పు ప్రకటించకపోవడంతో వేతన జీవులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఈ బడ్జెట్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతుండడం గమనార్హం. స్వల్పంగా పెరిగిన పన్నుల్లో వాటా కేంద్ర పన్నుల్లో వాటా ఈసారి బడ్జెట్లో స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి గతంలో ఉన్న 41 శాతం పన్నుల్లో వాటాను ఈసారి 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 42.5 శాతానికి పెంచారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటా కూడా గత ఏడాది కంటే కొంచెం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 2.102 శాతంగా ఉన్న పన్నుల్లో వాటా ఈసారి 2.174 శాతానికి పెరగడం గమనార్హం. ఈ మేరకు రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింది రూ. 33,181 కోట్లు వస్తాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రతి నెలా సగటున రూ.2,370 కోట్ల చొప్పున మొత్తం 14 విడతల్లో ఈ మొత్తం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే, పన్నుల్లో వాటి ఈసారి రూ.4వేల కోట్ల వరకు పెరిగింది. గత బడ్జెట్లో రూ.29,280 కోట్లు రాగా, ఈసారి అది రూ.33వేల కోట్లకు పెరగడం ఒక్కటే తెలంగాణకు ఈసారి కేంద్ర బడ్జెట్లో దక్కిన ఊరట అని చెప్పుకోవచ్చు. -
కేంద్ర బడ్జెట్ పైనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆశలు
-
లక్ష కోట్లు టార్గెట్..! కేంద్ర బడ్జెట్ పైనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆశలు
-
ఏపీ కోటా నిండుకుంది!
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే 661 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోగా, ఆ రాష్ట్ర వాటా కింద ఇంకా 2.45 టీఎంసీల జలాలే మిగిలి ఉన్నాయని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రస్తుతం రోజుకి 1.5 టీఎంసీల చొప్పున కృష్ణా జలాలను ఏపీ తరలించుకుంటుండగా, ఇదే వినియోగం కొనసాగితే రెండు రోజుల్లో ఆ రాష్ట్ర వాటా నీళ్లు మిగలకుండా అయిపోతాయని తెలిపింది. కాబట్టి ఆ తర్వాత నీళ్లు తీసుకోకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమ రాష్ట్ర హక్కుగా లభించాల్సిన వాటా జలాలను పూర్తిగా తామే వాడుకుంటామని, ఇందుకుగాను ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లో మిగిలిన నిల్వలకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయంపై చర్చించడానికి సత్వరమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) మహమ్మద్ అంజాద్ హుస్సేన్ గురువారం మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల వారీగా ఇరు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలను ఆ లేఖలో తెలంగాణ పొందుపరిచింది. ఏడాదిలో మూడో లేఖ ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో అపరిష్కృతంగా ఉండడంతో రెండు రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలని 2015లో తాత్కాలిక సర్దుబాటు పేరుతో కేటాయింపులు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి బుధవారం నాటికి 833 టీఎంసీల జలాలను వాడుకోగా, ఏపీ 661.42 టీఎంసీలు (79.33 శాతం), తెలంగాణ 172.37 టీఎంసీలు (20.67శాతం) వాడుకున్నట్టు లేఖలో తెలంగాణ స్పష్టం చేసింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయంలో కనీస నిల్వ మట్టానికి ఎగువన 183.01 టీఎంసీల నీటి లభ్యతగా ఉండగా, అందులో తెలంగాణ వాటా 180.55 టీఎంసీలు ఉంటే, ఏపీ వాటా 2.45 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయని తేల్చి చెప్పింది. ఏపీ వాటాకు మించి కృష్ణా జలాలను వినియోగించుకుంటోందని ఫిర్యాదు చేస్తూ తెలంగాణ లేఖ రాయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. కట్టడి చేయమంటే వాడకం పెంచిన ఏపీ.. ఏపీ వాడకం పోగా ఆ రాష్ట్ర కోటా కింద 20 టీఎంసీల కృష్ణా జలాలే మిగిలి ఉన్నాయని, ప్రస్తుత సంవత్సరంలో అంతకు మించి నీళ్లు తీసుకోకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని ఈ నెల 17న తాము రాసిన లేఖను కృష్ణా బోర్డు తగిన చర్యల కోసం ఏపీకి పంపించగా, ఆ రాష్ట్రం ఆశ్చర్యకర రీతిలో వినియోగాన్ని మరింత ఉధృతం చేసిందని తెలంగాణ ఆరోపించింది. నాగార్జునసాగర్ కుడికాల్వతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ద్వారా భారీగా నీళ్లను తరలించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా శ్రీశైలం జలాశయం 875.50 అడుగుల వద్ద నుంచి నీళ్లు తీసుకునేందుకు అవకాశం ఉన్నా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కాల్వకు నీటి తరలింపును ఈ నెల 26 నుంచి ప్రారంభించిందని అభ్యంతరం తెలిపింది. -
20న షెడ్యూల్?.. కీలక ఘట్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్: మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని పురపాలక శాఖ పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో పురపాలక శాఖ డైరెక్టర్ సమక్షంలో 121 మునిసిపల్ చైర్మన్, 10 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్స్టేషన్ల వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రచురించారు. తాజాగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. డ్రా పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 50 శాతం మునిసిపల్ చైర్మన్, మేయర్ పదవులు కేటాయించారు. నగరాలు, పట్టణాల వారీగా ఏ కేటగిరీకి ఏది రిజర్వు చేశారనే వివరాలను వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వివాదాలకు తావులేకుండా డ్రా పద్ధతిలో కేటగిరీల వారీగా మహిళా రిజర్వుడు స్థానాలను నిర్ణయించారు. రొటేషన్ పద్ధతిలో మునిసిపల్ చైర్మన్, మునిసిపల్ వార్డులు, మేయర్, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజర్వేషన్లు నిర్ణయించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఖరారు చేసిన రిజర్వుడు స్థానాల వివరాలతో గజిట్లు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇవే వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మునిసిపల్ శాఖ కార్యదర్శి పంపించారు. వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తారని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. నేడు కేబినెట్ భేటీలో షెడ్యూల్పై చర్చ ఆదివారం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్పై చర్చించే అవకాశముంది. కేబినెట్ ఆమోదంతో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం కానుంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనల వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో మేయర్ పదవి రాష్ట్రంలోని పది మేయర్ స్థానాలకు గాను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహా మరో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లను అన్ రిజర్వుడు (జనరల్) కేటగిరీకి రిజర్వు చేశారు. ఈ కేటగిరీలో కేవలం గ్రేటర్ వరంగల్ ముసినిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మినహా మిగతా నాలుగు కార్పొరేషన్లు..జీహెచ్ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండను జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వు చేశారు. బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు కాగా మంచిర్యాల, కరీంనగర్ బీసీ జనరల్, మహబూబ్నగర్ను బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఒక్కో మేయర్ పదవిని కేటాయించారు. కొత్తగూడెంను ఎస్టీ జనరల్, రామగుండంను ఎస్సీ జనరల్కు రిజర్వు చేశారు. 300 డివిజన్లతో కూడిన జీహెచ్ఎంసీ మేయర్ పదవి ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వు అయ్యిందని, అయితే భవిష్యత్తులో జీహెచ్ఎంసీని ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారో తమకు ఇప్పటివరకు సమాచారం లేదని శ్రీదేవి చెప్పారు. ఇదిలా ఉంటే మునిసిపాలిటీల్లో బీసీలకు 38 మునిసిపల్ చైర్మన్ పదవులు రిజర్వు కాగా ఇందులో బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19 చొప్పున కేటాయించారు. జనరల్ కోటాలో 61 కేటాయించగా అందులో జనరల్లో 30, జనరల్ మహిళలకు 31 మునిసిపల్ చైర్పర్సన్ స్థానాలను రిజర్వ్ చేశారు. ఎస్టీలకు 5 మునిసిపాలిటీలు కేటాయిస్తే... మహిళలకు రెండు, ఎస్టీ జనరల్కు మూడింటిని రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో మొత్తం 17 మునిసిపాలిటీలను కేటాయిస్తే.. 9 ఎస్సీ జనరల్, 8 ఎస్సీ మహిళలకు కేటాయించారు. -
తుగ్లక్ సర్కార్కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తైనా ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. నాటి వైఎస్సార్ హయాం నుంచి బీఆర్ఎస్ పాలన దాకా ఏనాడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరగలేదని.. కానీ, ఇప్పుడు రేవంత్ ఆ పని చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. శనివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ బచావో యాత్ర జరగాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సమాచారం అందించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకునే ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘తుగ్లక్ పేరు పుస్తకాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు చూస్తున్నాం. TS నుంచి TG గా మారిస్తే ఎవరికి లాభం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేశారు. తెలంగాణ తల్లిని రూపుమాపి.. కాంగ్రెస్ తల్లిని ప్రతిష్టించారు. కాకతీయ కళాతోరణం తీసివేస్తున్నారు. అపసవ్య దిశలో పాలన సాగుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య విడదీయలేని బంధం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకోవడం మంచిది కాదు. వైఎస్ఆర్ ఆనాడు ఎంసీహెచ్ను విస్తరించినా.. హైదరాబాద్ అస్థిత్వాన్ని ముట్టుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2016లో జిల్లాలు ఎర్పాటు అయ్యి పాలన సెట్ అవుతున్న సందర్భంలో జిల్లాలను తొలగించాలని అనుకోవడం తుగ్లక్ చర్యే. తుగ్లక్ సర్కార్కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం. సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక జిల్లాగా ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. ఆరు గ్యారెంటీలు అటకెక్కించారు. జంట నగరాల్లో ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా?. కనీసం.. ఒక్క రోడ్డు వేయలేదు. రేవంత్కు తెలిసింది ఒక్కటే.. విధ్వంసం. శాంతి ర్యాలీనీ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. మా పార్టీకి చెందిన 8 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేది రేవంత్ గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే.. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు. -
బీసీల వాటా 31.4%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగావార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి బుధవారం జీవో నంబర్ 14 జారీ చేశారు. మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వుడు స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4 శాతం, కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ మహిళలకు ఒకటి, బీసీ జనరల్కు రెండు మేయర్ పదవులు దక్కనున్నాయి. -
త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. తొలుత మండలాల హేతుబద్ధీకరణ ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. సగటు మధ్య తరగతి ఉద్యోగి సంసారంలా.. ‘రాష్ట్ర ప్రభుత్వంలో 10.5 లక్షల మంది ఉద్యోగుల సైన్యం ఉంది. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల కలయికే ప్రభుత్వం. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికీ వస్తుంది. ఆ రోజున తనకు అందాల్సిన ఆర్థిక లబ్ధి తీసుకోవడం అతని హక్కు. కానీ గత ప్రభుత్వం చేతకాక వయో పరిమితిని పెంచింది. అందువల్ల ఆ సమయంలో జరగాల్సిన రిటైర్మెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఉద్యోగులకు గత ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర బకాయి పెట్టింది. అలాగే కాంట్రాక్టర్ల బిల్లులకు రూ.42 వేల కోట్లు..ఇలా అన్నీ కలిపి రూ.1.11 లక్షల కోట్లు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి అప్పులు సంక్రమించాయి. ప్రస్తుతం క్రమ పద్ధతిలో పొదుపు చేస్తూ సగటు మధ్యతరగతి ఉద్యోగి సంసారం మాదిరి రెండేళ్లుగా శ్రమిస్తూ ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నాం. గతంలో ఉద్యోగులకు ఏ రోజున జీతాలు వచ్చాయి.. ఇప్పటి పరిస్థితి ఏమిటో సమీక్షించుకోవాలి. ఉద్యోగులకు పెద్దన్నగా ఓ తీపి కబురు ఉద్యోగులకు పెద్దన్న మాదిరిగా ఇక్కడికి వచ్చా. తీపి కబురు చెప్పకుండా ఉండడం సబబు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చా. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు రూపొందిస్తున్నాం. రూ.1.02 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఉద్యోగులు పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయం విషయంలో మరింత కృషి చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత వేగంగా గాడిన పడుతుంది. ఉద్యోగ సంఘ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ముందుగా హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయం నిర్మించుకోవాలి. ఉద్యోగ సంఘం ఎంత నిధి ఇస్తుందో.. అదే స్థాయిలో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది..’ అని సీఎం చెప్పారు. టీజీవో అధ్యక్ష కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, బి.శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఏలూరు.. సచివాలయంలో విలేకరులకు తెలిపారు. పెండింగ్ బిల్లుల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.700 కోట్లను ఏప్రిల్ నుంచి రూ.1,500 కోట్లకు పెంచుతామని చెప్పారన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సీఎం, మంత్రులకు టీజీవో తరఫున ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్రాన్ని అప్పులపాలు చేయబోం: భట్టి
గోదావరిఖని/ములుగు: గత పాలకుల మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయనీయబోమని, అన్నిరంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లి 2047నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గానికి 3,500 మంది లబి్ధదారులను ఎంపిక చేశామన్నారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం లభించిందని స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ వస్తామని, పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తానని చెప్పారు.సింగరేణి పరిరక్షణకు కృషి సింగరేణి సంస్థ అభివృద్ధి, పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భట్టివిక్రమార్క అన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజావసరాల కోసం నిత్యం తపిస్తున్న నాయకుడు రాజ్ఠాకూర్ అని ప్రశంసించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన యాత్రలో నా వెంట నడిచిన రాజ్ఠాకూర్కు ఆనాడే ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కొండా సురేఖ, ప్రిన్సిపల్ ఎనర్జీసెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ పాల్గొన్నారు. రెండుమూడు రోజుల్లో మేడారం పనులు పూర్తి సమ్మక్క–సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మేడారం జాతర నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో ఆదివారం మధ్యాహ్నం 3:26 గంటలకు మేడారం చేరుకున్నారు. కాన్వాయిలో ఆర్టీసీ పాయింట్, జంపన్న వాగు వద్దకు చేరుకొని వాహనంలో నుంచే పనులు పర్యవేక్షించారు. 3:50 గంటలకు హరిత హోటల్కు చేరుకొని అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రుల పర్యవేక్షణలో మేడారంలో అభివృద్ధి పనులు పూర్తికావొచ్చాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లోగా మిగిలిన పనులు కూడా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశ అనంతరం గద్దెల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. -
తెలంగాణలోనూ చిరంజీవి సినిమా టికెట్ ధరల పెంపు
ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రానికి తెలంగాణలో టికెట్ ధరలు పెంచినందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కి పెంపు ఉంటుందా లేదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'రాజాసాబ్'లానే దీనిపై కూడా ఎవరైనా న్యాయవాది పిటిషన్ వేసే అవకాశముంది. కాకపోతే ఈ రెండు రోజుల కోర్టు సెలవులు కాబట్టి సోమవారం నాడు ఇలాంటిది ఏమైనా ఉండే అవకాశముంది.'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ సంగీతమందించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్')ఏపీలో జారీ చేసిన జీవో విషయానికొస్తే ముందు రోజు వేసే స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరని జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయి.ఆపై తొలి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది. -
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
పురం.. సత్వరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారు, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని.. జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్ 195–ఎ ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. రాణీ కుముదిని ఈ నెల 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని ‘టి పోల్’యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన రిటరి్నంగ్ అధికారులు, సహాయ రిటరి్నంగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను వెంటనే నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. పోలింగ్ కోసం అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. నేడు రాజకీయ పార్టీలతో భేటీ ఇప్పటికే జిల్లా స్థాయిలో రాజకీయ పక్షాలతో ఈ నెల 5న సమావేశాలు నిర్వహించగా, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇదిలావుంటే ఈ నెల 16 నాటికి ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లపై స్పష్టత రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ఎస్ఈసీ దృష్టి పెట్టనుంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా కొత్త పాలకమండళ్లు! మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నెల మూడోవారంలోగా షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖరుకు కొత్త పాలక మండళ్లకు పురపాలన బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ పురపాలికల చట్ట సవరణ’బిల్లును ఆమోదించారు. గతంలో నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లోనూ 48 డివిజన్లుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. -
డే-4.. కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో.. తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు–2026ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చతో పాటు ఆమోదం తెలపనుంది సభ. పాల్వాయి హరీష్, బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్.. డీఆర్డీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారుఅధికారుల అవినీతి పై నేను ఎక్కని గడుప లేదుఅన్ని స్థాయిల్లో అధికారులకు అవినీతి పై ఫిర్యాదు చేసాంప్రభుత్వం డీఆర్డీఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అలాగే.. తెలంగాణ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికలను రిలీజ్ చేయనుంది. 2015-16 నుంచి 2018-19 వరకు ఆడిట్ నివేదికలు టేబుల్ చేయనుంది ప్రభుత్వం. దీంతో పాటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్టన్) పాలసీపై షార్ట్ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. -
సచివాలయ ఉద్యోగులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో తెలంగాణ సెక్రటేరియట్లో ఉద్యోగుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం కొత్త ఐడి కార్డులను ప్రవేశపెట్టింది. గత కొద్ది నెలలుగా సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో నకిలీ ఉద్యోగులను అరికట్టేందుకు కొత్త ఐడీ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. కార్డులపై సెక్రటేరియట్ భవనం,తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిరూపాలను ముద్రించింది. అదనంగా క్యూ ఆర్ కోడ్, ఇంటర్నల్ చిప్, ఎంప్లాయి నెంబర్, ఫోటో వంటి వివరాలను చేర్చింది. రెగ్యులర్ ఉద్యోగులు 1300 మంది, క్లాస్-4 ఉద్యోగులు 300 మంది.. మొత్తం 1600 మందికి ఈ కొత్త ఐడి కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే ఉద్యోగుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఐడి కార్డుల ద్వారా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసింది. మార్ఫింగ్ లేదా నకిలీ కార్డులు తయారు చేసే అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల గుర్తింపును సాంకేతిక ఆధారాలతో నిర్ధారించే ప్రయత్నం జరుగుతోంది. -
డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: అక్రిడేషన్ల విషయంలో జీవో 252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో.. వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలంటూ టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్టీ నేతలు మంగళవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని, జీవో 252ను సవరించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే.. స్పోర్ట్స్, కల్చరల్, ఫీచర్ ప్రతినిధులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రిపోర్టర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తా. ఆ అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తా. జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా జీవో 252ను వివరిస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ఫెడరేషన్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అక్రిడిటేషన్ల జీవో నెంబర్ 252పై పలువురు జర్నలిస్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం.. ఫీల్డ్ రిపోర్టర్లకు ‘అక్రిడిటేషన్ కార్డు’, డెస్క్ జర్నలిస్టులకు కేవలం ‘మీడియా కార్డు’ జారీ చేయాలని నిర్ణయించింది. ఒకే వృత్తిలో ఉన్న వారిని రిపోర్టర్లు, డెస్క్ అని రెండు వర్గాలుగా విభజించడం జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడమేనని ఇటు జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక.. మీడియా కార్డు వల్ల రైల్వే, బస్సు పాస్ రాయితీలు, టోల్ గేట్ మినహాయింపులు వంటి కనీస ప్రయోజనాలు కూడా అందే అవకాశం లేదని డెస్క్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నట్లుగానే డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జీవో వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని యూనియన్లు అంటున్నాయి. ఈ క్రమంలో.. జీవో విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులో పోరాటానికి సిద్ధమయ్యాయి. -
తెలంగాణలో మద్యం అమ్మకాలు.. స్పెషల్ జీవో రిలీజ్
సాక్షి, హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 సందర్భంగా.. రేపు అర్ధరాత్రి 12 దాకా మద్యం అమ్మకాల నిర్వహణకు వైన్స్ దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. అలాగే.. బార్లు, క్లబ్లతో పాటుగా ఈవెంట్లు నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నవారికి అర్ధరాత్రి 1.గం. దాకా మద్యం అమ్మకానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలకు ఇదివరకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడంతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నేతృత్వంలో ఇవాళ, రేపు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల పాత ఏడాదికి వీడ్కోలు.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఈవెంట్లు సిద్దమైయాయి.ఈ క్రమంలో రాజధాని శివారు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. ఈఏడాది కూడా కోట్ల రూపాయల దందా సాగుతుందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది. అయితే.. ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేయకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తగిన ఏర్పాటు చేస్తోంది. మరోవైపు.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల శాఖ అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. రోడ్లపై ద్విచక్ర వాహనాలతో హంగామా చేస్తే కేసు నమోదు తప్పదని పేర్కొంది. -
‘సంక్షేమం’లో సర్కారోళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అనర్హులకు చేరుతున్నాయా? వేల సంఖ్యలో సంపన్నులు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా? అందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల వెల్లడైన నివేదికలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం సేకరించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ వివరాలు.. ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల లబ్ధిదారుల వివరాలతో సరిపోలినట్లు తేలింది. 800 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమ పథకాలను కూడా తీసుకుంటున్నారని నామమాత్రపు సర్వేలో వెల్లడైన నేపథ్యంలో అన్ని సంక్షేమ పథకాలపై నిశిత పరిశీలన జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సామాజిక పింఛన్లతోపాటు ఇతర అన్ని సంక్షేమ పథకాలపై ఆడిట్ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. నాలుగు చోట్ల.. నిశిత ఆడిట్ వివిధ వర్గాల పేదలు, నిర్దేశిత కేటగిరీలకు చెందిన నిజమైన లబ్ధిదారులకు దక్కాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు పలువురు ప్రభుత్వ అధికారులు మొదలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇంటికి చేరుతున్నాయి. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి జీతాలు, అలవెన్స్లు పొందుతున్న 478 మంది రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు పొందుతున్న 338 మంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఈవిధంగా పలు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్న వారిలో అధిక మొత్తాల్లో వేతనాలు, అలవెన్స్లు పొందుతున్న అధికారులు, ఉద్యోగులతోపాటు లగ్జరీ కార్లు, మూడంతస్తుల భవనాలు, పెట్రోల్ బంక్ల యజమానులు కూడా ఉండటం ఆశ్చర్యం గొలుపుతోంది. అదికూడా కేవలం కరీంనగర్, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్లు, ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వపరంగా నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’లోనే ఇంతమంది అనర్హులు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్నట్టు తేలింది. మరింత లోతుగా పరిశీలన చేస్తే... ప్రధానంగా సామాజిక పెన్షన్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అవకతవకలు మచ్చుకు కొన్ని బయటపడ్డాయి. మొత్తంగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డేటాను వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటాతో లింక్ చేసి ఆధార్ సమాచారాన్ని ‘క్రాస్ వెరిఫై’ చేసినప్పుడు... 37 వేల మందికిపైగా ఉద్యోగులు (రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఇతరులు కలిపి) ప్రయోజనం పొందుతున్నట్టుగా వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగుల (కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సహా) ఆధార్ వివరాలను వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాబేస్తో సరిచూసినప్పుడు ఈ ఉద్యోగుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’ కేవలం ఉపరితలాన్ని మాత్రం స్పృశించినట్టుగా కొంత సమాచారం మాత్రమే బయటకు వచ్చిందని, మరింత లోతుగా పరిశీలన జరిపితే ఇతర పథకాల ద్వారా కూడా పలువురు ఉద్యోగులు ప్రయోజనాలు పొందే విషయం వెలికితీసే అవకాశం ఉందని అంటున్నారు. అక్రమంగా ‘చేయూత’ ఆధార్ కార్డుల పరిశీలన అనంతరం చేయూత పథకం సామాజిక పింఛన్ లబ్ధి పొందుతున్న ఉద్యోగుల వివరాలను కేటగిరీల వారీగా ప్రభుత్వానికి పంపారు. ఈ పథకంలో అంగన్ వాడీ హెల్పర్లు (1521), టీచర్లు (487), ఏఎన్ఎం (100), అర్చకులు (178), ఆర్టిజన్ (167), ఆశావర్కర్లు (1,280), కుక్లు (3,667), ఆయాలు (33), కండక్టర్లు (42), కాంట్రాక్టు టీచర్లు (35), డాటా ఎంట్రీ ఆపరేటర్లు (98), డ్రైవర్లు (68), ఫీల్డ్ అసిస్టెంట్లు (84), హోంగార్డులు (110), జూనియర్ లెక్చరర్లు (30), కామాటి (61), మౌజాం, ఇమాంలు (514), మల్టీపర్పస్ వర్కర్లు (2,263), అటెండర్లు (289), పబ్లిక్ హెల్త్ మేనేజర్లు (629), శానిటరీ సిబ్బంది (1145), పీజీటీలు (47), ఎస్జీటీ, టీజీటీలు (71), సెక్యూరిటీ గార్డులు (119), స్వీపర్లు (288), వీవోఏ (645), వీఆర్ఏ (164), వాచ్మెన్ (90) మంది కూడా ఉన్నారు. అలాగే, చాలా తక్కువ సంఖ్యలో వొకేషనల్ టీచర్లు, స్టాఫ్ నర్సులు, స్పెషల్పోలీస్ అధికారులు, స్పెషల్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ (సెకండ్ క్లాస్), లెక్చరర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఆరోగ్య మిత్రలు కూడా ఉన్నారని వెల్లడైంది. వీరిలో ఎవరికి ఇవ్వాలి? ఇలా పథకాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది ఆదాయ పరిమితికి లోబడి సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపికైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా పథకాలను పొందేందుకు అవసరమైన మేరకు వారి వేతనం లేని కారణంగా వీరు లబ్ధి పొందేందుకు అర్హులేననే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, దినసరి కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, అర్చకులు, ఆర్జిజన్లు, కుక్లు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, మౌజం, ఇమాంలు, వీఏవో, వీఆర్వోలు, ఎస్పీవోలు, పార్ట్టైం ఉద్యోగుల విషయంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరింది. గ్రాంట్ఇన్ ఎయిడ్ రెగ్యులర్, మినిమమ్ టైమ్ స్కేల్, రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, టైంస్కేల్ పొందుతున్న ఇతర కేటగిరీల ఉద్యోగులకు మాత్రం ఆయా పథకాలను వెంటనే నిలిపివేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసరా పింఛన్లపై సోషల్ ఆడిట్ నిర్వహణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశించగా, మిగిలిన సంక్షేమ పథకాలపైనా ఆడిట్ నిర్వహించే దిశలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ వివిధ పథకాలు పొందుతున్న వారు.. ఉల్లంఘనలు ఇలా... ⇒ నెలకు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్న అధికారులు, ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు చేయూత పింఛన్లు పొందుతున్నారు. ⇒ కార్లు, ట్రాక్టర్లు, సొంతిళ్లు ఉన్నవారూ ప్రయోజనాలు అందుకుంటున్నారు. ⇒ డిజేబిలిటీ పింఛన్లు... వైకల్యం లేకపోయినా కొందరికి అందుతున్నాయి. ⇒ 50 ఏళ్లు దాటని వారు కూడా వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. -
జీహెచ్ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు విస్తరించడంతో పాటు, జోన్లు సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, 30 సర్కిల్స్ను 60కు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది.జీహెచ్ఎంసీ వార్డుల డీ లిమిటేషన్పై కూడా ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు, పదిరోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6 వేలకు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఈరోజు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నిర్ణయంతో GHMC పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఉండటం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
కమీషన్కే ఏటా రూ.600 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై కాసుల వర్షం కురుస్తోంది. నిర్దేశించిన విధులను నిర్వర్తించడంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శ్రమిస్తుంటే..వారికి అరకొరగా వచ్చే వేతనం నుంచి కమీషన్ల కింద ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే సొమ్ముతో ఏజెన్సీలు జేబులు నింపుకుంటున్నాయి. కేవలం కమీషన్ పేరిట రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నెలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.600 కోట్ల మేర సంపాదిస్తుండటం గమనార్హం. కాగా తమ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోతలు, వేతన చెల్లింపుల్లో జాప్యంతో జమ అయ్యే వడ్డీ, ఇతరత్రా రూపాల్లో అందిన కాడికి దండుకుంటున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఏజెన్సీల ఇష్టానుసార నిర్ణయాలతో వారికి వేతనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. రావాల్సిన మొత్తం కంటే తక్కువగా ముట్టజెపుతుండటంతో, పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉండటంపై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పరిపాలన సజావుగా సాగాలనే పేరిట.. పరిపాలనను సజావుగా కొనసాగించేందుకు, ఉద్యోగ ఖాళీలతో ఏర్పడే సమస్యను అధిగమించేందుకు ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఉద్యోగులను నేరుగా నియమించుకోకుండా.. ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసుకుని వాటి ద్వారా అర్హత కలిగిన వ్యక్తులను వివిధ శాఖల్లోకి తీసుకుంటోంది. ప్రభుత్వానికి అవసరమైన సర్వీసులను నేరుగా వారి నుంచి పొందుతున్నప్పటికీ.. వేతనాలను మాత్రం ఏజెన్సీల ఖాతాకు విడుదల చేస్తుండటం ఇక్కడ గమనించవలసిన విషయం. అలా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ఏజెన్సీ ప్రతినిధులు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో ఏజెన్సీ కమీషన్తో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్, జీఎస్టీ కోతపెట్టి వేతనాలు చెల్లిస్తారు. దీంతో వేతన పట్టికలో కన్పించే మొత్తం, వాస్తవంగా చేతికందే వేతనంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. శాశ్వత ఉద్యోగులతో దాదాపు సమానంగా.. రాష్ట్ర ప్రభుత్వంలోని 31 శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రజలకు సర్వీసులు అందిస్తున్న శాఖల్లోనే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అత్యధికంగా ఉండటం గమనార్హం. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం..పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు 5,21,692 మంది కాగా... ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారు 4,93,820 మంది ఉన్నారు. అయితే ఇటీవల ఆర్థిక శాఖ ఆధార్ వివరాలు సేకరించగా.. కేవలం 2,74,844 మంది వివరాలు మాత్రమే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ అయ్యాయి. ఆధార్లో పేర్లు తప్పుగా నమోదు కావగడం లాంటి కారణాలతో మిగిలిన ఉద్యోగుల వివరాలు అప్లోడ్ కాలేదు. దీంతో ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎంట్రీ చేయనున్నారు. బేసిక్ కంటే తక్కువగా అందుతున్న వేతనం శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో వేతనాలను ఖరారు చేస్తే... ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి మాత్రం మూడు రకాల స్కేళ్లలో వేతనాలు అందిస్తున్నారు. జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసే వారిని మూడు కేటగిరీలుగా నిర్దేశించి వేతనాలు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి బేసిక్ వేతనం రూ.15,600గా నిర్ణయిస్తే...ఈపీఎఫ్ రూ.2,028, ఈఎస్ఐ రూ.507, జీఎస్టీ రూ.3,377, ఏజెన్సీ కమీషన్ రూ.624గా పేర్కొంటున్నారు. ఇవన్నీ కలిపితే ఉద్యోగి మొత్తం వేతనం రూ.22136 కాగా.. ఇందులో నిర్దేశించిన కేటగిరీల (ఈపీఎఫ్, ఈఎస్ఐ) కింద కోత పెడుతున్నారు. మరోవైపు డిడక్షన్ (ఇది కూడా కోతే) కింద దాదాపు రూ.2 వేలు కోత పడుతోంది. చివరకు ఉద్యోగికి రూ.13,611 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఆ ఉద్యోగి బేసిక్ వేతనం కంటే తక్కువగా చేతికందుతోందన్నమాట. ప్రస్తుతం ప్రైవేటు సంస్థల్లో ఎంట్రీ స్థాయిలోనే రూ.20 వేల చొప్పున వేతనాలు అందుతుండగా... ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారికి అత్యంత తక్కువగా వేతనాలు అందుతుండడం గమనార్హం. ఉద్యోగి కష్టం ఏజెన్సీ పాలు.. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టం చివరకు ఏజెన్సీలపాలవుతోందనే విమర్శలున్నాయి. ఒక ఉద్యోగి సగటు వేతనం నుంచి అధికారికంగా దాదాపు 4 శాతం నేరుగా ఏజెన్సీకి వెళుతోంది. ప్రభుత్వం సకాలంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు వేతనాల నిధులు బ్యాంకుల్లో జమ చేస్తున్నప్పటికీ.. ఏజెన్సీలు వాటిని వెంటవెంటనే ఉద్యోగులకు విడుదల చేయడం లేదు. తద్వారా బ్యాంకులో జమ అయిన నిధులకు సంబంధించిన వడ్డీతో ఏజెన్సీలు లబ్ధి పొందుతున్నాయి. మరికొన్ని ఏజెన్సీలు గైర్హాజరు, ఇతరత్రా కారణాలను చూపుతూ ప్రభుత్వానికి, అధికారులకు తెలియకుండా వేతనాల్లో కోతలు పెడుతున్నాయి. వాస్తవానికి ఏజెన్సీల విధానంపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఆ కార్పొరేషన్ ద్వారానే ఉద్యోగుల ఎంపిక చేపట్టడంతో 4 శాతం కమీషన్ నిధులు కూడా నేరుగా ఉద్యోగికే అందుతున్నాయి. పైపెచ్చు ఎలాంటి అనధికారిక కోతలకు తావుండటం లేదు. ఈ విధానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్లాంటి రాష్ట్రాలు పక్కాగా అమలు చేస్తుండటం గమనార్హం. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ శాఖల్లో ఏజెన్సీల ద్వారా ఉద్యోగుల ఎంపిక విధానంలో మార్పులు చేయాలి. ప్రభుత్వం నేరుగా నియమించుకోవడమో, లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నియమించుకోవడమో చేయాలి. దీనివల్ల ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ఈ ప్రక్రియలో కార్మిక ఉపాధి కల్పన, ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్లకు బాధ్యత అప్పగించాలి. మరోవైపు ఏజెన్సీలకు కమీషన్ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. దీంతో ఉద్యోగులకు కొంచెం ఎక్కువ వేతనం అందుతుంది. కోతలకూ తావులేకుండా వేతనం అందడం వల్ల వారి జీవన పరిస్థితులు మెరుగు పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయాలి. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం ఒక పాలసీని తెచ్చిన ప్రభుత్వం.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలి. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం -
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇక మీదట ప్రభుత్వ భవనాల్లో కొనసాగాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్ భవనాల అద్దె చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది2026 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ భవనాల్లోనే పని చేయాలని అన్ని శాఖలకు, యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వర్సిటీలను వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని పేర్కొంది. డిసెంబర్ 31లోపు ప్రభుత్వ భవనాలకు షిఫ్ట్ అవ్వాలని.. అన్ని శాఖలు ప్రభుత్వ స్థలాల గుర్తింపు పూర్తిచేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాధిపతులే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని.. ఆ అద్దెలు వాళ్లే చెల్లించాల్సి వస్తుందని సర్కార్ హెచ్చరించింది. -
300 ఎకరాలు రూ. 8,000 కోట్లు!
శాసనసభకు కూతవేటు దూరంలోని హౌసింగ్ బోర్డు స్థలంలో వెలిసిన పెట్రోల్ బంకు.. దాని లీజు గడువు ముగిసి 20 ఏళ్లు అవుతోంది. కానీ ఖాళీ చేయట్లేదు. పోనీ లీజు అద్దె చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు. నామమాత్రపు చిల్లర డబ్బులు అడపాదడపా చెల్లిస్తూ దాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. రూ.కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా అనుభవిస్తూ ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెడుతున్నారు.విజయనగర్ కాలనీ సమీపంలోని ఫంక్షన్ హాల్ అది. ఓ రాజకీయ నాయకుడి గుప్పిట్లో చిక్కుకుంది. దశాబ్దాల క్రితం హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకొని దర్జాగా ఆ నేత వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ లీజు అద్దె మాత్రం చెల్లించట్లేదు. ఖాళీ చేయాలని కోరితే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. అత్యంత విలువైన ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డు భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకొనే వీల్లేక.. లీజు రూపంలో ఆదాయం పొందలేక తెలంగాణ గృహనిర్మాణ మండలి కునారిల్లుపోతోంది. ఈ తరుణంలో అలాంటి భూములను ప్రస్తుతం వాటిని అనుభవిస్తున్న వారికి మార్కెట్ ధరకు అమ్మాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. బహిరంగ వేలం ద్వారా మరింత ఎక్కువ మొత్తాన్ని ఇంకా ఎక్కువకు విక్రయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. త్వరలో కేబినెట్ ముందు ఈ మేరకు ప్రతిపాదించి అందుకు ఆమోదం పొందేందుకు గృహనిర్మాణ శాఖ చర్యలు ప్రారంభించింది. రూ. 8 వేల కోట్ల వరకు ఆదాయం... హైదరాబాద్లోని కోకాపేట పరిసరాల్లోని భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇటీవల పలుమార్లు వేలం వేయగా రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోవడం తెలిసిందే. అలాగే మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని భూములు, అసంపూర్తి బహుళ అంతస్తుల భవన సముదాయాలను కూడా విక్రయిస్తోంది. ఇదే తరహాలో తెలంగాణ గృహనిర్మాణ మండలి భూములను కూడా విక్రయించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు మండలి అధికారులు ప్రభుత్వానికి వివరాలు సమరి్పంచారు. ఏయే భూముల్ని విక్రయించే అవకాశం ఉందో లెక్కలు తేల్చారు. వివిధ పద్ధతుల్లో లీజుల్లో ఉన్న ఈ భూములను విక్రయించడం ద్వారా సుమారు రూ. 8 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని గృహనిర్మాణ శాఖ అంచనా వేస్తోంది. లీజు భూములతోనే చిక్కు... గృహ నిర్మాణ మండలి వాణిజ్య అవసరాలకు భూములను లీజుకు ఇచ్చింది. కొన్నింటిని ప్రార్థనా స్థలాలకు, కబరిస్తాన్లకు ఇవ్వగా మరికొన్నింటిని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు అప్పగించింది. వాటి నుంచి నెలవారీగా రూ. 40 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉండగా నామమాత్రంగా చిల్లర పైసలు మాత్రమే వసూలవుతున్నాయి. లీజు ధరలను గతంలో సవరించినా ఆ మొత్తాన్ని చెల్లించేందుకు లీజుదారులు ముందుకు రావట్లేదు. లీజు గడువు పూర్తయిన వారు వాటిని ఖాళీ చేయట్లేదు. గతంలో చదరపు అడుగుకు రూ. 7 నామమాత్రపు లీజు ధర ఉండగా దాన్ని ఓసారి సవరించి రూ. 30కి పెంచారు. కానీ అందులో మూడో వంతు కూడా చెల్లించేందుకు లీజుదారులు ముందుకు రావట్లేదు. రూ. 10 చొప్పున అడపాదడపా చెల్లించి ఆయా స్థలాలను ఖాళీ చేయకుండా అ«దీనంలో ఉంచుకుంటున్నారు. హైదరాబాద్లో ఇలాంటి 115 ఆస్తులు ఉండగా వాటి మొత్తం విస్తీర్ణం దాదాపు 256 ఎకరాలుగా ఉంది. వాటిల్లో ధార్మిక, కబరిస్తాన్ స్థలాలు పోను మిగతా వాటిని లీజుదారులకు విక్రయించడం లేదా బహిరం™గ వేలం ద్వారా విక్రయించడం తక్షణ అవసరమని గృహనిర్మాణ శాఖ తాజాగా నిర్ణయించింది. ఇలా విక్రయించడం ద్వారా సబ్ రిజిస్ట్రార్ ధర ప్రకారమైతే రూ. 2,450 కోట్లు, మార్కెట్ ధర ప్రకారమైతే రూ. 7,400 కోట్లు పొందొచ్చని అంచనాకొచ్చింది. వాణిజ్య సముదాయాల్లోని దుకాణాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పక్కన మిగిలి ఉన్న చిన్నచిన్న స్థలాల విక్రయం ద్వారా మరో రూ. 600 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తోంది. దుకాణాల విక్రయం... హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రంలో సొంత జాగాలో గృహనిర్మాణ మండలి కాంప్లెక్సులు నిర్మించింది. నాంపల్లి, బాగ్లింగంపల్లి, కేపీహెచ్బీ, సికింద్రాబాద్, ఎస్ఆర్ నగర్, బషీర్బాగ్, ఫతేమైదాన్, విద్యానగర్, సంతోశ్నగర్ తదితర చోట్ల ఉన్నాయి. వాటిల్లో 201 దుకాణాలను అద్దెకిచ్చారు. గతంలో ఓసారి 14 దుకాణాలను వాటి నిర్వాహకులకే విక్రయించగా మిగతావి ఉన్నాయి. ఐదేళ్లకోసారి అద్దెలను సవరించి 50 శాతం మేర పెంచాలనే ఒప్పందం ఉన్నా దుకాణాల నిర్వాహకులు దాన్ని పట్టించుకోకపోగా అద్దె చెల్లించకుండా, దుకాణాలు ఖాళీ చేయకుండా మొండికేస్తున్నారు. దుకాణదారుల నుంచి అద్దె వసూలు కష్టంగా మారిన నేపథ్యంలో వాటిని గంపగుత్తగా విక్రయించాలని నిర్ణయించారు.ఇంటి పక్క స్థలాల విక్రయం... కేపీహెచ్బీ లాంటి హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఇప్పటికీ అక్కడక్కడా చిన్నచిన్న ప్లాట్లు మిగిలిపోయాయి. వాటి నుంచి బోర్డుకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వాటి పక్కనే ఉన్న ఇళ్ల వారికి వాటిని విక్రయించాలని ఇప్పుడు నిర్ణయించారు. ఇలాంటివి దాదాపు 400 బిట్లు ఉన్నాయి. సగటున ఒక్కోటి 35 గజాల మేర ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ ధర ప్రకారం వాటిని విక్రయించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సైనికులకు... విజయనగర్ కాలనీలో హౌసింగ్ బోర్డుకు దాదాపు 40కిపైగా ఆస్తులున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు అప్పట్లో ఒక్కోటి వెయ్యి గజాల (గరిష్టంగా) వరకు ఉన్న ప్లాట్లను కేటాయించారు. అవన్నీ లీజు రూపంలో ఇచ్చినవే. కానీ వాటి నుంచి లీజులు వసూలు కావట్లేదు. ఈలోగా కొందరు వాటిని ఇతరులకు విక్రయించడంతో ప్రస్తుతం ఆ ప్లాట్లు కొన్న వారి వారుసుల చేతుల్లో ఉన్నాయి. వాటి మార్కెట్ ధర నిర్ణయించి విక్రయించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో గజం ధర రూ. లక్షకుపైగా ఉన్నప్పటికీ ఆ భూములను కబ్జాలో ఉంచుకున్న వారు కేవలం గజం రూ. 5 వేలు చొప్పున నిర్ణయించి తమకు విక్రయించాలని గృహనిర్మాణ మండలికి విన్నవించారు. రూ. 350 కోట్లకుపైగా విలువైన భూములను కేవలం రూ. 10 కోట్లకే కొట్టేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ, మార్కెట్ ధర నిర్ధారించి విక్రయిస్తామని గృహనిర్మాణ మండలి పేర్కొంటోంది. ఇలా మొత్తంగా అన్ని కలిపితే 300 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. హౌసింగ్ బోర్డు లీజు స్థలాలు, షాపుల క్రమబద్ధీకరణహౌసింగ్ బోర్డుకు చెందిన అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. హౌసింగ్ బోర్డు భూములపై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇవ్వగా వాటిలో ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అద్దె బకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. లీజు ఒప్పందం పునరుద్ధరించుకోని సంస్థలకు లేఖలు రాసి వాటి క్రమబదీ్ధకరణకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బోర్డుకు 301 కమర్షియల్ షాపులు ఉండగా 2007లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 14 మంది షాపులు కొనగా మిగిలిన 287 షాపులకుగాను ప్రస్తుతం 62 షాపులు ఖాళీగా ఉన్నాయన్నారు. బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ఏటా 10 శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండగా ఈ నిబంధన అమలు కాకపోవడంతో షాపు యజమానుల నుంచి బోర్డుకు రూ. కోట్లు రావలసి ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షాపు లు నిర్వహిస్తున్నవారు వాటిని కొనేందుకు ముందుకొస్తే మార్కెట్ ధరకు విక్రయించడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. షాపు నిర్వహణకు అనువుగా లేని స్థలాలను వేలంలో విక్రయించాలన్నారు. అలాగే బోర్డు గతంలో కేటాయించిన ఇళ్ల పక్కనే ఉన్న 100 గజాల్లోపు స్థలాలను ఆ ఇంటి యజమానికి ఆసక్తి ఉంటే విక్రయించాలని సూచించారు. గతంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజి్రస్టేషన్ చేసుకోని వారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని చెప్పారు. మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ, 100 గజాల్లోపు స్థలాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల వివరాలు, రిజి్రస్టేషన్ చేసుకొని పక్కనే ఉన్న 100 గజాలలోపు స్థలాన్ని అడుగుతున్న వారి వివరాలు తదితర అంశాలపై పూర్తిస్ధాయి నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వాటన్నింటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి 'టాలీవుడ్' కన్ఫ్యూజన్.. పరిష్కారమే లేదా?
టికెట్ రేట్ల పెంపు అనేది తెలంగాణలో పెద్ద జోక్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి రెండుసార్లు జరిగితే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ పదేపదే జరగడం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ విషయంలో ఎందుకింత కన్ఫ్యూజన్ అనే సందేహం వస్తోంది. అసలు ప్రస్తుతం ఏం జరుగుతోంది? దీనికి పరిష్కారం లేదా?టాలీవుడ్లో టికెట్ రేట్ల పెంపు చాన్నాళ్లుగా ఉన్నదే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. రీసెంట్ టైంలో జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. గతేడాది డిసెంబరులో 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం మీకు తెలిసే ఉంటుంది. ఇది జరిగిన వెంటనే ఇకపై తెలంగాణలో ప్రీమియర్స్కి అనుమతి ఇవ్వబోం, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోం అని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు.కొన్నాళ్ల పాటు ప్రభుత్వం.. టికెట్ రేట్ల విషయంలో చెప్పిన మాటపై నిలబడింది. తర్వాతే మెల్లమెల్లగా సడలింపులు మొదలయ్యాయి. కొన్నాళ్ల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ విషయమై ఒకరు హైకోర్టుని ఆశ్రయించగా.. ప్రభుత్వంపై మొట్టికాయలు పడ్డాయి. సరే ఇకనైనా పాటిస్తారేమో అనుకుంటే.. తాజాగా 'అఖండ 2' విషయంలో ఏకంగా హైకోర్ట్ ఆదేశాల్నే ధిక్కరించారు.ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ ధరల్ని పూర్తిగా తగ్గించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నిర్మాతలు వీటిని పాటించలేదు. ఇదే విషయమై మరో పిటిషన్ వేయగా హైకోర్టు.. చిత్రబృందాన్ని ప్రశ్నించించింది. హైకోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నిర్మాతలు డివిజన్ బెంచ్ని ఆశ్రయించగా కాస్త ఊరట లభించింది.'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు గురించి తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా అధికారులు జీవో జారీ చేశారని, ఇకపై దర్శకనిర్మాతలు ఎవరూ తమ దగ్గరకు రావొద్దని అన్నారు. అయితే మంత్రికే తెలియకుండా జీవో జారీ చేసే అవకాశముందా? అనేది ఇక్కడ అర్థం కాని విషయం! ఇలా ప్రతిసారి 'టాలీవుడ్' విషయంలో తెలంగాణ ప్రభుత్వం కన్ఫ్యూజన్ అవుతూనే ఉంది.సరే 'అఖండ 2' విషయంలో జరిగిందేదో జరిగిపోయిందని అనుకుందాం. రాబోయేది సంక్రాంతి సీజన్. చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి మంత్రి కోమటిరెట్టి వెంకటరెడ్డి చెప్పినట్లు ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకుండా ఉంటారేమో చూడాలి? లేదంటే మళ్లీ జీవో జారీ చేసి హైకోర్టుతో చెప్పించుకుంటారా అనేది చూడాలి?ఏదేమైనా టికెట్ రేట్ల పెంపు విషయమై ఇండస్ట్రీ, ప్రభుత్వం ఒకచోట కూర్చుని ఓ క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. లేదంటే ప్రతిసారి ఇలా గందరగోళపడటమే అవుతుంది. టికెట్ రేట్ల పెంపు ఏమో గానీ ప్రేక్షకుడు క్రమక్రమంగా తెలుగు సినిమాకు దూరమవుతూనే ఉన్నాడు. థియేటర్లకు వచ్చి చూసే వాళ్లు రోజురోజుకీ తగ్గిపోతున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదే నిజం. దర్శకనిర్మాతలు హీరోలకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో? -
వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలుపుదాం
సాక్షి, హైదరాబాద్: వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ ఆర్డీ)లో జరిగిన ‘దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై న్యూ మిస్ మ్యాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్లో ఆయన ప్రసంగించారు. వారసత్వ ఆధారిత పరిశోధనకు తెలంగాణ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో మన రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ హబ్గా తీర్చిదిద్ద డంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందన్నారు. దక్షిణ భారతదేశానికి అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉందని, శాతవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్వర్క్లను నాణేల ద్వారా విస్తరించగా, కాకతీయుల నుంచి విజయన గర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నాణేలు ఆవిష్కరణ, కళాత్మకత, రాజ్యపాలనకు ప్ర తీకగా నిలిచాయని చెప్పారు. ఈ సదస్సు స్వతహా గానే చరిత్రాత్మకమైనదని, వారసత్వ శాఖ ఇంతకు ముందు పురావస్తు, మ్యూజి యంల శాఖ 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ సదస్సు రెండురోజులు జరిగే కార్యక్ర మంగా మాత్రమే కాకుండా, కొత్త ఆలోచనలను రగిలించే వేదిక కావాలన్నారు. న్యూ మిస్ మ్యా టిక్స్, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో నిలవాలని భట్టి ఆకాంక్షించారు. -
తెలంగాణ సర్కార్కు హైకోర్టు జరిమానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది. రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. వారం లోపు చెల్లించాలని స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. జంట జలాశయాల సమీపంలో నిర్మాణాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.చివరి అవకాశం ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి 2 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా వేసింది. -
వీరన్న కుటుంబాన్ని ఆదుకునేదెవరు?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఖమ్మం రైతు బానోతు వీరన్న ఉదంతంపై తాజాగా ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న బలవన్మరణం చెందడం అత్యంత బాధాకరం. పండించిన పంటకు ధర రాక.. అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అంటూ పురుగుల మందు తాగుతూ వీరన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఓ నిదర్శనం.వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి అంటూ హరీష్రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఏ మున్సిపాలిటీ.. ఏ జోన్లోకి?
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగరపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమవుతుండటంతో సదరు మున్సిపల్ కార్యాలయాలిక జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలుగా రూపాంతరం చెందనున్నాయి. అక్కడి పురపాలక కమిషనర్లు.. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సదరు కార్యాలయా లు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. ఆర్డినెన్స్, జీవోల ద్వారా ప్రభుత్వం విలీనం ప్రకటించగానే పురపాలికలు సర్కిళ్లుగా మారి దగ్గర్లోని సంబంధిత జోన్ల (కార్యాలయాల) పరిధిలోకి రానున్నాయి.ఆయా పుర/నగర పాలక సంస్థలు.. జీహెచ్ఎంసీ సర్కిళ్లుగా దిగువ జోన్ల పరిధిలోకి రానున్నాయి. ఎల్బీనగర్ జోన్: ఆదిబట్ల, మీర్పేట్, బడంగ్పేట, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్కేసర్, బోడుప్పల్. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్) సికింద్రాబాద్ జోన్: తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, జవహర్నగర్. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: ముషీరాబాద్, అంబర్పేట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట) కూకట్పల్లి జోన్: కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, దుండిగల్, నిజాంపేట్, బొల్లారం. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: మూసాపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్) చార్మినార్ జోన్: బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్పల్లి, తుక్కుగూడ. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: మలక్పేట్, సంతోష్నగర్, చాంద్రాయణగుట్ట, చారి్మనార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్) శేరిలింగంపల్లి జోన్: అమీన్పూర్, తెల్లాపూర్,మణికొండ, నార్సింగి (ప్రస్తుతమున్న సర్కిళ్లు: యూసుఫ్గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్చెరు) ఆయా జోన్లపరిధిలో ప్రస్తుతమున్న సర్కిళ్ల సంఖ్య, విస్తీర్ణం వంటి వాటితోపాటు అంతిమంగా సదరు ప్రాంతాల్లో ఆయా పారీ్టల బలాబలాల వ ంటివి ప్రాధాన్యం వహించగలవని తెలుస్తోంది. విలీనానికి సంబంధించి గత నాలుగురోజులుగా కసరత్తు చేస్తున్న సీజీజీ, జీహెచ్ఎంసీ అధికారులు ఆయా సర్కిళ్లు, జోన్లు, వార్డుల మ్యాపుల పరిశీలనలు చేస్తున్నారు. సంబంధిత ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. మణికొండ ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశమున్నా.. ఇప్పటికే ఖైరతాబాద్ జోన్ ఎంతో పెద్దిదిగా ఉంది. శేరిలింగంపల్లి జోన్లో ప్రస్తుతం తక్కువ సర్కిళ్లున్నాయి. (ఖైరతాబాద్ జోన్ పరిధిలోని ప్రస్తుత సర్కిళ్లు: మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్). -
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025: నేటి నుంచి సీఎం సమీక్షా సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి సమీక్షా సమావేశాలు జరుగనున్నాయి. ప్రతి రోజు వేర్వేరు అంశాలపై అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.నవంబర్ 25 – సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు సంబంధిత విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొని సమ్మిట్ నిర్వహణ, కీలక కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.నవంబర్ 26న లాజిస్టిక్స్, ఇతర ఏర్పాట్ల గురించి సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొంటారు. సమ్మిట్కు వచ్చే దేశీయ, విదేశీ ప్రతినిధుల రవాణా, నివాసం, భద్రత వంటి లాజిస్టిక్స్ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.నవంబర్ 27న జరగనున్న సమావేశానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. సమ్మిట్ వేదిక, రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్, అతిథి సదుపాయాలు మొదలైన మౌలిక వసతులపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు.నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు సీఎం, మంత్రి వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి పాల్గొని విద్యాసంస్థల భాగస్వామ్యం, యువజన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. దాంతో పాటు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పాల్గొని పర్యాటక ప్రోత్సాహక ప్రణాళికలను పరిశీలించనున్నారు.నవంబర్ 29న సాయంత్రం 4 గంటలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి పాల్గొనబోతున్నారు. రైతులకు కొత్త అవకాశాలు, సమ్మిట్లో అగ్రి–ఇన్నోవేషన్ సెషన్లపై చర్చించనున్నారు.సాయంత్రం 6 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్ పాల్గొని సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నారు.నవంబర్ 30న సీఎంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ టూరిజం అవకాశాలు, గ్లోబల్ హెల్త్ సెషన్లపై సమగ్ర సమీక్ష జరుగుతుంది. -
కొత్త డిస్కమ్పై తెలంగాణ సర్కార్ యూటర్న్!
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుపై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. నిర్దిష్ట అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పంపిణీ సంస్థలు ఇంధన శాఖకు తెలిపాయి. దీంతో ఇంధన శాఖ ప్రభుత్వానికి ఈ మేరకు నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు అదనంగా కొత్త డిస్కమ్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది.సంక్షేమ పథకాలైన వ్యవసాయ ఉచిత విద్యుత్, గృహజ్యోతి కనెక్షన్లను దీని పరిధిలోకి తేవాలని భావించింది. వాస్తవానికి డిస్కమ్ అనేది కొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. సంక్షేమ పథకాల కింద ఇచ్చే ఉచితాలు, తదితరాలు అన్ని డిస్కమ్ల పరిధిలోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటి కోసం ప్రత్యేకంగా డిస్కమ్ ఎలా అనే అంశంపై అధికారులు గందరగోళానికి గురయ్యారు. పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాత దీనిపై స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చారు.పాత డిస్కమ్ల రుణాలకు నిబంధనల అడ్డంకిడిస్కమ్ ఏర్పాటు ద్వారా రుణాలు పొందే ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కమ్లు అన్ని విధాల పూర్తిస్థాయిలో ఆర్థిక రుణాలు పొందాయి. ఇవే డిస్కమ్లు అవసరాల రీత్యా తిరిగి రుణాలు పొందడానికి కొన్ని నిబంధనలు (ఎఫ్ఆర్బీఎం) అడ్డంకిగా మారుతున్నాయి. రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 96,596 ఎంయూలు విద్యుత్ వినియోగం ఉంది. ఇది 2030 నాటికి 1.22 లక్షల ఎంయూలకు చేరే వీలుందని అంచనా వేస్తున్నారు.2033–24 నాటికి 1.30 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అయ్యే అవకాశం ఉంది. ఈ డిమాండ్ను చేరుకోవడానికి విద్యుత్ సంస్థల సామర్థ్యం గణనీయంగా పెరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 440 కేవీ సబ్ స్టేషన్లు 9, 220 కేవీ సబ్స్టేషన్లు 34, 132 కేవీ సబ్ స్టేషన్లు 75 ఏర్పాటు చేయాలని డిస్కమ్లు భావించాయి.ఇందుకోసం ట్రాన్స్కో, డిస్కమ్లకు కలిపి రూ.32 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే కొత్త డిస్కమ్ ఏర్పాటే మార్గమనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. పీఎఫ్సీ, ఇతర ఆర్థిక సంస్థలు కొత్త డిస్కమ్లకు రుణాలు ఇచ్చే వీలుందని కన్సల్టెన్సీ సంస్థలు సలహాలిచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే ప్రత్యేక అవసరాల కోసం రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని రుణ సంస్థలు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు సమాచారం. -
అగ్రనేతలతో సహా లొంగిపోనున్న 37 మంది మావోయిస్టులు
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల లొంగుబాటు.. అగ్రనేతల ఎన్కౌంటర్లతో కకావికలం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ(నవంబర్ 22, శనివారం) భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. వీళ్లలో ముఖ్యనేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది దాకా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్తో మావోయిజం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని.. అభివృద్ధిలో భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత ఆజాద్తో పాటు కీలక సభ్యులు రమేష్, అప్పాసి నారాయణ, ఎర్రాలు లొంగిపోతారని తెలుస్తోంది. వీళ్లిద్దరితో పాటు 20 మంది దాకా డివిజన్ ఏరియా కమిటీ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. అజాద్ 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదిలో.. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందారు. పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోయారు. ఇక.. అనారోగ్య కారణాలతో చంద్రన్న, బండి ప్రకాశ్ ఆయుధాలు వీడారు. మరో నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నాం డీజీపీ శివధర్రెడ్డి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.ప్రజాప్రతినిధులు బయట తిరగొద్దు!అల్లూరి: మారుడుమిల్లి ఎన్కౌంటర్ల నేపథ్యంతో రేపు ఏజెన్సీ బంద్, నిరసనలకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రంపచోడవరం వ్యాప్తంగా ఆంక్షలు విధించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులను ఏజెన్సీల్లో పర్యటించొద్దని.. వీళైతే మైదానాల్లోకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మరణించారు. -
ఓవర్ లోడ్ పట్టదా.. తీరు మారదా?
నవంబర్ 3: పరిమితికి మించిన కంకర లోడ్తో దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సు మీదకు దూసుకెళ్లడంతో 19 మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రవాణాశాఖ నవంబర్ 4 నుంచి 17 వరకు అంటే కేవలం 14 రోజుల వ్యవధిలో చేపట్టిన తనిఖీల్లో ఏకంగా 556 ట్రక్కులు ఓవర్లోడ్తో పట్టుబడటం గమనార్హం.సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించిన లోడుతో రోడ్డెక్కే వాహనాలను నియంత్రించాల్సిన బాధ్యత రవాణా శాఖది. కానీ, పరిమితికి మించి లోడ్ నింపి రోడ్డెక్కిస్తున్నది స్వయంగా మరో ప్రభుత్వ విభాగమే. అదే గనుల శాఖ. ఇసుక రీచ్లు, క్రషర్లలో ట్రక్కుల్లోకి పరిమితికి మించిన లోడు నింపుతున్నారు. ఆ లారీలకు అధికారికంగా ట్రాన్సిట్ పాస్లు జారీ చేస్తోంది స్వయంగా గనుల శాఖ అధికారులే. రాయల్టీ చెల్లిస్తే చాలు ఇసుక, కంకర తరలించేందుకు అనుమతిస్తున్నారు. కానీ, ట్రక్కుల్లో ఎంత కంకర తరలిస్తున్నారో తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విచిత్రమేంటంటే, ట్రక్కుల లోడు పరిమితితో సంబంధం లేకుండా అధిక లోడును నింపితే, ఆ లోడు ఎంతుందో కూడా ట్రాన్సిట్ పాస్లో పేర్కొంటున్నారు. అంటే, లారీ సామర్థ్యానికి మించి లోడును తరలించేందుకు అనుమతించినట్టు ఆ ట్రాన్సిట్ పాస్ జారీ ద్వారా గనుల శాఖ అంగీకరిస్తోంది. కానీ, అధిక లోడును నియంత్రించే బాధ్యత తమది కాదని, దాన్ని నియంత్రించాల్సింది రవాణాశాఖనే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక్కడే ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేక ఓవర్ లోడుతో ట్రక్కులు రోడ్డెక్కి అధిక వేగంతో దూసుకుపోతూ ఎప్పుడు ఎవరి ప్రాణాలను బలిగొంటాయో తెలియని భయానక వాతావరణం నెలకొంది. క్రషర్ల ఎదుట నిత్యం రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే, లోపలి నుంచి రోడ్డు మీదకు వచ్చే ట్రక్కుల్లో మూడొంతులు ఓవర్ లోడ్తో వస్తున్నవే దొరుకుతాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేవెళ్ల సమీపంలో జరిగిన ప్రమాదానికి ఓవర్లోడుతో దూసుకొచ్చిన ట్రక్కే కారణం కావటంతో, ఓవర్లోడ్ వాహనాలను రవాణా శాఖ పట్టించుకోవటం లేదని రాష్ట్రం మొత్తం దుమ్మెత్తి పోసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రవాణాశాఖ, ఆ మరుసటి రోజు నుంచే విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. 556 ట్రక్కుల్లో ఓవర్ లోడ్ ఉందని తేలింది. దీంతో వాటిల్లో మరీ ఎక్కువ లోడ్ ఉన్న 488 ట్రక్కులను సీజ్ చేసి రూ.85 లక్షల మొత్తాన్ని పెనాల్టీగా వసూలు చేశారు. ఇసుక రీచ్లు, క్రషర్లలో ట్రక్కుల్లోకి లోడ్ ఎక్కించేప్పుడే ట్రక్కుల సామర్థ్యానికి తగ్గట్టుగానే నింపితే ఈ సమస్యే రాదని, గనుల శాఖ దాన్ని పట్టించుకోకుండా ఆదాయాన్ని పొందటంపైనే దృష్టి సారించి పరిమితికి మించిన లోడుతో లారీలను రోడ్డెక్కిస్తోందని తాజాగా రవాణా శాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ సవాళ్ల సంగతేంటి...? ⇒ ప్రస్తుతం రవాణాశాఖలో వాహనాలను తనిఖీ చేసేందుకు ఎంవీఐలు, ఏఎంవీఐలు కేవలం 330 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలను ఇంత తక్కువ మంది తనిఖీ చేయటం సాధ్యం కాదు. ⇒ వేల కి.మీ. నిడివితో ఉన్న రోడ్లను మీద ఎన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసినా ఏదో ఓ చోట ఓవర్లోడ్ వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ⇒ ప్రతి రీచ్, క్రషర్ వద్ద తనిఖీలు చేస్తే సింహభాగం ట్రక్కులు అక్కడే దొరికి అవి రోడ్డెక్కటమే కుదరదు. ⇒ ట్రక్కులను పట్టుకున్న సందర్భాల్లో వాటిల్లోని లోడ్ ఎంతుందో గుర్తించాలంటే వే బ్రిడ్జి (బరువు తూచే వ్యవస్థ) అవసరం. అవి ఎక్కడో ఒకటి ఉండటంతో ఓవర్ లోడును వెంటనే గుర్తించటం కష్టంగా మారింది. ⇒ తనిఖీలో దొరికిన ఓవర్లోడ్ ట్రక్కులను సీజ్ చేయాలంటే, వాటిని ఎక్కడ ఉంచాలో అర్థం కాని దుస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్టాండ్లు, పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఇప్పటికే వీటితో నిండిపోయాయి. దీంతో సీజ్ చేయటం కష్టంగా మారింది. -
పర్యాటకులకు ప్రపంచ స్థాయి వసతి.. ‘తెలంగాణ టూరిజం హోమ్ స్టే’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం ‘తెలంగాణ టూరిజం హోమ్ స్టే’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రపంచ స్థాయి సేవలు, పరిశుభ్రమైన వసతి, కుటుంబ వాతావరణంలో స్థానిక సంప్రదాయాల అనుభవం లాంటి ఈ మూడు లక్ష్యాలతో ముందుకు వస్తున్న ఈ పథకం ద్వారా జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు , పర్యాటక గమ్యస్థానాల్లో వసతిని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణలోని సంప్రదాయ జీవన విధానాన్ని దగ్గరగా చూడటానికి, స్థానిక వంటకాల అద్భుత రుచిని ఆస్వాదించేందుకు ఈ హోమ్ స్టేలు ఉపయోగపడనున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ దీనిని ప్రమాణితమైన, భద్రత కలిగిన, సౌకర్యవంతమైన వసతి వ్యవస్థగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.హోమ్ స్టే కోసం వర్గీకరణ, పునర్వర్గీకరణ రుసుములుహోమ్ స్టేలు వెండి (Silver), బంగారం (Gold) వంటి రెండు వర్గాల్లో వర్గీకరించబడతాయి. వర్గీకరణ,పునర్వర్గీకరణ కోసం దరఖాస్తు రుసుములు:డిమాండ్ డ్రాప్ట్ను "కమిషనర్ / డైరెక్టర్ ఆఫ్ టూరిజం, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్" పేరుపై చెల్లించాల్సి ఉంటుంది. -
‘మీరాలం’ మిలమిల
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని మీరాలం చెరువును మిలమిలలాడే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారీ అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మీరాలం ట్యాంక్పై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బెంగళూరు జాతీయ రహదారి (ఎన్హెచ్–44) వద్ద శాస్త్రిపురం నుంచి చింతల్మెట్ వరకు ఐకానిక్ బ్రిడ్జ్ను నిర్మించనున్నారు. 2.5 కిలో మీటర్ల మేర నాలుగు లైన్ల మేర ఈ బ్రిడ్జి ఉంటుంది. వంతెన నిర్మాణ పనులను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ బిడ్డింగ్ దక్కించుకుంది. రూ.319 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్ను నిరి్మంచనున్నారు. ఈ మేరకు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో చేపట్టనున్న ఈ బ్రిడ్జ్ టెండర్కు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఆమోదించింది. గార్డెన్ ఆఫ్ బే తరహాలో.. మీరాలం ట్యాంక్పైన నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ను సింగపూర్లోని గార్డెన్స్ ఆఫ్ బే తరహాలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వంతెన సందర్శకులకు భద్రతతో పాటు దృశ్యపరంగా ఆకర్షణీయంగా నిర్మించనున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు పక్కనే ఉన్న రెండు దీవులను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో బర్డ్ ప్యారడైజ్, వాటర్ఫాల్స్, అనువైన కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, యాంపీ థియేటర్లతో ఈ దీవులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. మీరాలం ట్యాంక్లో ఒకటి 5 ఎకరాలు, మరోటి 2.5 ఎకరాల విస్తీర్ణంలో రెండు దీవులు ఉన్నాయి. గతంలో ఇందులో రాష్ట్ర పర్యాటక శాఖ బోట్లను సైతం నడిపేది. మీరాలం ట్యాంక్ను నెహ్రూ జులాజికల్ పార్క్తో అనుసంధానించి..జూ గుండా మీరాలం ట్యాంక్కు మళ్లీ బోట్లను నడపాలని, దీవులను అభివృద్ధి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదీ మీరాలం చరిత్ర జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించక ముందు భాగ్యనగరవాసుల దాహార్తిని మీరాలం ట్యాంక్ రిజర్వాయర్ తీర్చేది. హైదరాబాద్ రాష్ట్ర మూడో నిజాం అసఫ్ జాహీ–2 హయాంలో అప్పటి హైదరాబాద్ పాలకుడు (1804–1808) మీర్ ఆలం బహదూర్ పేరును ఈ రిజర్వాయర్కు పెట్టారు. 1804 జులై 20న మీర్ ఆలం రిజర్వాయర్ నిర్మాణానికి పునాది వేశారు. దాదాపు రెండేళ్లలో 1806 జూన్ 8న నిర్మాణం పూర్తయింది. ఐకానిక్ బ్రిడ్జి ఇలా.. పొడవు: 2.5 కిలో మీటర్లు వెడల్పు: 16.5 మీటర్లు (నాలుగు లైన్లు) ఎక్కడి నుంచి ఎక్కడికి: బెంగళూరు జాతీయ రహ దారి వద్ద శాస్త్రిపురం నుంచి చింతల్మెట్ వరకు.. ఎవరికి ప్రయోజనం: ఈ వంతెనతో దక్షిణ హైదరాబాద్ వైపు ప్రయాణం సులువవుతుంది. సుమారు లక్ష మంది ప్రయాణికులకు ఈ వంతెన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎంఆర్డీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రాష్ట్రమంతటా భూముల సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సర్వే శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నియమించిన 3,500 మందికిపైగా లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇప్పటికే ఆ శాఖలో పనిచేస్తున్న సర్వేయర్లతో ఈ సర్వేను చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకుగాను రాష్ట్రంలోని అన్ని గ్రామీణ జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయాలని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి అక్టోబర్ మూడో వారంలోనే ఉత్తర్వులు వెళ్లాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే గ్రామాలను ఎంపిక చేసే కసరత్తు ప్రారంభించారు. అయితే, కలెక్టర్లు తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల జాబితాలో మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించిన మేరకు 200లోపు ఎకరాలున్న గ్రామాలు, సర్వే సమస్యలు తక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామాల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలలోనే సర్వేను పైలట్ పద్ధతిలో ప్రారంభిస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. హద్దుల నిర్ధారణ... భూదార్ జారీ భూముల సర్వేలో భాగంగా ప్రతి భూకమతానికి హద్దులు నిర్ణయించనున్నారు. డీజీపీఎస్ ద్వారా సేకరిచిన డాటాను క్యూజీఐఎస్ సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేయాలని, ఇందుకోసం సర్వే సిబ్బందిని వినియోగించుకోవాలని రెవెన్యూ శాఖ చెప్పింది. సర్వే అనంతరం ప్రతి భూకమతం హద్దులు నిర్ణయించడంతోపాటు ఆ కమతాలకు ఆధార్ తరహాలో భూదార్ కార్డులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న సర్వే అనంతర ఫలితాలను బట్టి రాష్ట్రమంతటా సర్వే నిర్వహిస్తామని అంటున్నారు. -
‘విద్యానిధి’ కఠినతరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత ఎక్కువ మొత్తంలో రాయితీ అందిస్తున్న పథకం ఓవర్సీస్ విద్యానిధి పథకం. దీనికింద ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల ఆధారంగా లబ్ధిదారులను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది. తాజాగా ఈ పథకం కింద కోటాను ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా గతేడాది వరకు 1100 మంది విద్యార్థులకు సాయం అందిస్తుండగా... తాజాగా కోటా పెంపుతో లబ్ధిదారుల సంఖ్య 1900కు పెరిగింది. దీంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అర్హుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సంక్షేమ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ప్రతి కేటగిరీలో మెరిట్ కీలకం విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించేందుకు బ్యాచ్లర్ డిగ్రీలో మెరుగైన మార్కులు, ఐఈఎల్టీఎస్/ టోఫెల్ పరీక్షలో మెరిట్ సాధిస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు పరిగణించి అర్హత కల్పించేవి. బీసీ సంక్షేమ శాఖలో మాత్రం పోటీ తీవ్రంగా ఉండటంతో మరింత లోతుగా మెరిట్ను పరిశీలించి అర్హతలు ఖరారు చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని సంక్షేమ శాఖలకు పోటీ తీవ్రం కానుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో 1:3 చొప్పున దరఖాస్తులు ఉంటే... బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1:20 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మూడు సంక్షేమ శాఖల పరిధిలో కోటాను భారీగా పెంచింది. తాజాగా సంక్షేమ శాఖలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా... క్షేత్రస్థాయి నుంచి స్పందన భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వడపోతకు సంక్షేమ శాఖలు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి. అభ్యర్థులను అన్ని కేటగిరీల్లోనూ మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ముందుగా అభ్యర్థి సాధించిన డిగ్రీ మార్కులను విశ్లేషిస్తారు. ఆ తర్వాత జీఆర్ఈ/జీమ్యాట్లో మార్కులను మెరిట్ ఆధారంగా పరిశీలిస్తారు. అనంతరం ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల్లోనూ మెరిట్ ఆధారంగా వడపోస్తారు. ఇందుకు సంబంధించి నిబంధనలను సంక్షేమ శాఖలు త్వరలో సవరించనున్నట్లు తెలుస్తోంది. -
ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ చెప్పలేకపోయారు
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుక్కి సీటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్రెడ్డికి నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు శనివారం హరీష్రావు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలే చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కేసీఆర్ కట్టిన భవనాల్లో వాళ్ల పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే వృద్ధి రేటు పడిపోయింది. రేవంత్కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు ఉండటం రేవంత్కు ఇష్టం లేదు. అందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లి కూర్చుంటున్నారు. ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ నిన్న చెప్పలేకపోయారు. 2004-2014 కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడుగుతున్నారు. పీజేఆర్ కొడుక్కి టికెట్ ఇవ్వని రేవంత్కు.. ఆయన పేరు తీసే నైతికత లేదు. పీజేఆర్ను మానసికంగా వేధించి చనిపోయేలా చేసిందే కూడా కాంగ్రెస్ పార్టీనే అని హరీష్రావు ఆరోపించారు. .. రేవంత్ రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధం. ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగితే ఎందుకు బయటకు రాలేదు?. భట్టి ఢిల్లీ వెళితే తెలంగాణ భవన్ లో ఉండరు. గురుగ్రామ్లోని అత్తగారి ఇంట్లో ఉంటారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే భట్టి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ బయటకు రాలేదు. భట్టి ఇంట్లో హార్డ్ డిస్క్ లు కూడా ఐటీ అధికారులు తీసుకెళ్ళారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి బయట ఉన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉంది. రేవంత్ ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయి అని హరీష్రావు వ్యాఖ్యానించారు. -
‘గ్యారంటీ’ల బండ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ‘గ్యారంటీ’ల గండం పట్టుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు చేస్తున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా గ్యారంటీలు ఇవ్వటంతో పరిస్థితి విషమించింది. అధికారిక అప్పులకు తోడు లెక్కల్లోకి రాని ఈ ‘గ్యారంటీ’ అప్పులు కొండలా పేరుకుపోయాయి. గ్యారంటీ అప్పుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది. ఇది చాలా ప్రమాదకరమైన ఆర్థిక నిర్వహణ అని హెచ్చరించింది. గ్యారంటీ అప్పులు జీఎస్డీపీలో ఏకంగా 15.1 శాతానికి చేరాయని వెల్లడించింది. నిధులన్నీ సంక్షేమం, సబ్సిడీలకే పోతున్నాయని.. భవిష్యత్తుకు కీలకమైన విద్య, వైద్య రంగాలను గాలికి వదిలేశారని తూర్పారబట్టింది. బడ్జెట్ అంచనాలు ఏకంగా 21 శాతం గల్లంతవుతుండటం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది. అప్పుల ఊబిలోకి రాష్ట్రం.. ‘స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్’నివేదిక తెలంగాణ రాష్ట్ర ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇచ్చిన గ్యారెంటీలు జీఎస్డీపీలో 15.1 శాతానికి చేరగా, ఇందులో సింహభాగం (37%) నీటిపారుదల రంగానికే ఉండటం గమనార్హం. దేశంలో మరే రాష్ట్రం ఇంతటి భారీ గ్యారెంటీలను ఇవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ గ్యారెంటీలకు తోడు, 2025 మార్చి నాటికి అధికారిక అప్పులు సైతం జీఎస్డీపీలో 26 శాతానికి చేరాయి. ఇది ఎఫ్ఆర్బీఎం కమిటీ నిర్దేశించిన 20% పరిమితి కంటే చాలా ఎక్కువ. రాష్ట్రం బడ్జెట్ వెలుపల చేసే అప్పులు కూడా కొనసాగుతున్నాయి. 2024–25లో ఇవి రూ.2,697 కోట్లుగా ఉన్నాయి. కాగితాలపై కోటలు.. వాస్తవాలకు బీటలు పీఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 2015–23 మధ్య కాలంలో బడ్జెట్లో వేసిన అంచనాలకు, వాస్తవంగా వచ్చిన ఆదాయానికి మధ్య ఏకంగా 21% వ్యత్యాసం (లోటు) కనిపించింది. దేశంలో అత్యంత దారుణమైన పనితీరులో ఇది ఒకటి అని నివేదిక పేర్కొంది. కాగితాలపై కోటలు కట్టడం, తీరా ఆదాయం రాకపోవడంతో.. చివరకు అభివృద్ధి పనులకు భారీగా కోత పెట్టాల్సి వస్తోంది. ఇదే కాలంలో రాష్ట్రం తన మూలధన వ్యయంలో 12% కోత విధించింది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో బలంగా ఉంది. మొత్తం ఆదాయంలో 77% సొంత వనరుల (63% సొంత పన్నులు, 14% పన్నేతర ఆదాయం) నుంచే వస్తోంది. జీఎస్డీపీలో సొంత పన్నుల వాటా 8.1%గా ఉంది. ఆదాయం ఇలా బలంగా ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రణాళిక మాత్రం దారుణంగా విఫలమవుతోంది. విద్య, వైద్యానికి మంగళం: రాష్ట్ర ఖజానాలో సంక్షేమం, సబ్సిడీలకు పెద్ద పీట వేస్తున్న క్రమంలో కీలకమైన మౌలిక రంగాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. రెవెన్యూ ఆదాయంలో 14% సబ్సిడీలకే పోతోంది. ఇందులో సింహభాగం 76% కరెంట్ సబ్సిడీలకే వెళ్తుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమానికి బడ్జెట్లో 12.4% వాటా ఇచ్చి దేశంలో రెండో స్థానంలో నిలిచారు. కానీ, భవిష్యత్ తరాలను నిర్మించే కీలక రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజారోగ్యంపై తెలంగాణ తన బడ్జెట్లో 4.8% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది దేశంలోనే అత్యల్పం. విద్యారంగానికి చేసిన కేటాయింపులు 9.0% మాత్రమే. ఇది కూడా దేశంలోనే అత్యంత తక్కువ కావడం గమనార్హం. మౌలిక వసతులైన రోడ్లు, వంతెనల కోసం ఖర్చు చేస్తున్నది 1.9% మాత్రమే. సొంత ఆదాయం బలంగా ఉన్నా ఆ డబ్బంతా సబ్సిడీలకే పోతుండటం, మరోవైపు గ్యారెంటీల పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం రాష్ట్రాన్ని ప్రమాదపు అంచున నిలబెట్టిందని నివేదిక హెచ్చరించింది. కీలకమైన విద్య, వైద్యం కుంటుపడటంతో రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని నివేదిక పేర్కొంది. -
ఒప్పుకోవడమా? ఒత్తిడి పెంచడమా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను దారికి తేవాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఎలాగైనా బకాయిలు రాబట్టుకోవాలనే యోచనలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా ప్రైవేట్ కాలేజీలన్నీ మూతపడ్డాయి. కాలేజీల వద్ద సిబ్బంది ఆందోళనలు కొనసాగాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలో జరుగుతున్న ఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రైవేట్ కాలేజీలు నిర్వహించలేదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం (ఫతి) పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటోంది. ఇంకో వైపు పరిస్థితిపై అధికార యంత్రాంగం చర్చోపచర్చలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫతి నేతలకు ఫోన్లు వెళ్లాయి. ‘ముందు కాలేజీలు తెరవండి..సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’అనే సందేశాలు ఫతి నేతలకు వచ్చాయి. దీపావళిలోగా ఇస్తామన్న రూ.900 కోట్లు ఇవ్వాలని, మిగిలిన బకాయిలు ఎప్పుడిస్తారో జీఓ ద్వారా తెలియజేయాలన్నది యాజమాన్యాల డిమాండ్. ఉన్నతాధికారుల మంతనాలు సీఎస్ రామకృష్ణారావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా, దేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బంద్లో ఏఏ కాలేజీలు పాల్గొన్నాయో ఆరా తీశారు. ఫతిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలు సేకరించారు. అంతకు ముందు ఫతికి చెందిన ఇద్దరు నేతలతో డిప్యూటీ సీఎం ఫోన్ ద్వారా రహస్య మంతనాలు జరిపినట్టు తెలిసింది. బంద్కు దూరంగా ఉండే కాలేజీల పట్ల భవిష్యత్లో సానుకూలంగా ఉంటామనే సంకేతాలు పంపినట్టు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఫతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..అధికారులు క్షేత్రస్థాయిలో కాలేజీల వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ఏ కాలేజీలో ఎలాంటి అవకతవకలున్నాయనే నివేదిక రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. ముదురుతున్న ఆందోళన ఈ నెల 8వ తేదీన దాదాపు 30 వేల మంది కాలేజీల సిబ్బందితో, 11వ తేదీన లక్షకుపైగా విద్యార్థులతో సభ నిర్వహిస్తామని ఫతి ప్రకటించింది. ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్లో జరుగుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితి హింసాత్మకంగా మారే అవకాశం లేకపోలేదని నిఘా వర్గాలు అంటున్నాయి. ఫతిలో కొంతమంది ప్రభుత్వ అనుకూల ధోరణి ఉన్నా, ఎక్కువ మంది వ్యతిరేక ధోరణితో ఉన్నారు. వీరికి కొన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉందనేది నిఘా వర్గాల సమాచారం. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది, విద్యార్థులను రాజధానికి తరలిస్తే అవాంఛనీయ ఘటనలు జరగొచ్చని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రదర్శనలకు అనుమతి నిరాకరించినా, ఆందోళన మరోరూపం దాల్చే వీలుందనే అనుమానం పోలీసు వర్గాల నుంచి వస్తోంది. దీన్ని వాయిదా వేయించేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఫతి మాత్రం తమ సత్తా చూపించుకోవడానికి ఇది వేదికగా భావిస్తోంది. రీ ఎంబర్స్మెంట్పై కమిటీ ఫీజు రీయింబర్స్మెంట్ హేతుబద్ధీకరణ, ఉన్నతవిద్య బలోపేతానికి ప్రభుత్వం కమిటీ వేసింది. గత నెల 28వ తేదీనే ఇందుకు సంబంధించిన జీఓ వచ్చినా, మంగళవారం దీన్ని హడావిడిగా వెలుగులోకి తెచ్చింది. సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక, విద్య, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ శాఖల కార్యదర్శులతోపాటు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఎస్సీ డెవలప్మెంట్ విభాగం కమిషనర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాంను సభ్యులుగా చేర్చారు. ఫతి నుంచి ఎన్.రమేశ్బాబు, కేఎస్.రవికుమార్, డాక్టర్ కే.రామదాస్కు సభ్యులుగా చోటు కల్పించారు. ట్రస్ట్ బ్యాంకు ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వహణ, హేతుబద్ధీకరణ, ఫీజు రీయింబర్స్మెంట్ విధానం, ఉన్నతవిద్యలో నాణ్యత పెంపుపై ఈ కమిటీ చర్చించి మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది. -
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ అజారుద్దీన్కు తెలంగాణ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. మైనార్టీ వెల్ఫేర్తో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను కేటాయించింది. గత నెల అక్టోబర్ 31న అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్కు ఏ శాఖ ఇస్తారన్నది రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిత్వ శాఖను కేటాయించిన నేపథ్యంలో అజారుద్దీన్కు కూడా మంచి అవకాశం లభిస్తుందనే చర్చ జరిగింది. హోంశాఖ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, మైనార్టీ వెల్ఫేర్ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. -
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: పదేళ్లకు పైగా సర్వీస్ ఉన్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని అక్టోబర్ 23న తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల సేవలను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఈ తీర్పును న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వర్ రావు వెలువరించారు. ఈ కేసు వి.ప్రదీప్, ఎం.రాములు దాఖలు చేసిన రిట్ పిటిషన్లకు సంబంధించినది. వీరిద్దరూ 13 సంవత్సరాలుగా జూనియర్ ఇంజనీర్/మ్యానేజర్గా, మ్యానేజర్ (ప్రొడక్షన్ అండ్ ప్రోక్యూర్మెంట్)గా 16.5 సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ సేవలందిస్తున్నారు.జస్టిస్ రాజేశ్వర్ రావు తన తీర్పులో పేర్కొంటూ, పిటిషనర్లు తాత్కాలిక లేదా విరామాలతో కూడిన పనుల్లో కాకుండా, సాంక్షన్ చేసిన పోస్టులపైనే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ అంశం “వివాదాస్పదం కాదని” కూడా న్యాయస్థానం గమనించింది.అలాగే, కోర్టు స్పష్టమైన గడువును విధించింది. తీర్పు ప్రతిని అందుకున్న తేదీ నుండి మూడు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
మావోలు లొంగిపోవాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమంలోని అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం అందరికీ తెలుసునని, మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసే అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. మంగళవారం గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. పోలీసుల కృషితో ఇప్పుడవి దాదాపు లేకుండా పోయాయి. గ్రేహౌండ్స్ కమాండోలు సందీప్, శ్రీధర్, పవన్ కల్యాణ్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందితే.. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్లగొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. మూడురోజుల కిందట నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, ప్రమోద్ లాస్ట్ డ్రాన్ శాలరీ అతని పదవీ విరమణ సమయం వరకు కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షల ఎక్స్గ్రేషియాం, పోలీస్ సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం..’ అని సీఎం చెప్పారు. దేశానికే ఆదర్శంగా మన పోలీసులు ‘రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరగనివ్వకుండా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణను పూర్తి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకే పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ‘ఈగల్’ వింగ్ను ఏర్పాటు చేశాం. కొత్త తరహా నేరాలు సవాలుగా మారుతున్నాయి ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం గర్వకారణం. సాంకేతిక రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తెలంగాణకు దక్కిన గౌరవం. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది..’ అంటూ రేవంత్ కితాబునిచ్చారు. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి ‘పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చాం. పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్లు సారథ్యం వహించడం గర్వించదగ్గ పరిణామం. కీలక విభాగాలను సమర్థవంతంగా నడిపిస్తున్న వారిని చూసి గర్విస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఏడుగురు మహిళా అధికారులు డీసీపీలుగా ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లను, ఎస్ఐలను రిక్రూట్ చేశాం. రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి సాధ్యం. ఇందులో పోలీసుల పాత్ర కీలకం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం అందిస్తున్నాం. తీవ్రవాదులు, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను.. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలకు, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలకు, డీఎస్పీ, అదనపు ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలకు, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మనది ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదని, ‘ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే ఫార్ములాతో మనం ముందుకు వెళుతున్నామని చెప్పారు. ‘చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ‘ఫెయిర్ పోలీసింగ్’ అయితే.. పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ, శాంతిభద్రతలను కఠినంగా కాపాడటం ‘ఫర్మ్ పోలీసింగ్’. విధి నిర్వహణ సరిగా చేస్తూ ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్నీ పొందడమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’..’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి.. ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీకి అందజేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
50 శాతం మించొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్ను కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్డ్ ఏరియాల్లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ, 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వం వాదన ఇదీ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’నిబంధనలకు అను గుణంగా, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపామని తెలిపారు. 94 వేల ఎన్యూమరేషన్ బ్లాక్లలో లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, బీసీ జనాభా డేటా ఆధారంగానే కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు పెంచామని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా సహానీ కేసులో తీర్పును సింఘ్వీ ఉటంకించారు. డేటా బేస్ ఆధారంగా, అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకునే సౌలభ్యం ఉందని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వికాస్ కృష్ణారావ్ గవాలి కేసు తీర్పు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోందన్నారు. అంతేగాక ఈ వ్యవహారంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, అయితే గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. బిల్లును సవాల్ చేయకుండా, దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్ చేయడం సరికాదని సింఘ్వీ వాదించారు. ఇంతటి విస్తృత కసరత్తు తర్వాత, ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా హైకోర్టు స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటా 50% పరిమితి దాటరాదు: ప్రతివాదుల వాదన ప్రతివాది మాధవరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ ప్రభుత్వ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. కృష్ణమూర్తి కేసు తీర్పును ఉటంకిస్తూ ‘షెడ్యూల్డ్ ఏరియాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. జనరల్ ఏరియాల్లో ఈ పరిమితిని దాటడానికి వీల్లేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెల్లడించింది’అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ టెస్ట్లో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనేది ఒక కీలకమైన షరతు అని, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ఉదంతాలను ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించి, 50 శాతం పరిమితికి లోబడే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విభేదించింది. ‘ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా?’అని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, ముఖ్యంగా కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్దేశించిన 50 శాతం పరిమితిని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనబడటం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా కేసు మెరిట్స్ ఆధారంగా తదుపరి విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానం ప్రకారమే జరగనున్నాయి. -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జీవో నెంబర్ 9పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం కోర్టు నిరాకరించింది. గురువారం వాడి వేడి వాదనల అనంతరం.. తమ తీర్పుతో హైకోర్టు విచారణపై ప్రభావం పడొచ్చని, ఈ దశలో పిటిషన్ను స్వీకరించబోమని చెబుతూ ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలే చేసింది.స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆ జీవోపై స్టే విధిస్తూ.. విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈలోపు రిజర్వేషన్ల పరిమితి మీరకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది కూడా. అయితే.. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఇవాళ పరిశీలించింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలంది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టులో విచారణ యధాతథంగా కొనసాగుతుందని.. అక్కడే తేల్చుకుని రావాలని పిటిషనర్ తరఫు లాయర్కు స్పష్టం చేసింది. వాదనలు ఇలా.. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయి. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించాం. డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందిదేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాం. గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు. రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించింది. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాం. బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచాము. ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాం. సమగ్రంగా , సాంకేతికంగా సర్వే జరిపాం. అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపైన స్టే ఎలా విధిస్తారు ?. హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు. వెంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందిబెంచ్ జోక్యం చేసుకుని.. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా ? అని ప్రశ్నించింది. ప్రతివాది మాధవరెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ఏరియా ,గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉంది. జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించింది. మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించింది. 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదు అని అన్నారు. -
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. దాంతో మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత.కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది.నిన్న సుమంత్ను తన బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
BC Reservations: ‘మా వాదనలు పూర్తిగా వినలేదు..’
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే తొలగించాలని అందులో కోరింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం అర్ధరాత్రి పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అందులో ఏముందంటే.. 50% రిజర్వేషన్లు పరిమితి నియమమే తప్ప రాజ్యాంగ పరమైనది కాదని పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తమ వాదనలు సంపూర్ణంగా వినకుండానే జీవో 9పై స్టే విధించిందని తెలిపింది. ఓబీసీ సమగ్ర వివరాలను కుల సర్వే ద్వారా సేకరించాం. కమిషన్ అధ్యయన తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించారు. తెలంగాణలో 56% పైగా బీసీలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42 శాతం రిజర్వేషన్లు కేటాయించామని పిటిషన్ లో పేర్కొంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ శనివారం నుంచి పదిరోజుల పాటు సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారాంతం లోపే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ జరిగితే వాటిని కూడా కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
లోటు.. లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఆశించిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ గత కొన్నేళ్లుగా అతి తక్కువగా వస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించి వార్షిక బడ్జెట్లో ప్రతిపాదిస్తున్న నిధులకు, ఆ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం ఇచ్చే మొత్తానికి పొంతన ఉండటం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆశించిన మొత్తంలో రూ.లక్ష కోట్లకు పైగా లోటు ఉండడం గమనార్హం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను 2020–21లో చివరిసారి రాష్ట్రం ఆశించిన మేరకు కేంద్రం ఇచ్చింది. ఆ ఏడాదిలో రూ.10 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని అంచనా వేస్తే రూ.15 వేల కోట్ల వరకు ఇచ్చింది. దీంతో మరుసటి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.38 వేల కోట్లు వస్తాయని అంచనా వేసి వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ.8 వేల కోట్లు మాత్రమే. అప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల విషయంలో భారీ అంతరం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించినదాంట్లో గరిష్టంగా 30 శాతం నిధులు కూడా ఈ పద్దు కింద రావడం లేదని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.22,782.50 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి బడ్జెట్లో పెడితే.. తొలి ఐదు నెలల్లో (2025, ఆగస్టు 31 నాటికి) ఇచ్చింది రూ.1,673.43 కోట్లు మాత్రమే. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే...గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే సాయం కింద ఇచ్చే మొత్తం అని చెప్పొచ్చు. ఈ గ్రాంట్ను తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తిరిగి చెల్లించే షరతు ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినా, రాష్ట్రం నుంచి ఏదైనా శాఖకు వెళ్లినా, ఎన్జీవోలు, విద్యాసంస్థలైనా ఇదే నిబంధన ఉంటుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఈ పద్దు కింద కేంద్రం నిధులు ఇచ్చే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కూడా ఇవ్వొచ్చు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ నిధులను మంజూరు చేయవచ్చు. అయితే, ఈ నిధులను ఏ కారణం కోసం అయితే ఇచ్చారో వాటికి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల స్వతంత్ర ఆలోచలను దెబ్బతీసే చర్య కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ వైఖరి కారణంగానే రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రావడం లేదు. ఈ పద్దు కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులు వస్తే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆర్థిక అధికారాల కేంద్రీకరణ మాత్రం ఏటేటా పెరుగుతోంది. రాష్ట్రాలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే తప్ప సాయం చేయడం లేదు. సెస్ల రూపంలో కేంద్రమే పన్నులు వసూలు చేసుకుంటోంది. ఆ పన్నుల్లో వాటా ఆశించినంతగా ఇవ్వడం లేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా మంజూరు చేయడం లేదు. అనేక రకాలుగా కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడే విధంగా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల స్వతంత్ర ఆలోచనను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఈ ఆర్థిక అసమతుల్యత గతంలోనూ ఉన్నదే అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది. – ప్రొఫెసర్ అందె సత్యం, ఆర్థిక నిపుణులు -
కోటాపై ముందుకే!
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలకు సంబంధించిన జీవోలు 9, 41, 42లను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న ఈ అంశంపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటి షన్ వేయనుంది. హైకోర్టు తీర్పు దరిమిలా తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, మంత్రులు, న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో చర్చించాక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కేలా చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమశాఖ ఇచ్చిన జీవో నంబర్ 9తో పాటు దాని ఆధారంగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 9 నుంచి అయిదు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్ కూడా రద్దయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సుప్రీంను ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. 16న కేబినెట్లో చర్చ.. ఈ నెల 16వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు, ఏపీ చేపడుతున్న ‘బనకచర్ల’, ఆలమట్టి ఎత్తు పెంపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత ఎలాంటి తీర్పు వెలువడితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ జీవోలు, స్థానిక ఎన్నికల నిర్వహణతో ముడిపడిన వివిధ శాఖల మంత్రులు కూడా ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను ఇప్పటికే వెల్లడించారు. మొత్తం 50 శాతం రిజర్వేషన్లతో ఈ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు అదనంగా కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఆన్ రిజర్వ్డ్ (జనరల్)గా పరిగణించి, పెంచిన రిజర్వేషన్లు సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో..బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి చేసిన కసరత్తు, ఆ దిశలో కొన్ని నెలలుగా సాగించిన కృషిని తుదకంటా కొనసాగించాలనే నిశ్చితాభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. తద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అంటున్నారు. సుప్రీంలో సమర్థ వాదనలు వినిపించాలి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ల కోసం బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే, ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, ఎంపిరికల్ డేటా విశ్లేషణ అనంతర నివేదికల ఆధారంగా శాసనసభలో బిల్లులు ఆమోదం, వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపించిన తీరును సుప్రీంకోర్టుకు సవివరంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను, న్యాయ నిపుణులను కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు, స్థానిక సంస్థల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుకు మొదట ఆర్డినెన్స్ ఆ తర్వాత బిల్లుల ఆమోదం వంటి కీలక అంశాలలో జరుగుతున్న జాప్యాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని, రిజర్వేషన్లకు సంబంధించిన ట్రిపుల్ టెస్ట్ను పకడ్బందీగా నిర్వహించిన విషయం వివరించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని భావిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద 90 రోజుల పరిమితికి మించి బిల్లులు పెండింగ్లో ఉంటే అవి ఆమోదం పొందినట్టుగానే భావించాల్సి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు.. తమిళనాడు ప్రభుత్వం విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను గురించి ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. లక్షల మందికి పైగా ఉద్యోగులతో చేసిన సర్వే వివరాలను సుప్రీంకోర్టు ముందుంచాలని నిర్ణయించినట్లు సమాచారం. -
నికర జలాలు పోయేట్లు ఉన్నాయ్.. బనకచర్లపై హరీష్రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే.. ఇక్కడి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణాకు ప్రమాదంగా మారబోతోంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్కు ఇరువై రోజుల క్రితం లేఖ రాశారు. సీడబ్యూసీ(CWC) నిబంధనల ప్రకారం నికర జలాల మీదే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వరద జలాలపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఇస్తారు?.. రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా ? సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా ?. 112 టీఎంసీల నీళ్లు ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. పైన కృష్ణా, కింద గోదావరి జలాలు పోతే తెలంగాణ పరిస్థితి రెంటికి చెడిన రేవడిగా మారుతుంది. ఫ్లడ్ వాటర్ తో ప్రాజెక్ట్ కట్టుకోవాలనుకుంటే తాము కూడా ప్రాజెక్ట్ కట్టుకుంటామని మహారాష్ట్ర అంటోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. పోలవరం రైట్ కెనాల్ ద్వారా 11 వేల 500 క్యూసెక్కుల కెపాసిటీ కేంద్రం అనుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 23 వేల క్యూసెక్కుల కెపాసిటీతో కాలువలకు ఎలా టెండర్లు పిలిచారు ?. కాలువలు తవ్విన టీడీపీ ది తప్పు అయితే బీజేపీ ఎందుకు కళ్ళు మూసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కనీస బాధ్యత లేదా ?. అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే కేంద్ర మంత్రులు ఎందుకు పెదవులు మూసుకుంటారా?. చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతోంది. బీజేపీ తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ఒక విధంగా, ఇతర రాష్ట్రాలకు మరో రకంగా వ్యవహరిస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు?. అటు కేంద్రం పట్టించుకోదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదుకేంద్ర మంత్రి లేఖ రాసి ఇరువై రోజులు అయ్యింది.. కర్ణాటక లేఖ రాసి రెండు వారాలు అవుతుంది. ఇంకోవైపు మహారాష్ట్ర మరోవైపు లేఖ రాసింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. వరద జలాలే కాదు.. నికర జలాలు పోయేటట్లు ఉన్నాయి. వరద జలాల మీద ప్రాజెక్ట్ ఎలా కడతారు అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?. కేంద్ర మంత్రి, కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలు అబద్దమా?. ఢిల్లీ వెళ్లి ఎందుకు రేవంత్ కొట్లాడడం లేదు?. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్.. కృష్ణా జలాలు ఆపుతామని అంటే పిల్లిలా మారారా?. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఖర్గే, సిద్దరామయ్యతో ఎందుకు మాట్లాడం లేదు?. కనీసం రాహుల్ గాంధీతో ఫోన్ కూడా చేయించలేకపోతున్నారా?.రేవంత్ రెడ్డి బ్యాగులు మోయడమే కాదు తెలంగాణ బాగోగులు కూడా పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని హరీష్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ఆ కండిషన్తో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చట! -
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 9 అమలుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల కాగా.. దానిని అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. దీంతో సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా.. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది.ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే..రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీ మాధవరెడ్డి, మరొకరు.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.ఇదీ చదవండి: ‘అలాగైతే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు’.. : తెలంగాణ హైకోర్టు -
ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మాణంపై ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆస్తులతో పోల్చితే అప్పులు మించిపోయి దివాలా తీయడంతో జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ వ్యాపార దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ)ను చేపడుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ 2024 జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా ప్రక్రియ కాలంలో జేపీ అసోసియేట్స్ కంపెనీ వ్యవహారాల పర్యవేక్షణకు రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) అనే థర్డ్ పార్టీ ఏజెన్సీని ఎన్సీఎల్టీ నియమించింది. సొరంగం–1 నిర్మాణ విషయంలో కంపెనీ పనితీరుపై ఆర్పీ హామీ ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, హామీ ఇచ్చే పరిస్థితిలో లేకున్నా.. ఎన్సీఎల్టీ అనుమతితో ఒప్పందాన్ని రద్దు చేసుకొని మిగిలిన పనుల పూర్తికి మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఎస్ఎల్ఎస్సీ సిఫారసు చేసింది. పనితీరుపై ఆర్పీ రాతపూర్వకంగా హామీ ఇస్తే పలు షరతులతో జయ ప్రకాశ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలోనే మిగిలిన పనులు జరిపించాలని మరో ప్రత్యామ్నాయాన్ని ఎస్ఎల్ఎస్సీ సూచించింది. సొరంగాల నిర్మాణం పనులను ముందుకు తీసుకెళ్లే అంశంపై నల్లగొండ సీఈ చేసిన పలు ప్రతిపాదనలపై గత నెల 12న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అధ్యక్షతన సమావేశమైన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ విస్తృతంగా చర్చించి ఈ మేరకు రెండు ప్రత్యామ్నాయాలను సర్కారుకు సూచించింది. ఒక వేళ ఒప్పందాన్ని రద్దు చేస్తే కొత్త నిర్మాణ సంస్థతో పనులు చేయిస్తే తీవ్ర జాప్యంతోపాటు పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆర్థిక భారం సైతం పడనుందని తేల్చి చెప్పింది. అర్ధంతరంగా నిలిచిపోయిన సొరంగం నిర్మాణ పనులను చేపట్టే విషయంలో సాంకేతిక సమస్యలూ ఎదురవుతాయని స్పష్టం చేసింది. ఎస్ఎల్ఎస్సీ సిఫారసులను త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. మళ్లీ అంచనాలను పెంచొద్దు ఒకవేళ జేపీ అసోసియేట్స్తోనే ఒకటో సొరంగం పనులు కొనసాగిస్తే రెండోసారి సవరించి అంచనాల మేరకు మిగుల పనుల వ్యయం రూ.1157.42 కోట్లకు మించకుండా సీలింగ్ విధించాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. నవీకరించిన పనుల షెడ్యూల్ ప్రకారం పనులను గడువును 2028 జూన్ 30కి పెంచేందుకు ఓకే చెప్పింది. సీఈ, రిజాల్యూషన్ ప్రొఫెషనల్ పేరుతో సంయుక్తంగా నిర్వహించే ఎస్క్రో అకౌంట్కే బిల్లులు చెల్లించాలని సూచించింది. అత్యాధునిక టెక్నాలజీతో పనులు చేస్తాం..: జేపీ అసోసియేట్స్ ⇒ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాలను తవ్వాల్సి ఉండగా, 7.13 కి.మీ.ల రెండో సొరంగం తవ్వకాలు పూర్తి కాగా, 2.8 కి.మీల మేర లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ⇒ 43.93 కి.మీ.ల తొలి సొరంగం పనులకుగాను రెండు వైపుల నుంచి మొత్తం 34.38 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. మధ్యలో 9.541 కి.మీ.ల సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ⇒ గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలి కారి్మకులు మృతిచెందడంతో పనులు నిలిచిపోయాయి. ⇒ రెండోసారి సవరించిన అంచనాల ప్రకారం ఒకటో సొరంగానికి సంబంధించి రూ.1157.42 కోట్లు, రెండో సొరంగానికి సంబంధించి రూ.57.08 కోట్లు విలువైన పనులు జరగాల్సి ఉంది. ⇒ ఇప్పటి వరకు టన్నెల్ బోరింగ్ మెషిన్ల(టీబీఎం)తో సొరంగాల తవ్వకాలు జరగగా, ఇటీవల జరిగిన ప్రమాద నేపథ్యంలో ఇతర అత్యాధునిక పద్ధతుల్లో ఇదే వ్యయంతో పనులు చేసేందుకు జేసీ అసోసియేట్స్ పలు షరతులతో సంసిద్ధత వ్యక్తం చేసింది. ⇒ 2028 ఆగస్టు 30 వరకు గడువు పొడిగించడంతో పాటు బిల్లుల చెల్లింపు షెడ్యూల్లో మార్పులు చేయాలని, బిల్లులను సమరి్పంచిన 24 గంటల్లోనే గ్రీన్ చానల్ ద్వారా చెల్లింపులు జరపాలని, రూ.35.14 కోట్ల పెండింగ్ బిల్లులు, రూ.104 కోట్ల విద్యుత్ చార్జీలు చెల్లించాలనే షరతులను విధించింది. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్–1 సర్వీసుల నియామకాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఈ అంశంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ప్రధాన అప్పీళ్లు హైకోర్టులో ఈ నెల 15న విచారణకు రానున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని తేల్చిచెప్పింది. అదే సమయంలో ఆయా పోస్టుల్లో నియమితులైన వారికి ఎలాంటి సమానత్వ హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జొయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.వివాద నేపథ్యం ఇదీ..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల మార్కులు, ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చారు. సమాధాన పత్రాలను సరైన మోడరేషన్తో తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా కొత్తగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు ఎంపికైన కొందరు అభ్యర్థులు హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. ఈ అప్పీళ్లను విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఒకవేళ నియామకాలు చేపడితే అవి రిట్ అప్పీళ్ల తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
బోనస్ బకాయి రూ.1,159.64 కోట్లు
సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ఈ వానాకాలం సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నాం. అందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నరకాలే. వీరందరికీ బోనస్ ఇస్తాం. – మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క సీజన్కే పరిమితమైంది. గత (2024– 25) వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండించిన సుమారు నాలుగున్నర లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల వరకు చెల్లించింది. యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్ ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా ప్రాంత రైతులు ఏకంగా పోరుబాట పట్టారు. బోనస్ చెల్లించకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా మూకుమ్మడగా పోటీ చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో సైతం రైతులు యాసంగి బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్ కోతల ప్రక్రియ ప్రారంభమైనా గత యాసంగి బోనస్ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రావలసిన బోనస్ రూ.1,159.64 కోట్లు యాసంగి సీజన్లో 74.22 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డురకం ధాన్యం 51.03 ఎల్ఎంటీ కాగా, సన్న ధాన్యం 23.19 ఎల్ఎంటీ. ఈ మొత్తం ధాన్యానికి రూ.17,198.58 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నధాన్యం పండించిన 4,09,031 రైతులకు 1,159.64 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు దాటినా బోనస్ విడుదల చేయలేదు. బోనస్ కోసం పోరుబాట పట్టిన మక్తల్ రైతులను మంత్రి వాకిటి శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేశారే తప్ప బోనస్పై హామీ ఇవ్వలేదు. ఇటీవల పదవీ విరమణ చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సైతం బోనస్ అంశాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వారం క్రితం మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున రైతులు యాసంగిలో కూడా సన్నాలు సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల ఎల్ఎంటీ ధాన్యాన్ని సేకరిస్తే, అందులో 7.15 లక్షల ఎల్ఎంటీ సన్నాలే ఉన్నాయి. నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. ప్రస్తుత వానకాలం సీజన్లో సాగు చేసిన 67.33 లక్షల ఎకరాల్లో 60 శాతానికి పైగా సన్నధాన్యమే పండించినట్లు లెక్కలు చెపుతున్నాయి. ఈసారి కొనుగోలు కేంద్రాలకు 80 ఎల్ఎంటీ ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నధాన్యం మార్కెట్కు వస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తానికి బోనస్ క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తే రూ.2,200 కోట్లు అవుతుంది. ఇప్పటికే ఉన్న బాకాయి 1,159.64 కోట్లు కలిపితే దాదాపు రూ.3,400 కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. నాకు రూ.5.60 లక్షల బోనస్ రావాలి నాకు ఉన్న 5 ఎకరాల పొలంతోపాటు కొంత కౌలుకు తీసుకొని రబీలో వరి సాగు చేశాను. 2,800 బస్తాలు పండించాను. మొత్తం 1,120 క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. రూ.5.60 లక్షల బోనస్ రావాల్సి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. – వాడ్వాట్ తిమ్మన్న, రైతు, గుడే బల్లూరు గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న బోనస్ డబ్బులు ఇవ్వక పోవడంతో బాధిత రైతులమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీకి రైతులందరం రాజకీయాలకు ఆంతీతంగా పోటీ చేయాలని నిర్ణయించాం. – చెవిటోళ్ల వెంకటేష్, రైతు, గుడే బల్లూరు గ్రామం -
12లోగా ‘రీయింబర్స్మెంట్’ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఈ నెల 12లోగా చెల్లించకపోతే ఆందోళన చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రకటించింది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం మాట తప్పిందని, ఇచ్చిన హామీ మేరకు దీపావళిలోపు బకాయిలు చెల్లిస్తారన్న నమ్మకం లేదని వెల్లడించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బుధవారం హైదరాబాద్లో సమావేశమయ్యాయి. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ‘ఫతి’ చైర్మన్ డాక్టర్ ఎన్.రమేష్బాబు మీడియాకు వెల్లడించారు. బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు తమతో చర్చలు జరిపారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని, ఇందులో రూ.1,200 కోట్లలో రూ.600 కోట్లు తక్షణం, మిగతా రూ.600 కోట్లు దీపావళిలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్నుంచీ ప్రభుత్వం చుట్టూ తిరిగామని, అయినా బకాయిలు చెల్లించలేదన్నారు. ఇప్పటివరకు కేవలం రూ. 200 కోట్లే ఇచ్చారని, మిగతాదానికి సీఎంవో నుంచి క్లియరెన్స్ లేదని అధికారులు చెప్పడం శోచనీయమన్నారు. తమ ఉద్యోగులు కనీసం దసరా పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. ఇక ఉపేక్షించం విద్యారంగంపై ప్రభుత్వం శీతకన్ను చూపుతోందని, ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని రమేష్బాబు అన్నారు. ఇక ఏమాత్రం ఉపేక్షించలేమని, బకాయిలు ఇవ్వకపోతే 13వ తేదీ నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామన్నారు. క్లాసులు నిర్వహించకపోవడం, విద్యార్థులతో చలో హైదరాబాద్, చలో సెక్రటేరియట్, బంద్లు, రాస్తారోకోలు చేపడతామన్నారు. ఈ నెల 12లోగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని, మిగిలిన మొత్తాన్ని ఎప్పుటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీలోపు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సునీల్ కుమార్, ట్రెజరర్ కె.కృష్ణారావు, జనరల్ సెక్రటరీ కేఎస్ శివకుమార్, సంఘం నేత నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంక్బండ్పై 700 బతుకమ్మలతో సంబరాలు
సాక్షి,హైదరాబాద్: బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది. వందలాది మంది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 500 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు. -
ప్రభుత్వానికి మెట్రో బదిలీ ఈజీ కాదు
మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్న నేపథ్యంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ప్రభుత్వ అధీనంలోకి వెళ్తే నిర్వహణ ఎలా ఉంటుంది..? సౌకర్యాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. అలాగే మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీచేసే ప్రక్రియ కూడా అంత ఈజీ కాదు. వివిధ అంశాలపైన స్పష్టమైన అవగాహన, ఒప్పందం ఏర్పడిన తరువాత మాత్రమే ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ కానుంది. ఇందుకోసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో వివిధ అంశాలపైన సమావేశాలు నిర్వహించి ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ (Hyderabad) మహానగరంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించి నిర్వహిస్తోన్న 69.2 కి.మీల మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్అండ్టీ సంస్థకు ఏకమొత్తంగా రూ.2000 కోట్లు చెల్లించి ప్రభుత్వం ప్రాజెక్టును స్వాదీనం చేసుకోనుంది. అలాగే రూ.13000 కోట్ల రుణాలను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ ఆర్థిక అంశాలపైన ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు నిర్వహణపరమైన అంశాలపైన కూడా ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ ఒప్పందాలు జరగాల్సివుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏడాది కంటే ఎక్కువ కాలమే పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.కేంద్రం అనుమతి తప్పనిసరి పీపీపీ పద్ధతిలో చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ఒక భాగస్వామ్య సంస్థగానే ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగాలన్నా, ఆర్థిక లావాదేవాలపైన ఎలాంటి ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాకేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా అనుమతించవలసి ఉంటుంది. ఎల్అండ్టీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరే ప్రతి ఒప్పందం వివరాలను కేంద్రానికి అందజేయాలి. అలాగే బ్యాంకు రుణాలను (Bank Loan) రాష్ట్రం భరించనున్న దృష్ట్యా అందుకు కూడా కేంద్రం నుంచి అనుమతి లభించవలసి ఉంటుంది. రెండోదశ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఎలా ముఖ్యమో, మొదటి దశ బదిలీకి కూడా అంతే ముఖ్యం అని అధికారులు తెలిపారు. కేంద్ర రాష్ట్రాలతో పాటు ఎల్అండ్టీ (L&T) సంయుక్త ప్రాజెక్టుగా 2011లో మెట్రో మొదటిదశ చేపట్టిన సంగతి తెలిసిందే. 2017 నవంబర్ నుంచి మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చా యి. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ల మధ్య ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. రోజుకు 4.8 లక్షల మందికి పైగా పయనిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఎల్అండ్టీ తన వాటాను రాష్ట్రానికి విక్రయించనున్న దృష్ట్యా నిర్వహణపరమైన సాంకేతిక అంశాలపై న కూడా ఒప్పందాలు తప్పనిసరి.కియోలిస్కు ఇంకా గడువు ఉంది ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ (Keolis) సంస్థ హైదరాబాద్లో మెట్రో రైళ్లను నడుపుతోంది. సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. కియోలిస్ సంస్థ హైదరాబాద్తో పాటు దుబాయ్, లండన్, పూణే నగరాల్లో కూడా మెట్రోలను నడుపుతోంది. నగరంలో ఈ సంస్థతో 2026 నవంబర్ వరకు ఒప్పందం ఉంది. ఈ మేరకు ఈ ఒప్పందాన్ని ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకొని పునరుద్ధరించవలసి ఉంది. ఒకవేళ కియోలిస్ను కాకుండా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నా 2026 నవంబర్ వరకు ఆగాల్సిందే. కానీ హైదరాబాద్తో మెట్రో రైళ్ల నిర్వహణలో కియోలిస్కు ఉన్న అనుభవం దృష్ట్యా ప్రభుత్వం మరో సంస్థను సంప్రదించకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కియోలిస్తోనే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది.ఆస్తులు–అప్పలు తేలాల్సిందే.. మెట్రో రైళ్లను నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల భూములను ఎల్అండ్టీకి లీజుకు ఇచ్చింది. ఈ స్థలాల్లో మాల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొనేందుకు అనుమతినిచ్చారు. కానీ ఎల్అండ్టీకి ఇచ్చిన మొత్తం 18.5 లక్షల చదరపు అడుగుల్లో ఇప్పటి వరకు కేవలం 6.5 లక్షల చదరపు అడుగుల స్థలాలను మాత్రమే ఆ సంస్థ వినియోగించుకుంది. ఇందులో కొంత భూమిని సబ్లీజ్కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములన్నింటినీ ప్రభుత్వం తిరిగి తీసుకోవలసి ఉంది. ఇందుకోసం కొంతసమయం పట్టే అవకాశం ఉంది.చదవండి: ప్రైవేటు వెంచర్కు ప్రభుత్వ భూమిలో రోడ్డుఅలాగే సబ్లీజుకు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత రావలసి ఉంది. మరోవైపు రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలు ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదలాయించాలి. ఎస్బీఐ (SBI) నేతృత్వంలో 12 బ్యాంకులు ఈ రుణాలను అందజేశాయి. ప్రస్తుతం ఈ 12 బ్యాంకుల నుంచి రుణాలను ప్రభుత్వానికి బదిలీ అయ్యేందుకు కూడా కొంత గడువు అవసరం. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టు యాజమాన్య బదిలీకి ఏడాది కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. -
తెలంగాణ: రేపటి నుండి రేషన్ షాపులు బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి రేషన్ దుకాణాలు(Telangana Ration Shops) మూతపడనున్నాయి. పలు డిమాండ్లతో రేషన్ డీలర్ల సంఘం చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గత 5 నెలలుగా రేషన్ డీలర్లకు(Ration Dealers Commission) కమీషన్ అందలేదు. దీనికి తోడు రూ.5 వేల కనీస గౌరవ వేతనం డిమాండ్ చేస్తున్నారు డీలర్లు. ఈ క్రమంలో వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తూ వచ్చారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులు సోమవారం 33 జిల్లాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించారు కూడా. అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని డీలర్ల సంఘం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో.. ఇక బియ్యం పంపిణీ చేసేది లేదని రేషన్ డీలర్ల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా కమీషన్ను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన దాఖలాలు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt Ration Shops) స్పష్టత ఇస్తేనే తిరిగి రేషన్ షాపులు తెరుస్తామని అంటున్నారు. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. కమీషన్ పెంచాలి. దుకాణాల అద్దె, బియ్యం రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలి లాంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ బంద్ నిరవధికమా? లేదంటే రేపు ఒక్కరోజేనా? అనేదానిపై రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అక్టోబర్ 2నే దసరా.. మద్యం, మాంసం అమ్మితే కఠిన చర్యలే! -
సరూర్నగర్ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
బీసీ రిజర్వేషన్ల పెంపుపై అంత తొందరెందుకు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అంత తొందరెందుకని సర్కార్ను హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లు ఆమోదం పొందే వరకు ఆగొచ్చు కదా.. పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయకుండా జీఓ జారీ చేస్తే రిజర్వేషన్ల పెంపుపై మీ స్ఫూర్తి దెబ్బతింటుందని కదా అని ప్రశ్నించింది. చట్ట ప్రకారం తాము ఇచ్చే తీర్పుమేరకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం తెలిపినా, ఆ బిల్లును ఇంకా గవర్నర్ ఆమోదించలేదని స్పష్టం చేసింది. బిల్లు పెండింగ్లో ఉండగా, జీఓ ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ దశలో రిజర్వేషన్ల పెంపును ఆమోదించలేం.. అలాగని ఇప్పటికిప్పుడు ఎలాంటి నిలిపివేత ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది. ఇరువైపులా పూర్తి వాదనలు విని.. తుది ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఆలోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా పిటిషన్లు ముందే దాఖలు చేసినందును మెరిట్ ఆధారంగా విచారణ చేస్తామని చెప్పింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితోపాటు మరొకరు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీజే సూచన మేరకు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. చట్టప్రకారం 50 శాతానికి మించొద్దు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు మమూర్రెడ్డి, ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. ఇప్పటికే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లున్నాయి. తాజా పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 67కు చేరాయి. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. ఆర్టికల్ 200 ఉల్లంఘనే. మొత్తం వర్టికల్ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కృష్ణమూర్తి, వికాశ్కిషన్ గవాయ్.. కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 28ఏ ప్రకారం కూడా పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్ల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు. చట్ట సవరణ చేయకుండా జీఓతో రిజర్వేషన్ల పెంపు చెల్లదు. బీసీ రిజర్వేషన్లు 35 శాతానికి పెంచుతూ 2018లో జీఓ ఇచ్చినా.. ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది’అని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా అని ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని మయూర్రెడ్డి చెప్పారు. రిజర్వేషన్ల పెంపుతో ఎస్సీలకు ఏం ఇబ్బందని.. మీ కోటా అలాగే ఉంటుందని కదా అని ధర్మాసనం అడిగింది. జనరల్ కోటాలో అవకాశం తగ్గుతుందని ప్రభాకర్ బదులిచ్చారు. ప్రధానంగా పిటిషన్లు వేసింది రిజర్వేషన్లతో ఇబ్బంది గురించి కాదని.. రాజ్యాంగ ఉల్లంఘనపైనని వెల్లడించారు. పెంపు రాజ్యాంగ ఉల్లంఘనే... రాజకీయ పార్టీలతో ఈ ఎన్నికలకు సంబంధం ఉండదు కదా అని ధర్మాసనం అడగ్గా.. పార్టీలు బలపరుస్తాయని ప్రభాకర్ చెప్పారు. ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అయినా ప్రజలే కదా ఎన్నికయ్యేది అని ధర్మాసనం పేర్కొంది. అలా భావిస్తే జీఓనే అవసరం లేదని, రాజ్యాంగం కొన్ని హద్దులు విధించిందని ప్రభాకర్ అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 శాతం చట్ట విరుద్ధంగా పెంచడం రాజ్యాంగ ఉల్లంఘనే అని మమూర్రెడ్డి అన్నారు. జీఓను అన్ని పార్టీలు సమర్థిస్తున్నట్టుంది.. ఏ పార్టీ వ్యతిరేకిస్తున్నట్టు లేదు కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. ‘బీసీ రిజర్వేషన్ల కోసం కమిషన్ వేసి జనాభాపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. దాదాపు 53 శాతం బీసీ జనాభా ఉన్నందున 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ బిల్లును గవర్నర్కు పంపాం. గవర్నర్ ఆమోదం తెలిపాల్సి ఉంది. నోటిఫికేషన్ ఇచ్చినా, ఎన్నికల నిర్వహణకు దాదాపు 45 రోజుల సమయం పడుతుంది. ఇంత అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేయల్సిన అవసరం లేదు. దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేయండి’అని కోరారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిటిషన్ వేయడం సాధ్యం కానందునే అత్యవసర పిటిషన్లు వేశామని ప్రభాకర్ చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్పై తీర్పు వచ్చే వరకు ఆగొచ్చు కదా, గతంలో గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జీఓ జారీ చేసిన ఘటనలు ఉన్నాయా అని ఏజీని ప్రశ్నించింది. హైకోర్టు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించిందని, అందుకే త్వరగా ప్రక్రియ చేపడుతున్నామని ఏజీ బదులిచ్చారు. ఎన్నికలు నిర్వహించమని మాత్రమే హైకోర్టు చెప్పిందని.. రిజర్వేషన్లు పెంచమని కాదని ప్రభాకర్ నివేదించారు. తమిళనాడు రిజర్వేషన్ల పెంపును కూడా సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకొని.. రేపటి వరకు అవకాశం ఇస్తాం.. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని నోటిఫికేషన్పై సమాచారం ఇవ్వాలని లేదా ఇప్పుడే అడిగి చెప్పాలని సూచించింది. 10 నిమిషాల తర్వాత హాజరైన ఏజీ ఉన్నతాధికారులు అందుబాటులో లేరన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గవర్నర్ వద్ద బిల్లుపై 3 నెలలు ఆగితే నష్టమేముందని, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించొచ్చు కదా.. అప్పుడు రిజర్వేషన్లపై ఎలాంటి పిటిషన్ దాఖలు కాదు అని ధర్మాసనం అభిప్రాయపడింది. తాము ఇప్పుడు నిలుపుదల ఉత్తర్వులిస్తే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపునకు చేసిన ప్రయత్నమంతా వృథా అవుతుందని వ్యాఖ్యానించింది. పిటిషన్లలో తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ వాయిదా వేయాలని ఆదేశించాలని ప్రభాకర్ కోరారు. ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘనపైనే పిటిషన్లు వేశామని మరోసారి స్పష్టం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటికిప్పుడు జీఓ 9పై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
తెలంగాణలో ఐపీఎస్ల బదిలీ.. పూర్తి వివరాలు
తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీనియర్లతో సహా 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీసు కమిషనర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. పూర్తి వివరాలు...1. రవి గుప్తా (Ravi Gupta) ఐపీఎస్ బ్యాచ్: 1990ప్రస్తుతం: హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిబదిలీ: సెంటర్ ఫర్ గుడ్గవర్నెన్స్ డీజీ2. సీవీ ఆనంద్ (CV Anand)ఐపీఎస్ బ్యాచ్: 1991ప్రస్తుతం: హైదరాబాద్ పోలీసు కమిషనర్బదిలీ: హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి3. శిఖా గోయల్ (Shikha Goel)ఐపీఎస్ బ్యాచ్: 1994ప్రస్తుతం: సైబర్ సెక్యురిటీ డైరెక్టర్బదిలీ: విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీ4. స్వాతి లక్రా (Swati Lakra)ఐపీఎస్ బ్యాచ్: 1995ప్రస్తుతం: హోంగ్రౌండ్ ఏడీజీపీబదిలీ: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ (ఫుల్ అడిషినల్ చార్జ్)5. మహేష్ మురళీధర్ భగవత్ (Mahesh Muralidhar Bhagwat) ఐపీఎస్ బ్యాచ్: 1995ప్రస్తుతం: లా అండ్ ఆర్డర్ ఏడీజీపీబదిలీ: ఏడీజీపీ (పర్సనల్- అడిషనల్ చార్జ్)6. చారు సిన్హా (Charu Sinha)ఐపీఎస్ బ్యాచ్: 1996ప్రస్తుతం: సీఐడీ అడిషనల్ డీజీపీబదిలీ: ఏసీబీ డైరెక్టర్ జనరల్7. డాక్టర్ అనిల్ కుమార్ (Dr. Anil Kumar)ఐపీఎస్ బ్యాచ్: 1996పోస్టింగ్: గ్రేహౌండ్స్, అక్టోపస్ ఏడీజీపీ (ఆపరేషన్స్)8. వీసీ సజ్జనార్ (VC.Sajjanar)ఐపీఎస్ బ్యాచ్: 1996ప్రస్తుతం: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్బదిలీ: హైదరాబాద్ పోలీసు కమిషనర్9. విజయ్ కుమార్ (Vijay Kumar)ఐపీఎస్ బ్యాచ్: 1997పోస్టింగ్: ఇంటెలిజెన్స్ ఏడీజీపీ10. వై నాగిరెడ్డి (Y Nagi Reddy)ఐపీఎస్ బ్యాచ్: 1997ప్రస్తుతం: డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీబదిలీ: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్11. దేవేంద్ర సింగ్ చౌహాన్ (Devendra Singh Chauhan)ఐపీఎస్ బ్యాచ్: 1997ప్రస్తుతం: సివిల్ సప్లైస్ వీసీ, ఎండీబదిలీ: మల్టీజోన్-II ఏడీజీపీ12. విక్రం సింగ్ మాన్ (Vikram Singh Mann)ఐపీఎస్ బ్యాచ్: 1998ప్రస్తుతం: లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్బదిలీ: డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీ13. ఎం స్టీఫెన్ రవీంద్ర (Stephen Raveendra)ఐపీఎస్ బ్యాచ్: 1999పోస్టింగ్: సివిల్ సప్లైస్ కమిషనర్14. ఎం శ్రీనివాసులు (M. Srinivasulu)ఐపీఎస్ బ్యాచ్: 2006ప్రస్తుతం: సీఐడీ ఐజీపీబదిలీ: అడిషనల్ కమిషనర్ (కైమ్స్), హైదరాబాద్15. తఫ్సీర్ ఇక్బాల్ (Tafseer Iqubal)ఐపీఎస్ బ్యాచ్: 2008ప్రస్తుతం: జోన్ VI డీఐజీబదిలీ: లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్16. ఎస్ఎం విజయ్ కుమార్ (SM Vijay Kumar)ఐపీఎస్ బ్యాచ్: 2012ప్రస్తుతం: హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీబదిలీ: సిద్ధిపేట పోలీసు కమిషనర్17. సింధు శర్మ (Sindhu Sharma)ఐపీఎస్ బ్యాచ్: 2014ప్రస్తుతం: ఇంటెలిజెన్స్ ఎస్పీబదిలీ: ఏసీబీ జాయింట్ డైరెక్టర్18. డాక్టర్ జి వినీత్ (Dr. G. Vineeth)ఐపీఎస్ బ్యాచ్: 2017ప్రస్తుతం: మాదాపూర్ డీసీపీబదిలీ: నారాయణ్పేట్ ఎస్పీ19. డాక్టర్ బి అనురాధ (Dr. B. Anuradha)ఐపీఎస్ బ్యాచ్: 2017పోస్టింగ్: ఎల్బీ నగర్ డీసీపీ, రాచకొండ20. సీహెచ్ ప్రవీణ్ కుమార్ (Ch. Praveen Kumar)ఐపీఎస్ బ్యాచ్: 2017పోస్టింగ్: ఏసీబీ జాయింట్ డైరెక్టర్21. యోగేష్ గౌతమ్ (Yogesh Gautam)ఐపీఎస్ బ్యాచ్: 2017ప్రస్తుతం: నారాయణ్పేట్ ఎస్పీబదిలీ: రాజేంద్రనగర్ డీసీపీ, సైబరాబాద్22. సీహెచ్ శ్రీనివాస్ (Ch. Srinivas)ఐపీఎస్ బ్యాచ్: 2018పోస్టింగ్: హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీ23. రితిరాజ్ (Riti Raj)ఐపీఎస్ బ్యాచ్: 2018పోస్టింగ్: మాదాపూర్ డీసీపీ, సైబరాబాద్చదవండి: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్రెడ్డి -
హైదరాబాద్ సీపీగా సజ్జనార్.. సిరిసిల్ల కలెక్టర్గా హరిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ జరిగింది. ఆరుగురు ఐఏఎస్, 23 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ బత్తుల శివధర్రెడ్డిని తెలంగాణ డీజీపీగా ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే.ఇక భారీ బదిలీల్లో భాగంగా.. ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్ను హైదరాబాద్ నగర కమిషనర్గా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్నారు. చట్టవిరుద్ధమైన చర్యలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘన, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం.. లాంటి అంశాలతో హైకోర్టు సైతం మొన్నీమధ్యే ఆయనపై ఆగ్రం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఆయన్ని తప్పించింది. ఆ స్థానంలో హరితను కలెక్టర్గా నియమించింది. స్పెషల్ సెక్రటరీగా సందీపకుమార్ ఝాకు బాధ్యతలు అప్పగించింది.హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ను.. హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా నియమించింది. ఇంటలిజెన్స్ డీజీగా విజయ్కుమార్ను, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా శిఖా గోయల్, ఫైర్ వింగ్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ చీఫ్గా వీవీ శ్రీనివాసరావు, పౌరసరఫరాల కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు చారుసిన్హాకు అప్పగించారు. -
సర్కారువారి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు తొలి దశను ఎల్ అండ్ టీ గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 13 వేల కోట్ల రుణ భారాన్ని మోసేందుకు ముందుకొచ్చింది. అలాగే ఎల్ అండ్ టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్లో ఆ సంస్థకు ఉన్న ఈక్విటీలో రూ. 2 వేల కోట్లను వన్టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.వి. సుబ్రమణ్యన్ మధ్య జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2024 నవంబర్ నుంచి ఈ విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. మెట్రో విస్తరణ వేళ.. మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఎల్ అండ్ టీ యాజమాన్యం మాత్రం మెట్రో నిర్వహణ భారం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో రెండో దశలో భాగం కాబోమని.. తొలి దశ నుంచి సైతం వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు గత నెలలోనే ప్రకటించింది. ఇదే విషయాన్ని సీఎంకు తాజా భేటీలో పునరుద్ఘాటించింది. ‘మెట్రో’ను నడిపించడం తమ వల్ల కాదని.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే రెండో దశలోని 2ఏ, 2 బీ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడం సాధ్యం కాదని ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్.వి. సుబ్రమణ్యన్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి స్పష్టం చేశారు. అయితే కనీసం మొదటి దశ, రెండో దశ మధ్య ఆపరేషనల్ ఇంటిగ్రేషన్, రెవెన్యూ, కాస్ట్ షేరింగ్ కోసం స్పష్టమైన ఒప్పందమైనా కుదుర్చుకోవాలని సీఎం కోరినప్పటికీ అందుకు ఎల్ అండ్ టీ సీఎండీ ససేమిరా అన్నారు. తాము పూర్తిగా రవాణా కార్యకలాపాల నిర్వహణ రంగం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నందున కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు చేసుకోవట్లేదని ఎస్.వి. సుబ్రమణ్యన్ తేల్చిచెప్పారు. తమ సంస్థకు ఉన్న అప్పులు, ఈక్విటీ చెల్లిస్తే తొలిదశ ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమని ప్రతిపాదించారు. 2022 జూన్ 7న కుదుర్చుకున్న అదనపు రాయితీ ఒప్పందం ప్రకారం రూ. 3 వేల కోట్లు వడ్డీరహిత రుణంగా ప్రభుత్వం ఇస్తామన్న మొత్తంలో ఇంకా రూ. 2,100 కోట్లు అందాల్సి ఉందన్నారు. అలాగే రూ. 5,900 కోట్ల ఈక్విటీ విలువ కింద చెల్లించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో తొలిదశ ప్రాజెక్టును పూర్తిగా తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ఆదేశించారు. ఈ సమావేశంలో పట్టణ రవాణా సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏ అండ్ యూడీ కార్యదర్శి కె. ఇలంబరితి, హెచ్ఎంఆర్ఎల్ ప్రిన్సిపల్ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, సీఎంవో కార్యదర్శి కె. మణిక్యరాజ్, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కె.వి.బి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్పుల భారం పెరగడంతో.. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ తాజా వార్షిక నివేదిక ప్రకారం సంస్థకు కార్యకలాపాలు, ఇతర మార్గాల ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,108.54 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ. 1,399.31 కోట్ల ఆదాయం కంటే 21 శాతం తక్కువ. అలాగే 2024–25లో పన్నుల చెల్లింపునకు ముందు రూ. 625.88 కోట్ల నష్టం నమోదవగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 555.04 కోట్లుగా నమోదైంది. మెట్రో రైల్ తొలి దశ ప్రాజెక్టు కోసం ఎల్ అండ్ టీ 2010 సెపె్టంబర్లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో రాయితీ ఒప్పందం కుదుర్చుకొని 2011 మార్చిలో ప్రాజెక్టు ఫైనాన్షియల్ క్లోజర్ను పూర్తిచేసింది. తొలి దశ ప్రాజెక్టుకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని 10 బ్యాంకుల కన్సార్షియం రుణం మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో జాప్యంతో వ్యయ భారం పెరగడంతో తమకు రూ. 3,756 కోట్లను తిరిగి చెల్లించాలని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ 2017 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే 2020 ఫిబ్రవరిలో మెట్రో తొలి దశ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే నాటికి ఎల్ అండ్ టీ మెట్రో రైల్పై ఆర్థిక భారం రూ. 5 వేల కోట్లకు పెరిగింది.రెండు నుంచి తొమ్మిదవ స్థానానికి..హైదరాబాద్లో మెట్రో రైల్ పొడవు పరంగా దేశంలో 2014లో రెండవ స్థానంలో ఉండగా ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయింది. పలు నగరాలు మెట్రోను విస్తరించినా హైదరాబాద్లో మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న రవాణా డిమాండ్ను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2ఏ, 2బీ విస్తరణ కింద 8 లైన్లకు సంబంధించిన 163 కి.మీ. పొడవైన మెట్రో నెట్వర్క్ను ప్రతిపాదించడం తెలిసిందే. -
వారాంతంలోగా స్థానిక నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ వారాంతంలోగా వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నెలా ఖరులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆలోగానే నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల ఆ ఆదేశాలను పాటించినట్టు అవుతుందని ప్రభుత్వం భావి స్తున్నట్టు సమాచారం. దీనికిముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని, ఆ వెంటనే ఎన్నికల నిర్వహణ తేదీ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) సమాచారం తెలియజేస్తుందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. ముందుగా ఎస్ఈసీ షెడ్యూల్ జారీ చేస్తుందని, మరుసటిరోజు నోటిఫికేషన్ విడుదల చేయొ చ్చునని చెబుతున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ లేదా ప్రణాళిక శాఖ జీవో జారీ చేసిన తర్వాత, దీని ఆధారంగా పంచాయతీరాజ్ అధికారులు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వే షన్లపై జీవో జారీ చేస్తారని అంటున్నారు. రిజర్వేషన్లు బయటకు పొక్కొద్దు..మంగళవారం కల్లా ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలు, వార్డు స భ్యులు, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అర్థరాత్రి దాకా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దీనికి సంబంధించిన కసరత్తు పూర్తిచేసిన అధికారులు, సిబ్బంది.. ఆ మేరకు నివేదికలను సీల్డ్కవర్లలో జిల్లా కలెక్టర్లకు అందజేసినట్టు సమాచారం. ఖరారు చేసిన రిజర్వేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి వెల్లడించవద్దని అధికారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో వీటిపై వివరాలు చెప్పడానికి పీఆర్ ఆర్డీ అధికారులు, సిబ్బంది నిరాకరిస్తున్నారు. కాగా క్షేత్రస్థాయిలో వార్డులు, సర్పంచ్ల రిజర్వేషన్ల ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉండడంతో వీటి ఖరారుకు అధిక సమయం పట్టినట్టు తెలుస్తోంది. వార్డు సభ్యులు, సర్పంచ్ల రిజర్వేషన్లు కూడా..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో జారీ చేశాక...జిల్లాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన రిజర్వేషన్ల జాబితాలను పరిశీస్తారు. ఏమైనా మార్పు చేర్పులుంటే సరి చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. అయితే వీటితో పాటు వార్డు సభ్యులు, సర్పంచ్ల రిజర్వేషన్లు కూడా పూర్తి చేయాలనే ఆదేశాలతో.. వాటిని కూడా జిల్లా, మండల, గ్రామ అధికారులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేయాల్సి ఉండగా, అది కూడా పూర్తయినట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు...ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున.. దీని ద్వారా అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో పూర్తి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ జెడ్పీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో గెలిచుకునేందుకు వీలుగా ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వారం లోగా నోటిఫికేషన్ వెలువడితే..మూడు వారాల వ్యవధిలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవి ముగిశాక కొన్నిరోజుల అంతరంతో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత మూడు వారాల వ్యవధిలోనే ఆ ప్రక్రియ ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ నెలాఖరులోగా నోటిఫికేషన్ సాధ్యం కాని పక్షంలో..కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇంతవరకు జరిపిన కసరత్తుకు సంబంధించిన వివరాలు హైకోర్టుకు తెలియజేసి మరింత సమయం కోరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్లు ఇలా..!రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే..జిల్లా ప్రజా పరిషత్లు (జెడ్పీపీలు) 31, జెడ్పీటీసీ స్థానాలు 565 , మండల ప్రజాపరిషత్లు 565, ఎంపీటీసీ స్థానాలు 5,763, గ్రామపంచాయతీలు– 12,760, వార్డుల సంఖ్య 1,12,534 గా ఖరారు అయ్యాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక 2019లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 570, ఎంపీటీసీలు 5,817, గ్రామపంచాయతీలు 12,848గా ఉన్నాయి. అయితే ఇప్పుడు 1 జెడ్పీపీ, 5 జెడ్పీటీసీ, 5 ఎంపీపీలు, 54 ఎంపీటీసీ స్థానాలు, 185 గ్రామ పంచాయతీలు తగ్గాయి. మేడ్చల్–మల్కాజిగిరిలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో గ్రామీణ జిల్లా ఉనికి లేకుండా పోయింది. ఒక జెడ్పీపీ, 4 జెడ్పీటీసీల సంఖ్య తగ్గుదలకు ఇది కారణంగా నిలుస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు సిట్కు కీలక వ్యాఖ్య చేసింది. దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంపై కోర్టు స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ప్రభాకర్ రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదు. ఫోన్ డివైస్లలో డాటా ఫార్మట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఫోన్ డివైస్లో సమాచారం ధ్వంసం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక కూడా ఇచ్చింది. జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ఆయన టాప్ చేశారు. ప్రభుత్వ ఫోన్లో పాస్వర్డ్ సైతం చెప్పడం లేదు. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను తొలగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభాకర్రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే తన క్లయింట్ చాలాసార్లు సిట్ విచారణకు హాజరయ్యాని.. సహకరించడం లేదన్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల సమయం కోరారాయన. దీంతో.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ దాకా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెబుతూ.. మధ్యంతర ఊరటను పొడిగించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని ప్రభాకర్రావుకు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో.. ఇంటరాగేట్ చేసి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్కు సూచించింది. -
కొత్త డిస్కమ్కు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ అధికారులు రూపొందించిన ప్రణాళికకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆర్థికపరమైన అంశాలపై మరింత అధ్యయనం చేయాలని సూచించారు. ఏయే సంస్థల నుంచి రుణాలు పొందే వీలుంది? ఎంత మేర రుణాలు తీసుకోవచ్చన్న దానిపై నిర్దిష్ట సమాచారం అందించాలని అధికారులకు చెప్పినట్టు తెలిసింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, జెన్కో ఎండీ హరీశ్రావు, సింగరేణి సీఎండీ బలరాం, డిస్కమ్ల సీఎండీలు ముషారఫ్, వరుణ్రెడ్డి, రెడ్కో చైర్మన్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఉచితాలన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి..: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ కొత్త డిస్కమ్ పరిధి పర్యవేక్షణలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలోని తాగునీటి సరఫరాను కొత్త డిస్కమ్ పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా రూపొందించిన ప్రణాళికను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కమ్లు కమర్షియల్ ఆపరేషన్ విధులు నిర్వర్తిస్తాయని, కొత్త డిస్కమ్ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ డిస్కమ్కు కావాల్సిన మానవ వనరులను రెండు డిస్కమ్ల పరిధి నుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేయవచ్చని, కొంతమందిని తాత్కాలికంగా నియమించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో డిస్కమ్ ఏర్పాటుకు కావాల్సిన నిధుల సమీకరణపై ప్రభుత్వం చర్చించాల్సి ఉందని, కేబినెట్ ఆమోదం తర్వాత దీనిపై స్పష్టత ఇస్తామని సీఎం అన్నట్టు తెలిసింది. వీలైనంత త్వరగా కొత్త డిస్కమ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని అన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాజధానిలో అండర్ గ్రౌండ్ కేబుల్ రాష్ట్ర రాజధానితో పాటు, పరిసర జిల్లాల్లో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న వైనాన్ని అధికారులు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో స్మార్ట్ టెక్నాలజీతో నడిచే ట్రాన్స్ఫార్మర్లు, కేబులింగ్ వ్యవస్థ అవసరాన్ని తెలియజేశారు. ఇతర దేశాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం అమలులో ఉందంటూ.. దీన్ని రాజధానిలోనూ తీసుకొచ్చేందుకు రూపొందించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా సబ్ స్టేషన్ల ఏర్పాటు విధానాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆన్లైన్ విధానంలో సబ్ స్టేషన్లు, ఆధునిక టెక్నాలజీ ద్వారా వాటి పనితీరును గుర్తించే వ్యవస్థ గురించి వివరించారు. సబ్ స్టేషన్ సామర్థ్యానికి మించి విద్యుత్ కనెక్షన్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయాలను అదుపు చేయాలని సీఎం ఆదేశించారు. అవినీతిపై ఓ కన్నేయండి విద్యుత్ శాఖ అవినీతిమయమైందన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నట్టు తెలిసింది. తాజాగా ఓ అధికారి ఏసీబీకి చిక్కడంపై ఆయన ఆరా తీశారు. విద్యుత్ సంస్థల్లో కీలకమైన అధికారులపైనా ఆరోపణలున్నాయని, ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు తమ దృష్టికి తెచ్చినట్టు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శితో సీఎం అన్నట్టు తెలిసింది. ఏసీబీతో సమన్వయం చేసుకుని, అక్రమ ఆస్తులున్న వారి జాబితాను రూపొందించాలని ఆయన సూచించినట్లు సమాచారం. జెన్కోలో ఓ డైరెక్టర్ స్థాయి అధికారి అవినీతి వ్యవహారంపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. -
పట్టువిడుపులుంటేనే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. తొలుత మూడు.. ఆ తర్వాత మరిన్ని గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనలు విధించారు. ఈ అఫిడవిట్తోనే తంటా.. రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్మెంట్ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ దరఖాస్తుల సంగతేంటి? సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్లైన్లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. ఉదారంగా వెళ్లడమే మేలు సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. – భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు సాదాబైనామా క్లియరెన్స్ కోసం ఏముండాలంటే...! – భూమి రైతు ఆదీనంలో కొనసాగుతుండాలి – 12 సంవత్సరాలుగా సదరు వ్యక్తి అనుభవంలో ఉండాలి – కొనుగోలు చేసినట్టుగా పత్రం లేదా పహాణీలోని సాగుదారు కాలమ్లో పేరు ఉండాలి. సాదా బైనామా.. కథా కమామిషు తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్లైన్లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. -
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి నియమితులయ్యారు. అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారుగా రెండేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు.హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ఉమెన్ అండ్ చైల్డ్వెల్ఫైర్ డైరెక్టర్గా శ్రుతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, హెచ్ఎండీఏ సెక్రటరీగా కోటా శ్రీవాత్స, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం.రాజారెడ్డి నియమితులయ్యారు. -
ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం నెలకొంది. బకాయిలు చెల్లించని కారణంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన తర్వాత సోమ వారం ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. కొన్ని యాజమాన్యాలు బంద్ కొనసాగించాలని భావిస్తుండగా, ప్రభుత్వంతో గొడవ ఎందుకు అనే ధోరణిలో మరికొన్ని యాజమాన్యాలు ఉన్నట్లు సమాచారం. అయితే అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ మాత్రం మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని తెలిపారు. రూ.100 కోట్లు ఇస్తే ఎలా?: ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 1 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు గత నెల 25న నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ప్రభుత్వం పిలిపించి మాట్లాడడంతో పాటు బకాయిలు చెల్లిస్తామంటూ హామీ ఇవ్వడంతో సేవల నిలిపివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇతర చెల్లింపుల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కుదర్లేదు. దీంతో హాస్పిటల్స్ అసోసియేషన్ తాజాగా మరోసారి అల్టిమేటం ఇచ్చింది. అయితే ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఏం చేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. రూ.1,400 కోట్ల బకాయిలు ఉంటే రూ.100 కోట్లు ఇస్తే ఎలా అని డాక్టర్ రాకేష్ ప్రశ్నించారు. -
కాలేజీ యాజమాన్యాల యూటర్న్.. బంద్ లేనట్లేనా?? ఇదిగో క్లారిటీ
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో నేటి నుంచి ఇచ్చిన బంద్ పిలుపుపై యాజమాన్యాలు యూటర్న్ తీసుకున్నాయనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వంతో చర్చలు పూర్తైన తర్వాతే బంద్పై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి. అయితే.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సహా పలు డిమాండ్లతో నేటి నుంచి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్ను పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాకా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల తరఫున ప్రతినిధులతో మంత్రి భట్టి, అధికార వర్గాలు చర్చలు జరిపాయి. కానీ, ఆ చర్చలు ఎలాంటి పురోగతి సాధించలేదు. దీంతో నేటి బంద్పై ప్రతిష్టంభన నెలకొంది. అయితే.. ఈ పరిణామంపై యాజమాన్యాల ప్రతినిధులు స్పందించారు. నేడు కాలేజీలను తెరవొద్దని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం మధ్యాహ్నాం ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరుపుతామని, ఆ చర్చల తర్వాతే బంద్ కొనసాగింపుపై స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. దీంతో ఇవాళ ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగనుందనే స్పష్టత వచ్చింది. అయితే కొన్ని కాలేజీలు మాత్రం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం.ఎందుకీ నిర్ణయం?తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, బీఈడీ, ఎంబీఏ, నర్సింగ్ తదితర వృత్తి విద్యా ప్రైవేట్ కళాశాలల బంద్ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కళాశాలల యాజమాన్యాల సమాఖ్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన ₹1,200 కోట్ల బిల్లులను దసరా లోపు చెల్లించాలని, మొత్తం బకాయిలను డిసెంబర్ 31లోపు పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుపై feasibility నివేదికను అక్టోబర్ 31లోపు విడుదల చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ పరిస్థితుల మధ్య పరీక్షలు వాయిదా వేయాలని వర్సిటీలను ఫెడరేషన్ కోరుతోంది. ఈ పరిస్థితి విద్యార్థులు-తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాల మధ్య తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. బంద్ కొనసాగితే గనుక.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. -
గాంధీ సరోవర్కు ‘రక్షణ’ భూములివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘గాంధీ సరోవర్’ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదలాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువల స్ఫూర్తిని చాటేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ అయ్యారు. 98.20 ఎకరాలు కేటాయించండి మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ’నిర్మించ తలపెట్టామని, ఇందుకు గాను అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, మ్యూజియం, శాంతి విగ్రహం వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ల్యాండ్ స్కేపింగ్, ఘాట్లు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే వినోద ప్రదేశాలను కూడా అభివృద్ధి చేస్తామని రేవంత్ చెప్పారు. దీనిపై రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీకి వస్తేనే ఫీజు?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేసే ప్రసక్తే లేదని చెబుతున్న ప్రభుత్వం.. చడీచప్పుడు లేకుండా ఆ పథకంలో కోతలు వేసే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గత నెల 21వ తేదీన ‘సాక్షి’కథనం ప్రచురించగా, ప్రభుత్వం స్పందించి ‘అబ్బే అలాంటిదేమీ లేదు.. నిరాధార వార్త’అంటూ కొట్టిపారేసింది. కానీ వచ్చే శుక్రవారం అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్ గుర్తింపు హాజరును ఫీజు రీయింబర్స్మెంట్కు ఎలా లింక్ చేయాలి, ఎలా తప్పనిసరి చేయాలి? అనే అంశాన్ని భేటీ ఎజెండాలో ప్రధానంగా చేర్చారు. కొత్తగా కాలేజీలకు డిజీ లాకర్ను తీసుకొస్తున్నారు. ఇందులో ఫ్యాకల్టీ, విద్యార్థుల హాజరు శాతం నమోదు అవుతుంది. విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సూచనలు చేసినట్టు తెలిసింది. దీనికి అనుగుణంగానే వీసీల సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోతపై వ్యూహ రచన చేయబోతున్నట్టు సమాచారం. ముందు హాజరు.. తర్వాత మార్కులు ప్రస్తుతానికి ముఖ గుర్తింపు హాజరు విధానం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ను ఫిల్టర్ చేయాలని భావిస్తున్నారు. ఈ దశలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రాకపోతే తర్వాత దశలకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ మొదలుకొని అన్ని సాంకేతిక, సాధారణ కోర్సుల్లో ఒక సంవత్సరంలో 50 శాతం సబ్జెక్టులు పాసవ్వడంతో పాటు, 75 శాతం హాజరు ఉండాలన్న కొత్త నిబంధన తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి సూచనగా చెబుతున్నారు. సాంకేతిక విద్యలో కోర్సులోని ప్రధాన సబ్జెక్టులో విద్యార్థి కనీసం 60 శాతం మార్కులు తెచ్చుకుంటేనే రీయింబర్స్మెంట్ అమలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలిసింది. ఉదాహరణకు సీఎస్ఈ ఎమర్జింగ్ కోర్సు తీసుకున్న విద్యార్థి డేటాసైన్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులు తెచ్చుకుని తీరాలి. అదే విధంగా బీకాంలో కామర్స్ సబ్జెక్టులో మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అధికారుల అంతర్మథనం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా అనేక మంది పేదలు ఉన్నత చదువులకు వెళ్లారు. తర్వాత ప్రభుత్వాలు ఈ పథకంలో మార్పులు తెచ్చేందుకు సాహసించలేదు. ఈ నేపథ్యంలో పథకంలో కోతకు అడుగులు వేయాల్సి రావడంపై అధికారులు మథనపడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుతం దాదాపు రూ.8 వేల కోట్ల వరకు పేరుకు పోయాయి. వీటిని రాబట్టుకునేందుకు కాలేజీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. భారీగానే కోతరాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్లు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా రూ.2,350 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్గా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం ఫీజు చెల్లిస్తారు. ఆపై ర్యాంకులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తారు. మొదటి ఏడాదిలో 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులు అవ్వని విద్యార్థులు దాదాపు 50 శాతం మంది ఉంటున్నారు. ఉన్నత విద్యలో కొత్తగా ప్రవేశించడం, భయం వల్ల వారికి తక్కువ మార్కులు వస్తున్నాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, కాలేజీకి వచ్చినా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో హాజరును కొలమానంగా తీసుకుంటే చాలామంది విద్యార్థులకు అసౌకర్యం తప్పదని అధికారులే చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్లో కోత వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. -
అక్షరం తేడా ఉన్నా బిల్లు రాదాయె!
జనగామ జిల్లాకు చెందిన వెంకటమ్మ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె పదేళ్ల క్రితం పుట్టింటి పేరుతోతీసుకున్న ఆధార్ కార్డునే ప్రస్తుతం వినియోగిస్తోంది. ఇటీవల ఆధార్ నంబర్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించేలా అధికారులు మార్పులు చేశారు. అయితే వెంకటమ్మ ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రంలో అత్తింటివారి పేరు ఉండటంతో ఆధార్ వివరాలతో సరిపోలట్లేదంటూ అధికారులు బిల్లు చెల్లింపు నిలిపేశారు.నల్లగొండకు చెందిన పెదబోయిన ఈశ్వరి పేరును గ్రామ కార్యదర్శి బృందం ఇందిరమ్మ ఇళ్ల రికార్డులో పి.ఈశ్వరిగా పేర్కొంది. కానీ ఆధార్లో ఉన్నట్టుగా పేరు లేకపోవటంతో ఆమెకు ఇందిరమ్మ బిల్లు అందలేదు. అప్పు తెచ్చి పనులు మొదలుపెట్టానని.. బిల్లు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నానని ఈశ్వరి వాపోతోంది. సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో సమస్యలు తలెత్తుతున్నాయి. తొలుత లబ్ధిదారులు అందించిన వివరాల ఆధారంగా వారి బ్యాంకు ఖాతా లకు నేరుగా బిల్లులు జమ చేస్తూ వచ్చిన అధికారులు.. ఆయా వివరాలు తప్పుగా నమోదవటం వల్ల బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టారు. అయినా సమస్యలు తగ్గకపోగా కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. పొడి అక్షరాలతో పేర్లు... గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలోని బృందాలు ఇందిరమ్మ లబ్ధిదారుల పూర్తి పేర్లను ఆధార్ కార్డుల్లోని వివరాల ప్రకారం నమోదు చేయాల్సి ఉండగా కొంత మంది లబ్ధిదారుల విషయంలో సిబ్బంది పొడి అక్షరాలతో సరిపుచ్చారు. ఇంకొందరి ఇంటిపేర్లను పూర్తిగా రాసినా అర్థమయ్యేలా రాయకపోవడం వల్ల కంప్యూటరీకరించే వేళ అక్కడి సిబ్బంది ఇంటి పేర్లను పొడి అక్షరాల్లోకి మార్చారు. దీంతో ఆధార్ కార్డుల్లోని ఇంటి పేర్లు ఒక రకంగా.. ఇందిరమ్మ లబ్ధిదారుల రికార్డుల్లో మరో రకంగా నమోదయ్యాయి. ఫలితంగా ఆధార్లోని వివరాల ప్రకారం పేర్లు లేకపోవడంతో లబ్ధిదారులు మారిపోయినట్లు భావిస్తూ అధికారులు బిల్లులను నిలిపేస్తున్నారు. పేర్ల స్పెల్లింగ్లలో తేడాల వల్ల.. కొందరు లబ్ధిదారుల పేర్ల స్పెల్లింగ్లలోనూ తేడాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యాయి. ఉదాహరణకు వల్లి అనే పేరును ఆంగ్ల అక్షరాల్లో రాసేటప్పుడు ఆధార్ కార్డులో చివరి అక్షరంగా ‘వై’అని ఉంటే.. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ‘ఐ’అని రాశారు. అలాగే సుమతి పేరును ఆంగ్లంలో టీహెచ్ఐ అని ఒకచోట, టీఐ అని మరోచోట నమోదు చేశారు. ఇలాంటి తేడాలను కూడా లబ్ధిదారులు మారినట్టుగానే భావిస్తూ బిల్లుల చెల్లింపును అధికారులు ఆపేస్తున్నారు. బేస్మెంట్ స్థాయి వరకు పని పూర్తయినట్టు ఇందిరమ్మ యాప్లో ఫొటోతో సహా అప్లోడ్ చేసి 20 రోజులు గడుస్తున్నా బిల్లులు రావట్లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులను సంప్రదిస్తే ఆధార్ కార్డులోని వివరాలతో సరిపోలట్లేదని.. దాన్ని మారిస్తే తప్ప బిల్లు రాదని చెబుతున్నారు. అయితే తమ ప్రమేయం లేకుండా జరిగిన పొరపాట్లు ఇళ్ల నిర్మాణంపై ప్రభావం చూపుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన వారి వివరాలను మార్చి బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. చాలామంది లబ్ధిదారులకు ఈ సమస్య తెలియక బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫిర్యాదు చేయని వారి బిల్లుల విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. -
వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ‘వందేళ్లలో రాని వరదలొచ్చి పెద్ద నష్టమే జరిగింది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లాలో అమలు చేసే విధానం రాష్ట్రమంతటికీ విస్తరిస్తాం. ఇందుకు ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సమగ్ర నివేదిక రూపొందించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలో గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు చూసి తగిన సాయం అందించాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చానని చెప్పారు. మళ్లీ వరదలు వచ్చి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. జిల్లా అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ఇక్కడ అమలు చేసే ప్రణాళిక రాష్ట్రమంతటికీ విస్తరించేందుకు ఉపయోగపడుతుందని, విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలని చెప్పారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్లతో కలిసి సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ రివ్యూ చేశారు. రైతులను ఓదార్చిన సీఎం సీఎం రేవంత్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్దు వద్ద వరదలతో దెబ్బతిన్న వంతెనను, బూరుగిద్ద వద్ద కొట్టుకుపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అక్కడి నుంచి కామారెడ్డి పట్టణంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వపరంగా సాయం అందించామని, ఫార్మా, బీడీ కంపెనీల ద్వారా పిల్లల అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమీకృత కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావ్, లక్ష్మీకాంతరావ్, భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో వరద నష్టంపై సుదీర్ఘంగా సమీక్షించారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. నివేదికలు మార్గదర్శకాలకు లోబడి ఉంటేనే కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. లేకపోతే మన ప్రతిపాదనలు తిరస్కారానికి గురై మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుందన్నారు. వరదలతో మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడిందని, తక్షణమే మరమ్మతులు చేశామన్నారు. అంతకుముందు తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ శివారులోని హెలిపాడ్ వద్ద దిగిన రేవంత్రెడ్డికి షబ్బీర్అలీ, జిల్లా కలెక్టర్ సంగ్వాన్ స్వాగతం పలికారు. పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ లోపు అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి జరిగిన నష్టాలపై సరైన నివేదిక రూపొందించాలన్నారు. అలాగే, శాశ్వత పరిష్కారం చూపడానికి అయ్యే వ్యయానికి సంబంధించిన నివేదికలు కూడా తయారు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్ష చేస్తారని, ఆ లోపు నివేదికలు రూపొందించాలన్నారు. ఆ తరువాత తాను అందరితో కలిసి సమీక్ష చేస్తానని తెలిపారు. వరదలతో ఇసుక మేటలు వేసిన పొలాలను సరి చేయడానికి అధికారులంతా సమన్వయం చేసుకుని ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. యూరియా పంపిణీలో మార్పులు చేయాలి సహకార సంఘంలోనే యూరియా పంపిణీ చేయడం వల్ల వేలాది మంది రైతులు రావడం, వారికి సరిపోవడం లేదంటూ నెగెటివ్ ప్రచారం జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అలాకాకుండా రెండు మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని తెరిచి అక్కడి రైతులకు అక్కడే యూరియా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల మధ్య సరైన సమన్వయం, సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రభుత్వం బద్నాం అవుతోందన్నారు. ఆస్పత్రుల్లో వైద్యుల హాజరుకోసం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం అమలు చేయాలని వైద్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కొడంగల్తో సమానంగా కామారెడ్డి కామారెడ్డి నియోజక వర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తాను రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలు చూడాలి కాబట్టి ప్రజలు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి చెబితే తనకు చెప్పినట్టేనని, ఆయన సహకారంతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులను, రోడ్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లు కూలిపోయిన పేదలకు ప్రత్యేక కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిçస్తున్నామని, అలాగే పశువులు చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పారు. -
'అప్పు'డే మొదలైంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానా కటకటలాడుతోంది. ఆదాయం తక్కువై..ఖర్చులు ఎక్కువ కావడంతో అప్పులు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతినెలా రూ.12 వేల కోట్లకు మించి ఆదాయం రాకపోవడం, అదే సమయంలో రూ.18 వేల కోట్ల వరకు అనివార్య ఖర్చులు చేయాల్సి వస్తుండటంతో అప్పుల పద్దు ప్రతినెలా పెరిగిపోతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ముగిసిన ఐదు నెలల కాలం కంటే అదనంగా సెప్టెంబర్ నెల ప్రారంభంలోనేప్రభుత్వం ఏకంగా రూ.6 వేల కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకుంది. కాగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలై 31 వరకు చేసిన రూ.25వేల కోట్లకు తోడు ఆగస్టు నెలలో తీసుకున్న రూ.3వేల కోట్లు, ఈ నెలలో తీసుకున్న రూ.6వేల కోట్లు, ఈనెలలోనే ఇంకా ప్రభుత్వం తీసుకుంటుందని భావిస్తున్న మరో రూ.3వేల కోట్లు కలిపి తొలి ఆరు నెలల్లోనే రాష్ట్ర రుణపద్దు రూ.37వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఇది మొత్తం ఏడాది కాలంలో అప్పుల రూపంలో బహిరంగ మార్కెట్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న దాదాపు రూ.64వేల కోట్లలో 50 శాతం కంటే రూ.5వేల కోట్లు ఎక్కువే కావడం గమనార్హం. కనాకష్టంగా సర్దుబాటు వాస్తవానికి, ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభం నుంచే నిధుల సర్దుబాటు కష్టంగా మారింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో సొంత పన్నుల ఆదాయం పెద్దగా పెరగలేదు. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లతోపాటు ఎక్సైజ్, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్... ఇలా అన్ని రాబడి మార్గాలు కలిపినా గత ఏడాది కంటే పెద్దగా మార్పు రాలేదు. ఈ ఏడాది జూలై 31 వరకు కాగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మొత్తం బడ్జెట్ అంచనాల్లో గత ఆర్థిక సంవత్సరం జూలై నాటికి 26.01 శాతం రాగా, ఈసారి వచ్చింది 26.32 శాతం మాత్రమే. అయితే, ఖర్చుల్లో మాత్రం అనివార్య చెల్లింపులకు తోడు అనూహ్య సర్దుబాట్లు అవసరమయ్యాయి. సాధారణంగా ఇచ్చే వేతనాలు, పింఛన్లు, రెవెన్యూ వ్యయం, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు చెల్లింపులతోపాటు అంతకుముందు నెలలో రూ.9వేల కోట్ల మేరకు రైతు భరోసా, గత నెలలో రూ.700 కోట్లకు పైగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు సమకూర్చుకొని రైతుభరోసా చెల్లించిన తర్వాత ఖజనా పరిస్థితి మరింత కష్టంగా మారిందని ఆర్థికశాఖ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నిధుల సర్దుబాటుకు వేస్అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్లకు వెళుతున్నామని, ఇది సాధారణమే అయినా అనూహ్యంగా ఖర్చులు వస్తే మాత్రం అప్పులు చేయక తప్పడం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. కాగా, ఈ నెల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇంకా కొన్ని శాఖలకు నిధులు విడుదల చేయలేదని తెలుస్తోంది. మార్కెటింగ్ తదితర శాఖల ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదని సమాచారం. కాగా, నిధుల సర్దుబాటు కాక ప్రతి నెలా కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులను నెలాఖరు వరకు వాయిదా వేస్తున్నారని, అప్పుడు వచ్చే నిధులకు అనుగుణంగా చివరి రోజుల్లో వీలున్నన్ని బిల్లులు మంజూరు చేస్తున్నారని తెలుస్తోంది. -
వాహనాలకు ప్రీమియం నంబర్లు.. ఇక కొత్త నిబంధనలు
తెలంగాణలో వాహనాలకు ప్రీమియం నంబర్లకు సంబంధించిన నిబంధనలు మారాయి. తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు 1989లోని రూల్ 81కు సమగ్ర సవరణ చేస్తూ ప్రీమియం వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను రిజర్వ్ చేసే ఫీజు విధానం, ప్రక్రియను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇకపై రవాణా శాఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించరు. మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడం, అవినీతిని అరికట్టడం, మొత్తం రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా డిజిటల్-ఓన్లీ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకుకొచ్చారు.కొత్త అంచెల ఫీజు విధానంసవరించిన నిబంధనల ప్రకారం నంబర్ల పాపులారిటీ, ప్రత్యేకత ఆధారంగా ఆరు అంచెల ఫీజు వ్యవస్థను ప్రవేశపెట్టారు.టైర్ 1లో 1, 9, 9999 నంబర్లకు అత్యధికంగా రూ.1,50,000టైర్ 2లో 99, 100, 786, 888, 999 నంబర్లకు రూ 1,00,000టైర్ 3లో 33, 111, 555, 666, 777, 1000 నంబర్లకు రూ. 50,000 టైర్ 4లో 1234, 2023, 2525, 3333, 4444, 5555, 6666, 7777, 8888, 9090 నంబర్లకు రూ. 20,000టైర్ 5లో 123, 143, 202, 345, 789, 987 నంబర్లకు రూ. 10,000టైర్ 6లో ఇతర అన్ని నంబర్లకు రూ.2,000అధిక-డిమాండ్ నంబర్లకు ఆన్లైన్ వేలంఅధిక-డిమాండ్ అంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే నంబర్ల కోసం ప్రభుత్వం ఆన్లైన్ వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. బిడ్డర్లు రెండు గంటల విండోలో పోటీపడతారు. అత్యధిక బిడ్డర్ నంబర్ను సొంతం చేసుకుంటారు. విఫలమైన బిడ్డర్లు చెల్లించిన ఫీజులో 10% కోల్పోతారు.గెలిచిన బిడ్డర్ 30 రోజుల్లో వాహనాన్ని రిజిస్టర్ చేయకపోతే, రిజర్వేషన్ రద్దు చేస్తారు. అలాగే మొత్తం రుసుమును సీజ్ చేస్తారు. ఆన్లైన్ విధానం వల్ల అక్రమాలు తగ్గడమే కాకుండా ప్రీమియం సేవల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సవరణలను ఖరారు చేయడంలో విస్తృత భాగస్వామ్యం ఉండేలా గెజిట్ వెలువడిన 15 రోజుల్లో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ఆహ్వానించింది. -
లోకల్ రిజర్వేషన్ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
-
కాళేశ్వరంపై సీబీఐ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. శాసనసభలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. లోతైన దర్యాప్తు అవసరం.. ‘తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ (సీఓఐ)ను నియమించింది. విచారణ కమిషన్ తన నివేదికను ఈ ఏడాది జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. గత నెల 4న జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినెట్ చేసిన తీర్మానం ప్రకారం ఈ నివేదికపై శాసనసభలో చర్చ జరిగింది. పీసీ ఘోష్ విచారణ కమిషన్ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని.. అసలు ప్రణాళిక లేదని కమిషన్ తేల్చిచెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల కోసమే మేడిగడ్డకు మార్పు ‘కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. లిఫ్టులు, పంపుల సంఖ్య పెరగడంతోనే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగంది. కాంట్రాక్టర్ల కమీషన్లకు తలొగ్గి నిర్మాణ లోపాలపై కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మేడిగడ్డ కుప్పకూలింది. దుర్మార్గంగా ఆలోచించి దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ దోచుకున్నాడు. కేసీఆర్కు, ఆయన కుటుంబానికి వందల ఎకరాలు, ఫామ్హౌస్లు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 85,449 కోట్లు అప్పు తీసుకున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఊరుపేరు మార్చి రూ. 1.50 లక్షల కోట్ల భారాన్ని తెలంగాణపై మోపారు. తెచ్చిన రుణంలో ఇప్పటివరకు అసలు, వడ్డీ కలుపుకుని రూ. 49,835 కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించాం. అసంపూర్తిగా మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ. 47 వేల కోట్లు అవసరం ఉంది. లోపభూయిష్ట నిర్ణయాలతో ఆర్థికభారం మోపిన కేసీఆర్, హరీశ్రావును శిక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన ప్రాణహిత ప్రాజెక్టు ఉసురు తీసి ఉరి వేసింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా తెచ్చిన అప్పులను రీ–స్ట్రక్చర్ చేసి వడ్డీ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఢిల్లీకి సర్కస్ చూడటానికి వెళ్లడం లేదు. ఇప్పటివరకు ప్రధాని మోదీని కలిసి రూ. 26,400 కోట్ల రుణం రీ–స్ట్రక్చర్ చేసి ఏటా రూ. 4 వేల కోట్లు ఆదా చేస్తున్నాం. రుణాలు రీ–స్ట్రక్చర్ అయితే ప్రతి నెలా రూ. వేయి కోట్లు ఆదా అవుతాయి. నాకు ప్రధాని మోదీ బడే భాయ్. జెండా, ఎజెండా వేరైనా అనుమతులు, నిధులు తెచ్చుకునే బాధ్యతపై నాపై ఉంది. మోదీని కలిసేందుకు నాకు భేషజాలు లేవు’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
సీఎస్ సర్వీసు 7 నెలలు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావు ఈ నెల 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీసును మరో 7 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అండర్ సెక్రటరీ భూపేందర్ పాల్ సింగ్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏఐఎస్ (సీఎస్–ఆర్ఎం) రూల్స్–1960లోని రూల్–3ని ప్రయోగించడం ద్వారా ఏఐఎస్ (డీసీఆర్బీ) రూల్స్లోని 16(1) నిబంధనను సడలిస్తూ రామకృష్ణారావు సర్వీసును పొడిగించినట్టు కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. 1991 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు గత ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.పొడిగింపు పొందిన రెండో సీఎస్తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి సీఎస్గా పనిచేసిన రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని ఒకసారి 3 నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు పొడిగించేందుకు కేంద్రం అనుమతించింది. ఆ తర్వాత పదవీ కాలం పొడిగింపు పొందిన రెండో సీఎస్గా రామకృష్ణారావు నిలిచారు. గతంలో ఒక ప్రయత్నంలో మూడు నెలలు మాత్రమే సర్వీసు పొడిగించగా, రామకృష్ణారావు విషయంలో మాత్రం ఒకేసారి ఏడు నెలల సర్వీస్ పొడగింపునకు కేంద్రం అనుమతించడం గమనార్హం. -
స్థానిక ఎన్నికలపై డైలమా!
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో డైలమా ఏర్పడింది. వాయిదా వేద్దామా? ప్రభుత్వ పరంగా బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చి ముందుకు వెళదామా అన్న దానిపై అధికార కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్తో కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరిపినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ నియమించిన మంత్రుల బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. మంత్రుల బృందం చేసే సిఫారసును ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరోసారి కూలంకషంగా చర్చించిన తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటూతేల్చుకోలేక..!: పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశం ఎంతకీ తేలకపోవడం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సమస్యగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మెజారిటీ మంత్రులు ఎన్నికలకు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ పార్టీలోని బీసీ నాయకత్వం రిజర్వేషన్ల కల్పనపై మాట నిలబెట్టుకుని ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సూచిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మొదటి నుంచి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలనే ఆలోచనతో ఉన్నారు. ఈ తర్జనభర్జనల నేపథ్యంలోనే న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పీసీసీ నియమించిన ఐదుగురు మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్తో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా ఇస్తే బూమరాంగ్ ఖాయం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..కులగణన చేస్తామని, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసి, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెబితే బూమరాంగ్ కావడం ఖాయమని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పింది. అవసరమైతే ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత సమయం కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన రెండు బిల్లులతో పాటు, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్పై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని తప్పుపడుతూ.. క్షేత్రస్థాయిలో బీజేపీని ఎండగట్టే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినట్లు తెలిసింది. సోమవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీలతో చర్చలు జరిపిన సీఎం, మంత్రుల బృందం.. మంగళవారం బిహార్లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్న రాహుల్గాందీతోనూ సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. బీజేపీని ఎండగట్టాల్సిందే.. ‘పార్గీ పరంగా సాధ్యం కాదు. ఒకవేళ ఇచ్చినా మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితే రావొచ్చు. ఓడిపోయే సీట్లను బీసీలకు కేటాయించొచ్చు. ఇది బీసీలను మోసం చేయడమే..’ అని కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ‘బీసీలకు రిజర్వేషన్ల అమలు ఇప్పుడు ఒక్క తెలంగాణ అంశమే కాదు.. యావత్ దేశానిది. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఒకట్రెండు ధర్నాలు చేసి చేతులు ముడుచుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి బీజేపీని మరింతగా ఎండగట్టాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి..’ అని హైకమాండ్ పెద్దలు గట్టిగా చెప్పినట్లు తెలిసింది.ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా? అనే సందేహం కూడా కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. కోర్టును గడువు అడగండి..మళ్లీ ఆర్డినెన్స్ పంపండి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయ కోవిదుల అభిప్రాయాలను తీసుకుని నివేదిక సమర్పించేందుకు గాను టీపీసీసీ నియమించిన మంత్రుల బృందం ఆదివారం ప్రజాభవన్లో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డితో సమావేశమై ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, న్యాయపరంగా ఉన్న ఇబ్బందులపై చర్చించింది. తాజాగా సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను కూడా వివరించింది. ఈ నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయాలనే కోణంలోనే ముందుకు వెళ్లాలనుకుంటే ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని సూచించినట్టు తెలిసింది. అదే విధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి 3 నెలలు ముగిసిన తర్వాత మళ్లీ ఆర్డినెన్స్ చేసి, మరోమారు ఆమోదం కోసం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపాలని చెప్పినట్లు సమాచారం. ఈలోపు హైకోర్టులో ఉన్న కేసులో ఆరు వారాల గడువు కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని, తద్వారా సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు బలం చేకూరుతుందని, రెండోసారి మంత్రివర్గం పంపిన ఆర్డినెన్స్ను రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఆమోదించాల్సి ఉంటుందని ఆయన వివరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్ణయంపై చర్చ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ నిర్వహణకు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం సాధ్యం కాదనే కోణంలోనే వీలున్నంత త్వరగా అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేయాలన్న యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇదే నిజమైతే 30వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వాయిదాకు కనుక మొగ్గు చూపితే హైకోర్టును గడువు అడిగే విధంగా కేబినెట్ నిర్ణయం ఉంటుందని సమాచారం ఏది ఏమైనా ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో..అన్ని అంశాలను క్రోడీకరించి మంత్రుల బృందం ఇచ్చే సిఫారసుపై చర్చించిన అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడతాయా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాహుల్ యాత్రలో సీఎం, రాష్ట్ర నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ బిహార్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ అనిల్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్తో కలిసి రేవంత్రెడ్డి రోడ్షోలో పాల్గొన్నారు. రోడ్షోకు హాజరైన పార్టీ నేత ప్రియాంకగాం«దీని కూడా రాష్ట్ర నేతలు కలిశారు. -
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్కు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
కొన్నోళ్లే కన్నోళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చేయండి’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత పేరుతో పిల్లలను తీసుకుని పెంచిన ఆ తల్లిదండ్రులది కడుపుకోతనే అని చెప్పింది. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఇవ్వమని కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా.. ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించింది. మంగళవారం ఉదయం 11 గంటలకల్లా పిల్లలను ఆ తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశిస్తూ.. సెప్టెంబర్ 2న వర్చువల్గా సంబంధిత అధికారులంతా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు..: తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన 9 మంది తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మాతా, శిశు సంక్షేమ శాఖ డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లింది. ఇందులో డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన దాసరి అనిల్ కుమార్ కుటుంబంతోపాటు మరో ముగ్గురు దంపతులు సుప్రీంకోర్టులో అప్పీల్చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే 14వ తేదీలోగా పిల్లల్ని ఇవ్వాలని ఈ నెల 12న తుది తీర్పును వెలువరించింది. అయితే, సుప్రీం తీర్పును అధికార యంత్రాంగం పాటించడం లేదంటూ ఆ తల్లిదండ్రులు ఈనెల 18న ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తాము ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై జస్టిస్ నాగరత్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల లోపు కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. అయితే, తమకు మంగళవారం ఉదయం 11గంటల వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు ఏఎస్జీ కోరారు. ‘సరే ఈ ఒక్కసారికి అవకాశమిస్తున్నాం, మంగళవారం ఉదయం 11గంటలకల్లా తల్లిదండ్రుల చేతిలో ఆ పసికందులు ఉండాలి’అని జస్టిస్ నాగరత్న ఆదేశించారు. ఇదిలాఉండగా.. సోమవారం సాయంత్రంలోపే పిల్లలను ఆ తల్లిదండ్రులకు అధికారులు అప్పగించడం గమనార్హం. ఇదీ జరిగింది.. గత ఏడాది మేలో మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిల్లల అక్రమ రవాణా, విక్రయం వ్యవహారం బట్టబయలైంది. మహిళా ఆర్ఎంపీ ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు గుర్తించి పోలీసులు 11 మందిని అరెస్ట్చేశారు. వారు మొత్తం 16 మంది చిన్నారులు (నలుగురు మగ, 12 మంది ఆడ పిల్లల్ని) అమ్మినట్లు గుర్తించారు. ఏడుగురు చిన్నారులను అమ్మకం దశలోనే పట్టుకోగా, మరో 9 మందిని కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొని మాతా, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. వీరిని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) ద్వారా ప్రభుత్వం దత్తత ప్రక్రియలో పెట్టింది. వీరిలో అమ్మకం దశలో దొరికిన ఆరుగురు చిన్నారులను పేరెంట్స్ దత్తత తీసుకున్నారు. అలాగే కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చిన 9 మంది చిన్నారులను కూడా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంపిక చేసుకొని, తదుపరి రోజు తీసుకోవాల్సి ఉండగా, హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతోంది. ఇందులో నలుగురు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురికి సంబంధించిన కేసు ఈ నెల 28న హైకోర్టు ముందుకు రానుంది. -
ఎక్కడ ప్లస్.. ఎక్కడ మైనస్!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో కేడర్వారీగా మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్, సెలవులపై వెళ్లిన ఉద్యోగులు.. ఇలా వివిధ కోణాల్లో రాష్ట్ర సర్కారు సమగ్ర సమీక్ష చేపట్టనుంది. ప్రధానంగా పనిభారానికి తగినట్లుగా పోస్టులున్నాయా? లేనట్లయితే డిమాండ్ ఎలా ఉంది? అనే అంశాల ప్రాతిపదికన సమీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో గత నెలలో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. శాఖలవారీగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతోపాటు శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహించాలని కమిటీని ఆదేశించింది. కమిటీకి స్పష్టమైన సమాచారాన్ని అందించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్ని విభాగాల హెచ్ఓడీలకు గత వారం సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా సమీక్షలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్న జాబ్ క్యాలెండర్ సైతం ఈ నివేదికపైనే ఆధారపడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డిమాండ్ అండ్ సప్లై తరహాలో... ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఉద్యోగుల పాత్రే అత్యంత కీలకం. ప్రతి కార్యక్రమం సజావుగా జరగాలంటే డిమాండ్కు తగ్గట్లు పోస్టులు మంజూరు చేయాలి. ఒకవేళ ఖాళీలుంటే వెంటనే భర్తీ చేయాలి. ప్రస్తుతం కొన్ని శాఖల్లో డిమాండ్కు సరిపడా ఉద్యోగులు లేరు. దీంతో సంక్షేమ కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటోంది. ఉదాహరణకు బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా 11 ఆర్థిక సహకార సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా ఉద్యోగుల పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో ఆయా విభాగాల్లో కార్యక్రమాల అమలు గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేలా డిమాండ్కు సరిపడా కొలువులు నిర్దేశించేందుకు వ్యూహాత్మక కార్యాచరణను సర్కారు రూపొందిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిమాండ్కు సరిపడా పోస్టులు లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులున్న శాఖలను గుర్తించి వాటిని సమతౌల్యం చేసేలా కమిటీ సూచనలు చేసే అవకాశం ఉంది. కమిటీ పరిశీలించనున్న అంశాలు... ⇒ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) ఆధారంగా ప్రతి విభాగంలో మంజూరైన శాశ్వత, తాత్కాలిక పోస్టులు, వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీల వివరాలు. ⇒ ప్రభుత్వం అనుమతించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, భర్తీ కోసం గుర్తించిన పోస్టులు, నియామకాలు పూర్తి చేసిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగుల సంఖ్య. ⇒ శాశ్వత ప్రాదిపదికన ఉద్యోగాలు భర్తీ చేశాక తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వారి తొలగింపు వివరాలు. ⇒ ప్రభుత్వ శాఖల్లో డిమాండ్కు తగినట్లు అదనపు పోస్టుల ప్రతిపాదనలు, కొత్తగా ప్రతిపాదించిన పోస్టుల నియామకాల వల్ల పడే ఆర్థికభారం అంచనా. ⇒ ఆర్థిక భారం తగ్గించుకోవడానికి గతంలో పోస్టులు మంజూరు చేసి పెండింగ్లో పెట్టిన పోస్టుల సమాచారం. ⇒ ప్రభుత్వ శాఖల్లో అనుమతి లేకుండా తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు.త్వరలో నూతన జాబ్ కేలండర్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన జాబ్ కేలండర్ విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ముమ్మరం చేసింది. గతేడాది విడుదల చేసిన జాబ్ కేలండర్కు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రతిబంధకంగా మారడంతో అమలు సాధ్యపడలేదు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కొలిక్కి రావడంతో నూతన జాబ్ కేలండర్ జారీ అవసరమైంది. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పరిశీలనకు నిర్దేశించిన కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగాల గుర్తింపుపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదించాక నూతన జాబ్ కేలండర్ ఖరారు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
మేడారం జాతర.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, గిరిజనులపట్ల సీఎం రేవంత్రెడ్డి కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ముందు మూడు ఆప్షన్లు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే అధికార కాంగ్రెస్ కూడా 3 ఆప్షన్లను పరిశీలించనుంది. ఈ మూడు ఆప్షన్లలో ఎటువైపు మొగ్గుచూపాలనే అంశాన్ని తేల్చేందుకు ఈనెల 23న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ భేటీలో 3 అంశాలపై చర్చించి మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని యోచిస్తోంది. ఆదివారం సీఎం రేవంత్రెడ్డితో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు సమాచారం. ఎలా ముందుకెళ్దాం? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదు. పీసీసీ చీఫ్తో పాటు పార్టీలోని బీసీ ముఖ్య నేతలు ఓ వాదన వినిపిస్తుండగా, కొందరు మంత్రులు, మరికొందరు నేతలు మరో వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే బీసీలకు 42 %రిజర్వేషన్ల కల్పనే పార్టీకి ప్రధానమని, అవసరమనుకుంటే ఈ విషయంలో మరికొంత సమయం తీసుకుందామని ఆయన అంటున్నారు. ఆదివారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరు మంత్రులు, నాయకులు మాత్రం ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యాయని, మరింత జాప్యం చేయడం మంచిది కాదని, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పీఏసీని సమావేశపరచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. ఈ మూడు ఆప్షన్లు పీఏసీ ముందుకు.. పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చ జరగనుండగా.. రిజర్వేషన్ల విషయం ఎటూ తేలనందున కోర్టును మరింత సమయం కోరుదామని, వీలుకాదంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మరోమారు ఢిల్లీకి వెళదామనే ప్రతిపాదన ఇందులో మొదటిది. మరోమారు అసెంబ్లీని సమావేశపరిచి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టాలనేది రెండో ప్రతిపాదన. ఈ రెండూ కాదంటే నేరుగా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడం మూడోది. వీటిపై అందరి అభిప్రాయాలనూ క్రోడీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీఎంతో ముఖ్యుల భేటీ ఆదివారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్తో మహేశ్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియన్ నేత వి.హనుమంతరావులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు గాం«దీభవన్లో పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా 22న నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జరిగే అమరవీరుల స్థూపావిష్కరణకు హాజరు కావాలని రేవంత్ను వీహెచ్ కోరారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా పీసీసీ చీఫ్కు సూచించిన ముఖ్యమంత్రి.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని వీహెచ్కు చెప్పినట్టు సమాచారం. -
ఒక్కటి దాటినా కోతే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లలోపు ఉంటే గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. అయితే, ఈ పథకం లబ్ధిదారుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి విద్యుత్ వినియోగం 200 యూనిట్లకు మించితే వారు పథకానికి అర్హత కోల్పోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వవర్గాలు. ఈ మేరకు గృహజ్యోతి పథకాన్ని కుదించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ జరుగుతోంది. గృహజ్యోతి పథకం కింద ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల సంఖ్యను కట్టడిచేయడంతోపాటు కొత్త లబ్ధిదారులు పెరగకుండా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికోసం ఈ పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉచిత విద్యుత్ వినియోగదారుల సంఖ్య ఏటా పెరుగుతూపోతే ఆర్థిక భారం భారీగా పెరిగిపోతుందన్న ఆందోళనతో లబ్ధిదారుల సంఖ్యను కుదించాలని సర్కారు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. 16 నెలల్లో 12 లక్షల మంది పెరిగారు.. గృహాలకు ప్రతినెలా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక 2024 మార్చి నుంచి గృహజ్యోతి పథకం అమలును ప్రారంభించింది. 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ పథకం అమలవుతోంది. మొదట్లో 39 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా దరఖాస్తులు రావడంతో ఈ లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమైనట్టు తెలిసింది. పథకం ప్రారంభమైన 16 నెలల్లో కొత్తగా 12 లక్షల మంది చేరారు. అంటే జూలైలో ఈ పథకం కింద లబ్ధిదారులు 51.26 లక్షల మంది ఉన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం సబ్సిడీ కింద ప్రతి నెలా రూ.185 నుంచి 200 కోట్ల వరకు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు చెల్లిస్తోంది. ఒక్క యూనిట్ ఎక్కువైనా.. విద్యుత్ వినియోగం ఆధారంగా 0–50 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.95 పైసలు, 51–100 యూనిట్ల వినియోగానికి యూనిట్కు రూ.3.10 చొప్పున బిల్లు వసూలు చేస్తారు. వినియోగం 100 యూనిట్లకు పెరిగితే 0–200 యూనిట్ల మధ్య వినియోగానికి ప్రతీ యూనిట్కు రూ.3.40 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్న వారిలో 0–50, 50–100 యూనిట్లను వినియోగించే పేదలే ఎక్కువ. వీరితోపాటు 100–200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న లబ్ధిదారులందరికీ జీరో బిల్ వస్తోంది. అంటే 200 యూనిట్లలోపు కరెంటు వాడిన వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువైనా వారు పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెలలో 201 యూనిట్లు విద్యుత్ వినియోగించి.. ఆ తరువాత నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడినా వారికి ఈ పథకం వర్తిస్తోంది. ఇకపై ఏదైనా నెలలో 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగిస్తే వారిని శాశ్వతంగా ఈ పథకం కింద అనర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చలు జరిగినట్టు తెలిసింది. తెల్ల కార్డులు 93 లక్షలు.. గృహజ్యోతి పథకం మార్గదర్శకాల ప్రకారం తెల్లరేషన్ కార్డు ఉన్నవారంతా అర్హులు. రాష్ట్రంలో దాదాపు 93 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 51.26 లక్షల మంది ఉన్నారు. అయితే, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హుల సంఖ్య పెరిగితే.. ఆ మేరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది. సకాలంలో డిస్కంలకు ఆ నిధులు చెల్లించకుంటే ఆ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.185 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు డిస్కంలకు సబ్సిడీగా చెల్లిస్తోంది. వినియోగదారుల సంఖ్య పెరిగితే సబ్సిడీ మొత్తం కూడా భారీగా పెరుగుతుంది. అందువల్ల 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే వారిని అనర్హులుగా ప్రకటిస్తే ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
జిల్లా.. ఎలా?
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఓ వైపు ముంచుకొస్తున్న జనాభా లెక్కల ప్రారంభ గడువు.. అది పూర్తి కాగానే శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన.. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల భౌగోళిక సరిహద్దుల్లో చేర్పులు మార్పులు చర్చనీయాంశమవుతున్నాయి. మార్పులు, చేర్పులు అవసరమైతే ఈ ఏడాది డిసెంబర్ 31లోగా మొత్తం ప్రక్రియను ముగించాలంటూ కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టగా..దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 2016 – 19లలో ఏర్పాటైన కొత్త జిల్లాల కూర్పుపై భిన్నవాదనలు వినిపిస్తుండటంతో ప్రస్తుతం ఉన్నవాటిని యథాతథంగా కొనసాగించటమా? లేక ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి వచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయటమా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏమీ తేల్చలేకపోతోంది. ఒక వేళ జిల్లాలను యథాతథంగా ఉంచి జనాభా లెక్కలకు వెళితే.. వచ్చే నియోజకవర్గాల పునర్విభజనను కూడా ప్రస్తుత జిల్లా యూనిట్గానే చేయాల్సి ఉంటుంది. అయితే నేల స్వభావాలు, పర్యావరణం, పంటలు, ఉమ్మడి సంస్కృతి, భాష, యాస, అన్నింటికంటే ముఖ్యంగా ఏకరీతి మానసిక స్థితి.సామాజిక శక్తుల పొందికతో పాటు జీవన శైలి, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, కట్టుబొట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల ఏర్పాటు చేయాల్సి ఉన్నా..గతంలో కొన్నిచోట్ల వాటిని పాటించలేదన్న అసంతృప్తి ఉంది. ఒక్కప్పుడు రాజధానిగా వెలిగిన వరంగల్ను కూడా అశాస్త్రీయంగా విభజించారని చెబుతూ..ఉమ్మడి వరంగల్ కింద ఉన్న జిల్లాలన్నిటినీ మళ్లీ ఒక్కటి చేయాలన్న డిమాండ్తో ఇటీవల ఏర్పడిన జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వడం గమనార్హం. సౌలభ్యం కోసమే అయినా.. కొత్త జిల్లాల ఏర్పాటు.. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలనను మెరుగుపరచడం, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచడం కోసమే జరిగినా, ప్రస్తుతం రాష్ట్రంలో పలు శాసనసభ నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఏ జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండటం లేదు. ఉదాహరణకు పాలకుర్తి నియోజకవర్గం మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో ఉండగా, హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉంది. ఇల్లందు నియోజకవర్గం ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. గిరిజన జనాభా అధికంగా ఉన్న ఖానాపూర్ నియోజకవర్గం సైతం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో వ్యాపించి ఉంది. తుంగతుర్తి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఉంది. అలాగే చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలు సైతం మూడేసి జిల్లాల్లో ఉన్నాయి. దీంతో సమాంతర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సమీక్షలకు పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో ఉన్న ప్రభుత్వం, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోతోంది. ఇదీ జిల్లాల ఏర్పాటు చరిత్ర కుతుబ్షాహీలు మొదలుకుని ఆసఫ్ జాహీల వరకు పరిపాలనా సౌలభ్యం కోసం సర్కార్లు, సుభాలుగా కొనసాగిన ప్రాంతాలను 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలోనే.. హైదరాబాద్ స్టేట్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను తెలంగాణలో, మరాఠి మాట్లాడే వారిని బొంబాయి రాష్ట్రంలో, కన్నడ మాట్లాడే వారిని సమీప కన్నడ జిల్లాల్లో విలీనం చేశారు. దశాబ్దాల పాటు తెలంగాణలో 9 జిల్లాలు కొనసాగగా 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం 2016లో కొత్తగా మరో 21 జిల్లాలు, 2019లో మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయటంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య మొత్తం 33కు చేరింది. 1956 తొలి పునర్విభజన – జిల్లాలు ఇలా: హైదరాబాద్ప్రస్తుతం ఉన్న ప్రాంతాలతో పాటు గుల్బర్గా (ప్రస్తుత కర్ణాటకలో) నుండి తాండూరు, మెదక్లోని వికారాబాద్, మహబూబ్నగర్లోని పరిగి ప్రాంతాలను కలిపి హైదరాబాద్ జిల్లాను పునర్వ్యవస్థీకరించారు. 2016 విభజనలో హైదరాబాద్ జిల్లాను యథావిధిగా ఉంచారు. మహబూబ్నగర్పది తాలూకాలతో ఉన్న మహబూబ్నగర్ జిల్లాకు అదనంగా రాయచూర్ (ప్రస్తుత కర్ణాటక) నుండి గద్వాల, ఆలంపూర్, గుల్బర్గా నుండి కొడంగల్ ప్రాంతాలను కలిప్పారు. ఇందులో ఉన్న పరిగిని హైదరాబాద్లో కలిపారు. 2016–2019 విభజనలో కొత్తగా నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు ఏర్పాటు చేశారు. షాద్నగర్, అమనగల్ తదితర మండలాలను రంగారెడ్డి జిల్లాలో విలీనం చేశారు. నల్లగొండకుతుబ్షాహీల నుండి ఒకే జిల్లాగా కొనసాగిన ఈ జిల్లాలో 1956లోనూ పెద్దగా మార్పులు చేయలేదు.నల్లగొండ,, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, రామన్నపేట, హుజూర్నగర్ తాలూకాలతో కొనసాగింది. అయితే 2016లో కొత్తగా యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. మెదక్మెదక్ సుభాగా వందల ఏళ్లు కొనసాగిన ఈ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, ఆందోలు, వికారాబాద్, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ తాలూకాలుండేవి. 1956 పునర్విభజనలో వికారాబాద్ను హైదరాబాద్లో కలిపి, గుల్బర్గాలో ఉన్న జహీరాబాద్, నారాయణఖేడ్లను మెదక్ జిల్లాలో చేర్చారు. 2016లో కొత్తగా సిద్దిపేట, మెదక్ జిల్లాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఎలగందల్ జిల్లా ఆపై కరీంనగర్గా మారిపోయింది. 1956లో ఈ జిల్లా సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల, సుల్తానాబాద్, మహదేవ్పూర్, హుజూరాబాద్ తాలూకాలతో కొనసాగింది. 2016లో కొత్తగా పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలను ఏర్పాటు చేశారు. వరంగల్వరంగల్ సుభాగా కాకతీయుల రాజధానికిగా ఉన్న వరంగల్లో 1956 నాటికి, పాకాల, ములుగు, మహబూబాబాద్, పరకాల తాలూకాలుండగా, 1952 అనంతరం జనగామ తాలూకాను వరంగల్ జిల్లాకు మార్చారు. 1953కు ముందు ఖమ్మం జిల్లా మొత్తం వరంగల్లో ఉండేది. 2016–19లలో కొత్తగా హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం 1953 అక్టోబర్ ఒకటిన ఏర్పాటైన ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గుంపహాడు, పాల్వంచ తాలూకాలుండగా, 1959లో భద్రచాలం సబ్ డివిజన్ గ్రామాలను తూర్పుగోదావరి నుండి ఖమ్మం జిల్లాకు మార్చారు. 2016లో కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశారు. నిజామాబాద్చాలా కాలం పరిపాలన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ తాలూకాలుండేవి. 1956 పునర్విభజనలో బొంబాయి రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో తెలుగు మాట్లాడే బిచ్కుంద, మద్నూర్, జుక్కల్లను నిజామాబాద్ జిల్లాలో విలీనం చేశారు. 2016 తర్వాత కామారెడ్డి జిల్లా ఏర్పాటయ్యింది. ఆదిలాబాద్ఆదిలాబాద్, ఉట్నూరు, ఖానాపూర్, నిర్మల్, బో«థ్, చెన్నూరు, సిర్పూరు, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ తాలూకాలతో పాటు పాటు ఇదే జిల్లాలో భాగంగా కొనసాగిన కిన్వత్, రాజూరా తాలూకాలతో ఈ జిల్లా కొనసాగింది. కానీ 1956లో మరాఠి మాట్లాడే వారు అధికంగా ఉన్న కిన్వత్, రాజూరాలను బొంబాయిలో కలిపారు. నాందేడ్ నుండి ముధోల్ను ఆదిలాబాద్లో కలిపారు. 2016లో కొత్తగా మంచిర్యాల, కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి 1978 ఆగస్టు 15న ఏర్పాటైన హైదరాబాద్ రూరల్ జిల్లాను అదే సంవత్సరం అక్టోబర్లో కేవీ రంగారెడ్డి జిల్లాగా మార్చారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడైన కొండా వెంకట రంగారెడ్డి పేరు మీద ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. 2106లో మహబూబ్నగర్ నుండి షాద్నగర్, ఆమనగల్ తదితర ప్రాంతాలను అదనంగా రంగారెడ్డి జిల్లాలో చేర్చి, కొత్తగా మేడ్చల్–మల్కాజిగిరితో పాటు వికారాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసి మహబూబ్నగర్ నుండి కొడంగల్ను కొత్తగా విలీనం చేశారు. అశాస్త్రీయంగా 33 జిల్లాలు చేశారు కేవలం కుటుంబ ఆధిపత్య పాలనను స్థిరీకరించడానికి రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా 33 జిల్లాలు చేసి రాజకీయ చైతన్యాన్ని, అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేశారు. అందులో భాగంగానే వరంగల్ జిల్లాను ముక్కలు చేశారు. మహానగరాన్ని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలి. గత శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ జిల్లాలను శాస్త్రబద్ధంగా పునర్వ్యవస్థీకరణ చేస్తామంది. సీఎం రేవంత్రెడ్డి మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఉంది. – ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, తెలంగాణ ఉద్యమ కారుల వేదిక, వరంగల్ చిన్న జిల్లాలతో సుపరిపాలనకు చాన్స్ నేను అతిపెద్ద అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశా. ఎంత పెద్దవంటే నా బదిలీ అయ్యే లోపు కొన్ని ప్రాంతాల్లో పర్యటించలేకపోయా. చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయొచ్చు. సివిల్ సర్వీస్ అధికారుల నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది. నేరుగా లబ్దిదారులతోనే టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. చిన్న జిల్లాలో వ్యయం అధికమైనా.. మంచి పాలనకు చాన్స్ ఉంటుంది. – డాక్టర్.బి.జనార్ధన్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ లోక్సభ యూనిట్గా పునర్విభజన చేయాలి తెలంగాణాలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, కొత్త జిల్లాల ఏర్పాటు కోసం విషయ నిపుణులతో కమిటీ వేసి, వారిచ్చే నివేదిక మేరకు విభజన చేయాల్సి ఉండగా అవేవీ జరగలేదు. ఇప్పుడైనా లోక్సభ యూనిట్గా జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల విషయంలో మినహాయింపు తీసుకోవచ్చు. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి -
అప్పుల కోసమే కొత్త డిస్కం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) ఏర్పాటుపై ఆ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఆధునీకరణ, పంపిణీ వ్యవస్థ బలోపేతమే ప్రధాన లక్ష్యాలుగా ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉచిత విద్యుత్ను ఉద్దేశించి డిస్కం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది. అయితే..ఇదెలా సాధ్యమని డిస్కం అధికారులు అంటున్నారు. ఉచితాలు ప్రతీ డిస్కం పరిధిలో ఉంటాయని, వీటిని ఒకే డిస్కం పరిధిలోకి తేవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ వద్దకు తీసుకెళ్లినట్టు అధికారులు తెలిపారు. ఉచితాల విషయాన్ని తర్వాత పరిశీలిద్దామని, ముందుగా డిస్కం ఏర్పాటుపై ఆర్థిక పరమైన నివేదిక రూపొందించాలన్నారు. నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనిని బట్టి కొత్త డిస్కం ఏర్పాటు ఆర్థిక సంస్థల వద్ద నిధులు పొందడానికేనని డిస్కం ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రూ. 32 వేల కోట్లు టార్గెట్ ప్రస్తుతం రాష్ట్రంలో రెండు డిస్కంలున్నాయి. ఇవి అన్నివిధాలా ఆర్థిక రుణాలు పొందాయి. ఇవే డిస్కంలు తిరిగి పొందడానికి కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. అప్పులు చేస్తే తప్ప ఆర్థికంగా ముందుకెళ్లడం కష్టమని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. రాజధానితోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 96,596 ఎంయూల విద్యుత్ వినియోగం ఉంది. ఇది 2030 నాటికి 1.22 లక్షల ఎంయూలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. 2033–24 నాటికి రాష్ట్రంలో 1.30 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కావొచ్చు. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలు ఇటీవల దీనిపై ఈ తరహా నివేదికలే ఇచ్చాయి. డిమాండ్ను చేరుకోవడానికి విద్యుత్ సంస్థల పనితీరును గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. తొమ్మిది 440 కేవీ సబ్స్టేషన్లు, 220 కేవీ సబ్స్టేషన్లు 34, 132 కేవీ సబ్స్టేషన్లు 75 ఏర్పాటు చేయాలని డిస్కంలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియకు ట్రాన్స్కో, డిస్కంలకు కలిపి రూ. 32 వేల కోట్లు అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని విద్యుత్ సంస్థలు సమకూర్చుకోవడానికి కొత్త డిస్కం ఏర్పాటు మార్గమని భావిస్తున్నారు. పీఎఫ్సీ, ఇతర ఆర్థిక సంస్థలు కొత్త డిస్కంలకు రుణాలు ఇస్తాయని కన్సల్టెన్సీ సంస్థలు అధికారులకు సలహాలిచ్చాయి. ఈ దిశగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ఇవ్వాల్సింది రూ. 248 కోట్లు.. ఇచ్చింది రూ. 50 కోట్లు
36 మందిని ఎంపిక చేసినా.. మా మండల కేంద్రంలో 36 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఏడు నెలలు గడుస్తున్నా నాతోపాటు ఏ ఒక్కరికీ ఈ పథకంలో లబ్ధి చేకూరలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు అందించాలి. – రాయరాకుల కట్టమ్మ,నల్లబెల్లి (వరంగల్ జిల్లా)సాక్షి, హైదరాబాద్ /నెట్వర్క్: ఉపాధి హామీ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అంతంత మాత్రంగానే అందిందనే విమర్శలున్నాయి. ఈ ఏడాది జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాల్లో ఇది ఒకటి. ఇప్పటివరకు ఈ పథకం కింద 83,887 మంది ఉపాధి కూలీలకు రూ. 50.33 కోట్లు చెల్లించారు. మిగతా 4,13,658 మంది కూలీలకు రూ.248.19 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి టోకెన్ చెక్కులు జనరేట్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఉపాధికూలీల ఖాతాల్లోకి మాత్రం ఈ డబ్బు జమ కాలేదు. ఇదీ ఆత్మీయ భరోసా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద 20 రోజులు పనిచేసి సొంతభూమి లేని ఉపాధికూలీలకు (జాబ్ కార్డులు కలిగిన వారికి) ఏడాదికి రూ.12 వేలు (ఆరునెలలకు రూ.6వేలు చొప్పున) చొప్పున చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ఒక్కో జిల్లాలోని ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. జనవరి 26న ప్రభుత్వపరంగా ఈ పథకాన్ని ప్రారంభించాక...అదే నెల 29వ తేదీ వరకు నిర్వహించిన గ్రామసభల్లో దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక, రూ.6 వేల అందజేత వంటి ప్రక్రియ చేపట్టారు. ఈ గ్రామసభల్లో అర్హులైన వారికి పూర్తిస్థాయిలో రూ.6 వేల చొప్పున ఇవ్వలేకపోయారు. ఈ పథకం కింద గతంలో గుర్తించిన 5.80 లక్షల లబ్ధిదారులకుగాను, అదనంగా కొత్తగా రెండులక్షల దాకా దరఖాస్తులు అందాయి. వీటిని కూడా అధికారులు పరిశీలించాక ఎక్కువ సంఖ్యలో అనర్హులు ఉన్నట్టుగా (భూమి ఉన్నవారు, 20 రోజులు పనిచేయని వారు) తేలినట్టు అధికారవర్గాల సమాచారం. గతంలో కొన్నిచోట్ల గ్రామసభల్లో కొందరు లబ్ధిదారులను ఎంపిక చేసినా, కొద్దిరోజుల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ డబ్బులు వేయలేదు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కోడ్ లేకపోవడంతో కొంత ఆలస్యంగానైనా కొందరు లబ్ధిదారులకు డబ్బులు చెల్లించారు. క్షేత్రస్థాయిలో ఇలా... నిజామాబాద్ జిల్లాలో ఉపాధికూలీల్లో 38,787 మందిని అర్హులుగా గుర్తించారు. మండలానికి ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేసి జిల్లావ్యాప్తంగా 1,675 మందికి రూ. 6 వేల చొప్పున రూ.1.5 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 37,112 మందికి ఆత్మీయ భరోసా సాయం అందాల్సి ఉంది. ఖమ్మం జిల్లా: నేలకొండపల్లి మండలంలో 18 మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించారు. 2024–25లో ఈ మండలంలో 20 రోజులు పైగా ç9,800 మంది పనిచేశారు. ఇందులో 2,177 మంది ఉపాధి కూలీలకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు లింకేజీ, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నాయని మండల అధికారులకు ప్రభుత్వం తెలిపింది. అన్నింటిని సరిచేసి ఆ సమాచారాన్ని ఈజీఎస్ రాష్ట్ర అధికారులకు మండల అధికారులు పంపించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నేలకొండపల్లి మండలం కొంగర గ్రామపంచాయతీలో 18 మందిని ఎంపిక చేశారు. వారికి రూ .6వేలు అందించారు. 2021–22ను ప్రామాణికంగా తీసుకోవాలి ఈ పథకం అమలు తీరు అనేది ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. కరోనా నేపథ్యంలో 2021–22లో ఉపాధి హామీ కింద రాష్ట్రంలో అత్యధికంగా ‘పర్సన్ డేస్’నమోదైనందున, 2023–24కు బదులు ఈ పథకానికి 2021–22ను ప్రామాణికంగా తీసుకోవాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశాం. 2022–23లో రాష్ట్రంలో 4.4 లక్షల జాబ్కార్డులు, 15.8 లక్షల మంది పేర్లను ఉపాధిహామీ డేటాబేస్ నుంచి తొలగించారు. 2023–24లో రాష్ట్రంలోని 156 గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో పనిచేసిన ఉపాధి కూలీలకు ఈ పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నాం. – పి.శంకర్, జాతీయకార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్ జాబితాలో పేరుంది..సాయం అందలే జాబితాలో పేరు వచ్చింది. సాయం మాత్రం అందలేదు. నాకు వ్యవసాయ భూమి లేదు. భరోసా సొమ్ము వస్తే మా కుటుంబానికి ఎంతోకొంత ఆసరాగా ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం మాత్రం నిరాశనే మిగిల్చింది. – పల్లెపు నవ్య, తొర్తి (నిజామాబాద్ జిల్లా) భరోసా లభించలేదు నేను ఉపాధి హామీ పనులతోనే ఇద్దరు కొడుకులను సాకుతున్నాను. సొంత ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత వచ్చింది. అయితే ఈ పథకం కింద రూ.6వేలు ఇప్పటి వరకు అందలేదు. అధికారులను అడిగితే ఈనెల వచ్చేనెల అంటూ దాటవేస్తున్నారు. – భూక్యా పార్వతి, పాండురంగాపురంతండా (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) నయాపైసా ఇవ్వలేదు జాబితాలో నా పేరు వచ్చిందని అధికారులు చెప్పారు. డబ్బులు పడతాయని అన్నారు. కానీ ఇప్పటి వరకు నయాపైసా కూడా ఇవ్వలేదు. నాకేకాదు మా ఊరిలో ఎవ్వరికీ డబ్బులు రాలేదు. – కాంపాటి చిన్నఉప్పలమ్మ, అయోధ్యగ్రామం (మహబూబాబాద్ జిల్లా) -
సీబీఐ చేతికి గట్టు వామనరావు దంపతుల కేసు
సాక్షి, న్యూఢిల్లీ: గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ క్రమంలో.. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది.హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17వ తేదీన రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. ఈ జంట హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ ఎన్ కె. సింగ్ల ధర్మాసనం పిటిషన్ను విచారించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ అవసరమా? అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.ఈలోపు.. కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో.. సీబీఐకి కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. -
సివిల్స్ అభ్యర్థులకు ఎంతైనా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: సివిల్స్ సాధించాలనుకునే అభ్యర్థులకు ఎంతయినా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సివిల్స్లో తెలంగాణ విద్యార్థులే అత్యధికంగా ఎంపిక అవ్వాలని ఆయన అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’పథకం పేరుతో సివిల్స్ మెయిన్స్కు సన్నద్ధమయ్యే 178 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రజాభవన్లో జరిగింది. చెక్కులు అందించిన అనంతరం భట్టి మాట్లాడారు. సమాజంలో మానవ వనరులే బలమైన పెట్టుబడులని, వీటిని సానబట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం, ఢిల్లీలో వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక తోడ్పాటునిచ్చినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని, ప్రజల జీవన స్థితిగతులను వీరే మార్చగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది ఎంపికవ్వాలి: కోమటిరెడ్డి విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్కు ఎంపికైతే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ పథకం సహాయంతో సివిల్స్లో విజయం సాధించి, పరిపాలన విభాగంలో అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిత్తల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ పేదింటి పిల్లలు కూడా సివిల్స్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 2024లో తెలంగాణ ప్రాంతం నుంచి సివిల్స్ విజేతలైన 30 మందికి ఈ సందర్భంగా మెమెంటోలను బహూకరించారు. వరంగల్కు చెందిన ఎట్టబోయిన సాయిశివాని సివిల్స్లో 11వ ర్యాంక్ సాధించడంపై ముఖ్యఅతిథులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
చెప్పడం మర్చిపోయాను.. క్షమించండి: ఎన్టీఆర్
ఎన్టీఆర్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరో. ఈ గురువారం మూవీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ విషయం చెప్పడం మర్చిపోయిన తారక్.. ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. క్షమించాలి అని అంటూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)'వేదికపై ముఖ్యమైన విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. నా 25 ఏళ్ల కెరీర్ని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పు జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అలానే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. మీరు చాలా సహకారం అందించారు. అభిమానులని ఎంతో బాధ్యతగా చూసుకున్నారు. వారి ఆనందానికి కారణమయ్యారు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్, హృతిక్ చేసిన 'వార్ 2' సినియా.. యష్ రాజ్ స్పై యూనివర్స్లో భాగం. కియారా అడ్వాణీ హీరోయిన్ కాగా అయాన్ ముఖర్జీ దర్శకుడు. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అందుకే ఆదివారం రాత్రి ఈవెంట్లో నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాగోలేకపోతే తనని పదింతలు ఎక్కువ తిట్టండి అని ఛాలెంజ్ చేశారు. మరోవైపు తారక్ కూడా చిత్ర ఫలితంపై నమ్మకంగా ఉన్నారు. హృతిక్తో కలిసి కాలర్ ఎగరేసి మరీ నమ్మకాన్ని చూపించారు.(ఇదీ చదవండి: ఆంధ్రాకు షిఫ్ట్ అయిన సినీ కార్మికుల వివాదం)My sincere thanks to the Government of Telangana and the honourable CM Shri @revanth_anumula garu, as well as the Telangana Police Department @TelanganaCOPs for their support in making the #War2 pre-release event a grand success. pic.twitter.com/krKp8xZejS— Jr NTR (@tarak9999) August 10, 2025 -
ఏ క్షణంలోనైనా సింగూరుకు గండి!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగు, తాగునీటిని సరఫరా చేసే సింగూరు జలాశయానికి తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా జలాశయం తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగనుందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్ఆర్పీ) హెచ్చరించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ సభ్యులు, డిజైన్స్ విభాగం నిపుణుడు అశోక్కుమార్ గంజు నేతృత్వంలో సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు యోగిందర్కుమార్ శర్మ, హైడ్రాలజిస్ట్/నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ పి.రామరాజు, జీఎస్ఐ మాజీ డీజీ ఎం.రాజు, డ్యామ్ గేట్ల నిపుణుడు ఎన్.కన్హయ్య నాయుడుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఎస్ఆర్పీ మార్చి 23న సింగూరు జలాశయాన్ని సందర్శించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. సామర్థ్యానికి మించి నీటి నిల్వలతో.. ‘సింగూరు జలాశయానికి ఎగువ మట్టి కట్టల (అప్స్ట్రీమ్ ఎర్త్ డ్యామ్)కు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్మెంట్తోపాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల అప్స్ట్రీమ్ వంపునకు రక్షణగా ఏర్పాటు చేసిన రివిట్మెంట్ దెబ్బతింది. వాస్తవ డిజైన్ల ప్రకారం జలాశయంలో నీటినిల్వలు 517.8 మీటర్లకు మించకుండా నిర్వహించాలి. దీనికి విరుద్ధంగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 885 జారీ చేసింది. కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తుండటంతో జలాశయం తీవ్రంగా దెబ్బతింది. అప్స్ట్రీమ్ రివిట్మెంట్కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించకపోవడం వల్ల జలాశయం కట్టలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. అత్యవసరంగా రివిట్మెంట్కి మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించకపోతే ఏ క్షణంలోనైనా మట్టి కట్టలకు గండిపడి లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది. సింగూరుకు దిగువన ఉన్న మంజీర, నిజాంసాగర్ జలాశయాలతోపాటు పెద్ద సంఖ్యలో ఉన్న చెక్డ్యామ్లూ తెగిపోయి నష్టం తీవ్రత మరింత పెరగొచ్చు’అని నిపుణుల ప్యానెల్ నివేదికలో హెచ్చరించింది. మరమ్మతులకు అనుమతించండి.. వర్షాకాలం ముగిశాక జలాశయంలో నీటి నిల్వను తగ్గించి అప్స్ట్రీమ్ రివిట్మెంట్కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల ప్యానెల్ సూచించింది. మట్టికట్టల రక్షణ కోసం కట్టిన పారాపెట్ వాల్ ఒకచోట కుంగిపోయి నిలువనా చీలినందున గ్రౌటింగ్తో చీలికలను పూడ్చాలని సూచించింది. జలాశయంలో 97 శాతం నిల్వలు పూర్తిగా గేట్లపై ఆధారపడినందున గేట్ల నిర్వహణకు నిరంతరం పూర్తి సంసిద్ధతతో ఉండాలని సూచించింది. ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం.. మంజీరా నదీపై 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1989లో నిర్మించిన సింగూరు జలాశయం ఏటా హైదరాబాద్కు 6.96 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తోంది. మంజీరా, మహబూబ్నగర్, ఫతేహ్ నహర్, నిజాంసాగర్లకు అవసరమైన నీటిని నిల్వ చేసి వాటికి అవసరమైనప్పుడు విడుదల చేస్తోందని ప్యానెల్ తెలిపింది. ఈ క్రమంలో మార్గమధ్యంలోని ఎన్నో చెక్డ్యామ్లను నింపుతూ కనీసం 7 కరువుపీడిత జిల్లాలకు జీవనాడిగా సేవలందిస్తోందని పేర్కొంది. గోదావరి నదీ సబ్ బేసిన్–4 పరిధిలోని తీవ్ర కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని సరఫరా చేసే మేజర్ ప్రాజెక్టు సింగూరుకు విపత్తు సంభవిస్తే ప్రాణ, ఆస్తినష్టంతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. 2016, 2019, 2024లలో జలాశయానికి తనిఖీలు చేసి స్పిల్వే, ఎర్త్ డ్యామ్, గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని నివేదికలు ఇవ్వగా ఇప్పటివరకు చేయలేదని ప్యానెల్ తేలి్చంది. -
సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు అధికార వర్గాల సమాచారం. ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలం పొడిగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో మరో మూడు నెలలు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో సీఎస్గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్రంజన్, వికాస్రాజ్ పోటీలో ఉన్నా రు. కేంద్ర సరీ్వసులో ఉన్న సంజయ్ జాజు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేరని సమాచారం. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్కు సీఎస్గా అవకాశం లేదని సమాచారం. -
మెగా కోడలికి తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు
మెగా కోడలు, హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యే కొత్తగా క్రీడా పాలసీని ప్రకటించారు. ఇందులో భాగంగా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ విషయంమై క్రీడారంగాల్ని ప్రోత్సాహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవాళ్లతో ఓ బోర్ట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ని నియమించింది. ఇందులో ఉపాసనకు చోటు దక్కింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు)ఐపీఎల్లో లక్నో జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంజీవ్ గోయెంకాని ఛైర్మన్గా నియమించారు. కో ఛైర్మన్గా ఉపాసనకు బాధ్యతలు అప్పగించారు. బోర్డ్ సభ్యులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, భూటియా, రవికాంత్ రెడ్డి తదితరులని నియమించారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేసిన ఉపాసన.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పింది.బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కో ఛైర్మన్గా అవకాశం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన చెప్పారు. నన్ను నియమించిన సీఎం రేవంత్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి ఇదో శక్తివంతమైన అడుగు అని రాసుకొచ్చారు. రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్లు ఈ మధ్యే రేవంత్ రెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి, ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని అభిప్రాయపడ్డారు.(ఇదీ చదవండి: రూ. 100 కోట్ల క్లబ్లో 'మహావతార్ నరసింహ')Honoured to be the Co Chairman of the Sports Hub of Telangana alongside @sanjivgoenka Ji to shape Telangana into a global sports force.Grateful to Shri @revanth_anumula Garu and the Government of Telangana for this bold vision.This is a powerful step towards building… pic.twitter.com/Xz3k1LWFnw— Upasana Konidela (@upasanakonidela) August 4, 2025 -
పెండింగ్.. పరిష్కారమయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్లో పెట్టిన జీవో 59 అమలు కోసం ఒత్తిడి పెరుగుతోంది. గత 20 నెలల కాలంగా తమ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉన్నాయని, వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకుని తాము నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కారణంతో తమ దరఖాస్తులు పెండింగ్లో పెట్టడం సమంజసం కాదంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు దరఖాస్తుదారులు వస్తున్నారని, మరోవైపు ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రిపై కూడా పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీవో 59 ద్వారా ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో ఈ నెలలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దరఖాస్తుదారులకు మరోమారు నోటీసులిచ్చి, అవసరాన్ని బట్టి ఆ భూములపై మరోమారు కూలంకషంగా విచారణ జరిపి అర్హులకు క్రమబద్ధీకరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆ శాఖ వర్గాలంటున్నాయి. కేబినెట్ సబ్ కమిటీకి ఇప్పటికే నివేదిక ఆదాయ వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి గతంలోనే రెవెన్యూ శాఖ జీవో 59కి సంబంధించిన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. జీవో 59 కింద మొత్తం 57,661 దరఖాస్తులు రాగా, 55,997 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 32,788 దరఖాస్తులకు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు. వీరిలో 13,726 మంది డిమాండ్ మేరకు ప్రభుత్వానికి చెల్లింపులు చేశారు. దీంతో 10,553 మంది కన్వేయన్స్ డీడ్లు కూడా మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తుల్లో 828 దరఖాస్తులు అధిక విలువ ఉన్న భూములకు సంబంధించినవని, సాధారణ విలువ ఉన్న పెండింగ్ దరఖాస్తుల ద్వారా దాదాపు రూ.1,000 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుందని, అధిక విలువ గల భూములను కూడా క్రమబద్ధీకరిస్తే మరో రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే కన్వేయన్స్ డీడ్స్ వచ్చినప్పటికీ సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జీవో 59 క్రమబద్ధీకరణ భూములపై లావాదేవీలు నిర్వహించవద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిశీలన పూర్తయిన దరఖాస్తులు, మార్కెట్ విలువ చెల్లించినవి, డీడ్స్ జారీ అయి కూడా పెండింగ్లో ఉన్నవి, అధిక విలువ కలిగిన భూములు... ఇలా పలు దశల్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే దిశలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. -
ఒలింపిక్స్ పతకం లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఒలింపిక్స్ నిర్వహించేందుకు మన వద్ద నిధులు, వేదికలు, అన్ని వనరులు, హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. కానీ ఇంతా చేసి మనం ఒక్క స్వర్ణ పతకం కూడా గెలవలేకపోతే మన ముఖం ప్రపంచానికి ఎలా చూపిస్తాం? అందుకే మున్ముందు రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చాం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో క్రీడా సదస్సు(స్పోర్ట్స్ కాంక్లేవ్) నిర్వహించింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఒలింపిక్ పతక విజేతలు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, ప్రపంచ చాంపియన్షిప్ మెడలిస్ట్ అంజూ బాబీ జార్జ్, మాజీ వాలీబాల్ ప్లేయర్ రవికాంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. పలువురు మాజీ క్రీడాకారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండదు ‘క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలతో కలిసి పని చేస్తాం. స్పోర్ట్ పాలసీ అమలుకు సంబంధించి పలువురు ప్రముఖులతో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై క్రీడల్లో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోరు. ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న, నిష్ణాతులైన వారిని ఏరికోరి భాగస్వాములను చేస్తున్నాం. వారంతా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తారని నమ్ముతున్నా..’అని సీఎం పేర్కొన్నారు. మున్ముందు క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ ‘పారిస్ ఒలింపిక్స్లో భారత్ పేలవ ప్రదర్శన చూసిన తర్వాతే నాకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. చాలా కాలంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ అనేదే లేదు. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానం గురించి నిర్ణయం తీసుకున్నాం. విజన్ 2047లో క్రీడలకు ప్రత్యేక అధ్యాయం కేటాయించాం. మున్ముందు క్రీడలకు ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయిస్తాం. ఈ పాలసీ లైబ్రరీలో పడేసే కాగితం ముక్క కాదు. బంగారంతో గీసిన రేఖ లాంటిది..’అని రేవంత్ అన్నారు. హైదరాబాద్కు చాన్స్ ఇవ్వమని అడిగాం.. ‘1956 ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్బాల్ జట్టులో 9 మంది హైదరాబాదీలే ఉన్నారు. హైదరాబాద్లో గతంలో జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ క్రీడలను సమర్థంగా నిర్వహించాం. అయితే గత ప్రభుత్వం పదేళ్లు క్రీడలను ఏమాత్రం పట్టించుకోలేదు. స్టేడియంలు ఫంక్షన్ హాళ్లుగా, సన్బర్న్లాంటి ఈవెంట్లకు వేదికలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. 2026లో ఖేలో ఇండియా నిర్వహణ హక్కులు మనకు కేటాయించాలని, 2036లో భారత్లో ఒలింపిక్స్ జరిగితే రెండు క్రీడాంశాలను హైదరాబాద్లో నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. కొరియా యూనివర్సిటీ నుంచి కోచ్లు ‘రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంతో యువత పెడదారి పడుతోంది. అటువంటివారిని సరైన మార్గంలోకి తెచ్చేందుకు క్రీడలే తగిన మార్గమని భావిస్తున్నాం. గత ఏడాది నేను కొరియా వెళ్లినప్పుడు అక్కడ 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 మంది ఒలింపిక్ పతక విజేతలు వచ్చిన విషయం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇప్పుడే అదే యూనివర్సిటీతో జత కట్టి కోచ్లను తీసుకురానున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది..’అని రేవంత్ ప్రకటించారు. సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తిలాంటి ప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం, నగదు ప్రోత్సాహకాలతో ప్రభుత్వం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 15 మందితో గవర్నింగ్ బోర్డు కొత్త స్పోర్ట్స్ పాలసీని సమర్థంగా నిర్వహించేందుకు 15 మందితో ప్రభుత్వం గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు మాజీ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, భైచుంగ్ భూటియా, రవికాంత్ రెడ్డి, మాజీ అధికారులు పాపారావు, ఇంజేటి శ్రీనివాస్, వ్యాపారవేత్తలు సంజీవ్ గోయెంకా, ఉపాసన కామినేని, విటా దావి, కావ్య మారన్, సి.శశిధర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. పలు సంస్థలతో ఎంఓయూలు ‘స్పోర్ట్ కాంక్లేవ్’లో భాగంగా వేర్వేరు సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఫుట్బాల్ అకాడమీ కోసం ‘ఫిఫా’, ‘ఏఐఎఫ్ఎఫ్’లతో, ఒలింపిక్ వాల్యూస్ ప్రోగ్రామ్కు సంబంధించి అభినవ్ బింద్రాతో, షూటింగ్లో ప్రతిభాన్వేషణ, శిక్షణ కోసం ‘గన్ ఫర్ గ్లోరీ’అకాడమీతో, బాస్కెట్ బాల్ క్రీడలో ప్రతిభాన్వేషణ, అభివృద్ధి కోసం ‘స్పోర్ట్స్ ప్రిక్స్’సంస్థతో, క్రీడలతో పాటు చదువులో కూడా కెరీర్ మార్గనిర్దేశం చేసేలా ‘హర్ స్పోర్ట్స్ కీ చాంపియన్’సంస్థతో ఒప్పందాలు కుదిరాయి. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన ‘టెన్విక్’సంస్థ రాష్ట్రంలోని 50 పాఠశాలల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఎంఓయూ కుదిరింది. -
మూడు సంపుటాలు.. వేయి పేజీలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీల్డ్ కవర్లో నివేదికను అందజేశారు. మూడు సంపుటాల్లో నివేదికను సిద్ధం చేశారు. 650కిపైగా పేజీలతో ప్రధాన నివేదిక అందజేసినట్లు జస్టిస్ ఘోష్ పేర్కొనగా.. అనుబంధాలతో కలిపి మొత్తం మూడు సంపుటాలుగా ఇచ్చిన నివేదికలో వెయ్యికిపైగా పేజీలునున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘో‹Ùతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధ్యులు వారేనా? బరాజ్ల డిజైన్లు, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను కమిషన్ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్ల స్థల ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్లు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన కమిషన్.. ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా ప్రశ్నలను సంధించింది. విచారణ చివర్లో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీశ్రావు, మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయాల ఆధారంగానే బరాజ్ల నిర్మాణ పనులు జరిగాయని మాజీ మంత్రులిద్దరితోపాటు కేసీఆర్ కమిషన్ ఎదుట వాగ్మూలం ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనలను ఖండిస్తూ అసలు గత ప్రభుత్వంలోని జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో బరాజ్ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు జరగలేదని తేలి్చంది. దీనికి సమర్థనగా గత ప్రభుత్వంలో జరిగిన కేబినెట్ సమావేశాలకు సంబంధించిన తీర్మానాల ప్రతులతో కమిషన్కు నివేదిక అందించింది. బరాజ్లకు సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారనే అంశాన్ని నిర్ధారించడానికి ఈ నివేదిక కీలకం కానుంది. ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ స్థల మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారనే అంశంపై కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా పలువురు సాక్షులను ప్రశ్నించింది. చాలా మంది సాక్షులు దీనికి సమాధానంగా ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ల పేర్లను ఉటంకించారు. విచారణకు హాజరైన సాక్షుల్లోనే పలువురి పాత్రపై ఆధారాలను సేకరించిన కమిషన్.. వారినే బాధ్యులుగా నిర్ధారిస్తూ నివేదికలో పొందపరిచినట్లు సమాచారం. నేడు సీఎంకు నివేదిక.. జస్టిస్ ఘోష్ గురువారం సమర్పించిన నివేదిక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి చేరగా.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్రెడ్డికి ఆ నివేదికను అందచేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం నివేదికను మీడియాకు బహిర్గతం చేయనున్నట్లు తెలిపారు. అంశాలకు కట్టుబడే నివేదిక.. జస్టిస్ ఘోష్ ప్రభుత్వం కమిషన్కు నిర్దేశించిన అంశాలకే పరిమితమై నివేదికను సిద్ధం చేసినట్లు జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి సిఫారసులు చేయలేదని మీడియాకు తెలియజేశారు. సర్కారుకు నివేదిక అందించడంతో తన బాధ్యత తీరిందన్నారు. ఇకపై కమిషన్ కార్యకలాపాల కోసం హైదరాబాద్కు రానన్నారు. సర్కారు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించగా అది తనకు తెలియదన్నారు. బాధ్యులెవరు? ప్రజాధన దుర్వినియోగం ఎంత? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరు/ఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ అంశాలు, నిర్మాణ సంస్థలు/కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం, ఇతర అవకతవకతలపై విచారణ జరపాలని కోరింది. అసమంజస రీతిలో ఒప్పందాల గడువు పొడిగింపు, పనులు పూర్తయినట్లు తప్పుడు సరి్టఫికేట్ల జారీ, గడువు పూర్తికాక ముందే బ్యాంక్ గ్యారెంటీల విడుదల, తదితర చర్యలతో నిర్మాణ సంస్థలు/కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించిన వ్యవహారంపై విచారణ జరిపి సంబంధిత అధికారులు/సంస్థలను బాధ్యులుగా నిర్ధారించాలని సూచించింది. అంశాలవారీగా బాధ్యులను గుర్తించడంతోపాటు దుర్వినియోగమైన నిధులను కమిషన్ నిర్ధారించి నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. -
1,000 పేజీలతో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తన తుది నివేదిక సమర్పించింది. గురువారం బీఆర్కే భవన్కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. షీల్డ్ కవర్లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్కు అందజేస్తారని సమాచారం. -
ఆర్టీసీలో అడియాసలు
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించిన తర్వాత 200 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. వీటి రూపంలో మహిళలకు రూ.6,680 కోట్లు ఆదా కాగా ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేసింది. తద్వారా సంస్థ లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ నష్టాలతో మునిగిపోయే నావ కాదు.. లాభాల్లోకి వచ్చిన సంస్థ’.. ఉచిత ప్రయాణ పథకం కింద 200 కోట్ల ఉచిత టికెట్ల మైలురాయిని చేరుకున్న తరుణంలో ఆరు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలివి. వారే స్వయంగా ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రకటించారు. అయినప్పటికీ.. సంస్థలో దశాబ్దాల పాటు పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వేల మంది ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొని ఉండటం, పెన్షన్ లేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం శోచనీయం. వేదన వర్ణనాతీతం రిటైర్ అయిన ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకపోగా, కనీసం ఎప్పుడిస్తారో కూడా చెప్పకపోవటంతో రిటైర్ అయిన ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. పెన్షన్ లేని ఉద్యోగం కావటంతో.. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నవారిని పక్కన పెడితే సెక్యూరిటీ, శ్రామిక్, డ్రైవర్,కండక్టర్ లాంటి తక్కువ జీతాలతో పనిచేసిన వారు పేదరికంలో మగ్గుతున్న తీరు, వారు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒకరు, ఇద్దరు కాదు.. దాదాపు 16 వేల కుటుంబాలు నానా అవస్థలకు గురవుతున్నాయి. తమ బాధలు చెప్పుకోవటానికి వెళ్తే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, నిస్సహాయ పరిస్థితుల్లో ఇక నుంచి ప్రతి సోమవారం సంబంధిత డిపోల ముందు, ప్రతి నెలా రీజినల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. పెండింగ్ బకాయిలకు సంబంధించి ఉన్నతాధికారులతో పాటు కనిపించినవారికల్లా తమ గోడు చెప్పుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఎట్టకేలకు వేతన సవరణ జరిగినా.. ప్రతి నాలుగేళ్లకోమారు ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను సవరించాలి. కానీ ఉద్యోగులు పోరాటాలు చేస్తే తప్ప అది అమలుకు నోచుకోవటం లేదు. అలా 2017లో జరగాల్సిన వేతన సవరణ 2024లో అమలులోకి వచ్చింది. అంతవరకు 16 ఇంటెరిమ్ రిలీఫ్ (మధ్యంతర ఉపశమనం)లతో నెట్టుకొచ్చి, గత ఏడాది ఏప్రిల్లో 21 శాతం ఫిట్మెంట్తో ప్రభుత్వం వేతన సవరణ చేసింది. అదే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తెచ్చింది. పాత బకాయిలు పదవీ విరమణ సమయంలో ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, అప్పటికే రిటైర్ అయిన వారి సంగతేంటో సంస్థ చెప్పలేదు. అదే వారి పాలిట శాపంగా మారింది. ఈ వేతన సవరణ కాలంలో సంస్థలో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయినవారందరికీ ప్రయోజనం లభించాల్సి ఉంది. మొత్తం 16 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి కలగాల్సి ఉంది. ఎన్ని బకాయిలో.. ⇒ 2017 వేతన సవరణ, ఆ ఏడాది ఏప్రిల్ నుంచే అమలులోకి రావాల్సి ఉంటుంది. కానీ 2024 జూన్ నుంచి అమలులోకి వచ్చినందున.. ఆ ఏడాది మే వరకు రిటైర్ అయిన అందరికీ ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించాలి. కండక్టర్, డ్రైవర్ లాంటి వారికి నెలకు సగటున రూ.5 వేల చొప్పున 2017 ఏప్రిల్ నుంచి చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఒక్కొక్కరికి లక్షల్లో ఉంటుందని అంచనా. ⇒ పనిచేసిన కాలంలో 300 వరకు పేరుకునే ఆర్జిత సెలవుల (దాదాపు 10 నెలలు) మొత్తాన్ని కూడా రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా బకాయి ఉంది. ఉదాహరణకు చూస్తే.. 2022 జూన్లో రిటైర్ అయిన డిపో మేనేజర్ స్థాయి అధికారికి ఆ బకాయి మొత్తం రూ.11 లక్షలుగా ఉంది. ఇక ఉద్యోగ స్థాయిని బట్టి కీ మొత్తం కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఉంటుంది. ⇒ 2017 వేతన సవరణతో జీతాలు పెరిగినందున, ఆర్జిత సెలవు బకాయిలు కూడా పెరుగుతాయి. రూ.10 లక్షల బకాయి ఉన్నవారికి మరో రూ.4 లక్షల వరకు ఈ వేతన సవరణ వల్ల అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ 2019 జూలై నుంచి ఆర్టీసీలో డీఏల చెల్లింపు నిలిచిపోయింది. గతేడాది ఒకేసారి ఐదు పెండింగు డీఏలను చెల్లించారు. ఈ మధ్య కాలంలో రిటైర్ అయినవారికి ఆ లబ్ధి ఇవ్వలేదు. ఒక్కో పెండింగు డీఏ నికరంగా 2.5 శాతం నుంచి 3.2 శాతం మధ్య ఉంది. ఆ మొత్తం కూడా రిటైర్డ్ ఉద్యోగులకు భారీగా లభించాల్సి ఉంది. అలాగే అప్పటివరకు జరిగిన జాప్యానికి బకాయిలు లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. అది కూడా పెండింగులోనే ఉంది. ⇒ అలాగే గ్రాట్యుటీపై 2017 వేతన సవరణ ప్రభావాన్ని లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. వేతన సవరణతో పెరిగే జీతం ప్రకారం పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన మొత్తాన్ని ఇవ్వలేదు. ⇒ ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో రిటైర్డ్ ఉద్యోగులు అధిక వడ్డీ ఆశతో దాచుకున్న మొత్తాలపై ప్రస్తుతం వడ్డీ చెల్లింపు నిలిచిపోయింది. చాలామందికి ఆ బకాయి కూడా పేరుకుపోయి ఉంది. లబ్ధి అందకుండానే కన్నుమూత! డ్రైవర్, శ్రామిక్, సెక్యూరిటీ.. లాంటి కష్టతరమైన ఉద్యోగాలు ఏళ్లపాటు చేయటంతో ఆరోగ్యాలు దెబ్బతిని చాలా మంది సగటు జీవిత కాలం కంటే ముందే చనిపోతున్నారు. ప్రతి నెలా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది అలా తమకు రావాల్సిన బకాయిలు రాకముందే చనిపోతున్నారని సంఘాల సంఘాలు నేతలు చెబుతున్నారు. -
బనకచర్లకు మా సమ్మతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు తాము సమ్మతి ఇచ్చినట్లేనంటూ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 (3)లో ఉన్న నిబంధన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు వర్తించదని తెలంగాణ స్పష్టం చేసింది. పోలవరం విస్తరణలో భాగంగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు తమ అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని 95వ టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) పోలవరం ప్రాజెక్టును ఆమోదిస్తూ గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా జారీ చేసిన ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్స్లో బనకచర్లతో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించడానికి చేపట్టిన ప్రాజెక్టులో రోజుకు 3 టీఎంసీల జలాల తరలింపునకు వీలుగా ఏపీ సర్కారు సదుపాయాలను సృష్టిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పునర్విభజన చట్టం, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిబంధనలతోపాటు ఆ ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను చేపట్టరాదంటూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా లేఖ రాశారు. ‘అన్ని మిగులు జలాలు ఉమ్మడి ఏపీకి చెందుతాయని గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న నేపథ్యంలో ఆ జలాల ఆధారంగా ప్రతిపాదించిన బనకచర్లకు ఉమ్మడి ఏపీ నుంచి వేరుపడిన తెలంగాణ సమ్మతి తప్పనిసరి. ఈ ప్రాజెక్టు తెలంగాణ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించనుంది. బేసిన్లో చివరి రాష్ట్రం కావడంతో బనకచర్ల ప్రాజెక్టును చేపట్టే హక్కు ఉందని ఏపీ పేర్కొనడం పూర్తిగా గోదావరి ట్రిబ్యునల్ తీర్పును వక్రీకరించడమే. వరద జలాల పంపిణీ గురించి ట్రిబ్యునల్ తీర్పులో ఎలాంటి ప్రస్తావన లేదు’అని లేఖలో ఆయన పేర్కొన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు... వరద జలాల పంపిణీకి ప్రాతిపదిక లేదు.. ‘బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించి అక్కడి నుంచి పెన్నా బేసిన్లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించాలని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు గోదావరి బేసిన్ పరిధిలోకి రాదు. పూర్తిగా కృష్ణా, పెన్నా బేసిన్ల పరిధిలోకి ఆయకట్టు రానుండటం వల్ల ఈ అంశంపై పునఃపరిశీలన జరపాలి. రాష్ట్రాల మధ్య వరద జలాల పంపిణీపై గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో ఎలాంటి నిబంధన లేదు. భారీ మొత్తంలో జలాలను బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏపీ తరలించడంతో ఇప్పటికే కృష్ణా బేసిన్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీదుగా పెన్నా బేసిన్కు తరలించడం పూర్తిగా కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పునకు విరుద్ధం’అని లేఖలో తెలంగాణ పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్లు 84 (3) (2), 85 (8సీ/8డీ) ప్రకారం కొత్త ప్రాజెక్టులన్నింటికీ తొలుత సంబంధిత నదీ యాజమాన్య బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా బనకచర్ల విషయంలో ఏపీ ఈ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపిందని వివరించింది. బనకచర్లతో పోలవరం గేట్ల నిర్వహణలో మార్పులు జరిగి బ్యాక్వాటర్తో తెలంగాణ భూభాగంలో ముంపు సమస్య మరింత తీవ్రమై దుమ్ముగూడెం బరాజ్ మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్వాటర్ మరింత పెరిగితే భద్రాచలం పట్టణం, ఆలయంతోపాటు పరిసర గ్రామాలు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ముంపునకు గురవుతాయని పేర్కొంది. పోలవరంపై పీపీఏకే ఆ అధికారం.. బనకచర్లలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఫోర్షోర్ నుంచి నీటిని తరలించనుండటంతో ఆ పనులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పరిధిలోకి వస్తాయని తెలంగాణ తెలిపింది. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన పీపీఏ.. పోలవరం పనులను టీఏసీ, సీడబ్ల్యూసీ అనుమతులకు కట్టుబడి నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. టీఏసీ, సీడబ్ల్యూసీ అనుమతుల్లేకుండా బనకచర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులను పీపీఏ అనుమతించరాదని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. బనకచర్లకు పర్యావరణ, ఇతర అనుమతులను కోరే అధికారం పీపీఏకే ఉందని స్పష్టం చేసింది.పోలవరం ద్వారా 449.78 టీఎంసీల తరలింపునకు డీపీఆర్ రూపొందగా... తాజాగా మరో 200 టీఎంసీలను ఇదే ప్రాజెక్టు ద్వారా తరలించడానికి బనకచర్లను ఏపీ ప్రతిపాదించడం వల్ల పోలవరం ద్వారా తరలించనున్న మొత్తం జలాలు 650 టీఎంసీలకు పెరిగి ప్రాజెక్టు అపరేషన్ షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకుంటాయని లేఖలో తెలంగాణ వాదించింది. ఇది ఉమ్మడి ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశాల మధ్య కుదిరిన ఆపరేషన్ షెడ్యూల్ ఒప్పందానికి విరుద్ధమని గుర్తుచేసింది. 75 శాతం లభ్యతతో 449.78 టీఎంసీల తరలింపునకే పోలవరానికి సీడబ్ల్యూసీ అనుమతించగా.. బనకచర్ల పేరుతో అంతకుమించి మిగులు జలాలను ఏపీ తరలించాలనుకోవడం ఆ అనుమతులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా అదనపు పనులు చేపట్టడంతో 2011లో పనుల నిలుపుదలకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసిందని.. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని గుర్తుచేసింది. -
కేంద్రానిదే బాధ్యత: రాహుల్గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు ‘కుల గణన అనేది రేవంత్రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్ అభివర్ణించారు. కుల గణనను కేంద్రం సరిగా చేయదు ‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్ వద్దా? ‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్ నిలదీశారు. రేవంత్రెడ్డి తదితరులను అభినందిస్తున్నా.. ‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్ అన్నారు. భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్ జోడో యాత్ర, సంవిధాన్ బచావ్ ర్యాలీల్లో రాహుల్గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్’ అనే రాహుల్ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు లాభం జరిగింది. ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య. రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు. ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్ గాందీని అభినందిస్తున్నా. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు. -
రాత్రికి రాత్రే అడవులపై బుల్డోజర్లు ఎందుకు?: సుప్రీంకోర్టు
రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి. ..: సీజేఐ జస్టిస్ గవాయ్ :.. సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేసి సుస్థిర అభివృద్ది కోసమేనని సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న అటవీ భూమిని అంత అత్యావశ్యకంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ సున్నితంగా హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్రావు, మరో పిటిషనర్ తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తాజా నివేదికను దాఖలు చేశాం ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో అన్ని పనులను నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర అంశాలతో కూడిన నివేదికను కోర్టులో దాఖలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ అఫిడవిట్ను పరిశీలించేందుకు తమకు సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్రావు, ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే వారం వాదనలు వింటామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దీనిపై స్పందించిన... ప్రతివాదులు మరింత సమయం కావాలని కోరగా.. ఆగస్టు 13కు తదుపరి విచారణను వాయిదా వేశారు. పర్యావరణ అంశాలపై సుప్రీంకోర్టుకు సహాయం చేసేందుకు కేంద్ర సాధికారక కమిటీ (సీఈసీ) స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి తమకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మేం అడవులను కాపాడాం ‘సరే ప్రస్తుతానికైతే అటవీ భూమిని కాపాడారు కదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం అడిగింది. అది అటవీ భూమా.. కాదా?’అనే అంశంపై మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ స్థలంలో చెట్లు సంరక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం అనేది సమంజసం కాదు. సుస్థిర అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను. అంటే దానర్థం రాత్రికిరాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి మొత్తం అడవిని ధ్వంసం చేయడాన్ని సమర్థిస్తానని మాత్రం కాదు’అని అన్నారు. అటవీ భూమిని కాపాడకపోతే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనే దానిపై నిర్ణయం తీసుకోండి అని అని జస్టిస్ గవాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు.. తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరల పెంపు!
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. టికెట్ ధరలతో పాటు ఈనెల 23 ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 600 వరకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అంతే కాకుండా ఈ నెల 24 నుంచి 27 వరకు ఐదు ఆటలు ప్రదర్శించుకోడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి రోజు నుంచే మల్టీప్లెక్స్ల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150 టికెట్ ధరలు పెంచుకునేందుకునేలా వెసులుబాటు కల్పించింది. అలాగే జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీఫ్లెక్స్ల్లో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.106 పెంచుకునేలా అనుమతులు జారీ చేసింది. పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత మళ్లీ హరి హార విరమల్లు సినిమాకి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే గతంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఏపీలోనూ భారీగా ధరల పెంపు..ఏపీలోలోనూ గత ప్రభుత్వంలో బెనిఫిట్ షోలు రద్దు చేయగా.. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కోసం మళ్లీ వాటిని తీసుకొచ్చారు. 23న అంటే విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల ప్రీమియర్ షోలకు అనుమతించారు. ఈ షోకి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్ల్లో అయితే ఏకంగా రూ.200 పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు రేట్ల పెంపు అమల్లో ఉండనుంది. 'హరిహర వీరమల్లు' సినిమా దాదాపు ఐదేళ్లపాటు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తీశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్. తొలుత క్రిష్ డైరెక్టర్ కాగా.. మధ్యలో ఆయన తప్పుకొన్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. ఆయన మిగతా అంతా పూర్తి చేశారు. -
రిజర్వేషన్లు ఎలా ఉంటాయో!?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్ సైతం తీసుకురానుంది. దీంతో ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికల రాజుకుంటున్న నేపథ్యంలో గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ ఎలా ఉంటుందో..: పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చూస్తే..అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రస్తుతం ఉన్న 22 శాతం రిజర్వేషన్లను, 42 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేనుండటంతో.. అందులో పొందుపరిచే అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ,ఎస్టీ స్థానాలు కూడా కొంత మేరకు ప్రభావితం కావచ్చునని చెబుతున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్పర్సన్ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు.. గతంలో ఉన్న రిజర్వేషన్లు రెండు పదవీ కాలాల (టర్మ్లు) సమయం కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్మ్కు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్ మాత్రమే ఉంటాయన్న మాట. ఈ కారణంగానూ రిజర్వేషన్ స్థానాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. తాజా జనాభా లెక్కలతోనూ ప్రభావితం! గతంలో మాదిరిగానే సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల ప్రతిపాదికన, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా యూనిట్గా..ఎంపీపీ అధ్యక్షుడు జిల్లా యూనిట్గా, జెడ్పీపీ చైర్మన్ రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్లు ఉంటాయా లేదా అనేది కూడా రాజకీయ పార్టీల నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది. అయితే ప్రభుత్వం జారీచేసే ఆర్డినెన్స్కు అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజా జనాభా లెక్కల్లో (కుల గణన)వచ్చిన మార్పులను బట్టి రిజర్వేషన్లు కూడా మారిపోతాయని భావిస్తున్నారు. స్థానాల సంఖ్యపై స్పష్టత! రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు 12,782గా, గ్రామాల వార్డులు 1,12,712, ఎంపీటీసీ స్థానాలు 5,816, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్లు 566, జిల్లా పరిషత్లు 31గా లెక్క తేలినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఈ లెక్క తేల్చినట్లు అధికారవర్గాల భోగట్టా. 2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)–(మేడ్చల్ జిల్లా పరిషత్ రద్దు) స్థానం తగ్గగా అనేక గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 55 నుంచి 60 స్థానాల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. తగ్గిన ఎంపీటీసీలు, పెరిగిన మండలాలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ (గ్రామీణ జిల్లా) ఉనికిలో లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో ఆయా గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గనున్నట్టు తెలుస్తోంది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గవచ్చని అంచనా. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది. గత ఎన్నికల్లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 12,782కు పెరిగింది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా 10–11 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి 12న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా, క్షేత్రస్థాయి నుంచి సకాలంలో పూర్తి సమాచారం అందకపోవడంతో వాటి ప్రకటనలో జాప్యం జరిగింది. సోమవారం నాటికి కూడా కొన్నిచోట్ల నుంచి వివరాలు రాకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లపై కచి్చతమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 ఎన్నికల నాటికి మండల ప్రజా పరిషత్లు 539 ఉండగా, 2025 ఎన్నికల నాటికి 566కు పెరగనున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు 12,769 ఉండగా, ఇప్పుడు 12,782కు చేరుకున్నట్టు అధికారవర్గాల సమాచారం.


