హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో అడ్వర్టైజ్మెంట్ గ్యాస్ బెలూన్ పేలింది. ఓ కన్వెన్షన్ లో హొలీ ఈవెంట్ లో అడ్వర్టైజ్మెంట్ కోసం బెలూన్ ఏర్పాటు చేశారు. అయితే అది గాలికి ఎగిరి వచ్చి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది.
దీన్ని బ్రహ్మకుమారీస్ వాలంటరీలు తీయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలింది,. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఉస్మాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


