breaking news
Vanda Devullu Movie
-
ఓటీటీలోకి ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మంచి వసూళ్లతో పాటు ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. విజయ్ ఆంటోని బర్త్డే సందర్భంగా ఈరోజు(జులై 24) ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను పంచుకుంది. ఆగస్టులో తమ ప్లాట్ఫామ్లో ఓటీటీ ప్రీమియర్ కానుందని జీ5 తెలుగు ప్రకటించింది.అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.వంద దేవళ్లు కథేంటంటే..పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఒక్క క్లిక్తో ఐదు సినిమాల రివ్యూస్.. ఈ వారం హిట్ బొమ్మ ఏది?
ఈ వారం టాలీవుడ్లో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో పాటు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’కూడా ఉంది. వీటితో పాటు యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన లవ్స్టోరీ ‘దీవాన’, ‘బిచ్చగాడు’ఫేం విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’, మలయాళ మూవీ ‘బాలన్-ది బాయ్’ సినిమాలు కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల కథేంటి? ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి? పూర్తి రివ్యూస్ని ఒక్క క్లిక్తో చదివేయండి.1) ‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘దీవాన’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్: వంద దేవుళ్లునటీనటులు: విజయ్ ఆంటోనీ, శ్వాసిక, అజయ్ దిషాన్, లిజోమోల్ జోసే, కరుణాస్ తదితరులునిర్మాణ సంస్థ:విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్నిర్మాత:రామాంజనేయులు జవ్వాజిదర్శకత్వం: శశిసంగీతం: బాలాజీ శ్రీరామ్సినిమాటోగ్రపీ: ఎస్బీ దర్శన్ కిర్లోష్ఎడిటర్: హరీష్ యువరాజ్విడుదల తేది: జూన్ 19, 2026‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన కొత్త చిత్రమే ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ట్రైలర్ని కట్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఇలా భారీ అంచనాలతో నేడు(జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు.. సంసార జీవితం ఆస్వాదించే వయసుకొచ్చేసరికే భర్తను కోల్పోవడం.. తర్వాత పిల్లలే ప్రపంచంగా బతికే ఓ తల్లి కథ ఇది. కాలం మారినా ఇప్పటికీ కొన్ని కట్లుబాట్లు మాత్రం మారడం లేదు. చిన్న వయసులో భర్తను కోల్పోయిన ఒక మహిళకు ‘వితంతువు’ అనే శిక్ష వేసి జీవితాంతం బంధీగానే ఉంచేస్తుంది ఈ సమాజం. భార్యను కోల్పోయిన భర్త మళ్లీ పెళ్లి చేసుకోవడం సులభం కానీ భర్తను కోల్పోయిన ఒక మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ అంత ఈజీ కాదు. మగాళ్లతో పాటు తోటి ఆడవాళ్లు కూడా అదేదో పెద్ద తప్పుగానే భావిస్తున్నారు. మళ్లీ పెళ్లి అంటే కేవలం శారీరక సుఖం కోసమే అన్నట్లుగా చూస్తున్నారు. అదొక్కటే కాదు శారీరక అవసరాలతో పాటు ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరం అని చాట చెప్పిన సినిమా వంద దేవుళ్లు. సినిమా చూస్తున్నప్పుడు ఎంతో మంది అమ్మల జీవితాలు మన కళ్లముందు మెదలుతాయి. ఇదే కాన్సెప్ట్తో దాదాపు 30 ఏళ్ల కిత్రం ‘మా నాన్నకు పెళ్లి’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో శ్రీకాంత్ వాళ్ల నాన్న కృషం రాజుకు మళ్లీ పెళ్లి చేయాలని భావిస్తాడు. ఇందులో హీరో అజయ్ దిషాన్ తన తల్లికి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే కథ-కథనం విషయంలో మాత్రం చాలా తేడానే ఉంది. ఈ సినిమాలో చాలా సున్నితమైన అంశాలను చర్చించారు. పాతికేళ్ల వయసులోనే భర్తను కోల్పోతే.. ఆ మహిళ జీవితాంతం ఒంటరిగానే ఉండాలా? ఆమెకు కూడా శారీరక అవసరాలు ఉంటాయి కదా? దాన్ని ఎందుకు తప్పుగా చూస్తారు? తోడు వెతుక్కుంటే తప్పేంటి? అనే అంశాలను ఇక్కడ చాలా సహజంగా చర్చించారు. ‘నేను కూడా అందరిలాగానే ఉప్పుకారం తింటున్నాను కదా? నాకు కూడా కూడా కోరికలు ఉండవా?’ అని ప్రారంభంలోనే అమ్మ పాత్రతో చెప్పించి, అసలు కథను ప్రారంభించాడు. పిల్లలు పెద్దయిన తర్వాత తల్లికి మళ్లీ పెళ్లి ఆలోచన రావడం.. ఒక కొడుకు ప్రేమతోనూ, మరొక కొడుకు పెళ్లితోనూ ఆ పెళ్లిని ముడి పెడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండాఫ్ మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఏడు కొండలు పాత్ర ఎంట్రీ తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. యూట్యూబ్ కంటెంట్ నేపథ్యంలోని సన్నివేశాలూ నవ్విస్తాయి. క్లైమాక్స్లో వచ్చే చిన్న ట్విస్ట్ బాగుంటుంది. ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు అలాంటి క్లైమాక్స్ ఊహించలేం. ఎవరెలా చేశారంటే..విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో పాత్రలో జీవించేశారు. హీరోయిన్ శ్వాసిక తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్బీ దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా రిచ్గా అనిపించింది. బాలాజీ శ్రీరామ్ నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. హరీష్ యువరాజ్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)
-
'బిచ్చగాడు' కంటే 'వంద దేవుళ్ళు' పెద్ద హిట్ అవ్వాలి: నిహారిక
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 'బిచ్చగాడు' తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే (జూన్ 19) రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక అతిథిగా విచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)నిహారిక మాట్లాడుతూ .. 'వంద దేవుళ్ళు' సినిమాని ఇప్పటికే చూశాను. డైరెక్టర్ శశి తీసిన 'శ్రీను' చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన 'బిచ్చగాడు' లాంటి గొప్ప మూవీ తీశారు. ప్రతి ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పనిచేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్ను గొప్పగా చూపించారు. అమ్మ ఉన్న ప్రతిఒక్కరూ 'వంద దేవుళ్ళు' చూడాలి. 'బిచ్చగాడు' కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పింది.విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. 'శశి.. 20 ఏళ్ల నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం 'బిచ్చగాడు'తో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వంద దేవుళ్ళు' అంటూ మేం రాబోతోన్నాం. శశి నాకు ఈ కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుందని అన్నారు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) -
'నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవర్రా?'.. ఫుల్ ఎమోషనల్గా ట్రైలర్
బిచ్చగాడు మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్గా టచ్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో అలరించేందుకు వస్తోంది. వంద దేవుళ్లు పేరుతో మరోసారి అమ్మ ప్రేమ, సెంటిమెంట్ చూపించేందుకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించారు. మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మధ్య తరగతి కుటుంలాల జీవితం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బిచ్చగాడులానే అమ్మ సెంటిమెంట్ ఉండనుందని టీజర్లోనే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాకు బాలాజీ శ్రీరామ్ సంగీతం సమకూర్చారు.


