బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మంచి వసూళ్లతో పాటు ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.
ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. విజయ్ ఆంటోని బర్త్డే సందర్భంగా ఈరోజు(జులై 24) ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను పంచుకుంది. ఆగస్టులో తమ ప్లాట్ఫామ్లో ఓటీటీ ప్రీమియర్ కానుందని జీ5 తెలుగు ప్రకటించింది.అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
వంద దేవళ్లు కథేంటంటే..
పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


