breaking news
Adilabad District News
-
‘ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఆదిలాబాద్టౌన్: ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్, సీసీఐ పరిశ్రమ అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఈ అంశాలపై వెంటనే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వాటిపై స్పష్టమైన ప్రణాళికలు లేకపోయినా అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఏర్పాటుౖ పె స్పష్టత ఇవ్వలేకపోతున్నా స్థానిక ఎమ్మెల్యే డీపీఆర్ పూర్తయిందంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం జిల్లా ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ను ఏరోస్పేస్ జోన్గా గుర్తించి, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రూ.8 కోట్లతో సర్వేపూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే రేణుక సి మెంట్ పరిశ్రమ ఏర్పాటుకురూ.4కోట్లతో సర్వే లు నిర్వహించగా, వాటిని అడ్డుకున్నది ప్రస్తుత నాయకులేనని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, నారాయణ, ప్రహ్లా ద్, వసంత్, గణేష్, దమ్మపాల్, దివిటి రాజు, ఆసిఫ్, మహేష్, సాయి పాల్గొన్నారు. -
‘ప్రగతి’ నిరంతర ప్రక్రియ కావాలి
కై లాస్నగర్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని రిజిస్ట్రేషన్లశాఖ రాష్ట్ర ఐజీ, ప్రజాపాలన జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరుపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 99 రోజుల కార్యక్రమం ముగిసినప్పటికీ దాన్ని ఆపకుండా భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో కొనసాగించాలనారు. గ్రామ, మండల సభల్లో ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత, కమ్యూనిటీ సంస్థాగత వినతులను అన్ని శాఖల అధికారులు క్రోడీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పర్యటన సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇచ్చిన హామీలపై నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికకు సంబంధించిన బుక్లెట్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం నేరడిగొండ: ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్ హనుమంతు అన్నారు. నేరడిగొండ పీహెచ్సీని బుధవారం సందర్శించారు.హెచ్పీవీ వ్యాక్సినేషన్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ ఎంఏ కలీం, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సద్దాం, హెచ్ఈవో పవార్ రవీందర్, హెల్త్ సూపర్వైజర్ సంతోష్, స్వర్ణలత, సిబ్బంది ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన ఐజీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఐజీ, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఆరా తీఽశారు. ట్రెయినీ సబ్ రిజిస్ట్రార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న కార్యాలయానికి కొత్త భవనం కేటాయించాలని సబ్ రిజిస్ట్రార్ శ్రీలత ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన .. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న అస్మా బేగం, రెహనా బేగం ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన పరిశీలించారు. ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపులు, ఇతర వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, హౌసింగ్ పీడీ శంకర్, డీఈ షాకీర్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. -
● మొలకెత్తాయా.. లేదా.. రైతుల పరిశీలన ● నష్టపోయిన వారు మరోసారి విత్తేందుకు సిద్ధం ● తాజా వానలతో జోరందుకున్న సాగు పనులు● ఊపందుకున్న పత్తి విత్తనాల విక్రయం
విస్తారంగా సాగు.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల తర్వాత విస్తారంగా సాగు పనులు నడుస్తున్నాయి. పత్తి, సోయా, కంది, ఇతరత్రా పంటల విత్తన పనులు జోరందుకున్నాయి. పత్తి విత్తనాల ప్యాకెట్లు మార్కెట్లో సరిపడా అందుబాటులో ఉన్నాయి. – రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారివర్షపాతం వివరాలు.. (జూన్ 1 నుంచి 24 వరకు)సాధారణ వర్షపాతం: 150.5 మి.మీ.లు కురిసింది : 90.7 మి.మీ.లు వ్యత్యాసం : 40 శాతం స్థితి : లోటు వర్షపాతం -
‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యం .. విద్యార్థులకు శాపం’
కై లాస్నగర్: నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడానికి కేంద్రప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఇది విద్యార్థులకు శాపంగా మారిందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష నిర్వహణ లోపాలతో నష్టపోతున్న విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చాత్రోంకి గూంజ్ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ పోరాటాన్ని ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రుల వద్దకు బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో మార్కెట్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు శ్రీకాంత్రెడ్డి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’కు వేళాయె
కై లాస్నగర్: అనర్హులను తొలగించి పారదర్శకతతో కూడిన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యంగా చేపట్టిన సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియ జిల్లాలో గురువా రం నుంచి షురూ కానుంది. జూలై 24వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇంటింటి సర్వే చేపట్టనున్న బీఎల్వోలకు ప్రత్యేక కిట్లతో పాటు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. దీంతో వారు ఇక క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించనున్నారు. సందేహాల నివృత్తి కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్డెస్కులను ఏర్పాటు చేశారు. ఈ ఫారాలు అందించిన ఓటర్ల పేర్లనే ముసాయిదా జాబితాలో ప్రకటించనున్నట్లుగా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రక్రియ నిర్వహణ వివరాలు వెల్లడించారు. దీంతో ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని విధిగా తీసుకుని వివరాలు నమోదు చేసి తిరిగి అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి మూడుసార్లు.. వర్షాకాలం కావడంతో ప్రత్యేక సవరణలో పాల్గొనే బీఎల్వోలకు ప్రత్యేకంగా రెయిన్కోట్, చేతి గొడుగులు అందజేశారు. వాటితో పాటు ప్యాడ్, రిజిస్టర్, డిక్లరేషన్ ఫారాలు, స్టాప్లర్, పిన్స్, పెన్నులు, పెన్సి ల్లు, బ్యాగులు, ఫారం 6,7తో కూడిన ప్రత్యేక కిట్లను ఇప్పటికే అందజేశారు. వీటితో పాటు తమ పరిధిలోని ఓటర్ల సంఖ్యకనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. ఈ మేరకు గురువా రం ఉదయం 8గంటల నుంచే బీఎల్వోలు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లనున్నారు. ఓటర్లకు ఫారా లను అందజేయనున్నారు. ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు అందజేసి వారి నుంచి ఎకనాలెడ్జ్మెంట్ తీసుకుంటారు. తిరిగి తొమ్మిదో రోజు నుంచి పూరించిన ఫారాలను స్వీకరిస్తారు. నిరాక్షరాస్యులైన ఓటర్లు తమ సమాచారాన్ని పూర్తి చేయడంలో అవసరమైన సాయం అందజేస్తారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు కలిగిన ప్రతీ ఓటరు తమ వివరాలను ఽధ్రువీకరించుకుని బీఎల్వోలకు అందజేయాల్సి ఉంటుంది. 2002లో ఓటు హక్కు లేకుంటే ... ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికి 2002 ఓటర్ల జాబి తాలో పేరు లేనటువంటి ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి వారు తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల ఓటరు వివరాల ఆధారంగా సంబంధిత ఫారాలను పూర్తి చేసి సంతకం చేయడం లేదంటే బొటినవేలుముద్ర వేసి బీఎల్వోలకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించే వెసులుబాటు ఉంది. ఇలాంటి వారు తమ కుటుంబీకుల వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా స్వయంగా పరిశీలించుకోవచ్చు. ప్రధా న రాజకీయ పార్టీలు సైతం బూత్ల వారీగా ప్రత్యేక ఏజెంట్లను నియమించింది. వారి సహకారం కూడా తీసుకోవచ్చు. అపోహలు వీడి సహకరించాలి ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిపోతాయనే అపోహలను ప్రజలు నమ్మవద్దు. తమ ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు స్వచ్ఛందంగా వివరాలు అందజేయాలి. ప్రక్రియ పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా సహకరించాలి. ఓటర్ల జాబితాలోని లోపాలు సరిదిద్దడంతో పాటు మరణించిన, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించడం జరుగుతుంది. అలాగే 1అక్టోబర్ 2026 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును తుది జాబితాలో చేర్చేలా చూస్తాం. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడంతో పాటు వాటిని పూర్తి చేసి సకాలంలో బీఎల్వోలకు అందజేసి సహకరించాలి. – రాజర్షి షా, కలెక్టర్ అందుబాటులో హెల్ప్డెస్క్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న సందేహాల నివృత్తి కోసం జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్డెస్కులను ఏర్పాటు చేశారు. ఓటరు జాబితాలతో పాటు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ఇవే కాకుండా సందేహాల నివృత్తి లేదా ఇతర సమాచారం కోసం కేంద్ర ఎన్నికల సంఘం టోల్ఫ్రీ నంబర్ 1950ని సైతం సంప్రదించవచ్చు. -
రాలే.. సార్!
ఆదిలాబాద్టౌన్: బడులు పునఃప్రారంభమై పది రోజులు గడుస్తున్నా విద్యార్థులు ఇంకా పూర్తి స్థాయిలో పాఠశాలకు హాజరు కావడం లేదు. దీంతో సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. గడిచిన పది రోజుల్లో జిల్లాలో హాజరుశాతం కేవలం 35.85 నమోదు కావడం గమనార్హం. అయితే పల్లెల్లో పిల్లలు తల్లిదండ్రుల వెంట పంట చేను పనులకు వెళ్లడం, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, వసతిగృహా ల్లో ఉంటూ చదివే విద్యార్థులు ఇంకా ఇంటి వద్దనే ఉంటున్నారు. మొహర్రం ఉండడంతో హాజరు శాతం కొంత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. పెరగని హాజరు శాతం.. జిల్లాలో 679 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, 18 కేజీబీవీలు, 6 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 56,605 మంది విద్యార్థులున్నారు. ఈనెల 15న పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సరాసరి 20,291 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. బడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరోజు కూడా 50 శాతం హాజరు నమోదు కాకపోవడం గమనార్హం. విద్యార్థులకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్లు పంపిణీ చేశారు. మరికొంత మందికి అందించాల్సి ఉంది. సర్కారు బడిలో ఉన్నారా.. ప్రైవేట్ బాట పట్టారా జిల్లాలో సర్కారు బడుల్లో 56,605 మంది విద్యార్థులు ఉండగా, కనీసం 20వేల మంది విద్యార్థులు బడికి రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొంత మంది వివిధ కారణాలతో బడికి రాకపోగా, మిగతా విద్యార్థులు ప్రైవేట్ వైపు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు తెరువక ముందే ప్రైవేట్ యజమాన్యాలు విద్యార్థుల ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి పాఠశాలల్లో చేర్పించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అసలు ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారా.. లేక ప్రైవేట్ బడిబాట పట్టారా అనే సందేహం నెలకొంది. ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో గతేడాదితో పోల్చితే 30 శాతం పెంచాలని కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కనీసం పది శాతం కూడా పెరగకపోవడం ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతోంది. నామ్కే వాస్తేగా బడిబాట.. సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం ఏటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది సైతం నెల పాటు కార్యక్రమాన్ని నిర్వహించినా ఆశించిన ఫలితాలు కానరాలేదు. ఈనెల 19 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే సెన్సెస్ ఉండడంతో ఉపాధ్యాయులు ఆ విధుల్లో బిజీగా ఉండటం, డ్యూటీలు లేనివారు బడిబాటపై దృష్టి సారించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది పరిస్థితి ఇదీ.. అధికారుల లెక్కల ప్రకారం.. 1వ తరగతి ఈ ఏడాది 2,968 మంది సర్కారు బడుల్లో చేరారు. ఇదిలా ఉండగా 2వ తరగతిలో 5,767, 3వ తరగతిలో 5,262, 4వ తరగతిలో 5,454, 5వ తరగతిలో 5,164, 6వ తరగతిలో 3,603, 7వ తరగతిలో 4,984, 8వ తరగతిలో 5,336, 9వ తరగతిలో 5,566, పదో తరగతిలో 5,859 మంది విద్యార్థులు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నారు. అయితే బడికి మాత్రం 20వేల మంది కూడా హాజరు కాకపోవడంతో మిగతా వారు ఏం చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. తేదీ హాజరైన విద్యార్థులు 15 8,906 16 15,473 17 20,236 18 20,189 19 23,546 20 23,735 22 25,402 23 22,840 ఈ నెల 15 నుంచి విద్యార్థుల హాజరు వివరాలుజిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 739 మొత్తం విద్యార్థులు 56,605 -
ఒంటికి.. రెంటికి కష్టాలే
ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో టాయ్లెట్స్ కొరతతో విద్యార్థినులకు తిప్పలు తప్పడం లేదు. గురువారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2026ఈ రైతు పేరు పెండే లక్ష్మణ్. తాంసి మండలం వడ్డాడి గ్రామం. మూడున్నర ఎకరాల్లో ఏడు పత్తి బ్యాగుల విత్తనాలను జూన్ 10న పొడిదుక్కుల్లోనే వేశాడు. రెండు మామూలు వర్షాలతో మొలకలు వచ్చినట్టే వచ్చాయి. తర్వాత వరుణుడి జాడ లేకపోవడంతో విత్తనం ఉబ్బిపోయి నష్టపోవాల్సి వచ్చింది. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల తర్వాత మంగళవారం మళ్లీ ఏడు బ్యాగుల విత్తనాలు విత్తాడు. ఈ రైతు పేరు కాటిపెల్లి చంద్రశేఖర్ రెడ్డి. ఇచ్చోడ. పదెకరాల్లో 20 బ్యాగుల పత్తి విత్తనాలు వారం క్రితం వేశాడు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక 30 శాతం మొలకెత్తలేదు. దీంతో నష్టపోయిన చోట మళ్లీ విత్తనాలు వేస్తున్నాడు.ఈ రైతు పేరు ఉప్పు శంకర్. నేరడిగొండ మండలం వడూర్. మూడు రోజుల క్రితం పొడిదుక్కుల్లోనే పదెకరాల్లో పది బ్యాగుల పత్తి విత్తనాలు వేశాడు. ప్రస్తుతం వర్షాలు పడడంతో ఇప్పుడు అవి మొలకెత్తుతాయని ఎదురుచూస్తున్నాడు. -
డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: డ్రగ్స్, గంజాయి వంటి మా దకద్రవ్యాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం నిర్వహించి న డ్రగ్స్ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ‘వాల్ ఆఫ్ ప్రామిస్’పై సంతకం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై సమాజమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ‘యాంటీ డ్రగ్స్ సోల్జర్’గా పోరాడుతామని ఏర్పా టు చేసిన ప్రత్యేక సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులు, యువత సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో ఆది లాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు బి.సునీల్ కుమార్, కె.ఫణీదర్, ప్రణయ్ కుమార్, ఎస్సైలు అశోక్, సంజయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సత్వర న్యాయం అందించేందుకు చర్యలు బాధితులకు సత్వర న్యాయం, వైద్య, న్యాయ, మా నసిక సహాయ సేవలు అందించేందుకు ప్రత్యేక చ ర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అన్నారు. భరోసా కేంద్రం ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో పోలీస్ హెడ్క్వార్టర్స్లో సమావేశం నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్య త ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మౌనిక, భరోసా సెంటర్ ఇన్చార్జి పద్మ, భరోసా సెంటర్ కోఆర్డినేటర్లు ప్రనూష, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మత్తు నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం మత్తు వ్యసనాల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని ఎస్పీ అన్నారు. రిమ్స్లోని డీఅడిక్షన్ సెంటర్ ను పరిశీలించారు. చికిత్స విధానం, సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలువాటు పడిన వ్యక్తుల కు వైద్య సలహాలు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తూ వారిని ఆరోగ్యవంతమైన జీవనంలోకి తీసుకురావడానికి దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆయ న వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, మా వల సీఐ ప్రేమ్కుమార్ తదితరులు ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టం చేయాలిజిల్లాలో రోడ్డుప్రమాదాల నివారణకు ట్రాఫిక్ ని బంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. బుధవారం రాత్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సిబ్బంది పనితీరు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, పెండింగ్ కే సులు,ఈ–చలాన్ల అమలు తదితర అంశాలను స మీక్షించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల నియంత్రణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.హెల్మె ట్, సీట్బెల్ట్ వినియోగం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్, ఆర్ఎస్సైలు దేవేందర్, మనీ ష్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యాలకు డ్యూటీ మీట్ దోహదం
ఆదిలాబాద్టౌన్: అధికారులు, సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు డ్యూటీ మీట్లు దోహదపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లాస్థాయి డ్యూటీ మీట్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని జోనల్, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. డ్యూటీ మీట్లో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, మెడికో లీగల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్, క్రైమ్ సీన్ ఫొటోగ్రఫీ, పోలీస్ పోర్ర్టెయిట్, అబ్జర్వేషన్ టెస్ట్, యాంటీ సబటేజ్ చెక్, డాగ్ స్క్వాడ్, కంప్యూటర్ అవేర్నెస్ తదితర 11 విభాగాల్లో పోటీలు, రాత, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేరస్తులు అనుసరిస్తున్న కొత్త పద్ధతులను అర్థం చేసుకుని, నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా పోలీసులు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరన్నారు. ఎస్పీ స్వయంగా ఫింగర్ ప్రింట్లు తీసే విధానం ప్రదర్శించి సిబ్బందికి శిక్షణ అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఫింగర్ప్రింట్, ఎన్ఐబీ, డీసీఆర్బీ, బీడీ టీం, డాగ్ స్క్వాడ్, రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన డీవైఎస్వో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దయానంద్ రెడ్డి మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట రమేశ్ తదితరులున్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం తలమడుగు: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని సుంకిడి గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ రహీం పాషా, ఎస్సైలు రాధిక, జీవన్రెడ్డి, సర్పంచ్ నర్సమ్మ, ఉపసర్పంచ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతకు ప్రాధాన్యత
ఆదిలాబాద్రూరల్: ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని మామిడిగూడ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. విలేజ్ ఆర్గనైజేషన్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సంఘాల బలోపేతానికి, ఆర్థికస్వావలంబనకు వీవో భవనాలు దోహ దపడతాయన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే పిప్పల్ధరి గ్రామంలో బోనగిరి నారాయణ ఇంటిని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వ పథకాల అమలుతీరు, గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గో వింద్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ధ్రువీకరణ విత్తనాలనే కొనుగోలు చేయాలి ధ్రువీకరణ విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలని కలెక్టర్ అన్నారు. మండలంలోని అంకోలిలో ఏ ర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 86 రైతు వేదికల ద్వారా వికేంద్రీకృత పద్ధతిలో విత్తనాల పంపిణీ చేపడుతున్నామన్నారు. విత్తన మేళా ద్వారా సోయా 1,273.015 క్వింటాళ్లు, కంది 147.73 క్వింటాళ్లు, పెసర 30.44 క్వింటాళ్లు, మినుము 22.17క్వింటాళ్లు, నానో యూ రియా 3,053 సీసాలు, నానో డీఏపీ 1,965 సీసాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపా రు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తన మేళాలు జూన్ 23 నుంచి వారం పాటు కొనసాగుతాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తాయని, నకిలీ విత్తనాల విక్రయదారులపై సీడ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి కైలాస్నగర్: జిల్లాలో ఓటర్ల జాబితా రూపకల్ప న, సవరణ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీఎల్వోలు, ఎన్నికల విభాగం అధికారులతో స మీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్ర జాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోల మ్యాపింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యాన్ని సహించబో మ న్నారు. ఇందులో అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, ఆర్డీవో పి.జగదీశ్వర్రావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నలంద ప్రియ, తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు, బూత్ లెవెల్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
త్వరలోనే విమానాశ్రయానికి శంకుస్థాపన
ఆదిలాబాద్: త్వరలోనే ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి సోమవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించినట్లు వెల్లడించారు. జిల్లా ప్రగతికి విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణానికి ఇప్పటికే గుర్తించిన 1,880 ఎకరాలకు అదనంగా మరో 400 ఎకరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తక్షణమే భూమిని అప్పగించడంతో పాటు, టెర్మినల్ భవనం, విమాన రాకపోకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఒప్పందం కుదిరిందని వివరించారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ.300 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.600 కోట్ల కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. విమానా శ్రయం ద్వారా ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలి పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రఽ దానమంత్రి, కేంద్ర మంత్రుల సమక్షంలో నిర్మాణా నికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అలాగే ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇందులో నాయకులు జోగు రవి, పోషన్న,ధోని జ్యోతి, దయాకర్, నరేష్, విలాస్, రాకేవ్, భీమ్ సేన్ రెడ్డి, శివ, గోపి తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్పై దృష్టి సారించాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ గోడం నగేశ్ రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్కుమార్కు విన్నవించారు. ఢిల్లీలో సోమవారం రాత్రి ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ఈ రైల్వేలైన్ ఏర్పాటైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు ఈ లైన్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ప్రా జెక్టుకు సంబంధించి అప్రూవల్ ప్రక్రియ చివరి దశలో ఉందని, త్వరతగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
అర్హులకే సంక్షేమ పథకాలు
కై లాస్నగర్: ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎ వరైనా అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందాలని, ఆ దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైనథ్ మండల కేంద్రానికి చెందిన 111 మంది డబు ల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు పీఏసీఎస్ చైర్మ న్ గోవర్దన్రెడ్డితో కలిసి ఇంటి పట్టాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఇళ్లు దక్కనివారు అధైర్యపడవద్దని, డబుల్ ఇళ్లకు పక్కనే ఉన్న రెండెకరాల స్థలంలో ఇంటిస్థలాలతో పాటు ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని భరోసాఇచ్చారు. ఇందులో జైనథ్ సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ సంతోష్, ఆత్మ డివిజన్ చైర్మన్ సంతోష్, జైనథ్ తహసీల్దార్ నారాయణ, ఆర్ఐలు ఉల్లాస్, హన్మంత్రావు పాల్గొన్నారు. -
నో ఆన్
అంతా ఆఫ్సాక్షి,ఆదిలాబాద్: ఆన్లైన్లో నిర్వహించాల్సిన టెండర్ ప్రక్రియను ఆదిలాబాద్ మున్సిపల్లో ఆఫ్లైన్లో చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ టెండర్లను అస్మదీ యులకు అప్పజెప్పేందుకు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైకి ఆన్లైన్ టెండర్ అని చెబుతున్నప్పటికీ.. ఆ వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. ఆఫ్లైన్లో టెండర్ ము గించి తామనుకు న్న వారికి ప నులు అప్పజెప్పేందుకు అక్రమంగా వ్యూహ రచన చేశారని తెలుస్తోంది. ఈ వ్య వహారంలో ము న్సి పల్కు చెందిన ఓ కీలక ఇంజినీరింగ్ అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి.. ఈ పనులు నిర్వహించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఎన్ని వచ్చాయనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఆ వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయని చెబుతున్నారే తప్పితే.. నోటిఫికేషన్కు సంబంధించి ఆన్లైన్ వివరాలు వెల్లడించడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా టెండర్ ప్రక్రియ నిర్వహించినప్పుడు దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయడం నిబంధన. ఈ విషయంలో మున్సిపల్ అధికారి వివరణ కోరినప్పుడు మొదట ఐఅండ్పీఆర్కు టెండర్ నోటిఫికేషన్ వివరాలు పంపడం జరిగిందని, ఆ నోటిఫికేషన్ ఏ పత్రికలో వచ్చిందో స్ప ష్టత లేదని.. అక్కడి నుంచి బిల్లుల కోసం వారు పంపినప్పుడు తెలుస్తుందని అన్నారు. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ విషయంలో మరోసారి ఆ అధికారిని వివరాలు కోరినప్పుడు ఓ ప్రధాన పత్రికలో 12వ తేదిన, 15వ తేదిన వచ్చిందని, తన దగ్గర ఆ వివరాలు లేవని, సెక్షన్ అధికారి వద్ద ఉన్నాయని, సమయం దాటిపోవడంతో ఈ రోజు ఆ వివరాలు ఇవ్వలేనని ఆ అధికారి పేర్కొన్నారు. నిబంధనలు ఇలా.. సాధారణంగా రూ.2లక్షలు పైబడిన వర్క్ను తప్పనిసరి ఆన్లైన్లో చేపట్టాలి. దానికి సంబంధించి ముందుగా పేపర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. త ద్వారా కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆ పేపర్ నోటిఫికేషన్ ప్ర స్తుతం తన వద్ద లేదని అధికారి చెప్పడం వెనుక పె ద్ద మతలబే ఉందనే విమర్శలున్నాయి. తాము అనుకున్న కాంట్రాక్టర్కు పనులు అప్పగించేందుకు ఈ వ్యవహారాన్ని మున్సిపల్లో ఓ కీలక ఇంజినీర్ చక్రం తిప్పారనే ప్రచారం సాగుతుంది.గూడుపుఠాణి.. రూ.50లక్షల పనిలో రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు మున్సిపల్ అధికారి స్పష్టం చేశారు. ఈ రెండు దరఖాస్తుల్లో ఓ కాంట్రాక్టర్ బిడ్ కెపాసిటీ కలిగి లేకపోవడంతో అర్హత సాధించలేకపోయాడని వివరించారు. మరో కాంట్రాక్టర్కు పూర్తి అర్హతలు ఉన్నట్లుగా తెలిపారు. ఈ వర్క్ ఎవరికి దక్కిందనేది బుధవారం స్పష్టం చేయనున్నట్లు చెప్పారు. ఈ వర్క్ను తమ అస్మదీయుడికి అప్పగించేందుకే ఇలా ఆఫ్లైన్లో టెండర్ నిర్వహించారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. మరో దరఖాస్తు బిడ్ కెపాసిటీ లేని కాంట్రాక్టర్ ద్వారా వేయించడం వెనుక గూడుపుఠాణి దాగి ఉందని తెలుస్తోంది. ఇక రెండో పని రూ.15లక్షల వర్క్లో ఒకరే టెండర్ దాఖలు చేశారని, ఆయనకు కూడా బిడ్ కెపాసిటీ లేకపోవడంతో రెండోసారి టెండర్ రీకాల్ చేయనున్నట్లు మున్సిపల్ అధికారి స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని మావల, కేఆర్కే కాలనీల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసేందుకు టెండర్లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) రూ.50లక్షలు, రూ.15లక్షలతో రెండు వేర్వేరు పనులు చేపట్టేందుకు ఈ టెండర్లు పిలిచారు. వీధి దీపాలతో పాటు జంక్షన్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం టెండర్లను ఆన్లైన్లో నిర్వహించాలి. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఆఫ్లైన్లో చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
పాఠశాలల బంద్ విజయవంతం
ఆదిలాబాద్టౌన్: ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ మంగళవారం విజయవంతమైంది. ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా పాల్గొనగా పట్టణంలో తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పరిషత్ నాయకులు బంద్ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్లు, షూ, ఇతర వస్తువులు విక్రయిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. కార్యక్రమంలో పరిషత్ నాయకులు పాల్గొన్నారు. -
వన మహోత్సవ లక్ష్యం 38.94లక్షలు
కై లాస్నగర్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ (2026–27) సంవత్సరానికి గాను జిల్లాకు 38.94లక్షల మొక్కలను లక్ష్యంగా కేటాయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. మరోవైపు అవసరమైన మొక్కలను సరఫరా చేసేందుకు డీఆర్డీఏ, అటవీశాఖ నర్సరీలను సిద్ధం చేసింది. నాటేందుకు వీలుగా మొక్కలను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే అటవీశాఖ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించగా మిగతాశాఖలు సైతం ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇతర శాఖల్లో ... సాగునీటి పారుదలశాఖకు 22వేలు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖకు 20వేలు, ఎకై ్సజ్ శాఖకు 6వేలు, పరిశ్రమలు, విద్యాశాఖకు 5వేలు, రెవెన్యూ, ఆర్టీసీ, సోషల్ వెల్ఫేర్, ఉన్నత విద్య, యువజన, సర్వీస్ల, పశు సంవర్ధకశాఖ, విద్యుత్ శాఖలకు వెయ్యి చొప్పున, దేవాదాయశాఖకు 2వేలు, ఇతర శాఖలకు మరో వెయ్యి చొప్పున మొక్కలు నాటేలా లక్ష్యంగా కేటాయించారు. బీసీ వెల్ఫేర్, సివిల్ సప్లై, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఇంటర్మీడియెట్ విద్య, మార్కెటింగ్, మైనార్టీ సంక్షేమం, ఆర్డబ్ల్యూఎస్ వంటి ప్రభుత్వ శాఖలను వన మహోత్సవం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ శాఖలకు ఒక్క మొక్కను కూడా కేటాయించలేదు. నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సరఫరా చేసేందుకు గాను గ్రామాల్లో డీఆర్డీఏ ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేశారు. అలాగే అటవీశాఖ ఆధ్వర్యంలోనూ శాఖా పరమైన ఎనిమిది నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. అవెన్యూ ప్లాంటేషన్తో పాటు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నాటేందుకు వీలుగా ఉండే వేప, మర్రి, రావి, చింత, కానుగ, గుల్మోర్, సుబాబుల్తో పాటు రోడ్లు, ఇళ్లలో నాటేందుకు అవసరమైన గులాబీ, మల్లె, మందార, చామంతి వంటి పూల మొక్కలు, జామ, సీతాఫలం, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచారు. ప్రస్తుతం అన్ని నర్సరీల్లోనూ అందుబాటులో ఉంచారు. వర్షాలు కురిసే కొద్ది శాఖల వారీగా మొక్కలను తీసుకెళ్లి నాటనున్నారు. మున్సిపాలిటీల్లోని వార్డులు, గ్రామాల్లో ప్రజలకు ఒక్కో ఇంటికి ఆరు చొప్పున అందించనున్నారు. డీఆర్డీఏ, అటవీ శాఖలదే కీలక బాధ్యత ప్రభుత్వం ఈ ఏడాదికి గాను జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో అత్యధికంగా డీఆర్డీఏకు నిర్దేశించింది. ఆ తర్వాత ఆదిలాబాద్ మున్సిపల్తో పాటు జిల్లా అటవీ, వ్యవసాయ శాఖలకు కేటాయింపులు చేసింది. మిగతా శాఖలకు సంబంధించి ఖాళీగా ఉన్న ప్రదేశాలు, మొక్కలు నాటేందుకు వీలుగా ఉన్న అవకాశాలకనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ వంటి విద్యాసంస్థల్లోనూ మొక్కలు నాటాలని యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ఇటీవల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా అటవీశాఖ ఇప్పటికే 23వేల మొక్కలను నాటింది. ప్రధాన శాఖల వారీగా మొక్కలు నాటాల్సిన లక్ష్యం శాఖలు నాటాల్సిన మొక్కలు డీఆర్డీఏ 24.87లక్షలు అటవీశాఖ 4.25లక్షలు వ్యవసాయ 2.25లక్షలు ఆదిలాబాద్ మున్సిపల్ 5.10లక్షలు పోలీస్ 80వేలు ఆర్అండ్బీ 50వేలు ఐటీడీఏ ఉట్నూర్ 50వేలు వంద శాతం మొక్కలు నాటుతాం జిల్లాకు కేటాయించిన వనమహోత్సవ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన శాఖలన్నింటికీ లక్ష్యాలను నిర్దేశించాం. ఆదిశగా మొక్కలు నాటేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. లక్ష్యం మేరకు వందశాతం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. – ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్ -
పంట డబ్బులొచ్చినయ్
ఆదిలాబాద్టౌన్: ఆరుగాలం కష్టించి పండించిన పంట దిగుబడులను విక్రయించి నెలరోజులు గడిచినా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఓ వైపు వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడం.. పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వం సోమవారం జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసింది. మార్క్ఫెడ్ అధికారులు సంబంధిత రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే మొదట విక్రయించిన వారికి మాత్రమే ప్రస్తుతం జమ కాగా.. మిగతా వారికి రెండుమూడు రోజుల్లో జమ కానున్నట్లుగా మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. రైతుల్లో హర్షం..గత వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో పత్తి, సోయా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గింది. పంటకు గిట్టుబాటు ధర కూడా లభించలేదు. రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. యాసంగిలో రైతులు జొన్న, మొక్కజొన్న సాగు చేశారు. అయితే ఆశించిన దానికంటే అధిక దిగుబడి వచ్చింది. ఎకరానికి 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు జొన్న పంట పండిందని రైతులు చెబుతున్నారు. ఈ పంటను ప్రభుత్వరంగ సంస్థ మార్క్ఫెడ్ క్వింటాలుకు రూ.3,699 మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయమై మార్క్ఫెడ్ డీఎం మహేశ్కుమార్ను వివరణ కోరగా, ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించి డబ్బులను సోమవారం విడుదల చేసిందని, వాటిని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపారు. మిగతావి రెండు మూడు రోజుల్లో జమ అవుతాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. -
అంగన్వాడీల ధర్నా
కై లాస్నగర్: బీఎల్వో విధుల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు సోమవారం ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ, ఐసీడీఎస్ పనులతో ఇప్పటికే అంగన్వా డీలపై పనిభారం పెరిగిందన్నారు. మౌలిక వ సతులు లేకున్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ క్రమంలో బీఎల్వో విధులు అప్పగించడం సరికాదన్నారు. కార్యకమంలో సంఘ నాయకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
‘అంతా డొల్లా..’పై ఫోకస్
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా ఆ సమూహంలో విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఈనెల 18న ‘అంతా డొల్లా..!’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు ఆ శాఖ అధికారులు స్పందించారు. వరంగల్లో ఎస్ఈ కార్యాలయం ఉండగా, వారి ఆదేశాల మేరకు క్వాలిటీ కంట్రోల్ ఏడీ తిరుపతి, స్థానిక విద్యుత్ శాఖ ఇన్చార్జి ఏడీ జనార్దన్ రెడ్డి, ఏఈ సదానందం సోమవారం ఆ పనులను పరిశీలించారు. విద్యుత్ టవర్లు, స్తంభాలు, కండక్టర్ వైర్లు, సైడ్ ఆర్మ్లు ఇలా అన్ని అంశాల్లో పరిశీలన చేశారు. నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఈ విషయంలో ఆదిలాబాద్ విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావును వివరణ కోరగా, క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు. సాధారణంగా ఇది జరిగేదేనని వివరించారు. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని అందులో సూచిస్తారని పేర్కొన్నారు. -
వన మహోత్సవ లక్ష్యాలు సాధించాలి
కై లాస్నగర్: పర్యావరణం పరిరక్షించేలా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను వందశాతం సాధించాలని ఎఫ్డీవో చిన్నవిశ్వనాథ్ బూసిరెడ్డి అన్నారు. వనమహోత్సవ కార్యక్రమ నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాకు 39లక్షల 500 మొక్కలను ప్రభుత్వం లక్ష్యంగా ఖరారు చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వనమహోత్సవంలో పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. వారి తో మొక్కలు నాటించడంతో పాటు సంరక్షించే బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ మాట్లాడుతూ, మొక్కలు నాటే ఫొటోలను జిల్లా అధికా రుల గ్రూప్లో తప్పనిసరిగా పోస్టు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బట్టల దుకాణంలో పుస్తకాల అమ్మకం
మంచిర్యాలఅర్బన్: ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు పాతరేశాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నాయి. ఈ నెల 6న ‘పుస్తకాలు, ధరల మోత’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అనుమతి, ఎమ్మార్పీ లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని సోమవారం మంచిర్యాలలో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్థానిక గౌతమినగర్లో ట్రినిటీ హైస్కూల్ ఎదురుగా ఉన్న దుకాణాల్లో ఎమ్మార్పీ లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని పీడీఎస్యూ, ఏఐఎస్బీ, యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మంచిర్యాల ఎంఈవో మాళవీదేవికి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు విద్యాశాఖ సహాయ సంచాలకులు(ఏడీ) లలిత, ఎంఈవో మాళవీదేవి దుకాణాన్ని సందర్శించి సీజ్ చేశారు. మార్కెట్ రోడ్డులోని బట్టల దుకాణంలో పుస్తకాలు విక్రయిస్తున్నారని ఓ పేరెంట్ ఫిర్యాదు చేయగా.. విద్యాశాఖ అధికారులు తనిఖీ చేశారు. గ్రీన్వుడ్ పాఠశాలకు చెందిన పాఠ్యపుస్తకాలు లభ్యం కావడంపై ఏడీ లలిత, ఎంఈవో మాళవీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలు ఎందుకు ఉన్నాయని యజమానిని ప్రశ్నించగా.. ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చామంటూ సమాధానం ఇచ్చారు. దుకాణాన్ని సీజ్ చేయడంపై మల్లగుల్లాలు పడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భద్రత కల్పించారు. సోమవారం రాత్రి వరకు పుస్తక దుకాణం సీజ్పై ఎటూ తేల్చలేదు. ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈవో మాళవీదేవి తెలిపారు. తనిఖీల విషయం తెలుసుకుని పాత కలెక్టరేట్ సమీపంలో కార్పొరేట్ పాఠశాల పుస్తకాలు విక్రయిస్తున్న మరో బట్టల దుకాణం నిర్వాహకుడు, ఇతర అనుబంధ పుస్తక దుకాణాల యజమానులు దుకాణాలు మూసివేయడం గమనార్హం. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
దస్తురాబాద్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మున్యాల తండాకు చెందిన బానవత్ రాజు(48)కు భార్య వనిత, ఇద్దరు కుమారులు శంకర్, సాయి, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. ఇద్దరు కుమారులు విదేశాలలో ఉద్యోగాలు కోల్పోయి ప్రస్తుతం ఇంటివద్ద ఖాళీగా ఉంటున్నారు. దీనికి తోడు కుమార్తె న్యూమోనియా వ్యాధి బారిన పడటంతో చికిత్స నిమిత్తం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని తండ్రి సక్లనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై యువకుడు.. సాత్నాల: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు బోరజ్ మండలం పెండల్వాడకు చెందిన గేడం జ్ఞానేశ్వర్ (23) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సావాపూర్లో ఒక ఇంట్లో వంట చేయడానికి వెళ్లిన అతని తల్లి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి విగత జీవుడై కనిపించాడు. మృతుని తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి, చెల్లితో ఉంటున్నాడు. పాముకాటుకు ఒకరు మృతి కాగజ్నగర్టౌన్: మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన బొమ్మెళ్ల సత్తయ్య (63) పాముకాటుతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఇంటి ఆవరణలో నేలపై నిద్రిస్తున్న సత్తయ్యను పాము కాటువేయగా కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామ సమీ పంలోని పెన్గంగ నది ఒడ్డున సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గమనించిన పంచా యతీ కార్యదర్శి సందీప్ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై సాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి 30 నుంచి 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటుందని, నీలం రంగు షర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఎడమచేతికి, ఎడమ కాలికి నల్లని దారం కలిగి ఉన్నాడని, గుర్తుపట్టిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బాసర గోదావరిలో యువకుడి మృతదేహం బాసర:బాసర గోదావరిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. భైంసాలోని కొర్బగల్లి గ్రామానికి చెందిన బొండ్ల అక్షయ్ కుమార్ (23) ఈ నెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. 21న అతని మోటార్ సైకిల్ గోదావరి వంతెన సమీపంలో లభ్యమైంది. సోమవారం ఉదయం బాసర గోదావరి ప్రధాన ఘాట్ ఎదురుగా నదిలో మృతదేహం లభ్యమైంది. మృతుని తండ్రి బొండ్ల నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలు కోటపల్లి: మండలంలోని పార్పల్లి సమీపంలోని 63వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. పిన్నారంకు చెందిన ఆటో డ్రైవర్ కుదురుపాక సతీశ్ చెన్నూర్ నుంచి పార్పల్లి వైపు వెళ్తుండగా ఫారెస్టు చెక్పోస్టు సమీపంలోకి రాగానే ఎదురుగా సిరోంచ నుంచి వస్తున్న సర్వేంద్ర అనే కారు డ్రైవర్ ఫారెస్టు చెక్పోస్టు టోల్ ఛార్జీలు పడకుండా ఉండేందుకు ఎదురుగా వస్తున్న ఆటో రూట్ నుంచి వెళ్లే క్రమంలో ఆ టోను ఢీకొట్టాడు. దీంతో ఆటో రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కొప్పుల బాపు, ఇరుగురాల్ల సాత్వికకు స్వల్పంగా డ్రైవర్ సతీష్కు తీవ్రగాయాలుకాగా 108లో చెన్నూర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. -
అర్హులందరికీ ఓటు హక్కు
ఆదిలాబాద్: అర్హులందరికీ ఓటు హక్కు ఉంటుందని, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో సరిచూసుకోవాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సోమవారం ‘సర్’ కార్యక్రమం, నషా ముక్త్ భారత్పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా చేపట్టిన 2కే రన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ ఓటరు తమ వివరాలను ఎన్యుమరేటర్లకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం 20 ఏళ్లకు ఒకసారి చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా 2002 నాటి గణన ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఓట్ల తొలగింపుపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఎన్యుమరేషన్ ఫారం నింపి తమ ఓటును సుస్థిరం చేసుకోవాలని సూచించారు. అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నషా ముక్త్ భారత్ సాధనలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం రన్లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఇందులో డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీఎంహెచ్వో సాధన, డీవైఎస్వో దయానంద రెడ్డి, డీడబ్ల్యూవో మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
దుబాయ్లో చిక్కుకున్న తల్వేద వాసి
నిర్మల్ ఖిల్లా: నిర్మల్ రూరల్ మండలం తల్వేదకు చెందిన గడ్చంద సాయన్న ఉపాధి నిమిత్తం ఏడాదిన్నర క్రితం యూఏఈలోని దుబాయ్కి వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సోనాపూర్ కార్మికుల శిబిరంలో నివాసముంటున్న సాయన్నకు ఇటీవల పక్షవాతం వచ్చింది. తోటి కార్మికులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో సాయన్నను స్వదేశానికి పంపించాలని అతని భార్య కమల, కుమారుడు అజయ్ పలుమార్లు కంపెనీ యాజమాన్యాన్ని, సంబంధిత ఏజెన్సీని కోరినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి సమస్య విన్నవించారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కార్యాలయానికి, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు ఈ మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేశామని, వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని భరోసానిచ్చారు. -
కాగితపు రశీదులకు ఇక చెల్లు
నిర్మల్చైన్గేట్/కాగజ్నగర్టౌన్: మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చే కాగితపు రశీదులకు కాలం చెల్లింది. పేపర్ లెస్ పాలనలో భాగంగా నిర్మల్, కుమురంభీం జిల్లాల్లోని 126 మీసేవ కేంద్రాల్లో ఈ నెల 19 నుంచి డిజిటల్ రశీదుల విధానం అమల్లోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (మీసేవ) కమిషనర్ ఆదేశాల మేరకు.. ఇకపై కాగితపు ప్రింట్లకు బదులుగా దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ హైపర్ లింక్ వస్తుంది. పాత పద్ధతిలో ప్రింట్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఎంఎస్ డిలిటైనా తిరిగి పంపించే సౌకర్యం ..మొబైల్కు వచ్చిన ఎస్ఎంఎస్ పొరపాటున డిలిట్ అయినా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీసేవ అప్లికేషన్లో సదరు ఎస్ఎంఎస్ను తిరిగి పంపించే సౌకర్యాన్ని కల్పించారు. దరఖాస్తుదారులు కోరితే ఆపరేటర్లు మళ్లీ మెసేజ్ పంపేలా సహాయం అందిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..కొత్త నిబంధనల ప్రకారం.. జిల్లాలోని మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తు దారుల నుంచి కచ్చితమైన, యాక్టివ్ ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. జూన్ 19 నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు) రశీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి పాత పద్ధతిలోనే కాగితపు రశీదులు జారీ చేస్తే జిల్లాలోని సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని ఐటీ, ఈఎస్వో కమిషనర్ ఉత్తర్వులుల్లో హెచ్చరించారు. అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెక్ట్ మొబైల్ నంబర్ను మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్లో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. మరింత మెరుగు మీ సేవ కేంద్రాల్లో రెవెన్యూ లాగిన్లో ప్రజలు ఆదాయ, నివాస, కుల, సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫిజికల్ దరఖాస్తు ఫారాలు కార్యాలయాలకు పంపిస్తే అక్కడ అధికారులకు దొరక్క నెలల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి. మళ్లీ జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పేపర్లెస్ సేవలతో ఆ పరిస్థితి ఉండదు. – సిరాజ్, మీసేవ కేంద్రం నిర్వాహకుడు, కాగజ్నగర్ పక్కాగా అమలు జిల్లాలో పేపర్లెస్ సేవలు ఈ నెల 19 నుంచి పక్కాగా అమలు చేస్తున్నాం. ప్రజలు దరఖాస్తు చేసుకున్న అనంతరం వారికి మొబైల్లో మెసేజ్ వస్తుంది. సంబంధిత కార్యాలయ అధికారి లాగిన్లోకి దరఖాస్తు చేరుకుంటుంది. ప్రజల దరఖాస్తు స్థితిని మొబైల్లోనే చూసుకోవచ్చు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. – గౌతం, మీసేవ కేంద్రాల జిల్లా అధికారిరశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధానం అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీ సేవ కేంద్రాల్లో పేపర్ రశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం. – నదీమ్, ఈ మేనేజర్, నిర్మల్మొబైల్, రశీదు లింక్..కొత్త విధానం ప్రకారం.. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే, దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్ లింక్ ఉంటుంది. పౌరులు ఆ లింక్పై క్లిక్ చేసి తమ అక్నాలెడ్జ్మెంట్ రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు.. డౌన్లోడ్ చేసు కోవచ్చు.. లేదా ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు ఈ ఎస్ఎంఎస్ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు. -
సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎప్సెట్ అర్హత సాధించిన విద్యార్థుల సర్టి ఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం ప్రా రంభమైంది. పట్టణంలోని సంజయ్గాంధీ పాలిటెక్నికల్ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పరిశీలనలో తొలి రోజు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ముందుగా నమోదు చేసుకున్న ప్రకారం సర్టి ఫికెట్లను పరిశీలించారు.తొలి రోజు 210 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 202 మంది హాజరైనట్లుగా ప్రిన్సిపాల్ డి.నరేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
అటవీ అధికారులపై దాడికి యత్నం
జన్నారం: పెట్రోలింగ్కు వెళ్లిన అటవీశాఖ అధికారులపై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన జన్నారం రేంజ్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు జీపు డ్రైవర్ సాజిద్, అటవీ అధికారుల కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మండలంలోని బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాల సమీపంలో పైడిపల్లి బీట్ ఆఫీసర్ శ్రీకాంత్, రాయికుంట బీట్ ఆఫీసర్ మక్బూల్, తాళ్లపేట బీట్ ఆఫీసర్ ఎండీ రహీమొద్దీన్, బేస్ క్యాంపు సిబ్బంది ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. అధికారుల రాక ను గమనించిన దుండగులు అసభ్య పదజాలంతో ధూషిస్తూ వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బేస్ క్యాంపు మంచెను పాక్షికంగా ధ్వంసం చేశారు. అప్రమత్తమైన అటవీ సిబ్బంది, జీపు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఈ విషయమై జన్నారం ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ జి.వికాస్ను సంప్రదించగా దాడికి యత్నించిన మాట నిజమేనని, ఈ విషయంపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ను సంప్రదించగా అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు. -
బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి
నేరడిగొండ: బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండలంలోని కామట్వాడ సర్పంచ్ మడావి మాధవ్రావ్, ఉప సర్పంచ్ గోవింద్ తమ అనుచరులు 75 మందితో కలిసి సోమవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నా రు. రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్, సీనియర్ నాయకులు కేమ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ సంతోష్, మాజీ సర్పంచ్ లింబాజీ, రమణరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
‘అన్న అక్క’తో ఏఐ బోధన
ఆదిలాబాద్టౌన్: ప్రస్తుత కాలంలో సాంకేతికత ప్రతీ రంగాన్ని ప్రభావితం చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలోనూ మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను పరిచయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం డిగ్రీ విద్యార్థులను సంసిద్ధం చేసింది. ఒకప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిందే విద్యార్థులకు జ్ఞాన వనరుగా ఉండేది. ప్రస్తుతం ఏఐ సాయంతో విద్య మరింత సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్న అక్క మెంటర్షిప్ టీచింగ్ ఇంటర్షిప్’ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. జూలై 1 నుంచి డిగ్రీ విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. వారికి ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏఐ కంప్యూటర్ విద్యను బోధించనున్నారు. లెక్చరర్లు, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ.. ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులతో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ విద్యాబోధన చేయనుంది. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఇటీవల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఐ బోధనలో విద్యార్థులకు స్నేహపూర్వకంగా మార్గనిర్దేశం చేసే డిజిట ల్ పాత్రలను రూపొందించారు. పాఠ్యాంశాలను కేవలం చదవడం కాకుండా చిత్రాలు, యానిమేషన్లు, వీడియోలు, కథలు, ప్రశ్నోత్తరాల రూపంలో అందించడం ద్వారా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. పాఠాలు వినడం, చూడడం, ఆచరణలో పెట్టడం ద్వారా అభ్యసన మరింత ప్రభావవంతంగా మారుతోంది. విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి.. జిల్లాలో నాలుగు ప్రభుత్వం డిగ్రీ కళాశాలలతో పాటు ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది. పట్టణంలో ప్రభుత్వ సైన్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్, ఇచ్చోడ, ఉట్నూర్లలో ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. వీటిలో చదివే ఫైనలియర్ విద్యార్థులు 30 గంటల తరగతులు బోధించాల్సి ఉంటుంది. నెల నుంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు గాను డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ పాయింట్లు కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా ప్రతీవిద్యార్థి నేర్చుకునే సామర్థ్యం ఒకేలా ఉండదు. కొందరు వేగంగా అర్థం చేసుకుంటే, మరికొందరికి అదనపు సమయం అవసరం అవుతుంది. ఏఐ ఆధారిత బోధన ద్వారా ప్రతీ విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, వారికి తగిన విధంగా పాఠ్యాంశాలు అందించే అవకాశం కలుగుతోంది. దీంతో వెనుకబడిన విద్యార్థులు కూడా ఇతరులతో సమానంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. నైపుణ్యాలు పెంపొందించేందుకు.. విద్యార్థులు కంప్యూటర్, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతగానో దోహద పడనుంది. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండడంతో ఇప్పటి నుంచే విద్యార్థులకు పరిచ యం చేస్తున్నారు. దీంతో వారిలో సృజనాత్మకత, స మస్య పరిష్కార సామర్థ్యం, డిజిటల్ అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెంపొందుతాయి. ఏఐ ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ వారి పనిని మరింత సులభతరం చేసే సాధనంగా మారుతుందని లెక్చరర్లు చె బుతున్నారు. పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయడం, విద్యార్థుల ప్రగతిని విశ్లేషించడం, అదనపు అభ్యాస సామగ్రిని అందించడం వంటి అంశాల్లో ఏఐ సహా యపడుతోందని పేర్కొంటున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలు, విద్యుత్ సదుపాయాలు వంటివి అధిగమిస్తే ఈ కార్యక్రమం విద్యారంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.పాఠాలతో పాటు ఏఐపై అవగాహన..అన్న అక్క మెంటర్షిప్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి ప్రారంభించనుంది. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు సమీపంలోని పాఠశాలలకు వెళ్లి ఏఐ విద్యాబోధన చేస్తారు. విద్యార్థులకు ఏఐపై అవగాహన, డిజిటల్ లిట్రసీ, కంప్యూటేషనల్ థింకింగ్, కోడింగ్ ప్రాథమిక అంశాలను నేర్పిస్తారు. ఇటీవల డిగ్రీ విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఈ అంశాలపై శిక్షణ కల్పించాం. జిల్లాలో నాలుగు ప్రభుత్వ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. – అరుణ్, నోడల్ అధికారి -
భవిష్యత్తు బీఆర్ఎస్దే
నేరడిగొండ: తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ దేన ని, బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్ర జలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఎమ్మె ల్యే డాక్టర్ అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని గుత్పాల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు మళ్లీ గు లాబీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారిలో ఉడుగుల సురేష్, బట్టు నర్సయ్య, ఒడ్డెపల్లి సురేష్, దావుల ఆడేళ్లు, ఉడుగు ల పెద్ద గంగయ్య, కొండ గంగయ్య, బోగి మల్ల య్య, దశకంటి రాములు, దావుల శివయ్య, సుధీర్, శ్రీకాంత్, సతీష్, నవీన్, ప్రవీణ్, నగేష్, సంజు, లక్ష్మణ్, భీంరావ్, భాస్కర్, సాగర్, కృష్ణ, సంతోష్, రాజు తదితరులున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సోమేశ్, రాథోడ్ సురేందర్, సుజీల్, సాబ్లే సంతోష్, బాబులాల్, కై లాస్ తదితరులు పాల్గొన్నారు. -
భూసర్వే సాధ్యమేనా?
కై లాస్నగర్: భూ వివాదాలు, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టాలని నిర్ణయించింది. దశలవారీగా ఈ ప్రక్రి య నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం జి ల్లాలోని 70 గ్రామాలను ఎంపిక చేసింది. అయితే ఈ సర్వే సాఫీగా సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రెగ్యులర్ సర్వేయర్ల కొరత, లైసెన్స్డ్ సర్వేయర్లు విధుల నిర్వహణకు విముఖత వ్యక్తం చేయడమే కారణంగా తెలుస్తోంది. 21 మండలాలు.. 10 మందే సర్వేయర్లు జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖను సర్వేయర్ల కొరత వేధిస్తుంది. జిల్లావ్యాప్తంగా 21 మండలాలకు గాను కేవలం పది మంది మాత్రమే రెగ్యులర్ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్కు రెండేసి మండలాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే దరఖాస్తులు అధికంగా వస్తుండటంతో వారు ఏ మండలంలో సర్వే నిర్వహించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పనిభారం పెరగడంతో సకా లంలో సర్వే చేపట్టలేని పరిస్థితి. దీంతో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. భూ సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు సర్వేయర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో గ్రామాల్లో భూ సమస్యలు, వివాదాలు అధికమవుతున్నాయి. లైసెన్స్డ్ సర్వేయర్ల విముఖత జిల్లాలో ఇప్పటికీ నిజాం కాలంనాటి సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతున్నందున భూముల విభజనలు, బైనంబర్ల సంఖ్య రోజురోజుకు పెరుగతున్నాయి. సరిహద్దులు మారడంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో భూ వివాదాలు అధికమవుతున్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించి బాధిత రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమగ్ర రీసర్వేకు నిర్ణయించింది. తొలి విడతలో 70 గ్రామాలను ఎంపిక చేసింది. స్పష్టమైన హ ద్దులు నిర్ణయించి, ప్రతీ సర్వేనంబర్కు భూదార్ కే టాయించాలనే ఉద్దేశంతో ఈప్రక్రియ చేపడుతుంది. సర్వేయర్లు తగినంత లేకపోవడంతో ఇటీవల ని యమించిన లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా చేయించా లని భావిస్తోంది. ఇందుకోసం ఎకరం సర్వేకు రూ. 50 చొప్పున వారికి చెల్లించాలని నిర్ణయించింది. అ యితే ఇదితమకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో స ర్వే విధులపై వారు విముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వారితో అదనపు కలెక్టర్ సమావేశమయ్యారు.ప్రభుత్వం ప్రకటించిన ఎకరానికి రూ. 50 గిట్టుబాటు కాదంటూ అదనపు కలెక్టర్ ఆర్ఎస్. చిత్రుకు వినతిపత్రం అందజేసి తమనిరసన వ్యక్తం చేశారు. స్కీల్డ్ వర్కర్లకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే నిర్వహణ ముందుకు సాగుతుందా లేదా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారానే సర్వే భూ వివాదాలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేకు ఆదేశించింది. తదనుగుణంగా జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేశాం. త్వరలోనే గెజిట్ జారీ చేసి లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా ప్రక్రియ నిర్వహించాలని భావిస్తున్నాం. వారు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరులోపు పీఆర్సీ ప్రకటించా లని, పెండింగ్లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించా లని పేర్కొన్నారు. పాఠశాలల కుదింపు చర్యలు నిలిపివేయాలన్నారు. ఇన్సర్వీస్ టీచర్లకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక టెట్ నిర్వహించాలని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో బదిలీలు, పదో న్నతులు చేపట్టాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బాధ్యులు శ్రీనివాస్, స్వామి, శివన్న, శ్యామ్సుందర్, సురేష్, అశోక్, మహేందర్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్
కై లాస్నగర్: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ జిల్లాలో ప్ర శాంతంగా ముగిసింది. 1,763 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఏడు కేంద్రాలను ఏర్పాటు చే శారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష సాగింది. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో విద్యార్థులను ఉదయం 11 నుంచి మ ధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్ణీత సమయం ముగిసిన వెంటనే గేట్ల ను మూసివేశారు. పరీక్షకు 1583 మంది హాజరుకాగా 180మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఆయా కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ అమలు చేశారు. పలు కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహా జన్ పరిశీలించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ పరి శీలించి పరీక్ష నిర్వహణపై ఆరా తీశారు. పకడ్బందీ గా ప్రశాంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూ చించారు. వారి వెంట అదనపు ఎస్పీ సురేందర్రావు, ఆర్డీవో జగదీశ్వర్ రావు తదితరులున్నారు. -
ఆసనాలు అదుర్స్
యోగా ఆసనాలు వేస్తున్న కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ఆదిలాబాద్టౌన్:/కై లాస్నగర్: యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిక్షకుల సూచనలకు అనుగుణంగా ఆసనా లు ఆచరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, యోగాతో మానసిక ఒత్తిడిని దూరం కావచ్చన్నారు. బ్రహ్మ కుమారీస్కు సంబంధించిన యోగా పోస్టర్ ఆవిష్కరించి, శిక్షకులను సన్మానించారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎంహెచ్వో సాధన, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీవైఎస్వో దయానంద్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఈవో మాధవి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆయుష్ వైద్యులు చంద్ర శేఖర్, ప్రీతి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై యోగా ఆసనాలు చేశారు. అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కోర్టులో.. జిల్లా కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రభాకర రావు మాట్లాడుతూ యోగా నిత్య సా ధనతో రోగాలు దరిచేరవని పేర్కొన్నారు.ఇందులో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, జడ్జిలు హుస్సేన్, డ్యానిరుత్, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా జైలులో.. జిల్లా జైలులోనిర్వహించిన కార్యక్రమంలో సిబ్బంది, ఖైదీలు యోగా ఆసనాలు చేశారు. జైలు సూపరింటెండెంట్ గోపి రెడ్డి, జైలర్ చంద్రశేఖర్, సుధలక్ష్మి, సాయికిరణ్, నాగరాజు, అంజయ్య, సాంబయ్య, రమేశ్, మోసిన్, దామోదర్, సునిత, అశో క్, మహేందర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ కార్యాలయంలో.. ఉట్నూర్రూరల్: స్థానిక కుమురంభీం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి పీవో మకరందు ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు, ఆశ్రమ గిరిజన విద్యార్థినులతో కలిసి యోగాసనాలు ఆచరించారు. ఇందులో ఏపీవో వసంతరావు, ఏపీవో (పీవీటీజీ) ఆత్రం భాస్కర్, డీడీ ప్రేమకళ, డిప్యూటీ డీఈ చందన్పాల్గొన్నారు. -
కేటీఆర్కు ఘన స్వాగతం..
నేరడిగొండ: జిల్లాకు విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు స్థానిక బీఆర్ఎస్ నాయకులు టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు.వైఎస్సార్ హయాంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధిఆదిలాబాద్: వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్రెడ్డి అన్నారు. జిల్లాలో చనాఖా –కోరటా బ్యారేజీకి మాజీ మంత్రి దివంగత సీఆర్ఆర్ (సి.రామచంద్రారెడ్డి) పేరును నామకరణం చే స్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా మండలకేంద్రంలో శనివారం సంబరాలు నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు క్షీరా భిషే కం చేశారు. జిల్లాలో రిమ్స్ ఆస్పత్రి, మత్తడివాగు వంటి ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు దివంగత నేత వైఎస్సార్ కారణమని, వీటి నిర్మాణంలో సీఆర్ఆర్ చొరవ ఉందని కొనియాడారు. పార్టీ మండల అధ్యక్షుడు రూప్రావు, రాందాస్, వామన్ వంకడే, గాన్ శ్యామ్, సంజీవ్ తదితరులు ఉన్నారు. -
● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ● యోగాపై పెరుగుతున్న ఆసక్తి ● నిత్యజీవితంలో భాగం ● వ్యాయామాలకు మేలు
చిన్ననాటి నుంచే రాణిస్తూ చిన్ననాటి నుంచి యోగాలో రాణిస్తున్నా. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించా. ఈ ఏడాది జనవరిలో కామారెడ్డి యోగా భవన్లో రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–18 విభాగంలో బంగారు పతకాలు సాధించి సౌజ్ జోన్ పోటీలకు ఎంపికయ్యా. అక్కడ రాణించకపోయినా, యోగాలో శిక్షణ పొందుతున్నా. – చైత్ర, రామకృష్ణాపూర్‘యోగా’గురువు.. మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన మండ శ్రీనివాస్ యోగా గురువుగా పిలుస్తుంటారు. గుడిపేట్ 13వ బెటాలియన్లో శిక్షణ పొందుతున్న పోలీసులకు యోగా నేర్పిస్తున్నారు. జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీగా ఉంటూనే, వెయ్యికి పైగా విద్యార్థులను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి వెళ్లేలా వారికి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. యోగా శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతూ, శిక్షకులు, జడ్జిలను తయారు చేస్తున్నారు. పతకాలు రాణించేలా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుస్తున్నారు. మండ శ్రీనివాస్, జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీపీడీ ప్రోత్సాహంతో.. దండేపల్లి: నేను దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. పీడీ రవి ప్రోత్సాహంతో రెండేళ్లుగా యోగాలో రాణిస్తున్నా. పలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నా. సీఎంకప్, మండల, జిల్లా, జోనల్ పోటీల్లో పాల్గొన్నా. హెచ్ఎం రాజేశ్వర్రావు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతి సాధించడమే తన లక్ష్యం. – యోగా ఆసనం వేస్తున్న విజయ్ ఆసక్తితో శిక్షణ మా తల్లిదండ్రులు అనురాధ, మోహన్ ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. తనకు యోగాపై ఉన్న ఆసక్తితో శిక్షణ ఇప్పించారు. ఈ ఏడాది జనవరిలో కామారెడ్డి యోగా భవన్లో రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి సౌత్జోన్కు ఎంపికయ్యా. అక్కడా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నా. ప్రస్తుతం హైదరాబాద్లో యోగా శిక్షణ ఇస్తున్నా. – సి. వైష్ణవి, మంచిర్యాలశిక్షకుడిగా పనిచేస్తున్నా నిర్మల్ఖిల్లా: 2018లో ఎంటెక్ పూర్తి చేశాక.. యోగాపై ఆసక్తి పెరిగింది. గురువు అన్నపూర్ణ వద్ద యోగాసనాల సాధన చేశా. యోగా తో ఆరోగ్య ప్రయోజనాలు నలుగురికి చెప్పాలన్న తపనతో అన్ని మెలకువలు నేర్చుకుని శిక్షకుడి అయ్యాను. యోగాలో లెవెల్–3 శిక్షణ పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖలో కాంట్రాక్ట్ శిక్షకుడిగా పనిచేస్తున్నా. – ఎం.ప్రదీప్, యోగా శిక్షకుడు, ఆయుష్శాఖ, నిర్మల్ పట్టుదలతో సాధన చేస్తూ.. ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్కు చెందిన చౌహాన్ ప్రజ్యోత్సింగ్ యోగాలో పట్టుదలతో సాధన చేస్తూ జాతీయ స్థాయి సత్తాచాటుతున్నాడు. యోగాలో ఎం.ఏ చదువుతున్న ఈయన చిన్నప్పటి నుంచే యోగాపై ఆసక్తి ఉండేది. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. హర్యానాలో బంగారు పతకం సాధించాడు. రాష్ట్ర స్థాయిలో 11 మీట్లలో పాల్గొని 16 స్వర్ణం, 8 రజతం, 4 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఉదయ్ సింగ్, శారద ప్రోత్సాహం, గురువులు చేతన్, తిరుపతి రెడ్డిల శిక్షణే తన విజయాలకు కారణమని తెలిపాడు. భవిష్యత్తులో యోగా ప్రొఫెసర్గా స్థిరపడి, సొంతంగా యోగా స్టూడియోను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమంటున్నాడు. ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ మంచిర్యాలటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కిడ్జీ స్కూల్ చైర్మన్ దామెర సిద్దయ్య అన్నారు. జిల్లా కేంద్రం లక్ష్మీనగర్ స్కూల్లో శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి ఫాదర్స్ డే, యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తండ్రి గొప్పతనాన్ని తెలిసేలా నృత్యాలు పాటలతో అలరించారు. అనంతరం యోగా మాస్టర్ ఎం.శంకర్ అభ్యాసకులతో ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమారాణి, టీచర్లు ,సిబ్బంది పాల్గొన్నారు. పతకాలు తన ఖాతాలోకి.. ఆదిలాబాద్: తలమడుగు మండలం అర్లి(కె) గ్రామానికి చెందిన బొండ్ల భార్గవ్ యోగాలో సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈయన పదేళ్లుగా యోగాలో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 8 జాతీయ, 10 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నాడు. 7 స్వర్ణ, 3 రజత, 4 కాంస్యంతో కలిపి 14 పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తండ్రి ఆర్ఎస్ఎస్లో యోగా చేయడం చూసి స్ఫూర్తి పొందిన భార్గవ్, కోచ్ సంతోష్ శిక్షణ, తల్లిదండ్రులు, అన్న మద్దతు తన విజయాలకు కారణమని చెబుతాడు. భవిష్యత్తులో వరల్డ్ ఛాంపియన్ అథ్లెట్గా ఎదగాలని, అదే సమయంలో ఒక మంచి ఫిజియోథెరపిస్ట్గా సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక యోగా. ప్రపంచ దేశాలు ఆమోదించాయి. నేటి కాలంలో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గొప్ప విరుగుడు. రోజూ ఒక గంట చేస్తే, ప్రతీ ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. – ముల్కల శంకర్, యోగా గురువు, మంచిర్యాల మెలకువలు నేర్చుకుని కుంటాల: కుంటాలకు చెందిన చిన్నారులు మోక్ష, షర్ణిక.. యోగాలో సత్తాచా టుతున్నారు. గత రెండేళ్లుగా యోగా శిక్షణలో మెలకువలు నేర్చుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. వారిని పలువురు అభినందిస్తున్నారు. షర్ణికమోక్షఒత్తిడి దూరం రోజువారీ యోగాతో ఒత్తిడి దూరమవుతోంది. మానసిక ప్రశాంత చేకూరి, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చక్కని ఔషధం. – పి.హన్మంతరావు, డీఏవో, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుసులువుగా ఆసనాలు వేస్తున్నా నాకు మైగ్రేన్, వెన్నునొప్పి ఉండేది. యోగా మొదలుపెట్టా. క్రమంగా తగ్గిపోయి, ఉత్సాహంగా మొదట ఆసనాలు కష్టమనిపించినా ఇప్పుడు సులువుగా వేస్తున్నా. – కె.నీరజ, లక్ష్మీనగర్, మంచిర్యాల సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒత్తిడిని దూరం చేసి, మనస్సును ఏకం చేసి శరీరాన్ని అదుపులో పెట్టేందుకు పలువురు యోగా బాట పడుతున్నారు. ఒంటికి యోగా మంచిదేనని పేర్కొంటున్నారు. ముందే ప్రారంభించాలి ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి. వ్యాధులు వచ్చాక చేయడం కన్నా, ముందు నుంచే ప్రారంభిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయి. – వొడ్నాల శ్రీనివాస్, వ్యాపారి, మంచిర్యాలఇంట్లో అందరం చేస్తాం మా ఇంట్లో అందరం యోగా చేస్తాం. మెరుగైన జీవనం ప్రతిఒక్క రూ అలవాటు చేసుకో వాలి.– కుమార స్వామి, ల్యాబ్ టెక్నీషియన్, మంచిర్యాల ప్రతీ రోజూ చేస్తా ప్రతీ రోజూ యోగా చేస్తాను. వయస్సురీత్యా వచ్చే రుగ్మతలతోపాటు, మానసిక ప్ర శా ంతతను కూడా అందిస్తోంది. – గజ్జెల్లి వెంకటయ్య, విశ్రాంత సింగరేణి కార్మికుడు, మంచిర్యాల పోటీ ప్రపంచంలో జీవనం ఉరుకులు, పరుగులమయమైంది. మానసిక, వ్యక్తిగత ఒత్తిళ్లతో అనారోగ్యం బారినపడుతున్నారు. ఇందుకు ఉపశమనం పొందేలా యోగాసనాలు చేస్తున్నారు. అన్నివర్గాల్లో ఆసక్తి పెరగడం, నిత్యజీవితంలో మానసిక ప్రశాంతత, వ్యాయామ సాధనకు యోగాసనాలు ఓ భాగమైంది. నేడు అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా కథనం. -
నాన్న మాటే.. విజయానికి బాట..
నిర్మల్ ఖిల్లా: జీవితంలో తండ్రి ఇచ్చే మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అమూల్యమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గోమస జసింత్ జోయల్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి డేనియల్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన విజయ ప్రయాణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మల్కు చెందిన ‘జసింత్ జోయల్‘ బీటెక్ 2020లో పూర్తిచేశారు. అనంతరం గ్రూప్–1 లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిర్మల్లోని సోఫీనగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తన తండ్రి డేనియల్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో ఆరేళ్లపాటు కొడుకుతోపాటు అక్కడే ఉన్నారు. గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ప్రతీ అంశాన్ని తండ్రితో చర్చించేవాడినని జసింత్ తెలిపారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి చదువుకు సంబంధించిన అంశాలతోపాటు ఆర్థిక స్వేచ్ఛ, పొదుపు, కుటుంబ బంధాలు, జీవన విధానం వంటి విషయాలపై విలువైన సూచనలు, సలహాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహమే గ్రూప్–1లో విజయానికి బాటలు వేశాయని తెలిపారు. ప్రస్తుతం తాను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘నాన్న... మీ ప్రేమ, ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే మా జీవితాలకు బలమైన పునాది. థాంక్యూ డాడీ... హ్యాపీ ఫాదర్స్ డే’ అని జసింత్ జోయల్ భావోద్వేగ సందేశాన్ని ‘సాక్షి’ తో పంచుకున్నారు.. -
క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి
కై లాస్నగర్: పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక ఏఆర్ హెడ్క్వార్టర్స్లో పోలీసులు శనివారం పరేడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూ చించారు. చట్టం ముందు అందరూ సమానమేవన ని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పి ఎల్.జీవన్రెడ్డి, సీఐలు బి.సునీల్కుమార్, చంద్రశేఖర్, బిడి.ప్రేమ్ కుమార్, కె.ఫణిదర్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, ఎన్.చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్ట ర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు. నేరాల నియంత్రణపై దృష్టి సారించాలిఆదిలాబాద్టౌన్: ఆర్థికనేరాలు నియంత్రించేలా రా త్రి వేళల్లో గస్తీ పటిష్టం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. కార్యాలయ ఆవరణ, వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు బి.సునీల్కుమార్, కె.నాగరాజు, జి.శ్రావణ్, జె.ఫణిధర్, డి.గురుస్వామి, బి.డి.ప్రేమ్కుమార్, ప్రణయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బావిలో జారిపడి బాలిక మృతి
నార్నూర్: ప్రమాదవశాత్తు బావిలో జారిపడి బాలిక మృతిచెందిన ఘటన జామ్డా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జామ్డా గ్రామానికి చెందిన పూసం కళాబాయి, షేకు దంపతుల కుమార్తె రత్తుబాయి (15) స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. శనివారం అదే గ్రామానికి చెందిన రైతు వ్యవసాయ క్షేత్రంలో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. ఎండ తీవ్రంగా ఉండటంతో దాహార్తి తీర్చుకోవడానికి మధ్యాహ్నం అక్కడే ఉన్న బావి వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయింది. ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుమిట్టాడుతుండగా చిన్నారులు గమనించి పొలంలో ఆమె అక్క శ్రీదేవికి చెప్పారు. అక్కడికి చేరుకున్న ఆమె చెల్లిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో రత్తుబాయిని బయటకు తీసి ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదువులో చురుగ్గా ఉండే రత్తుబాయి అకాల మరణం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. తండ్రి షేకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీ సాయి తెలిపారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
లక్సెట్టిపేట: ప్రేమ విఫలమైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలో తిమ్మాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ కథనం ప్రకారం..తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బైరి రాజ్కుమార్ (26) మార్బుల్ పని చేసేవాడు. సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. మనస్పర్థల కారణంగా ఏడాది క్రితం విడిపోయారు. అప్పటినుంచి మనస్తాపం చెందాడు. శుక్రవారం రాత్రి ఇంటి డాబాపై పురుగుల మందు తాగాడు. శనివారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రి కాంతయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆ క్షణం కళ్లల్లో ఆనందం చూశాను..
నాన్న.. జీవితాన్ని సరైన దారిలో నడిపించే మార్గదర్శి. అపజయాలు ఎదురైనా ధైర్యం చెప్పి విజయాన్ని అందించే దిక్సూచి. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల విజయాలే తనవిగా భావించి సంతోషిస్తాడు. బిడ్డల ఎదుగుదలలో తన కష్టాలను మెట్లుగా మలిచి ఉన్నత స్థానాలకు చేర్చి ఆనందిస్తాడు. తన భుజాలపై ఎక్కించుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం. నేడు ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నతస్థానాలకు చేరిన వారిపై ప్రత్యేక కథనం.బెల్లంపల్లి: ‘నాన్న ప్రేమ ఎల్లలు లేనిది.. దేనితోనూ వెలకట్టలేనిది. చిన్నతనం నుంచి మొదలుకుని ఐఏఎస్ పాసయ్యే వరకు నాన్నతో నా జర్నీ ఫ్రెండ్స్లా సాగింది. నా చిన్నతనంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ నాన్న నా బెడ్ పక్కనే ఉండి సపర్యలు చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను..’ అంటూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఐఈఎస్ఎస్డీ. మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రి ఇనుకొండ వెంకటేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామం. నాన్న ఇనుకొండ వెంకటేశ్వరరావు(రిటైర్డు పోలీసు అధికారి), అమ్మ గంగభవానీ, అక్క లక్ష్మీమౌనిక. -
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఉట్నూర్రూరల్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ పీవో మంద మకరందు పేర్కొన్నారు. కుమురం భీం ప్రాంగణ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల సర్మేడి నాయకులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, గిరిజన హక్కులు, వెదురు ఆధారిత పరిశ్రమలు, పల్లిపట్టీ, మహువా లడ్డూల తయారీ, చేపల పెంపకం, గోండి భాష అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోండి భాషను కంప్యూటర్లో సులభంగా అర్థమయ్యేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను తెలిసేలా పర్యాటక రంగ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తమ ప్రాంతాల్లోని సమస్యలను సర్మేడి నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు దీపావళికి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని కోరారు. కొందరు చదువుకోకుండా క్రికెట్ ఆడుతున్నారని దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే స్పందిస్తూ పోలీసు యంత్రాంగం, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మండల కేంద్రంలో సుమారు రూ.కోటి వ్యయంతో గ్రంథాలయాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సర్మేడి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు నీట్
కై లాస్నగర్: వైద్య విద్య కోర్సులో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఆదివారం మరోసారి నీట్ నిర్వహించనున్నారు. గత నెల 3న పరీక్ష నిర్వహించినా ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా రద్దయిన విషయం తెలి సిందే. దీంతో పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన భద్ర త ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా 1700 మంది హాజరుకానుండగా వీరి కో సం పట్టణంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష ఉంటుంది. బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు. తర్వాత గేటును మూసివేస్తారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎండలతీవ్రత నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆయా కేంద్రాల్లో ఏ ఎన్ఎంలను నియమించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడిసిన్ అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. విద్యార్థులు నీట్ అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, వాటర్బాటిల్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకురావద్దని పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఆదిలాబాద్రూరల్: మండలంలోని బంగారుగూడలో గల నీట్ కేంద్రాలను అదనపు కలెక్టర్ రాయిసిడాం చిత్రు శనివారం పరిశీలించారు. అధికారులను అడిగి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. -
లోక్ అదాలత్తో కేసులు సత్వర పరిష్కారం
కై లాస్నగర్: కోర్టుల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకరరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పలు సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల రాజీ మార్గం ద్వారా విజయవంతంగా పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారమైతే కక్షిదారులకు కోర్టు ఫీజు తిరిగి అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా కాకుండా చూసుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని అన్నారు. అనంతరం సైబర్ క్రైమ్ బాధితుడికి లక్ష ప్రొసీడింగ్ కాపీని, భూసేకరణ లబ్ధిదారులకు రూ.65,33,437విలువ గల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు నగేష్, జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
● అడుగంటిపోతున్న భూగర్భజలాలు ● మూడు మండలాల్లో మరీ తీవ్రంగా.. ● ఎల్నినోతోనే వర్షాభావ పరిస్థితులు ● నీటిపొదుపు పాటించకుంటే ముప్పే
కై లాస్నగర్: జిల్లాకు ఎల్నినో ముప్పుపొంచి ఉంది. దీని ప్రభావంతో ఈ వానా కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబు తున్నారు. జూన్ నెలాఖరుకు చేరుకుంటున్నా ఇప్పటివరకు ఒక్క భారీ వ ర్షం కురవకపోవడం ఎల్నినో తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికే భూ గర్భజలాలు అడుగంటాయి. పాతాళగంగ 9.78 మీటర్ల లోతుకు పడిపోయింది. దీంతో పలు మండలాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవడం ఉత్తమమని, వృథా చేస్తే మనుగడ కష్టమేనని భూగర్భజల శా ఖ అధికా రులు హె చ్చరిస్తున్నా రు. జలసంరక్షణ చర్యలు చేపడుతూ నీటి ని ఆదా చేస్తేనే రాబో యే రోజుల్లో నీటి కష్టాల ను అధిగమించే అవకాశము ంటుందని అభిప్రాయపడుతున్నారు. పలు మండలాల్లో ప్రమాద ఘంటికలు జిల్లాలో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతూ అడుగంటుతున్నాయి. గతేడాదితో పోల్చితే నీటి దిగువ మట్టం కొంత పరవాలేదనిపించినా పలు మండలాల్లో నీటిమట్టం తగ్గి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో మే నెలలో భూ గర్భజల మట్టం 11.83 మీటర్ల దిగువకు చేరగా, ఈసారి 9.78 మీటర్ల దిగువనే ఉంది. గతేడాది కంటే 2.06 మీటర్ల ఎత్తున నీటిమట్టం ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కారణంగా జిల్లాలో చెరువులు, వాగులు, ప్రాజెక్ట్లు అడుగంటి ఎడారులను తలపిస్తున్నాయి. బోరుబావుల్లోనూ నీటిమట్టం తగ్గి పలుచోట్ల వాటిలోంచి నీరు రాని పరిస్థితి నెలకొంది. కాగా, జిల్లాలోని కొన్ని మండలాల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గింది. జిల్లాలోని బోఽథ్, నేరడిగొండ, భీంపూర్ మండలాల్లో నీటిమట్టం పరిస్థితి తీవ్రంగా తగ్గి డ్రై ఏరియాకు చేరుకుంటోంది. దీంతో ఆయా మండలాల్లో బోర్లు, చేదబావుల్లో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. తగ్గుతున్న నీటి మట్టాన్ని కాపాడుకోవాలంటే వర్షపునీటిని ఒడిసిపట్టేలా సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టి వర్షపునీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే వివిధ అవసరాలకు వాడే నీటిని వృథాగా పోనీయకుండా పొదుపుగా వినియోగించాల్సి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులతో ఉన్న వనరులను వృథా చేసుకుంటే భవిష్యత్లో నీటి కష్టాలు తలెత్తి మనుగడ కష్టమయ్యే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎల్నినో కారణంగా వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండటంతో ఎక్కువగా నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగు చేయడం ఉత్తమమని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. -
ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి
నీటి వృథాను అరికట్టాలంటే ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలి. వానాకాలంలో వరదనీరు వృథా పోకుండా పారే నీటికి నడకనేర్పి, నడిచే నీటిని నిలకడగా ఉంచి, నిలకడగా ఉన్న నీటిని భూమిలోకి ఇంకించేలా చూడాలి. ఇలా నీటి సంరక్షణ చర్యలు చేపడితే భూమిలోకి నీరు ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి. దీంతో నీటి కష్టాలనూ అధిగమించవచ్చు. రైతులు తమ పంట పొలాల్లో బోర్ల చుట్టూ బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్, ఫాంపౌండ్స్ను నిర్మించుకుని వర్షపునీటిని సంరక్షించుకోవాలి. – సతీశ్యాదవ్, జిల్లా భూగర్భ జలవనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
ఉట్నూర్రూరల్: విద్యుత్ సమస్యలు లేకుండా చూ డాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వి ద్యుత్శాఖ అధికారులతో సమావేశమై వానాకాలంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. అనంత రం మండలంలోని నవోదయనగర్లో రెండు అంగన్వాడీ కేంద్రాల్లో ఉచిత విద్యుత్ సరఫరాను ప్రా రంభించారు. విద్యుత్ సౌకర్యం లేని చోట సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరాకు కృషి చేస్తామని చెప్పారు. గురువారం పులి మడుగుకు చెందిన రిటైర్డ్ పోస్ట్మేన్ రాథోడ్ రాంజీ, ఆడే ప్రకాశ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. -
వీరనారుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: వీరనారుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు, బ్రిగేడియర్ (రిటైర్డ్) ఎన్ఆర్.బాబు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీ యూ భవనంలో నిర్వహించిన మాజీ సైనికుల సంక్షేమ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు. వీర జవాన్ల సతీమణులు, తల్లులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైనికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చే స్తున్నాయని తెలిపారు. ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా సైనిక సంక్షేమ శాఖను సంప్రదించాలని సూచించారు. ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి రాజేశ్వరరావు, సిబ్బంది షేక్ పైముద్దీన్, కిశోర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్దాస్, భాస్కర్రెడ్డి, శివప్రసాద్, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు తక్కువగా కురిసే అవకాశం
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశముంది. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ ఎల్నినీనో ప్రభావంతో ఇప్పటికి రుతుపవనాల జాడలేదు. ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. సెప్టెంబర్ తర్వాత ఎల్నినో ముప్పు తగ్గే అవకాశముంటుంది. కానీ, అప్పటికే పంటల సాగు కాలం ముగిసి వర్షాల అవసరం అంతగా ఉండదు. రైతులు, ప్రజలు సాగునీటి విషయంలో వర్షాలపై ఆధారపడకుండా తక్కువనీటితో సాగయ్యే పంటలు వేయడం ఉత్తమం. – డాక్టర్ శ్రీధర్చౌహాన్, వ్యవసాయ శాస్త్రవేత్త -
జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్నగర్: ఎస్ఐఆర్–2026 ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షిషా పాల్గొని జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియకు సంబంధించి బీఎల్వోలు, బీఎల్ఏలకు శిక్షణతో పాటు కిట్ల పంపిణీ ఇప్పటికే పూర్తయింద ని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చే శామని, ఈనెల 23నాటికి అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు జిల్లా, మండల కేంద్రాల్లో హోర్డింగుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనకు ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, డిప్యూటీ డీఈవోలతో నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. మ్యాపింగ్ కాని ఓటర్లను గుర్తించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని బీఎల్వోలను ఆదేశించినట్లు వివరించారు. ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సహకారం కోసం ఎలాంటి రాజకీయ అనుబంధం లేని స్థానిక వలంటీర్లనే ఎంపిక చేశామని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రూ, ఆర్డీవో జగదీశ్వర్రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్ (యూజీ) పునఃపరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ పునఃపరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం బజార్హత్నూర్: మండలంలోని గులాబ్తండాలో బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. బాల వికాస ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, సింగారెడ్డి, శ్రీలక్ష్మీరెడ్డి, ఎంపీడీవో మహేందర్రెడ్డి, సర్పంచ్ రాథోడ్ లక్ష్మీబాయి, శివకుమార్, అరుణ్కుమార్, గోవింద్రావ్ తదితరులున్నారు. -
రేపు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ రాక
కైలాస్నగర్: వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చై ర్మన్ ముత్తినేని వీరయ్య ఈనెల 21న జిల్లా కేంద్రానికి రానున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బౌనే నగేశ్, ఉగ్గె నానయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జె డ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ది వ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలి పారు. జిల్లాలోని దివ్యాంగులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
‘అంగన్వాడీ’ నియామకాల్లో తిరకాసు!
సాక్షి, ఆదిలాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. ఎంపిక ప్రక్రియ కోసం గైడ్లైన్స్ జారీ చేసింది. అభ్యర్థులకు కేటాయించే మార్కుల పారామీటర్స్ను ప్రకటించింది. ఇందులో సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా పది మార్కులు కేటాయించేందుకు అవకాశం కల్పించింది. ఈ తాజా తిరకాసుతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 800 ఖాళీలు గతంలో విద్యార్హతల ఆధారంగా 80, వితంతువులకు ఐదు, అనాథలకు 10, శారీరక, మానసిక సమస్యలున్నవారికి ఐదు మార్కులు కేటాయించేవారు. ఇలా వంద మార్కులకు ఈ అంశాల ఆధారంగా అభ్యర్థులకు కేటాయించి ఎంపిక చేసేవారు. జిల్లాలో 800 ఖాళీలుండగా నిరుద్యోగుల నుంచి తీవ్ర పోటీ ఉండనుంది. సెలక్షన్ కమిటీ సభ్యులు అభ్యర్థులకు వంద మార్కులు కేటాయించేందుకు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా 70, వితంతువులకు ఐదు, అనాఽథలకు 10, శారీరక, మానసిక ఇబ్బందులున్నవారికి 10 మార్కులు కేటాయించనున్నారు. మరో 10 మార్కులను ఇంటర్వ్యూ ఆధారంగా కేటాయించేలా పారామీటర్లో పొందుపర్చారు. మెరిట్లో మార్కులు కలిసొచ్చినా ఈ ఇంటర్వ్యూ ద్వారా కలిపే మార్కులు ప్రభావితం చేసే అవకాశముందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇందులో పైరవీలు చోటుచేసుకుంటే అర్హులైన అభ్యర్థులు నష్టపోయే అవకాశముందని ఆందోళనకు గురవుతున్నారు. సెలక్షన్ కమిటీలో సభ్యులు వీరే.. మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0లో భాగంగానే ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ పోస్టులు భర్తీ చే యాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకోసం రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నుంచి ఈనెల 15న సర్క్యులర్ జారీ చేసింది. దశలవారీగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని అందులో పేర్కొంది. మొదటిదశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు, గిరిజన ప్రాంతాల్లోని హెల్పర్లనూ భర్తీ చేయాలని సూచించింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ (ఐటీడీఏ ప్రాంతాలను మినహాయించి)ల పరిధిలో సెలక్షన్ కమిటీ చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా జిల్లా సంక్షేమాధికారి, సభ్యులుగా ఆర్డీవో, డీఎంహెచ్వో లేనిపక్షంలో అడిషనల్ డీఎంహెచ్లను నియమించింది. ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో కలెక్టర్ చైర్మన్గా, జిల్లా సంక్షేమాధికారి మెంబర్ కన్వీనర్గా, ఐటీడీఏ పీవో, సంబంధిత ఆర్డీవో, డీఎంహెచ్వో లేనిపక్షంలో అడిషనల్ డీఎంహెచ్వో సభ్యులుగా ఉండనున్నారు. కాగా, ఇంటర్మీడియెట్ విద్యార్హత ఆధారంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసిందని, నోటిఫికేషన్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. -
అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలి
ఆదిలాబాద్రూరల్: అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. శుక్రవారం మావల పోలీస్స్టేషన్ పరిధి లోని కేఆర్కే కాలనీలో కార్డన్సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 127 ద్విచక్రవాహనాలు, 26 ఆటోలు, ఒక కారు, అక్రమంగా నిల్వ చేసిన 68 క్వార్టర్ బాటిళ్ల మద్యం, ఆరు బీర్బాటిళ్లు, మూడు లూస్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారణా యుధాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడు తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రో డ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ ఆవశ్యకత, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణం, డ్రంకెన్డ్రైవ్తో కలిగే అనర్ధాల గురించి వివరించారు. సైబర్ మోసాల బారిన పడకుండా అ ప్రతమత్తంగా ఉండాలని సూచించారు. డీఎస్పీలు జీవన్రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు ప్రేమ్కుమార్, ఫణిధర్, చంద్రశేఖర్, ఎస్సైలు శ్రీకాంత్, రాధిక, మనీశ్, పోలీస్ జాగిలం రోమా, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు ఆదిలాబాద్టౌన్: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రయాణికులు, అనుమానాస్పద వ్యక్తులు, వారి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలు సే కరించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తనిఖీల్లో నార్కోటిక్స్ గుర్తింపు జాగిలం ‘రోమా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం సహాయంతో స్టేషన్ పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద సామగ్రి, ప్రయాణికుల లగేజీని పరిశీలించారు. రైల్వే మార్గాల ద్వారా గంజాయి, ఇతర మా దకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పో లీస్శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని తెలి పారు. గంజాయి, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా పోలీసులకు 8712659973 నంబర్లో వాట్సాప్ ద్వారా తెలుపా లని కోరారు. సమాచారం అందించిన వారి వివరా లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యు వత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, నాగరాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, రైల్వే భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. -
కనీస వేతనం చెల్లించాలని ధర్నా
కైలాస్నగర్: మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ గౌరవా ధ్యక్షుడు దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. శుక్రవా రం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ చైర్పర్సన్ బండారు అనూష సతీశ్, కమిషనర్ జగదీశ్గౌడ్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. అనేక ఏళ్లుగా విధులు ని ర్వహిస్తున్న కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయడం లేదని తెలిపారు. కార్మికుల పీఎ ఫ్, ఈఎస్ఐ బకాయిల చెల్లింపుల్లోనూ జాప్యం జ రుగుతోందని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల ను వెంటనే రెగ్యులర్ చేయాలని, సూపర్వైజర్లు, డ్రైవర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, యూని యన్ అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి నగేశ్, సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి సురేందర్, డ్రైవర్ల విభాగం అధ్యక్షుడు జనార్దన్, కార్యదర్శి భిక్షపతి, నీటి విభాగం నాయకులు చిన్నయ్య, పెంటన్న, అజీమ్, శ్యామ్, మల్లేశ్ తదితరులున్నారు. -
‘యూరియా యాప్ వద్దు’
ఇచ్చోడ: రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ముఖరా(కె) రైతులు డిమాండ్ చేశా రు. శుక్రవారం మండలంలోని ముఖరా(కె) లోని పంట పొలాల్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులకు యూరియా దొరడంలేదని తెలిపారు. మెజార్టీ రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవ డం కష్టంగా మారిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యూరియా రైతులకు ఎ ల్లప్పుడు అందుబాటులో ఉండేదని గుర్తు చేశా రు. వెంటనే యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులున్నారు. -
‘బాలికల విద్యాభివృద్ధికి కృషి’
ఇచ్చోడ: బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే అ నిల్జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.88లక్షలతో చేపట్టిన అదనపు తరగతిగదుల నిర్మాణానికి భూ మిపూజ చేశారు. అనంతరం వారు మాట్లాడు తూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారికి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీఈవో మాధవి, తహసీ ల్దార్ ఇమ్రాన్, ఎంఈవో బిక్కు, కేజీబీవీ ఎస్వో మల్లిక, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాల సందర్శన బోథ్: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను ఎమ్మెల్యే అనిల్జాదవ్ విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించి శుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వసతిగృహంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి మోటారు కొనుగోలు చేసి, బోరు పంపును బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే, అధికారులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ అనురాధ, పాఠశాల చైర్మన్ శోభ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన బోథ్ మండల కేంద్రంలోని కేజీబీవీలో సుమారు రూ.38.15 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేశ్తో కలిసి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
పొగాకు రహిత విద్యాసంస్థల ఏర్పాటుకు సహకరించాలి
ఆదిలాబాద్టౌన్: పొగాకు రహిత విద్యాసంస్థ ల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీ కాంత్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్యాధికారి సాధన ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించి మాట్లాడారు. విద్యాసంస్థల పరిధి లో పొగాకు ఉత్పత్తుల వినియోగం, విద్యాసంస్థలకు 100గజాల పరిధిలో విక్రయాన్ని నిషేధి ంచినట్లు చెప్పారు. మైనర్లతో పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, మైనర్లకు విక్రయించడం నిషేధమని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో క్యాన్సర్, అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. హెచ్ఎం కిషన్, పీఈటీ చరణ్, సోషల్ వర్కర్ చిరంజీవి తదితరులున్నారు. -
‘రైతులను వంచిస్తున్న ప్రభుత్వం’
ఆదిలాబాద్టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోమని ప్రభుత్వం చెప్పడం రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. యాప్లో యూరియా బుకింగ్ విధానాన్ని ఎత్తివేయాలని, రైతువేదికల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని విమర్శించారు. వానాకాలం రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని, జొన్న రైతులకు వెంటనే చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు జిల్లా పర్యటనకు రానున్నట్లు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్రావు, నాయకులు గండ్రత్ రమేశ్, సేవ్వా జగదీశ్, పరమేశ్వర్, కుమ్రా రాజు, బటు సతీశ్, సూర్యకాంత్, అనిల్, అశోక్, దయానంద్ తదితరులున్నారు. -
అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి
ఆదిలాబాద్(బేల): కాంట్రాక్టర్లు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం మండలంలోని ఎకోరి, జునోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకోరిలో రూ.20 లక్షలతో పంచాయతీ భవనం ప్రారంభించామన్నారు. రూ.30 లక్షల వ్యయంతో వంతెన, జునోనిలో రూ.5 లక్షలతో సవారీ బంగ్లా నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నిర్మాణంలో నాణ్యత లోపించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఇన్చార్జి ఎంపీడీవో మహేష్ కుమార్, సర్పంచులు వాడేయ్ రేష్మ, గేడాం కిషోర్, తదితరులు పాల్గొన్నారు. -
తెగని పోడు.. ఆగని పోరు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూముల సాగుదారులు, అధికారుల మధ్య పోడు రగడ రగులుతూనే ఉంది. ఏళ్లుగా ఏటా వానాకాలంలో విత్తనాలు వేసే వేళ అటవీ సిబ్బంది, ఆక్రమణదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇక వర్షాలు మొదలైతే గొడవలు మరింతగా జరిగే ఆస్కారం ఉంది. అటవీ ఆక్రమణలపై ఏళ్లుగా శాశ్వత పరిష్కారం లేక సమస్య జఠిలంగా మారుతోంది. ఆక్రమణ భూములు స్వాధీనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్ష ఎకరాలకు పైనే అటవీ భూములు సాగులో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో మూడేళ్లుగా పోడు పట్టాలు ఇవ్వని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఘర్షణలు జరుగుతున్నాయి. మొదట గిరిజనేతరులకు ఐదు ఎకరాల కంటే అధికంగా సాగులో ఉన్నవారి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం, సాగుదారులను భూమి వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోనే 50వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. పులుల రాకపోకల కోసం తడోబా నుంచి కవ్వాల్ వచ్చేలా 1492 చ.కి.మీ. కారిడార్గా గుర్తిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. అయితే అటవీ సమీప ప్రాంత వాసులపై మరింత ఆంక్షలు అమలు కావడంపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పత్తి సాగు ఆరంభంతో చెట్లు నరికి సాగు చేయడం పెరిగిపోయినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. పోడు రైతులు వెదురు, పండ్ల తోటలు, ఇతర ఆహార ధాన్యాల సాగే చేయాల్సి ఉంది. పూర్తి వాణిజ్య పంట పత్తిపైనే అధికంగా ఆధారపడుతున్నారు. పట్టాలిచ్చినా.. ఆగని పోరు గత సర్కారు జీవో 140 ప్రకారం పోడు చేస్తు న్న గ్రామాలను గుర్తించింది. ఆ గ్రామాల్లో నే పోడు కమిటీలను ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించి, గ్రామ, మండల, డివిజన్, జి ల్లా, రాష్ట్ర స్థాయిలో పరిశీలన తర్వాత పట్టాలు జారీ చేసింది. ఇక గిరిజనుల్లోనూ అర్హులైన వారిని ఎంపిక చేసి 2023 జూన్లో పోడు పట్టాలు మంజూరు చేశారు. ఆ సమయంలో చాలామంది తమకు పట్టాలు రాలేదని మళ్లీ అర్జీలు ఇచ్చారు. ప్రధాన నిబంధనల్లో గిరిజ నులను 2005 వరకు, గిరిజనేతరులను 1930 కంటే ముందు సాగులో ఉన్నట్లుగా లేదా మూడు తరాల వారు ఆ భూమిని అనుభవిస్తున్నట్లుగా రుజువులు చూపించాల్సి రావడంతో అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 33వేల మంది గిరిజనుల చేతిలో 1.24 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు 32వేల మంది గిరిజనేతరుల చేతిలో 1.02లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్లు అర్జీలు వచ్చాయి. అయితే గిరిజనేతరులు చట్టం ప్రకారం అనర్హలు కావడంతో వాటిని తిరస్కరించారు. అయినప్పటికీ తమకు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పట్టాలపై రాజకీయ కారణాలతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. నిత్యం ఘర్షణలే.. ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, కాగజ్నగర్, పెంచికల్పేట, చింతలమానేపల్లి, బెజ్జూరు, ఆదిలాబాద్, మావల, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, సోనాల, కడెం, ఉట్నూరు, జన్నారం, దండేపల్లి, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో అటవీ అక్రమాలపై నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఫారెస్టు సిబ్బంది, సాగుదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం దూషణలు, ఎదురుదాడులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సార్లు పోలీసు బందోబస్తుతో అటవీ అధికారులు సాగు ఆక్రమణలను తొలగిస్తున్నారు. దండేపల్లి మండలం కోయపోచగూడ, ఇటీవల చింతలమానేపల్లి మండలం దిందా, కడెం మండలం గొండుగూడ, కెరమెరి మండలం సుర్దాపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలం అల్లికోరి పరిధిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అటవీ అధికారులు సాగుదారులపై కేసులు సైతం నమోదు చేశారు. అయితే అర్హులైన వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. -
తప్పని తాగునీటి కష్టాలు..!
భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోవడంతో ఆదిలాబాద్రూరల్ మండలంలోని గుట్టలపై నివాసముండే గ్రామాల ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై చాలా వరకు ఎండగా ఉంటుంది. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. బోథ్ మండల కేంద్రానికి చెందిన ఈ రైతు పేరు రాసం ప్రవీణ్ కుమార్. 2022లో తనకున్న ఆరెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశాడు. మూడేళ్ల తర్వాత గెలలు చేతికి రావడం ప్రారంభించాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 16 టన్నులు విక్రయించగా రూ.3,10,000 ఆదాయం వచ్చింది. ఏటా 15 సార్లు గెలలు అమ్మకానికి వస్తాయని, ఆయిల్ పామ్ సాగుకు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదని, ఒకసారి పంటను కాపాడుకుంటే ఏటా ఆదాయం పొందవచ్చని రైతు పేర్కొంటున్నాడు. -
‘రైతుల ఆత్మబంధువు కేసీఆర్’
బజార్హత్నూర్: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టి, రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు, కుటుంబ పెద్ద మరణిస్తే రైతుబీమా పథకాలను అమలు చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన కేసీఆర్ రైతుల మనస్సులో ఆత్మబంధువుగా నిలిచిపోయారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం మండలంలోని కాండ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అనితరామకిషన్, ఉపసర్పంచ్ గంగయ్య, గిర్నూర్ ఉప సర్పంచ్ గొల్లెన రాజేందర్ బీఆర్ఎస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచులు పరచ సాయన్న, రాథోడ్ ప్రవీణ్, సోము రాములు, మెండ్కే సాయినాథ్, అనిల్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
యోగాతో దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం
ఆదిలాబాద్టౌన్: యోగాతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని, ప్రతిఒక్కరూ యోగా సాధనను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పిలుపునిచ్చారు. గురువారం రిమ్స్లో యోగా అవగాహన వాక్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు యోగా సాధన సమర్థవంతమైన పరిష్కార మార్గమన్నారు. నిత్యం యోగా, వాకింగ్ అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రతిరోజూ యోగాసనాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, యోగా డే నోడల్ అధికారి డాక్టర్ కస్తాల చంద్రశేఖర్, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ప్రీతల్ రాథోడ్, డిప్యూటీ నోడల్ అధికారులు డాక్టర్ శ్రీకాంత్, అయూష్ వైద్యురాళ్లు మౌనిక, సబోహి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ఆయూష్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
ఉట్నూర్రూరల్: రాత్రి సమయాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం ఉట్నూర్ పోలీస్స్టేషన్లో టీజీఎ స్పీ సిబ్బందికి ఏర్పాటు చేసిన వంటగదిని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్ధాలపై యువతకు అవగాహన కల్పించాలన్నా రు. ఆర్థిక నేరాలు, దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలన్నారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, సీఐ ఎం.ప్రసాద్, ఎస్సై జి.విజయ్ ఉన్నారు. -
ఒకటో తేదీనే వేతనాలు
సాక్షి,ఆదిలాబాద్: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, తదిత ర ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి వారికి కూడా సకాలంలో చెల్లించాలని సూచించింది. ఈ నెల 9న ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అన్ని ప్రభు త్వ శాఖలు, సంస్థలకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. జూలై నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు. జిల్లాలో రెగ్యులర్ ఉద్యోగులు 9వేల వరకు ఉండగా, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 2500 వరకు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతినెలా 1న గతనెలకు సంబంధించిన జీతాలను అన్నివర్గాల ఉద్యోగులకు చెల్లించాలి. ప్రస్తుతం అదేవిధంగా విడుదల అవుతున్నప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యం జరుగుతుందనే అభిప్రాయం ఉంది. పేబిల్లుల ఆలస్యం, హాజరు నమోదు, తనిఖీలు, ఆడిట్, బిల్లుల ఆమోదంలో జాప్యం వంటి కారణాలతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు, వేతనాలు అందని పరిస్థితి ఉంది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలస్యమైతే బాధ్యులపై చర్యలు.. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గౌరవ వేతనంపై పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి జీతాలు, వేతనాలు ఆలస్యం కాకుండా చెల్లించా లని, జాప్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా గతనెల 21వ తేదీ నుంచి ప్రస్తుత నెల 20వ తేదీ వరకు హాజరును పరిగణించాలని పేర్కొంది. 25న ట్రెజరీ విభాగానికి సంబంధిత శాఖలు బిల్లులు సమర్పించాలని ఆదేశించింది. నెల చివరి పనిదినం లోపు బిల్లుల పరిశీలన, ఆడిట్, ఆమోద ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో సకాలంలో జమయ్యేలా ట్రెజరీ అధికారులు బాధ్యత వహించాలని పేర్కొంది. సంబంధిత శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీవో)లకు తగిన బడ్జెట్ కేటాయింపు, అవసరమైన పరిపాలన, ఆర్థిక అనుమతులు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించింది. శాఖాధిపతులు ఈ విషయంలో పర్యవేక్షణ చేయాలనిస్పష్టం చేసింది. ఆలస్యమైతే సంబంధి త అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. -
5 లక్షల ఎకరాల్లో..
ఆదిలాబాద్టౌన్: కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులు రైతులను నట్టేట ముంచేందుకు నకిలీ దందా కొనసాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠా జిల్లాలో ఈ దందాను జోరుగా సాగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మకాం వేసి కొంతమంది డీలర్లతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని వారితో మిలాఖత్ అయ్యారు. తక్కువ ధరకే విత్తనాలు ఉన్నాయని, అధిక దిగుబడి వస్తుందని ఆశచూసి రైతులకు అంటగడుతున్నారు. ఆ విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తినా కాత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పోలీసులు ఇలాంటి కేటుగాళ్ల ఆటపట్టిస్తున్నారు. ఈ ఏడాది 5 కేసులు నమోదు చేసి పలువురిని రిమాండ్కు తరలించినప్పటికీ ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మేలు రకం అంటూ.. తమ కంపెనీ విత్తనాలు మేలు రకమైనవని, అధిక దిగుబడులు వస్తాయని అన్నదాతలను నమ్మిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలను టార్గెట్ చేశారు. బ్రాండెడ్ గల బీటీ విత్తనాల పేర్లలోని ఒక్కో అక్షరాన్ని అటుఇటూ చేస్తూ, అలాంటి కవర్ ప్రింట్తో అదే మాదిరి పలికే పేర్లతో బ్రాండ్లు తయారు చేస్తున్నారు. నకిలీలను పసిగట్టని రైతులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. బీటీ డిమాండ్ పెరగడంతో.. కొన్నేళ్లుగా బీటీ రకం విత్తనాల డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. దీంతోపాటు బీటీ–3, లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. చీడపీడల ఉధృతి తగ్గడంతో రైతులు వీటిపైనే ఆధారపడటం, కొన్ని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించడంతో ఈ నకిలీలకు అనుకూలంగా మారుతోంది. గతంలో పంట ఏపుగా పెరిగినా దిగుబడి రాక చాలా మంది రైతులు నష్టపోయిన ఘటనలు లేకపోలేదు. ఈ ఏడాది బేలలో మొదటిసారి 150 ప్యాకెట్లు, రెండోసారి 81, ఇచ్చోడలో 58 ప్యాకెట్లు, ఆదిలాబాద్లో 742, మొత్తం 1031 ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 5 లక్షల 91వేల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. అత్యధికంగా రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. 4 లక్షల 30వేల ఎకరాల్లో పత్తి, 90 వేల ఎకరాల్లో సోయా, 50వేల ఎకరాల్లో కందులు, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. అయితే రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పత్తి సాగవుతుండడంతో కేటుగాళ్లు జిల్లాపై దృష్టి పెట్టారు. ఏటా ఖరీఫ్ సాగుకు ముందు పల్లెల్లో తిరగడం, కంపెనీల ప్రచారం చేపట్టడం, గ్రామాల్లోని పేరున్న రైతులకు విత్తనాలను ఉచితంగా అందించడం వంటివి చేస్తున్నారు. గిఫ్టులు, ఆఫర్లతో మభ్య పెడుతూ విత్తనాలు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నారు. -
‘బడుల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’
ఆదిలాబాద్టౌన్: పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మూసివేతకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు గురువారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి పేద విద్యార్థులపై పడుతున్న ఆర్థికభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీశాంత్, శైలేంద్ర, అంకుశ్, హరి, శివ, అలోక్, ధృవ, హనీష్, మనీష్, రోహిత్, శివచరణ్, రామ్, అజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
సిరులు కురిపిస్తున్న గెలలు!
బోథ్: ఆయిల్ పామ్ సాగుపై జిల్లా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే దీర్ఘకాలికంగా స్థిరమైన రాబడినిచ్చే ఈ వాణిజ్య పంట వైపు స్థానిక రైతులు క్రమంగా అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో ఆయిల్ పామ్ గెలల ధరలు గణనీయంగా పెరగడం, తోటల విస్తీర్ణం, దిగుబడి రోజురోజుకూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుండడంతో పంటను సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరతో రైతుల్లో ఆనందం ఇటీవల కాలంలో మార్కెట్లో ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు ఏకంగా రూ.23,500 కు పెరిగింది. ఈ పెరుగుదల సాగుదారులకు పెద్ద ఊరటగా మా రింది. అంతకుముందు టన్నుకు రూ.21,546 ధర ఉండగా ఇటీవల అదనంగా రూ.1,954 పెరగడంతో రైతులకు ఆర్థికంగా భారీ లాభం చేకూరనుంది. జిల్లాలో సాగు ఇలా.. జిల్లా ఉద్యానవన శాఖ తాజా గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో మొత్తం 1,009 మంది రైతులు 2,960 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడి వస్తుండడంతో కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 135 మంది రైతుల వద్ద నుంచి తగిన మద్దతు ధర చెల్లించి 410 టన్నుల తాజా గెలలు సేకరించారు. ఈ ధరల పెరుగుదలతో పాటు మెరుగైన ఉత్పాదకత కారణంగా రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీటి వనరులు ఉన్న రైతులు ఇతర పంటల కంటే తక్కువ నష్టభయం ఉండి, ఏటా స్థిరమైన ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ తోటల వైపే మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ పామ్ ఆయిల్కు డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ఉచితంగా మొక్కల సరఫరా, సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ వంటి ప్రోత్సాహకాలు అందించడం కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.ఆయిల్ పామ్ సాగు : 2,960 ఎకరాలు సాగు చేస్తున్న రైతుల సంఖ్య : 1009 ఇప్పటి వరకు సేకరించిన గెలలు : 410 టన్నులు విక్రయించిన రైతుల సంఖ్య : 135 ప్రస్తుతం గెలల ధర టన్నుకు : రూ.23,500 జిల్లా వివరాలు -
పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ అనూషతో కలిసి సుమారు రూ.18.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదిలాబాద్ను అభివృద్ధి చెందిన పట్టణంగా మార్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ రానున్నాయని, తద్వారా పట్టణం పారిశ్రామికంగా, ఆర్థికంగా గొప్ప పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మా ట్లాడుతూ పట్టణంలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు. గాంధీ పార్క్ ప్రహరీని రూ.26 లక్షలతో, పిట్టలవాడ కాలనీలో రూ.10 లక్షలు, రాంనగర్ కాలనీలో రూ.32 లక్షలు, డాల్డా కంపెనీ ఏరియాలో రూ.25 లక్షల వ్యయంతో కూడి న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, ఈఈ అరుణ్ కుమార్, డీఈలు, ఏఈలు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిది కాదు.. నాలుగే!
కై లాస్నగర్: ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)గ్యాస్ కనెక్షన్దారులకు కేంద్రం షాకిచ్చింది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల పరిమితిని కుదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏడాదికి తొమ్మిది రాయితీపై అందిస్తుండగా తాజా గా ఐదు కోత విధించింది. నాలుగుకు పరిమితం చేసింది. జిల్లా వ్యాప్తంగా 36,960 కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశముంది. వంటకు తంటాలు పడకూడదనే.. దారిద్య్రరేఖకు దిగవనున్న నిరుపేదలు కట్టెలపొయ్యిపై వంటకు తంటాలు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. తెల్లకార్డు కలిగిన వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేసింది. స్టౌ, రెగ్యులేటర్ పైపుతో పాటు సిలిండర్ సైతం ఉచితంగానే పంపిణీ చేసింది. సాధారణ, దీపం కనెక్షన్ దారులకు రూ.47సబ్సిడీని అందిస్తున్న కేంద్రం ఉజ్వల లబ్ధిదారుల ఖాతాలో మాత్రం రూ.300 జమచేస్తోంది. ఈ సబ్సిడీని మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. కుదింపు ఇలా.. ఉజ్వల గ్యాస్ కనెక్షన్దారులకు 14.2 కేజీల గ్యాస్ సిలిండర్లను నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 సిలిండర్లను అందించింది. స్కీం ప్రారంభం నుంచి తొమ్మిదేళ్ల పాటు లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీని జమ చేసింది. ఒక్కో కుటుంబం ఏడాదికి సగటున 6నుంచి 7 సిలిండర్లు మాత్రమే వినియోగిస్తుందని గుర్తించిన కేంద్రం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తొమ్మిదికి కుదించింది. లబ్ధిదారులకు రెగ్యులర్గా రాయితీ జమ చేస్తూ వస్తోంది. తాజాగా పశ్చిమాసియా యుద్ద ప్రభావం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా చూపింది. ఈ క్రమంలో ఆయా గ్యాస్ కనెక్షన్ల బుకింగ్ విధానంలో మార్పు చేసింది. అలాగే ఉజ్వల కనెక్షన్దారులకిచ్చే సబ్సిడీ సిలిండర్లలో ఐదు కోత విధించింది. ఇక ఏడాదికి నాలుగు సిలిండర్లకు మాత్రమే రూ.300 చొప్పున సబ్సిడీ అందనుంది. ఐదో సిలిండర్ తీసుకున్నటైతే సదరు లబ్ధిదారు ప్రస్తుతం ఉన్న ధర రూ.1,021 పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. కేంద్ర నిర్ణయంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆరోపణలు అవాస్తవం’
కై లాస్నగర్: సిరికొండలోని కొనుగోలు కేంద్రంలో జొన్నలు కొనుగోలు చేయలేదని, అదనపు ఖర్చులు అడిగారని జరుగుతున్న ప్రచారం, ఆరోపణలు అవాస్తవమని జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ మహేశ్కుమార్ అన్నారు. మంగళవా రం డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూగురే పాండురంగ్ (48) అనే రైతు తన జొన్న పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన విషయం వాస్తవమేనని, నిబంధనల ప్రకారం ఇతర రైతుల మాదిరిగానే ఆయన సరుకును కూడా తూకం వేసినట్లు తెలిపారు. ఈనెల 6న రైతుకు చెందిన 70 బస్తాల (35 క్వింటాళ్లు) జొన్నలను కొనుగోలు చేసి, రశీదు (తక్పట్టి) జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం బయోమెట్రిక్ ద్వారానే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే సరుకు లోడింగ్కు ముందు రైతు తన దస్తావేజులను కేంద్రంలో సమర్పించకుండా తిరిగి తీసుకెళ్లారని, వాటిపై ఉన్న లాట్ నంబర్ల ఆధారంగానే లోడింగ్ చేయడం సాధ్యమవుతుందని చెప్పా రు. డాక్యుమెంట్లు తీసుకువచ్చి లోడింగ్ పూర్తి చేయాలని పలుమార్లు కోరినా రైతు తిరిగి కేంద్రానికి రాకపోవడంతో లోడింగ్ ప్రక్రియ పెండింగ్లో ఉందన్నారు. కొనుగోలు కేంద్రంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రైతులు, ప్రజలను కోరారు. -
జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: జిల్లాలో క్రీడా అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీవైఎస్వో అల్లూరి దయానంద్రెడ్డి తెలిపారు. బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన అధునాతన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని, క్రీడల్లో జిల్లాను అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సాక్షి: స్టేడియంలో కోచ్లు లేకపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందిగా ఉంది. నియామకాలపై ఎలా ముందుకు వెళతారు? డీవైఎస్వో: కోచ్ల నియామకాలపై ముందుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తాం. సాక్షి: గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి మీ ప్రణాళిక ఏమిటి? డీవైఎస్వో: మనం నిర్వహించే క్యాంపుల్లో వారిని చేర్చుకుని తగిన శిక్షణ ఇస్తాం. స్కూల్ హెడ్మాస్టర్లు, తహసీల్దార్, ఎంపీడీవోల సహకారంతో మోటివేషన్ ఇప్పిస్తాం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తాం. సాక్షి: పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.. ఎలాంటి చర్యలు చేపడుతారు? డీవైఎస్వో: ముందుగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. రెండో ప్రాధాన్యతగా లైటింగ్స్ ఏర్పాటు, తర్వాత మైదానం అభివృద్ధి చేస్తాం. వాకర్స్కు ఇబ్బంది కలగకుండా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే కొన్ని పనులు శాంక్షన్ అయ్యాయి. ట్రాక్, ఇతర సౌకర్యాలు వందశాతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. సాక్షి: ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు నిలిచిపో యి చాలా కాలమైంది.. వాటి పరిస్థితి ఏంటి? డీవైఎస్వో: ఆ నిర్మాణ పనులు మున్సిపల్ నిధులతో మొదలయ్యాయి. అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రయత్నిస్తా. సాక్షి: ఒక సీనియర్ పీడీగా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? డీవైఎస్వో: గ్రామీణ క్రీడాకారులు మరుగున పడిపోతున్నారు. ముందుగా ఆయా ప్రాంతాల నుంచి పీడీల ద్వారా వారిని వెలుగులోకి తీసుకువస్తాం. తొలుత జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపుతాం. జిల్లాను క్రీడల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా శ్రమిస్తా. సాక్షి: స్టేడియంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫీజులు వసూలు చేసుకుంటూ ప్రభుత్వ మైదానాన్ని ఉపయోగిస్తున్నారు? ఈ అంశంపై ఎలా దృష్టి సారిస్తారు? డీవైఎస్వో: ముందుగా క్రీడా పాఠశాల విద్యార్థుల సాధనకు ఇబ్బందులు లేకుండా ట్రాక్ చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తాం. మిగతా దాంట్లో నడక సాధకులు వెళ్లేలా పెద్ద ట్రాక్ అభివృద్ధి చేస్తాం. ఉద్యోగాల కోసం సాధన చేసే నిరుద్యోగులకు ప్రత్యేక స్థలం కేటాయిస్తాం. సాక్షి: స్పోర్ట్స్ స్కూల్ అప్గ్రేడేషన్ కోసం ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? ఇంటర్ వరకు ఉన్నతీకరించే అవకాశాలు ఉన్నాయా? డీవైఎస్వో: జూనియర్ కాలేజీ వరకూ ఉన్నతీకరించవచ్చు. కానీ, మనకు సదుపాయాలు అందుబాటులో లేవు. భవనం లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. -
గడువులోపు పూర్తి చేయాలి
కై లాస్నగర్: జిల్లాలో గృహ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతులు, నిర్మాణాల పురోగతి, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మావల, కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూం ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు, పెండింగ్ పనులు జూలై 15 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అనుమతుల విషయంలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొలి ప్రాధాన్యం కల్పించాలని, దీనికి సంబంధించిన నివేదికలు త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, హౌసింగ్ పీడీ శంకర్, ము న్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జొన్నల పైసలు రాలే
సాక్షి, ఆదిలాబాద్: యాసంగిలో జొన్న దిగుబడులు విక్రయించిన రైతులు పంట అమ్మిన డబ్బులకోసం వారాల తరబడి ఎదురుచూస్తున్నారు. పంట విక్రయించిన ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు రూ పాయి చేతికందని పరిస్థితి. ఓవైపు వానాకాలం సీజ న్ మొదలైంది. సాగు పెట్టుబడికి చేతిలో చిల్లి గవ్వ లేక రైతులు బయట అప్పు చేయాల్సిన దుస్థితి. ఒకవేళ సమయానికి ఆ డబ్బులు అంది ఉంటే కొంతలో కొంత పెట్టుబడి భారం తగ్గి రైతుకు వెసులు బాటుగా ఉండేది. దిగుబడి బారెడు.. కొన్నది మూరెడు జిల్లాలో యాసంగిలో రైతులు లక్ష ఐదు వేల ఎకరా ల్లో జొన్న సాగు చేశారు. ఎకరానికి 15 నుంచి 25 క్వింటాళ్ల చొప్పున 16లక్షల నుంచి 21లక్షల క్వింటా ళ్ల వరకు దిగుబడి వచ్చింది. మే మొదటి వారంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను విక్రయించారు. అయితే కొనుగోళ్లలో పరిమితి విధించడంతో రైతులు పూర్తిస్థాయిలో మద్దతు ధర కు పంటను అమ్ముకోలేని దుస్థితి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.3,699 అందినా మొత్తం దిగుబడికి వర్తించలే. గత్యంతరం లేక మిగతా పంటను రైతులు ప్రైవేట్లో విక్రయించుకుంటే రూ.2500 నుంచి రూ.3వేల లోపే పలకడం గమనార్హం. ఇది లా ఉంటే మార్క్ఫెడ్ కొనుగోళ్లు ముగిసే వరకు కొన్నది కేవలం స్వల్పమే. ఇంకా మార్కెట్లోనే నిల్వలు .. కొనుగోళ్లు ముగిసి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆదిలాబాద్, ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్యార్డుల్లో జొన్నల నిల్వలు లోడింగ్కాక భారీగా పేరుకుపోయాయి. సుమారు 2వేల టన్నుల వరకు నిల్వ లు ఇంకా గోదాంలకు తరలించాల్సి ఉంది. కూలీల కొరత, లోడింగ్ చేసేందుకు లారీలు రాకపోవడంతో ఈ సమస్య అఽధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో జొన్న కొనుగోళ్ల వివరాలు విక్రయించిన రైతులు : 25,560 కొనుగోలు చేసిన జొన్నలు : 73 మెట్రిక్ టన్నులు రైతులకు రావాల్సిన డబ్బులు : రూ.270 కోట్లు ఒకట్రెండు రోజుల్లో డబ్బులు జొన్నలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒ కట్రెండు రోజుల్లో రైతులకు డబ్బులు రానున్నాయి. ఈ సీజన్లో 7లక్షల 50వేల క్వింటాళ్ల వరకు మార్క్ఫెడ్ లక్ష్యం కాగా స్వల్పదూరంలోనే నిలిచాం. ప్రభుత్వం నుంచి డబ్బులు వి డుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జ మచేస్తాం.– మహేశ్కుమార్, డీఎం మార్క్ఫెడ్ -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. ఈ రైతు పేరు కాడిగిరి నాసర్యాదవ్. ఈయనది తాంసి. యాసంగిలో జొన్న సాగు చేయగా 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో మే 18న విక్రయించాడు. వీటికి సంబంధించి రూ.2,95,920 రావాల్సి ఉంది. నెల గడుస్తున్నా పైసలు చేతికందలేదు. వానాకాలం సీజన్ మొదలు కావడంతో పెట్టుబడి కోసం ప్రభుత్వ బ్యాంకు, ప్రైవేట్లో కలిపి రూ.లక్షకు పైగా అప్పు చేశాడు. ఇతనొక్కడే కాదు.. జొన్న దిగుబడులు విక్రయించిన వేలాది మంది రైతులది ఇదే పరిస్థితి. -
అస్మదీయులకు ఓడీ.. తస్మదీయులకు డీడీ
ఆదిలాబాద్:సిబ్బంది కొరతతో ఆర్టీసీ సతమతమవుతోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కోసారి 12 గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి. సిబ్బందిలేమి కారణంగా పనిభారం అధికమై ఎంతోమంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారికే డబుల్ డ్యూటీ (డీడీ)లు కేటాయిస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది అధికారులు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీస్ (ఓడీ)లు ఇస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఓడీఎం బదిలీపై వెళ్తూ కొంతమంది ఉద్యోగులకు ఓడీలు ఇచ్చి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా రీజియన్ వ్యాప్తంగా కొంతమంది ఉన్నతాధికారులు అడ్డగోలుగా ఓడీలు ఇస్తూ అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. అయినవారికి అందలం.. సాధారణంగా స్టాఫ్ తక్కువగా ఉంటే నియామకాల ద్వారా ఖా ళీలు భర్తీ చేస్తారు. లేదంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులకు ఓడీ పేరుతో విధులు కేటాయిస్తారు. ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే అధికారులు ఓడీలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడే కొంతమంది ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమకు వత్తాసు పలికే వారికి అప్పనంగా ఓడీలు కేటాయిస్తున్నారు. ఓవైపు సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఉంటుండగా, తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను అందలమెక్కిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల డిపోలో సీనియార్టీని కాదని, కొంతమంది జూనియర్ ఉద్యోగులకు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీలు ఇవ్వడం వివాదాస్పదమైంది. అనారోగ్య కారణాలు, వయస్సు రీత్యా సీనియర్లు విజ్ఞప్తి చేసుకుంటే అవసరాన్నిబట్టి ఓడీలు ఇవ్వాల్సింది పోయి, జూనియర్ ఉద్యోగులకు కేటాయించడం విమర్శలకు కారణమవుతోంది. ఓడీలతో పెరుగుతున్న డీడీలు.. అవసరం ఉన్నా, లేకపోయినా కొంతమందికి ఓడీలు కేటాయిస్తుండడంతో మిగిలిన కార్మికులపై భారం పడుతోంది. క్షేత్రస్థాయిలో బస్సులు నడిచేందుకు కీలకంగా వ్యవహరించే డ్రైవర్లు, కండక్టర్లపై డబుల్ డ్యూటీల భారం పడుతుంది. సిబ్బంది లేకపోవడంతో వారికి డబుల్ డ్యూటీ పేరిట అదనంగా పే చేయాల్సి వస్తుంది. తమవారికి లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, పరోక్షంగా ఇతర ఉద్యోగులపై పనిభారం నెడుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు ఆసుపత్రుల పాలవుతున్నారు. రీజియన్ పరిధిలోని ఉద్యోగులు డిపో డ్రైవర్లు కండక్టర్లు ఆదిలాబాద్ 129 204 ఆసిఫాబాద్ 90 111 భైంసా 33 128 మంచిర్యాల 149 162 నిర్మల్ 138 204 ఉట్నూర్ 39 46 మొత్తం 578 855వేధిస్తున్న సిబ్బంది కొరత.. ఆదిలాబాద్ రీజీయన్ వ్యాప్తంగా 737 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరిలో రెగ్యులర్ డ్రైవర్లు 583 మంది ఉన్నారు. మిగతా 154 మంది అవుట్ సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్నారు. 867 మంది కండక్టర్లు ఉండగా, వీరిలో కూడా సిబ్బంది కొరత ఉంది. మరోవైపు కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు ఇష్టారాజ్యంగా ఓడీలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. -
సాగు భూముల కోసం పోరు
కడెం: సాగు భూముల కోసం మండలంలోని పెత్తర్పు గోండుగూడ వాసులకు అటవీ అధికారులకు మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. మంగళవారం పునరావాసంలో భాగంగా కవ్వాల్ టైగర్జోన్లో రాంపూర్, మైసంపేట్ వాసులకు అప్పగించిన సాగు భూములకు హద్దులు ఏర్పాటు చేయించేందుకు వెళ్లిన అటవీ, రెవెన్యూ అధికారులను గోండుగూడ వాసులు మళ్లీ అడ్డుకున్నారు. పునరావాస గిరిజనులతో పాటుగా ఏళ్లుగా ఇక్కడే సాగు చేస్తున్న తమకు సాగు భూములు కేటాయించాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పది మంది ఆదివాసీలను జీపులో ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అడ్డుకునేందుకు వెళ్లిన మహిళలను ఈడ్చుకెళ్లారు. ఓ ఆదివాసీ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పునరావాసంలో భాగంగా రాంపూర్, మైసంపేట్ వాసులకు భూములు అప్పగించామని, వారికి పట్టాలు సైతం వచ్చాయని, గోండుగూడ వాసులు అడ్డుకోవడం సరికాదని ఎఫ్డీవో శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవదాసు, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎఫ్ఆర్వోలు గీతారాణి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రావు, అనితా, కల్పనదేవి, వాణి, రామకృష్ణ, కిరణ్, ఎస్సైలు సాయికిరణ్, సాయికుమార్, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు. అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు కడెం: మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ జీపీ పరిధిలోని గోండుగూడ వాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదని రాంజీగోండ్ సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గోండుగూడ ఆదివాసీలు సాగు భూముల కోసం పోరాడితే వారిని అడ్డుకుని ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారన్నారు. ఆదివాసీలకు సాగు భూములు దక్కే వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, తొడసం భీంరావు, తదితరులు పాల్గొన్నారు. -
రెక్కలొచ్చే దిశగా..
కై లాస్నగర్: జిల్లాకేంద్రంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ ప్రాంతవాసుల కల సాకారం దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. మంగళవారం ఓఎల్ఎస్ సర్వే ప్రారంభమైంది. విమానాయాన శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. పారదర్శకంగా భూసేకరణ ప్రక్రియ : కలెక్టర్ ఆదిలాబాద్ జాయింట్ యూజర్ (డిఫెన్స్–సివిల్) ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపడతామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్, బెంగళూరు కు చెందిన ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సి విల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్రెడ్డితో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయ భూసేకరణ చర్యలు వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే 700 ఎకరా ల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అదనంగా డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎయి ర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) కోసం 1,500 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ రన్వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలు కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందన్నారు. జియో కోఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామ ని సీఎంవో కార్యాలయం, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీకి భూములు అప్పగిస్తామని తెలిపారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలన పూర్తయిందన్నారు. రక్షణశాఖ కోరిన 1,500 ఎకరాల భూసేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులతో కలిసి మ్యాప్ల ఆధారంగా మైక్రో లెవెల్ సమీక్ష నిర్వహించామని, ప్రాజెక్టు వేగవంతానికి ఈ సమావేశంతో కీలక ముందడుగు పడినందన్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, జా యింట్ యూజర్ ఎయిర్పోర్ట్ భూసేకరణపై స్ప ష్టత వచ్చిందన్నారు. గతంలో జారీ చేసిన 700 ఎకరాల జీవో ప్రకారం పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 800 ఎకరాల అనుమతుల ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. తదుపరి విధానపరమైన నిర్ణయాల కోసం త్వరలో ఎంపీ నేతృత్వంలో ఢిల్లీలో ఉమ్మడి సమావేశం జరగనుందన్నారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోందని, జిల్లా అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు జేపీ సబర్వాల్, ఎస్.జి.హెడ్గే, ఎస్.కె.రెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, తహసీల్దార్లు శ్రీనివాస్, గోవింద్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన .. ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో మైక్రో లెవల్ సర్వే చేపట్టారు. ఎరోడ్రమ్తో పాటు ఇందిరమ్మకాలనీ, అనుకుంట, సీసీఐ, ఇందిరమ్మ కాలనీ వంటి ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు. రన్వే విస్తరణతో పాటు ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా మ్యాపుల ప్రకారం భూములను పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. -
నేరాల నియంత్రణకు పటిష్ట బీట్ వ్యవస్థ
ఆదిలాబాద్టౌన్: జిల్లావ్యాప్తంగా గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు నేరాలు అరికట్టేందుకు రాత్రి సమయాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం నెలవా రీ నేర సమీక్ష నిర్వహించారు. కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ బాధితులకు త్వరితగతిన న్యా యం జరిగేలా దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పటిష్టమైన బీట్ వ్యవస్థ అమలు చేయాలన్నారు. గంజా యి రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు రాత్రి వేళల్లో బస్సులు తదితర వాహనాల్లో నార్కోటిక్ జాగిలాల సాయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు డీడీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. స్టేషన్లలో 5ఎస్ విధానంతో పాటు వర్టికల్ విధానం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, సీసీటీఎన్ఎస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు నవీకరించి పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యా ఖ్యలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో ప్రతిభ కనబ ర్చిన 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇందులో అదనపు ఎస్పీ పి.మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, డీసీఆర్బీ, ఐటీ కోర్, ఎన్ఐబీ, కమ్యూనికేషన్, ఫింగర్ప్రింట్ విభాగాల అధికారులు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సేల్స్మెన్కు గాయాలు
కెరమెరి: మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన డీఆర్ డిపో సేల్స్మెన్ చహకటి రాజేశ్వర్ తెల్లవారుజామున తన కుమారుడు జగదీశ్వర్ను బైక్పై ఎక్కించుకుని ఆసిఫాబాద్కు బయలుదేరాడు. మానిక్గూడ సమీపంలో వాహనానికి పందులు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. జగదీశ్వర్కు స్వల్పంగా రాజేశ్వర్కు తీవ్రగాయాలయ్యాయి. 108లో ముందుగా ఆసిఫాబాద్ అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగదీశ్వర్ మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
హత్తిఘాట్.. స్పీడప్
కై లాస్నగర్: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హత్తిఘాట్ ఇండస్ట్రియల్ కారిడార్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన భూసేకరణకు వడివడిగా అడుగులు వేస్తోంది. 2062.01 ఎకరాల భూ సేకరణకు ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారంపై ఫోకస్ పెంచింది. గ్రామసభల నిర్వహణకు సన్నద్ధమవుతుంది. భూ సేకరణ వేగవంతం ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధి భోరజ్ మండలంలోని హత్తిఘాట్ ప్రాంతాన్ని ఆనుకుని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే ఈ ప్రాంతం అనువుగా ఉందా లేదా అనేదానిపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించి భూములను పరిశీలించారు. అనుకూలమని నిర్ధారించడంతో భూ సేకరణ కోసం ఇటీవల పేపర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హత్తిఘాట్, గూడ, రాంపూర్–టి, గిమ్మ–బి గ్రామాల్లోని నీటి ఆధారిత పంటల సాగుకు అనుకూలంగా ఉన్న సారవంతమైన భూమలను సేకరించనున్నారు. ఆయా గ్రామాల్లోని పట్టా భూములు, వివాదాస్పద, సాదాబైనామా, ఈడీ అటాచ్లో ఉన్న భూముల వివరాలన్నింటిపై ఇప్పటికే అధికారులు పూర్తి వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేశారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతమైనందున ఆయా భూముల్లో ఈ సారి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఒకవేళ సాగు చేస్తే స్వల్పకాలిక రకాలకు ప్రాధాన్యం ఇచ్చేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు. 19 నుంచి గ్రామసభలు భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈనెల 19నుంచి గ్రామసభలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ సభల్లో రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలతో పాటు భూములు సేకరించనున్న టీజీఐఐసీ అధికారులు పాల్గొనున్నారు. పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, మండల సర్వేయర్లతో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయనున్నారు. వీరు ఆయా గ్రామాల్లోని సర్వేనంబర్ల వారీగా పట్టాదారులు, వారికున్న భూవిస్తీర్ణం, సాగుభూమి స్థితి వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ హక్కుదారులే కాస్తులో ఉన్నారా లేక ఇతరులేవరైనా సాగు చేస్తున్నారా అనే అంశాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరాకు రూ.3.40 లక్షలు పలుకుతుంది. దీని ఆధారంగా ఎకరాకు ఎంత పరిహారం చెల్లించాలనే దానిపై ఈ సభల్లో నిర్ణయించనున్నారు. భూ వివరాలన్నీ సక్రమంగా ఉన్నట్లయితే పరిహారం నిర్ణయించి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అనంతరం మండల సర్వేయర్లు, టీజీఐఐసీ నుంచి వచ్చే అధికారులతో కలిసి భూముల సర్వే చేపట్టి తుది నివేదిక సిద్ధం చేస్తారు. దాని ఆధారంగా తగు చర్యలు చేపట్టనుంది. ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా అభివృద్ధిపరంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయి. కసరత్తు చేస్తున్నాం హత్తిఘాట్ ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే భూ యజమానులు, వారి పేరిట ఉ న్న భూ విస్తీర్ణం, సర్వేనంబర్లు తెలిపిలా నోటిఫికేషన్ ప్రకటించాం. గ్రామసభలు నిర్వహించి సమగ్ర వివరాలు సేకరిస్తాం. వాటి ఆధారంగా అవార్డు ప్రకటించి తుది జాబితా సిద్ధం చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్ఎస్ చిత్రు, అదనపు కలెక్టర్ గ్రామాల వారీగా సేకరించనున్న భూముల వివరాలు -
సంకల్ప్ ప్రాజెక్ట్కు రిమ్స్ ఎంపిక
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మాతాశిశు మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్ప్ ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని వసతులు, మెరుగైన వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై మంగళవారం హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సెక్రెటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీసీహెచ్ఎస్ డా.ఉపేందర్ జాదవ్, రిమ్స్ పిడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వంశీకృష్ణ, నర్సింగ్ సిబ్బంది అరుణ, సిమ్మి కుమారి, తదితరులు పాల్గొన్నారు. -
సీసీఐ పునరుద్ధరించే దాకా పోరు
ఆదిలాబాద్టౌన్: సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ లక్ష్యంగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ‘హలో యువత.. చలో సీసీఐ పరిశ్రమ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర మంత్రులు గతంలో హామీ లు ఇచ్చారని, అయితే ప్రస్తుతం పరిశ్రమను తుక్కు కింద విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్, విద్యుత్ శాఖలకు సీసీఐ బకా యిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకో వడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు దర్శనాల మల్లేశ్, అఖిలపక్ష నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బండి దత్తాత్రి, మెట్టు ప్రహ్లాద్, గోడం గణేశ్, యూనుస్ అక్బానీ, వెంకటనారాయణ, రాజు, సతీష్, కస్తాల ప్రేమల, ఆయా పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
బహుదూరపు బాటసారులు
పొట్టకూటి కోసం పిల్లాపాపలతో వందల మైళ్లు ఎండనకా..వాననకా వలస జీవులు ప్రయాణం సాగిస్తున్నారు. రాజస్థాన్ నుంచి జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు అధికంగా ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వస్తుంటారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనిముట్ల తయారీ కోసం నిర్మల్, భైంసా, ఆదిలాబాద్ ప్రాంతాలకు రాజస్థాన్ నుంచి వలస కార్మికులు ఐదారు కుటుంబాలు చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకే వాహనంపై నిర్మల్ జిల్లా కేంద్రం నేషనల్ హైవే–61 మీదుగా భైంసా వైపు వెళ్లారు. పిల్లాజెల్లతో.. మూటామల్లె సర్దుకుని వలస వెళ్తున్న కుటుంబాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
● 19 మండలాల్లో వర్షాభావం ● విత్తనాలు వేసిన రైతుల్లో గుబులు ● త్వరితగతిన వర్షాలు పడితేనే ఊరట ● లేనిపక్షంలో విత్తనం నష్టమే!
వ్యత్యాసం – 56 శాతం స్థితి వర్షాభావంసాధారణ 82.6 మి.మీ.లు సాక్షి,ఆదిలాబాద్: ఈ వానాకాలంలో చిరు జల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు 82,870 ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించి రైతులు విత్తనాలు విత్తినట్లు చెబుతున్నారు. అనధికారికంగా సుమారు 2లక్షల ఎకరాల వరకు పొడిదుక్కుల్లోనే విత్తనాలు వేసినట్లు రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జిల్లాలో వర్షాధారంగానే పంటల సాగు ఉండడంతో విత్తనాలు వేసిన రైతులు నింగి వైపు చూస్తున్నారు. రెండు రోజుల్లో వానలు లేకుంటే విత్తన దశలోనే రైతు తీవ్ర నష్టాన్ని చవిచూసే పరిస్థితి. భారీ వర్షాలు ఏవి.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నైరుతి ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రుతుపవనాలకు ముందు కురిసే తేలికపాటి వర్షాలే ఇప్పటివరకు నమోదైన ట్లు చెబుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్ కంటే ముందే మే చివరిలోనే జిల్లాలో భారీ వర్షాలు కు రిశాయి. దీంతో రైతులు మొదటి వారంలోనే పెద్ద ఎత్తున విత్తనాలు వేశారు. అప్పట్లో ఆ వర్షాలు రై తుకు కలిసి వచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నా రు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా తలమడుగు, సొనాల మినహాయిస్తే మిగతా అన్ని మండలాల్లో వర్షాభావ పరి స్థితులే నెలకొన్నాయి. బజార్హత్నూర్ మండలంలో చుక్కవాన పడలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు సాగు విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. సమయ ఆందోళన.. జూన్ మొదటి రెండు వారాల్లోనే రైతులు పొడిదుక్కుల్లోనే విత్తనాలు వేస్తారు. వర్షాలు కురిస్తే అవి మొలకెత్తుతాయనే ఆశతో ముందుకెళ్తారు. జూన్ చివరి వరకు కూడా పత్తి విత్తనాలు వేయడాన్ని సాధారణ సాగుగానే పరిగణిస్తారు. జూలై మొదటి వారంలో కొంత ఆలస్యంగా, ఆ తర్వాత వారాన్ని పూర్తిగా ఆలస్యంగా పరిగణిస్తారు. సోయా విషయానికొస్తే జూలై లోపే విత్తుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సరైన సమయంలో సాగుతోనే ఉత్పాదకత పెరుగుతుందని రైతుల్లో విశ్వాసం. ఆలస్యంగా సాగు చేయడం ద్వారా చీడపీడలు, ఎదుగుదల లోపం, కాత, పూత సరైన సమయంలో రాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమై పంట నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా జూన్లోనే విత్తనాలు వేసేందుకు రైతులు మొగ్గుచుపుతుంటారు. నింగి వైపు రైతు చూపుబజార్హత్నూర్ మండలంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 90 మి.మీ.ల వర్షపాతం కురువాలి. ఇక్కడ ఒక్క మి.మీ. కూడా నమోదు కాలేదు. దీంతో రైతులు విత్తనాలు వేసేందుకు సంకోచించే పరిస్థితి. అయినా 800 ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. వరుణుడి కరుణ కోసం కర్షకులకు ఎదురుచూపు తప్పట్లేదు. తొందరపడొద్దు.. ఈనెల 18, 19 తేదీల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు తేలికపాటి వానలే కురిశాయి. వర్షాధారంగానే పంటలు సాగు చేసే పరిస్థితి ఉండడంతో రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయడం శ్రేయస్కరం. జూన్ చివరి వరకు సమయం ఉన్నందున తొందరపడొద్దు. – శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్ అందుబాటులో పత్తి విత్తనాలు జిల్లాలో ఇప్పటివరకు రైతులు రెండున్నర లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయించారు. 11లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. – రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి -
‘కడెం’కు రక్షణగా ట్రాష్రాక్
కడెం: నిర్మల్–మంచిర్యాల జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ కడెం ద్వారా 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కడెం ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా కడెం, దస్తురాబాద్, జన్నారం, దండెపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రధాన కాలువకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టింది. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యకు చెక్ కడెం ప్రాజెక్ట్ వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, చెత్తాచెదారం ప్రధాన(ఎడమ) కాలువ గేట్లలో ఇరుక్కుని, కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఇబ్బందులు తలెత్తేవి. గతేడాది కాలువ గేటులో భారీ దుంగ ఇరుక్కుపోవడంతో గేటును కిందకు దించలేకపోయారు. ఇలాంటి సమయంలో సాగునీరు వృథాగా పోయో పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా రూ.2.58 కోట్ల వ్యయంతో ట్రాష్రాక్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలువ సమీపంలో ఈ ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టడంతో వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, కట్టెలు, చెత్తాచెదారం అడ్డుకుంటుంది. దీంతో ప్రధాన కాలువకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగునీటిని దిగువకు వదిలేందుకు ఆస్కారం ఉంటుంది. కాలువకు అడ్డుకట్టగా భారీ పిల్లర్లను నిర్మించి, మధ్యలో భారీ ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కాలువకు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలోనూతన గేట్లను అమర్చనున్నారు. ప్రాజెక్ట్పై ప్రభుత్వం ఫోకస్ కడెం ప్రాజెక్ట్ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022, 2023లో కడెం ప్రాజెక్ట్కు వచ్చిన భారీ వరదల కారణంగా ప్రాజెక్ట్ డేంజర్జోన్లోకి వెళ్లింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.12 కోట్ల నిధులతో ప్రాజెక్ట్ వరద గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం రూ.2.58 కోట్లతో ప్రాజెక్టు ఎడమ కాలువకు రక్షణగా ట్రాష్రాక్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నెలాఖరుకు పూర్తి కడెం ప్రధాన కాలువలోకి భారీ దుంగలు వెళ్లి కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాష్రాక్ నిర్మాణం చేపడుతున్నాం. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల చివరినాటికి పనులు పూర్తి చేయిస్తాం. – వీరన్న, డీఈఈ, కడెం ప్రాజెక్ట్ -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
తలమడుగు: చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందిన కాటిపల్లి కపిల్రెడ్డి (31)మంగళవారం అతని స్నేహితులు శైలేందర్, రామయ్య, ప్రమోద్, గంగయ్యతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని వాగుకు వెళ్లారు. విద్యుత్ తీగల సహాయంతో చేపలు పట్టే ప్రయత్నంలో కపిల్రెడ్డి షాక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు. అనుమానాస్పదంగా ఒకరు..తానూరు: అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బోల్సాలో పాలేరుగా పనిచేస్తున్న కందురోళ్ల పీరాజీ (35) సోమవారం రాత్రి యజమాని పశువుల పాకకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన తోటి పాలేర్లకు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్పీ సాయికిరణ్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చాకు, మృతదేహాంపై చింపేసినట్లు ఉన్న చొక్కా, కల్లు సీసాలు, మద్యం బాటిళ్లు గుర్తించారు. భూ వివాదం విషయమై పాత కక్షలతో సమీప బంధువులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బెల్తరోడా–భైంసా రహదారిపై ధర్నా నిర్వహించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..దిలావర్పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంజులాపూర్కు చెందిన ఉప్పల గణేశ్ (57)కు దిలావర్పూర్లోని పాత బస్టాండ్ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. దానిని ము జ్టిగ ముత్యంకు కౌలుకు ఇచ్చాడు. మంగళవారం పంటచేను చూసేందుకు వచ్చాడు. ముత్యంను బస్టాండ్ వరకు రమ్మని పిలవడంతో అతని ఎలక్ట్రిక్ వాహనంపై వెళ్తుండగా నిర్మల్–భైంసా రహదారిపై వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గణేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ముత్యంకు గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. యువతి అదృశ్యంసిర్పూర్(టి): మండలంలోని చీలపెల్లికి చెందిన నిఖిత(21) ఈ నెల 15న రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని, కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. గ్రామానికి చెందిన యు.సునీత కుమార్తె నిఖిత 15న రాత్రి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదన్నారు. గతంలో ఆసిఫాబాద్ మండలం నవేగాంకు చెందిన రెగర్ల వెంకటేష్ నిఖితను తీసుకెళ్లి సిర్పూర్(టి)లో వది లేసి వెళ్లిపోయాడన్నారు. ఇప్పుడు కూడా తమ కూ తుర్ని అతనే తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సునీత ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు
ఉట్నూర్రూరల్: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మంగళవారం త న జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్చం అందించి సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యే బొజ్జుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురా రోగ్యాలు ప్రసాదించాలని, నిరంతరం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి మ రింత కృషి చేసి భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. దాడి కేసులో ఆరుగురు యువకుల రిమాండ్కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె)లో గత నెలలో జరిగిన దాడి కేసులో ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించా రు. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన ముచ్చర్ల సంపత్, అతని స్నేహితులు మందమర్రి టోల్గేట్ సమీపంలోని గోపాల్ దాబా వ ద్దకు వెళ్లగా అక్కడ కొంతమంది వ్యక్తులతో పా ర్సిల్ విషయమై వాగ్వివాదం జరిగింది. అక్కడి నుంచి వచ్చి సోమగూడెంలోని బంధువుల ఇంటివద్ద ఉండగా దాబా వద్ద ఉన్న వ్యక్తులు ఆయుధాలతో అక్కడికి వచ్చి వారిపై దాడికి పాల్పడడంతో సంపత్, అల్లంల ప్రశాంత్, బొ మ్మనవేణి వరప్రసాద్, ఆకుల రాణాప్రతాప్కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దనకుంట్ల మునియప్ప, మహమ్మద్ అబ్బు, మహమ్మద్ సమీరుద్దీన్, అఖిల్, మల్యాల చందు, షేక్ ఫేరోజ్ను అరెస్టు చేశారు. నిందితుల ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గుప్తనిధుల కోసం తవ్వకాలుకాగజ్నగర్రూరల్: మండలంలోని ఈజ్గాం శివారులోని పంటచేలలో గుప్త నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం శివారులోని పంట చేనులో పొక్లెయిన్తో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్టు సమీపంలో తవ్వి పూడ్చిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ముఠాను పట్టుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్గా రమేశ్మంచిర్యాల క్రైం: మంచిర్యాల జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్గా పట్టణానికి చెందిన సమిట్ల రమేశ్ను నియమిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుందని రమేశ్ తెలిపారు. కాగా రమేశ్ 20 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. స్థానిక న్యాయవాదులు, బార్కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్టౌన్: ప్రమోషన్లు పొందాలనుకునే సీని యర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించి, షరతులతో కూడిన పదోన్నతులు ఇ వ్వాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్నాయక్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి సీని యర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. విద్యా హక్కు చట్టం అమలుకు ముందే అనేక మంది ఉపాధ్యాయులు అప్పటి నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో చేరారని, వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు వర్తింపజేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తులు 80 వేలు.. ఇళ్లు 3,700
కై లాస్నగర్: జిల్లాలో ఇందిరమ్మ రెండోవిడత ఇళ్లకు తీవ్ర పోటీ నెలకొంది. మంజూరైన ఇళ్ల సంఖ్య గొరంత కాగా.. అర్హులైన వారి సంఖ్య కొండంతగా ఉంది. దీంతో ఇల్లు ఎవరికి దక్కుతుందనే దానిపై దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాలుగా మారనుంది. గుడిసెలో నివసిస్తున్న వారికి మాత్రమే మంజూరు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో అర్హుల గుర్తింపుపై అధికారులు ఫోకస్ పెంచారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంటున్నారు. నియోజకవర్గానికి 1500 చొప్పున.. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గానికి 1500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ లెక్కన ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు కలిపి 3వేల ఇళ్లు మంజూరయ్యాయి. పాక్షికంగా ఉన్న ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలకు మరో 786 ఇండ్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండలాల్లో అందిన ఎల్–1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా కేటాయించారు. అదే ప్రతిపాదికన గ్రామాల వారీగా కూడా కేటాయింపులు పూర్తి చేసిన హౌసింగ్ అధికారులు కలెక్టర్ రాజర్షి షా ఆమోదం కోసం పంపించారు. అయితే ఈ కేటాయింపుల్లో ఒక్కో గ్రామానికి 5నుంచి 15, జిల్లా కేంద్రంలోని ఒక్కో వార్డుకు 12 నుంచి 13 ఇళ్లు ఎల్1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక సవాలే.. తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 16వేల ఇళ్లు మంజూరయ్యాయి. ప్రజల నుంచి అంతగా పోటీ లేకపోవడంతో ఈ విడతలో అర్హులైనవారితో పాటు రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి ఇళ్లు మంజూరయాయి. వాటి నిర్మాణాలు ముమ్మరంగా సాగుతుండటం, బిల్లులు సైతం వెంటవెంటనే వస్తుండటంతో ఈ విడతలో డిమాండ్ ఏర్పడింది. అలాగే ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లోనూ వందలాది మంది దరఖాస్తులు అందజేయడం తీవ్రతకు అద్దం పడుతుంది. రెండో విడతలో కేవలం 3,786 ఇళ్లు మాత్రమే జిల్లాకు మంజూరయ్యాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇళ్లు లేనటువంటి వారి సంఖ్య (ఎల్–1 జాబితాలో) 80,123 మంది ఉన్నారు. వారంతా సొంతింటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సవాలుగా మారనుంది. తొలి విడతలో ఈ బాధ్యతను పూర్తిగా ఇందిరమ్మ కమిటీలకే అప్పగించారు. దీంతో అనర్హలకు సైతం పెద్ద ఎత్తున ఇళ్లు వచ్చాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సారి కమిటీలు అర్హులైన పేర్లను సిఫారసు చేసినప్పటికీ ఎంపిక మాత్రం అధికారులకే అప్పగించారు. గుడిసెల్లో ఉన్న వారికే ప్రాధాన్యత .. ఈ విడతలో గుడిసెల్లో నివసించే వారినే ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ గ్రామాల్లో అలాంటి వారు లేకపోవడంతో ఇంటి పైకప్పుగా తాడిపత్రి వేసుకుని, రేకుల షెడ్డులో నివసించే వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి తప్పనిసరిగా ఇళ్లను కేటాయించాలి. ఇ లాంటి వారి గుర్తింపు కోసం ఎంపిక చేసిన మండల స్థాయి గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో చేయనుండగా, మున్సిపల్లో కమిషనర్, వార్డు ఆఫీసర్లు చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక రెండో విడతలో జిల్లాకు 3786 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిని మండలాలు, గ్రామాల వారీగా అందిన ఎల్–1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా కేటాయించాం. ఈ విడతలో గుడిసెల్లో ఉన్న వారికే ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వారి గుర్తింపునకు సర్వే జరుగుతుంది. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తాం. కలెక్టర్ ద్వారా వారికి ప్రొసీడింగ్ పత్రాలు అందజేస్తాం. – రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ -
ఇసుక తోడేళ్లు మస్తూ..!
బేల మండలంలోని సాంగిడి వద్ద గల పెన్గంగ ఇది. నదిలో నీరు ఉన్నా ప్రతిరోజు ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గతంలో ఇక్కడ వేలం నిర్వహించిన వీడీసీ సభ్యులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయినప్పటికీ అక్రమ దందా మాత్రం ఆగడంలేదు.ఆదిలాబాద్: పెన్గంగలో ఇసుకాసురులు మకాం వేశారు. నదిని నిత్యం జేసీబీలతో తోడేస్తున్నారు. సహజ సంపదను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో వీరి అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో.. జిల్లాలో పెన్గంగ పరీవాహక ప్రాంతాలైనా భీంపూర్ మండలంలోని వడూర్, అంతర్గాం, అర్లి టీ, గుబిడి, తాంసి కె, భోరజ్ మండలంలోని పెండల్వాడ, జైనథ్ మండలంలోని సాంగ్వి, ఆనందపూర్, బేల మండలంలోని కామ్గార్పూర్, సాంగిడి సమీపంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నదిలో నీరు ఉన్నప్పటికీ జేసీబీలతో తవ్వుతూ ప్రతీ పది నిమిషాలకో టిప్పర్ నింపుతుండడం గమనార్హం. వీటిని సమీప ప్రాంతాలకు తరలిస్తూ డంపింగ్ చేస్తున్నారు. తర్వాత ఇతర ప్రాంతాలకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ ఇసుక ధర ప్రస్తుతం రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పలుకుతోంది. ఇలా రోజుకు లక్షల్లో ఆదాయం సమకూరుతుండడంతో అక్రమార్కులు దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అనుమతుల పేరుతో అక్రమంగా.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి విధానాలను తీసుకువచ్చింది. ఆన్లైన్లో చలానా చెల్లిస్తే ట్రాక్టర్లో ఒక ట్రిప్పు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడే తతంగమంతా మారిపోతుంది. ట్రిప్పు కోసం అనుమతి తీసుకుంటున్న కొంతమంది స్థానిక అధికారులను మచ్చిక చేసుకొని అదనంగా ట్రిప్పులు కొడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుకను చౌకగా అందిస్తుండగా, దానిని సాకుగా చూపి మరికొందరు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. మినహాయింపులతో ఇసుక తరలింపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెన్గంగ నుంచి ఇసుక తరలింపులో కొన్ని మినహాయింపులున్నాయి. ఇంద్రవెల్లి, గాదిగూడ మండలాలకు తరలింపు ఇబ్బందవుతుందని కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టిప్పర్లలో కూడా తరలిస్తున్నారు. విషయం నా దృష్టిలో ఉంది. – రవీందర్, మైనింగ్, ఏడీ ఇది బేల మండలం కాంగార్పూర్ సమీపంలోని పెన్గంగ నది. ఇక్కడ నిత్యం జేసీబీలతో ఇసుకను తోడుతూ టిప్పర్లు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. సమీపంలోని తీర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. చదువుతో పాటు ఆటలు.. నాన్న హర్జి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నేను కూడా హసన్పర్తి లోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివాను. ఫాతి మా స్కూల్లో టెన్త్ పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. మా గురువులు మాపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. చదువుతో పాటు ఆటపాటలు నేర్పించేవారు. అప్పుడు సెల్ఫోన్లు లేవు. జంక్ ఫుడ్ దొరికేది కాదు. బడి ముందర పండ్లు అమ్మేవారు. ఇప్పటికీ మా గురువులు కళ్లలో మెదులుతూనే ఉంటారు. వారంటే ఎనలేని అభిమానం. – డాక్టర్ సాధన, డీఎంహెచ్వో -
బడి స్మృతులు..
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026హుషారుగా వెళ్లేవాడిని.. చిన్నతనంలో బడికి హుషారుగా వెళ్లేవాడిని. ఏ రోజు మారం చేయలేదు. అమ్మ అమిత్షా చిన్నతనంలోనే చదువు ప్రాధాన్యత, క్రమశిక్షణ నేర్పించారు. ఆ స్ఫూర్తితో ఉదయమే నిద్రలేచి ఉత్సాహంగా రెడీ అయ్యేవాడిని. పాఠశాలకు ఎప్పుడూ గైర్హాజరు కాలేదు. చిన్నతనం నుంచి సివిల్స్ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడిని. హోంవర్క్ పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసేవాడిని. బీహార్లోని శిశు మందిరంలో ఒకటి నుంచి రెండో తరగతి, మిథిల పబ్లిక్ స్కూల్లో మూడో నుంచి ఐదో తరగతి వరకు చదివాను. తర్వాత మా కుటుంబం రాజస్థాన్లోని జైపూర్కు రావడంతో అక్కడి మహేశ్వరీ పబ్లిక్ స్కూల్లో 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివాను. కాన్పూర్ ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ బీటెక్ పూర్తి చేశాను. – రాజర్షిషా, కలెక్టర్ సర్కారు బడిలోనే చదివా.. నేను మొదటిరోజు బడికి సంతోషంగానే వెళ్లాను. మా ఇంటి దగ్గరే బడి ఉండేది. 1,2 తరగతులు బ్రాహ్మణవాడ ప్రా థమిక పాఠశాలలో చదివాను. ఆ తర్వాత 5,6 తరగతులు స్టేషన్ రోడ్లో, 7 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ బాలికల పాఠశాలలో పూర్తి చేశాను. ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల్లోనే పూర్తి చేశాను. గురువులు మాపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్లేదానిని. ఆటాపాటలతో విద్యాబోధన చేసేవారు. టీఎల్ఎం ఉపయోగించేవారు. – డి.మాధవి, డీఈవో బాల్యం తిరిగి రాదు.. పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటిరోజే బ డికి వెళ్లేవాడిని. నేను జ మ్ముకశ్మీర్లోని లిటిల్ఫ్లవర్ పాఠశాలలో చ దివా ను. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండడంతో స్నేహితులతో కలిసే అవకాశం ఉండేది కాదు. పాఠశాలకు వెళితేనే ఫ్రెండ్స్తో సరదాగా ఉండేది. మా గురువులు మా పై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. నా ణ్యమైన బోధన చేసేవారు. వారంటే ఎనలేని అభిమానం. అలాగే బాల్యం తిరిగి రాదు. అదో మధుర జ్ఞాపకం. – అఖిల్ మహాజన్, ఎస్పీ కష్టపడి చదివారు.. ఉన్నతస్థాయికి ఎది గారు.. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారు.. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తమ బాల్యంలో బడి స్మృతులను ‘సాక్షి’తో మరోసారి గుర్తుకు చేసుకున్నారు. వారి మాటల్లోనే.. – ఆదిలాబాద్టౌన్ -
నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్ విడుదల
కై లాస్నగర్: కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అన్నారు. టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేషనల్ టాలెంట్ హంట్ కార్యక్రమ ప్రచార పోస్టర్లను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి, కాంగ్రెస్ పార్టీ మీడియా, కమ్యూనికేషన్స్ విభాగంలో సేవలందించేందుకు ఈ నేషనల్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులు, పబ్లిసిటీ కోఆర్డినేటర్లు, రీసెర్చ్ టీమ్ సభ్యులుగా పనిచేయాలనే ఆసక్తి ఉన్న యువత @tpccmc. in వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. -
రక్తదానానికి ముందుకు రావాలి
ఆదిలాబాద్టౌన్: స్వచ్ఛంద రక్తదానం కోసం యువత ముందుకు రావాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో సాధన అన్నా రు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రిమ్స్లో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరా రు.కార్యక్రమంలో పీవో డీటీటీ నరేందర్ రాథో డ్, అదనపు డీఎంహెచ్వో మనోహర్, యువజన సంఘాల నాయకులు బాలశంకర్ కృష్ణ, సిరాజ్, సతీష్రెడ్డి, శ్రీకాంత్, ప్రమోద్, గణేష్, ఠాకూర్ రాణాప్రతాప్ సింగ్, శశికాంత్, అజీజ్, శశికళ, అనిల్, రాజు, పరమేశ్వర్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సిరికొండ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని రిమ్మ గ్రామంలో శనివా రం ఏర్పాటు చేసిన సాముహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులైన దంపతులకు సారె, దుస్తులు అందజేసి సన్మానించారు. గిరిజన సంప్రదాయాలు గొప్పవని అన్నారు. మాజీ సర్పంచ్ అనిల్కుమార్ గ్రా మానికి గ్రంథాలయం కావాలని అడగడంతో మంత్రి వెంటనే స్పందించారు. రూ.10లక్షలు మంజూ రు చేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, నియోజకరవ్గంలోని మారుముల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నా రు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక సర్పంచ్ జంగుబాయి, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం ఆదిలాబాద్రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని బెల్లూరి శివారు గాయత్రి గార్డెన్స్లో శనివారం నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సంక్షేమ పథకాల పారదర్శక అమలుతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం జాబ్ మేళా లో ఉద్యోగాలు పొందిన యువతకు సన్మానం, టా స్క్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే ఎంపికై న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదా రులకు చెక్కులు, మైనార్టీ లబ్ధిదారులకు కుట్టు మిష న్లు, అగ్నిమాపక శాఖకు సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ ఉపకరణాలను పంపిణీ చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో ఎంపీ నగేష్, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ భవనం ప్రారంభం మావల మండలం బట్టిసావర్గాంలో రూ.1.43 కోట్లతో నూతనంగా నిర్మించిన పీహెచ్సీ భవనా న్ని మంత్రి జూపల్లి శనివారం ప్రారంభించారు. -
ఇందిరమ్మ తుది బిల్లుకు ‘ఆవాస్’
కై లాస్నగర్: ఇందిరమ్మ ఇళ్ల తుది బిల్లు మంజూరుకు మార్గం సుగమం అవుతున్నట్లుగా తెలు స్తోంది. గృహ ప్రవేశాలు సైతం పూర్తయిన గ్రామీణ ప్రాంతానికి చెందిన పలువురు లబ్ధిదారులకు తుది బిల్లు చేతికందడం లేదు. దీంతో వారంతా ఎంపీడీవో, హౌసింగ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలాంటి వారి బిల్లుల చెల్లింపుల కోసం కేంద్రం కొత్తగా ఆవాస్సాఫ్ట్ పేరిట కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇందిరమ్మ ఇంటి తుది బిల్లు జమ చేయనున్నట్లుగా హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ యాప్ ద్వారా నగదు చెల్లింపులు షురు కానున్నట్లుగా పేర్కొంటున్నారు. తద్వారా లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడే అవకాశముంది. చెల్లింపులు ఇలా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకం కింద నిరుపేదలకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున నాలుగు విడతల్లో అందిస్తోంది. బెస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, గోడలు నిర్మించాక రూ.లక్ష, రూఫ్ స్లాబ్ వేసిన తర్వాత రూ.2లక్షలు, ఇంటి ప్లాస్టరింగ్, కలరింగ్, విద్యుత్ వంటి వాటితో పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పున విడుదల చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.5లక్షలు అందుతుండగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మాత్రం ఫైనల్ బిల్లు రావడం లేదు. కొందరికి రూ.1.60 లక్షలు రావాల్సి ఉండగా, మరికొందరికి రూ.2లక్షలు అందాల్సి ఉంది. ఇందులో రూ.12వేలు మరుగుదొడ్డి నిర్మాణానికి ఉపాధి హామీ నిధుల నుంచి అందిస్తున్నారు. అలాగే మరో రూ.27వేలను వంద రోజుల ఉపాధి పనుల కల్పన కింద పనులు జరిగినట్లుగా వారికి లెక్కకట్టి రూ.3వేల చొప్పున లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మిగతా నిధులను పీఎంఏవైజీ కింద కేంద్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయడం లేదు. త్వరలోనే చెల్లింపులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు పెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని పెండింగ్లో ఉంచింది. ప్రత్యేక యాప్ ద్వారా త్వరలోనే కేంద్రం నుంచి చెల్లింపులు ప్రారంభమయే అవకాశముంది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. – రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ ప్రత్యేక యాప్తో అందనున్న బిల్లుఇందిరమ్మ లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు అందించేందుకోసం కేంద్ర ప్రభుత్వం అవాస్ సాఫ్ట్ పేరిట ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా చెల్లింపులు చేసేలా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ యాప్ వారం నుంచి పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని దీంతో ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ చెల్లింపులు జరిగే అవకాశమున్నట్లుగా హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ మొదటి విడత కింద జిల్లా వ్యాప్తంగా 16,094 ఇళ్లు మంజూరు కాగా అందులో 2,445 ఇళ్లు పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే వీరిందరికి చివరి బిల్లు చేతికందే అవకాశముంది. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్టౌన్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహన్, వలబోజు గోపీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని పేర్కొందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణలో 30వేల మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సిన అవసరముందని 2028 ఆగస్టు 31 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందులో సంఘ నాయకులు కేశవ్, విలాస్, అనిల్, నాందేవ్ , గంభీర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఊర్లు ప్రభుత్వ పాఠశాలలకే జై కొడుతున్నాయి. తమ పిల్లలను సర్కారు బడికి పంపేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఉపాధ్యాయులు అత్యుత్తమ బోధనతో ఆకర్షిస్తుండగా.. తల్లిదండ్రులు ప్రైవేట్ బాట వీడుతున్నారు. ఏకగ్రీవ తీర్మానాలతో సర్కారు బడి వైపు అడుగులేస్తున్నారు. అందరికీ ఆద
ఉట్నూర్రూరల్: మండలంలోని వడోని ఎంపీపీఎస్లో రెండేళ్ల క్రితం వరకు విద్యార్థుల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే. పాఠశాల మూతపడే పరి స్థితి. ఈ క్రమంలో ఉపాధ్యాయు ల బోధన తల్లిదండ్రులను ఆలో చనలో పడేసింది. తమ పిల్ల లను ప్రైవేట్ నుంచి సర్కారు బడి బాట పట్టించింది. గతేడాది విద్యార్థుల సంఖ్య 70కి పెరగగా.. ఈ ఏడాది మరో 20 కొత్త ప్రవేశాలు నమోదయ్యాయి. 15మంది ఆరో తరగతికి వెళ్లగా ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 75కు చేరువైంది. ఈ సారి నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు జాయిన్ కావడం గమనార్హం. తల్లిదండ్రుల్లో పెరిగిన నమ్మకం ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధ న అందిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు ఏటా ఏకలవ్య, గురుకుల, మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి సీట్లు సాధిస్తున్నారు. తద్వారా తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి ఇక్కడ చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలలో ప్రస్తు తం ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఏటా విద్యార్థుల సంఖ్య పెంపు సాధ్యపడుతుందని ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ గజేందర్ పేర్కొంటున్నాడు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
తలమడుగు: నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని ఖోడద్ గ్రామంలో అంతర్రాష్ట్ర రహదారిపై రూ.34 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేశామన్నారు. ఇందులో సర్పంచ్ లస్మారెడ్డి, నాయకులు కేదారేశ్వర్రెడ్డి, కిరణ్, వెంకటేశ్, ఆనంద్, చందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరంజి(టి) రహదారి నిర్మాణానికి కృషి తాంసి: భీంపూర్ మండలంలోని కరంజి(టి) అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నిపాని నుంచి సావర్గాం మధ్య అంతర్రాష్ట్ర రహదారి ప్రారంభమైన నేపథ్యంలో తాత్కాలిక రోడ్డు మర్మమతు పనులను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు వినోద్రెడ్డి, మహేందర్, అశోక్, సుధాకర్, శ్రీకాంత్ తదితరులున్నారు. -
‘సర్’తో ప్రమాదంలో విపక్షాల ఓట్లు
కై లాస్నగర్: సర్ (ఎస్ఐఆర్) పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో విపక్ష పార్టీల ఓట్లు ప్రమాదంలో పడ్డాయని, భారీగా ఓట్ల చోరీ జరుగుతోందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆరోపించారు. స్థానిక కంది క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన బీఎల్ఏ–2ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఈసీని అడ్డుపెట్టుకుని పథకం ప్రకారం బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తుందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కోల్పోకుండా మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. ఈవిషయంలో బీఎల్ఏ–2ల పాత్ర కీలకమన్నారు. అనంతరం పీసీసీ ట్రైనర్ నరేశ్రాథోడ్, కోఆర్డినేటర్లు రాఘవేంద్రరెడ్డి, మోహన్ కుమార్ ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఇందులో సర్ కోఆర్డినేటర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారి అనూష, బోరంచు శ్రీకాంత్రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, నాయకులు సాయి మౌనారెడ్డి, సంజీవ్రెడ్డి, సాజిద్ ఖాన్, పరమేశ్వర్, పట్టణ కౌన్సిలర్లు, డీసీసీ కార్యదర్ళులు, మండల అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు. -
మోదీ పాలన ఆదర్శం
ఆదిలాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మనదేశం 12ఏళ్లుగా అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాల అమలులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఎంపీ నగేశ్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో అనేక సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని వివరించా రు. ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్ ముస్తపురేతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నాగోబా స్కూల్ ప్రారంభం
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్ను శుక్రవారం ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు చేశారు. ఈప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికే శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్ను ప్రారంభించినట్లు మెస్రం వంశీయులు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, పేద పిల్లలను నాగోబా స్కూల్లో చేర్పించి ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, కేస్లాపూర్ సర్పంచ్ తుకారం, మెస్రం వంశం ఉద్యోగులు దేవ్రావ్, శేఖర్బాబా, మోనోహర్, సోనేరావ్, వంశపెద్దలు కోసేరావ్, హనుమంత్రావ్, నాగ్నాథ్, భీంరావ్ తదితరులున్నారు. -
పంట రుణం ఇక ఈజీ
లక్ష్మణచాంద: ఇప్పటివరకు సాగు సమయం వచ్చిందంటే చాలు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పంట రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు ‘రేపు రండి..మాపు రండి’అంటూ తిప్పించుకునేవారు. ఇక నుంచి పంట రుణాలు కావాలనుకునేవారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్ యాప్ ద్వారా నేరుగా పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కృషిక అనే నూతన యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఆంగ్లంలో ఉండగా, త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని అధికారులు తెలిపారు. కృషిక యాప్ పని తీరు ఇలా.. ప్రయోజనాలు ఇవే.. భవిష్యత్తు లక్ష్యాలు.. -
జాతీయస్థాయి పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: చండీగఢ్లో ఈనెల 10 నుంచి 13 వరకు జరుగుతున్న ‘నేషనల్ క్యాడెట్ జూడో చాంపియన్షిప్ 2026’లో ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వవిద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లాకేంద్రంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో చదువుతున్న మోథం హర్షవర్ధన్ మైనస్ 60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, రమావత్ తరుణ్ మైనస్ 55 కేజీల విభాగంలో కాంస్యం కై వసం చేసుకుని రాష్ట్రకీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. త్వరలో జరగనున్న ఏషియన్ క్యాడెట్, వరల్డ్ క్యాడెట్ జూడో చాంపియన్షిప్లో వీరు పాల్గొనే అవకాశం ఉందని కోచ్ రాజు పేర్కొన్నారు. వీరిద్దరి విజయం జిల్లా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోందని డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. లక్ష్మణ్కు ఉత్తమ రైతు పురస్కారంతాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన రైతు కేమ లక్ష్మణ్ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 62వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రవ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, అధికారులు రైతును సన్మానించి పురస్కారం అందజేశారు. వ్యవసాయరంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. గ్రామస్తులు ఆయన్ను అభినందించారు. తనకు సహకరించిన ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రానికి కేమ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణం తీసింది!
ఖానాపూర్: వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ఒకరు మృతిచెందారని ఆరోపిస్తూ ఖానాపూర్ ప్రభుత్వ ఆ సుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగా రు. రోగిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు, గ్రామస్తులతో కలిసి అధికారులు, వైద్యసిబ్బందిని నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన షేక్ షారుఖ్ తన తండ్రి షేక్ హుస్సేన్ (54)కు గురువారం అర్ధరాత్రి తీవ్రనొప్పులు, అధిక చెమటలు వచ్చాయి. ఆర్ఎంపీ సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బంది కేవలం ఒక ఇంజక్షన్, మూడు మాత్రలు ఇచ్చారని, కనీసం బీపీ పరీక్ష నిర్వహించలేదు. వైద్యుడు ప్రత్యక్షంగా వచ్చి చూడలేదు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని చెప్పకపోవడంతో దా దాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం హు స్సేన్ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధుల్లో నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాత్రివేళ వైద్యుడు అందుబాటులో లేరని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలను ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డి ఖండించారు. రోగికి వైద్యచికిత్స అందించామని, డ్యూటీ వైద్యుడు అందుబాటులో ఉన్నారని, సిబ్బంది రోగి పరిస్థితి వైద్యుడి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపారు. సిబ్బంది అనుమతి లేకుండానే రోగిని ఇంటికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుర్జాపూర్ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్రాములు, నాయకులు భూసి నరేందర్, బొమ్మెన రాకేశ్, ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్షాక్తో ఒకరు..
ముధోల్: విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందిన ట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కోలిగల్లీకి చెందిన ముడుగుల సాయినాథ్ (40), సాయినాథ్ భూమేష్ ఎలక్రీషియన్తో కలిసి మాధవ్నగర్ కాలనీలో శుక్రవారం విద్యుత్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయినాథ్ ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురయ్యాడు. స్థానికులు అంబులెన్సుకు సమాచారం అందించి ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సర్కారు కళాశాలల బలోపేతమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: ‘ప్రభుత్వ కళాశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం.. త్వరలో మధ్యాహ్న భోజన పథకం, యూనిఫాం, నోట్బుక్స్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.. తల్లిదండ్రులు కూడా అన్ని విషయాలు ఆలోచించి పిల్లల్ని ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలి.. ’అని డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? డీఐఈవో: ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అన్ని కళాశాలల లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి అడ్మిషన్లు చేపడుతున్నారు. ఈనెల 30 వరకు గడువు ఉంది. 13 కళాశాలల్లో 1139 మంది విద్యార్థులు చేరారు. సాక్షి: అన్ని కళాశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయా.. వాటి ఏర్పాటు కోసం ఎలా ముందుకెళ్తున్నారు? డీఐఈవో: ప్రతీ కళాశాలలో తాగునీరు, టాయిలెట్స్, ల్యాబ్, గ్రంథాలయం వంటి వసతులు ఉ న్నాయి. ఆరు కళాశాలకు మాత్రమే ప్రహారీలు లే దు. గతేడాది మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.50వేల నిధులు మంజూరు చేసింది. గోడల కు పెయింటింగ్ కూడా వేయించడం జరిగింది. సాక్షి: లెక్చరర్ల కొరతను ఏవిధంగా అధిగమిస్తారు..? డీఐఈవో: కళాశాలల్లో లెక్చరర్ల కొరత లేదు. 33 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తున్నాం. అలాగే 8 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 168 మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. నార్నూర్, తలమడుగు, బోథ్, తాంసి కళాశాలల్లో ఇన్చార్జి ప్రిన్సిపాళ్లు ఉండగా, మిగతా కళాశాలల్లో రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. సాక్షి: వార్షిక ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫలితాలపై ఎలా దృష్టి సారిస్తారు..? డీఐఈవో: వార్షిక పరీక్షల ఫలితాలు తగ్గిన విషయం వాస్తవమే. సప్లిమెంటరీ ఫలితాలు ఫస్టియర్లో నాలుగో స్థానం, సెకండియర్లో ఐదో స్థానంలో నిలిచాం. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. రెమీడియల్ తరగతులు నిర్వహించాం. ఈ ఏడాది ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తాం. సాక్షి: ప్రభుత్వ కళాశాలల్లో తరగతులు సక్రమంగా జరగవనే ఆరోపణలున్నాయి.. మీరేమంటారు? డీఐఈవో: అలాంటిదేమి లేదు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి. లెక్చరర్లు, విద్యార్థులకు ఫేషి యల్ అటెండెన్స్ ఉంది. విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం అందిస్తున్నాం. కళాశాలకు రాకపోతే ఇంటికి వెళ్లి విద్యార్థులను తీసుకొచ్చేలా చూస్తాం. తరగతి గదులతో పాటు కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సాక్షి: నాణ్యమైన విద్యాబోధన కోసం ఎలాంటి చర్యలు చేపడతారు..? డీఐఈవో: ప్రతీ కళాశాలకు ప్రభుత్వం ఈ ఏడాది డిజిటల్ బోర్డులను అందించింది. లెక్చరర్లకు 22 రోజుల పాటు ఓరియంటేషన్ నిర్వహిస్తాం. అన్ని వసతులతో పాటు నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులు చేరాలి. -
సర్కారు బడికి కొత్త అ‘డ్రెస్’
నిర్మల్ఖిల్లా/నిర్మల్రూరల్/మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, స్థానిక సంస్థల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల అందరి యూనిఫాం మారింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే కొత్త యూనిఫాం అమలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న యూనిఫాం రంగుల్లో మార్పులు చేస్తూ కొత్త డిజైన్లను ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యూనిఫాం విధానం అమలులోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, గురుకుల, కేజీబీవీలు తదితర స్కూళ్లు విద్యార్థుల నూతన రంగుల దుస్తులతో శోభను సంతరించుకోనున్నాయి. పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు, అవసరమైన గుడ్డ సరఫరా, కుట్టింపు ప్రక్రియలను త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. సమగ్ర శిక్ష, సెర్ప్, మెప్మా సంస్థల సమన్వయంతో యూనిఫాంల తయారీ, పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంకా చేరని ముడివస్త్రం పాఠశాలలు ఈ నెల 15న పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ విద్యార్థులకు రెండేసి యూనిఫామ్ జతలు అందిస్తారు. ఇప్పటివరకు జిల్లాలకు యూనిఫామ్ వస్త్రం చేరలేదు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ముడివస్త్రం చేరి అక్కడి నుంచి పాఠశాలలకు చేరాలంటే కనీసం నెలరోజులైన పట్టవచ్చు. దీంతో కొన్ని రోజుల వరకు గత సంవత్సరం యూనిఫాంతోనే విద్యార్థులు బడులకు రావాల్సి ఉంటుంది. నిర్మల్ జిల్లాలో గత సంవత్సరం 47,969 మంది విద్యార్థులకు యూనిఫామ్ను స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి అందజేశారు. ఈసారి బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున సుమారు 53,100 మందికి అందించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాలో గత ఏడాది 761 పాఠశాలల్లో 42,711మంది విద్యార్థులకు మొదట 1,86,723 మీటర్ల ముడి వస్త్రం సరఫరా చేశారు. రెండో దఫా 58,059 మీటర్ల వస్త్రం సరఫరా అయింది. గత ఏడాది వేసవి సెలవులకు ముందే యూనిఫామ్కు అవసరమైన వస్త్రం సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసిపోతున్నా ముడివస్త్రం సరఫరాకు నోచుకోలేదు. కొత్తగా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. ప్రత్యేకతలివే.. విద్యాశాఖ విడుదల చేసిన నమూనాల ప్రకారం బాలురకు లైట్ బ్లూ రంగు షర్ట్, నేవీ బ్లూ రంగు ప్యాంట్/నిక్కర్ ఉండనుంది. బాలికలకు లైట్ బ్లూ టాప్తోపాటు నేవీ బ్లూ స్కర్ట్ లేదా దుస్తులు అమలు చేయనున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికల యూనిఫాంలో ప్రత్యేక నేవీ బ్లూ వేస్ట్కోట్ను కూడా ప్రవేశపెట్టారు. తరగతుల వారీగా డిజైన్లలో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. -
ఆర్జేసీలను కొనసాగించాలి
నార్నూర్: ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ బాలుర, ఉట్నూర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను (ఆర్జేసీ) కొనసాగించాలని ఆదివాసీ వి ద్యార్థి సంఘం (ఏఎస్యూ) జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆర్జేసీ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో)గా మార్చి కొనసాగిస్తామని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్జేసీలను య థావిధిగా కొనసాగించాలని కోరారు. అవసరమైతే ప్రత్యేకంగా కొత్త సీఈవో కళాశాలలను మంజూరు చేసి భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సలహాదారుడు పెందోర్ దీపక్, డీఏసీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్, రాజ్గొండ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కుంరం చతుర్షావ్, మండల అధ్యక్షుడు ఆత్రం ప్రమేశ్వర్, నాయకులు మారప గంగారం, కొట్నాక్ శ్యాంరావు, కొట్నాక్ శ్రీరామ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి నిర్ణయం
రైతులు పంట రుణాల కోసం నేరుగా తమ మొబైల్ ఫోన్ల నుంచి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిక యాప్ తీసకురావడం మంచి నిర్ణయం. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది. ఈ యాప్ వల్ల వారికి మేలు చేకూరుతుంది. – నర్సారెడ్డి, రైతు, లక్ష్మణచాంద సద్వినియోగం చేసుకోవాలి కృషిక యాప్ ద్వారా రైతులు తమ పంటల సాగుకు అసవరమైన రుణాలను తమ మొబైల్ ఫోన్ల నుంచే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లకుండా రుణాలు పొందవచ్చు. జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. –రాంగోపాల్, ఎల్డీఎం, నిర్మల్ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కై లాస్నగర్: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణకు నూతన నియమాలను అమలు చేస్తోందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ‘స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేలా ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వర్మి కంపోస్టు బెడ్స్ (వానపాముల ఎరువు తయారీ షెడ్డు)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామం, పట్ట ణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ అనేది అందరి బాధ్యత అని అన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన తడి చెత్తను గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వర్మి కంపోస్టు బెడ్స్కు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేయనున్నట్లు తెలిపారు. వ్యాపార సంస్థలు, హోటళ్లు, మార్కెట్లు, బస్టాండ్ల నిర్వాహకులు తమ పరిసరాల్లో తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసి పరిశుభ్రతకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, సీసీలు కార్తీక్, యాసిన్, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘ప్రీ ప్రైమరీ’ ఎంపిక రప్రక్రియ జిల్లాలో ఈ విద్యాసంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభిస్తున్న ప్రీ–ప్రైమరీ స్కూళ్లలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల నియామకాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ము గిసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఈ ప్రక్రి య చేపట్టారు. 74 ఇన్స్ట్రక్టర్, 74 ఆయా పోస్టులకు వేలల్లో దరఖాస్తులు అందగా మెరిట్ ప్రతిపాదికన ఒక్కో పోస్టుకు ఇద్దరి చొప్పున పిలిచారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఎంపిక చేశారు. వీరికి సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, జిల్లా విద్యాశాఖ అధికారులు లక్ష్మణ్, రఘురమణ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్నికల హామీలు విస్మరించిన బీజేపీ’
కై లాస్నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామనే హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. శుక్రవారం ఆ పార్టీ నాయకులతో కలిసి ఫ్యాక్టరీలో చేపట్టిన కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించకుండా శాశ్వతంగా తుక్కుగా మార్చేస్తోందని మండిపడ్డారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సాజీద్ఖాన్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీ ఎస్సై గంగన్న మృతి
జన్నారం: అనారోగ్యంతో ఎస్బీ ఎస్సై జాడి గంగన్న మృతిచెందారు. మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన ఈయన 1989లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2018లో ఏఎస్సైగా, 2024 సెప్టెంబర్ 26న ఎస్సైగా ప్రమోషన్ పొంది, ప్రస్తుతం రామగుండం ఎస్బీ ఎస్సైగా పనిచేస్తున్నారు. రెండునెలల క్రితం బ్రెయిన్స్ట్రోక్తో హై దరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అనా రోగ్యం బారినపడగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. కాగా, గంగన్న మరో 14 నెలల్లో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. ఆయనకు భార్య అన్నపూర్ణ, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
రైతు అయోమయం
సాక్షి,ఆదిలాబాద్: జూన్ 1నుంచి వానాకాలం సీజన్ మొదలైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివర కు వర్షాభావ పరిస్థితులున్నాయి. ఏడు మండలాలు మినహాయిస్తే మిగతాచోట్ల చినుకు జాడ కరువైంది. ఈనెల 8న తొలకరి పలకరింపుతో పలు మండలాల్లో కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మూడు రోజులుగా వాన లేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటే ఆశలు వ దులుకోవాల్సిందే. జిల్లాలో 20 శాతానికి పైగా రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు వేశారు. మరో వైపు పగటి ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో మిగతా రైతులు వెనకడుగు వేస్తున్నారు. రెండు, మూడు వర్షాలు పడే వరకు వేచి చూడడమే మంచిదని భావిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సైతం అదే సూచిస్తున్నారు. తేలికపాటి వర్షాలున్నాయి.. ఈనెల 14 వరకు తేలికపాటి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే జిల్లాలో ఎక్కడెక్కడ కురుస్తాయనేది స్పష్టత లేదు. పొడి దుక్కుల్లో విత్తనాలు వేయడం రిస్క్తో కూడుకున్నది. మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తుకోవడం మంచిది. – శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్ భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన ముకుంద్ సంతోష్ తొలకరికి ముందే ఈనెల 5న తనకున్న 19 ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తాడు. మృగశిరకార్తే రోజు తొలకరితో సంబురపడ్డాడు. అయితే నాలుగు రోజులైనా వాన జాడ లేకపోవడంతో ఆందోళన మొదలైంది. ఒక సంతోష్ మాత్రమే కాదు.. జిల్లాలో విత్తనాలు వేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి. జిల్లాలోని 21 మండలాల్లో వర్షపాతం వివరాలు.. అధిక : తలమడుగు, సిరికొండ, సొనాల సాధారణ : భీంపూర్, జైనథ్, మావల, తాంసి వర్షాభావం : బేల, గుడిహత్నూర్, ఆదిలాబాద్అర్బన్, బోథ్, ఉట్నూర్, సాత్నాల, భోరజ్ తీవ్ర వర్షాభావం : గాదిగూడ, నార్నూర్, ఆదిలాబాద్రూరల్, నేరడిగొండ, ఇచ్చోడ అసలే వర్షం కురవని ప్రాంతాలు : ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ -
రాష్ట్రస్థాయిలో మెరిసిన జిల్లా అథ్లెట్స్
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో మెరిశారు. ఈనెల 11,12 తేదీల్లో ఓయూ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి మెన్, ఉమెన్, జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా అథ్లెట్లు నాలుగు పతకాలతో సత్తా చాటారు. హ్యామర్త్రోలో దివిటి అరుణ (స్వర్ణ), డిస్కస్త్రోలో కాంస్య పతకాలతో మెరిసింది. ట్రిపుల్ జంప్లో సీహెచ్ వసంత స్వర్ణంతో సత్తా చాటగా, హ్యామర్త్రోలో రాధారాణి రజత పతకం సాధించింది. అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేష్, కోచ్ వీజీఎస్ రాకేశ్ క్రీడాకారులను అభినందించారు. -
ఆవుకు అరుదైన శస్త్రచికిత్స
ఆదిలాబాద్(బేల): మండలంలోని పొన్నాల గ్రా మంలో ఆవుకు సోకిన హార్న్ క్యాన్సర్ (కొమ్ము క్యా న్సర్)ను పశువైద్యులు శుక్రవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు. రైతు అశోక్ పుల్మ రేకు చెందిన ఆవు కొమ్ము భాగంలో క్యాన్సర్ గడ్డలతో తీవ్ర ఇబ్బంది పడుతుండగా, పశువైద్యులు స కాలంలో స్పందించి ప్రాణదానం చేశారు. పశువైద్యాధికారి వినోద్ దేశ్పాండే.. శస్త్రచికిత్స చేశారు. కొమ్ము భాగాన్ని శాసీ్త్రయ పద్ధతిలో తొలగించారు. రక్తస్రావం కాకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. శస్త్రచికిత్స అనంతరం ఆవు ఆ రోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గాయం మానడానికి అవసరమైన చికి త్స అందిస్తున్నామని, కొన్నిరోజుల అనంతరం ఆ వు పూర్తిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. పశువైద్యుల బృందాన్ని స్థానిక రైతులు అభినందించారు. -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ క మాండ్ కంట్రోల్ సెంటర్లో ఆదిలాబాద్ పట్ట ణ కౌన్సిలర్లు, ఆదిలాబాద్రూరల్, జైనథ్, భీం పూర్, బేల, తాంసి, తలమడుగు మండలా ల సర్పంచ్లకు సీసీ కెమెరాల ప్రాధాన్యతపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో గతంలో సీసీ ఫుటేజీ ఆధారంగా ఛేదించిన పలు కేసులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు.సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్అనూష, వైస్చైర్మన్ మహమ్మద్ రోహిత్, ఆది లాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, సీఐలు బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, ప్రేమ్ కుమార్, శ్రావ ణ్, రహీంపాషా తదితరులు పాల్గొన్నారు. -
అధ్యక్షా.. మేముసైతం
నిర్మల్ఖిల్లా: హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్నేహ మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా చిన్నారులు ప్రతిభ కనబర్చారు. కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన స్నేహ సంఘం సభ్యురాలు దీటి శ్రీనిజ (8వ తరగతి) డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించి పేదరికంపై అద్భుతంగా ప్రసంగించి అందరి ప్రశంసలు పొందింది. సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన హాసిని ఎంపీగా వ్యవహరించి తన ప్రతిభ చాటుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, అధికారుల సమక్షంలో మాక్ పార్లమెంట్ గురువారం సాయంత్రం నిర్వహించగా ఇందులో పాల్గొన్నారు. వీరిని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. చిన్నారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతనెల 30న నిర్మల్లో నిర్వహించిన జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్లో ఈ చిన్నారులు ప్రతిభ కనబర్చగా కలెక్టర్ భవేశ్మిశ్రా అభినందించారు. -
‘డబుల్’ పనులు త్వరగా పూర్తి చేయాలి
కైలాస్నగర్: జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీ, మావల మండల కేంద్రం సర్వే నంబర్ 170లో లబ్ధిదారులకు కేటాయింపునకు సిద్ధమైన డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో క్షేత్రస్థాయిలో ఇళ్లను పరిశీలించారు. వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, తాగునీరు, శానిటేషన్ పనులు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని గాంధీ పార్క్ను సందర్శించారు. పార్క్లో చేపట్టిన ఏడు ఫామ్ పాండ్స్, ఐదు బోర్ వెల్ రీచార్జ్ స్టక్చ్రర్స్ నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మెప్మా పీడీ సీవీఎన్ రాజు, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్అండ్బీ డీఈ ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వద్దు పథకాల అమలు, భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి మా ట్లాడారు. పెండింగ్ ఫైళ్లను గడువులోపు క్లియర్ చే యాలని ఆదేశించారు. ‘భూ భారతి’, సాదాబైనా మాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రెవె న్యూ, అటవీ శాఖల భూ సరిహద్దు వివాదాలను సమన్వయంతో పరిష్కరించుకోవాలని తెలిపారు. వివాదాస్పద భూముల్లో జాయింట్ సర్వే నిర్వహించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పే ర్కొన్నారు. కమ్యూనిటీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేయవద్దని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవె న్యూ) ఆర్ఎస్ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్రావు, ఉట్నూర్ ఆర్డీవో మోహన్ సింగ్, కలెక్టరేట్ ఏవో వర్ణ, సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ఎల్నినో ప్రభావం.. పిడుగులకు ఆస్కారం!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో తొలకరి వర్షాలు కురవడంతో రైతులు దుక్కిలో విత్తనాలు వేసే పనుల్లో ఉన్నారు. వానాకాలం మొదలైన నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు కురవలేదు. వాతావరణంలో తే మ తగ్గలేదు. ఉష్ణోగ్రతలు వేసవి స్థాయిలోనే ఉన్నా యి. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిడుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి కారుమబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో కూడిన ఉరుములు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ హృదయ విదారక ఘటన గతేడాది జూన్ 12న చోటుచేసుకుంది. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో దుక్కిలో విత్తనాలు వేస్తుండగా పిడుగు పడడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృత్యువాత పడ్డ నలుగురిలో ఇద్దరు తండ్రి కూతురు కాగా, మిగతా ఇద్దరు వారి సంబంధీకులే. అదేరోజు బేల మండలం సాంగిడి, సోన్కాస్ గ్రామాల్లో పిడుగుపాటుకు గురై మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఆ సమయంలోనే ఉట్నూర్ మండలం కుమ్మరితండాలో పిడుగు పడడంతో ముగ్గురు గాయపడ్డారు. -
పారిశుద్ధ్యం లోపించొద్దు
ఇంద్రవెల్లి: వానాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని డీపీవో రమేశ్ సూచించారు. గురువా రం మండలంలోని దనోరా(బి) గ్రామపంచా యతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, డంపింగ్ యార్డు, విద్యుత్, తాగునీటి సరఫరా తది తర వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు పరి శీలించారు. ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. సర్పంచ్ జాదవ్ జమునానాయక్, ఉప సర్పంచ్ షేక్ కరీంలాలా, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. -
ప్రీప్రైమరీ స్కూళ్లను రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: ప్రీప్రైమరీ స్కూళ్లను వెంటనే ర ద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వా డీ టీచర్లు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడా రు. ప్రభుత్వం ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పీఎంశ్రీ ప్రీప్రైమరీ స్కూళ్లను రద్దు చేసి వీటికి కేటాయించే నిధులను అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలని కోరారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సంఘం నాయకురాళ్లు సునీత, పార్వతి, కళావతి, రాధ, శోభ, విజయ, రత్నలక్ష్మి, నజీమ, కళ్యాణి తదితరులున్నారు. -
ముగిసిన ఏఐ, లైఫ్ స్కిల్ శిక్షణ
ఆదిలాబాద్రూరల్: నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్లో జిల్లాలోని విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న ఏఐ, లై ఫ్ స్కిల్ శిక్షణ గురువారం ముగిసింది. విద్యార్థులకు పీపీటీ తయారు చేసి ప్రజెంటేషన్ చేశారు. అగ్రికల్చర్లో అభివృద్ధి, పోటీ పరీక్షలపై అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేశారు. డీబీసీడీవో సోనియా, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఫ్యాకల్టీ మహేందర్రావు, శశాంక్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
గిరిజన గ్రామాలాభివృద్ధికి కృషి
బోథ్: గిరిజన గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలో ని కంటేగావ్ గ్రామంలో రూ.15లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడ తూ.. గ్రామస్తుల సహకారంతో పెండింగ్ సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. గ్రామానికి చెందిన రాథోడ్ ఇందల్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి గురై ఇళ్లు కో ల్పోయిన జాదవ్ దేవిదాస్, హీరాలాల్ కుటుంబా లను కలిసి ఓదార్చారు. అండగా ఉంటామని భరో సా ఇచ్చారు. మండలంలోని మర్లపల్లి గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించి నందుకు గ్రామస్తులు సర్పంచ్ శీలాబాయి అంబాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బోథ్లో పర్యటించిన ఎమ్మెల్యే పట్టణంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు ఉండడంతో వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులున్నారు. -
20న జాతీయ లోక్ అదాలత్
బోథ్: ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని బోథ్ కోర్టు న్యాయమూర్తి కె. సందీప్ తెలిపారు. న్యా యస్థాన ప్రాంగణంలో న్యాయవాదులతో ఆ యన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుదీ ర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఎక్కువ మొత్తంలో పరిష్కరించేలా న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. ఈమేరకు కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సమ యం, డబ్బు ఆదా అవుతాయని, ఇరువర్గాల కు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ పంద్రం శంకర్, బార్ అసోసియేషన్ సెక్రెటరీ రూపేందర్ సింగ్, న్యాయవాదులు ఆడెపు హరీశ్, మహేశ్, గంగసాగర్, సందేశ్ పాల్గొన్నారు. -
దేశ చరిత్రలో ప్రధాని మోదీ రికార్డు
తలమడుగు: ప్రధాని నరేంద్రమోదీ దేశ చరిత్రలో అత్యధికంగా 4,399 రోజుల పాలన సాగిస్తూ రికార్డు సృష్టించారని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు దేశాన్ని అత్యధిక రోజులు పాలించిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ గౌడ్, నాయకులు తాటిపల్లి గంగాధర్ రాజు, చంద్రకాంత్, ప్రభాకర్, వామన్ పటేల్, జీవీరమణ, వెంకటస్వామి, కిరణ్, నారాయణ, ప్రేమేందర్ రెడ్డి, స్వామి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో ఖైదీల్లో సానుకూల మార్పు
ఆదిలాబాద్టౌన్: ఖైదీల్లో సానుకూల మార్పునకు యోగా దోహద పడుతుందని జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.గోపిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకు ని జిల్లా జైలులో బుధవారం నుంచి యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. 200 మంది ఖైదీలు, 45 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకా గ్రత పెంపొందుతుందని అన్నారు. ఈ శిక్షణ ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో జైలర్ ఎన్.చంద్రశేఖర్, సిబ్బంది, తతోవంశి యోగా గురువు విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
మోదీ పుష్కర పాలనపై ఎమ్మెల్యే పూజలు
ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్వాడి ధర్మశాల శ్రీవేంకటేశ్వర ఆలయంలో బీజే పీ నాయకులతో కలిసి పూజలో పాల్గొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారని తెలిపారు. సుదీర్ఘకాలం పనిచేసిన ప్ర ధానులలో ఒకరిగా నిలిచి దేశానికి గర్వకారణంగా మారారని కొనియాడారు. పుష్కరకాలంలో పేదలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం జనధన్, ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రుణాల మంజూరు వేగవంతం చేయాలి
కై లాస్నగర్: ప్రభుత్వ సంక్షేమ, అభివవృద్ధి పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని, లక్ష్యం మేరకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన డీఎల్ఆర్సీ డీసీసీ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని బ్యాంకు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ, ఎన్ఎల్ఎం, పీఎం విశ్వకర్మ వంటి ప్రతిష్టాత్మక పథకాల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. వివిధ పథకాల కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించి రుణాల మంజూరు వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం సంప్రదాయ వ్యాపారాలకే పరిమితం కాకుండా, సరికొత్త ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల ప్రకారం మంజూరు చేయాలన్నారు. ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా డ్రోన్ల వినియోగం, రూఫ్ టాప్ సోలార్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కొత్త తరహా రుణాలు అందించాలని పిలుపునిచ్చారు. అలాగే అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన రైతులకు కూడా లోన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు లీడ్ డిస్టిక్ర్ట్ మేనేజర్ ఉత్పల్ కుమార్ ధామ్ జిల్లా ఆర్థిక ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రావూఫ్, ఆర్సేటీ డైరెక్టర్ మహ్మద్ గౌస్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
పెట్రో ధరలు తగ్గించాలి
కై లాస్నగర్: పెంచిన పెట్రో, వంటగ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతూ సా మాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. ఫలితంగా పెరిగిన నిత్యావరాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగి న గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, అర్ధాంగి రమేశ్, అమీనా బేగం, మహబూబ్ ఖాన్, సలీం,షేక్ పాషా, కట్గోజి స్వామి, ఎస్.అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పర్యటించిన శిక్షణ ఐఏఎస్లు
ఇంద్రవెల్లి: 2025 బ్యాచ్కు చెందిన శిక్షణ ఐఏఎస్లు బుధవారం జిల్లాలో పర్యటించారు. తెలంగాణ దర్శన్లో భాగంగా ట్రైయినీ ఐఏఎస్లు హరిప్రసా ద్, సాయి సురేశ్, సాయి శివాని, శ్రీకాంత్రెడ్డి, సచి న్ భజవరగుట్టు, పసర్కుమార్ ముందుగా కేస్లాపూర్ చేరుకున్నారు. నాగోబా ఆలయంలో పూజలు చేపట్టారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూ పాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించారు. ఇందులో ఐటీడీఏ ఏపీవో వసంత్రావ్, డిప్యూటి ఈవో చందన్, ఏపీవో పీవీటీసీ భాస్కర్, డీఈ తా నాజీ, ఎస్వో రాజ్కుమార్, జేడీఎం నాగభూషణ, నాగ్నాథ్ తదితరులున్నారు. ‘ఐటీడీఏ’లో అధికారులతో సమీక్ష ఉట్నూర్రూరల్: మండలంలోని కామాయిపేట గ్రా మాన్ని సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని పీవో చాంబర్లో వివిధ శాఖ ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ఆదిలాబాద్టౌన్: ‘ఏజెన్సీ పరిధిలో మాతా శిశు మ రణాల నివారణకు చర్యలు చేపడతాం.. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం.. ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి..’ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సాధన అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమె బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? డీఎంహెచ్వో: వానాకాలందృష్ట్యా అ ప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య సిబ్బందికి సూచించాం. జి ల్లాలోని ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చే స్తాం. జూలైలో ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేపడతాం. డీఎంహెచ్వో కార్యాలయంలో కాల్సెంటర్ ఏ ర్పాటు చేసి 24గంటల పా టు సేవలు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, డయేరియా వంటివి ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. సాక్షి: కొంత మంది సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఎంహెచ్వో: వైద్యులు, సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా చర్యలు చేపడతాం. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. పీహెచ్సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండాలి. సాక్షి: డెంగీ, మలేరియా వ్యాధులపై ఎలాంటి ముందస్తు చర్యలు చేపడతారు..? డీఎంహెచ్వో: వానాకాలంలో దోమ కాటుతో డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలుతాయి. గతేడాది జిల్లాలో నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు చేపడతాం. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా అవగాహన కల్పి స్తున్నాం. వర్షపు నీరు నిల్వ ఉండడంతో అందులో దోమలు వృద్ధ చెంది వ్యాధులకు కారణమవుతాయి. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. సాక్షి: జిల్లాలో ఏమైనా మందుల కొరత ఉందా..? డీఎంహెచ్వో: ప్రస్తుతానికి లేదు. వ్యాధుల సీజన్ కావడంతో డ్రగ్ స్టోరేజీలో అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతాం. పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్హెల్త్ సెంటర్లు, ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది వద్ద అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా చూస్తాం. సాక్షి: కటాఫ్ విలేజ్లపై ఎలాంటి దృష్టి సారిస్తారు..? డీఎంహెచ్వో: జిల్లాలో 192 కటాఫ్ విలేజ్లు ఉ న్నాయి. ప్రతీ పీహెచ్సీలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీ మ్లను ఏర్పాటు చేశాం. ఆయా గ్రామాల్లో ఉండే గర్భిణులను వారం రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్లకు తరలించడం జరుగుతుంది. హైరిస్క్ గర్భిణులను ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఇంటికి వెళ్లిఅవసరమైనచర్యలు చేపడతాయి. సాక్షి: వైద్యుల కొరత తీవ్రంగా ఉంది.. ఎలా అధిగమిస్తారు? డీఎంహెచ్వో: పీజీ విద్యకోసం 18 మంది వైద్యులు వెళ్లడంతో పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఆర్బీఎస్కే, జన్మన్ వైద్యుల ద్వారా సేవలు అందిస్తున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేలా చూస్తాం. సాక్షి: మాతా శిశు మరణాల నివారణకు ఎలాంటి చర్యలు చేపడతారు..? డీఎంహెచ్వో: జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ఇదివరకు ఎనీమియాతో గర్భిణులు మృత్యువాత పడేవారు. ఇటీవల బీపీ కారణంగా చనిపోతున్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను ఏఎన్ఎం, ఆశ, సూపర్వైజర్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయిస్తాం. అవసరమైన వారిని వెంటనే రిమ్స్కు తరలించేలా చర్యలు చేపడతున్నాం. -
యువతకు హితబోధ..
గుడిహత్నూర్: తోషంలో నిర్వహించిన గ్రామసభలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ, గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యు వత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హైల్మెట్, సీట్ బెల్టు ధరించడంతో పాటు మద్యం సేవించకుండా వాహనాలు నడపాలన్నారు. అనంతరం 30 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద సమయంలో ఉపయోగపడే ఫస్టయిడ్ కిట్లు పంపిణీ చేశారు. యువతకు ఐదు వాలీబాల్ కిట్లు, 200 మందికి హెల్మెట్లు అందజేశారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. 75 మంది యువతకు లర్నింగ్ లైసెన్స్ అందజేశారు. గతంలో లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషాతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
వెళ్లింది 12 మంది.. వచ్చింది ఇద్దరు
ఆదిలాబాద్టౌన్: మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రిమ్స్ పరిస్థితి. ప్రతీసారి బదిలీల్లో రిమ్స్ ఆస్పత్రిపై నిర్లక్ష్యం జరుగుతోంది. అసలే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు అధిక పో స్టులు కేటాయించాల్సిన అధికారులు ఉన్న వారిని బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని కేటాయించకపోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రోగుల వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్లో ఇప్పుడిప్పుడే ఖాళీలు భర్తీ అవుతుండగా, ఈ బదిలీల్లో ఉన్న పోస్టులు ఖాళీ అయ్యాయి. 12మంది వైద్యులకు బదిలీలు జరగగా, నలుగురిని మాత్రమే కేటా యించారు. వీరిలో ఇద్దరు రిపోర్టు చేశారు. దీంతో పాటు 2021 బ్యాచ్కు చెందిన స్టాఫ్ నర్సులు దా దాపు అందరూ బదిలీ అయ్యారు. 60 మందికి స్థానచలనం జరగగా, మంగళవారం 10లోపు మా త్రమే రిపోర్టు చేశారు. బదిలీ అయిన వారి స్థానాల్లో పూర్తిస్థాయిలో చేరే అవకాశాలు కానరావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపితే గా ని పరిస్థితి మారే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే రిమ్స్లో వైద్యు ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా భర్తీకి నోచుకోవడం లేదు. ఉన్నవారిని బదిలీ చేయడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి. 12మంది వైద్యులకు బదిలీలు సాధారణ బదిలీల్లో భాగంగా రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు. రిమ్స్లో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లు తానాజీ జాడే, కరుణాకర్, రత్నకుమారి, సరోజ బదిలీ కాగా, రిమ్స్కు ప్యాథాలజీకి సంబంధించి నీలవేణికు ప్రొఫెసర్ పోస్టు కేటాయించారు. అయితే, ఈమె ఇంకా విధుల్లో చేరలేదు. అ సోసియేట్ ప్రొఫెసర్లను జనరల్ మెడిసిన్ సందీప్ పవార్, గైనిక్ విభాగానికి సంబంధించి పి.క్రాంతి, పీడియాట్రిక్ వైద్యులు హేమలత, కన్నయ్య, జనరల్ సర్జన్ జి.సృజన, ఆర్థోపెడిక్ అవినాష్రెడ్డితో పాటు మరో అసోసియేట్ ప్రొఫెసర్కు ట్రాన్స్ఫర్ అయింది. ఈ విభాగంలో బి.గవస్కర్ మాత్రమే నిజామాబాద్ నుంచి వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో జనరల్ మెడిసిన్లో కమలాకర్ బదిలీ అయ్యారు. సైకియాట్రిక్ విభాగంలో నిజా మాబాద్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ బదిలీపై వచ్చారు. మంచిర్యాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నీలవేణి విధుల్లో చేరాల్సి ఉంది. నలుగురు ప్రొఫెసర్ల బదిలీలు జరగగా, ఒకరు వస్తున్నారు. అసోసియేట్లో ఐదుగురికి బదిలీ కాగా, ఒకరిని కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెర్లలో ముగ్గురికి బదిలీ కాగా, ఇద్దరిని కేటాయించారు. స్టాఫ్ నర్సుల పరిస్థితి కూడా.. 2021 బ్యాచ్కు సంబంధించిన స్టాఫ్ నర్సులకు బదిలీలు జరిగాయి. రిమ్స్ నుంచి అత్యధికంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు బదిలీ చేశారు. 60 మంది వరకు బదిలీలు జరగగా, జిల్లాలో పది మంది వరకు రిపోర్టు చేశారు. స్టాఫ్ నర్సుల పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ అవుతాయా.. లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు చికిత్స చేస్తే, స్టాఫ్ నర్సులు వారికి వైద్యసేవలు అందిస్తారు. ఈ పోస్టులు ఖాళీగా ఉంటే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం గగనమే. -
మేల్కోకుంటే.. ముప్పే!
కై లాస్నగర్: వర్షాకాలం మొదలైంది. పట్టణంలోని చాలా డ్రెయినేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. పూడిక పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షానికే అవి పొంగి ప్రవహించే అవకాశముంది. ముందస్తు చర్యల్లో భాగంగా వేసవిలోనే పూడికతీత పనులు చేపట్టాల్సిన బల్దియా యంత్రాంగం ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించలేదు. గతేడాది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలు కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా పాఠం నేర్వని అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూడిక తొలగింపుపై అలసత్వం.. మున్సిపల్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని విద్యానగర్, రాంనగర్, సుభాష్నగర్, రిక్షాకాలనీ, రిమ్స్, పంజాబ్చౌక్, శాంతినగర్, మహలక్ష్మివాడ, హౌసింగ్బోర్డు, ఖానాపూర్, తాటిగూడ, దస్నాపూర్ వంటి పలు కాలనీల్లో సుమారు 20కి పైగా భారీ డ్రెయినేజీలు ఉన్నాయి. వీటిలో కొ న్నింటిని పారిశుద్ధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు శు భ్రం చేయిస్తున్నారు. కొన్నింటిని జేసీబీలతో మా త్రమే శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ప్ర క్రియ సాగకపోవడంతో ఆయా డ్రెయినేజీల్లో చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే వరదంతా రోడ్లపై ప్రవహించే అవకాశముంది. గతేడాది ఇదే పరిస్థితి తలెత్తింది. వర్షాకాలం రాకముందే పూడికతీత పనులపై దృష్టి సారించాల్సిన బల్దియా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది కూడా మళ్లీ వరద ముంపు సమస్య తప్పకపోవవచ్చని ఆయా కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకపాత్రలో బల్దియా ... గతేడాది ఆలస్యంగా పనులు చేపట్టడంతో పంజాబ్ చౌక్లోని భారీ డ్రెయినేజీ ఉప్పొంగి మురుగునీరంతా రోడ్లపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాటిగూడ, మహాలక్ష్మివాడ కాలనీల్లోని ప లు ఇళ్లలోకి మురుగునీరు చేరింది. ఎగువ నుంచి వ చ్చిన వరదతో జీఎస్ఎస్టేట్ పూర్తిగా జలమయమైంది. దాని ఎదుట గల ప్రధాన పాత జాతీయ రహదారిపై ఐదారు గంటలు రాకపోకలు స్తంభించాయి. స్వయంగా కలెక్టర్ రాజర్షి షా అక్కడికి చేరుకుని పు నరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ సారి ఇప్పటి వర కు కనీసం వరద ప్రాంతాలను గుర్తించకపోవడం, టెండర్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో మళ్లీ ముప్పు తప్పవకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. త్వరలోనే పూడికతీత పనులు పట్టణ పరిధిలో ఎన్ని వరద డ్రెయినేజీలు ఉన్నాయి.. గతేడాది ఏయే చోట్ల సమస్యలు తలెత్తాయనేదానిపై ఆరా తీస్తున్నాం. స్వయంగా కాలనీలకు వెళ్లి పరిశీలిస్తున్నాం. త్వరలోనే గుర్తించి పూడికతీత పనులు చేపట్టేలా టెండర్ల ప్రక్రియ చేపడతాం. ఒకవేళ ఆలస్యమైతే అడ్వాన్స్గానైనా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – ఏ.జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో.. వార్డులు : 49 కుటుంబాలు 48,393 జనాభా : 1,50,383 ప్రధాన డ్రెయినేజీలు : 20 -
పిడుగుల దడ!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మె రుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకా లం ఆరంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవా లు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. ఒక్కోసారి ఒకే కు టుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది. వానాకాలంలో తీవ్రత ఎక్కువ ప్రధానంగా వానాకాలం సీజన్ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మే ఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్ర యాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నా రు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నా యి. మరికొన్ని సమయాల్లో సెల్టవర్లు, విద్యుత్ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి. ‘దామిని’తో తప్పును ముప్పు ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్ సమాచారాన్ని లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘దామిని’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్ చేసుకుంటే చదువురాని వారు సైతం సు లువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రో జు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. గాల్లో కలుస్తున్న ప్రాణాలు జాగ్రత్తలే రక్ష -
జాడలేని యూనిఫాం
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫాం జాడ లేదు. మరో ఐదు రోజుల్లో బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు వస్త్రం చేరుకోలేదు. అయితే కుట్టిన యూనిఫాం అందజేస్తారా.. లేక వస్త్రం పంపిస్తారా అనే విషయం విద్యాశాఖ అధికారులకు సైతం తెలియడం లేదు. ప్రతిసారి మార్చి, ఏప్రిల్లోనే వస్త్రం వచ్చేది. అయినా బడి రీఓపెన్ అయ్యే సమయానికి ఒక జత కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేని పరిస్థితి. ఈసారి వస్త్రమే రాలేదు. ఇక కుట్టడం ఎప్పుడని ఉపాధ్యాయుల్లో సందేహం వ్యక్తమవుతుంది. కాగా, పాఠశాల విద్యా శాఖాధికారులు మాత్రం మొదటి రోజు యూనిఫాం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చిరిగిన దుస్తులతోనే.. ఈ విద్యా సంవత్సరం జూన్ 15న బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఏటా కనీసం 50 శాతం మంది విద్యార్థులకై నా మొదటి రోజు పాఠ్య పుస్తకాలతో పాటు ఒక జత యూనిఫాం అందజేసేవారు. అయితే ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు. చిరిగిన దుస్తులతోనే బడికి వచ్చే పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రెడీమేడ్ దుస్తులు పంపిణీ చేస్తే విద్యార్థులకు వదులుగా, చిన్నవి, పెద్దవిగా సైజులు సరిపోక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా యూనిఫాం కుట్టిస్తుండడంతో సమస్య ఎదురయ్యేది కాదు. రెండేళ్లుగా స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. సకాలంలో కూలీ అందకపోయినా యూనిఫాంలను మాత్రం కుట్టి పాఠశాలలకు అందజేసేవారు. మరి ఈసారి పరిస్థితి ఏమిటనేది తెలియరావడం లేదు. 73,884 మంది విద్యార్థులకు.. జిల్లాలో 1180 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో 73,884 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. రెండేళ్లుగా స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫాం కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. ఈ కుట్టుకు సంబంధించిన బాధ్యతలను డీఆర్డీఏకు అప్పగించేవారు. యూనిఫాంలు త్వరగా కుట్టించేలా ప్రభుత్వం మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసేవారు. ఈసారి ఆ కమిటీలు కూడా వేయలేదని తెలుస్తోంది. అయితే గతనెల 27న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ యూనిఫాంకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. డేస్కాలర్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాం, బ్లాక్ షూ, రెండు సాక్సులు, బెల్టు అందిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూల్, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నైట్ డ్రెస్, పీటీ డ్రెస్, ట్రాక్సూట్, వైట్ షూ, రెండు సాక్సులు, టవల్, ప్లేట్, గ్లాస్, కటోరా, కప్పులు, స్పూన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. వీటన్నింటిని బడులు తెరిచిన మొదటిరోజు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపినప్పటికీ ఇంకా బడులకు చేరుకోలేదు. యాజమాన్యం పాఠశాలలు విద్యార్థుల డీఈవో పరిధిలో 974 52,485 ట్రైబల్ వెల్ఫేర్ 171 14,054 బీసీ గురుకులాలు 06 331 ఎస్సీ గురుకులాలు 16 1975 గిరిజన గురుకులాలు 06 1755 జ్యోతిబాపూలే పాఠశాలలు 07 3284 యూనిఫాం అందించేలా చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించేలా చర్యలు చేపడుతున్నాం. బడులు తెరిచిన మొదటి రోజు అందించాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు వస్త్రం రాలేదు. – ఉష్కం తిరుపతి, సెక్టోరియల్ అధికారి -
మృత్యువులోనూ వీడని అన్నబంధం!
మృతదేహాలను ఒడ్డుకు చేర్చుతున్న గంగపుత్రులు, పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కాచిగూడ చెప్పల్ బజార్ ప్రాంతంలో నివాసముండే నీలి నాగభూషణ్కు ముగ్గురు కుమారులు చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్కుమార్ (31) ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్పై చిరువ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నాగభూషణ్ భార్య చంద్రకళ రెండేళ్ల క్రితమే మృతి చెందగా ముగ్గురు కుమారులైన చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్కుమార్ (31)తో ఉంటున్నాడు. రాంచందర్–అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు వసంత్, విజయ్ ఉన్నారు. వీరి అక్షరాభ్యాసం కోసం ఈ కుటుంబమంతా మంగళవారం బాసరకు వచ్చింది. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్లి అక్షరాభ్యాసాలు చేయించాలని నిర్ణయించుకున్నారు. స్నానాల కోసం ఇంటెక్వెల్ వద్ద నదిలోకి దిగిన చంద్రశేఖర్, రాంచందర్, మల్లేశ్కుమార్ బురదనీటిలో కూరుకుపోయారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు ముగ్గురూ నీటిమునిగి మృత్యువాత పడ్డారు. తన కళ్లెదుటే ముగ్గురు కొడుకులు ప్రాణాలు కోల్పోవడం చూసి నాగభూషణ్ గుండెలు బాదుకున్నాడు. వీరి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెండు గంటలు గాలింపు గోదావరి నదిలో స్నానాలకు దిగిన ప్రాంతంలో ఇంటెక్ వెల్ ఉంది. నది నీటిని తాగునీటి కోసం మళ్లించేందుకు ఇక్కడ ఫిల్టర్ బెడ్ నిర్మించారు. ఈ ప్రాంతంలో బురద కూడా ఎక్కువగానే ఉంది. ముందుగా స్నానానికి వెళ్లిన చంద్రశేఖర్ అందులో కూరుకుపోతుంటే తమ్ముడు మల్లేశ్కుమార్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఇద్దరు మునిగిపోతుండగా రాంచందర్ వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. క్షణాల్లోనే ముగ్గురు గల్లంతైపోయారు. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనను చూసి కుటుంబీకులంతా తల్లడిల్లిపోయింది. తండ్రి నాగభూషణ్తోపాటు మిగతా కుటుంబీకులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి రోదన అక్కడివారిని కంటతడి పెట్టించింది. సీఐ దీపక్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు స్థానిక గంగపుత్రులు వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు ముగ్గురూ తోడబుట్టిన అన్నదమ్ములు. మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం. ఒకరి చేయి పట్టుకుని ఒకరు పెరిగారు. మృత్యువు ఎదురొచ్చినా ఏ ఒక్కరూ చేయి విడువ లేదు. నీట మునిగిపోతున్న ఒకరిని కాపాడబోయి ఒకరు ఇలా ముగ్గురూ గోదావరి నదిలో మృత్యు ఒడికి చేరారు. పిల్లల అక్షరాభ్యాసం కోసం ఆనందంగా మంగళవారం నిర్మల్ జిల్లా బాసరకు వచ్చిన ఆ కుటుంబం పర్యటన విషాదాంతంగా ముగిసింది. ఒక్కసారిగా ముగ్గురు అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబాన్ని విషాదం ముంచేసింది. – భైంసా/బాసరబాసర యువకుల మానవత్వంఈ విషాద ఘటన సమయంలో మానవత్వం చూపిన బాసర యువకులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా ముందుకువచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. సొంత బంధువుల్లా బాధిత కుటుంబాన్ని ఓదారుస్తూ వారి వెంట ఉండి ధైర్యం చెప్పడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఒకవైపు ముగ్గురు కుమారులను కోల్పోయిన తండ్రి ఆవేదన, మరోవైపు భర్తను కోల్పోయిన మహిళల రోదనలు అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించాయి. చిన్నారులు తమ తండ్రుల కోసం ఎదురుచూస్తుండగానే వారి మరణవార్త వినాల్సి రావడం అందరి హృదయాలను కలిచివేసింది. అంతటితో ఆగకుండా ఆ యువకులంతా విరాళాలు సేకరించి అంబులెన్స్, కారులో మృతదేహాలు, కుటుంబీకులను హైదరాబాద్కు తరలించారు. -
ఓటర్ల మ్యాపింగ్ విజయవంతం చేయండి
కై లాస్నగర్: ఓటర్ల మ్యాపింగ్ను విజయవంతం చే యాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తన ఓటును ఎస్ఐఆర్– 2002 జాబితాకు బీఎల్వో, తహసీల్దార్ సమక్షంలో మంగళవారం మ్యాపింగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మ్యాపింగ్ ప్రక్రియకు జూన్ 24 వరకు గడువు ఉందన్నారు. 25వ తేదీ నుంచి బీ ఎల్వోలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫార మ్స్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. పట్టణ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ యజ్వేందర్ రెడ్డి, బీఎల్వో నివేదిత తదితరులున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రగతిపై సమీక్ష జిల్లా కేంద్ర సహకార బ్యాంకును లాభాలబాటలో తీసుకెళ్లెలా పనిచేయాలని కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్చార్జి రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు సంబంధించిన డీఎల్ఎంఆర్సీ, డీఎల్ఈసీ సమావేశాలు నిర్వహించారు. బ్యాంకు ప్ర స్తుత ఆర్థిక స్థితిగతులు, ప్రగతిని సమీక్షించారు. ఖా తాదారులకు మెరుగైన సేవలు అందించేలా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో సీఈవో సీహెచ్.రవి, నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రవూఫ్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల సహకార అధికారి ఎం.సత్యనారాయణ, మంచిర్యాల అసిస్టెంట్ రిజి స్ట్రార్ రవీందర్, డీజీఎంలు టి. వెంకటేశ్వరస్వామి, జి.భీమేందర్, తదితరులు పాల్గొన్నారు. పీఆర్ కార్యాలయం తనిఖీజెడ్పీ కార్యాలయంలో గల పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశా రు. అన్ని విభాగాల గదులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, జీపీ భవనాలతో పాటు పాఠశాలల్లో చేపట్టిన కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులను గడువులోపు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని సందర్శించారు. పనుల నాణ్యత పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఈఈ శివరాం, డీఈఈ రమేశ్పవార్, క్వాలిటీ కంట్రోల్ డీఈఈ సలావుద్దీ న్, సూపరింటెండెంట్ శ్రీరామ్ తదితరులున్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు ఆదిలాబాద్టౌన్:విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జెడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, గతేడాదితో పోల్చితే ఈసారి 30 శాతం విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచాలని ఆదేశించారు. లేకుంటే ఉపాధ్యాయులపై చర్యలుంటా యని హెచ్చరించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు రావాలని సూచించారు. యూని ఫాంకు సంబంధించిన వస్త్రం వస్తుందని, మెప్మా అధికారులు చొరవ చూపి త్వరగా కుట్టించేలా చూ డాలన్నారు. ఇప్పటినుంచే పదో తరగతి విద్యార్థుల పై ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్నారు. ప్రతీ పాఠశాలలో కిచెన్ గార్డెన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. డిజిటల్ విద్య పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న 12 జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని విద్యా శాఖాధికారులను ఆదేశించారు. 22 అంశాల ను తప్పనిసరిగాఅమలు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో మాధవి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ కందుల గజేందర్, తిరుపతి, లక్ష్మణ్, రఘురమణ, అజయ్, ఎంఈవో సోమయ్య, మెప్మా పీడీ సీవీఎన్ రాజు పాల్గొన్నారు. -
బోథ్, సొనాల మండలాల్లో భారీ వర్షం
బోథ్: బోథ్, సొనాల మండలాల వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సష్టించింది. ఏకధాటిగా దాదాపు మూడు గంటల పాటు కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సొనాల మండలంలోని పెద్దగూడ గ్రామ సరిహద్దులో ప్రవహిస్తున్న వాగు ఉధృతికి వంతెన సమీపంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోథ్ మండల కేంద్రంలోనూ వర్షం కురిసే సమయంలో పిడుగు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు తీవ్రతకు పట్టణంలోని పలువురి ఇళ్లలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. మరోవైపు ఈ ఏడాది తొలకరి పలకరించడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాన పడటంతో అదును చూసుకుని పలు గ్రామాల్లో రైతులు ఆనందంగా విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
మహిళా సంఘాలకు 18 కొత్త బస్సులు
కై లాస్నగర్: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం కొత్తగా బస్సులను అందజేసింది. ఎస్హెచ్జీ సభ్యులను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 18 సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఒక్కో సంఘానికి ఒకటి చొప్పున 18 బస్సులను కేటాయించింది. సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎస్హెచ్జీలకు వాటిని అందజేశారు. కార్యక్రమానికి జిల్లా నుంచి డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏపీడీ జాదవ్ గోవింద్రావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి.లక్ష్మి, కోశాధికారి మంజూషా, సెర్ప్ హెచ్ఆర్ మేనేజర్ శ్రీనివాస్తో పాటు అన్ని మండలాల ఏపీఎంలు, ఒక్కో మండలం నుంచి 50 మంది మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్కు తరలివెళ్లారు. ఈ బస్సులను మండల సమాఖ్యలు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.69వేల చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. ఎస్హెచ్జీల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం తోడ్పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
రైల్వే పనుల పురోగతిపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ గోడం నగేష్ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు విన్నవించారు. సికింద్రాబాద్లోని ఆయన కార్యాలయంలో మంగళవారం కలిసి పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ‘ఆదిలాబాద్–ఆర్మూర్’ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ వేగవంతం చేయాలని కోరారు. కరంజి రోడ్–జందాపూర్ (ఎల్సీ నంబర్ 33), బాసర రైల్వే స్టేషన్ (ఎల్సీ నంబర్ 182), రెబ్బెన (ఎల్సీ నంబర్ 71) వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. -
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థినికి ఉత్తమ ప్యాకేజీ
శ్రీరాంపూర్: సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థిని మంచాల అక్షయ ఉత్తమ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. 2020–23లో ఇక్కడ సివిల్ డిప్లొమా కోర్సు చదివిన ఆమె అనంతరం కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసింది. ఇటీవల హెచ్ఎస్బీలో రూ.16.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం కాలేజీలో అక్షయను ప్రిన్సిపల్ కుర్మ రాజేందర్, డీజీఎం (పర్సనల్) అనిల్కుమార్ అభినందించారు. సింగరేణి పాలిటెక్నిక్ కాలజీ మంచి విద్యాప్రమాణాలతో కొనసాగుతుందనడానికి ఇది నిదర్శనమని వారు తెలిపారు. పారిశుధ్య కార్మికుడి మృతిభైంసాటౌన్: పట్టణంలోని మున్సిపాలిటీ పారి శుధ్య విభాగంలో పని చేస్తున్న జంగ్మే మారుతి (45) గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతి కొన్నేళ్లుగా మున్సిపాలిటీలో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండురోజులుగా విధులకు హాజరుకావడం లేదు. మంగళవారం సాయంత్రం గడ్డెన్నవాగు ప్రాజెక్టులో అతడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సుకేశ్న బాయి, ఇద్దరు కొడుకులున్నారు. వడదెబ్బతో ఒకరు మృతిఆసిఫాబాద్రూరల్: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని రాజురా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజురా గ్రామానికి చెందిన పిప్రే మోహన్ (40) ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. -
ఓసీ పేలుళ్లపై ఆందోళన
కాసిపేట: మందమర్రి ఏరియా కేకే ఓపెన్కాస్ట్ వద్ద మంగళవారం సోమగూడం, చొప్పరిపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధిక పేలుళ్లతో ఇంట్లో ఉండలేకపోతున్నామని, ఇళ్లు పగుళ్లు తేలాయని, దుమ్ము, విషవాయువులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్ల తీవ్రత అధికంగా ఉండటంతో తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడ్డుకున్న క్రమంలో రెండు రోజులు తీవ్ర తగ్గించి తిరిగి యథావిధిగా పేలుళ్లు జరుపుతున్నట్లు ఆరోపించారు. రోజూ సాయంత్రం పేలుళ్ల దాటికి ఇళ్ల గోడలు, రేకులు పగిలి పోతున్నాయని, వర్షాకాలంలో ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదని మండిపడ్డారు. పేలుళ్ల తీవ్రతను తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇస్తూ విస్మరిస్తున్నారని, ఇలా జరిగితే ఆందోళనలు ఉధృతం చేసి ఓపెన్కాస్ట్ను పూర్తిగా అడ్డుకోనున్నట్లు హెచ్చరించారు. ఓసీలో పేలుళ్లను తగ్గిస్తామని, గ్రామంలో సర్వే చేయించి పగుళ్లు తేలిన గోడలకు మరమ్మతులు చేయిస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని సింగరేణి అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. స్థానిక నాయకులు రాంచందర్, గురుమూర్తి, తిరుపతి, లక్ష్మణ్, స్వరూప, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పోరాట వీరుడు బిర్సాముండా
ఆదిలాబాద్రూరల్: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పోరాడిన తొలి ఆదివాసీ పోరాటయోధుడు బిర్సాముండా అని కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావ్ అన్నారు. బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఎదుట గల ఆయన విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిర్సాముండా స్ఫూర్తితో ఆదివాసీలకు దక్కాల్సిన హక్కులు, చట్టాల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర నాయకుడు కుర్సెంగే తానాజీ, మెస్రం శంకర్, ఆదివాసీ పర్దాన్ సమాజ్ జాతీయ నాయకుడు కుర్సెంగే యాదవ్ రావ్, గేడం మాధవ్, గేడం మనోహర్, మేస్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం
నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా ఆర్ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లఖంపూర్ గ్రామానికి చెందిన మాడవి షేక్రావ్ (45) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తన ఆటోలో ఇచ్చోడ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాడవి షేక్రావ్కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ దేవిదాస్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దేవిదాస్ను చికిత్స కోసం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. షేక్రావ్కు భార్య సంధ్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు మరణించడంతో అతడి భార్య, పిల్లల రోదనలు స్థానికులను కలచివేశాయి. ఎస్సై ఇమ్రాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం!
భైంసా: బాసర గోదావరి నదిలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు పుణ్యస్నానానికి వెళ్లి నీటమునిగి మృత్యువాత పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో బాసర గోదావరిలో భద్రతా లోపాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతీ ఏడాది ప్రమాదాలు జరుగుతున్నా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం, అనంతరం పరిస్థితి మళ్లీ ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఐదుగురు.. గతేడాది జూన్ 15న గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు రాజస్థాన్కు చెందినవారు కాగా, ఈ కుటుంబం హైదరాబాద్లో స్థిర పడింది. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన 30 మంది బృందం ఇంటర్సిటీ రైతులో బాసరకు చేరుకుంది. ఇసుక దిబ్బ నుంచి నీటిలో స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు రాథోడ్ రాకేశ్, భరత్, మదన్, వినోద్, రుతిక్ మృతిచెందారు. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు మరో ముగ్గురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏటా బాసరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ నదీ తీరంలో శాశ్వత భద్రతా ఏర్పాట్లు మాత్రం లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు నది పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు తక్కువగా ఉండటంతో పాటు నిత్యం విధుల్లో ఉండే లైఫ్గార్డుల సంఖ్య కూడా సరిపడా లేదని తెలుస్తోంది. పండుగలు, సెలవు దినాలు, వారాంతాల్లో భారీగా భక్తులు వచ్చే సమయంలో ప్రత్యేక నిఘా అవసరమని భక్తులు భావిస్తున్నారు. భక్తుల ప్రధాన డిమాండ్లు -
సందడే సందడి
ఉట్నూర్ పోలీస్స్టేషన్లో ప్రస్తుతం చిన్నారుల నవ్వులు, ఆటపాటలతో వారు చేసే సందడి కనిపిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్లో చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. పార్కులోని జారుడు బల్లలు, ఊయలలు, సీసాలపై ఊగుతూ చిందులు వేస్తున్నారు. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ నవ్వులు చిందిస్తూ ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తమ పిల్లలను పార్క్కు తీసుకువస్తున్నారు. కాగా, చిన్నారులకు పోలీస్ సిబ్బంది స్టేషన్లో వారి విధుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ చిల్డ్రన్స్ పార్క్ వేసవిలో పిల్లలకు మంచి వినోదాన్నిస్తోంది. తమ పిల్లలు ఎలాంటి భయం లేకుండా సురక్షితమైన వాతావరణంలో ఆడుకోవడం చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – ఉట్నూర్రూరల్ -
● ఆదిలాబాద్కు విచ్చేసిన డీజీపీ సీవీ ఆనంద్ ● నేడు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పోలీస్బాస్ మంగళవారం రాత్రి ఆదిలాబాద్కు విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. వారివెంట ఉమె న్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా తదితరులున్నారు. వీరు బుధవారం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బెల్లంపల్లిలో ఏడాదిపాటు అదనపు ఎస్పీగా.. డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అ దనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడిషనల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా మే 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. నేటి పర్యటన ఇలా.. డీజీపీ ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూలో పాల్గొననున్నారు. పట్టణంలోని కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వ్య వస్థను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చేరుకుంటా రు. వీటితో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ డీజీపీ పాల్గొననున్నారు.


