Adilabad District News
-
వేగవంతంగా జీపీవోల నియమాక ప్రక్రియ
● ఆప్షన్లు ఇచ్చిన 68 మంది అభ్యర్థులు కై లాస్నగర్: గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెరపైకి తెచ్చిన గ్రామపాలన అధి కారి (జీపీవో) పోస్టుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న 83 మంది పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించింది. ప రీక్షకు 73 మంది హాజరైన సంగతి తెలిసిందే. కాగా, పరీక్ష ఫలితాలు వెల్లడించని ప్రభుత్వం సదరు అ భ్యర్థులు ఏ జిల్లాలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నార నే దానిపై ఆప్షన్లు కోరింది. ఇందుకు గురువారమే తుది గడువుగా ప్రకటించింది. దీంతో 68 మంది అభ్యర్థులు కలెక్టరేట్ ఏవో వర్ణను కలిసి ఆప్షన్ ఫాంలు అందజేశారు. ఇందులో 66మంది జిల్లాలో పని చేసేందుకు ఆసక్తి చూపగా మరో ఇద్దరు ఇతర జిల్లాలకు అప్షన్లను అందజేసినట్లు అధికారులు తెలిపా రు. వీరందరికీ ప్రభుత్వం జూన్ 2న ఉద్యోగ నియమాక పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం. -
ముందస్తు సాగు వద్దు
● డీఏవో శ్రీధర్స్వామి ● ‘సాక్షి ఫోన్ ఇన్’కు స్పందన ● రైతుల సందేహాలు నివృత్తి చేసిన జిల్లా వ్యవసాయాధికారి ఆదిలాబాద్అర్బన్/ఆదిలాబాద్టౌన్: ‘జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కాదు. నైరుతి వానలు పడ్డాక జూన్ 15వరకు పత్తి, జూలై 10 వరకు సోయాబీన్ విత్తుకోవచ్చు. ముందుగా విత్తనా లు వేస్తే కాత, పూత దశలో తెగుళ్లు ఆశించే ప్ర మాదముంది. ఈసారి 5.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. జిల్లాకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి’ అని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్స్వామి తెలిపారు. వానాకాలం సాగులో రైతు ల సందేహాలను నివృత్తి చేసేందుకు గురువా రం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ఇన్కు స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు ఫోన్ చేసి సందేహాలు తెలుపగా డీఏవోతోపా టు వ్యవసాయశాఖ టెక్నికల్ అధికారులు విశ్వామిత్ర, విశ్వనాథ్ సమాధానాలిచ్చారు. ప్రశ్న: ప్రస్తుతం వర్షాలు క్రమం తప్పకుండా కురుస్తున్నాయి. ఈ సమయంలో పత్తి విత్తనాలు వేసుకోవచ్చా? – రాజు (ఇచ్చోడ), సంజీవ్ (సీతాగొంది), అందె ఆనంద్ (పొన్నారి), గౌతమ్ (సాత్నాల) డీఏవో: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి వెంటనే పత్తి విత్తనాలు విత్తుకోవద్దు. నైరుతి వర్షాలు పడ్డాక అంటే జూన్ రెండో వారం వరకు విత్తుకోవచ్చు. ముందుగా విత్తనాలు వేస్తే కాయకుళ్లు తెగులు సోకే ప్రమాదముంది. ప్రశ్న: నకిలీ విత్తనాలను ఎలా అరికడతారు? ఫసల్ భీమా గురించి వివరించండి? – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు డీఏవో: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జి ల్లా, మండలస్థాయి కమిటీలు వేసి నిరంతరం నిఘా ఉంచాం. ఫసల్ బీమా యోజన అమలు పై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. ప్రశ్న: ఏ రకం పత్తి విత్తనాలు మంచివి? – శ్రీనివాస్గౌడ్, కై లాస్ (బజార్హత్నూర్) డీఏవో: మన దుకాణాల్లో దొరికే పత్తి విత్తనాలు దాదాపు అన్ని మేలు రకానికి చెందినవే. ముందుగా పంట చేతికివచ్చే ప్లాటినం, సదానంద్, నూజివీడు కంపెనీకి చెందిన ఆశ లాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవచ్చు. ప్రశ్న: సోయాబీన్కు సబ్సిడీ ఉందా? సోయా, పత్తి విత్తనాలు ఎప్పుడు విత్తుకోవాలి? – ముండే సురేశ్, రాజు (బోథ్) డీఏవో: సోయాకు ఇప్పటికైతే సబ్సిడీ లేదు. సోయాలో అంతరపంటగా ఇంకేదైనా వేసుకో వచ్చు. జూన్ 15 వరకు పత్తి, జూలై రెండో వా రం వరకు సోయా విత్తనాలు వేసుకోవచ్చు. ప్రశ్న: రబీలో జొన్న, ఖరీఫ్లో పత్తి సాగు చేశా ను. ప్రస్తుతం ఏ పంట వేస్తే మంచిది? – సురేందర్ (కనుగుట్ట, బోథ్), లస్మారెడ్డి (బేల మండలం), అశోక్ (భీంపూర్), రాకేశ్రెడ్డి (ఇచ్చోడ మండలం) డీఏవో: ఈసారి మొక్కజొన్న వేయండి. ఎకరా కు దాదాపు 30క్వింటాళ్ల వరకు దిగుబడి వ స్తుంది. మక్కను బోదెల పద్ధతిలో సాగు చేస్తూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. ప్రశ్న: సోయా విత్తన రకాలు తెలుపండి? – ఆర్టీబీ ప్రసాద్ (బోథ్), మహేందర్ (సాంగిడి, బేల మండలం) డీఏవో: ఎప్పుడూ ఒకేరకం సోయా విత్తనాలు వేస్తే పురుగు ఆశించే ప్రమాదముంది. మార్కెట్లో జేఎస్ 335, రవి, ఓంకార్ లాంటి రకాలు న్నాయి. నోటిఫైడ్ విత్తనాలు వాడాలి. కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ప్రశ్న: గత సీజన్లో సోయాబీన్ వేస్తే ప్రస్తుతం ఏ పంట వేస్తే మంచిది? – దేవన్న (జైనథ్), గంగన్న (ధనోర, భీంపూర్ మండలం), నర్సయ్య (సిరికొండ) డీఏవో: గతంలో సోయాబీన్ వేస్తే ప్రస్తుతం మినుము, పెసర, కంది వేయాలి. పంట మా ర్పిడి చేస్తేనే ఫలితం ఉంటుంది. ప్రశ్న: మొక్కజొన్న సాగులో మొక్కకు మొక్కకు మధ్య దూరం ఎంతుండాలి? – లక్ష్మణ్, సిరికొండ డీఏవో: స్వీట్కార్న్ విత్తన వైరెటీలు మన దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 15 సెంటిమీటర్లు, వరుసల మధ్య దూరం 45 నుంచి 60 సెంటిమీటర్లు ఉండేలా చూసుకోవాలి. ప్రశ్న: కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చే నకిలీ విత్తనాలను ఎలా అరికడతారు? – వెంకటేశ్, తాంసి మండలం డీఏవో: పోలీస్, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను నియమించాం. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసు నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 50 నకిలీ విత్తన ప్యాకె ట్లు, 10కిలోల లూజ్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. జిల్లాలోని చెక్పోస్టులు, సరి హద్దు గ్రామాల్లో నిఘా పెంచాం. -
నాణ్యమైన విత్తనాలే విక్రయించాలి
నేరడిగొండ: రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు విక్రయించాలని డీఏవో శ్రీధర్స్వామి సూచించారు. మండల కేంద్రంలో ని ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, నిల్వలు, ధరల పట్టిక, లైసెన్స్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. విత్తనాలు కొన్న రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవో కృష్ణవేణి తదితరులున్నారు. గ్రోమోర్ సేవా కేంద్రం ప్రారంభం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రోమోర్ సేవా కేంద్రాన్ని డీఏవో శ్రీధర్స్వామి ప్రారంభించారు. ఏవో కృష్ణవేణి, గ్రోమోర్ ఏరియా మేనేజర్ (రిటైల్ ఆపరేషన్స్) వీఎన్ స్వామి, ఏరియా కంట్రోలర్ నరేంద్ర, న్యూ స్టోర్ ఆపరేషన్స్ ఇన్చార్జ్ గోపి, సెంటర్ మేనేజర్ అనిల్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు
కై లాస్నగర్: లైసెన్స్డ్ సర్వేయర్లకు అవసరమైన మెడికల్ (ఫిజికల్ ఫిట్నెస్) సర్టిఫికెట్లను గురువారం శిక్షణ కేంద్రంలోనే అందజేశా రు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు సివిల్ సర్జన్, జిల్లా క్షయ నియంత్రణాధికారి సుమలత జిల్లా కేంద్రంలోని టీటీడీసీకి చేరుకుని అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. వారికి అవసరమైన సర్టిఫికెట్లు అందించారు. అనంతరం టీబీ రహిత సమాజ నిర్మాణానికి తో డ్పడాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా వా రికి అవగాహన కల్పించారు. ఆమె వెంట క్ష యనియంత్రణ విభాగం సిబ్బంది ఉన్నారు. -
వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
కై లాస్నగర్: జూన్ మొదటి వారంలో జిల్లాలో నిర్వహించనున్న వనమహోత్సవాన్ని విజయవంతం చే యాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డీ ఆర్డీవో రాథోడ్ రవీందర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఉపాధిహామీ ఏపీవో లు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. మండలాల వారీగా నాటాల్సి న మొక్కల లక్ష్యాన్ని ప్రకటించి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని, గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఉసిరి, ఈత, తాటి, ఇప్ప, వెదురు మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. నీటి సంరక్షణకు అవసరమైన వ్యక్తిగత, సామాజిక ఇంకుడుగుంతల నిర్మాణాలకు స్థలాలు ఎంపిక చేయాలని తెలిపారు. మంజూరు చేయడంతోపాటు వాటిని గ్రౌండింగ్ చేసే లా చూడాలని పేర్కొన్నారు. ఉపాధిహామీ కూలీల కు రోజుకు రూ.270 కూలీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాకు జాతీయ అవార్డు తీసుకువచ్చేలా ‘జల సంచాయ్ జన భగీరథీ’ కార్యక్రమ ఫొటోలను వేగంగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీడీ కుటుంబరావు, కృష్ణారావు, ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ఎందుకిలా?
● ‘హస్తం’ వెనుకబాటుపై మీనాక్షి ప్రశ్న ● ఎమ్మెల్యే, ఇన్చార్జీల అభిప్రాయ సేకరణ ● పార్లమెంట్ పరిధిలో పరిస్థితిపై ఆరా సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి లో పార్టీ పూర్తిగా వెనుకబాటుకు కారణమేంది?.. ఈ ప్రశ్న సంధించింది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్. బుధవారం హైదరాబా ద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులతో ఆమె స మావేశమయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, శ్యామ్నాయక్, రావి శ్రీనివాస్ హాజ రయ్యారు. వేర్వేరుగా వారితో ఆమె పది నిమిషాల చొప్పున సమీక్షించారు. పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్థితిపై ఆరా తీసి వారి అభిప్రాయాలు సేకరించారు. నివేదిక రూపంలో అధిష్టానానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ పరిధిలో పార్టీ పటిష్టతకు మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమిపై ఆరా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నియోజకవర్గ ఇన్చార్జీలతో మాట్లాడి వారి ఓటమికి గల కారణాలను మీనాక్షి నటరాజన్ తెలుసుకున్నారు. పార్లమెంట్ పరిధిలో పార్టీని పటిష్టపర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అడిగారు. కొందరు పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు అందరినీ సమన్వయం చేయడంలో వి ఫలమయ్యారని మీనాక్షి నటరాజన్కు తెలిపారు. గ్రూపులను ప్రోత్సహించడంతో నియోజకవర్గాల్లో పరిస్థితులు మారిపోయాయని వివరించినట్లు స మాచారం. ఎన్నికల తర్వాత ప్రస్తుతం వేదికలపైన కూర్చుంటున్న ముఖ్య నాయకులు పార్టీని పటిష్టపర్చడంలో బాధ్యతగా వ్యవహరించడం లేదని ఇ న్చార్జికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని కోరినట్లు చెప్పుకొంటున్నారు. కొలిక్కి వచ్చేనా? పార్టీ బూత్, గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను నియమించేందుకు ఇప్పటికే అన్ని స్థాయిల్లో పేర్లు సేకరించారు. ఒక్కొక్క కమిటీకి ఐదుగురి ఆశావహుల పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. వా టిని పరిశీలకుడు తాహెర్బిన్ హందన్, చిట్ల సత్యనారాయణ అధిష్టానానికి పంపే ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ కమిటీలు అధిష్టానం నుంచి ఖరారు కానున్నా యి. కాగా, ఈ కమి టీలకు ముందే రాష్ట్ర కార్యవర్గం కూర్పు జరగనుండగా, ఈ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులకు ఎవరికైనా చోటు దక్కుతుందా? అనేది ఆసక్తి కలిగిస్తోంది. జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించి త్వరలో పీసీసీ నుంచి మరో కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. ఆ కమిటీ ద్వారా అభిప్రాయ సేకరణ చేసి పేర్లను ఏఐసీసీకి పంపించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేసే అవకాశముంది. -
ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చూడాలి
ఆదిలాబాద్టౌన్: ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని రి మ్స్ కళాశాలలో ఎయిర్బోన్ ఇన్ఫెక్షన్ నియంత్రణ పై శిక్షణ ఇవ్వగా కలెక్టర్ హాజరై ఇందుకు సంబంధించిన పత్రాలు విడుదల చేశారు. అనంతరం మా ట్లాడుతూ.. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబ లే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిమ్స్లో మాత్రమే డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, టీబీ నియంత్రణాధికారి సుమలత, సత్యనారాయణ, సందీప్ జాదవ్ పాల్గొన్నారు. -
● వన మహోత్సవానికి అంతా సిద్ధం ● జిల్లా లక్ష్యం 46.57లక్షల మొక్కలు ● గతేడాది కంటే 2.57 లక్షలు అదనం ● పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు
తలమడుగు మండలం ఉండం నర్సరీలో నాటేందుకు సిద్ధంగా మొక్కలుకై లాస్నగర్: కనుమరుగవుతున్న అటవీ విస్తీర్ణంతో పాటు పచ్చదనం పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఏటా వర్షాకాలంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈసారి జి ల్లాలో 46,57,400 మొక్కలు నాటాలని లక్ష్యం వి ధించింది. గతేడాది కంటే ఈసారి 2.57లక్షల మొక్కలు అదనంగా నాటాలని నిర్దేశించింది. జూన్ మొ దటి వారంలో కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, ఎన్జీవో లు, ప్రజలను పెద్దఎత్తున భాగస్యాములను చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. మున్సిపాలిటీలో ప్రతీ ఇంటికి ఐదు పూలు, పండ్ల మొక్కలు అందించి నాటేలా చూడాలని ఆదేశించింది. పచ్చదనం పెంపే లక్ష్యంగా.. ఆదిలాబాద్ అడవుల జిల్లాగా ముద్రపడ్డప్పటికీ చె ట్లను విక్షణారహితంగా నరికివేయడంతో వృక్ష సంపద కనుమరుగవుతోంది. తిరిగి దీనిని పెంచాలని భావించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరిట విరివిగా మొక్కలు నాటింది. తద్వారా పచ్చదనం పెరిగినా చాలాచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొక్కల పెంపకానికి అదే ప్రాధాన్యతనిస్తోంది. వనమహోత్సవం పేరిట కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రైతుల నుంచి టేకు మొక్కలు కావాలని డిమాండ్ ఉన్నా నర్సరీల్లో వాటిని పెంచడంలేదు. గతేడాది టేకు మొక్కల పెంపకానికి అనుమతివ్వాలని అటవీశాఖ అధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన రాలేదు. ఈసారి కూడా టేకుమొక్కలు నాటే అవకాశం లేదు. 18శాఖలకు భాగస్వామ్యం జిల్లాలోని 473 గ్రామపంచాయతీలు, ఏకై క ఆదిలా బాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో 17ప్రధాన ప్రభుత్వశాఖ లు, మరో ఒకట్రెండు ఇతర శాఖలను భాగస్వాములను చేయనున్నా రు. ఆయా శాఖ లు నాటాల్సిన మొక్కల ల క్ష్యాలను నిర్దేశించారు. ఇందుకు అ వసరమైన మొక్కలను జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధిహామీ కింద నిర్వహిస్తున్న నర్సరీల్లో సిద్ధం చేశారు. వీటితో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొమ్మిది నర్సరీల్లోనూ మొక్కలు సిద్ధంగా ఉన్నా యి. వాటిలో గుల్మొహర్, వేప, కానుగ, బూరు గు, చింత మొక్కలతో పాటు పండ్లకు సంబంధించి న దానిమ్మ, మామిడి, నిమ్మ, పూలకు సంబంధించి మందార, గులాబీ, మల్లె లాంటి మొక్కలు పెంచా రు. కొన్నిచోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల మొక్కలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. వర్షాలు కురిసే నాటికి అవి అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నా రు. కార్యక్రమ నిర్వహణపై సమావేశం కార్యక్రమం నిర్వహణపై ఇటీవల కలెక్టర్ రాజర్షిషా ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పండ్లతోటలు, వెదురు పెంపకం, మూలిక లు, ఈత, ఖర్జూరా తదితర మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఆదేశించారు. గతేడాది కంటే అదనం2023 కంటే గతేడాది లక్ష మొక్కలు తగ్గించగా ఈసారి రెట్టింపుగా లక్ష్యం పెంచారు. శాఖ లవారీగా మార్పులు చేశారు. గతేడాది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్డీఏ)కు 25లక్షలు కాగా, ఈసారి 2.87లక్షలు అదనంగా కేటాయించారు. అటవీశాఖకు గతేడాది 8లక్షలు కాగా, ఈసారి 5.76లక్షలే కేటాయించారు. మున్సిపాలిటీకి గతేడాది 5లక్షలు కాగా, ఈసారి 2.76లక్షలు అదనంగా లక్ష్యం విధించారు. వ్యవసాయశాఖకు ఈసారి 77వేలు అదనంగా కేటాయించారు. పోలీస్శాఖకు 8,100 తగ్గించారు. విద్యాశాఖకు గతంలో లక్ష కేటాయించగా ప్రస్తుతం 5,600 మా త్రమే నాటాలని నిర్ణయించారు. ఈసారి ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖలు, మత్స్యశాఖ, ఉద్యానవన, డిగ్రీ కళాశాలలు, ఎకై ్సజ్, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలను లెక్కలోకే తీసుకోలేదు. ఇతర శాఖల్లోనూ వందలలోపే మొక్కలు నాటేలా ప్రణాళిక నిర్దేశించారు. జిల్లా వివరాలు జిల్లాలోని మండలాలు : 21 గ్రామపంచాయతీలు : 473 మొక్కల లక్ష్యం : 46.57లక్షలు గతేడాది నాటిన మొక్కలు : 44లక్షలుజిల్లాలో శాఖలవారీగా మొక్కల లక్ష్యం ప్రభుత్వ శాఖ మొక్కల లక్ష్యం అటవీశాఖ 5.76లక్షలు ఆర్అండ్బీ 50,500 డీఆర్డీఏ 27.87లక్షలు గిరిజన సంక్షేమశాఖ 50వేలు ఇరిగేషన్ 22వేలు వ్యవసాయశాఖ 2.77లక్షలు రెవెన్యూశాఖ 10,100 మున్సిపల్శాఖ 7.76లక్షలు పోలీస్శాఖ 91,900 విద్యాశాఖ 5,600 పశుసంవర్ధక, డెయిరీ మత్స్యశాఖ 600 పరిశ్రమలశాఖ 500 వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ 300 విద్యుత్శాఖ 500 సంక్షేమశాఖలు 900 యువజన వ్యవహారాలు సాంస్కృతిక శాఖ 10వేలు సివిల్ సప్లయ్శాఖ 2వేలు ఇతర శాఖలు 500 -
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి
ఆదిలాబాద్టౌన్: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈవో ఏనుగు శ్రీనివాస్రెడ్డి సూచించారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడురోజుల ఎన్రోల్మెంట్ ప్రచార జాత కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అన్ని రకాల సౌకర్యాలు కల్పి స్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించేందుకు టీఎస్ యూటీఎఫ్ కృషి అభినందనీ యమని కొనియాడారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే కిష్టన్న, వీ అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు టీ సూర్యకుమార్, కోశాధికారి కే శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు ఎ.స్వామి, ఎ.ఇస్తారి, జిల్లా కమిటీ సభ్యులు, మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టెక్నాలజీ జోడించి బోధించాలి
ఆదిలాబాద్టౌన్: అత్యాధునిక సాంకేతికతను జోడించి బోధించాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఓదెలు కుమార్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు చేయాలని సూ చించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ అశోక్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, రి సోర్స్ పర్సన్లు విజయ్కుమార్, చంద్రశేఖర్, విద్యాసాగర్రెడ్డి, నవనీత్కుమార్ ఉన్నారు. -
వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్క్వార్టర్ సమావేశ మందిరంలో ఉట్నూ ర్ సబ్ డివిజన్ అధికారులతో బుధవారం సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నకిలీ లూజ్ విత్తనాల నియంత్రణకు దృష్టి సారించాలన్నారు. బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులను తనిఖీలు చేయాలని సూచించారు. జిల్లాలో బ్లూకోర్టు, డయల్ 100 సిబ్బంది ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ పోలీసులు మీకోసం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వానాకాలంలో అత్యవసర సామగ్రి కలిగి ఉండాలని, వాగులు, వంకలు, బ్రిడ్జిలు దాటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ సు రేందర్రావ్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, సీఐలు రహీం పాషా, మొగిలి, రాజు, పండే రావు, గుణవంత్రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, ఉట్నూర్ సబ్డివిజన్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
వన మహోత్సవం విజయవంతం చేయాలి
● కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: జిల్లాకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వన మహోత్సవం, ఇందిర సౌర గిరి జల వికాసం, పీఎం జన్ మన్ కా ర్యక్రమాల అమలుపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్యక్రమంపై విస్తృత ప్రచా రం కల్పించి, సామూహిక మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, డీఎఫ్వో ప్రఽశాంత్ బాజీరావు, ఆర్డీవో వినోద్ కుమార్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. సాత్నాల: జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన భోరజ్ మండలంలో రైతుల భూ సమస్యలపై అందిన ప్రతీదరఖాస్తును పరిష్కరిస్తామని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. భూ భారతి దరఖాస్తుల ప్ర గతిపై ఆరా తీశారు. ఆయనవెంట తహసీల్దార్లు రాజే శ్వరి, నలంద ప్రియ, రఘునాథ్రావు, ఽశ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల
ట్రిపుల్ఐటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. బాసర క్యాంపస్కు 1500 సీట్లు, కొత్తగా మహబూబ్నగర్ సెంటర్కు 180 సీట్లు కేటాయించారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం కాలనీలో గల ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇది. ఇందులో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు దాదాపు 60 మంది వరకు చదువుతున్నారు. ఈ బడికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తి కాక పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం అద్దె భవనంలో తరగతులు కొనసాగుతున్నాయి. ఒకట్రెండు గదులు ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. -
పత్తి మద్దతు ధర రూ.8,110
ప్రభుత్వం 2025– 26కు సంబంధించి పంటలకు మద్దతు ధర ప్రకటించింది. నాణ్యత కలిగిన పత్తి క్వింటాల్కు రూ.8,110కు చేరింది. 8లోu మావల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మన ఊరు–మనబడి కింద భవనం మంజూరైంది. స్లాబ్ వేసి వదిలిపెట్టారు. దీంతో 7వ తరగతి విద్యార్థులు ఆరుబయటే కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 6వ తరగతి గది వర్షానికి ఊరుస్తుంది. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అలాగే సరిపడా గదులు లేక వారి ఇక్కట్లు వర్ణనాతీతం. -
● ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం నిల్వలు ● జూన్ 1 నుంచి కార్డుదారులకు పంపిణీ ● వర్షాల నేపథ్యంలో సర్కారు నిర్ణయం ● కార్డుదారులకు ప్రయోజనం
కైలాస్నగర్: వానాకాలం నేపథ్యంలో రేషన్ లబ్ధిదారులకు మూడు నెలల కోటా బియ్యం ఒకేసారి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుదారులకు సరిపడా కోటా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు అవసరమైన సన్నబియ్యం సరఫరా చేసేందుకు గాను నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలను కేటాయించింది. దీంతో ఆయా జిల్లాల నుంచి స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం చేరుకుంటుండగా రేషన్ షాపుల వారీగా సరఫరా ప్రారంభించారు. జూన్ 1నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. సర్కారు నిర్ణయంపై కార్డుదారుల్లో హర్షం..డీలర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. కార్డుదారులకు ఇబ్బందుల్లేకుండా... వర్షాకాలంలో రోడ్ కనెక్టివిటీ లేనటువంటి గ్రామాల ప్రజలు రేషన్ బియ్యం పొందేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి సరఫరా చేసేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన కోటా విడుదల చేయగా జిల్లాలోని ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లకు సన్నబియ్యం చేరుతున్నాయి. వాటిని కేటాయింపుల ఆధారంగా రేషన్షాపులకు సరఫరా చేస్తున్నారు. కార్డుదారులు మూడు నెలల కోటా బియ్యం ఒకేసారి తీసుకోవాలంటే డీలర్ వద్ద గల పీఓఎస్ డివైస్పై మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎప్పటిలాగే ప్రతి నెలా తీసుకుంటామంటే అలా కూడా తీసుకునే వెసులుబాటు కల్పించింది. జూన్ 1 నుంచి 30వరకు డీలర్లు పంపిణీ చేయనున్నారు. డీలర్ల ఆందోళన.. ప్రభుత్వ నిర్ణయాన్ని కార్డుదారులు స్వాగతిస్తుండగా డీలర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలకు సరిపడా కోటా బియ్యం మాత్రమే నిల్వ చేసేలా రేషన్ షాపులు ఉండటంతో ఒకేసారి మూడు నెలల కోటా తీసుకుంటే దాన్ని ఎక్కడా నిల్వ చేయగలమని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు కొన్ని షాపుల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వల తరలింపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో అవి అలాగే ఉండిపోయియి. తాజాగా పూర్తి స్థాయిలో బియ్యం తెచ్చుకుంటే భారీ వర్షాలకు బియ్యం తడిసి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని హైరానా పడుతున్నారు. అయితే ఈ విషయంలోనూ వారికి వెసులుబాటు కల్పించినట్లుగా పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. కార్డుదారులకు బియ్యం పంపిణీని ప్రారంభించి, ఖాళీ అయిన నిల్వల వారీగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. తద్వారా వారికి కొంత ఊరట కలిగనుంది. -
● ఇంకా పూర్తి కాని ‘మనఊరు– మనబడి’ పనులు ● పెండింగ్లోనే ‘అమ్మ ఆదర్శ కమిటీ’ వర్క్స్ ● జిల్లాలో 25 శిథిలావస్థ పాఠశాలలు ● చాలా బడుల్లో సరిపడా ఉపాధ్యాయులు కరువు ● మరుగుదొడ్ల పరిస్థితీ అంతంతే! ● సర్కారు పాఠశాలల తీరిది
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025ఇక్కడ అసంపూర్తిగా కనిపిస్తున్నది భీంపూర్ మండలంలోని అర్లి(టి) ప్రాథమికోన్నత పాఠశాల భవనం. ఇందులో విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేవు. దీంతో గత ప్రభుత్వ హయాంలో అదనపు గదుల నిర్మాణం కోసం మన ఊరు–మనబడి కింద రూ.38 లక్షలు మంజూరు చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదని ఇలా అసంపూర్తిగా వదిలేశాడు. రెండేళ్లుగా విద్యార్థులు సరిపడా గదులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాదైనా పనులు పూర్తి అవుతాయని తల్లిదండ్రులు భావించినా ప్రస్తుతం ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.నిర్మాణ దశలో ఉన్న జిల్లా కేంద్రంలోని కుమురంభీం కాలనీ పాఠశాలసమయం : ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సంప్రదించాల్సిన నంబర్లు : 89777 42697, 81063 02862 ఉత్తమ ఫలితాలకు ప్రశంసబోథ్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాలలలో ఉత్తమ ఫలితాలకు గాను ప్రిన్సిపాల్ జి. సంగీతకు ప్రశంస దక్కింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించినందుకు గాను సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా బుధవా రం హైదరాబాద్లో ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రిన్సిపాల్తో పాటు పాటు ఉపాధ్యాయులను అభినందించారు. టెండర్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి.. మన ఊరు–మనబడి ద్వారా చేపట్టిన టెండర్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు రూ.23.58 కోట్ల బిల్లులు చెల్లించడం జరిగింది. ఇంకా రూ.7కోట్ల 61 లక్షలు చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతాం. ప్రస్తుతం పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులకు సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వివరాలు తీసుకొని విద్యా శాఖ డైరెక్టర్కు పంపించాం. – జె.నారాయణ, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆదిలాబాద్టౌన్: నూతన విద్యాసంవత్సరానికి వేళయింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 6 నుంచి ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు ఈనెల 31లోగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ఈ ఏడాది కూడా సర్కారు బడుల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. 2021–22 సంవత్సరంలో మన ఊరు–మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం పనులు చేపట్టారు. మూడేళ్లు గడుస్తున్నా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పలు పాఠశాలల్లో చేపట్టిన పనులు కూడా ఇంకా కొన్ని అసంపూర్తిగానే నిలిచాయి. అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వసతులు అవసరం ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యా శాఖ అధికారులు జిల్లా యంత్రాంగం నుంచి తీసుకున్నారు. ఇందులో ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేరు.. విద్యార్థులు ఉన్నచోట సరిపడా టీచర్లు లేరు.. పలు పాఠశాలలకు తరగతి గదుల కొరత, మరుగుదొడ్లు, తాగునీటి సమస్య, శిథిలావస్థ బడులు వంటివి అనేకం ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం నాటికి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా.. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా జిల్లాలో గత విద్యా సంవత్సరంలో 649 పాఠశాలల్లో పనులు చేపట్టారు. మైనర్ రిపేర్లు, తాగునీరు, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుదీకరణ, బాలికల మరుగుదొడ్ల పనులు చేపట్టారు. వీటికోసం రూ.30 కోట్ల అంచనా వేశారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తదితర పనులు పెండింగ్లో ఉన్నాయి. 25 బడులు శిథిలావస్థలో.. జిల్లాలో 25 ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యా శాఖాధికారులకు నివేదించారు. 54 పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేవని, 17 ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, ఒక యూపీఎస్లో బాలికల మరుగుదొడ్లు, నాలుగు యూపీఎస్ల్లో బాలురకు, 12 ఉన్నత పాఠశాలల్లో బాలురకు మరుగుదొడ్లు లేవని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు అధికారులకు నివేదించారు. ఈ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. న్యూస్రీల్ -
ఆ సైలెన్సర్లు వాడొద్దు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించడంతో చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని వాడిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. నెలరోజుల పాటు జిల్లా కేంద్రంలో స్పెషల్డ్రైవ్ నిర్వహించి సీజ్ చేసిన 160 మోడిఫైడ్ సైలెన్సర్లను జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట మంగళవారం రోడ్రోలర్తో తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వాహనాలకు బిగించవద్దని, కంపెనీ సైలెన్సర్లను మాత్రమే వాడాలని సూచించారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఇకనుంచి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే మెకానిక్లు వాహనాలకు మోడిఫైడ్ సెలెన్సర్లు బిగించవద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్, టూటౌన్ సీఐలు సునిల్కుమార్, కరుణాకర్రావు, ట్రాఫిక్ సీఐ ప్రణయ్కుమార్, ఎస్సైలు మహేందర్, దేవేందర్, సిబ్బంది రాజేశ్, రామకృష్ణ, రమేశ్, ఫేరోజ్, విజయ్, సతీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సాగు సన్నద్ధతపై రేపు సాక్షి ఫోన్ఇన్
ఆదిలాబాద్టౌన్: ముందస్తు తొలకరితో అన్నదాత సాగుకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తి కోసం ‘సాక్షి’ నడుంబిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్స్వామితో గురువారం ఫోన్ఇన్కు శ్రీకారం చుట్టింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు, నకిలీ విత్తనాల బెడద, సాగులో మెలకువలు తదితర అంశాలపై రైతులు ఫోన్ ద్వారా సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన నంబర్ : 81063 02862 సమయం : ఈనెల 29న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి●
తలమడుగు: మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు మండలంలోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ను మంగళవారం తనిఖీ చేశారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలోకి పశువుల అక్రమ రవాణా కాకుండా వివిధ శాఖల సమన్వయంతో చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించాలన్నారు. స్టేషన్లో కేసులు పెండింగ్ లేకుండా చొరవ చూపాలన్నారు. అనంతరం కోసాయి రైల్వేస్టేషన్కు చేరుకుని అక్రమ రవాణాపై ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్సై రాధిక, ఏఎస్సై లక్ష్మణ్, సిబ్బంది ఉన్నారు. -
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
కై లాస్నగర్: ఎంపికై న అభ్యర్థులు 50 రోజుల పాటు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకుని సర్వేయర్గా రాణించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. శిక్షణకు అవసరమైన మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ ముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమన్నారు. శిక్షణలో నేర్పే అంశాలపైపట్టు సాధించాలని సూచించారు. 155 మందిని రెండు బ్యాచ్లుగా చేసి థియరీ, ఫీల్డ్లో శిక్షణ ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం వీసీలో పాల్గొన్న కలెక్టర్ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వరి ధాన్యం సేకరణ, వ్యవసా యం – మాన్సూన్ సంసిద్ధత వంటి అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దే శం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ బసవేశ్వర్, డీఎస్వో వాజీద్ అలీ, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లా కేంద్రం.. హాకీకి కేరాఫ్గా మారేనా ● ఇప్పటికే కేంద్రం నుంచి సెంటర్ మంజూరు ● తాజాగా సింథటిక్ టర్ఫ్ కోర్టు ఏర్పాటుకు ఎంపీ ప్రతిపాదన ● మంజూరైతే ఇక జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదిక
సాక్షి,ఆదిలాబాద్: మన జాతీయ క్రీడ హాకీకి జిల్లా కేంద్రం కీలకంగా మారనుంది. ఆదిలాబాద్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు వేదిక కానుందా.. అంటే.. అవుననే స మాధానం వినిపిస్తోంది. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాకీలో శిక్షణ కోసం ఖేలో ఇండియా సెంటర్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రస్తు తం ఈ క్రీడలో అనేక మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. రాష్ట్ర,జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్లో సింథటిక్ టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయాలని తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మంజూరైతే రాను న్న రోజుల్లో జాతీయస్థాయిపోటీలనిర్వహణకు వేది కవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రూ.7 కోట్లతో ప్రతిపాదనలు.. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం స్పోర్ట్స్ స్కూల్ కొనసాగుతుంది. అలాగే ఉట్నూర్, జాతర్లలో ఐటీడీఏ ఆ ధ్వర్యంలో గిరి క్రీడా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇందులోని విద్యార్థులు పలువురు హాకీలో శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా జిల్లాకేంద్రంలోని కొలాం ఆశ్రమ పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకు ల పాఠశాల, కళాశాల విద్యార్థులు సైతం ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇటీవల జిల్లా నుంచి గజానంద్, రాంకుమార్ ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రాతిని ధ్యం వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రానున్న రోజుల్లో ఈ క్రీడాభివృద్ధికి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇదిలా ఉంటే స్థానిక ఎంపీ నగేశ్ తాజా గా కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవి యాకు హాకీ కోసం ఆదిలాబాద్లో రూ.7 కోట్లతో సింథటిక్ టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. ఈ ఏడాది చివరిలోగా దీనికి మంజూ రు లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పట్టు వదలొద్దు.. జిల్లాలో క్రీడల అభివృద్ధి పరంగా నేతలు, అధికారులు పట్టువదలకుండా కృషి చేయాలన్న అభిప్రా యం పలువురి నుంచి వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్కు గతంలోనే ఫుట్బాల్ అకాడమీ మంజూరై ప్రారంభించబడింది. కొద్ది కాలం పాటు ఇక్కడ శిక్షణ కూడా కొనసాగింది. అయితే మధ్యలో దీన్ని ఖమ్మంకు తరలించారు. దీంతో ఆదిలా బాద్ కు అన్యాయం జరిగిందన్న అభిప్రాయం, ఆవేదన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమైంది. ఆ తర్వాత ఆదిలా బాద్కు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేశారు. ప్రస్తు తం హాకీ సెంటర్ కొనసాగుతుండగా, ఫోకస్ పెంచితే మరింత అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రయోజనాలు ఇలా.. టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేసిన పక్షంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా మారనుంది. రానున్న రోజుల్లో ప్రత్యేక అకాడమీ ఏర్పాటుకు కూడా అవకాశాలు ఉంటాయి. స్థానికంగా ఔత్సాహికులైన ఎంతో మంది క్రీడాకారులకు మంచి శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. -
● జిల్లాలో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ● పలుచోట్ల అన్నదాతకు తిప్పలు
జిల్లాలో మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు(మిల్లీమీటర్లలో) మండలం నమోదైన వర్షపాతం జైనథ్ 70.5 ఆదిలాబాద్ అర్బన్ 69.0 ఇచ్చోడ 44.5 మావల 37.5 గుడిహత్నూర్ 18.03 ఇంద్రవెల్లి 15.0 బోథ్ 5.5 భీంపూర్ 5.0 బజార్హత్నూర్ 4.8 ఉట్నూర్ 4.5 జైనథ్ 2.3 నార్నూర్ 1.5 తలమడుగు 0.8 కై లాస్నగర్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్ర వేశించాయి. మరోవైపు అల్పపీడనం సైతం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో జిల్లాలో పలు మండలాల్లో మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్లో మధ్యాహ్నం 2.30గంట ల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన మొదలైంది.గంటన్నర పాటు ఏకధాటిగా కురవడంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయయ్యాయి. అంబేడ్కర్చౌక్, పంజాబ్చౌక్లతో పాటు రాంనగర్లోని రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వికలాంగుల కాలనీలో వరదనీరు ఇళ్లలోకి చేరింది. జై నథ్లోనూ లోతట్టుప్రాంతాలు జలమయమ య్యా యి. ఇంద్రవెల్లి, బోథ్, భీంపూర్, బజార్హత్నూర్, ఉట్నూర్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంద్రవెల్లి, గాది గూడ మండలాల్లో కురిసిన వర్షానికి ఇంటిపైకప్పులు లేచిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడగా, స్తంభాలు నెలకొరిగాయి. పొల్లుగూడలోని పె ర్సపేన్ ఆలయంపై పిడుగు పడింది. అలాగే జొన్నల కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాంనగర్లో రహదారిపై నిలిచిన వర్షపునీరు -
గోదావరి మింగింది..
● బాసర వద్ద నదిలో మునిగి ఇద్దరు మృతి ● అందరూ చూస్తుండగానే జల సమాధి ● మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల బాలుడు ● నిజామాబాద్ జిల్లాకు చెందిన మరోవ్యక్తి.. భైంసా:నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి సోమవారం ఇద్దరిని మింగింది. పుణ్యస్నానాలకు వచ్చిన 11 ఏళ్ల బాలుడు, 40 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. అంతా చూస్తుండగానే ఆయుష్షు తీరిపోయింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని పర్బని జిల్లా టాకిలి గ్రామానికి చెందిన కుల్దీప్ బాలాసాహెబ్ దేశ్ముఖ్ (11) తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి సోమవారం బాసరకు రైలు మార్గం ద్వారా చేరుకున్నాడు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఈ కుటుంబం, పుణ్యస్నానం కోసం గోదావరి తీరానికి వెళ్లింది. ఫిల్టర్ బెడ్ సమీపంలో ఈత కొట్టేందుకు నీటిలోకి దూకిన కుల్దీప్, లోతైన నీటిలో మునిగిపోయాడు. అతనితో ఉన్న మరో బాలుడిని స్థానికులు కాపాడారు. కుల్దీప్ను రక్షించలేకపోయారు. కుటుంబ సభ్యులు కేకలు వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బాసర పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్లముందే కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. ఫంక్షన్ ముగించుకుని వచ్చిన వ్యక్తి.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బొల్లమల రాజు(40) తన బంధువులతో కలిసి ఆదివారం ఇంట్లో ఒక కార్యక్రమం పూర్తి చేసుకుని, మరుసటి రోజు సోమవారం బాసరకు వచ్చాడు. కూలీపని చేస్తూ భార్య, పిల్లలను పోషిస్తున్న రాజు, అమ్మవారి దర్శనం తర్వాత గోదావరి నదిలో స్నానం చేయడానికి రెండో ఘాట్ వద్దకు వెళ్లాడు. ఈత రాకపోయినా.. కాళ్లు కడుక్కుంటానని నీటిలోకి దిగాడు. బంధువులు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే లోతైన నీటిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా మృతదేహం లభించలేదు. చివరకు అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. రాజు భార్య స్వరూప ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలు అప్పగింత ఇద్దరు మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకే రోజు గోదావరి నదిలో ఇద్దరు భక్తులు జలసమాధి అవడం స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేసింది. -
ముగిసిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు
● జిల్లాకు 15 మెడల్స్ ● జాతీయస్థాయికి ఇద్దరు ఎంపికమంచిర్యాలటౌన్: పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి టైసన్ బాక్సింగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. 260 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఆద్యంతం ఆకట్టుకునేలా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో అలరించారు. జిల్లా కేంద్రంలో కోచ్ రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా బాక్సింగ్ శిక్షణ కేంద్రం నుంచి 19 మంది పోటీల్లో పాల్గొనగా 9 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 15 మెడల్స్ను సాధించారు. గోల్డ్ మెడల్ను సాధించిన వారిలో ఏ.రక్షిత్, జి.రిశ్వంత్, ఎండీ ఉబేద్, క్రితి అగర్వాల్, బి.రుత్విక్ కుమార్, ఓ.సంస్కృతి, సీహెచ్.హాసిని, బి.అనుదీప్, ఎస్.షణ్ముఖ్ తేజ ఉన్నారు. సిల్వర్ మెడల్ సాధించిన వారిలో పి.కార్తీక్, జి.శ్రీనాథ్, బ్రాంజ్ మెడల్ సాధించిన వారిలో ఎం. అశ్వత్, పురబ్ బిశ్వాస్, బి.అనురాగ్, సీహెచ్.జగదీశ్వర్ ఉన్నారు. వీరిని జిల్లా యువజనుల క్రీడల శాఖ అధికారి కీర్తి రాజ్వీరు అభినందించారు. జాతీయ స్థాయిలో వచ్చేనెల 3న గోవాలో జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు క్రితి అగర్వాల్, ఉబేద్ ఎంపికై నట్లు కోచ్ రాజేశ్ తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లె గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం.. కడెం మండలం లింగాపూర్కు చెందిన నీరేటి రాహుల్ (19) ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్కు బైక్పై పండుగ నిమిత్తం వెళ్లి తిరిగివస్తున్నాడు. ఖానాపూర్ మండలం గోసంపల్లె పొలిమేరలో చెట్టును ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బైక్పై ఉన్న మరో యువకుడు జక్కుల కార్తీక్కు సురక్షితంగా బయటపడ్డాడు. యువకుడి అతి వేగం, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.చికిత్స పొందుతూ విద్యార్థి మృతికాగజ్నగర్రూరల్: మండలంలోని అంకుశాపూర్ గ్రామానికి చెందిన గౌత్రే విష్ణుతేజ(12) విద్యార్థి చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విష్ణుతేజ 7వ తరగతి చదువుతున్నాడు. సెల్ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని నెలరోజుల క్రితం పురుగుల మందు తాగాడు. హైదరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమిండంతో మృతి చెందాడు. సోమవారం స్థానిక పీహెచ్సీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ తెలిపారు.మేకల మందపై చిరుత దాడినర్సాపూర్ (జి): మండలంలోని రాంపూర్ అ నుబంధ దర్యాపూర్ గ్రామశివారులోని అట వీ ప్రాంతంలో మేకల మందపై సోమవారం సాయంత్రం చిరుత పులి దాడి చేసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎరుకల శ్రీకాంత్ మేకలను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. మేకలు మేస్తుండగా చిరుత ఒక్కసారిగా మందపై దాడిచేసింది. ఈ ఘటనలో ఓ మేక మేక గాయపడింది. ఈమేకు బాధితుడు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నందున పశువులు, మేకల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీఅధికారులు సూచించారు. -
అక్రమ పత్రాలతో మోసం చేసిన ఉద్యోగి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి మోసం చేసిన కేసులో ఓ ప్రభుత్వ ఉద్యోగిని వన్టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వన్టౌన్ పోలీసుస్టేషన్లో సీఐ సునీల్ కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన కొండూరి గంగాధర్ విద్యానగర్కు చెందిన సయ్యద్ రజాక్ సర్వే నం.346, ప్లాట్ నం.191 అటెండర్ కాలనీలో ప్లాట్ విక్రయించాడు. పదవిని దుర్వినియోగం చేసి సుమిత్రబాయి అనే అటెండర్ పేరుపై నకిలీ దస్తావేజులు తయారు చేసి బాధితుడికి విక్రయించాడు. సయ్యద్ రజాక్ ఈ ప్లాట్ను బ్రహ్మకంటి సత్యనారాయణకు విక్రయించగా, ఆయన నళినికి ప్లాట్ను అమ్మాడు. ఆమె బ్యాంక్ రుణం తీసుకుని ఇల్లు నిర్మించే క్రమంలో అక్కడికి వెళ్లి స్థల యజమాని తోట ఆశమ్మ అభ్యంతరం తెలిపింది. దీంతో మోసం వెలుగులోకి వచ్చింది. మొదట ప్లాట్ కొనుగోలు చేసిన సయ్యద్ రజాక్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు. కొండూరి గంగాధర్ అక్రమంగా సుమిత్రబాయి సహకారంతో, ఆమెను బెదిరించి అక్రమ పత్రాలు సృష్టించినట్లు తేలిందని సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. గంగాధర్ ప్రస్తుతం జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ వ్యవహారానికి సంబంధించి బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి విచారణ చేపట్టి అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారిస్తూ కలెక్టర్కు నివేదిక అందజేశారు. దాని ఆధారంగా గంగాధర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీచేశారు. -
పంటమార్పిడితోనే ఫలితం
● ఏళ్ల తరబడి ఒకే రకం పంటలు చేటు ● మార్పుతోనే మంచి దిగుబడి మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. రుతుపవనాలు జూన్ మొదటి వారంలో జిల్లాలను తాకానున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు పడేలోగా విత్తనాలు సమకుర్చుకునే పనిలో రైతులు సమయాత్తమవుతున్నారు. అయితే వారు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే.. ఒకే భూమిలో ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి పండిస్తూ దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. చీడపీడల బెడద అధికమవడంతోపాటు భూమి నిస్సారమవుతుంది. పంట మా ర్పిడితో ప్రయోజనం పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ సస్యరక్షణ శాస్త్రవేత్త రాజశేఖర్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో నల్లరేగడి నేలలు 70 శాతం, 20 శాతం ఎర్ర,10 శాతం చౌడు ఇసుక నేలలు ఉన్నాయి. అన్ని పంటలకు అనుకూలంగా నేలలు ఉన్న రైతులు పత్తి, సోయా, వరి పంటలను ఎనిమిదేళ్లుగా సాగు చేస్తున్నారు. దీని ద్వారా చీడపీడల ఉధృతి పెరుగుతుంది. భూసారం కోల్పోయి పంట దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నారు. పంట మార్పిడితో కొంతవరకు దిగుబడి పెంచుకుని నషాల నుంచి గట్టేక్కే ప్రయోజనం ఉంది. పంట మార్పునకు.. పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా ఎంచుకోవాలి. ఉదాహరణకు కొన్ని పంటలు వేరు వ్యవస్థలు భూమి నుంచి పోషకాలను గ్రహిస్తాయి. నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు ఈ కోవలోకి వస్తాయి. అపరాల పంటలు కొంతవరకు పరిస్థితుల్ని కూడా తట్టుకుంటాయి. ఆకుల్ని రాల్చి భూమికి సేంద్రియ పదార్థాల్ని అందిస్తాయి. ఈ పంట వేరు బుడిపెలు నత్రజనిని స్థీరీకర్తిస్తాయి. నల్లరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించిన వారు సోయచిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి అకులు పూర్తిగా రాలిపోతాయి. తద్వారా ఎకరాకు 1 నుంచి 2 టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తుంది. ఎలాంటి పంట వేసుకోవాలి గతేడాది రబీలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్లో మొక్కజొన్న వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల రాబోయే రబీలో మళ్లీ వేరుశనగ వేసినప్పుడు ఆ పంట నులిపురుగుల బెడద తగ్గుతంది. శనగ పంట వరుసగా వేసుకుంటే కాయతొలుచు పురుగుల తాకిడి ఉంటుంది. వీటి దాడి తక్కువగా ఉండే జొన్న, నువ్వులు, ఉలవ, మెట్ట వరి పంటలు వేసుకోవచ్చు. కంది, శనగ, పంటలతో పోలిస్తే మినుము, సోయచిక్కుడు పంటలకు కాయతొలుచు పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. వీటితో పంట మార్పిడి చేయవచ్చు. వరుసగా పొద్దుతిరుగుడు వేసుకున్నవారు దాని స్థానంలో కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యపు పంటలు వేసుకోవాలి. దీనివల్ల నులిపురుగు తాకిడి తగ్గుతుంది. అనుప, కాకర, దోస, కర్బూజ, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ తీగజాతి కూరగాయల పంటలసాగు చేసినవారు వరితో పంట మార్పిడి చేసుకోవాలి. ఏళ్లుగా పసుపు వేయొద్దు ఒకసారి పసుపు వేసిన భూమిలో రెండేళ్లపాటు పసుపు సాగు చేయొద్దు. వరుసగా పసుపు వేసుకుంటే దిగుబడి తగ్గిపోతాయి. చీడపీడల దాడి అధికమవుతుంది. పసుపు వేసిన భూమిలో వరి, చెరుకు, అరటి పంటలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. చీడపీడల నివారణకు.. కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు, కొన్ని పంటల్ని అధికంగా అశించి వృద్ధి చెందుతాయి. అలాంటి పంటల్ని వరుసగా వేసుకోకుండా పంట మార్పిడి చేసుకోవాలి. ఉదాహరణకు ఒకే భూమిలో వరుసగా వరి వేయకుండా పప్పు ధాన్యపు పంటలు, నూనె గింజల పంటలు వేసుకోవాలి. మిరప, వేరుశనగ, క్యాబేజీ పంటల్ని లద్దె పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటి ఉధృతిని అరికట్టేందుకు జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, అరుతడి పంటలతో పంట మార్పిడి చేయాలి. దీనివల్ల ఆయా పంటల్లో కాళహస్తి తెగులు, నులి పురుగులు, ఆకుముడత, లద్దె పురుగుల ఉధృతిని నివారించవచ్చు. దుక్కి దున్నుతున్న రైతు -
స్మార్ట్ బజార్
● నెట్టింట్లో ఆర్డర్.. నట్టింటికే సరుకులు ● మార్కెటింగ్ రంగంలో ఆధునిక విప్లవం.. ● విస్తరిస్తున్న ఆన్లైన్ మార్కెట్.. ● ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న ఈ–కామర్స్ ● నేడు ప్రపంచ మార్కెటింగ్ దినోత్సవంనిర్మల్ఖిల్లా: ప్రస్తుత మార్కెటింగ్ రంగం రోజు రోజుకూ కొత్త ఒరవడిని సంతరించుకుంటూ విని యోగదారులను ఆకర్షిస్తోంది. గతంలో షాపింగ్ కోసం మార్కెట్కు వెళ్లి వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం ఉండేది. కానీ, నేడు ఈ–కామర్స్ సంస్థలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండానే నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ ఉపకరణాల వరకు అన్నింటినీ ఇంటికి చేర్చే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మంగళవారం ప్రపంచ మార్కెటింగ్ దినోత్సవం సందర్భంగా ఈ–కామర్స్ సంస్కృతిపై ప్రత్యేక కథనం. ఆన్లైన్ షాపింగ్ జోరు గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ కొనుగోళ్లు ఇప్పుడు గ్రామాలు, మారుమూల తండాలకు విస్తరించాయి. నిత్యావసరాలు, బట్టలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పాదరక్షలు అన్నీ మొబైల్ ద్వారా ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ సౌ లభ్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ– కామ ర్స్ సంస్థల విస్తృత నెట్వర్క్, సులభమైన డెలివరీ వ్యవస్థ ఈ ట్రెండ్ను వేగవంతం చేసింది. ఉపాధి అవకాశాలు ఉమ్మడి జిల్లాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి సంస్థలు ఏజెన్సీలు, కొరియర్ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. స్థానిక యువత డెలివరీ సిబ్బందిగా ఉపాధి పొందుతూ వినియోగదారులకు నేరుగా వస్తువులను అందజేస్తున్నారు. ఈ వ్యవస్థ గ్రా మీణప్రాంతాలకు కూడా సేవలను అందిస్తూ స్థాని క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ‘స్మార్ట్ నిర్మల్’యాప్ ద్వారా నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ను జిల్లావాసులు ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ల సమన్వయంతో శాఖాహార, మాంసాహార ఐటమ్స్ను సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నారు. కాగా, ఆన్లైన్లో వస్తువుల కొనుగోలుతో స్థానిక వ్యాపారులకు కొంత నష్టం జరుగుతుందని, వారిని ప్రోత్సహించాలని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. యువత ఆధిపత్యం మొబైల్ ఫోన్ను విరివిగా వినియోగించే యువత ఈ–కామర్స్ సేవలను ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఫ్యాషన్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఆహార పదార్థాల వరకు వారు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. గృహిణులు కూడా నిత్యావసరాలు, బట్టలు, గృహ సామాగ్రి కొనుగోలుకు ఈ–కామర్స్ వేదికలను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ కొనుగోళ్లలో తప్పుడు వెబ్సైట్లు, మోసపూరిత లావాదేవీల నుంచి జాగ్రత్తగా ఉండాలి. విశ్వసనీయ సంస్థలను ఎంచుకోవడం, ముందస్తు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. పిన్కోడ్, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను సురక్షిత వెబ్సైట్లలోనే నమోదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లలేకనే.. బయటకు వెళ్లి షాపింగ్ చేసే సమయం లేదు. ఇంట్లో ఉండి నిత్యావసరాలు తదితర వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటాను. డెలివరీ తర్వాత వస్తువు డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేసే అవకాశం ఉంది. కాలానికనుగుణంగా ఈ కామర్స్ షాపింగ్ మంచి వేదికగా మారుతోంది. – లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగి, నిర్మల్ స్థానిక మార్కెట్పై ప్రభావం అరచేతిలో సెల్ఫోన్ ఉండడంతో ఆన్లైన్ షాపింగ్కు ఆసక్తి పెరుగుతోంది. ఈ కామర్స్ వ్యాపారం క్రమంగా పల్లెలకు విస్తరించడంతో స్థానిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిర్మల్ మార్కెట్ ప్రస్తుతం పండుగ సీజన్లో వెలవెలబోతోంది. స్థానిక వ్యాపారులకు వర్తకం జరిగేలా ప్రోత్సహించాలి. – పోల దయాకర్, వస్త్ర వ్యాపారి, నిర్మల్ -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: గిరిజనుల అర్జీలు సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను పీవో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 119 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఆయా అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏవో దామోదరస్వామి, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ● ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామానికి బోర్వెల్ సౌకర్యం కల్పించాలని గిత్తే మనోహర్ దరఖాస్తు అందించాడు. ● తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి రోడ్లతోపాటు ఇళ్ల సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు. ● ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామానికి చెందిన రాజ్కుమార్ తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నాడు. ● కడెం మండలం ఉడుంపూర్ గ్రామానికి చెందిన ఆత్రం మాణిక్రావు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని కోరాడు. -
డీపీవోగా రమేశ్ బాధ్యతలు
● మూడు నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెర కైలాస్నగర్: జిల్లా పంచాయతీ అధికారిగా గుడిపెల్లి రమేశ్ సోమవారం ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించారు.దీంతోపాత,కొత్తఅధికారుల మధ్య ఈ పోస్టుపై మూడునెలలుగా నెలకొన్న ప్ర తిష్టంభనకు తెరపడింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డీపీవోగా ఉన్న శ్రీలతను కమిషనర్ కా ర్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం నిర్మల్ డీఎల్పీవోగా పనిచేస్తున్న రమేశ్ను ఇక్కడ నియమించింది. ఈఏడాది ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకోడ్ అమల్లో ఉండడంతో డీ ఎల్పీవోగా ఉన్న ఆయన్ను రీడిప్లాయ్మెంట్ కింద డీపీవోగా నియమిస్తూ అదే నెల 25న మరో సారి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అదేనెల 27న నిర్మల్ డీఎల్పీవోగా రిలీ వై జిల్లాలో విధుల్లో చేరేందుకు వచ్చిన ఆయన కలెక్టర్ను కలిశారు. అయితే కోడ్ ముగిసేవరకు వేచి ఉండాలని కలెక్టర్ ఆయనకు సూచించారు. తీరా కోడ్ ముగిసినా విధుల్లో చేర్చుకోలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన ఏ పోస్టులోలేకుండా వెయిటింగ్లోనే కొనసాగారు. తాజాగా రమేశ్ను తప్పనిసరి గా విధుల్లో చేర్చుకోవాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఈనెల 24నఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టర్ను రమేశ్ మర్యాదపూర్వకంగా కలిసి రిపోర్టు చేశారు. -
● ఆదిలాబాద్ ఏసీబీ కార్యాలయ పరిస్థితి ● డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులు మంచిర్యాలకు తరలింపు ● ఇక్కడ కానిస్టేబుళ్లు మాత్రమే..
ఆదిలాబాద్ ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) కార్యాలయం.. ఓ డీఎస్పీస్థాయి అధికారి, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, రైటర్.. ఇలా మొత్తం 14 మందితో ఆఫీస్ నిత్యం సందడిగా ఉండే ది. అయితే ఇది ఇక గతమే. ప్రస్తుతం అధికారులతో పాటు కొంత మంది కానిస్టేబుల్ పోస్టులను మంచిర్యాలకు తరలించేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ సైతం పూర్తయింది. ఇక్కడ కేవలం ఒకరిద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న ఈ కార్యాలయం ప్రాభవాన్ని కోల్పోయింది. ఆఫీసు ఉందా అంటే.. ఉంది అన్నట్టుగా మారింది. – సాక్షి,ఆదిలాబాద్ఆదిలాబాద్ ఏసీబీ కార్యాలయం మంచిర్యాలకు తరలిపోయాయి.. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లో ఈనెల 19న ఏసీబీ డైరెక్టర్ తరుణ్జోషి అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని అక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నస్పూర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా అక్కడికే తరలించారు. ఇక ఆదిలాబాద్లో కార్యాలయాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. పదేళ్ల కేసులను పరిశీలిస్తే.. మంచిర్యాల ప్రాంతం నుంచే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని ఆ రోజు డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు. సేవలు అందుబాటులోనని చెబుతూ.. ఆదిలాబాద్ ఏసీబీ కార్యాలయం నుంచి ప్రధాన పో స్టులను మంచిర్యాలకు తరలించిన విషయంలో ఇప్పటికీ అధికారులు స్పష్టంగా పేర్కొనడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణం దృష్ట్యా మంచి ర్యాల, కుమురంభీం జిల్లాలకు కలిపి మంచిర్యాల కార్యాలయం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఆదిలాబాద్ ఆఫీస్ సేవలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడి కార్యాలయం కూడా డీఎస్పీ పర్యవేక్షణలోనే కొనసాగుతుందని పేర్కొంటున్నారు. ఆదాయ దాడులు కాకుండా ప్రత్యక్ష దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసుల్లో నిందితుడిని 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ రేంజ్కు సంబంధించి కేసుల్లో నిందితులను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ క్రమంలో సమయభావం, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకొని డీఎస్పీ ప్రధాన కార్యాలయం మంచిర్యాలలో, అలాగే ఆదిలాబాద్లో సేవలు అందుబాటులో ఉండేలా కానిస్టేబుళ్లకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. విస్తృత దాడుల నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏసీబీ విస్తృత దాడులు నిర్వహిస్తోంది. అనేక మంది ఉన్నతాధికారుల అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేవలు మరింత పెంచాల్సి ఉండగా, వాటి స్థాయి తగ్గించడం ఏవిధంగా సబబనే ప్రశ్న తలెత్తుతోంది. కనీసం ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టు కూడా ఆదిలాబాద్లో అందుబాటులో ఉంచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం తాము మంచిర్యాలలో ఉన్నా.. ఎక్కడున్నా.. బాధితుల ఫిర్యాదు అందిన తర్వాత డీఎస్పీ స్థాయి అధికారి నుంచి మొదలుకుంటే అందరూ రంగంలో ఉంటారని, ఇటీవల నిర్మల్ జిల్లా కడెంలో మండల సర్వేయర్ను పట్టుకున్న కేసే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. అయితే అధికారుల పోస్టులు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో బాధితులు ఫిర్యాదు విషయంలో కొంత వెనుకంజ వేసే అవకాశం లేకపోలేదు. ఆ సమయంలో మంచిర్యాల వరకు వెళ్తారా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సేవలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కార్యాలయం ద్వారా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలకు అవినీతి నిరోధక శాఖ పరంగా పూర్తిస్థాయిలో సేవలు కొనసాగుతాయి. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఆదిలాబాద్ కార్యాలయంలో ప్రతిరోజు ఉద్యోగుల హాజరుకు సంబంధించి కూడా పర్యవేక్షణ నేనే చేస్తున్నాను. ఫిర్యాదుల విషయంలో కూడా తక్షణం స్పందిస్తున్నాం. అవినీతికి సంబంధించి శాఖ అధికారులకు సమాచారాన్ని ప్రజలు ఎలాంటి సందేహాం లేకుండా అందించాలి. – పి.విజయ్కుమార్, డీఎస్పీ, ఏసీబీ -
మంత్రి ‘తుమ్మల’ను కలిసిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్: రైతులకు సంబంధించిన జొన్న కొనుగోళ్ల డబ్బులు త్వరగా విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. మంత్రి కార్యాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. జొన్న కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వానాకాలం పంటకు పెట్టుబడి లేక అప్పు చేయాల్సిన దుస్థితి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతు భరోసా నిధులు సైతం వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ముగిసిన ‘సర్వేయర్’ సర్టిఫికెట్ల పరిశీలన
కై లాస్నగర్: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 163 మంది సర్టిఫికెట్లను జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో నాలుగు ప్రత్యేక కౌంటర్ల ద్వారా పరిశీలించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. నలుగురు అభ్యర్థులు గైర్హాజరు కాగా, తగు డాక్యుమెంట్లు, అర్హతలు లేకపోవడంతో ముగ్గురిని రిజెక్ట్ చేశారు. మరో అభ్యర్థికి సంబంధించి ఆధార్కార్డు ఆదిలాబాద్లో ఉన్నప్పటికీ మిగతా విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నిర్మల్లో ఉండటంతో అక్కడి అధికారులతో మాట్లాడి సదరు అభ్యర్థిని నిర్మల్ జిల్లాకు పంపించారు. దీంతో 155 మంది శిక్షణకు అర్హత సాధించినట్లు జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తెలిపారు. శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇండ్లు రాకుండా చేస్తున్నారు
అయ్యా.. మేము మావల మండలంలోని బట్టిసావర్గాం గ్రామానికి చెందిన నిరుపేదలం. వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నాం. మా గ్రామానికి 12 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేశారు. మాకు ఇండ్లు మంజూరయ్యాయి. అయితే గ్రామానికి చెందిన కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారు. గ్రామస్తులను రెచ్చగొట్టి మాకు ఇండ్లు దక్కకుండా కుట్ర చేస్తున్నారు. అర్హులమైన మాకు అన్యాయం జరుగకుండా చూడాలని కోరుతున్నాం. ముంపు నుంచి రక్షించండి మేమంతా తాంసి మండల కేంద్ర వాసులం. గ్రామానికి చెందిన లింగంగౌడ్ ప్రాథమిక పాఠశాలకు నాలుగు మీటర్ల పక్కనే కల్లు కంపౌండ్ నిర్వహిస్తున్నాడు. దాని పక్కనే ప్రవహస్తున్న మత్తడివాగు ఆనుకుని గట్టు వెంబడి పెద్ద మొత్తంలో ఈత చెట్లు నాటాడు. అయితే వాగును ఆనుకునే 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. వనంలా పెంపు చేస్తుండంతో వాగు సాఫీగా ప్రవహించకుండా బ్యాక్ వాటర్ ఇళ్లలోకి వచ్చే ప్రమాదముంది. వర్షాకాలంలో ముంపునకు గురయ్యే అవకాశముంది. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -
సమస్యల పరిష్కారానికి చర్యలు●
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలు ప రిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 40 మంది అర్జీదారులు ఎస్పీకి తమ సమస్యలను విన్నవించారు.ఆయన సంబంధిత పోలీసు అధికా రులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాల ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ సమస్యను పరిష్కరించినప్పుడే పోలీసులపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. నేడు ఉమ్మడి జిల్లాస్థాయి హాకీ ఎంపిక పోటీలుఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రి యదర్శిని స్టేడియంలో మంగళవారం ఉమ్మ డి జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలి పారు. అర్హులైన క్రీడాకారులు స్టేడియంలో శిక్షకులు జే.రవీందర్, వై.శేఖర్, పి.శ్రీనివాస్, మహమ్మద్, అశోక్, అతుల్, గోవింద్ వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. -
ఏటీసీ పనుల పరిశీలన
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి సోమవారం పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టాటా ఫౌండేషన్ సంయుక్తంగా రూ.40 కోట్లతో నిర్మాణం చేపడుతుందని పేర్కొన్నారు. ఇందులో రూ.35 కోట్లు ఫౌండేషన్ వాటా, రూ.5 కోట్లు ప్రభు త్వ వాటాతో పనులు చేపడుతున్నట్లు వివరించారు. జూన్ వరకు నిర్మాణం పూర్తి కావా ల్సి ఉండగా, మరికొన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు వరకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఐటీఐని ఉన్నతీకరణ చేసేందుకు ఈ సెంటర్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రోబోటిక్, ఏఐ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఆయన వెంట ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రశాంత్, విక్రమ్ తదితరులు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహిస్తున్న టైసన్ కప్ స్టేట్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రీడా పాఠశా ల విద్యార్థులు సత్తా చాటారు. అండర్–17 బాలికల విభాగంలో 48–50 కిలోల కేటగిరీ లో టి. నిహారిక, అండర్–14 విభాగంలో 49– 52 కేజీల కేటగిరిలో బి.నిఖిల్కుమార్, 35– 37 కేజీల కేటగిరీలో నందిని బంగారు పతకాలు సాధించారు. అలాగే 40–43 కేజీల కేటగిరిలో బి.అశ్విని రజత పతకంతో సత్తా చాటినట్లు బాక్సింగ్ కోచ్ ఎం.సాయికుమార్ తెలిపారు. ఇందులో టి.నిహారిక జూన్ 3 నుంచి 7వరకు గోవా వేదికగా నిర్వహించను న్న ఫస్ట్ గోవా ఇన్విటేషనల్ జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు కోచ్ వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలవడంపై డీవైఎస్వో వెంకటేశ్వర్లు, ఆది లాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. విజయేందర్, జనరల్ సెక్రెటరీ ఎంఏ.బేగ్ తదితరులు అభినందించారు. -
బారులు తీరి.. గోడు వినిపించి
● ప్రజావాణికి వినతుల వెల్లువ ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: పింఛన్ రావడం లేదని ఒకరు.. ఇంది రమ్మ ఇల్లు మంజూరు చేయాలని మరొకరు.. ఉపాధి చూపాలని ఇంకొకరు.. ఇలా వివిధ సమస్యలతో వచ్చిన బాధితులు కలెక్టరేట్లో బారులు తీరారు. సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో కలెక్టర్ రాజర్షి షాతో తమ గోడు వెల్ల బోసుకున్నారు. వారి నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించేలా చొరవచూపాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వి ద్యుత్, మున్సిపల్, జెడ్పీ, రిమ్స్ వంటి తదితర శా ఖలకు సంబంధించి ఈ వారం 123 దరఖాస్తులు అందాయి. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదే వి, ఆర్డీవో వినోద్ కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వారం బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే... -
ఆ సార్లు.. అడ్డుకుంటున్నారు
సార్.. మేమంతా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామస్తులం. సర్వేనంబర్ 73 లోని భూమిని 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. నోటిఫైడ్ ఏరియా కావడంతో మాకు పట్టాలు జారీ కాలేదు. పహానీల ద్వారా ప్రభుత్వ సాయం కూడా పొందుతున్నాం. అయితే వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లగా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. పనిముట్లను లాక్కుంటున్నారు. అందులో మొక్కలు నాటేందుకు ఇటీవల సర్వే చేశారు. దీంతో మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. -
ఉపాధి దూరం చేశారు
నా పేరు సరిత. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ వాసిని. నా కొడుకు శివప్రసాద్ దివ్యాంగుడు. తన బాగోగులు చూసేందుకు ఆయన వెంటే ఉండాల్సి వస్తోంది. పట్టణంలోని భవిత కేంద్రంలో చేర్పించగా నాకు అక్కడ కేర్ గివ్గా ఉద్యోగం కల్పించారు. అయితే వైద్య చికిత్స నిమిత్తం నేను హైదరా బాద్కు వెళ్లగా నా స్థానంలో మరో మహిళను నియమించారు. వైకల్యం కలిగిన పిల్లల తల్లులతో నియమించాల్సిన ఈ పోస్టును సాధారణ పిల్లలున్న మహిళతో భర్తీ చేశారు. నా కొడుకు పరిస్థితి దృష్టిలో ఉంచుకుని నాకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నా. -
ఆలస్యం వెనుక.. ఆంతర్యమేమిటో?
● వర్షాకాలం ముంగింట వేసవి పనులకు టెండర్లు ● అత్యవసర నిధులు.. అద్దె వాహనానికి కేటాయింపు ● బల్దియా అధికారుల తీరుపై విమర్శలు కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి చేపట్టిన టెండర్ల ప్రక్రియ విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రత్యేకాధికారి పట్టించుకోకపోవడంతో బల్దియా అధికారులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం ముంగిట వేసవి పనులకు టెండర్లు నిర్వహించడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవలే రూ.40లక్షల పనులకు టెండర్లను ఖరారు చేశారు. వాటికి సంబంధించి న సామగ్రి ఇప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా కా లేదు. తాజాగా మరో రూ.60 లక్షలతో కూడిన సామగ్రి,నీటి సరఫరాకు టెండర్లు పిలువడం వె నుక ఆంతర్యమేమిటనే సందేహాలు వినిపిస్తున్నా యి. సమ్మర్ సీజన్ పేరిట నిధుల స్వాహా కోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది లా ఉంటే అత్యవసరమైన తాగునీటి సమస్య కోసం వెచ్చించాల్సిన నిధులను ఓ అధికారి వా హనం అద్దె చెల్లించేందుకు కేటాయింపులు చేయ డం విమర్శలకు తావిస్తోంది. వర్షాకాలం ముంగిట టెండర్లు.. జిల్లాలో మూడు, నాలుగు రోజులుగావిస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి కూడా ఈసారి ముందుగానే పలకరిస్తుందని అధికారులు చెబు తున్నారు. ప్రస్తుతం లాండసాంగ్వి పంపుహౌస్ నుంచి నిత్యం 12 ఎంఎల్డీల నీటి సరఫరా జరుగుతుందని, పట్టణంలో నీటి సమస్య ఎక్కడా లేదని బల్దియా అధికారులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సమ్మర్ సీజన్ కోసం కేటాయించిన అత్యవసర (15వ ఆర్థిక సంఘం) నిధులకు సంబంధించి రూ.60.50 లక్షల టెండర్లు ఇంత ఆలస్యంగా నిర్వహించడమేంటనే ప్రశ్న తలెత్తుతుంది. ఇందులో రూ.15.50 లక్షలతో చేతిపంపుల సామగ్రి సరఫరా, రూ.25 లక్షలతో బోర్వెల్స్ డ్రిల్లింగ్, పంపుసెట్ మోటార్లకు, మరో రూ.20 లక్షలతో ఆయా కాలనీలకు నీటి సరఫరా నిమి త్తం టెండర్లు ఆహ్వానించిన అధికారులు వీటిని శనివారం తెరిచారు. ఇందులో రూ.40.50 లక్షల సామగ్రి సరఫరాకు సంబంధించిన టెండర్ ఖరా రు చేస్తూ ఓ గుత్తేదారుకు కేటాయించారు. మరో రూ.20 లక్షల బోర్వెల్స్, మోటార్ల సరఫరాకు సంబంధించి టెండర్ను రీకాల్ చేస్తున్నట్లుగా వె ల్లడించారు. వేసవిముగింపు దశకు చేరడం, ఎక్క డా నీటి సమస్య అంతగా లేకపోయినా టెండర్ల కేటాయింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర నిధులు అధికారి వాహన అద్దెకు.. పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు వె చ్చించాల్సి ఉంటుంది. అయితే బల్దియా అధికా రులు అందుకు భిన్నంగా ఓ అధికారి వాహన అద్దె చెల్లించేందుకు నిధులు కేటాయింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ఇతర అభివృద్ధి ప నులు పర్యవేక్షించేందుకు గాను వాహనాన్ని అద్దె కు వినియోగిస్తూ దానికి ఈ నిధులు చెల్లించేలా టెండర్లలో పొందుపరిచారు. నెలకు రూ.33వేల చొప్పున ఏడు నెలలకు గాను రూ.2.31 లక్షలు వెచ్చించనున్నట్లుగా అందులో పేర్కొన్నారు. సాధారణంగా అధికారుల వాహనాల అద్దె జనరల్ ఫండ్, ఇతర నిధుల నుంచి వినియోగించాల్సి ఉంటుంది. ఈవిషయమై మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును ఫోన్లో సంప్రదించగా.. తాను కార్యాలయానికి వెళ్తున్నానని, వెళ్లాక వివరాలు చెబు తానని పేర్కొన్నారు. ఇదే విషయమై మున్సిపల్ ఇంజినీర్ పేరి రాజును సంప్రదించగా.. తాను మీటింగ్లో ఉన్నానని, మళ్లీ మాట్లాడతానంటూ పేర్కొనడం గమనార్హం. -
నకిలీ విత్తన విక్రయాలపై నిఘా పెంచాలి
ఇచ్చోడ: గ్రామాల్లో అమాయక రైతులను ఆసరగా చేసుకొని నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు న మోదు చేయాలని రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెం బొర్రన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఇచ్చోడలో రైతులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొంత మంది వ్యాపారులు గ్రామాల్లో అమాయక రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నరని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, పోలీసు శాఖ లు గ్రామాల్లో మరింత నిఘా పెంచి తనిఖీ లు నిర్వహించాలన్నారు. ఆయన వెంట రైతులు అనిల్, మోహన్, మాణిక్రావు, సలీం తదితరులు ఉన్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు సర్వం సిద్ధం
● నేటి నుంచి 163 మందికి వృత్తిపరమైన శిక్షణ కై లాస్నగర్: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ల వృత్తిపరమైన శిక్షణకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం మొదటి బ్యాచ్గా ఎంపిక చేసిన 163 మందికి జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో 50 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10గంటలకు అభ్యర్థులు కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ప్రత్యేకంగా నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులు, మీ సేవకేంద్రం దరఖాస్తు రశీదు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులను రెండు బ్యాచ్లుగా విభజించనున్నారు. కొందరికి ఉదయం తరగతులు నిర్వహిస్తారు. మరి కొంతమందికి క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తారు. సర్వేకు సంబంధించిన గొలుసులు, క్రాస్స్టాప్, క్యాలికులేటర్, స్కేల్, పెన్సిల్, నోట్ బుక్తో పాటు స్టడీ మెటిరియల్ అందించనున్నారు. ఈ సామగ్రి అంతా ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. కాగా, ఏర్పాట్లను జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ పరిశీలించారు. శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని రాణించాలని ఆయన సూచించారు. -
రిజిస్ట్రేషన్ ఇక సులభతరం
కై లాస్నగర్: రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఆస్తుల రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో జూన్ 2నుంచి అన్ని చోట్ల అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో రెండు చోట్ల ఇకపై స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో రెండు చోట్ల.. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి ద్వారానే ప్లాట్లు, ఇళ్లు వంటి ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోజుకు సగటున 50 నుంచి 60 వరకు ఉండగా, బోథ్లో నెలకు 30 నుంచి 40 ఉంటున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లపై అమ్మినవారు, కొన్నవారు, సాక్ష్యులు, సబ్రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యమవుతుంది. ఫలితంగా ప్రజల సమయం వృథా అవడంతో పాటు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని నివారించాలని భావించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఆధార్–ఈ సంతకం అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. తద్వారా జాప్యం లేకుండా ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయవచ్చని భావిస్తోంది. సేవల్లో వేగవంతం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలు వేగవంతంగా పారదర్శకంగా అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్గా పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అక్కడ విజయవంతం కావడంతో జూన్ 2నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ జూన్ 2 నుంచి అమలుకు సర్కారు నిర్ణయం ప్రజలకు సత్వర సేవలే లక్ష్యం రోజుకు 48 స్లాట్లు.. నూతన విధానం ద్వారా రోజుకు ఒక్కో సబ్రిజి స్ట్రార్కు 48 స్లాట్లుగా నిర్ణయించారు. ఉదయం 24, మధ్యాహ్నం 24 డాక్యుమెంట్ల చేసేలా వా టిని విభజించారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా registration. telangana. gov. in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయానికి రావా ల్సి ఉంటుంది. తద్వారా వేచి చూడాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత సమయంలో ప్రక్రియ పూ ర్తి చేసుకునే అవకాశముంటుంది. ఆలస్యమైతే మాత్రం మరుసటి రోజు స్లాట్ బుక్ చేసుకోవా ల్సి ఉంటుంది. ఏదైనా అత్యవసర సమయంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత ఐదు అదనపు రిజిస్ట్రేషన్లను స్లాట్తో సంబంధం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అవకాఽశం కల్పించింది. ఇంకా ఆదేశాలు రాలేదు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్లాట్ బుకింగ్ విధానంతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2నుంచి అమలు చేయాలని భావిస్తోంది. అయితే అధికారికంగా ఇంకా మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్కాంత్రావు, జాయింట్–1 సబ్రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
నైరుతి ఆగమనానికి ముందే రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమయ్యారు. తొలకరి పలకరించక ముందే దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన ముందస్తు వర్షాల నేపథ్యంలో ఆదిలా బాద్ రూరల్ మండలం తంతోలి గ్రామంలో రైతులు ఇలా పంట చేనును సిద్ధం చేస్తున్నారు. మంచి రోజు చూసి వి
నాట్య మయూరాలు శాసీ్త్రయ నృత్యంలో రాణిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు బాలకేంద్రం చిన్నారులు. కూచిపూడిలో గిన్నిస్రికార్డులో స్థానం దక్కించుకున్నారు. సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025ప్రశాంతంగా జీపీవో రాత పరీక్ష●కై లాస్నగర్: గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామకం కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప ట్టణ శివారులోని నలంద డిగ్రీ కళాశాలలో ని ర్వహించిన పరీక్షకు 83 మంది హాజరుకా వాల్సి ఉండగా 73 మంది హాజరయ్యారు. ప ది మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులను క్షు ణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అ నుమతించారు. కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ‘డీసెట్’కు 12 మంది గైర్హాజరుకై లాస్నగర్: డీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన డీ సెట్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ శివా రులోని నలంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చే సిన కేంద్రంలో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించినసెషన్లో 101 మందికి గాను 95 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 5గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 100మందికి గాను 94 మంది హాజరయ్యారు. మొత్తం 12 మంది గైర్హాజ రైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్అర్బన్: ముందస్తు వర్షాలు.. నైరుతి ఆగమన కబురు నేపథ్యంలో జిల్లాలోని రైతులు వానా కాలం సాగుకు సన్నద్ధమయ్యారు. పత్తితో పాటు ఇతర పంటల విత్తనాల కొనుగోలుకు మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి విత్తనాల ఎంపిక విషయంలో ఆచీ తూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది రైతులు కొనుగోలు చేయగా, శుభఘడియలు రాగా నే కొనేందుకు మిగతా వారు సిద్ధమవుతున్నారు. అందుబాటులో సరిపడా విత్తనాలు.. వానాకాలం సీజన్కు సంబంధించి వ్యవసాయశాఖ అన్ని రకాల విత్తనాలు సిద్ధం చేసింది. జిల్లాకు సరఫరా అయిన విత్తనాలను ఆయా మండలాలు, గ్రా మాల వారీగా రైతులకు అందుబాటులో ఉంచింది. జిల్లాలో పత్తి సాగు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆ విత్తనాలపై ఎక్కువ ఫోకస్ పెంచింది. మరో వారం రోజుల్లో వానాకాలం పనులు ఊపందుకోనున్న తరుణంలో విత్తనపరంగా ఎలాంటి లోటు రానియ్యకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆయా లైసెన్స్డ్ దుకాణాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి రైతులకు మాత్రమే విక్రయించేలా దృష్టి సారించింది. అందుబాటులో 13.15 లక్షల ప్యాకెట్లు జిల్లాలోని రైతులకు ఈసారి పత్తి విత్తన సమస్య తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గతంలో విత్తనాలు దొరక్క దుకా ణాల ఎదుట భారీ క్యూలైన్లు, షాపుల ముందు రైతుల పడిగాపులు, నకిలీ విత్తనాల సరఫరా, ప్రైవేట్ వ్యాపారుల మాయాజాలం వంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తమైంది. ఈ సారి ముందుగానే సరిపడా మించి విత్తనాలు అందుబాటులో ఉంచింది. జిల్లాలోని 297 దుకాణాల్లో 13.15 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఇందులో అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్లో అత్యల్పంగా మావల మండలంలో ఉన్నాయి.విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు (ఫైల్) న్యూస్రీల్మండలాల వారీగా అందుబాటులో ఉన్న పత్తి విత్తనాల ప్యాకెట్లు.. మండలం దుకాణాలు ప్యాకెట్లు ఆదిలాబాద్రూరల్ 04 1487 ఆదిలాబాద్అర్బన్ 69 631945 బజార్హత్నూర్ 07 8320 బేల 31 182887 భీంపూర్ 09 11499 భోరజ్ 03 559 బోథ్ 17 70211 ఇచ్చోడ 24 121605 గాదిగూడ 06 18735 గుడిహత్నూర్ 11 15302 ఇంద్రవెల్లి 21 64834 జైనథ్ 10 4521 మావల 01 325 నార్నూర్ 11 27850 నేరడిగొండ 13 49173 సాత్నాల 03 3017 సిరికొండ 04 11928 సొనాల 06 10549 తలమడుగు 16 29455 తాంసి 14 22209 ఉట్నూర్ 16 29340అందుబాటులో ఉంచాం.. రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాం. డిమాండ్ మేరకు అన్ని రకాల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే పూర్తిస్థాయిలో వర్షాలు కురిశాకే విత్తుకోవడం మేలు. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి -
ఎస్హెచ్జీలకు అదనపు ఉపాధి
● స్కూల్ యూనిఫాం కుట్టు బాధ్యత వారికే ● పట్టణంలో 256 మంది సభ్యుల ఎంపిక ● జూన్ 2లోగా దుస్తులు అందించేలా ఆదేశం కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మహిళాశక్తి పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే గతేడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన యూనిఫాం కుట్టించే బాధ్యత కూడా వారికే అప్పగిస్తోంది. తద్వారా అదనపు ఉపాధి సమకూరుతుంది. గతేడాది నుంచి కుట్టు బాధ్యతలు.. సర్కారు బడి విద్యార్థులకు అవసరమైన యూనిఫాంను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీటిని కుట్టించే బాధ్యతలను రాష్ట్రస్థాయిలోని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేవారు. ఆ దుస్తులు కొలతలకు అనుగుణంగా లేకపోవడంతో విద్యార్థులకు అసౌకర్యంగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక దీనిని గుర్తించింది. స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్కూల్ యూనిఫాం కుట్టే బాధ్యతలను గతేడాది నుంచే వారికే అప్పగించింది. దుస్తులు కుట్టేందుకు అవసరమైన బట్టను ప్రభుత్వమే అందజేస్తోంది. విద్యా సంవత్సరం ముగింపులో పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు సేకరించిన ఎస్హెచ్జీ సభ్యులు బట్ట అందిన కొద్దీ దుస్తులు కుడుతన్నారు. ఒక్కో జతకు వారికి రూ.75 చొప్పున ప్రభుత్వం కూలీ చెల్లిస్తోంది. స్వయం ఉపాధి రుణాల సద్వినియోగంతో వివిధ వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు దీని ద్వారా అదనపు ఉపాధి లభిస్తోంది. 68 పాఠశాలలు..10వేల విద్యార్థులు ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 68 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 10,786 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 4813 మంది, బాలికలు 5973 మంది ఉన్నారు. వీరందరికీ ఏడాదికి గాను ప్రభుత్వం రెండు జతల యూనిఫాం అందజేస్తోంది. వీటిని కుట్టించేందుకు గాను పట్టణంలోని 68 స్లమ్ లెవల్ ఫెడరేషన్లను ఎంపిక చేశారు. 258 మంది ఎస్హెచ్జీ సభ్యులను గుర్తించి వారికి కుట్టు బాధ్యతలు అప్పగించారు. కొంతమంది తమ టైలరింగ్ దుకాణాల్లో దుస్తులు కుడుతుండగా మరికొంతమంది తమ ఇళ్ల వద్దే స్టిచింగ్ చేస్తున్నారు. బడులు తెరిచే నాటికి ప్రతీ విద్యార్థికి యూనిఫాం అందించాలని జిల్లా అధికారులు సంకల్పించారు. జూన్ 2 నాటికి కనీసం ఒక జతను అందించేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా సభ్యులు తమ పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పర్యవేక్షించేందుకు గాను మెప్మా పరిధిలోని ఐదుగురు సీవోలకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రయోజనకరం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన యూనిఫాం కుట్టించే బాధ్యతను ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం ఎంతో హర్షనీయం. అవసరమైన బట్టను ప్రభుత్వమే మాకు సరఫరా చేసింది. దీంతో ఇంటి వద్దే దుస్తులను కుడుతున్నా. ప్రభుత్వ నిర్ణయంతో మాకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. – రాణి, ఎస్హెచ్జీ సభ్యురాలు, హౌసింగ్బోర్డు ఆర్థికంగా ముందుకు సాగుతున్నాం.. ప్రభుత్వం నుంచి బ్యాంకు లింకేజీతో పాటు సీ్త్ర నిధి రుణాలు పొందుతున్నాం. వాటి ద్వారా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు సాగుతున్నాం. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం కుట్టించే బాధ్యతను ప్రభుత్వం మాకు అప్పగించడంతో అదనపు ఉపాధి లభించింది. అయితే ప్రస్తుతం ఒక్కో జతకు రూ.75మాత్రమే చెల్లిస్తోంది. మార్కెట్ ధరకనుగుణంగా కూలీ రేటు పెంచితే బాగుంటుంది. – షభానా, ఎస్హెచ్జీ సభ్యురాలు, కేఆర్కే కాలనీ -
సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మృతి
మందమర్రిరూరల్/పాతమంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణా నికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ (69) అ నారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో ఆదివారం ఉదయం మృతిచెందారు. నెల రోజు లుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని మంచిర్యాలలోని నివాసానికి తీసుకువ చ్చారు. మధ్యాహ్నం వరకు సందర్శనార్థం అక్కడే ఉంచారు. పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం పార్థివదేహాన్ని సాయంత్రం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్ మీదుగా ఈద్గాకు తరలించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ కోదండరామ్, యూనియన్ నేతలు, స్నేహితులు, తోటి పాత్రికేయులు, రాజకీ యనాయకులు, అభిమానులు నివాళులర్పించారు. ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్గా ప్రస్థానం మునీర్ ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్గా జిల్లాలో చెరగని ముద్రవేశారు. విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్లో పనిచేసి, సీపీఐలో చురుకైన నాయకుడిగా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. 1981లో సింగరేణిలో కార్మికుడిగా చేరి, భూస్వాముల అరాచకాలపై పో రాటాలు చేశారు. 1982లో హత్య కేసులో నిందితుడిగా శిక్ష పొందినా, హైకోర్టు కేసును కొట్టివేసింది. ఇక జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో 40 ఏళ్ల్లు పనిచేశా రు. 2008లో సింగరేణి గోల్డెన్ హ్యాండ్షేక్ పథకం ద్వారా ఉద్యోగ విరమణ పొంది, జర్నలిజంలో కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్గా సమ్మెను విజయవంతం చేశారు. పలువురి నివాళి మునీర్ మృతికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, కోనేరు కోనప్ప, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు. మునీర్కు భార్య రిజ్వానా, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
ప్రాణ రక్షకులు
● ప్రమాద స్థలాలకు క్షణాల్లో చేరుతున్న పైలెట్లు ● క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. ● వైద్య చికిత్సతో నిలబెడుతున్న ప్రాణాలు ● నేడు జాతీయ పైలెట్ దినోత్సవంచెన్నూర్: 108 అంబులెన్స్ పైలట్లు ప్రాణరక్షకులని.. ప్రమాదం జరిగిందని సమాచారం వస్తే చాలు క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. సకాలంలో వైద్య చికిత్స అందించడంతో వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. పైలట్ల సేవలను పలువురు కొనియాడుతున్నారు. సోమవారం జాతీయ అంబులెన్స్ పైలెట్ దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 అంబులెన్స్లు పని చేస్తున్నాయి. 176 మంది పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారు. అంబులెన్స్లు ఆయా మండలాల పరిధిలో జరిగే రోడ్డు, ఇతర ప్రమాదాలు జరిగిన సమయంలో సంఘటన స్థలాలకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పైలెట్లు ప్రమాద స్థలాలకు చేరుకునేందుకు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. జిల్లా అంబులెన్సులు పైలెట్ మంచిర్యాల 18 45 అదిలాబాద్ 25 60 నిర్మల్ 15 36 కుమురం భీం 15 35 -
మరోసారి సత్తా చాటుతా..
ఇటీవల పదో తరగతి పూ ర్తయింది. మంచిర్యాలలో ని ఖేలో ఇండియా ద్వారా బాక్సింగ్లో రెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాను. ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రెండుసార్లు పాల్గొని సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించాను. సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ పతకం సాధించగా, ఓపెన్ స్టేట్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో మూడోస్థానంలో నిలిచాను. జాతీయస్థాయిలో ఆడినా పతకం అందుకోలేకపోయాను. మంచిర్యాలలో నిర్వహిస్తున్న పోటీల్లో గోల్డ్ పతకం సాధిస్తాను. – క్రితి అగర్వాల్, మంచిర్యాల జాతీయస్థాయిలో రాణిస్తా ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఇటీవల టెన్త్ చదివాను. రాష్ట్రస్థాయిలో ఎస్జీఎఫ్లో రెండు గోల్డ్మెడల్స్ సాధించాను. బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీల్లో 46, 48 కేజీల విభాగంలో గోల్డ్మెడల్స్ సాధించాను. జాతీయస్థాయి పోటీల్లో నాలుగుసార్లు పాల్గొనగా ఒకసారి దేశంలోనే 8వ స్థానంలో నిలిచాను. జాతీయస్థాయిలో గోల్డ్మెడల్ సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నాను. – నిహారిక, నిజామాబాద్ గోల్డ్మెడల్ సాధిస్తా రాష్ట్రస్థాయిలో సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో, ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్మెడల్స్ సాధించాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గోవాకు ఎంపికయ్యాను. పదోతరగతి ఇటీవల పూర్తి చేయగా, 8వ తరగతి నుంచే బాక్సింగ్లో శిక్షణ పొందుతున్నా. జాతీయస్థాయిలో పాల్గొని గోల్డ్మెడల్ను సాధించాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్నాను. – జె.అనుగ్రహ, హైదరాబాద్ జాతీయస్థాయిలో ఆడేందుకు శిక్షణ ఇటీవల ఇంటర్ పూర్తయింది. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడి గోల్డ్మెడల్ సాధించాను. జాతీయస్థాయిలో ఒకసారి ఆడి, సెమీఫైనల్ చేరాను. ఫైనల్ చేరేలా శిక్షణ తీసుకుంటూనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నా. జాతీయస్థాయిలో రాణించేలా బాక్సింగ్లో శిక్షణ పొందుతున్నా. – సంస్కృతి, మంచిర్యాల -
● నృత్యంలో రాణిస్తున్న చిన్నారులు ● మహా బృంద నాట్యంలో పాల్గొని గిన్నిస్ రికార్డు ● బాలకేంద్రం చిన్నారుల ప్రతిభ
ఆదిలాబాద్: చిన్నారులు ఆయా వేదికల్లో శాసీ్త్రయ నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్నారు. అందులోనే రాణిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారు. వారే జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ గిన్నిస్ రికార్డులకెక్కిన చిన్నారులు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2023 డిసెంబర్ 24, 25వ తేదీల్లో కూచిపూడి కళా వైభవం–మహా బృందనాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 4,218 మంది నృత్యకారిణులు ఒకేసారి ప్రదర్శించి గిన్నిస్ రికార్డు సాధించారు. వారిలో బాల కేంద్రానికి చెందిన 26 మంది కూచిపూడి చిన్నారి నర్తకులు ఉండడం విశేషం. గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులు.. గడ్డం శ్రీనిధి, దువాస హర్షిని, పన్నాల లాస్య, ఠాకూర్ హర్షిని, అక్షర గీత, క్షీరసాగర్ జాహ్నవి, సన్నిధి దేశ్ముఖ్, కుర్ర భవిష్య, జాబు శ్రీ వర్ధిని, ఆర్. ఓజస్విని, నాలంవార్ మహాలక్ష్మి, గుండేటి అశ్విత, ఉపలంచివార్ అక్షిత, కొంకటీ ఇతీక్ష, పోలాజి ఉమారాణి, మోర శ్రేష్ట, సామ మహతి, చిలుక ఆమని, మామిడి అక్షయ, అవరగొండ సంజన, యానాకి నక్షత్ర, మచ్చ సాత్విక, కటకం భావనశైని, కొండ్ర అలేఖ్య, కానిందే మహాశ్రీ, రామోజీ రచన. గిన్నిస్ రికార్డు సాధించిన బాలకేంద్రం చిన్నారులతో కలెక్టర్ రాజర్షి షా నాట్యశిఖామణి ‘ఆమని’ కై లాస్నగర్ కాలనీకి చెందిన చిలుక వెంకటస్వామి–అన్నపూర్ణ దంపతుల కుమార్తె ఆమని 2021 నుంచి బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు చేస్తూ ఎన్నో వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చింది. అద్భుత కళా నైపుణ్యంతో అన్నమయ్య పురస్కారాన్ని సాధించింది. ఇప్పటివరకు 10 రికార్డులు సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఈవెంట్లో పాల్గొని ధ్రువపత్రాన్ని అందుకుంది. -
శత జన్మదిన సందడి
● వాగ్దారిలో ఓ వృద్ధుడి వందో పుట్టినరోజు వేడుక నేరడిగొండ: మండలంలోని వాగ్దారి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడి శత జన్మదిన సంబురం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మధ్య ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన బదావత్ కిర్యానాయక్ 1925 మే 24న జన్మించాడు. శనివారంతో వందేళ్లు పూర్తికాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిర్యానాయక్ కేక్ కట్ చేశారు. తన ఆరోగ్యానికి జీవనశైలే కారణమని పేర్కొన్నాడు. కార్యక్రమంలో ఐదు తరాల వారసులు పాల్గొని సందడి చేశారు. -
రాణిస్తున్న ‘జాహ్నవి’
జిల్లా కేంద్రంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కె.జాహ్నవి ఏడో తరగతి చదువుతోంది. 2022 నుంచి బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ రాణిస్తోంది. చిన్ననాటి నుంచే నృత్యంపై ఆసక్తితో శిక్షణలో చేర్పించినట్లు తల్లిదండ్రులు సంజుతాయి– రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఆరు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా 7 రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో ప్రదర్శనలు ఇచ్చింది. మహారాష్ట్ర వార్ధాలో జరిగిన నృత్య పోటీల్లో పాల్గొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. కళాశక్తి పురస్కారంతోపాటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో పాల్గొని ధ్రువపత్రం అందుకుంది. -
పంచ్ అదుర్స్!
● మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ● 260 మంది క్రీడాకారులు హాజరు.. ● హోరాహోరీగా తలపడుతున్న బాక్సర్లుమంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు వేదికగా నిలిచింది. ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ (బాక్సింగ్ ఫెడరేషన్ అనుబంధం) పర్యవేక్షణలో ఈనెల 24న ప్రారంభమైన ఈ పోటీలు 26 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది బాక్సింగ్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. వయస్సు, బరువు ఆధారంగా విభజించిన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతూ శక్తివంతమైన పంచ్లతో ఆకట్టుకుంటున్నారు. టైసన్ బాక్సింగ్ క్లబ్ ఏర్పాట్లు పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున ప్రేక్షకులు తరలివస్తున్నారు. టైసన్ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించి, లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురి క్రీడాకారులను ‘సాక్షి’పలకరించగా తమ అనుభవాలు వెల్లడించారు. -
రికార్డుల ‘హర్షిణి’
జిల్లా కేంద్రంలోని ఠాకూర్ ప్రదీప్ సింగ్– అనూష దంపతుల కుమార్తె హర్షిణి కూచిపూడి నృత్యంలో అరుదైన రికార్డులను సాధిస్తుంది. 2022 నుంచి ఇప్పటివరకు 11 అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. 2022లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2023లో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫెంటాస్టిక్ అచీవ్మెంట్స్ అండ్ రికార్డ్స్, జేమ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా రికార్డ్స్ దక్కాయి. ఇప్పటివరకు 40కి పైగా జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి వేదికలపై అద్భుత ప్రదర్శనలు ఇచ్చింది. తల్లి ప్రోత్సాహంతో రాణిస్తున్నానని హర్షిణి తెలిపింది. -
ఇంద్రాదేవి ఆలయంలో విత్తన పూజలు
ఇంద్రవెల్లి: ఖరీఫ్సీజన్ నేపథ్యంలో ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీలు విత్తన పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విత్తన పూజలు చేశారు. అమ్మవారికి నవధాన్యాలతో నైవేద్యాలు సమర్పించారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు పుష్కలంగా కురవాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఆలయ మహారాజ్ చహకటి సూర్యరావ్, ఆయా గ్రామాల ఆదివాసీలు ఉన్నారు. 108లో ప్రసవంబెల్లంపల్లి: పురిటినొప్పులతో బాధపడుతున్న 8 నెలల గర్భిణికి 108 సిబ్బంది ఎంతో నేర్పుతో ఆదివారం ప్రసవం చేశారు. కుమురం భీం జిల్లాలోని భీమన్గూడ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన ఆత్రం పోసుబాయికి పురిటినొప్పులు వచ్చాయి. ఆశ కార్యకర్త సహాయంతో కుటుంబీకులు 108 అంబులెన్స్లో ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియాస్పత్రికి రెఫర్ చేయడంతో అక్కడికి తీసుకెళ్లారు. 8 నెలల గర్భిణి, రక్తం తక్కువగా ఉండటం, ఐదో కాన్పు కావడంతో అక్కడి వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. వెంటనే పోసుబాయిని మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సోమగూడెం శివారుప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. రోడ్డు పక్కన అంబులెన్స్ను నిలిపి ఈఆర్సీపీ వైద్యుడి సలహాతో ఈఎంటీ దుర్గం ఆత్మరావు, పైలెట్ అజయ్ ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. వారిని మంచిర్యాల మాతా శిశుకేంద్రానికి తరలించారు. బెల్లంపల్లి 108 అంబులెన్స్ ఈఎంటీ, పైలెట్ను కుటుంబీకులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. -
అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్కార్డు
కైలాస్నగర్: అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్కార్డు అందిస్తామని జిల్లా పౌరసరఫరా ల అధికారి మహ్మద్ వాజీద్ అలీ అన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అందిన దరఖాస్తులకు సంబంధించిన సర్వేను మావల మండల పరిధిలోని షాద్నగర్, కై లాస్నగర్ కాలనీల్లో రెవెన్యూ సిబ్బంది శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సర్వే తీరును పరి శీలించారు. పలువురు దరఖాస్తుదారుల కు టుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట నాయబ్ తహసీల్దార్ రాథోడ్ బాబుసింగ్, సీనియర్ అసిస్టెంట్ వినోద్రావు, రికార్డు అసిస్టెంట్ వెంకన్న తదితరులున్నారు. -
● జిల్లాలో మద్యం వ్యాపారుల తీరిది ● ధరల పెంపు ముందే పసిగట్టి భారీగా సరుకు కొనుగోలు ● నిల్వ లిక్కర్ ధర పెంచి విక్రయాలు ● మందుబాబుల జేబులకు చిల్లు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న ఎకై ్సజ్ శాఖ
సాక్షి,ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం గడిచిన సోమవారం రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెంచింది. అయితే గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఫుల్బాటి ల్పై రూ.40, హాఫ్పై రూ.20, క్వార్టర్ పై రూ.10 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే పాత స్టాక్పై కొత్త రేటును వైన్స్ య జమానులు వసూలు చేస్తున్నారు. నిల్వ ఉన్న స్టాక్ను అడ్డగోలుగా పెంచి మందుబాబుల జేబు లకు చిల్లు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని వైన్స్లలో ఇది బాహాటంగా సాగుతుంది. కొంత మంది బాటిళ్లపై ఉన్న ఎంఆర్పీ విషయంలో ప్రశ్నిస్తే.. ప్రభుత్వం పెంచినప్పటి నుంచి ఆ ధరలు అటోమెటిక్గా అమల్లోకి వచ్చాయని చెబుతున్నారు. కొన్నిచోట్ల మద్యంప్రియులు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. కొంత మంది పోనిలే అని అక్కడినుంచి వెళ్లిపోతున్నారు. ముందే సమాచారం లీక్.. స్టాక్ ఫుల్గా కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19 నుంచి మద్యం ధరలు పెంచేసింది. అయితే ఈ సమాచారం మద్యం వ్యాపారులకు ముందుగానే లీక్ అయినట్లు ప్ర చారం ఉంది. దీంతో వారు అన్నిరకాల లిక్కర్ బాటిళ్లకు సంబంధించి స్టాక్ ఫుల్గా కొనుగోలు చేసి వైన్స్లలో నిల్వ ఉంచారు. జిల్లా కేంద్రంలో ని ప్రతీ వైన్స్లలో ఇప్పుడు నెలకు పైగా సరిపడా సరుకు నిల్వ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాత లిక్కర్ బాటిళ్లను కొత్త ధరతో అమ్మడం ద్వారా మద్యం వ్యాపారులు దండిగా మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ప్రేక్షక పాత్రలో ఎకై ్సజ్శాఖ.. సాధారణంగా మద్యం ధరలు ప్రభుత్వం పెంచి న తర్వాత ఎకై ్సజ్ శాఖ అధికారులు పాత స్టాక్ వి షయంలో నిర్ణయాత్మక పాత్ర వహించాలి. ప్రధానంగా ప్రతీ వైన్స్లో ఎంత మేరకు పాత స్టాక్ ఉందనేది పరిశీలన చేయాలి. ఆ లిక్కర్ను పాత ధరలోనే విక్రయించాలి. ఇక కొత్త స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ ఎంఆర్పీకి అనుగుణంగా విక్రయాలు జరిగేలా చూడాలి. అయితే వైన్స్లలో పాత స్టాక్ను బాహాటంగా కొత్త ధరలతో అమ్ముతున్నప్పటికీ ఆశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. మాకెలాంటి ఫిర్యాదు రాలేదు వైన్స్లలో పాత స్టాక్ను కొత్త ధరలతో అమ్ముతున్నారనే విషయంపై మాకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయంలో తనిఖీలు చేయాలని కూడా ఆదేశాలు రాలేదు. అయినప్పటికీ ఈ విషయంలో పరిశీలన చేస్తాం. – హిమశ్రీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి -
అటవీ అనుమతుల కు ప్రత్యేక చర్యలు
● వీసీలో రాష్ట్ర మంత్రులు సీతక్క, సురేఖ కైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచా యతీ రాజ్, ఆర్అండ్బీ, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనుల్లో అటవీశాఖ అనుమతులకు ఏర్పడిన ఇబ్బందులు పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఐటీడీఏ అధి కారులతో శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ అనుమతులు రాకపోవడంతో అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం అవుతుందని ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను త్వరలోనే పరిష్కరించి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని వారు భరోసానిచ్చారు. ఆయా శాఖలు సమన్వయంతో పనుల వేగాన్ని పెంచాలని సూచించారు. కాగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా ఈ వీసీలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లి రోడ్డు, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ నుంచి సిరికొండ మండలం వాయిపేట్ రోడ్డుకు సంబంధించిన అనుమతులు పెండింగ్లో ఉన్నట్లుగా మంత్రులకు వివరించారు. -
చదువుతోనే గిరిజనుల అభివృద్ధి
● ఎస్పీ అఖిల్ మహాజన్నార్నూర్: చదువుతోనే గిరి గ్రామాల అభివృద్ధి సా ధ్యపడుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. గాదిగూడ మండలంలోని కుండి, షేకుగూడ, పిప్రి (జి), పూనగూడ గ్రామాల్లో పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడా రు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నతంగా చది వించాలని సూచించారు. త్వరలోనే గాదిగూడలో అ గ్నివీర్కు సంబంధించి ప్రత్యేక శిక్షణ శిబిరం ప్రారంభిస్తామని తెలిపారు. యువత సన్మార్గంలో పయనించాలని సూచించారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా సంక్షేమ పథకాలను రద్దు చేస్తామన్నారు. ప్రతీ గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ను కేటాయించామన్నారు. ఎలాంటి సమస్యలున్నా డయల్ 100 లేదా విలేజ్ పోలీస్ ఆఫీసర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. అనంతరం నాలుగు గ్రామాల్లోని యువతకు క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ కిట్లను అందజేశారు. క్రీడారంగంలో రాణించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో నార్నూర్ సీఐ రహీంపాషా, గాదిగూడ ఎస్సై జీవన్రెడ్డి, ఆదివాసీ నాయకుడు మెస్రం శేఖర్, మాజీ వైస్ ఎంపీపీ యోగేష్, గ్రామ పటేళ్లు లక్ష్మణ్, పైకు, జంగు, రమేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
భోరజ్ మండలంలో వచ్చిన దరఖాస్తులు వివరాలిలా..
● పైలట్ మండలంలో భారీగా దరఖాస్తులు ● ప్రారంభమైన క్షేత్రస్థాయి విచారణ ● ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు కై లాస్నగర్: ధరణిలో ఆప్షన్లు లేని కారణంగా పేరుకుపోయిన భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం–2025ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. చట్టం అమల్లో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని పైల ట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది. అక్కడి భూసమస్యలు తెలుసుకునేందుకు గాను ఈనెల 5నుంచి 16వరకు గ్రామాల వారీగా రెవె న్యూ సదస్సులు నిర్వహించింది. ముగ్గురు తహసీల్దార్ల ఆధ్వర్యంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోజుకు మూడు గ్రామాల చొప్పున సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే భారీగా దరఖాస్తులు అందాయి. జూన్ 2 నుంచి చట్టం పూర్తి స్థాయిలో అమలు కాను న్న నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అందిన ప్రతీ దరఖాస్తు పరిష్కరించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. సమస్యలు ఏ మేరకు పరిష్కరించి అన్నదాతకు భరోసా కల్పిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1,067 దరఖాస్తులు .. భోరజ్మండలంలో 28 రెవెన్యూ గ్రామాలున్నాయి. భోరజ్,భీంపూర్,బేల తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఎని మిది మంది రెవెన్యూ ఉద్యోగులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సదస్సులు నిర్వహించారు. అందులో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ఆయా భూసమస్యలకు సంబంధించి మొత్తం 1067 దరఖాస్తులు అందాయి. ఇందులో అ త్యధికంగా సర్వేనంబర్లలో తప్పిదాలు,పట్టాదారు పాస్ పుస్తకంలో భూమి మిస్సింగ్, సరిహద్దుల వివాదం, పేర్ల మార్పిడి, డిజిటల్ సిగ్నిచర్ పెండింగ్, భూ విస్తీర్ణంలో తేడాలు, విరాసత్ వంటివి ఉన్నా యి. వీటన్నింటిని గ్రామం, రైతుల వారీగా కంప్యూటరీకరించిన రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభమైన క్షేత్రస్థాయి విచారణ సదస్సుల్లో అందిన దరఖాస్తులను జూన్ 2లోగా పరిష్కరించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం భీంపూర్, భోరజ్, బేల, తలమడుగు, బజార్హత్నూర్, ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఆరు త్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నేతృత్వంలోని ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, మండల సర్వేయర్లతో కూడిన ఈ బృందాలు తమకు కేటాయించిన గ్రామాల్లో క్షేత్రస్థాయి పరి శీలన చేస్తున్నాయి. మ్యాప్లు, పాత భూరికార్డులతో గ్రామాలకు వెళుతున్న అధికారులు తమకు అందిన దరఖాస్తులను ప్రత్యక్షంగా విచారిస్తున్నారు. అయితే ఇందులో ఏ మేరకు సమస్యలు పరిష్కారమవుతాయి అనేది త్వరలోనే తేలనుంది. రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు పరిశీలిస్తున్న కలెక్టర్ రాజర్షి షా (ఫైల్) సర్వే నంబర్ మిస్సింగ్ 26 పెండింగ్ మ్యూటేషన్ 18 డిజిటల్ సైన్ పెండింగ్ 31 ఎక్స్టెన్షన్ కరెక్షన్స్ 106 ల్యాండ్ నేచర్ కరెక్షన్స్ 10 పట్టాదారు డిటేల్స్ కరెక్షన్స్ 110 నిషేధిత జాబితా నుంచి తొలగింపు 12 నిషేధిత భూమిలో చేర్చడం 08 అసైన్డ్ ల్యాండ్ 59 ఓఆర్సీ నాట్ ఇష్యూడ్ 05 38ఈ సర్టిఫికెట్ జారీ కానివి 01 సక్సేషన్ 131 ల్యాండ్ ఎక్విషన్ 01 ఇతర సమస్యలు 544భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన భోరజ్ మండలంలో వివిధ భూ సమస్యలకు సంబంధించి 1067 దరఖాస్తులు అందాయి. వాటిని పరిష్కరించేందు కోసం సీనియర్ తహసీల్దార్లు , రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారు ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తులపై ప్రత్యక్షంగా విచారణ చేస్తున్నారు. వివరాలు సేకరించి జూన్ 2లోగా వాటన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – బి.వినోద్కుమార్, ఆర్డీవో, ఆదిలాబాద్ -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
ఆదిలాబాద్అర్బన్: జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఇందులో భాగంగానే నిర్వహించనున్న సమ్మెను విజయవంతం చేయాలన్నారు. ఇందులో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, నాయకులు మంతెన కాంతారావు, మెరుగు చిరంజీవి, సురేశ్, అశోక్, లక్ష్మి, శాంత, ముజీబ్, ఖాసిం, సలీం, జమీల్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ పేరిట ఓ మొక్క..
కైలాస్నగర్: పట్టణప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ‘అమృత్ మిత్ర’ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమానికి (ఉమెన్ ఫర్ ట్రీస్) శ్రీకారం చుట్టింది. అమ్మ పేరిట ఒక మొ క్క నాటండి (ఏక్ పేడ్ మాకా నామ్ పే)నినాదంతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా ఆది లాబాద్ మున్సిపల్ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో రెండు స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేశా రు. మూడు స్థలాలను పరిశీలించారు. జూన్ 5 నుంచి ఆయా ప్రాంతాల్లో మొక్కలునాటనున్నారు. చెరువు పరిసరాల్లో పచ్చదనం ఉట్టిపడేలా... పచ్చదనం క్రమేణ కనుమరుగవుతుండటంతో పట్ట ణ ప్రాంతాల్లో ఎండతీవ్రత అధికమవుతుంది. ము ఖ్యంగా వేసవిలో వీచే వడగాలులతో జనం తీవ్ర ఇ బ్బందులు పడాల్సిన పరిస్థితి. సమస్యను గుర్తించి న కేంద్రం పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటాలని సంకల్పించింది. అమృత్మిత్రలో భాగంగా మున్సి పల్ పరిధిలోని చెరువుల వద్ద విమెన్స్ ఫర్ ట్రీస్ కా ర్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందు కోసం పట్టణ పరిధిలోని రెండు స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేశారు. ఖానాపూర్ కాలనీకి చెందిన వినాయక, తిర్పెల్లికి చెందిన శారదామాత గ్రూపులకు సంబంధించి 20 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీరికి మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకోసం వారికి కొంత మొత్తం కూడా అందజేయనున్నారు. ఎంత నగదు చెల్లిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చెరువు కట్టల వద్ద భారీ వృక్షాలుగా ఎదిగే తబిబుయా, వేప, రాగి, కదంబ, మర్రి వంటి వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షించనున్నారు. చెరువుల రక్షణతో పాటు హరితవనాలుగా వాటిని తీర్చిదిద్దనున్నారు. స్థలాల ఎంపిక పూర్తి... ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువును మొక్కలు నాటేందుకు ఎంపిక చేశారు. 70ఎకరాల్లో ఈ చెరు వు విస్తరించి ఉంది. దానిచుట్టూ మొక్కలు నాటేందుకు వీలుగా ఎంపిక చేసిన సంఘాల సభ్యులతో కలిసి స్థలాలను మెప్మా డీఎంసీ శ్రీనివాస్ ఇటీవల పరిశీలించారు. తిర్పెల్లి, బ్రాహ్మణ్వాడ, ఖానా పూర్ ప్రాంతాల్లోని బతుకమ్మ ఘాట్లను పరిశీలించి వాటి ని ఎంపికచేశారు. ఈచెరువు చుట్టురా నాలుగు కిలో మీటర్ల మేర 800మొక్కలు నాటాలని నిర్ణయించా రు. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే వన మహోత్సవ కా ర్యక్రమంలో భాగంగా జూన్ 5న ఈ మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆగస్టు 31వరకు గడువు విధించారు. నాటిన ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్ చేయనున్నారు. సంరక్షణ తీరును నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆన్లైన్ కాల్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మొక్కలు నాటిన నుంచి వృక్షాలు గా ఎదిగేలా సంరక్షించాల్సిన బాధ్యత ఎంపిక చేసిన సంఘ సభ్యులపైనే ఉంటుంది. ‘ఉమెన్ ఫర్ ట్రీస్’కు శ్రీకారం పచ్చదనం పెంపులో మహిళల భాగస్వామ్యం ఎస్హెచ్జీలకు మొక్కలు నాటే బాధ్యతలు ఆదిలాబాద్ మున్సిపల్లో రెండు సంఘాలు ఎంపిక స్థలాలను గుర్తించాంఅమృత్ మిత్ర 2.0లో భాగంగా ఎస్హెచ్జీ సభ్యుల ద్వారా మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఖానాపూర్ చెరువు పరిధిలో ప్రాంతాలను గుర్తించడంతో పాటు మొక్కలు నాటే రెండు సంఘాల సభ్యులను ఎంపిక చేశాం. వారికి నీలంరంగు చీరలు, టోపి, పెన్ను, హ్యాండ్బ్యాగ్, నోట్బుక్, వాటర్ బాటిల్తో కూడిన కిట్ అందజేస్తాం. లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఆయా సభ్యులతో స్థలాలను పరిశీలించాం. – శ్రీనివాస్, మెప్మా డీఎంసీ, ఆదిలాబాద్ -
‘మావో’ళ్లు ఎట్లున్నరో..!
కుటుంబాల్లో ఆందోళన.. దండకారణ్యం, అబూజ్మడ్ వంటి ప్రాంతా ల్లో ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన నాయకుల ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి బలమైన ఉద్యమం ఇప్పుడు దాదాపు అంతరించిన స్థితిలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణ, ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, జిల్లాలో గతంలో ఉన్న సానుభూతి, కార్యకలాపాలు గణనీయంగా తగ్గడం, భవిష్యత్తులో ఈ ఉద్యమం పూర్తిగా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు వామపక్షవాద ఉద్యమానికి బలమై న కేంద్రంగా ఉండేది. ప్రతీ గ్రామం నక్సలైట్లకు ఆ శ్రయంగా మారిన రోజులు గతంలో ఉండేవి. అయి తే, ఇప్పుడు ఈ జిల్లా మావోయిస్టు ప్రభావ రహిత ప్రాంతంగా మారింది. కేంద్రప్రభుత్వం 2026 నాటి కి మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు ’ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ పరిస్థితిలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు ఇంకా సిద్ధాంతంతో పోరు బాటలోనే నడుస్తున్నారు. వారి ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉనికి కోల్పోతున్న ఉద్యమం ఉమ్మడి ఆదిలాబాద్లో దశాబ్దాలపాటు మావోయి స్టు ఉద్యమం బలంగా సాగింది. ప్రస్తుతం దాని ఉ నికి దాదాపు క్షీణించింది. వందలాది మంది కార్యకర్తలు ఎన్కౌంటర్లలో మరణించడం లేదా లొంగిపోవడం జరిగింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట కం సుదర్శన్(ఆనంద్, 69) 2024 జూన్లోమరణించారు. సీనియర్ నాయకులైన ఒగ్గు సత్వా జీ, కాసర్ల రవి(అశోక్),కంతి లింగవ్వ, గడ్డం మధూకర్, సుమ న్, రవిబాబు వంటి వారిని పార్టీ కోల్పోయింది. మూల దేవేందర్రెడ్డి అరెస్టయ్యారు. 2020లోకాగజ్ నగర్ మండలం కడంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్క మరణించారు. మావోయిస్టు రహిత జిల్లాగా.. కేంద్ర హోంశాఖ ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే ఈ జాబితాలో కొనసాగుతోంది. గతంలో నిర్మల్ నుంచి బెజ్జూరు వరకు, బొగ్గు గనులు, అడవులు, గిరిజన ప్రాంతా ల్లో మావోయిస్టు కార్యకలాపాలు సాగేవి. పీపుల్స్వార్ గ్రూప్ ద్వారా సింగరేణిలో సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య) బలంగా పనిచేసిన రోజుల్లో ఎన్కౌంటర్లు తరచూ జరిగేవి. గ్రామీణ, పట్టణప్రాంతా ల్లో సానుభూతిపరుల బలంతో ఉద్యమం విస్తరించింది. కొత్త నియామకాలతో విద్యావంతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, గత రెండు దశాబ్దాలలో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఏర్పాటు తర్వా త పార్టీ ఉనికి దాదాపు క్షీణించింది. ఇప్పుడు అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మినహా ఎలాంటి కార్యకలాపాలు కనిపించడం లేదు. ఉద్యమంలో ఉమ్మడి జిల్లావాసులు దశాబ్దాలుగా అడవుల్లోనే.. వైభవం నుంచి ఉనికి కోల్పోతున్న దశకు.. ‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో సర్వత్రా చర్చఇప్పటికీ కీలకస్థానాల్లో కొందరు.. ఇదిలా ఉంటే..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఇప్పటికీ మావోయి స్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇర్రి మోహన్రెడ్డి: సెంట్రల్ బ్యూరో, కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు. బండి ప్రకాశ్: సింగరేణి కోల్బెల్ట్ కమిటీ సెక్రెటరీ, ఇటీవల కేంద్ర కమిటీలో చేరారు. మైలారపు అడెల్లు: స్టేట్ కమిటీ సభ్యుడు, కుమురం భీం, మంచిర్యాల కమిటీ ఇన్చార్జి. సలాకుల సరోజ: సీనియర్ నాయకురాలు, పార్టీ ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతలు. జాడి వెంకటి, పుష్పలత: సీనియర్ నాయకులు, దండకారణ్యంలో బాధ్యతలు. చౌదరి అంకుబాయి, లచ్చన్న, తూము శ్రీనివాస్: సీనియర్ కేడర్గా కొనసాగుతున్నారు. -
● ఆర్టీసీ సేవలందని గ్రామాలెన్నో.. ● మండల కేంద్రాలకూ కరువు ● రహదారి, ఆదాయం ఉన్నా పట్టించుకోని వైనం
ఆదిలాబాద్: గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపడంలో ఆర్టీసీ నిర్లిప్తత పల్లెవాసులకు శాపంగా మారుతోంది. ప్రైవేట్ వాహనాలతో జేబులకు చిల్లు పడుతోందని, అలాగే పరిమితికి మించి ప్రయాణంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ‘గిరి’జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణాను తమకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా రహదారి సౌకర్యం ఉన్న గ్రామాలకు అవసరం మేరకు సర్వీసులు నడుపుతామని పేర్కొనడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. పలు మండలకేంద్రాలకు సైతం.. రహదారి సరిగా ఉండడంతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే బస్సులు నడుపుతామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ని సిరికొండ మండల కేంద్రం ఏర్పడి ఏళ్లు గడుస్తు న్నా ఇప్పటికీ బస్సు సౌకర్యం లేకపోవడం గమనా ర్హం. అలాగే తాంసి మండల కేంద్రానికి ఒకే ఒక్క ట్రిప్పు నడుపుతున్నారు. ట్రిప్పుల సంఖ్య పెంచా లని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేద ని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా తాంసిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మండలంతో పాటు భీంపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో వీరంతా ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. తాంసి–భీంపూర్ నడుమ కప్పర్ల మీదుగా బీటీ రోడ్డు ఉన్నా దశాబ్దాలుగా ప్రజా రవాణాకు నోచుకోవడం లేదని పేర్కొంటున్నారు. ప్రైవేటులో ప్రమాదకర ప్రయాణం.. ఆర్టీసీ బస్సు అందుబాటులో లేకపోవడంతో గ్రామీ ణులకు ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. అ యితే పరిమితికి మించి తరలిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అలా గే వాహనదారులు అడిగినంత ఇచ్చుకోవాల్సి వ స్తోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ అందిస్తున్న మహాలక్ష్మి పథకానికి సైతం నోచుకోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి
ఆదిలాబాద్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పో టీల్లో రాణించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నూ ప్రతిభ కనబరచాలని డీవైఎస్వో వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి సబ్ జూని యర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారన్నారు. అండర్ –8, 10, 12 విభాగంలో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించి ఎంపికై న వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతున్నట్లు వివరించారు. ఇందులో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రాజేశ్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ కాంతారావు, పెటా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్థసారథి, సాయికుమార్, రాకేష్, సౌమ్య, జ్యోతిస్వరన్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులు కల్పిస్తాం
● కలెక్టర్ రాజర్షి షా కైలాస్నగర్: ప్రత్యామ్నాయ స్థలంలో ఎలాంటి ఇ బ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. చిరువ్యాపారుల కోసం కేటాయించిన గణేశ్ థియేటర్ స్థలాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. పలు వురు వీధి వ్యాపారులతో మాట్లాడి సౌ కర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఇప్పటి వరకు విద్యుత్, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్. రాజు, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్రెడ్డి తదితరులున్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి మహిళలు ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చే సుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన టైలరింగ్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృత్తిపరమైన సాంకేతిక నైపుణ్యాలు అందిపుచ్చుకుని స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఇందులో డీ ఆర్డీవో రాథోడ్ రవీందర్, ఆయా సంస్థల ప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. రైతులను మోసం చేస్తే ఉపేక్షించం.. ఆదిలాబాద్అర్బన్: విత్తన వ్యాపారులెవరైనా రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని అఖిల్ ఫర్టిలైజర్స్, రైతుమిత్ర ట్రెడర్స్ను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ వానాకాలం కోసం సరిపడా పత్తి, సోయా తదితర విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర స్వామి తదితరులున్నారు.ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి ఆదిలాబాద్టౌన్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో 8 నుంచి 12 తరగతుల వి ద్యార్థులకు నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ పోస్టర్ను రణదీవెనగర్ జెడ్పీఎస్ఎస్లో శుక్రవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివా స్రెడ్డి, పాల్గొన్నారు. -
గిరి ప్రాంతాలపై వివక్ష తగదు..
గ్రామానికి బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాం. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలంటే చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఏ పనికై నా మేము జిల్లా కేంద్రానికే రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు, ఆస్పత్రికి రావాల్సి వస్తే మా ఇబ్బందులు వర్ణనాతీతం. గిరి ప్రాంతాలపై వివక్ష చూపడం తగదు. వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలి. – పి.రాము, ఖారగూడ, సాత్నాల ఎటువంటి విజ్ఞప్తులు లేవు..ప్రస్తుతానికై తే ఎలాంటి విజ్ఞప్తులు లేవు. ప్రయాణికుల సంఖ్య, విజ్ఞప్తుల ఆధారంగా ఆ ప్రాంతంలో సర్వే చేసి బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నేను చార్జ్ తీసుకొని కొద్ది రోజులే అవుతుంది. పరిశీలించి బస్సులను నడపడానికి కృషి చేస్తాం. – ప్రతిమారెడ్డి, ఆదిలాబాద్ డిపో మేనేజర్ -
వీహెచ్పీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
ఆదిలాబాద్: ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమం వెలకట్టలేనిదని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి ఆపరేషన్ సిందూర్ను కీర్తిస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించా రు. ఇందులో జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్దాస్, ఆరే దేవన్న, గడ్డం అశోక్, వామన్ రెడ్డి, బండారి వినోద్, శ్రీహరి, ఎల్వీ రావు, బండారి మనోహర్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● త్వరలో కాంగ్రెస్ కమిటీల ఎంపిక ● ఆధిపత్యం కోసం నేతల పాకులాట ● తమవారికే ఇవ్వాలంటూ పైరవీలు ● ఎంపిక ప్రక్రియ అబ్జర్వర్లకు సవాలే ● అధిష్టానం చెంతకు ఆశావహుల పేర్లు!
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ బూత్, గ్రామ, మండ ల, బ్లాక్ కమిటీల ఎంపికలో ముఖ్య నేతల మధ్య సమన్వయం కుదురుతుందా?.. సామాజిక న్యా యానికే ప్రాధాన్యత ఉంటుందా?.. లేదా కమిటీల కూర్పులో ముఖ్య నేతలు తమవారికే పదవులు దక్కేలా చక్రం తిప్పుతారా?.. అనే ప్రశ్నలు ప్రస్తు తం జిల్లా పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుకు ఈనెల 7న జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. టీపీసీసీ నుంచి పరిశీలకులుగా వచ్చిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందన్, టీపీసీసీ కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆ తర్వాత మండలాలవారీగా సమావేశాలు నిర్వహించారు. గురువా రం ఆదిలాబాద్ పట్టణ సమావేశాన్ని కూడా పూర్తి చేశారు. ఈ సమావేశాల్లో మండలాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో కమిటీకి మూడు నుంచి నాలుగు పేర్లు తీసుకున్నారు. వారి పేర్లను అధిష్టానానికి పంపనున్నారు. ఈనెల 28వ తేదీ లోపు ఈ కమిటీలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. పరిశీలకులకు సవాలే.. కమిటీల ఏర్పాటుకు సమావేశాలు పూర్తి చేసిన పరి శీలకులకు ఇప్పుడు అసలు సవాల్ మొదలైంది. ప్ర ధానంగా నియోజకవర్గాల్లో ముఖ్య నాయకుల మ ధ్య సమన్వయం సాధించడం ఒక ఎత్తైతే.. సామాజిక న్యాయం పాటించడం మరొక ఎత్తు. ఈ రెండింటిలో ఏ లోపం చోటుచేసుకున్నా పార్టీలో వివాదాలు, నాయకుల మ ధ్య విభేదాలు తప్పవు. ప్ర ధానంగా ఆదిలాబాద్ ని యోజకవర్గంలో ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి, బోథ్ నియోజకవర్గంలో ని యోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా పరిధిలో రెండేసి మండలాల చొప్పున ఉన్న ఖానా పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం సుగుణ, సీనియర్ నాయకుడు నరేశ్ జాదవ్, ఆసిఫాబాద్లో ముఖ్య నాయకుల మధ్య ఈ కమిటీల ఏర్పాటు విషయంలో విభేదాలున్నాయి. పరిశీలకుల ఎత్తుగడ ఎలా ఉంటుందో.. ఈ నేపథ్యంలో పరి శీలకుల ఎత్తుగడ ఎలా ఉంటుంది?.. నాయకుల మధ్య సమన్వయం సాధిస్తారా?.. సామాజిక న్యాయానికే పెద్దపీట వేస్తారా?.. సమతూకాన్ని ఎలా సాధిస్తారనే చర్చ పార్టీలో జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. పట్టు నిలుపుకోవాలని.. జిల్లా అధ్యక్ష స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు ముఖ్య నాయకులు ఈ కమిటీల ఏర్పాటులో ఎవరి వర్గానికి వారు పెద్దపీట వేసి పార్టీలో పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ముఖ్య నాయకుల నుంచి వారి అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ప్రధానంగా బోథ్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మల్లెపూల నర్సయ్య, గోక గణేశ్రెడ్డి తమ అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో అందరి మధ్య సమన్వయం సాధించేందుకు పరిశీలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు లేక నియోజకవర్గ ఇన్చార్జ్జీలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వారు సూచించిన పేర్లకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చివరికి మిగతా వారి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందో.. అనేది వేచి చూడాల్సిందే. సామాజిక న్యాయానికే పెద్దపీట ఈనెల 26, 27 తేదీల్లో రా ష్ట్ర కమిటీ ఏర్పాటు కానుండగా జిల్లా నాయకులకూ చోటు దక్కనుంది. సామాజిక న్యాయానికి పెద్దపీట ఉంటుంది. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆదేశాలు, జిల్లా ముఖ్య నాయకుల సూచనలు పరిగణనలోకి తీసుకుని కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. బూత్, గ్రామ, మండల, నియోజకవర్గానికి రెండు బ్లాక్ కాంగ్రెస్ కమిటీల చొప్పున ఎంపిక చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తి చేసి పార్టీని పూర్తిస్తాయిలో పటిష్టపరుస్తాం. – తాహెర్బిన్ హందన్, పార్టీ పరిశీలకుడు -
సాగుపై అవగాహన ఉండాలి
నార్నూర్: రైతులు పంటల సాగుపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం నాబార్డ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎన్ఆర్ భూ సంపదపై మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లులో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. జిన్నింగ్ మిల్లును పరిశీలించారు. నా బార్డ్, దాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ఆర్ఎన్ఆర్ భూసంపద కేంద్రం పనితీరు తె లుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాబార్డు, దాన్ ఫౌండేషన్ పనితీరు బాగుందని తెలిపారు. రైతు సభ్యుల సంఖ్య పెంచి మరింత మందికి న్యాయం చేయాలని సూచించారు. ఈ నెల 31 వరకు జొన్నలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కాగా, రైతుల కోరిక మేరకు మరో 10రోజులు పొడిగించేందుకు సా నుకూలంగా స్పందించారు. అనంతరం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీ లించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఏవో శ్రీధర్స్వామి, నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రవూఫ్, దాన్ ఫౌండేషన్ ప్రతినిధి నీలేశ్ రాథోడ్, మండల విద్యాధికారి పవార్ అనిత తదితరులున్నారు. -
‘ముందస్తు చర్యలు చేపట్టాం’
కైలాస్నగర్: జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లు, భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయ న పాల్గొని మాట్లాడారు. అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల వైపు ఎవరూ వెళ్లకుండా భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్లు సమకూర్చామని తెలిపారు. ఖరీఫ్నకు అవసరమైన విత్తనాలు, యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల ను తనిఖీ చేసి నకిలీ, నిషేధిత విత్తనాలు విక్రయించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వి వరించారు. జిల్లాలో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పా టు చేసి నకిలీ విత్తనాల అక్రమ రవాణా జరగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, డీఏవో శ్రీధర్స్వామి, సివిల్ సప్లయ్ డీఎం సుధారాణి, డీఎస్వో వాజీద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
ఆదిలాబాద్టౌన్: కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గు రువారం జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ డివిజన్ పరిధి లో మూడు పట్టణ పోలీస్స్టేషన్లు, మూడు సర్కి ల్ కార్యాలయాలు, మొత్తం 12 పోలీస్స్టేషన్లలో దాదాపు 300 కేసులు త్వరగా పూర్తి చేసి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఎంసీ రిపోర్టులను పీఎంఈ, ఎంవీఐ, ఫైర్ అధికారి కార్యాలయంలో పెండింగ్ రిపోర్టులు, అగ్రికల్చర్ కార్యాలయంలోని రిపోర్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. కోర్టు డ్యూటీ అధి కారులు జవాబుదారీతనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీ ఐలు సునీల్కుమార్, కరుణాకర్, ఫణీందర్, వెంకటేశ్వర్రావు, స్వామి, ఎస్సైలు పాల్గొన్నారు. -
‘కేంద్ర ప్రభుత్వ విధానం సరికాదు’
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీలు, మావోయిస్టులను హత్య చేసినట్లు గర్వంగా ప్రకటించుకున్న కేంద్ర ప్ర భుత్వ విధానం సరికాదని వామపక్ష ప్రజాసంఘా ల నాయకులు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ జా తీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పా టు పలువురిని ఎన్కౌంటర్ పేరిట హత్య చేశారని ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతోనే మోదీ సర్కార్ ఆపరేషన్ కగార్ పేరిట హత్యాకాండకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు గోడం గణేశ్, వెట్టి మనోజ్, సిర్ర దేవేందర్, వెంకటనారాయణ, జగన్సింగ్, గద్దల శంకర్, మడావి గణేశ్, గేడం కేశవ్, మెస్రం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్కు సన్మానం
కై లాస్నగర్: ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద శాలువా తో సత్కరించారు. జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రమేశ్, ప్రజ్ఞాకుమార్, మల్లన్న, బాలశంకర్ కృష్ణ, శశికాంత్, రాఘవేంద్ర, లలిత, కానిందేబాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభంఆదిలాబాద్టౌన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ దయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్టియర్, 2.30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. నిమిషం ని బంధన ఉండగా విద్యార్థులు నిర్ణీత సమయానికంటే ముందే కేంద్రాలకు చేరుకున్నారు. ఫస్టియర్లో 1,823మందికి 1,716 మంది హాజరు కాగా 107 మంది గైర్హాజరయ్యారు. సెకండియర్లో 588 మందికి 531మంది హాజరుకాగా, 57మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ తెలిపారు. డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?ఉట్నూర్రూరల్: ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు తెలు స్తోంది. ఉట్నూర్ పట్టణంలోని హోటళ్లు, మూత్రశాలలు, బస్టాండ్ ప్రాంతం, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద మైక్రో జిరాక్స్ చిట్టీలు విచ్చలవిడిగా కనిపించ డమే దీనికి నిదర్శనం. ఇన్విజిలేటర్లు, నిర్వాహకులు కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు పరీక్షలకు అనుగుణంగా మైక్రోజిరాక్స్ చీటీలు తయారు చేసి అందుబాటులో ఉంచినటు తెలిసింది. వీటిని విద్యార్థులకు విక్రయించినట్లు సమాచారం. -
‘కాంగ్రెస్ బలోపేతానికి కృషి’
ఆదిలాబాద్ రూరల్: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతా నికి కృషి చేస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, పార్టీ జిల్లా పరిశీలకుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికే పదవులు దక్కుతాయని తెలిపారు. గురువా రం మండలంలోని యాపల్గూడలో కాంగ్రెస్ ఆది లాబాద్ రూరల్, సాత్నాల, మావల మండలాల వి స్తృత స్థాయి సమావేశం నిర్వహించగా హాజరై మా ట్లాడారు. పార్టీ ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు, కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామంలోని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆది లాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీ సీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు బోరంచు శ్రీకాంత్రెడ్డి, సుధాకర్గౌడ్, గిమ్మ సంతోష్, భూపె ల్లి శ్రీధర్, సాంటెన్న, ఎల్టి భోజారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి కైలాస్నగర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని, ఇందుకు పార్టీ కార్యకర్తలంతా సమష్టి కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకా డమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ సూచించారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ పట్టణ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎవరికి పార్టీ అ ధ్యక్ష పదవి ఇచ్చినా అంతా కలిసి పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దాదాపు రూ.388 కోట్ల విలువైన భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపించారు. అవినీతికి పాల్ప డేవారిని తాను ప్రశ్నిస్తానని చెప్పారు. పార్టీ పరిశీలకుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారా యణ, మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బోరంచు శ్రీకాంత్రెడ్డి, దిగంబర్రావు పాటిల్, బాలూరి గోవర్ధన్రెడ్డి, మునిగెల నర్సింగ్, ముజాహిదీన్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన ఆక్రమణల తొలగింపు
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధానచౌక్ల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రి య రెండో రోజు కొనసాగింది. సినిమారోడ్, అంబేడ్కర్చౌక్, శివాజీచౌక్ ఏరియాల్లో ఫుట్పాత్లు ఆక్రమించి వేసిన షెడ్లు, టేలాలను అధికారులు బుధవారం తొలగింపజేశారు. ఈ ప్రక్రియను డీఎస్పీ జీవన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు పర్యవేక్షించారు. అధికారుల సూచన మేరకు పలువురు స్వచ్ఛందంగానే వాటిని తొలగించుకున్నారు. అనంతరం ప్రత్యామ్నాయంగా కేటాయించిన గణేశ్ థియేటర్ స్థలానికి తరలివెళ్లారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సాయంత్రం వరకు అక్కడే ఉండి ప్రక్రియను పూర్తి చేశారు. కార్యక్రమంలో టీపీవో సుమలత, టీపీబీవో సాయికృష్ణ, టీపీఎస్ నవీన్కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట చిరు వ్యాపారుల ధర్నా తమ షెడ్లను తొలగించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని చిరువ్యాపారులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రత్యామ్నాయంగా కేటాయించిన స్థల ప్రొసీడింగ్లను తాత్కాలికంగా కాకుండా పర్మినెంట్ పదంతో జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యథావిధిగా తమ వ్యాపారాలను ప్రధాన చౌక్ల్లోనే కొనసాగించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఆర్డీవో వినోద్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారికి ఎంఐఎం, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మద్దతు తెలిపారు. -
బడిబాట పట్టేనా?
● ప్రణాళిక సిద్ధం చేస్తున్న విద్యాశాఖ ● వచ్చే నెల 6 నుంచి 19 వరకు కార్యక్రమాలు ● సర్కారు బడుల్లో పిల్లల్ని చేర్పించడమే లక్ష్యం ● ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల ప్రచార హోరుఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల బలోపేతం కో సం ప్రభుత్వం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఏటా చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జూన్ 6 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలను ఖరారు చేసింది. కొత్తగా చేరే వారితో పాటు బడిబయటి పిల్లల్ని పాఠశాలలో చేర్పించడమే ప్రధాన లక్ష్యం. గతేడాది నెల పాటు నిర్వహించినా ఆశించిన ప్రగతి సాధించలేదు. ప్రైవేట్లోనే విద్యార్థులు అధిక సంఖ్యలో చేరారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు చేపట్టింది. మెగా డీఎస్సీద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పక్షం పాటు పండగ వాతావరణం కల్పించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే విద్యార్థులు ఈ ఏడాది ఏ మేరకు సర్కారు బడుల్లో చేరుతారో వేచి చూడాల్సిందే. బడిబయట పిల్లలు చేరేనా.. ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యాశాఖ పలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ డ్రాపౌట్ సంఖ్య మాత్రం తగ్గడం లేదు. బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించినా మళ్లీ చెత్తకుప్పల వెంట, హోటళ్లు, లాడ్జీలు, తదితర పరిశ్రమల్లో పనిచేస్తూనే ఉన్నారు. వారం, పది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించినా అనుబంధ శాఖలు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 500కు పైగా బడిబయట పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య వెయ్యికి పైనే ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. లక్ష్యం నెరవేరేనా.. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాయి. తల్లిదండ్రులను మ భ్యపెట్టి తమ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్లోనే అడ్మిషన్లు అధికంగా కావడం గమనార్హం. ఈ ఏడాదైనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి సర్కారు బడిలో చేర్పించేలా చర్యలు చేపడతాం. జూన్ 6 నుంచి 19 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. నాణ్యమైన విద్య అందుతుంది. – ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, డీఈవో -
● ఈ సారి తొలకరి త్వరగా పలకరించే అవకాశం ● సాగుకు రైతుల సమాయత్తం ● అందుబాటులో ఎరువులు, విత్తనాలు ● నేల తడిసాకే విత్తుకోవాలంటున్న అధికారులు
ఆదిలాబాద్అర్బన్: వానాకాలం (ఖరీఫ్) సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అవసరమ య్యే విత్తనాలు, ఎరువులను ఆయా గ్రామాల రైతులకు అందుబా టులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే వర్షాలు పడే అవకాశాలున్నందున ఆ దిశగా అన్నదాతలు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే దుక్కులు దున్నే పనులు జోరందుకున్నాయి. రొటవేటర్తో చదును చేయడం, పొలాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు విత్తేందుకు రైతులు రెడీ అవుతున్నారు. దీనికి తోడు ఈ సారి నై రుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్న ట్లు వాతావరణ శాఖ చెప్పిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రైతులు సిద్ధమవుతున్నారు. పంట మార్పిడిపై దృష్టి గతేడాది ఖరీఫ్లో సాగు చేసిన పంటలను మళ్లీ ఈ సీజన్లో వేయకుండా రైతులు పంట మార్పిడిపై దృష్టి సారిస్తున్నారు. గతంలో సోయా వేసిన నేలల్లో ఈ సారి పత్తి, కంది, అలాగే పత్తి వేసిన చోట ఈ సారి సోయా లేదా మొక్కజొన్న పంటల సాగు దిశగా ఆలోచన చేస్తున్నారు. అలాగే పెసర, మినుమును అంతర పంటగా వేయాలని భావిస్తున్నారు. పంట మార్పిడిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. మరికొందరు తక్కువ సమయంలో అధిక దిగుబడినిచ్చే పంటలు సాగుకు మొగ్గుచూపుతున్నారు. 6లక్షల ఎకరాల సాగు అంచనా.. జిల్లాలో ఈ ఏడాది 6 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి ఉండనుంది. తర్వాత సోయా, కంది, మినుము, వరి, జొన్న, మొక్కజొన్న, పెసర పంటలు ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా రైతులకు సరిపడా మించి అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయ శాఖ చెబుతోంది. గత అనుభవాల దృష్ట్యా.. గత అనుభవాల దృష్ట్యా రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని చాలామంది రైతులు గతంలో వర్షాలు సరిగా కురవక రెండు, మూడు సార్లు విత్తనాలు వేసిన సంఘటనలు ఉన్నాయి. దీంతో మళ్లీ మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం పడడంతో పాటు కొందరికి నాసిరకం విత్తనాలు సరఫరా అయ్యాయి. పంట ఏపుగా పెరిగినా పూత, కాత లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సారి ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ శాఖ సైతం ఈ సారి అంచనాకు మించి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాయని వెల్లడించడంతో మార్కెట్లో డిమాండ్ రకం విత్తన ప్యాకెట్లు విరివిగా లభ్యమయ్యే అవకాశాలున్నాయి. ట్రాక్టర్తో చదును చేస్తున్న రైతు నేల తడిసాకే విత్తుకోవాలి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చూసి విత్తనాలు వేసుకోవద్దు. వర్షాకాలం ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. క్రమం తప్పకుండా కురిసి భూమి కొంత లోతు వరకు తడిసాకే విత్తుకోవాలి. తేలికపాటి వర్షాలకు వేసినట్లైతే ఎండ వేడిమికి నేల పొడిబారి విత్తనాలు చెడిపోయే అవకాశం ఉంది. ఈ సారి సరిపడా మించి ఎరువులు, విత్తనాలను సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఈ ఏడాది పంటల సాగు అంచనా.. పంట రకం సాగు అవసరమయ్యే (ఎకరాల్లో) విత్తనాలు(క్వింటాళ్లలో) పత్తి 4,40,000 11,00,840 ప్యాకెట్లు సోయాబీన్ 62,500 18,725 కంది 55,000 21,960 జొన్న 1600 66 మొక్కజొన్న 23000 1,834 వరి 1900 489 పెసర 550 22 మినుము 550 44 ఇతర పంటలు 250 12 -
‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పాటించాలి
● కలెక్టర్ రాజర్షి షా బైక్పై వెళ్లిన కలెక్టర్.. మండలంలోని చిట్యాల్బోరి శివారు అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా అక్కడికి కారు వెళ్లేందుకు రోడ్డు మా ర్గం సరిగా లేదు. ఈ క్రమంలో కలెక్టర్ ఇలా ఐకేపీ ఏపీవో జాకీర్ హుస్సేన్ బైక్పై వెళ్లారు. ఆదిలాబాద్రూరల్: ఉపాధి హామీ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని చిట్యాల్బోరి, కచికంటి, యాపల్గూడ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. యాపల్గూడలో రామాలయ ఆవరణలో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుక్నారు. కూలీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పనుల నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఈ ఏడాది సాధ్యమైనంత త్వరగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో రాథోడ్ రవిందర్, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, ఈజీఎస్ ఎపీవో జాకిర్ ఉస్సేన్, పీఆర్ ఎఈ సంతోష్, తదితరులు ఉన్నారు. -
వడపోత పక్కానేనా..!?
● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు కొనసాగుతున్న ప్రక్రియ ● ఈపీఎఫ్, ఈఎస్ఐ ఎన్వోసీలపై ఆరా.. ● బడా ఏజెన్సీల తీరుపై విమర్శలుసాక్షి,ఆదిలాబాద్: ‘ఎక్స్’ అనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంప్యానల్మెంట్లో గుర్తింపు పొంది ఉంది. ఆయా జిల్లాల్లో వివిధ శాఖల్లో వర్క్ ఆర్డర్ పొంది ఉద్యోగుల నిర్వహణ చేస్తుంది. అయితే ఒకట్రెండు జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు చేసిన సదరు ఏజెన్సీ మిగతా జిల్లాల్లో మాత్రం విస్మరించింది. చెల్లింపు చేసిన శాఖల నుంచి ఎన్వోసీ తీసుకొని ఆ పత్రాలను వేరే జిల్లాల్లో దరఖాస్తుతో జత పరిచారు. తద్వారా ఏజెన్సీ ఇతర జిల్లాల్లోని అక్రమ బాగోతం పైకి కనిపించకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో కొత్త ఎంప్యానల్మెంట్ కోసం అనేక దరఖాస్తులు రాగా, ఆ ఏజెన్సీల అ సలు బాగోతాలను సూక్ష్మంగా పరిశీలించాలన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. కొనసాగుతున్న పరిశీలన.. జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 2 నుంచి 13వరకు జిల్లా ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. 32 దరఖాస్తులు విక్రయించగా, 29 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. కాగా గత 14వ తేదీన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ టెండర్ తెరిచారు. అందులో ఒక ఏజెన్సీ వివిధ సర్టిఫికెట్లు లేని కారణంగా తిరస్కరణకు గురైంది. మిగతా 28 ఏజెన్సీలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇందులో దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల్లో కొన్ని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంప్యానల్మెంట్లో గుర్తింపు కలిగి ఉన్నాయి. ఆ ఏజెన్సీలు కొన్ని జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు చేసినప్పటికీ పలు జిల్లాల్లో వాటిని చెల్లించకుండా ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాశారనే అపవాదు ఉంది. అయితే ఏయే జిల్లాలోనైతే ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించారో ఆ సర్టిఫికెట్లను ఈ కొత్త ఎంప్యానల్మెంట్లో చోటు కోసం దరఖాస్తుతో పాటు జతచేశారు. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు ఏయే జిల్లాలోనైతే ఎంప్యానల్మెంట్లో చోటు కలిగి ఉన్నాయో, అక్కడ ఏయే శాఖల్లో వర్క్ ఆర్డర్ కలిగి ఉన్నాయో, అన్నింటి నుంచి ఎన్వోసీలను సూక్ష్మంగా పరిశీలించాలని పలు ఏజెన్సీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. కొంత మంది బడా ఏజెన్సీలు అధికారులను మచ్చిక చేసుకొని ఇలాంటి బాగోతాలను తెరపైకి రానివ్వకుండా చూసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. జిల్లాలో కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటులో ఉన్నతాధికారులు పారదర్శకంగా వ్యవహరించి అన్ని అర్హతలు ఉన్న ఏజెన్సీలనే పరిగణలోకి తీసుకోవాలని, తద్వారా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి ప్రయోజనాలు పూర్తిగా దక్కేలా అధికారులు చూడాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నాం.. కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. ప్రస్తుతం లేబర్, కాంట్రాక్ట్ లైసెన్స్ల పరిశీలన చివరి దశలో ఉంది. ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ ఇలా అన్ని అంశాల్లో ఏజెన్సీలకు సంబంధించి ఏయే జిల్లాల్లోనైతే వారు వర్క్ ఆర్డర్ పొంది ఉద్యోగుల నిర్వహణ చేస్తున్నారో ఆయా జిల్లాల్లో నుంచి శాఖల వారీగా ఎన్వోసీలను పరిశీలన చేస్తున్నాం. కమిటీ ఆధ్వర్యంలో అన్ని అంశాలను లోతుగా పరిశీలన చేసి లిస్టును ఫైనల్ చేయడం జరుగుతుంది. జాబితా పెట్టిన తర్వాత ఇతర ఏజెన్సీల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు ఒకట్రెండు రోజులు గడువు కూడా ఇస్తాం. – మిల్కా, ఉపాధికల్పన శాఖ ఇన్చార్జి జిల్లా అధికారి -
పాఠశాలల అభివృద్ధిలో హెచ్ఎంలదే కీలకపాత్ర
ఆదిలాబాద్టౌన్: పాఠశాలల అభివృద్ధిలో ప్రధానో పాధ్యాయులదే కీలకపాత్ర అని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతినగర్ జెడ్పీఎస్ఎస్లో ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంచడం, నాణ్యమైన విద్య అందించేందుకు దృష్టి సారించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని పేర్కొన్నారు. అనంతరం సరస్వతినగర్ పాఠశాలలో ఆదిలాబాద్రూరల్ ప్రాథమిక ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రాథమిక విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. అనంతరం డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని, పుస్తకాల గోదాంను పరిశీలించారు. ఇందులో స్టేట్ రిసోర్స్ పర్సన్ అశోక్, రిసోర్స్ పర్సన్లు తిలావత్, ప్రత్యూష, దేవిదాస్, నర్సయ్య, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి నేరడిగొండ: మండల పరిధిలోని ఎంపీయూపీఎస్, ఎంపీపీఎస్ల్లో పనిచేస్తున్న ఎస్జీటీ, పీఎస్హెచ్ఎంలకు నేరడిగొండ జెడ్పీఎస్ఎస్లో ఐదు రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఇందులో ఎంఈవో భూమారెడ్డి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాం, అనిల్, ఆర్పీలు గంగాధర్, రాజ్కుమార్, సంతోష్, రవీందర్, చంద్ర శేఖర్, శివలీల, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఆదిలాబాద్: కార్మికుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భీంరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో డిపో ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల ను సవరించడం సరికాదని మండిపడ్డారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేసి నడపాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల సంస్థ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆ సమస్యను వెంటనే పరి ష్కరించాలన్నారు.అంతేకాకుండా ఆర్టీసీలో కార్మి క సంఘాలను అనుమతించాలన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మె జయప్ర దం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లాఅధ్యక్షుడు భీంరావ్, డిపో కార్యదర్శి ఆశన్న, గంగన్న, నారాయణ, దత్తు, వెంకటి, సురేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్–గడ్చందూర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి●
ఆదిలాబాద్:ఆదిలాబాద్–గడ్చందూర్ నూత న రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ జైన్ను మంగళవారం సికింద్రాబాద్లో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు తెలిపారు. అ లాగే జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న రైల్వేఓవర్, అండర్ బ్రిడ్జిలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ..తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఎంపీ నగేశ్ మంగళవారం త్రిపుర మాజీ సీఎం విప్లవ్ కు మార్దేవ్తో పాటు దర్శించుకున్నారు. వారి వెంట ఎంపీ హిమాద్రిసింగ్ ఉన్నారు. -
ఆంధ్ర, మహారాష్ట్ర టు ఆదిలాబాద్
ఇచ్చోడ: జిల్లాలో జొన్నల దందా జోరుగా సాగుతుంది. కొంతమంది వ్యాపారులు ముఠాగా ఏర్పడి బినామీ రైతుల పేరిట జొన్నలు విక్రయిస్తూ స్వల్ప వ్యవధిలో భారీగా ఆర్జిస్తున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గడిచిన పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట జొన్నలతో వాహనాలు పట్టుబడిన ఘటనలు అనేకం వెలుగుచూశాయి. అయినా యంత్రాంగం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆన్లైన్ నమోదు నుంచే.. రబీలో ఆయా పంటలు సాగు చేసిన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఈవోలు ముందుగానే ఆన్లైన్లో నమోదు చేశారు. వీటి ఆధారంగానే పంట దిగుబడిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది. ఈ పద్ధతి ద్వారా నేరుగా రైతు మాత్రమే తన పంట దిగుబడిని విక్రయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు పంట సాగు చేయకుండానే చేసినట్లుగా సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇచ్చోడ మండలంలో ఈ ఏడాది రబీలో 5,815 ఎకరాల్లో జొన్న సాగైనట్లు ఆన్లైన్లో నమోదై ఉంది. అయితే మండలంలో మెజార్టీ గ్రామాల్లో సాగునీటి సౌకర్యం లేదు. జొన్న సాగు అంతంతే ఉంది. అయితే ఆన్లైన్ నమోదులో ఉన్న దాంట్లో సగం కూడా సాగు కాలేదని తెలుస్తోంది. జిల్లాలో చాలా మండలాల్లో ఇదే పరిస్థితి. సాంకేతికత అడ్డు పెట్టుకుని.. సాంకేతికత అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యాపారులు జొన్నలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపికచేసుకున్న రైతులనువారి ఆధార్కార్డు, పట్టాపాస్బుక్ ద్వారా కొనుగోలు కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ ఆన్లైన్ ఆధారంగా విక్రయింపజేస్తా రు. తర్వాత ఆ రైతు విక్రయించిన వివరాలు సహకార సంఘాలు, మార్క్ఫెడ్ వద్ద ఎక్కడా కనిపించడం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు తమకు సహకరించిన రైతులకు కొంత ముట్టజెబు తూ, అధికారులతో ‘మామూలు’గా వ్యవహరిస్తూ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆన్లైన్లో పంట నమోదై ఉన్న రైతులనుంచి మాత్రమే జొన్నలు కొనుగోలు చేస్తున్నామని, బినామీలను నిర్ధారించలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో జోరుగా జొన్నల దందా ప్రైవేట్ వ్యాపారులదే హవా అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ‘మద్దతు’తో అమ్మకం పట్టుబడుతున్నా స్పందించని అధికారులుజిల్లాలో జొన్న సాగు వివరాలు పంట సాగు 1,10,901 ఎకరాలు సాగు చేసిన రైతులు 39,764 మంది కొనుగోలు కేంద్రాలు 12 ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 3,84,000 క్వింటాళ్లు నిర్మల్కు చెందిన ఓ ట్రేడర్ ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలో 250 క్వింటాళ్ల జొన్నలను ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తుండగా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామ సమీపంలో పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా కావలి నుంచి జొన్నలను ఆదిలాబాద్ జిల్లాకు లారీలో అక్రమంగా తరలిస్తుండగా సిరికొండ మండలం రాంపూర్(బి) వద్ద పోలీసులు పట్టుకున్నారు. 30 క్వింటాళ్ల జొన్నలతో పాటు లారీని సీజ్ చేశారు. ఇలా ఒక్క రోజులోనే 280 క్వింటాళ్ల జొన్నలు పట్టుబడడం గమనార్హం. ఈ నెల 14న తాంసిలోని సబ్మార్కెట్ యార్డులో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన జొన్నలను విక్రయించేందుకు యత్నిస్తుండగా అనుమానం వచ్చిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడికి చేరుకుని 136 క్వింటాళ్ల జొన్నలతో పాటు మాక్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ నమోదులో పొరపాట్లు లేవు.. పంటల ఆన్లైన్ నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే వివరాలను ఆన్లైన్ నమోదు చేశారు. ఈ ఏడాది జొన్న పంట దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న జొన్నలను పోలీసులు అడ్డుకట్ట వేయాలి. – శ్రీధర్స్వామి, డీఏవో -
బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే చర్యలు
● కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను డీలర్లు అందుబాటులో ఉంచాలని, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కలెక్టరేట్లో ఎరువులు, విత్తనాల విక్రయాలు, వివరాల నమోదుపై మంగళవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం వారికి ఈపీవోఎస్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ దుకాణ ం వద్ద ఎరువులు, విత్తనాల లభ్యత స్టాక్ వివరాలు ప్రదర్శించడంతో పాటు టాస్క్ఫోర్స్ సభ్యు ల వివరాలు రైతులకు తెలిపేలా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్స్వామి, ఇచ్చోడ ఏడీఏ రాంకిషన్, సాంకేతిక వ్యవసాయాధికారి విశ్వామిత్ర,తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ క్లియర్
కైలాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధానచౌక్ల్లో దశాబ్దకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్య ఎ ట్టకేలకు తొలగింది. అంబేడ్కర్చౌక్, గాంధీచౌక్, దేవిచంద్చౌక్, శివాజీచౌక్ల్లోని ఫుట్పాత్లు, డివైడర్లు, రోడ్లను ఆనుకుని ఉన్న ఆక్రమణలను అధి కారులు మంగళవారం తొలగించారు. ఇది వరకే వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించిన అధికారులు ప్రధాన చౌక్ల నుంచి వెళ్లిపోవాలంటూ పలుమార్లు నోటీసులు సైతం జారీచేశారు. అయినా వారు స్పందించకుండా అక్కడే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లన్నీ రద్దీగా మారి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ఒక వాహనం వెళితే మరో వాహనం వెళ్లలేని దుస్థితి. దీంతో పాదాచారులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధి కారులు పొక్లెయిన్ల సాయంతో ఆక్రమణలన్నీ తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ చర్యలపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రత్యేక బలగాల నడుమ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల సమయంలో ప్రత్యేక పోలీసు బలగాల నడుమ ము న్సిపల్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆయా చౌక్ల్లోని డివైడర్లు, టేలాలు, షెడ్లను పూర్తిగా తొలగింపజేశారు. కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోగా, మరికొందరు వీధి వ్యాపారులు, మైనార్టీ నాయకులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొనగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వన్టౌన్కు తరలించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజ న్, ఏఎస్పీ కాజల్, డీఎస్పీ జీవన్రెడ్డి భద్రతను పర్యవేక్షించారు. ఆర్డీవో వినోద్కుమార్, మున్సి పల్ కమిషనర్ సీవీఎన్. రాజు ఆధ్వర్యంలో ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. ఆయా చౌక్ల్లోని సుమారు 201 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆక్రమణల తొలగింపు అనంతరం రోడ్లు విశాలంగా మారాయి. వాహనదారులు ఇబ్బందులు లేకుండా వెళ్లే అవకాశం కలిగింది. ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు ప్రధాన చౌక్ల్లో తొలగించిన వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా జిల్లా కేంద్రంలోని గణేశ్ థియేటర్ స్థలం కేటాయించారు. 208 మంది వ్యాపారులకు గత నెలలో లక్కీ డ్రా నిర్వహించి స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఐదు వరుసలుగా స్థలాలను ఎంపిక చేశారు. మరో వైపు తొలగించిన ఆక్రమణదారుల్లో 101 మంది తొలిరోజే గణేశ్ థియేటర్ స్థలానికి చేరుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు ప్రా రంభించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, టీపీవో సుమలత, టీపీబీవో సాయికృష్ణ, టీపీఎస్ నవీన్ కుమార్ సాయంత్రం వరకు అక్కడే ఉండి వ్యాపారులకు స్థలాల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించారు. మళ్లీ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు.. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఎవరైనా టేలాలు, తోపుడుబండ్లు, షెడ్లను ఏర్పాటు చేసినట్లైతే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన చౌక్లతో పాటు రోడ్ల వెంబడి కొత్తగా ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రధానచౌక్ల్లో ఆక్రమణల తొలగింపు పలువురి ముందస్తు అరెస్ట్ ప్రత్యామ్నాయంగా స్థల కేటాయింపు -
అభివృద్ధి పనులు ఇలా..
సాక్షి, ఆదిలాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి కుటుంబ ఆదా యం రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇందిరా సౌర గిరి జలవికాసం అనే ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. సోమవా రం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ పథకాన్ని ఈ వారంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ఈమేరకు లబ్ధి చేకూరనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక మంది గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం కింద పోడు వ్యవసాయం చేసుకునేందుకు భూ యాజమాన్య హక్కు ను కల్పించింది. ఆ భూముల్లో రాబోయే ఐదేళ్లల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రస్తుతం సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నల్లమల డిక్లరేషన్ ప్రకటించింది. గిరిజనుల సంక్షేమం కోసం పలు అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం సంక్రమించిన పోడు భూములకు ఈ పథకంతో లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. లబ్ధి ఇలా.. పోడు భూముల్లో వంద శాతం సబ్సిడీతో సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. తద్వారా ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చి గిరి రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో బోరుబావుల స్థానంలో చేతిబావులు తవ్వించాలని ఐటీడీఏ నిర్ణయించింది. దీనికి ఇందిరా సౌరజల వికాస పథకం ద్వారా సౌర పలకలు బిగించనున్నారు. శాఖల సమన్వయం.. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఇందులో అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు. తద్వారా వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు. పోడు భూముల్లో సాగుకు సర్కారు తోడ్పాటు ‘ఇందిరా సౌర జల వికాసం’తో ముందడుగు ఉమ్మడి జిల్లాలో పలువురికి చేకూరనున్న లబ్ధి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ వారంలో ప్రారంభం ఏర్పాట్లపై ఐటీడీఏ దృష్టిఉమ్మడి జిల్లాలో గిరి తెగల జనాభా.. (2011 జనాభా లెక్కల ప్రకారం) గోండు 2,63,515 లంబాడా 1,12,793 కొలాం 38,176 కోయ, ఇతరులు 30,739 పర్దాన్ 26,029 మన్నెవార్ 15,370 నాయక్పోడ్ 5,206 తోటి 2,231 ఎరుకల 1,735 మొత్తం జనాభా 4,95,794 పోడు భూముల వివరాలు.. విస్తీర్ణం 2,12,256 ఎకరాలు రైతుల సంఖ్య 66,839 పట్టాల జారీ సంఖ్య 66,839 ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ భూముల్లో భూగర్భ, నీటి సర్వే చేపట్టి రైతుకు లబ్ధి చేకూరేలా చేతిబావులు తవ్వకం చేపట్టనున్నారు. 5 హెచ్పీ, 7.5 హెచ్పీ సోలార్ పంపుసెట్లు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యాంత్రీకరణకు సహకారం అందించనున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కోసం డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయనున్నారు. అర్హులు వీరు.. అటవీ హక్కు చట్టం కింద జారీ చేయబడిన భూ యాజమాన్యం హక్కు కలిగిన ప్రతీ గిరిజన రైతును అర్హులుగా నిర్ణయించారు. సదరు రైతుకు రెండున్నర ఎకరాలు(హెక్టా రు), అంతకంటే ఎక్కువ ఉంటే ఒక యూని ట్గా మాత్రమే మంజూరు చేస్తారు. అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నట్లయితే సరిహద్దులో గల ఇద్దరి నుంచి ఐదుగురిని గ్రూప్గా ఏర్పాటు చేసి యూనిట్గా మంజూరు చేయనున్నారు. ఒకవేళ సరిహద్దులో అటువంటి రైతుల భూములు లేనిపక్షంలో ఆ రైతుకు వ్యక్తిగతంగా యూనిట్ మంజూ రు చేసేలా ఇందులో ప్రణాళిక చేశారు.డిప్యూటీ సీఎం రానున్నారు.. ఇందిరా సౌర జల గిరి వికాస పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఈ వారంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి వేదికను ఖరారు చేస్తున్నాం. జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనేది పథకం ప్రారంభించిన తర్వాత స్పష్టం అవుతుంది. – ఖుష్బూ గుప్తా, పీవో, ఉట్నూర్ ఐటీడీఏ -
సమస్యలు సత్వరం పరిష్కరించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీవెన్స్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఎస్పీకి వినతులు అందజేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ఆయా స్టేషన్ల అధికారులకు ఎస్పీ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వారం ప్రధానంగా కబ్జాలు, కుటుంబ కలహాలు, అధిక వడ్డీ, కోర్టు కేసులు, గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు తది తర వాటిని ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని వారికి భరో సా కల్పించేలా వ్యవహరించారు. ఇందులో సీసీ రాజు, ప్రజాఫిర్యాదుల విభాగం అధికారి జైస్వా ల్ కవిత, వామన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆక్రమణపై ఫోకస్
● మున్సిపల్ స్థలం కాజేసిన వారిపై కేసు ● ఉద్యోగుల తీరుపై అనుమానాలు ● విచారణ నివేదిక కోరిన పోలీసులు ● కసరత్తు చేస్తున్న బల్దియా అధికారులుదర్జాగా షెడ్డు నిర్మాణం..రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంతో ఆ స్థలంలో ఈ ఏడాది మార్చిలో షెడ్డు నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా పనులు కానిచ్చారు. దీనిపై ఫిర్యాదులు అందగా టౌన్ప్లానింగ్ అధికారులు ఆ స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిర్మాణ పనులు నిలిపివేయాలని చెప్పినా సదరు అక్రమార్కులు లెక్కచేయలేదు. విషయాన్ని అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు, మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో అక్రమార్కులు షెడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తు తం ఎస్పీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించడంతో పోలీసులు అక్రమార్కులపై కేసు నమోదు చేశారు. బల్దియా స్థలాన్ని కాజేసిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరొకరు పరారీలో ఉన్నారు. కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఇంటి దొంగల్లో గుబులు మొదలైంది. రూ.కోట్లాది విలువైన మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకు న్న ఇద్దరిపై కేసు నమోదైంది. అందులో ఒకరు కట కటాల్లోకి వెళ్లగా,మరొకరు పరారీలోఉన్నారు. అయి తే ఇందులో మున్సిపల్ ఉద్యోగుల పాత్రపై పోలీ సులు విచారణ నివేదిక కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో వారిపైన కూడాకేసులు నమో దు చేసి రిమాండ్కు తరలించనున్నట్లుగా పోలీసు అధికారులుప్రకటించడంతో వారిలో వణుకు మొద లైంది. భవిష్యత్తులో ఇలాంటి వాటికితావులేకుండా ఉండాలంటే అక్రమార్కులతో పాటుఅందుకు సహకరించిన వారిపైన కఠినంగా వ్యవహరించా ల నే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ వ్యవహరంలో ఎవరిపైవేటు పడుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది. ఆక్రమణ తీరు ఇలా.. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీ మున్సిపల్కు సంబంధించి పాత లీజు స్థలం ఖాళీగా ఉంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించారు. భుక్తాపూర్కు చెందిన ఓ వ్యక్తి తన బంధువుపై రిజిస్ట్రేషన్ చేసి తన పేరిట మార్చుకున్నారు. 469.44 చదరపు అడుగుల స్థలం ధర ప్రస్తుతం రూ.కోట్లలో పలుకుతుంది. ఇంతటి విలు వైన భూమిని తమ హస్తగతం చేసుకుకోవాలని వ్యూహం పన్నారు. 35 ఏళ్లుగా అక్కడే ఉంటున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి బల్దియా అధికారులను ఆశ్రయించారు. మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి దానిపై విచారణ చేయాల్సి ఉండగా ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఎలాంటి విచారణ చేపట్టకుండానే ఆ స్థలానికి వార్డు పరిధిలోనే లేనటువంటి ఇంటి నంబర్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం నిర్మాణంలో ఉన్న, నిర్మించిన ఇళ్లకే నంబర్ (అసెస్మెంట్) కేటాయించాల్సి ఉంటుంది. కానీ అక్రమార్కులతో కుమ్మక్కై ఇంటి నంబర్ కేటాయించారని తెలు స్తోంది. దాని ఆధారంగా సదరు ఆక్రమణదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. -
జిల్లాలో పటిష్ట చర్యలు చేపట్టాలి
● డీజీపీ (పర్సనల్) అనిల్ కుమార్ ● పోలీసు కార్యాలయం పరిశీలన ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పో లీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని డీజీపీ (పర్సనల్) అనిల్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అంతకుముందు పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో జరిగే వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని అధి కారులను ఆదేశించారు. హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరూ వినియోగించేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని సూ చించారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు,అమలుచేస్తున్న విధానాలు, సమ్మర్ క్యాంపులు, చిల్డ్రన్ పార్కులు, సైబర్క్రైమ్ తదితర విషయాలను డీజీపీకి ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్ట డానికి ప్రత్యేకంగా హైవేలపై ర్యాంబుస్టిప్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేజ్ పోలీసు ఆఫీసర్ వ్యవస్థ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేరాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో గస్తీ, పెట్రోలింగ్, ఆపరేషన్ చబుత్రా, మైనర్లు వాహనాలు నడపకుండా ప్రత్యేక స్పెషల్ డ్రై వ్, కార్డెన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వివరించా రు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, స్పెష ల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐ లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు మెరుగైన సేవలు
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదిలాబాద్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆదిలాబాద్ డిపోను సోమవారం ఆయన సందర్శించారు. ఉద్యోగుల సమస్యలు అడిగి తె లుసుకున్నారు. ముందుగా డిపో ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడా రు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంతో మహిళలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారన్నారు. ఆర్టీసీ లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది క లగకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే అ వసరం మేరకు ప్రతీ గ్రామానికి బస్సు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన బ స్సులను సైతం కొనుగోలు చేస్తున్నామని, ప ర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను సైతం పలు రీజియన్లలో ప్రవేశపెట్టామన్నారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సు ల ఏర్పాటు విషయంలో దూరం సమస్యగా మారిందన్నారు. నిజామాబాద్లో చార్జింగ్ పా యింట్తో అనుసంధానం చేస్తే ఎలక్ట్రిక్ బస్సులు నడపవచ్చన్నారు. ఆయన వెంట డిపో మే నేజర్ కల్పన తదితరులు ఉన్నారు. -
జిల్లాలో ఇదీ పరిస్థితి..
అవగాహన కల్పిస్తున్నాం..అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతీ శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. షాపింగ్ మాల్స్, పాఠశాలలు, అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, సూపర్ మార్కెట్లలో హోజరి మిషన్, హెచ్చింగ్ మిషన్, కెమికల్ పౌడర్, సీవో2 సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. ఆయా యాజమాన్యాల వద్దకు వెళ్లి ఫైర్సేఫ్టీ పాటించాలని తెలియజేస్తున్నాం. – డి.జైత్రాం, ఎస్ఎఫ్ఓ, ఆదిలాబాద్ ● జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యా లయ సమీపంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో నాలుగేళ్ల క్రితం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అస్తినష్టం మినహా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ● తాంసి మండలంలోని కప్పర్లలో ఇటీవల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పశువుల పాకతో పాటు పక్కన నిలిపిన రెండు బొలెరో వాహనాలు కాలిపోయాయి. చుట్టుపక్కల వారు స్పందించి మంటల ను ఆర్పివేశారు. అయితే ప్రమాదం జరిగిన గంట తర్వాత జిల్లా కేంద్రం నుంచి ఫైరింజన్ చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాష్ట్ర రాజధానిలో తాజాగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఆయా ఆస్పత్రులు.. అపార్ట్మెంట్లు.. పాఠశాలలు..తదితర కార్యాలయా ల్లో అగ్నిప్రమాదాలు వాటిల్లితే ప్రాణాలు గాలిలో కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ వైద్యశాలల్లో రోగుల ప్రాణాలకు భరోసా లేకపోగా, కాలనీలు, ప్రైవేట్ బడుల్లో సైతం రక్షణ చర్యలు కనిపించని పరిస్థితి. కేవలం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్పా మళ్లీ షరామామూలే అన్నవిధంగా మారింది జిల్లాలోని సంబంధిత శాఖ అధి కారులు తీరు. హైదరాబాద్లోని పాతబస్తీలో ఆది వారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 17 మంది సజీవ దహనంకాగా, మరికొంత మంది గా యాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మనమెంత భద్రమనే అనుమానం వ్యక్తమవుతుంది. గతంలో జిల్లాలోనూ పలు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదు. నిబంధనలు బేఖాతరు.. ● జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు నిత్యం రోగులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. రోగుల నుంచి యాజమాన్యాలు భారీగానే ఫీజులు వసూలు చేస్తారు. అయితే భద్రత విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుకోని ప్రమా దం జరిగితే రోగులతో పాటు వారి బంధువులు సైతం ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు న్నాయి. చాలా ప్రైవేట్ ఆస్పత్రులు ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. అలాగే పైఅంతస్తుల్లో నిర్వహణ కొనసాగుతుంది. మెట్లు ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగితే పరుగు తీసే అవకాశం కూడా లేకుండాపోతోంది. తొక్కిసలాట జరిగితే ప్రాణాలు సైతం పోయే అవకా శం ఉంటుంది. ● మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు అనుమతులు పొందే సమయంలో తప్పనిసరిగా ఫైర్సేఫ్టీ పొందాలి. పాఠశాలల్లో హోజరి, షబ్బింగ్ మిషన్, వాటర్ ట్యాంక్, కెమికల్ పౌడర్ను అందుబాటులో ఉంచాలి. జిల్లాలో చాలా పాఠశాలల్లో ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానరాని పరి స్థితి. యాజమాన్యాలు సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని సర్టిఫికెట్లు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లే అవకాశాముంటుంది. ● జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోనూ పలు అపార్ట్మెంట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా వాటిలో ఫైర్సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం సంభవించే అవకాశం లేకపోలేదు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కనీసం ఫైర్ ఇంజన్ కూడా రాలేని పరిస్థితి. అశోక్ రోడ్, బ్రాహ్మణవాడ, తిర్పెల్లి, కోలిపుర, పంజేషా తదితర కాలనీల్లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఫైర్ ఇంజన్ వెళ్లేసరికి కాలి బూడిదే.. జిల్లాలో మూడు ఫైర్స్టేషన్లు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్లో ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని ఫైర్స్టేషన్లో 2 ఫైరింజన్లు ఉండగా, ఒకటి మార్కెట్ యార్డు కు సంబంధించి ఉంది. ఈస్టేషన్ ద్వారా ఆదిలాబా ద్, జైనథ్, బేలతో పాటు తాంసి, తలమడుగు, భీంపూర్మండలాల పరిధిలో ప్రమాదాలుజరిగితే ఇక్క డి నుంచే ఫైరింజన్లు వెళ్తాయి. ఉట్నూర్, ఇచ్చోడ పరిధిలోని మండలాల్లో దాదాపు 50కిలోమీటర్లకు పైగా దూరంలో ప్రమాదం జరిగినప్పుడు ఫైరింజ న్లు వెళ్లేసరికి ఆస్తులు కాలి బూడిదవుతాయి. బోథ్, బేలలో ఫైర్స్టేషన్లు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే అంతేనా.. ఆస్పత్రులు, పాఠశాలల్లో కనిపించని ‘ఫైర్సేఫ్టీ’ అపార్ట్మెంట్లలోనూ కానరాని నిబంధనలు ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అగ్నిమాపక శాఖజిల్లాలో 200 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, అందులో కేవలం 40 మాత్రమే ఫైర్సేఫ్టీ పరికరాలు కలిగి ఉన్నాయి. ఇక 50 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా, కేవలం ఐదారుకు మించి వాటిలో ఈ పరికరాలు కనిపించని పరిస్థితి. నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు 2009 సంవత్సరం తర్వాత అన్నింటికి ఫైర్సేఫ్టీ అనుమతి తప్పనిసరి. అలాగే అపార్ట్మెంట్లకు 18 మీటర్లు, ఆస్పత్రులు 15 మీటర్ల ఎత్తులో ఉన్నవాటికి అనుమతులు పొందాలి. చాలా అపార్ట్మెంట్లలో ఈ పరికరాలు అందుబాటులో లేవు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీ కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, బ్యాంకు రుణా ల మంజూరు, స్వయం ఉపాధి, బోరుబావుల మంజూరు, భూసమస్యలు వంటి వివిధ అంశాలకు సంబంధించి ఈవారం మొత్తం 104 అర్జీలు అందాయి. అనంతరం శాఖల వారీగా అర్జీల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, కలెక్టరేట్ ఏవో వర్ణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. కలెక్టర్ రాజర్షి షా గ్రీవెన్స్కు 104 దరఖాస్తులు ‘ఇందిరమ్మ’కు 18 ఫిర్యాదులుఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల స్వీకరణకు గాను కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ సోమవారం కూడా కొనసాగింది. జెడ్పీ, మున్సిపల్, హౌసింగ్ శా ఖల ఉద్యోగులు ఈ కౌంటర్లో మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండి ప్రజ ల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ వా రం ఆదిలాబాద్ పట్టణం నుంచి తొమ్మిది, గ్రామీణ ప్రాంతాల నుంచి మరో తొమ్మిది మొత్తం 18 ఫిర్యాదులు అందినట్లుగా ఆయా శాఖల అధికారులు తెలిపారు. -
● గూడ్స్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం ● అదుపుతప్పి బోల్తా పడుతున్న వాహనాలు ● గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు ● డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతోనే ఘటనలు ● చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న రవాణాశాఖ
●గతేడాది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు బయల్దేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ నిర్మల్ ఘాట్ సెక్షన్ సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, ఓవర్ లోడ్ కారణంగా ఓ ప్రయాణికుడు మృత్యువాత పడగా, అందులో ప్రయాణిస్తున్న 25 మంది గాయాల పాలయ్యారు. ఆదిలాబాద్టౌన్: జిల్లాలో రహదారి ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. శుభకార్యాలు, దైవదర్శనం, ఇతర పనుల నిమిత్తం గూడ్స్ వా హనాల్లో వెళ్తున్న సమయంలో అతివేగం, డ్రైవర్ ని ర్లక్ష్యం, మద్యం మత్తులో నడపడం, పరిమితికి మించి వెళ్లడంతో వాహనాలు బోల్తా పడుతున్నాయి.ఈ ఘటనల్లో అందులో ప్రయాణిస్తున్న వారి లో పలు వురు మృతిచెందగా,మరికొంతమంది తీవ్ర గాయా లై కోలుకోలేని స్థితికి చేరుకుంటున్నారు. కుటుంబ పెద్దలను కోల్పోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది తెలిసి ఇలాంటి ప్రయాణాలు చేస్తుండగా, మరికొందరు అవగాహ న లేకపోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా గూడ్స్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రవాణా శాఖాధికారుల నిర్లక్ష్యమో, అలసత్వమో ఏమోగానీ ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్ర మాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తప్పా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టకపోవడంతో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనల ప్రకారం గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలించరాదు. అయితే కొంతమంది యజ మానులు శుభకార్యాలు, దైవదర్శనాలు ఇతర పను ల నిమిత్తం గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్నారు. ఘా ట్ సెక్షన్లు, మూలమలుపుల వద్ద అతివేగం కారణంగా వాహనాలు బోల్తా పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు క్షతగాత్రులుగా మారుతుండగా, మరి కొంత మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఐచర్, బొలెరో, లారీలు, టాటాఏస్, ఆటో ట్రాలీ వంటి వాహనాల్లోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు.. గూడ్స్వాహనాలతో పాటు ఆటోలు, జీపుల్లో పరిమి తికిమించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇచ్చో డ, బజార్హత్నూర్, సిరికొండ, సాత్నాల, నేరడిగొండ, తదితర ప్రాంతాల్లో జీపులు, ఆటోల్లో పరి మితికి మించి ప్రయాణా లుసాగిస్తున్నారు. గతంలో బోథ్, తలమడుగు మండలంలో, ఇచ్చోడ సమీపంలో ఆటోలు బోల్తా పడడం, రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో పలువురు మృతిచెందారు. సిరికొండ మండలంలోని నేరడిగొండ(జి) వద్ద శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో మూలమలుపు వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 30 మందిలో 11 మంది గాయాలపాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. రిమ్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు -
బీసీ గురుకుల ‘సీవోఈ’
● ఉమ్మడి జిల్లాకు ఒకటి మంజూరు ● ఆదిలాబాద్ పరిధిలో లక్సెట్టిపేటలో బాలుర కళాశాల ● ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి..ఆదిలాబాద్రూరల్: బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో మహాత్మజ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 పాఠశాలలను ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని ఇంటర్మీడియెట్ వరకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చేరింది. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్సెట్టిపేటలో బీసీ సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) సైతం అందుబాటులోకి రానుంది. ఇక్కడి విద్యార్థులు ఇంటర్ ఫలి తాల్లో ప్రైవేట్కు ధీటుగా ఫలితాలు సాధిస్తుండడంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. ఒక్కో సీవోఈలో 160 సీట్లు .. కొన్నేళ్లుగా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో సీవోఈలు కొనసాగుతున్నాయి. బీసీ సంక్షేమశాఖ పరిధిలోనూ హైదరాబాద్లో బాలురు, బాలికల సీవోఈలు ఒక్కోటి చొప్పున నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 10 సీవోఈలను ఉమ్మ డి జిల్లా ప్రాతిపదికన అందుబాటులోకి తెస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకుని రెండు ఏర్పా టు చేస్తున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బాలుర, నిజామాబాద్లో బాలి కల సీవోఈలను ప్రారంభించనున్నట్లు అధికా రులు పేర్కొంటున్నారు. ఒక్కో సీవోఈలో ఎంపీసీలో 80సీట్లు, బైపీసీలో 80 సీట్లు అందుబా టులోకి రానున్నాయి. శిక్షణ.. ఎంపిక ఇందులో ఇంటర్మీడియెట్తో పాటు జేఈఈ మెయిన్స్, నీట్, ఐఐటీ తదితర పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీటిలో ప్రవేశాలకు గాను 75 శాతం బీసీ విద్యార్థులకు, 25 శాతం ఇతరులకు కేటా యించనున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదివిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జిల్లాలో 22 బీసీ గురుకులాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2017లో 11మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలను ప్రారంభించగా ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చే రింది. ఇందులో 11 బాలికలు, 11 బాలుర కళా శాలలు ఉన్నాయి. వీటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గాను శనివారం వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి.. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు సీవోఈలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బాలుర సీవోఈ ప్రారంభం కానుంది. అలాగే నిజామాబాద్లో బాలికల సీవోఈ ఏర్పాటు కానుంది. ఒక్కో దానిలో 160 (ఎంపీసీ 80, బైపీసీ 80) సీట్లు అందుబాటులో ఉంటాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. – ఎస్ శ్రీధర్, మహాత్మాజ్యోతి బాపూలే గురుకులాల ఆర్సీవో -
● ఐపీ మైదానానికి టెండర్ల భయం ● ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు పెత్తనం ● నిరుపేద క్రీడాకారులు ఆటలకు దూరమయ్యే అవకాశం ● ఇప్పటికే వసతులు లేక అవస్థలు
ఆదిలాబాద్: అసలే అరకొర వసతులు.. క్రీడా శిక్షకులు సైతం లేరు.. పర్యవేక్షణ కూడా అంతంతే.. వీటికి తోడు క్రీడాకారులను మైదానానికి దూరం చేసేలా అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఆటలు ఆడాలన్నా, వ్యాయామ సాధన చేయాలన్నా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని(ఐపీ) స్టేడియమే పెద్దదిక్కుగా నిలుస్తోంది. అయితే దీనిని నెమ్మదిగా ప్రైవేట్ పరం చేసేందుకు యువజన క్రీడా శాఖ చర్యలు క్రీడాకారులకు శరాఘాతంగా మారుతుంది. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ నిర్వహణను కాంట్రాక్టర్ కు అప్పగించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే రోజుల్లో స్టేడియంలో పేఅండ్ప్లే విధానం అమలుకు అధికారులు చేస్తున్న కసరత్తు క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. గతమెంతో ఘనం.. ఈ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిభగల క్రీడాకారులకు నెలవుగా మారింది. ఎంతోమంది రాష్ట్ర జాతీయ స్థాయి వేదికల్లో మెరిసి ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సాధించారు. పలు క్రీడాంశాల్లో నిరంతరం శిక్షణ ఇచ్చేవారు. జిల్లా కేంద్రం నుంచే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం క్రీడాకారులు వచ్చి తర్ఫీదు పొందేవారు. పలు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించిన చరిత్ర స్టేడియానికి ఉంది. అయితే ఇదంతా గతం.. దశాబ్ద కాలంగా ఈ మైదానంలో క్రీడా శిక్షణలు లేకపోవడంతో ఎంతోమంది ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాక కనుమరుగైపోతున్నారు. ఆడాలనే అభిలాష ఉన్నా సరైన వసతులు లేక క్రీడల్లో రాణించలేని పరిస్థితి. శిక్షణకు మంగళం.. గతంలో మైదానంలో కబడ్డీ, వాలీబాల్, జూడో, హాకీ, ఖోఖో వంటి క్రీడల్లో శిక్షణ అందించేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు ఒక్క శిక్షకుడు లేకపోవడం గమనార్హం. స్టేడియంలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు శిక్షకులను నియమించింది. అయితే క్రీడల్లో రాణించాలనే ఔత్సాహికులకు కోచ్లు లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. ఆదాయమే పరమావధిగా.. స్టేడియం నిర్వహణలో భాగంగా కాంట్రాక్టర్కు స్విమ్మింగ్ పూల్ నిర్వహణ అప్పజెప్పినట్లు అధి కారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు సంబంధించిన అభివృద్ధి దాఖలాలేవి కనిపించట్లేదు. గతంలో లీజుకు ఇచ్చిన సమయంలో స్టేడియంలో ఆశించదగ్గ ప్రగతి జరిగిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికీ స్టేడియానికి దుకాణ సముదాయాలతో ఆదాయం లభిస్తుంది. అయినప్పటికీ స్విమ్మింగ్ పూల్ నిర్వహణను ప్రైవేటుపరం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో విఫలయత్నం.. ఐపీ స్టేడియంలో పే అండ్ ప్లే విధానాన్ని గతంలో అందుబాటులోకి తీసుకోవచ్చారు. నిర్ణీత ఫీజు చెల్లించిన వారికి మాత్రమే మైదానంలోకి అనుమతించారు. అయితే క్రీడాకారులు, క్రీడా సంఘాల నుంచి విమర్శలు, పలువురు అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో వెనక్కి తగ్గారు. అంతేకాకుండా క్రీడాకారులు, వ్యాయామ సాధకులు విముఖత ప్రదర్శించడంతో డీఎస్ఏ అధికారులు తలొగ్గక తప్పలేదు.తాజాగా మళ్లీ అదే ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది. స్విమ్మింగ్పూల్ కాంట్రాక్టర్ చేతిలోకి.. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒకే ఒక్క స్విమ్మింగ్ పూల్ స్టేడియంలోనే ఉంది. అయి తే కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దీని నిర్వహణను రూ. 21లక్షలకు అద్దె ప్రాతిపదికన అప్పగించారు. గతంలో లీజులో కొనసాగిన సమయంలో నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగిందనే విమర్శలున్నాయి. తాజాగా మున్సిపల్ ఆధ్వర్యంలో లీజు విధానానికి సైతం స్వస్తి పలికి టెండర్ ద్వారా కాంట్రాక్టర్కు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. అవకాశం ఉంటే ప్రయత్నిస్తాం.. స్టేడియం నిర్వహణ, అభివృద్ధి కోసమే స్విమ్మింగ్ పూల్ కాంట్రాక్టర్కు అప్పగించడం జరిగింది. ప్రస్తుతమైతే స్టేడియంలో మరిన్ని అంశాలు, స్థలాలు టెండర్కు ఇచ్చే ప్రతిపాదనలైతే ఏమీ లేవు. ఏవైనా ప్రతిపాదనలో ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ దిశగా కృషి చేస్తాం. నిర్వహణకు సంబంధించి అవకాశం ఉంటే ప్రయత్నిస్తాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
కైలాస్నగర్: పైలెట్ ప్రజావాణిలో అందించే అర్జీలు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ రాజ ర్షి షా అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, జైనథ్ మండలాల జేఆర్వోలు, జిల్లాస్థాయి, ప్రత్యేక అధికారులు, గ్యాస్ డీలర్లతో పైలెట్ ప్రజావాణి అమలుపై సమీక్ష నిర్వహించారు. అందుతున్న అర్జీలు, పరిష్కారానికి చేపట్టిన చర్యలపై మండలాల వారీగా సమీ క్షించారు. గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, పింఛన్, గృహజ్యోతి అంశాలపైనే అధిక ఫిర్యాదులు అందుతున్నట్లుగా సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తూ బాధితుల సమస్యలు సత్వరం పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వినోద్కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎస్వో వాజీద్అలీ పాల్గొన్నారు. ఈవీఎంల గోదాం పరిశీలనజిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ఈవీ ఎంలను భద్రపర్చిన గోడౌన్ను కలెక్టర్ రాజర్షి షా శనివారం సందర్శించారు. నెలవారి సందర్శనలో భాగంగా స్ట్రాంగ్రూంలోని ఈవీఎంలను పరిశీలించారు. భద్రత సిబ్బందితో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ న వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాథోడ్ పంచపూల తదితరులున్నారు. -
నేమ్ విత్ సంథింగ్ స్పెషల్
హోటల్ మల్లేశ్ సిరికొండ: మండల కేంద్రానికి చెందిన రుద్రారపు మల్లేశ్ దశాబ్దాలుగా హోటల్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఏళ్లుగా ఇదే పనిచేస్తున్న ఇతడిని ఇంటిపేరు చెబితే ఎక్కువ మంది గుర్తుపట్టరు. అదే హోటల్ మల్లేశ్ అంటే మాత్రం టక్కున చెప్పేస్తారు. తన తండ్రి చాలాకాలం హోటల్ నడిపాడని, తానూ అదే కొనసాగిస్తుండడంతో ఆ పేరు కాస్త ఇంటిపేరుగా మారిందని అంటున్నాడు మల్లేశ్. కూరగాయల పోశెట్టి తాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన పాముల పోశెట్టి 35 ఏళ్లుగా కూరగాయలు సాగుచేస్తున్నా డు. వాటిని ప్రతిరోజు ఉదయాన్నే జిల్లా కేంద్రంలోని రైతుబజార్కు తీసుకువచ్చి విక్రయిస్తాడు. దశాబ్దాలుగా ఇదే పని చేస్తుండడంతో ఇతడిని కూరగాయల పొశెట్టిగా పిలుస్తుంటారు స్థానికులు. తన ఇంటిపేరు చాలా మందికి తెలియదని కూరగాయల పొశెట్టి అంటేనే గుర్తుపడతారని అంటున్నాడు ఇతడు. -
సమాజంలో ప్రతీ ఒక్కరికి ఓ పేరు ఉంటుంది. ఇందులో ఇంటి పేరును వ్యక్తి పేరు అనుసరిస్తుంది. కొందరికి మాత్రం తమ వృత్తి, ప్రవృత్తి, మర్చిపోలేని ఘటనలతో వచ్చే గుర్తింపు శాశ్వతమవుతోంది. అది ఏకంగా తమ ఇంటిపేరు స్థానంలో నిలిచిపోతుంది. వారికి ఆ పేరుతోనే ప్రత్యేకత లభిస్త
– ఆదిలాబాద్తెలంగాణ కిరణ్ నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి వెళ్లి కుంట కిరణ్ కుమార్రెడ్డి ఇల్లు ఎక్కడ అని అడిగితే గుర్తుపట్టేవారు తక్కువే. అదే తెలంగాణ కిరణ్ అంటే మాత్రం టక్కున చెబుతారు. గ్రామంలో ఈయన చిన్నప్పటినుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. పలు నిరసన కార్యక్రమాల్లో ముందుండి నినదించాడు. ఈ క్రమంలోనే ఈయన పేరు కాస్తా తెలంగాణ కిరణ్గా మారిపోయింది. 2001 నుంచి 2014 వరకూ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వడమే తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని సంతోషంగా చెబుతున్నాడు కిరణ్కుమార్రెడ్డి. -
బడి బాటలో బుక్స్
● జిల్లాకు చేరిన 84 శాతం పాఠ్యపుస్తకాలు ● మండల పాయింట్లకు సరఫరా షురూ జిల్లాలో.. మొత్తం పాఠశాలలు : 1,439 కావాల్సిన పాఠ్యపుస్తకాలు : 4,83,110 ఇప్పటివరకు చేరుకున్నవి : 4,05,700 ఇంకా రావాల్సినవి : 77,410 ఆదిలాబాద్టౌన్: పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందించేలా విద్యాశాఖ కసరత్తు చే స్తోంది. పాఠ్యపుస్తకాల సరఫరా సైతం ప్రారంభించారు. అయితే పూర్తిస్థాయిలో ఇంకా జిల్లాకు చేరుకోలేదు. మరాఠీమీడియం పుస్తకాలు ఒక్కటి కూడా రాకపోగా , హిందీ మీడియంకు సంబంధించి లాంగ్వేజ్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. జూన్ 12న పా ఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు అన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాలు అందించేలా చర్యలు చేపడుతామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా సర్కారు బడుల ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమి టీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తోంది. అలాగే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు సైతం బడులు తెరిచే రోజు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ పాఠ్యపుస్తకాల ప్రింటింగ్ ప్రెస్ నుంచి జిల్లాకు సరఫరా చేస్తుంది. జిల్లా కేంద్రంలో మూడు గోదాములు ఏర్పాటు చేసి వాటిని భద్రపర్చారు. వాటిని ప్రస్తుతం మండల పాయింట్లకు చేరవేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా ఆదివారం నుంచి మోడల్ స్కూళ్లకు ఈ ప్రక్రియ షురూ చేయనున్నారు. మరో రెండు రోజుల తర్వాత మండలాల వారీగా అందించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే వీటిని ట్రాన్స్పోర్టు చేసేందుకు నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు అయోమయంలో ఉన్నారు. రవాణా చార్జీలను పాఠ్యపుస్తకా ల సరఫరా ఇన్చార్జి వెచ్చించి స్కూళ్లకు పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. జిల్లాకు చేరిన 84శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాలో ప్రైవేట్ మినహా మిగతా అన్ని యాజమాన్యాలకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇప్పటివరకు జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను స్థానిక ఆర్వీ ఎం గోదాం, మార్కెట్ యార్డు, పాలశీతలీకరణ కేంద్రాల్లో భద్రపర్చారు. ఇంకా 77,410 వేల పుస్తకాలు రావాల్సిఉంది. మరో 24 రోజుల వరకు గడువు ఉంది. జిల్లా కేంద్రంలో భద్రపర్చిన పుస్తకాలను ప్రస్తు తం ఆయా మండలాల ఎమ్మార్సీలకు పంపిస్తున్నా రు. అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తున్నారు. వీటికి గాను రూ.3లక్షల 50వేల వరకు ట్రాన్స్పోర్టు చార్జీలు అవసరం కాగా, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు.ఎంఈవోలు, పాఠ్యపుస్తకాల గోదాం ఇన్చార్జీలు ఈ చార్జీలు భరిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిధులు వచ్చిన తర్వాత వారికి బిల్లులు అందించనున్నట్లు సమాచారం. చేరుకున్న పార్ట్–1 పుస్తకాలు ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో ఓ వైపు తెలుగు, మరో పక్క ఇంగ్లీష్లో పాఠాలను ముద్రించారు. ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో పార్ట్–1, పార్ట్–2గా విభజించి అందిస్తున్నారు. ప్రస్తుతం పార్ట్–1 పుస్తకాలు జిల్లాకు చేరుకోగా, పార్ట్–2 బుక్స్ ఆగస్టు, సెప్టెంబర్ వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని విభజించడం ద్వారా పుస్తకాల బరువు కూడా తగ్గింది. అయితే రెండేళ్లుగా విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఇది వరకు పాఠ్య పుస్తకాల గోదాం నుంచే వీటిని సరఫరా చేయగా ఈ ఏడాది హైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలలకే సరఫరా అవుతున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్నత తరగతులకు నోట్ బుక్స్ పంపిణీ చేయగా, ఈ సారి ప్రాథమిక తరగతులకు సైతం పంపిణీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. చేరని హిందీ, మరాఠీ మీడియం బుక్స్ జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 81,151 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియాలకు సంబంధించిన పుస్తకాలు 84శాతం వరకు చేరుకోగా, మరాఠీ మీడియంకు సంబంధించి ఏ ఒక్క తరగతికి పుస్తకాలు రాలేదు. హిందీ మీడియంలో కేవలం ఫస్ట్ లాంగ్వేజ్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. అలాగే మూడో తరగతి ఇంగ్లీష్, ఈవీఎస్ (ఇంగ్లీష్ మీడియం), నాల్గో తరగతి తెలుగు, ఆరో తరగతి గణితం (తెలుగు మీడియం), 7,8,9వ తరగతుల హిందీ, పదో తరగతి సాంఘిక శాస్త్రం, గణితం (ఇంగ్లీష్ మీడియం) పుస్తకాలు రాలేదు. అయితే బడులు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభించాం జిల్లాకు 84శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ఇప్పటికే కేజీబీవీలకు సరఫరా చేశాం. మోడల్ స్కూళ్లకు సరఫరా చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో మండలాల పాయింట్లకు పుస్తకాలను పంపిస్తాం. బడిబాట కార్యక్రమానికి ముందుగానే బుక్స్ చేరవేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. హిందీ, మరాఠీ మీడియం పుస్తకాలు జిల్లాకు చేరాల్సి ఉంది. – ఎన్. సత్యనారాయణ, పాఠ్యపుస్తకాల మేనేజర్, ఆదిలాబాద్ -
ముందస్తు చర్యలు చేపట్టాలి
● రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ● ప్రకృతి వైపరీత్యాలపై అధికారులతో సమీక్ష ఉట్నూర్రూరల్: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవీటీజీ, వరద ముంపు ప్రభావిత ప్రాంతాలపై ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్కలెక్టర్ యువరాజ్తో కలిసి సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకుంటున్న చర్యలను అడిగితెలు సుకున్నారు. గతంలో వరద ప్రభావిత ప్రాంతా ల్లో దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్ల మరమ్మతులు, నిధులు కేటాయింపు, నిర్మాణ పనుల వివరాలపై ఆరా తీశా రు. ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. అరవింద్ కుమార్కు స్వాగతం పలికిన కలెక్టర్ కైలాస్నగర్: రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ శనివారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక పెన్గంగ గెస్ట్హౌస్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఆర్డీవో వినోద్ కుమార్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో వేసవి వడగాలుల తీవ్రతను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలపై కలెక్టర్ ముఖ్య కార్యదర్శికి వివరించారు. -
కేసుల దర్యాప్తులో ప్రమాణాలు పాటించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: కేసుల దర్యాప్తు, పరిశోధనలో నా ణ్యత ప్రమాణాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. కోర్టుల్లో శిక్షల శాతం పెంచేలా దర్యాప్తు పరిశోధన నిర్వహించే అధికారులు, రైట ర్లకు పీపీ ద్వారా శనివారం ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మంది రంలో నిర్వహించిన కార్యక్రమానికి స్టేషన్, సీఐ ఆఫీస్ రైటర్లు, సీసీటీఎన్ఎస్, కోర్టు డ్యూటీ అధికా రులు ప్రత్యక్షంగా పాల్గొనగా.. ఎస్హెచ్వోలు, సీఐ లు, పోలీసు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సరైన దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసే క్రమంలో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇందులో పీపీ నవీన్కుమార్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి,డీసీఆర్బీ ఎస్సై మహేందర్పాల్గొన్నారు. తెలియని వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. వాట్సాప్, టెలీగ్రాం, సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్స్ ద్వారా మొబైల్ కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశముంటుందన్నారు. అప్రమత్తతోనే వాటిని అడ్డుకోవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లైతే వెంటనే 1930కి లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. గడిచిన వారంలో జిల్లా వ్యాప్తంగా 15 ఫిర్యాదులు అందాయన్నారు. -
అకాల వర్షం.. ఆగమాగం
● విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు ● తడిసిన వరి ధాన్యం, జొన్నలు ● రైతులకు తీవ్ర ఇబ్బందులుఆదిలాబాద్టౌన్/ఇంద్రవెల్లి/జైనథ్/తాంసి/ఉట్నూర్రూరల్: జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం రాత్రి అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులు తోడవడంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాలో 12.2 మి.మీ. వర్షం జిల్లాలో 12.2 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. సాయంత్రం 6నుంచి రాత్రి 10 గంటల వరకు వర్షం కురిసింది. ఇంద్రవెల్లి ఏరియాలో 28 వి ద్యుత్స్తంభాలు పడిపోయాయి. అలాగే ఉట్నూర్లో మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరగగా మూడు కండక్టర్లు కాలిపోయాయి. విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్ ఆయా ప్రాంతాలను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేశారు. అలా గే ఇంద్రవెల్లి, జైనథ్, ఉట్నూర్, బేల, సాత్నాల, ఇచ్చోడ తదితర కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు తెచ్చిన జొన్న పంట తడిసింది. దీంతో రైతులు వాటిని ఆరబెట్టారు. ● ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలపై చెట్లు పడిపోయాయి. క రెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డీఈ సుభాష్ ఆధ్వర్యంలో సిబ్బంది మరమ్మ తులు చేపట్టారు. మండలంలోని కేస్లాగూడలో వెడ్మ అంబాజీ, ధ ర్మసాగర్లో గోతి సర్ధార్, సాబ్లే జైత్రం, సాబ్లే లాల్సింగ్, గోతి సైనా బాయి, శ్యామ్రావ్, నాథ్సింగ్, రాజేందర్కు చెందిన ఇళ్ల పైకప్పులుదెబ్బతిన్నాయి. తమ కు పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ● జైనథ్, తాంసి మండలకేంద్రాల్లో మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన జొన్నలు వర్షానికి తడిసిపోయాయి. రైతులు టార్పాలిన్లు కప్పినా తడిసిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ● ఉట్నూర్ మండలకేంద్రంలోని గంగన్నపేట వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి ధాన్యం కొంతమేర తడిసింది. విషయం తెలుసుకున్న ఏపీడీ గోవింద్రావు అక్కడికి చేరుకొని ధాన్యాన్ని పరిశీలించారు. -
చిన్నయ్యగుట్టను చూసొద్దాం
లక్సెట్టిపేట: మండలంలోని హన్మంతుపల్లి గ్రామ పంచాయతీ పరిధి చల్లంపేట గ్రామశివారు అటవీప్రాంతంలో సుమారు 150 ఏళ్లక్రితం నుంచి చిన్నయ్యగుట్టపై చిన్నయ్య దేవుడు కొలువై ఉన్నాడు. గిరిజనుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచాడు. చారిత్రాత్మకంగా వెలిసిన చిన్నయ్య దేవుడిని గిరిజనులు, భక్తులు తరలివచ్చి పూజిస్తుంటారు. ప్రాచీనకాలంలో పాండవులు ఇక్కడ వ్యవసాయం చేసేవారు. ద్రౌపది స్నానం చేయడానికి కొల్లు గుంటలు, పరుపు బండపై వ్యవసాయం చేసినట్లు నాగళి సాళ్లు, గుడి లోపల దొనలో పట్టే మంచం దేవుని విగ్రహాలు ఉన్నట్లు ఇప్పటికి పూర్వీకులు చెబుతుంటారు. వర్షాకాలం ప్రారంభ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు దర్శనం కోసం వస్తుంటారు. రైతులు వరదపాశం బోనాలు వండి చిన్నయ్య దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. పంట పొలాలకు పురుగులు సోకితే ఇక్కడి తీర్థపు నీరు పొలాలపై చల్లితే పోతాయనే వారి నమ్మకం. అల్లుబండ..గుడిలో అల్లుబండకు ప్రత్యేక స్థానం. అక్కడికి వచ్చిన భక్తులు తమ మనసులో కోర్కెలు కోరుకుని అల్లుబండ లేపితే సులభంగా లేచినట్లైతే కోరిక నెరవేరుతుంది. అల్లుబండ బరువుగా ఉంటే కోరిక నెరవేరదని నమ్మకం. అల్లుబండ ప్రదేశం వద్ద భక్తులు వారి కోర్కెలు కోరుకుంటారు. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి అటవీప్రాంతంలో ఉన్న చిన్నయ్యగుట్టను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. రహదారి మధ్యలో మత్తడి నీటిని నిల్వచేయడంతోపాటు వాటికి అనుకూలంగా రోడ్డు ఏర్పాటు చేస్తే పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది. ఆలయానికి ప్రత్యేక హోదా లభిస్తుంది. గిరిజనుల ప్రత్యేక అలయం ప్రత్యేకంగా ఉంటుంది. భక్తుల సంఖ్య పెరుగుతుంది. – అన్నం చిన్నన్న, గ్రామస్తుడు, చందారం పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి గిరిజనుల ఆరాధ్యుడు చిన్నయ్యదేవుడు దర్శనం కోసం తరలివస్తున్న భక్తులు చిన్నయ్య దేవుడి ప్రత్యేకతపంట పొలాలు దుక్కి దున్నే ముందు దేవుడి దర్శనం చేసుకుంటారు. బండారు(పసుపు) తెచ్చుకుని ధాన్యం వేసేటప్పుడు అందులో కలిపి వ్యవసాయం సాగు చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత దినుసును దేవుడికి అప్పజెప్పి మొక్కిన మొక్కు చెల్లించుకుంటారు. వేసవికాలం ముగింపు సమయంలో చిన్నయ్య గుడి భక్తులతో కిటకిటలాడుతుంది. ఇలా వెళ్లాలి..పట్టణం నుంచి చందారం, హన్మంతుపల్లి, దౌడపల్లి, రంగపేట, జెండావెంకటాపూర్ గ్రామాల మీదుగా 10 కి.మీ దూరం వాహనాలపై చల్లంపేట వరకు చేరుకోవాలి. అక్కడి నుంచి అటవీ ప్రాంతంగుండా సుమారు 3 కి.మీ కాలినడకన వెళ్తే చిన్నయ్యగుట్ట దేవుడి గుడికి చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చేందుకు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. సమీప ప్రాంతంలో నీళ్ల సదుపాయం చిన్నపాటి బుగ్గవాగు లాంటిది ఉంటుంది. అందులోని నీటిని తాగడానికి వాడుతారు. ఇప్పటికి అక్కడ గిరిజనులే పూజార్లుగా కొనసాగుతుంటారు. ప్రతీ ఆది, గురువారాల్లో పూజలు నిర్వహిస్తారు. మేకలు, కోళ్లతో దేవుడికి మొక్కలు చెల్లించి ఆ తర్వాత వంట చేసుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. కాగా, బుగ్గవాగు ప్రాంతంపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఇటీవల రూ.కోటి నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేశారు. ఇంకా పనులు ప్రారంభించలేదు. -
కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య
తిర్యాణి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. మండలంలోని దేవాయిగూడ పంచాయతీ పరిధిలోని చందగూడ గ్రామానికి చెందిన కుర్సెంగ గోపాల్ (27) గత మూడేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. స్థానికంగా మందులు వాడినా నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో మనస్తాపం చెంది గురువారం మధ్యాహం గ్రామశివారులోని పంట చేనులో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని సోదరి అయిన కమలకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబీకులు ఘటన స్థలానికి చేరుకుని గోపాల్ను గోలేటిలోని సింగరేణి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తండ్రి రాము ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.పెళ్లి ఇష్టం లేక యువతి..ఖానాపూర్: పెళ్లిచేసుకోవడం ఇష్టం లేక యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం..మండలంలోని పాత ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెవాడకు చెందిన అల్లెపు పోశాని, రాజేందర్ దంపతుల కూతురు అక్షయ (18) ఇంటర్ చదువుతోంది. గతకొన్ని రోజులుగా యువతికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరగా యువతికి ఇష్టం లేదు. ఈక్రమంలో మనస్తాపంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతితిర్యాణి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని మార్కగూడ పంచాయతీ పరిధి వాడిగూడ గ్రామానికి చెందిన మెస్రం యేసు (50)గురువారం గృహ అవసరాల వస్తువుల కొనుగోలు కోసం బైక్పై తిర్యాణికి వచ్చాడు. తిరిగి రాత్రి ఇంటికి వెళ్తుండగా కై రిగూడ సమీపంలో రెండు ఎద్దులు పొట్లాడుకుంటూ వచ్చి అటుగా బైక్ను ఢీకొట్టాయి. యేసు తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చెలిమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమచికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు సంతోశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.గోదావరి నదిలో పడి యువకుడు..బాసర: బాసర గోదావరి నదిలో ప్రమాదవశాత్తు యువకుడి పడి మృతిచెందినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. ఆమె కథనం ప్రకారం..బిహార్ రాష్ట్రానికి చెందిన శర్మ దిల్కుష్(19) బాసరలో హమాలీ పనిచేస్తున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిరోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. శుక్రవారం బాసర గోదావరి రెండో ఘాట్ వద్ద స్నానాలు ఆచరించేందుకు కుటుంబ సభ్యులు రాగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. ఈత రాకపోవడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలించి యువకుడి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని భైంసా ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.రైలు ఢీకొని ఒకరు..కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రాళ్లపేట రైల్వేస్టేషన్ల మధ్య వంజీరి రైల్వేగేటు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. రైలు పట్టాలు దాటుతుండగా బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్లే రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ సురేష్ తెలిపారు. మృతుడికి 50 నుంచి 55 వయస్సు ఉంటుందని, బ్రౌన్, వైట్ లైనింగ్కలర్ ఫుల్షర్టు, సిమెంట్ కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.ట్రాక్టర్ కిందపడ్డ మహిళా కూలీ..ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ పంచాయతీ పరిధి గంగాయిపేట్ గ్రామ శివారులో ఇటుకబట్టి వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడ్డ గిరిజన కూలీ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాయిపేట్ గ్రామానికి చెందిన మేస్రం స్వప్న(35) ఇటుక బట్టి వద్ద ట్రాక్టర్లో ఇటుకలు నింపేందుకు వెళ్లింది. ఇటుకలు నింపిన తర్వాత ట్రాక్టర్ను వెనక్కి తీస్తుండగా ఆమెకు తగిలి కింద పండింది. ఆమె పై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నిర్మల్కు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది. స్వప్నకు భర్త, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే పీడీయాక్ట్
● మున్సిపల్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి రిమాండ్ ● ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలో కోట్ల రూపాయల మున్సిపల్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని భుక్తాపూర్కు చెందిన ఏ–2 అక్రమ్ మున్సిపల్ ఖాళీ స్థలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో తన బంధువు షాబొద్దీన్ పేరిట దస్తావేజులు సృష్టించినట్లు తెలిపారు. 35 ఏళ్లుగా అక్కడే ఉంటున్నట్లు ఇంటినంబర్ తీసుకున్నాడు. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో పలు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. భుక్తాపూర్లో 469.44 స్వేర్ యార్డ్స్ ఆక్రమించి ఇంటి నం.6–6–36/2/1 తీసుకున్నాడు. మున్సిపల్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిపై నాన్బెయిలబుల్ కేసులతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ల్యాండ్ మాఫియా, రౌడీలు గతంలో బెదిరింపులకు పాల్పడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే పోలీసులను ఆశ్రయించాలన్నారు. సమావేశంలో వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
నెన్నెల: మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన తోట వెంకటేశం వద్ద శుక్రవారం రూ.1.20 లక్షల విలువ కలిగిన 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. నందులపల్లిలో నకిలీ విత్తనాల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఏవో పుప్పాల సృజన ఫిర్యాదు చేయగా సోదాలు చేశామన్నారు. నందులపల్లి ప్రాజెక్టు ప్రాంతంలో 40 కిలోల విత్తనాలను తన చేనులో దాచేందుకు ప్రయత్నిస్తూ వెంకటేశం పట్టుబడ్డాడని చెప్పారు. మందమర్రికి చెందిన పిండి సురేశ్ వద్ద లూజ్ విత్తనాలు కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. రెండు విత్తన సంచులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. -
తప్పిపోయిన బాలుడి అప్పగింత
ఆసిఫాబాద్రూరల్: తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లికి శుక్రవారం అప్పగించినట్లు డీసీపీవో మహేశ్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తప్పిపోయి దక్షిణ ఎక్స్ప్రెస్ రైలులో కాగజ్నగర్ రైల్వే పోలీసులకు పట్టుకుని, ఈనెల 9న జిల్లా కేంద్రంలో బాల రక్షభవన్కు అప్పగించారు. రక్షభవన్ సిబ్బంది బాలుడికి కౌన్సెలింగ్ నిర్వహించి మాట్లాడి వారి సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాగా గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగా, తల్లి ఇక్కడకు రాగా, బాలుడిని అప్పగించినట్లు డీసీపీవో మహేశ్ తెలిపారు. సిబ్బంది శ్రావణ్, వ్రవీణ్ కుమార్, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. -
నిజాయతీ చాటుకున్న యువకుడు
బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుడు పోగొట్టుకున్న బ్యాగును యువకుడు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రకాశ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం బాసరకు వచ్చారు. గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు. మొదటి పుష్కర ఘాట్ వద్ద రెండు సెల్ఫోన్లు, బ్యాగును మరిచిపోయారు. అక్కడే ఉన్న యువకుడు మారుతి గమనించి ప్రకాశ్కు బ్యాగు, సెల్ఫోన్లు తిరిగి అప్పగించాడు. యువకుడిని స్థానికులు అభినందించారు. అధిక మద్యం తాగి ఒకరి మృతి జైనథ్: మండలంలోని బె ల్గాం గ్రామంలో అధిక మ ద్యం తాగి చౌహన్ (32)మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర నుంచి చౌహన్ ఇక్కడకు వలస వచ్చి రోజువారి కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి అధిక మద్యం తాగడంతో మృతిచెందినట్లు తెలిసింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని శాంతినగర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మచ్చ వీరయ్య (78) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. గురువారం రాత్రి బాత్రూమ్లో ఐరన్ రాడ్కు ఉరేసుకుని కనిపించాడు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కళ్లు సరిగ్గా కనిపించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
హాయ్.. అయాం పూజ అంటూ టోకరా
● మహిళల పేరిట చాటింగ్ ● కోరిక తీరుస్తామంటూ ఎర ● తీరా వచ్చాక నిలువు దోపిడీ ● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కొత్తపల్లి(కరీంనగర్): ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. మహిళల పేరిట యువకులతో చాటింగ్ చేస్తూ కోరికలు తీరుస్తామంటూ ఎరవేస్తున్నారు. ఈ ఓ వ్యక్తిని మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో వెలుగు చూసింది. ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నాడు. కొత్తపల్లి పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్కు చెందిన సరళ సందీప్(19), మల్కాపూర్ లక్ష్మిపూర్కు చెందిన పొన్నాల ప్రణయ్కుమార్(18), ఎండీ రెహాన్ జల్సాలకు అలవాటు పడి, దోపిడీలకు కొత్తరకం పన్నాగం పన్నారు. మహిళల పేరిట కోరిక తీరుస్తామంటూ వాట్సాప్లో యువకులకు మెసేజ్ చేస్తారు. ఆకర్షితులైన యువకులను చాటింగ్తో మభ్యపెడతారు. సరళ సందీప్ ఈ నెల 6న తన ఫోన్ ద్వారా మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి వాట్సాప్లో హాయ్ అయాం పూజ అంటూ మెసేజ్ చేశాడు. స్పందించి యువకుడు చాటింగ్ చేశాడు. కోరిక తీరుస్తానంటూ ఆశ చూపడంతో అది నమ్మి ఈ నెల 11న కరీంనగర్ వచ్చాడు. పథకం ప్రకారం దోపిడీకి సిద్ధమైన ముగ్గురు యువకులు కొత్తపల్లికి రప్పించారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై యువకుడిని వెలిచాల శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రెహాన్తో కలిసి యువకుడిని చిత్రహింసలకు గురి చేశారు. రూ.50వేలు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించడంతో తన వద్ద ఉన్న రూ.10వేలు ఇచ్చాడు. బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి మరో రూ.12వేలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ముగ్గురు నిందితులు సదరు యువకుడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు కొత్తపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎస్ సాంబమూర్తి ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం రేకుర్తి బస్టాండ్ ప్రాంతంలో సరళ సందీప్, పొన్నాల ప్రణయ్ కుమార్ను అరెస్టు చేశారు. రెహాన్ పరారీలో ఉన్నాడు. -
ఇక ఊరూరా క్షయ పరీక్షలు
సంవత్సరం టీబీ కేసులు2022 1565 2023 1476 2024 1602 2025 1038 (ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు)ఆదిలాబాద్టౌన్: టీబీ మహమ్మారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలో 2025 ముగిసే సరికి క్షయను సమూలంగా నిర్మూలించేందుకు కసరత్తు చేస్తోంది. వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో నిక్షయ్ శివిర్ వంద రోజుల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో సైతం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 522 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకనుంచి పల్లెల్లో ఇంటింటికీ టీబీ పరీక్షలు చేయనుంది. నిరంతర ప్రక్రియగా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే వైద్యాధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఊరూరా వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో టీబీని అంతమొందించే అవకాశం ఉంది. చాపకింద నీరులా.. టీబీ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చాలా మంది ప రీక్షలు చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చుట్టుపక్కల వా రికి సోకుతుంది. వ్యాధి సోకినవారు చికిత్స తీసుకో కపోవడంతో టీబీ ముదిరి మృత్యువాత పడుతున్నారు. 3 నుంచి 5 శాతం మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది. సకాలంలో మందులు వాడితే ఆరు నె లల్లోనే నయం అవుతుందని వైద్యులు సూచిస్తున్నా రు. టీబీలో రెండు రకాలు ఉండగా.. ఊపిరితిత్తులకు వచ్చిన టీబీ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుండగా, శరీరంలో ఇతర భాగాలకు వచ్చింది మాత్రం విస్తరించకుండా ఉంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 2వేల మందికి సోకగా, దాదాపు 25 మంది మృతి చెందినట్లు సమాచారం. సత్ఫలితాలు ఇవ్వడంతో.. టీబీ నిక్షయ్ శివిర్ వంద రోజుల కార్యక్రమం ఆది లాబాద్ జిల్లాతో పాటు భద్రాచలం, మెదక్, నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యపేట్లలో నిర్వహించారు. జిల్లాలో వంద రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్, వైద్య పరీక్షలు నిర్వహించారు. 4లక్షల 9వేల మందికి స్క్రీనింగ్ చేశారు. 10వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 522 మందికి టీబీ నిర్ధారణ అయ్యింది. 953 క్యాంపులు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వంద రోజుల్లో జిల్లా అంతటా కార్యక్రమాలు నిర్వహించలేక పోయారు. ఇకనుంచి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా చేపట్టనున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, టీబీ వ్యాధిగ్రస్తుల ఇంట్లో వారికి, 60ఏళ్లు పైబడిన వారికి, మద్యం, దూమపానం సేవించే వారు, బరువు తక్కువగా ఉన్నవారికి, అనుమానితులకు పరీక్షలు చేయనున్నారు. గ్రామాల్లోనే ఎక్స్రేలు.. గ్రామ గ్రామాన నిర్వహించే పరీక్షల్లో అక్కడే ఎక్స్రేలు తీయనున్నారు. హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే తెమడ సేకరించి ట్రూనాట్ యంత్రం ద్వారా పరీక్షలు చేస్తారు. ఆదిలాబాద్, నార్నూర్, ఉట్నూర్, జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,038 మంది టీబీ మందులను వాడుతున్నారు. ఈనెల 19న టీబీ ముక్త్ భారత్ అభియాన్కు శ్రీకారం ప్రణాళిక సిద్ధం చేస్తున్న వైద్యశాఖ వంద రోజుల కార్యక్రమంలో 522 మందికి వ్యాధి నిర్ధారణ టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కసరత్తుటీబీ నిర్మూలనే లక్ష్యం..టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నాం. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా పరీక్షలు చేయగా, 522 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో 2025 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించేందుకు టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతి ఒక్కరూ వైద్యపరీక్షలు చేసుకోవాలి. మందుల ద్వా రా వ్యాధి నయం అవుతుంది. అపోహలు వీడాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వోవ్యాధిగ్రస్తులకు ఉచిత చికిత్సటీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నాం. రిమ్స్, బోథ్, నార్నూర్, ఉట్నూర్ ఆస్పత్రుల్లో ట్రూనాట్ ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మందులు వాడితే ఆరు నెలల్లోనే వ్యాధి నయం అవుతుంది. వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నాం. – డాక్టర్ సుమలత, జిల్లా టీబీ నిర్మూలన అధికారి -
నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
● కలెక్టర్ రాజర్షి షా ● అధికారులతో సమీక్షకైలాస్నగర్: గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమ స్య తలెత్తకుండా చూడాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్వాటర్ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరా కోసం చేపట్టిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు 24 పనులు మంజూరు కాగా అందులో ఐదు పనులు పూర్తయ్యాయని మరో 11 పురోగతిలో ఉన్నాయని, 8 ప్రారంభం కాలేదని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి ముగిసేవరకు ప్రజలకు తాగునీటి సరఫరా లో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అవసరం ఉన్నచోట స్థానిక నీటి వనరులను, ట్యాంకర్లను వినియోగించుకోవాలని సూచించారు. మిష న్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంట్రా, గ్రిడ్, పంచాయ తీ, ఆర్డబ్యూఎస్ అధికారులు తమ శాఖల ప్రగతిని కలెక్టర్కు వివరించారు. ఇందులో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, సీపీవో వెంకట రమణ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ చంద్రమోహన్, గ్రౌండ్వాటర్ ఏడీ శ్రీవల్లి, డీఈలు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలి సాత్నాల: పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న భోరజ్ను రెవెన్యూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సద స్సుకు హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధి కారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తుల వెరిఫికేషన్ టీం ఇక అందుబాటులో ఉంటుందన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరి, నలందప్రియ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.డెంగీ నిర్మూలనకు చర్యలుఆదిలాబాద్టౌన్: జిల్లాలో డెంగీ నియంత్రణ కు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని కేఆర్కే కాలనీ బస్తీ దవాఖానాలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. కరపత్రాలు విడుదల చేశారు. టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. డెంగీ నివారణ, అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ నివారణ కు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఇందులో డీఎంహెచ్వో నరేందర్రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, టీబీ నిర్మూలన అధికారి సుమలత, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్ ● కొనుగోలుకు ఆసక్తి చూపని జనం ● రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రభావం ● గిరాకీ లేక వెలవెలబోతున్న దుకాణాలు
ఈ స్థాయిలో ధరలు తగ్గడం తొలిసారినేను 30 ఏళ్ల నుంచి బియ్యం అమ్ముతు న్నా. ఏటా వరి ధా న్యం చేతికచ్చినప్పటి నుంచి క్వింటాల్ ధర రూ.5వేలతో మొదలై బియ్యం పాతబడుతున్న కొద్ది వాటి ధర పెరిగేదే తప్పా తగ్గదే కాదు. పోయిన సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం క్వింటాల్కు రూ.1000 నుంచి రూ.1700 దాకా తగ్గినయ్. ఇన్నేళ్ల నా వ్యాపార జీవితంలో ఇంత ధర తగ్గడం తొలిసారి చూస్తున్న. సన్నబియ్యం విక్రయాలు 70 శాతం పడిపోయాయి. వ్యాపారం ఆశించినంత లేదు. – కిరణ్ కుమార్, బియ్యం వ్యాపారి, ఆదిలాబాద్ పంట దిగుబడి పెరగడంతోనే.. రాష్ట్రంలో సన్నరకం వడ్ల సాగు గణనీ యంగా పెరిగింది. దిగుబడి కూడా అధికమైంది. దీనికితోడు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోంది. గతంలో చాలా మంది రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతోనే బియ్యం ధరలు మార్కెట్లో గణనీయంగా పడిపోయాయి. షాపుల కిరాయిలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే కొనసాగితే దుకాణాలు మూసేయాల్సిందే. – సునీల్కుమార్, బియ్యం వ్యాపారి, ఆదిలాబాద్ కై లాస్నగర్: బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోల్చితే క్వింటాల్కు రూ.800 నుంచి రూ.1,600 వరకు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారా పే దలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లబ్ధిదారులు వీటి ని సద్వినియోగం చేసుకుంటుండగా.. మార్కెట్లో ధరలు దిగొస్తున్నాయి. గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. మరోవైపు ఈ స్థాయిలో ధరలు పడిపోవడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబు తున్నారు. ఇదీ పరిస్థితి.. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పేదలకు ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తి కి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తోంది. ఇవి నాణ్యతతో ఉండటంతో లబ్ధిదారులు వాటిని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకటో తారీకు వచ్చిందంటే చాలు షాపుల వద్ద బారులు తీరి మరీ తెచ్చుకుంటున్నారు. నెల మొదటి వారంలోనే 80 శాతం పంపిణీ పూర్తవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి సన్నరకాల వడ్లసాగును ప్రోత్సహిస్తోంది. రైతులకు క్వింటాల్కు రూ. 500 బోనస్ సైతం చెల్లిస్తోంది. తద్వారా సన్నాల దిగుబడి పెరిగింది. దీంతో ఇటు ప్రభుత్వం, అటు మిల్లర్లు పోటీపడి మరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తు న్న పరిస్థితి. ఈ క్రమంలో బియ్యం సరఫరా ఒక్కసారిగా పెరిగింది. అయితే రేషన్ పంపిణీ కారణంగాపేద,మధ్యతరగతి ప్రజలు మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. చేసేది లేక వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. గతేడాదితో పోల్చితే క్వింటాల్కు పాతవి రూ.800 నుంచి రూ.1600 వరకు, కొత్తవి రూ.1,250 నుంచి రూ.1,700 మేర ధర తగ్గడం గమనార్హం. తగ్గిన కొనుగోళ్లు.. గత ప్రభుత్వ హయాంలో తెల్లరేషన్ కార్డుదారులకు దొడు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో లబ్ధిదారులు వాటిని తినలేక రేషన్ డీలర్లకు తక్కువకు అమ్ముకుని మార్కెట్లో సన్నబియ్యం కొనుగోలు చేసేవారు. గతేడాది ప్రీమియం రకం (పాతవి) క్వింటాల్కు రూ.5,900 నుంచి నుంచి రూ. 6900 వరకు పలకగా.. ప్రస్తుతం ఇవి రూ.4,300 నుంచి రూ.6,100 వరకు లభిస్తున్నాయి. అలాగే కొత్తవి రకాన్ని బట్టి గతంలో రూ.5వేల నుంచి రూ.6,500 వరకు ధర పలకగా.. ప్రస్తుతం రూ.3,700 నుంచి రూ.5,250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో జిల్లాలోని బియ్యం విక్రయ దుకాణాలు వెలవెలబోయి దర్శనమిస్తున్నాయి. జిల్లాలో బియ్యం ధరల వివరాలు .. (ప్రస్తుతం, గతేడాది ఇదే సీజన్లో)బియ్యం రకం పాతవి కొత్తవి గతేడాది ప్రస్తుతం గతేడాది ప్రస్తుతం బీపీటీ రూ.5,900 రూ.4,300 రూ.5,000 రూ.3,700 హెచ్ఎంటీ రూ.6,100 రూ.4,700 రూ.5,800 రూ.4,100 జైశ్రీరామ్ రూ.6,900 రూ.6,100 రూ.6,500 రూ.5,250 -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
కై లాస్నగర్: ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న కలెక్టర్ రాజర్షి షాను కోరారు. గురువారం కలెక్టర్ను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన కళాశాలలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ కళాశాలకు స్థలం కేటాయించడంతోపాటు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బేల, ఇచ్చోడ మండలాల పరిధిలో మార్క్ఫెడ్ ద్వారా శనగలు విక్రయించిన రైతులకు డబ్బులు జమ చేయాలని కోరారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జైనథ్ మండలంలో 132/33 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరి ష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నట్లు జోగు రామన్న తెలిపారు. ఆయన వెంట మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీఆర్ఎస్ నాయకుడు కుమ్ర రాజు తదితరులున్నారు. -
గడువు పెంచినా గగనమే!
● ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుపై అనాసక్తి ● ఇప్పటికే మూడుసార్లు గడువు పెంపు ● రాయితీ ప్రకటించినా స్పందన కరువు కై లాస్నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం మ రో అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద 25శాతం రాయితీ ప్రకటించింది. ఫీ జు చెల్లింపు గడువు ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. అయినా ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. దీంతో క్రమబద్దీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఫీజు చెల్లింపునకు మరో 15రోజుల గడువు ఉండగా దరఖా స్తుదారుల్లో పెద్దగా స్పందన కనిపించడంలేదు. 25శాతం రాయితీతో ఓటీఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. రూ.వెయ్యి చెల్లించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారి ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. వేలల్లో దరఖాస్తులు రావడం, వాటి పరిశీలనకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వి భాగంలో తగినంత సిబ్బంది లేక ప్రక్రియ మందకొడిగా సాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక ఎల్ఆర్ఎస్ నిబంధనలు సడలించింది. గ తంలో దరఖాస్తు చేసుకున్న వారితోపాటు అక్ర మ లేఅవుట్లలో 10శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయితే విక్రయించకుండా ఉన్న ప్లాట్లకూ అవకాశం కల్పించింది. ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్టైం సెటిల్మెంట్ అవకాశం కూడా కల్పించింది. పదేపదే గడువు పెంచినా.. ఎల్ఆర్ఎస్కు 25శాతం ఫీజు రాయితీ ప్రకటించి న ప్రభుత్వం తొలుత మార్చి 31వ తేదీ వరకు గడువు విధించగా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరోసారి ఏప్రిల్ 30వరకు గడు వు పొడిగించింది. అయినా నామమాత్రంగానే స్పందన వచ్చింది. దీంతో ఈ నెల 3వ తేదీ వరకు మళ్లీ గడువు పెంచినా ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 31వ తేదీ వరకు చెల్లింపు గడువు పెంచుతూ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసింది. కారణాలనేకం.. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరి దిద్దాల్సిన అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, ఫీజు చెల్లించినా సకాలంలో ప్రొసీడింగ్లు అందించకపోవడం, ఎల్ఆర్ఎస్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడం లాంటి కారణాలతోనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపునకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఖ జానాకు అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ఫీజు చెల్లింపు ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.7.60 కోట్ల ఆదాయమే సమకూరింది. పరిశీలనలోనూ జాప్యం రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల అధి కారులు, సిబ్బంది వివిధ దశల్లో ప్లాట్లను పరిశీ లించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చెరువు శిఖం, బఫర్ జోన్లను నీటి పారుదల శాఖాధికారులు గుర్తించాల్సి ఉండగా ప్రభు త్వ, అసైన్డ్ ఇతర వివాదాస్పద భూములను రెవె న్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి మున్సి పల్ అధికారులకు వివరాలు అందించాల్సి ఉంది. వాటిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత బల్దియా అధికారులు క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమవడం, ఎల్ఆర్ఎస్ ప్లాట్ల పరిశీలనలో జాప్యం చేస్తుండటం కూడా క్రమబద్ధీకరణ ప్రక్రియపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ పరిధిలోని వార్డులు : 49 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు : 22,489 ఫీజు చెల్లించినవారు: 4,369 జారీ చేసిన ప్రోసిడింగ్లు: 2,015 ఫీజు రాయితీని సద్వినియోగం చేసుకోవాలి 25శాతం ఫీజు రాయితీతో ప్లాట్లు క్రమబద్ధీ కరించుకునే గడువు ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించింది. ప్లాట్లు క్రమబద్ధీకరించుకుంటే భవన నిర్మాణాలకు అనుమతులు పొందవచ్చు. ప్రక్రియపై దరఖాస్తుదారుల కు ఎలాంటి సందేహాలున్నా కార్యాలయంలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలి. – సుమలత, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆదిలాబాద్ -
మార్పునకే రైతుల ఆసక్తి
అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పరిగణనలోకి తీసుకున్న రైతులు వానాకాలంలో స్వల్ప కాలిక పత్తి విత్తనాల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. యాసంగిలో అదనపు పంట సాగు చేయాలనే దృక్పథం రైతుల్లో కనిపిస్తోంది. గతంలో దీర్ఘకాలిక రకాన్ని వేసి యాసంగి లోనూ దానికే నీటి తడులు అందించడం ద్వారా కొద్దిపాటి దిగుబడి తీసేవారు. వా నాకాలంలో స్వల్పకాలిక పత్తి రకం చేసి యా సంగిలో రెండో పంట తీయడమే లాభసాటి కావడంతో రైతులు కోరుకుంటున్నారు. – వివేక్, ఆదిలాబాద్ అర్బన్ ఏవో -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నా లుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 చట్టా లను యథావిధిగా కొనసాగించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేశ్ డిమాండ్ చే శారు. జిల్లా కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎర్రజి హరీశ్, నాయకులు అంకిత్, విక్రమ్ ఉన్నారు. ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో గు రువారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్య తిరేకంగా కార్మికులంతా పోరాడాలని పిలుపునిచ్చా రు. నాయకులు గౌరాల సుభాష్, మారుతి, నర్సింగ్, దేవిదాస్, రాజు, విక్రమ్ తదితరులున్నారు. కార్పొరేట్లకు అనుగుణంగా 29 కార్మిక చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం సమంజసం కాదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగ భద్రతను కేంద్రం దూరం చేస్తోందని ఆరోపించారు. కార్మికులంతా ఐకమత్యంతో పోరాడి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తా త్రే, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, నాయకులు రేసు సురేందర్, పండుగ పోచన్న, కే రమేశ్, ఆశన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నేళ్ల స్వామి, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల జాబితా సిద్ధం చేయాలి
కై లాస్నగర్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను నాలుగు రోజుల్లో పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూ చించారు. ఇందుకోసం రెండు షిఫ్ట్లుగా ఆపరేటర్ల ను నియమించుకుని ఈ నెల 19లోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, బ్యాంక్ అధి కారులు, మండల ప్రత్యేకాధికారులతో సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశీలించిన దరఖాస్తులపై రోజు వారీ నివేదిక అందించాలని సూచించారు. మండల స్థాయిలో పరిశీలించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత బ్యాంకులకు పంపించాలని తెలిపారు. జి ల్లావ్యాప్తంగా 48,296 దరఖాస్తులు రాగా 43,417 (డెస్క్ వెరిఫికేషన్) దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. 32,283 దరఖాస్తులను బ్యాంక్లకు పంపించినట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్లు పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి సోమవారంలోపు జాబితా అందించాలని ఆదేశించారు. బ్యాంకుల ద్వారా జాబితా పూర్తయిన అనంతరం ఎంపీడీవోలు తుది జాబితా తయారు చేసి పంపించాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో కుష్బు గుప్తా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావు, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్కుమార్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా రాజీవ్ యువ వికాసంపై సమీక్ష -
ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా ప్రమోషన్
ఆదిలాబాద్టౌన్: ఏడుగురు ఏఆర్ కానిస్టేబు ళ్లకు హెడ్కానిస్టేబుల్గా ప్రమోషన్ లభించింది. హెడ్కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన ఎన్.కిషన్రావు, ఎం.అశోక్, జే దుదిరామ్, ఆర్.గోవింద్, ఎల్.దినేశ్, ఎన్.అరవింద్, ఆర్.రామారావు గురువారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వీరికి ప్రమోషన్ చిహ్నం అలంకరించి అభినందనలు తెలిపారు. వీరిని జోన్ పరిధిలోని నిర్మల్, జగిత్యాల జిల్లాలకు బదిలీ చేశారు. అడిషనల్ ఎస్పీ సురేందర్రావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు. అటవీ అధికారులతో రైతుల వాగ్వాదంనేరడిగొండ: మండలంలోని పీచర, రాంపూర్ గ్రామాల రైతులకు సంబంధించిన అటవీ భూ ముల్లో రెండురోజులుగా అటవీ అధికారులు వి త్తనాలు చల్లడంతో గురువారం ఇరువర్గాల మ ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో అ టవీ హక్కుపత్రాలున్న ఆదివాసీ రైతులకు చెందిన 15 ఎకరాల్లో అటవీ అధికారులు విత్తనా లు చల్లారని రైతులు ఆరోపించారు. దీంతో గు రువారం గ్రామస్తులు, అధికారులకు మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. రైతులు ఎమ్మెల్యే అ నిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. డీఎఫ్వోతో మాట్లాడుతానని చెప్పినట్లు రైతులు తెలిపారు. -
‘లంబాడీలపై సవతి తల్లి ప్రేమ’
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలో లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చౌహాన్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని విజయ్నగర్ కాలనీ సేవాలాల్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీలకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు అధికారులు ఇష్టారీతిన నిబంధనలు విధించడం సరికాదని పేర్కొన్నారు. భవిష్యత్లో లంబాడీలపై వివక్ష చూపిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పాక్స్ చైర్మన్ అడే సురేశ్, సేవాలాల్ మహరాజ్ ఉత్సవ సమితి ఉట్నూర్ అధ్యక్షుడు జాదవ్ మధుకర్, నాయకులు అడే డిగంబర్, కై లాస్నాయక్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పథకాలను వినియోగించుకోవాలి
ఆదిలాబాద్టౌన్: సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికా రి మిల్కా సూచించారు. జిల్లా సంక్షేమాధికా రి కార్యాలయంలో గురువారం ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్లంతా ఐడీ కార్డు తీసుకోవాలని, ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరిలో రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న మైత్రి క్లినిక్ ద్వారా మంగళ, గురువారాల్లో సేవలందించనున్నట్లు తె లిపారు. ధ్రువపత్రాలు తీసుకోవడంలో ఇ బ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ట్రాన్స్జెండర్లు కామేశ్వరి, అలిజా, హర్షిత, కావ్య, మైత్రి క్లిని క్ కౌన్సిలర్ లావణ్య, యశోద, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్స్టేషన్ కోసం స్థల పరిశీలన
ఇంద్రవెల్లి: మండలంలోని దనోరా(బీ) గ్రా మంలో సబ్స్టేషన్ నిర్మాణానికి గురువారం విద్యుత్శాఖ డీఈ ప్రభాకర్ స్థలాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.10కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేసిందని తెలిపా రు. త్వరలో పనులు పూర్తి చేసి వినియోగదా రులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని పే ర్కొన్నారు. కొత్తగా సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే హీరాపూర్లోని సబ్స్టేషన్పై భారం తగ్గుతుందని తెలిపారు. గ్రామాలు, వ్యవసాయ బావుల వరకు కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఇంద్రవెల్లి ఏఈ జాదవ్ రోహిదాస్, మాజీ సర్పంచ్ యేర్మ జాకేశ్వర్, అధికారులు పాల్గొన్నారు. -
ఆదివాసీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు
బోథ్: జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో మండలంలో ని పట్నాపూర్లో నిర్మల్లోని స్వప్న ఆసుపత్రి సహకారంతో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యు వత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. లైసెన్స్ ఉంటేనే వాహనాలను నడపాలని, ఖచ్చితంగా హెల్మట్ ధరించాలని పేర్కొన్నా రు. అనంతరం వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ వెంకటేశ్వరరావ్, ఎస్సై ప్రవీణ్ కుమార్, బోథ్ సీహెచ్సీ సూపరింటెండెంట్ రవీంద్ర ప్రసాద్, ఏజీపీ శంకర్, వైద్యులు శశికాంత్, స్వప్న, మల్లేశ్, సచిన్ బాబు, ధృవన్ కుమార్, రాహుల్, దినేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘ఆమె’కు అండగా..
● 8,439 సంఘాలు.. రూ.275 కోట్లు ● జిల్లా బ్యాంకు లింకేజీ రుణలక్ష్యం ఖరారు ● మండలాల వారీగా టార్గెట్లు నిర్దేశం ● మహిళల ఆర్థికాభ్యున్నతికి దోహదం కైలాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందజేస్తోంది. కుటీర పరిశ్రమల ఏర్పాటుతో పాటు వివిధ వ్యాపారాల్లో రాణించేలా బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఎస్హెచ్జీ సభ్యులు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం ఏటా రుణ లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని ఖరారు చేసింది. జిల్లాలోని 8,439 సంఘాలకు గాను రూ.275.50 కోట్లను బ్యాంకు లింకేజీ ద్వారా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేసి జిల్లాకు పంపించింది. దాన్ని సాధించే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా.. అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో సంఘానికి రూ. 2లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందించనున్నారు. వీటితో కిరాణ, వస్త్ర దుకాణాలు, టైలరింగ్ యూనిట్లు, నాటు కోళ్లు, చేపల పెంపకం, కూరగాయల సాగు, పండ్ల విక్రయాలు, ఫుడ్ క్యాటరింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ, టిఫిన్ సెంటర్ల నిర్వహణ వంటి పలు రకాల వ్యాపారాలతో ఉపాధి పొందనున్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో వారు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను వందశాతానికి మించి సంఘాలకు రుణాలు అందజేశారు. జిల్లాలోని 8,993 సంఘాలకు గాను రూ.274.80 కోట్లను బ్యాంకు లింకేజీ కింద అందించేలా ప్రణాళిక ఖరారు చేశారు. అందులో 4,072 సంఘాలకు గాను రూ.285.50 కోట్ల రుణాలు అందజేశారు. లక్ష్యానికి మించి మరో రూ.10.70లక్షలు అందజేశారు. ఈ క్రమంలో గతేడాదితో పోల్చితే కొంత పెంచి ఈ సారి రుణ లక్ష్యం ఖరారు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో రూ.70లక్షలు అదనంగా సంఘాలకు అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, వాటికి కేటాయించిన నిధుల వివరాలు మండలం స్వయం కేటాయించిన సహాయక నిధులు సంఘాలు (రూ.లక్షల్లో ) ఆదిలాబాద్రూరల్ 464 1,818.58 బజార్హత్నూర్ 477 1,644.29 బేల 518 1,676.62 భీంపూర్ 439 909.77 బోథ్ 785 2,674.45 గాదిగూడ 263 578.06 గుడిహత్నూర్ 501 1,608.23 ఇచ్చోడ 599 2,094.63 ఇంద్రవెల్లి 517 1,300.29 జైనథ్ 704 2702.69 మావల 88 289.23 నార్నూర్ 447 1276.44 నేరడిగొండ 569 1834.30 సిరికొండ 269 710.52 తలమడుగు 593 2,196.16 తాంసి 330 1,073.90 ఉట్నూర్ 876 3,162.49 మహిళలు ఆర్థికంగా ఎదగాలి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. రుణాలు పొందిన మహిళలు వ్యాపారాలు ప్రారంభించి స్వయం సమృద్ధి సాధించేలా ముందుకు సాగాలి. రుణ వడ్డీలు ఎప్పటికప్పుడు చెల్లించినట్లైతే కొత్త రుణాలు పొందేందుకు అవకాశముంటుంది. గతేడాది లక్ష్యానికి మించిఅందజేశాం. ఈ సారి కూడా కేటాయించిన లక్ష్యాలను వందశాతం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. – రాథోడ్ రవీందర్ ,డీఆర్డీవో -
భూభారతితో సమస్యలు పరిష్కారం●
● కలెక్టర్ రాజర్షిషా సాత్నాల: భూభారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలంలోని పెండల్వాడ, హషింపూర్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. ఎలాంటి భూసమస్యలు ఉన్నా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించా రు. అలాగే మండలంలోని గూడ గ్రామంలో ని ర్వహించిన సదస్సుకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి హాజరయ్యారు. వచ్చిన 136 దరఖాస్తులను పరిశీలించారు. ఇందులో తహసీల్దార్ రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
గిరి‘జనులకు’ రైలు కూత!
● మంచిర్యాల–ఉట్నూరు– ఆదిలాబాద్కు ముందడుగు ● నిజామాబాద్–నిర్మల్, పటాన్చెరు–ఆదిలాబాద్ దాకా ● కొత్త లైన్లకు ఇంజినీరింగ్, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ప్రతిపాదనలు ● పింక్బుక్ 2025–26లో నిధులు అంచనా వేసిన రైల్వేశాఖ ● పట్టాలెక్కితే ఏజెన్సీ ప్రాంతవాసులకు రైలు యోగం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజన ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ముందడుగు పడింది. తొలిసారిగా ఉమ్మడి జిల్లా గిరిజన, అడవుల వెంట రైలు మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. ఈమేరకు 2025–26 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్ కేటాయింపులు తెలిపే కీలక పింక్బుక్లో వెల్లడించింది. గత ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తాజాగా రైల్వే శాఖ ఈ బుక్లో ఉమ్మడి జిల్లాకు పలు కొత్త మార్గాలు, ట్రాఫిక్ సర్వేల కోసం నిధుల ప్రతిపాదనలు ఉన్నాయి. భవిష్యత్లో కాజిపేట–బల్లార్షా 234కి.మీ. నాలు గో లైన్ సర్వేకు రూ.4.68కోట్లు, వన్యప్రాణులకు ప్రాణనష్టం జరగకండా బల్లర్షా, ఆసిఫాబాద్ రోడ్ వరకు రైల్వే పట్టాల ఫెన్సింగ్కు నిధులు ప్రతిపాదించారు. మంచిర్యాల టు ఆదిలాబాద్ వయా ఉట్నూరు మంచిర్యాల నుంచి వయా ఉట్నూరు ఆదిలాబా ద్ దాక ప్రతిపాదిత కొత్తమార్గం 186కి.మీ నిడివి. ఇందుకు రూ.వంద కోట్లు అంచనా ప్రతిపాదించారు. ఈ లైను ఏర్పాటు కోసం భూమి, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ఈ నిధులు వెచ్చించనున్నా రు. కొత్తగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ మధ్య మార్గం 125కి.మీ. కోసం ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే కోసం రూ.31లక్షలు, మరో కొత్త మార్గమైన పటాన్చెరు(నాగలపల్లి) వయా బోధ న్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు ఫైనల్ లొకేషన్ సర్వే 317కి.మీ కోసం రూ.7.92కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్–పింపల్కుటి 183కి.మీ ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.3.66కోట్లు, ఆది లాబాద్–గడ్చాందూర్ 70కి.మీ సర్వేకోసం రూ. 1.75కోట్లు, యావత్మాల్–ఆదిలాబాద్– వయా గంటిజి, పందర్కావందన్, చానఖా వరకు 100కి.మీ సర్వే కోసం రూ.25లక్షలు, సికింద్రాబాద్–ముత్కేడ్– ఆదిలాబాద్ 420కి.మీ ఇంజనీరింగ్, ట్రాఫిక్ ప్రాథమిక డబ్లింగ్ సర్వేకు రూ.1.64కోట్లు ప్రతిపాదించారు. ఆర్వోబీలు, స్టేషన్ల ఆధునికీకరణ ఆర్వోబీలు, వంతెనలకు ఆర్ఆర్ఎస్కే(రాష్ట్రీయ రేల్ సంరక్ష కోశ్), ఆర్ఎస్ నిధులు(రైల్వే సేఫ్టీ ఫండ్) కేటాయిస్తుంది. ఆదిలాబాద్ యార్డు–రో డ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) లెవల్ క్రాసింగ్కు రూ.5. 69కోట్లు, ముత్కేడ్ ఆదిలాబాద్ పింపల్కుట్టి 68కి.మీ. రూ.4.71కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ 8.16కి.మీ. రూ.1.04కోట్లు, ఆర్ఆర్ఎస్కే రూ. 1.93కోట్లు, ఆర్ఎస్ఎఫ్ రూ.9.73కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ ఘాట్సెక్షన్లో ఆర్ఆర్ఎస్కే నుంచి రూ.6.40కోట్లు, ఆదిలాబాద్ పిట్లైన్ నిర్మా ణం కోసం మూలధన నిధులు రూ.22. 28కో ట్లు, మంచిర్యాల–పెద్దంపేట మధ్య మూడో లైనుకు 4.37కి.మీ, మంచిర్యాల జిల్లా తాండూ రు మండలం రేచ్నీ, రేపల్లెవాడ మధ్య రోడ్ కొత్తగా అండర్ బ్రిడ్జికి రూ.7.64కోట్లు, ఆది లాబాద్ రైల్వేస్టేషన్లో భవనాలు, మరుగుదొడ్లు, విస్తరణ అభివృద్ధి కోసం రూ.4.44కోట్లు, ‘అమృత్’ స్కీం కింద ఆదిలాబాద్ స్టేషన్లో ఎఫ్వోబీ(ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం, దివ్యాంగుల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లకు ఎంపిక చేశారు. స్టేషన్లో లెస్ ట్రాక్, క్విక్ వాటరింగ్ కోసం రూ.14.95కోట్లు, ప్లాట్ ఫాంలపైన కవర్ నిర్మించేందుకు రూ.4.61కోట్లు ప్రతి పాదించారు. మంచిర్యాలకు అమృత్ స్కీం కింద నిధులు ప్రతిపాదించారు. కార్యరూపం దాల్చితేనే.. నిధుల ప్రతిపాదనలతో సరిపెట్టకుండా ఆ మేర కు మంజూరు చేసి కార్యరూపం దాల్చితేనే కొత్త మార్గాల్లో రైలు ప్రయాణ యోగం కలుగనుంది. గత కొన్నేళ్లుగా రైల్వేలో ఫైనల్ లొకేషన్ సర్వే జరి గిన పనులు సైతం ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు. తాజా ప్రతిపాదిత రైలు మార్గాలు అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలతోపాటు అనేక గిరి జన ప్రాంతాల నుంచి వెళ్లనుంది. దీంతో భూ సేకరణ, అటవీ అనుమతులు, పరిహరం రూ. వందల కోట్లలోనే ఉండనుంది. ఈ నేపథ్యంలో కేవలం పింక్బుక్లో కాగితాలపైనే సరిపెడితే మారుమూల ప్రాంతాలకు రైలు కూత అందని ద్రాక్షగానే మారనుంది. -
● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు నిబంధనల్లో మార్పులు ● కొత్త ఏజెన్సీలకు మినహాయింపు ● టెండర్లు తెరిచిన అధికారులు ● కొనసాగుతున్న పత్రాల పరిశీలన ● త్వరలోనే ఎంప్యానల్మెంట్ ఖరారు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంప్యానల్మెంట్ గుర్తింపు అంశంలో అధికారులు ఎట్టకేలకు సడలింపులు ఇచ్చారు. నిబంధనల్లో మార్పులు చేశారు. అనంతరం టెండర్లు తెరిచి పత్రాలను పరిశీలన ప్రక్రియ చేపట్టారు. త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. నిబంధనల్లో మార్పులిలా.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్ కలిగి ఉండాలి.. వంద మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం ఉండాలి.. ఇది టెండర్ నోటిఫికేషన్లో పొందుపర్చిన నిబంధనలు.. వీటిపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి.. ‘సాక్షి’లో దీనిపై ఈనెల 9, 13 తేదీల్లో ‘అంతా మా ఇష్టం’.. ‘టెండర్ వివాదాస్పదం’ శీర్షికలతో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇటీవల ప్రజావాణిలో కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు ఈ నిబంధనలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో పరిశీలన చేయాలని కలెక్టర్ రాజర్షిషా అప్పుడే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ రెండు అంశాల్లో కొత్త ఏజెన్సీలకు మినహాయింపు ఇచ్చారు. 29 దరఖాస్తులు రాక.. జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 2 నుంచి 13వరకు జిల్లా ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 32 దరఖాస్తులు విక్రయించగా, 29 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఈ టెండర్లు తెరిచారు. కమిటీకి కన్వీనర్ కమ్ మెంబర్ అయిన ఉపాధి కల్పనశాఖ ఇన్చార్జి అధికారి మిల్కా, సభ్యులైన కార్మికశాఖ అధికారులు ముత్యం రెడ్డి, రాజలింగు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఆ ఏజెన్సీలకు సంబంధించి డీడీ నంబర్, సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ, పాన్కార్డు, వారు పొందుపర్చిన కమీషన్ పర్సెంటేజ్ వంటి వివరాలు పరిశీలించారు. ఈ సర్టిఫికెట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా.. లేదా అనే దానిపై సూక్ష్మంగా పరిశీలన చేసిన తర్వాత కొత్త ఎంప్యానల్మెంట్కు ఎంపికయ్యే ఏజెన్సీల పేర్లను ప్రకటించనున్నారు. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పత్రాలను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులులోకల్.. నాన్లోకల్ లొల్లి దరఖాస్తుదారుల్లో లోకల్, నాన్లోకల్ లొల్లి మొ దలైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ఏజెన్సీ నిర్వాహకులు కొత్త ఎంప్యానల్మెంట్లో గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్థానిక ఏజెన్సీల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇ తర జిల్లాలో తాము దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లినప్పుడు వారు విభేదిస్తూ తమను దూరంగా ఉంచుతున్నారని, అలాంటప్పుడు జిల్లా అధికారులు ఈ విషయంలో పరిశీలన చేసి ఇక్కడ కూడా నాన్లోకల్ ఏజెన్సీలను గుర్తించవద్దని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంత మంది అధికారులే నాన్లోకల్ ఏజెన్సీలకు వంత పాడుతున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా ఈ ఏజెన్సీలతో ఆ అధికారులకు సంబంధం ఉందని పలువురు స్థానిక ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.పరిశీలిస్తున్నాం.. దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీలలో వారికి అన్ని విధాలా అర్హత ఉందా.. లేదా అనేది పరిశీలన చేస్తాం. నాన్లోకల్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవద్దని నిబంధన లేదు. టెండర్ నిబంధనలో పొందుపర్చిన అంశాల్లో కొత్త ఏజెన్సీలకు టర్నోవర్, పోస్టుల నిర్వహణలో అనుభవాన్ని మినహాయించాం. పాత ఏజెన్సీలకు మాత్రం ఈ నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయి. గతంలో వివిధ ఏజెన్సీలు ఉద్యోగులకు వేతనాలు సరిగ్గా చెల్లించని అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీ డిపాజిట్ కింద ఈఎండీ రూ.5లక్షలను ఖరారు చేశాం. – మిల్కా, ఉపాధికల్పన జిల్లా ఇన్చార్జి అధికారి, ఆదిలాబాద్ -
నేటితో ముగియనున్న ఫిట్నెస్ గడువు
ఆదిలాబాద్టౌన్: బడి బస్సుల భద్రమెంతా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. స్కూల్ పిల్లలను తీసుకెళ్లాల్సిన సంబంధిత వాహనాల కండీషన్ దారుణంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన పాఠశాల యాజమాన్యాలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. కాలం చెల్లిన వాటిని రోడ్లపై తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో జిల్లాలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నేటితో బడి బ స్సుల ఫిట్నెస్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ మంగళవారం జిల్లాలోని ఆయా పాఠశాలల స్కూల్ యా జమాన్యాలు, బస్సు డ్రైవర్లు, అటెండర్లతో సమావే శం నిర్వహించారు. బస్సుల నిర్వహణ, తదితర వి షయాలపై సమీక్షించారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభంప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో స్కూల్ బస్సులు మూలనపడ్డాయి. చాలావరకు మరమ్మతులో ఉన్నాయి. చిరిగిన సీట్లు, పగిలిన అద్దాలు, అరిగిన టైర్లు, ఫిట్నెస్ లేకపోవడం, కాలం చెల్లినవే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడి బస్సులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాల్సిన ప్రైవేట్ యాజమాన్యాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఫిట్నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణాశాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.నిబంధనలు బేఖాతరు..పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోగా ఆయా బస్సులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంటుంది. సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర అన్నీ సక్రమంగా ఉన్నాయా.. లేదా.? అనేది చూసుకోవాలని రవా ణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. స్కూల్ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్ వయసు 60 ఏళ్లు మించొద్దు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. అలాగే వాహనంలో విద్యార్థుల వివరాలు పట్టిక నమోదు చేసి ఉంచాలి. బస్సును 15ఏళ్లు మించి నడపరాదు వంటి తదితర నిబంధనలున్నాయి. అయితే జిల్లాలో మాత్రం చాలా పాఠశాలలు వీటిని పట్టించుకోవడం లేదు. కండీషన్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నారు. గతంలో ప్రమాదాలు సైతం చోటు చేసుకున్న ఘటనలున్నాయి. ప్రమాదాలు జరగకముందే అప్రమత్తంగా ఉండాల్సిన ఆ శాఖ అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత వారం పాటు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి.ముగియనున్న ఫిట్నెస్ గడువు జిల్లాలో 167 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇందులో 45వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సగానికిపైగా స్కూల్ బస్సుల్లోనే ఇంటికి రాకపోకలకు సాగిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 123 ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు సంబంధించి 140 బస్సులు ఉన్నాయి. వీటికి మే 15 వరకు ఫిట్నెస్ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు కూడా ఇన్సూరెన్స్ ముగిసింది.ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం..ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించాలి. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డు పైకి వస్తే సీజ్ చేస్తాం. నిబంధనలకు సంబంధించి డ్రైవర్లు, యాజమాన్యాలకు అవగాహన కల్పించాం. భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతాం. స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదు.– సీపెల్లి శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖ అధికారి -
కేయూ తీరు.. విమర్శల పాలు
● నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ● ఒకరోజు ముందు హాల్టికెట్లు.. చివరి నిమిషంలో కేంద్రాల మార్పు ● మాది ఏ సెంటర్ అంటూ విద్యార్థుల్లో గందరగోళం బోథ్: డిగ్రీపరీక్షల విషయంలో కాకతీయ యూని వర్సిటీ తీరు విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు ప్రారంభమయ్యే ఒకరోజు ముందు హాల్టికెట్లు ఆన్లైన్లో ఉంచడం, తీరా వాటిని విద్యార్థులకు పంపిణీ చేశాక.. కేంద్రాలు మార్చడంపై గందరగోళం నెలకొంది. కేయూ పరిధిలో బుధవారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు షురూ కానున్నా యి. జిల్లాలో బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజా ర్హత్నూర్, గుడిహత్నూర్, ఉట్నూర్, ఆదిలా బాద్లో పరీక్ష కేంద్రాలను అధికారులు కేటా యించారు. ఆయాకేంద్రాల్లో పరీక్షలురాసే విద్యా ర్థుల హాల్టికెట్లను ఒకరోజు ముందు సంబంధిత కళాశాలలకు ఆన్లైన్లోఅందుబాటులో ఉం చారు. విద్యార్థులు ఉదయం కాలేజీకి వెళ్లి వాటి ని తీసకున్నారు. తీరా మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో వర్సిటీ అధికారులు దాదాపు అన్ని పరీక్ష కేంద్రాలను మార్చారు. దీంతో విద్యార్థులు తమది ఏ సెంటర్ అంటూ అయోమయానికి గు రవుతున్నారు. -
● ఎస్పీ అఖిల్ మహాజన్
‘వీపీవో’ పటిష్టంగా అమలు చేయాలి నేరడిగొండ: విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నేరడిగొండ పోలీస్ స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ పోలీసుకు కేటాయించిన గ్రామాన్ని ఎప్పటికప్పుడు సందర్శించాలన్నారు. సమాచార వ్యవస్థ పటిష్టం చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. అలాగే మైనర్ డ్రైవింగ్పై దృష్టి సారించాలన్నారు. బహిరంగ మాద్యపానం జరగకుండా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు సంబంధించి సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేస్తూ వారికి భరోసా కల్పించాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్పీ వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేష్, నేరడిగొండ ఎస్సై ఎల్.శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు. చిల్డ్రన్ పార్క్ ప్రారంభం చిన్ననాటి నుంచే వ్యాయామం అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కును మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందులో ఏఎస్పీ కాజల్సింగ్ తదితరులున్నారు. దరఖాస్తుల ఆహ్వానంఆదిలాబాద్టౌన్: హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పాలి టెక్నిక్ డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.మిల్కా ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అ నాథలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన బాలికలు మాత్రమే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. కు లం,ఆదాయం(అనాథ బాలికలకు అవసరంలేదు), మరణ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్ పత్రాలు దరఖాస్తుకు జతచేసి జిల్లా కేంద్రంలోని బాలరక్షా భవన్లో ఈనెల 18లోగా అందించాలని సూచించా రు. వివరాల కోసం 9493433400, 9966490203 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
పుట్టుక.. చావులో వైవిధ్యం!
● ‘ఆడ’ కంటే ‘మగ’ జననమే అధికం ● అధిక మరణాలు కూడా పురుషులవే.. ● ఆగని గర్భస్త, నవజాత శిశు మరణాలు ● ‘సీఆర్ఎస్– 2021’ నివేదికలో వెల్లడిసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుట్టుక, చావు మానవ జీవనంలో కీలక ఘట్టాలు. దేశ వ్యాప్తంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే కేంద్ర హోంశాఖ పరిధి రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్)–2021 నివేదిక ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జననాలు, మరణాలతో పాటు ఏడాదిలోపు శిశువులు, గర్భంలోనే చనిపోతున్న శిశువుల వివరాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీ్త్ర, పురుష నిష్పత్తిలో ఏర్పడిన అసమానతలు, జనన, మరణాల్లో నమోదవుతున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.కన్నుమూస్తే మరణం..ఉమ్మడి ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లాలో మరణాలు అధికంగా నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832 మంది మరణించారు.మగ శిశువుల జననమే అధికం ఉమ్మడి ఆదిలాబాద్లోని నిర్మల్ జిల్లాలో అధికంగా జననాలు నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్లో తక్కువగా ఉంది. ఇందులో మగ శిశువుల జననాలే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆడ శిశుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లింగనిష్పత్తి తగ్గుతుండగా ఈ నివేదికలోనూ ఇదే తీరువెల్లడైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 26,576 మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25,124 మంది జన్మించారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జననాలు.. జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 2,073 1,865 2,710 2,729 4,783 4,594 9,377 నిర్మల్ 4,490 4,218 7,002 6,599 11,492 10,817 22,309 మంచిర్యాల 333 320 5,377 5,065 5,710 5,385 11,095 కు.ఆసిఫాబాద్ 3,458 3,240 1,132 1,088 4,590 4,328 8,918ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలుశిశు మరణాలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి మొదటి పుట్టిన రోజు కూడా జరుపుకోకుండానే ఎంతోమంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పుట్టిన సమయంలోనే అనేక సమస్యలుండగా, కొందరు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో 84మంది, మంచిర్యాలలో గ్రామీణ ప్రాంతంలో ఒక్కరూ చనిపోనప్పటికీ.. పట్టణ ప్రాంతంలో 11మంది, ఆదిలాబాద్లో 61, కుమురంభీం ఆసిఫాబాద్లో అధికంగా 77మంది నవజాత శిశు మరణాలు నమోదయ్యాయి. స్టిల్ బర్త్ మరణాలూ అధికమే..20 వారాలు దాటిన పిండం నుంచి ప్రసవ దశ శిశువు వరకు గర్భంలోనే మరణించే స్థితిని స్టిల్ బర్త్గా పేర్కొంటారు. ఈ పరిస్థితిని చాలామంది గర్భిణులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 178 మృతశిశువుల జననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో గ్రామీణ పరిధిలో నమోదు లేనప్పటికీ పట్టణాల్లోనే 174 నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్లో 61, నిర్మల్లో 26 నమోదయ్యాయి. గర్భం దాల్చి పిండ వృద్ధి దశలో ఎదురవుతున్న పలు సమస్యలతో గర్భంలోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.శిశుమరణాలు ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 27 18 10 06 37 24 61 నిర్మల్ 36 42 3 3 39 45 84 మంచిర్యాల 0 0 06 05 6 5 11 కు.ఆసిఫాబాద్ 43 29 02 03 45 32 77 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 1,367 1,206 890 842 2,257 2,048 4,305 నిర్మల్ 2,400 1,850 1,356 1,054 3,756 2,904 6,660 మంచిర్యాల 653 574 1,636 1,003 2,289 1,577 3,866 కు.ఆసిఫాబాద్ 1,890 1,172 263 131 2,153 1,303 3,456 గర్భస్రావాలు (స్టిల్ బర్త్) ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 21 20 14 06 35 26 61 నిర్మల్ 12 14 0 0 12 14 26 మంచిర్యాల 0 0 94 80 94 80 174 కు.ఆసిఫాబాద్ 98 74 04 02 102 76 178 -
● బిల్లులు పెండింగ్.. పనులు స్టాప్ ● ఒత్తిడికి లోనవుతున్న కాంట్రాక్టర్లు ● ఇటీవల గుండెపోటుతో ఒకరు మృతి ● పలుచోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్
ఇతని పేరు గుట్ట ప్రవీణ్. 46 సంవత్సరాలు. ఆదిలా బాద్ పట్టణం పాత హౌసింగ్ బోర్డు కాలనీ. క్లాస్–1 కాంట్రాక్టర్గా వ్యవహరించాడు. నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ప్రధానంగా ఈయన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించిన అనేక రోడ్లు, వంతెనలు, ఇతరత్రా పనులు నిర్వహించాడు. ఇతడికి సంబంధించి సుమారు రూ.60 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటి క్లియరెన్స్ కోసం తిరుగుతున్న మంజూరు కావడం లేదు. ఈ క్రమంలో ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రవీణ్ మాత్రమే కాదు.. పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.ఇది జిల్లా కేంద్రంలోని మావల నుంచి దస్నాపూర్ వచ్చే ప్రధాన రహదారి డివైడర్కు ఒక వైపు భాగం. 2023–24లో ఈ రహదారిని అభివృద్ధి పర్చేందుకు ఆర్అండ్బీ ద్వారా రూ.13కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం వర్క్ మంజూరు చేసింది. డివైడర్కు మరోవైపు పనులు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం నుంచి అరకొరగా బిల్లులు వచ్చాయి. మంజూరులో తాత్సారం కావడంతో కాంట్రాక్టర్ చేసేది లేక ఆ పనులు చేపట్టలేకపోయాడు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించడం లేదు. మరో వైపు ఇలాంటి అనేక రోడ్ల పనులు జిల్లాలో నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.●సాక్షి,ఆదిలాబాద్: ఈ రెండు అంశాలు జిల్లాలో బ్రేక్ పడిన అభివృద్ధి పనులు, పలుచోట్ల పనులు చేపట్టినా బిల్లులు అందని కాంట్రాక్టర్ల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం పెండింగ్ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని స్పష్టం చేస్తుండడంతో కాంట్రాక్టర్లు మనోవేదనకు గురవుతున్నారు. బిల్లుల కోసం తరచూ హైదరాబాద్ బా ట పడుతున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ ప్రవీణ్ మృతి చెంది నట్లు తెలుస్తోంది. బడాకాంట్రాక్టర్లతో పాటు చోటా మోటా కాంట్రాక్టర్లు కూడా పెండింగ్లో ఉన్న బిల్లులతో సతమతం అవుతున్నట్లు చెబుతున్నారు. లైసెన్స్ వదులుకున్న బడా కాంట్రాక్టర్.. తాజాగా ప్రవీణ్ మృతి తర్వాత కొంత మంది రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారలు ఏకంగా కాంట్రాక్టర్లకు సల హా ఇస్తున్నారు. పెండింగ్ బిల్లుల నేపథ్యంలో ఇప్ప ట్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని, అనవసరంగా బయట అప్పు చేసి ఇబ్బందులకుగురికావద్దని పే ర్కొనడం సంచలనం కలిగిస్తుంది. ఇదిలా ఉంటే.. జిల్లాలో కొన్నేళ్ల క్రితం తిరుమల, బాలాజీ కన్స్ట్రక్షన్స్ కంపెనీల మధ్య పెద్ద పెద్ద రోడ్ల పనులు చేపట్టేందుకు పోటీ ఉండేది. మధ్యలో బిల్లుల పెండింగ్ నేపథ్యంలో బాలాజీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పూర్తిగా కా ంట్రాక్ట్ పనులు మానుకొని లైసెన్స్ వదులుకుందనే ప్రచారం ఉంది. ఆ సమయంలో సదరు యజమాని సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఈ రంగం నుంచి తప్పుకున్నారని ప్రస్తుతం ఆదిలాబాద్లో చర్చ సాగుతుంది. మిగతా కాంట్రాక్టర్లు పనులు చేపట్టి ఒత్తిడిని మూటగట్టుకున్నారని పేర్కొంటున్నారు. సందెట్లో సడేమియా.. పెండింగ్ బిల్లుల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రస్తుతం ఆ బిల్లులను క్లియర్ చేపిస్తామని చెబుతూ పలువురు దళారులు తయారయ్యారనే ప్రచారం సాగుతుంది. ఇలా పెండింగ్ బిల్లులకు సంబంధించి ముందుగానే కమీషన్ తీసుకొని బిల్లు మంజూరు చేయిస్తామని చెబుతూ నెలలు గడిచినా ఆ డబ్బులు రాకపోవడంతో ఇలాంటి బాధితులు మరింత నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం, వరంగల్, ఇతర జిల్లాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు కొంతమేర మంజూరవుతున్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించిన బిల్లుల క్లియరెన్స్లో మాత్రం వివక్ష సాగుతుందనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు పలువురు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ సమయంలో అనేక పనులకు సంబంధించి అగ్రిమెంట్లు జరిగినప్పటికీ పనులు షురూ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ల మీదా ఒత్తిడి తీసుకురావడంతో వారు ఆ పనులు చేపట్టారు. అయితే పెండింగ్ బిల్లుల విషయంలో మా త్రం ఆ కాంట్రాక్టర్లకు మొండి చెయే ఎదురైందన్న అపవాదు ఉంది. ఈ పరిస్థితుల్లో బిల్లులు చెల్లించి, అభివృద్ధి పనుల పరంగా ప్రజలకు అసౌకర్యాలను దూరం చేయాలన్న అభిప్రాయం పలు వురి నుంచి వ్యక్తమవుతుంది. కాగా, పెండింగ్ బిల్లులు, నిలిచి పోయిన అభివృద్ధి పనుల విషయంపై ‘సాక్షి’ ఆర్ అండ్బీకి చెందిన ఓ అధికారి వివరణ కోరగా, ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి
● కలెక్టర్ రాజర్షిషాసాత్నాల: భూభారతి చట్టం కింద రైతులు, ప్రజ ల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరి శీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టా లని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. భూభారతి రెవె న్యు సదస్సుల్లో భాగంగా భోరజ్ మండలంలోని డొల్లారా గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ఆధారంగా రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాతిపాదికన జిల్లాలోని భోరజ్ మండలంలో గల 28 గ్రామాల్లో ఈనెల 16వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వచ్చిన 17 దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. అనంతరం దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికా రులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలు సమగ్రంగా పరిశీలించాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దా ర్ వేణుగోపాల్, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. -
బారులు తీరి.. సమస్యలు నివేదించి
● ప్రజావాణికి 107 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్కైలాస్నగర్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలె క్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు అర్జీదారులు బారులు తీరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారంతా కలెక్టర్ రాజర్షి షాకు తమ గోడు విన్నవించి దరఖాస్తులు అందజేశారు. వాటిని కలెక్టర్ సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పెండింగ్లో ఉంచొద్దని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీవో వినోద్కుమార్తోపాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం మొత్తం 107 అర్జీలు అందాయి. ఇందులో భూ సమస్యలు, పింఛన్, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సమస్యలే అధికంగా ఉన్నాయి. కాగా, ఈ వారం వచ్చిన దరఖాస్తుదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. -
‘ఇందిరమ్మ’ కోసం ప్రత్యేక కౌంటర్
కై లాస్నగర్: ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద సోమవారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. జెడ్పీ, మున్సిపల్, హౌసింగ్ శాఖల ఉద్యోగులు మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ మండలాల నుంచి 25 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా అనర్హులకే ఇళ్లు కేటా యించారని పేర్కొనడం గమనార్హం. కాగా గత సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో ఇందిర మ్మ ఇళ్లపైనే అత్యధిక ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కలెక్టర్ స్పందించి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తదుకనుగుణంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కౌంటర్ అందుబాటులోకి తెచ్చారు. ‘విద్యుత్ గ్రీవెన్స్’ సద్వినియోగం చేసుకోండి ● ఎస్ఈ జేఆర్ చౌహాన్ఆదిలాబాద్టౌన్: వి ద్యుత్ వినియోగదా రుల సమస్యల పరి ష్కారామే ధ్యేయంగా చేపట్టిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ జేఆర్. చౌ హాన్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, 2024 జూన్ 17న శ్రీ కారం చుట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇ ప్పటి వరకు 754 ఫిర్యాదులు అందగా 699 ప రిష్కరించామన్నారు. విద్యుత్ బిల్లులు, మీ టర్లు, కరెంట్ సరఫరాలో హెచ్చు తగ్గులు, కేట గిరీ, పేరు మార్పు, ప్రమాద భరిత స్తంభాలు వంటి ఫిర్యాదుల్లోని సమస్య తీవ్రత ప్రకారం అప్పటికప్పుడు పరిష్కరించినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను సమయం తీసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్లలో ఈ ప్రజావాణి ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సర్కిల్ ఆఫీస్లో అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. గ్రీవెన్స్లో అందిన ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్పై అభ్యంతరాలు ● నిబంధనలు పాటించలేదంటున్న పలు ఏజెన్సీల నిర్వాహకులు ● రద్దు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు ● నేడు దరఖాస్తుకు చివరి తేది
సాక్షి, ఆదిలాబాద్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కొంత మంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్ను కలిశారు. నూతన ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం ఇటీవల విడుదల చేసిన టెండర్ నోటిఫికేష న్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో 4459 ప్రకా రం నిబంధనలు జారీ చేయాల్సి ఉండగా, ఆ జీవో ను బేఖాతరు చేస్తూ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారని, అందులో అడ్డగోలు నిబంధనలు పెట్టడంతో అనేక ఏజెన్సీలకు కనీసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఇది కేవలం ప్రస్తు తం కొనసాగుతున్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసే లా నోటిఫికేషన్ రూపొందించినట్లు ఆ నిర్వాహకులు నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తుకు మంగళవారం తుది గడువు కావడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం కొత్తది జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్ ప్రజావాణిలో జిల్లాఇన్చార్జి ఉపాధికల్పన అధికారి మిల్కా అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి అక్కడినుంచే మాట్లాడారు. అభ్యంతరాలు ఇలా.. టెండర్ నోటిఫికేషన్లో పొందుపర్చిన పలు నిబంధనల విషయంలో ఏజెన్సీ నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2006లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 4459ను పూర్తిగా బేఖాతరు చేస్తూ కొందరికి మాత్రమే మేలు చేసేలా ఈ నిబంధనలు రూపొందించారని పలువురు ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానంగా దరఖాస్తు ఫీజు రూ.10వేలు, ఈఎండీ రూ.5లక్షలు చెల్లించాలని, రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్ కలిగి ఉండాలని, వంద మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో పలువురు ఏజెన్సీ నిర్వాహకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కొత్త ఏజెన్సీలకు ఈ నిబంధనల కారణంగా ఎలా అవకాశం లభిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా వంద మంది ఉద్యోగుల నిర్వహణ కంటే తక్కువ సంఖ్యలో అనుభవం ఉన్న ఏజెన్సీల పరిస్థితి ఏమిటని అంటున్నారు. ప్రభుత్వ జీవోలో అసలు ఈఎండే తీసుకోవద్దని ఉన్నప్పటికీ రూ.5లక్షలు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. నామమాత్రంగా దరఖాస్తు ఫీజు ఉండాల్సి ఉండగా, ఏకంగా రూ.10వేలు ఎలా నిర్ణయించారని ప్రశ్న లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా నూతన ఎంప్యానల్మెంట్ రూపొందించేందుకు టెండర్లు నిర్వహిస్తుండగా, కమిటీ ఆమోదంతోనే ఈ నోటిఫికేషన్ జారీ అయ్యిందా అని అడుగుతున్నారు. ‘ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్పై ఫిర్యాదులు వస్తున్నాయి.. ఈ విషయంలో ఏజెన్సీ నిర్వాహకులతో మంగళవారం సమావేశమై చర్చించి కొలిక్కి తేవాలి..’ ఇది జిల్లా ఇన్చార్జి ఉపాధికల్పన అధికారి మిల్కాకు కలెక్టర్ రాజర్షిషా ఫోన్లో చేసిన ఆదేశాలు. పరిశీలిస్తున్నాం.. ప్రజావాణిలో కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు నోటిఫికేషన్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలన చేస్తున్నాం. ఉపాధికల్పన అధికారి సోమవారం అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఈ విషయంలో ఆమె నుంచి స్పష్టత తీసుకొని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అనంతరం తదుపరి చర్యలు చేపడతాం. – శ్యామలాదేవి, అదనపు కలెక్టర్ -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 30 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయినా బాధితులు డయల్ 100లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి వస్తే ‘డయల్ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా 8712659973 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
ఆదిలాబాద్: ఈ నెల 20న దేశవ్యాప్తంగా ని ర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి దేవేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ జిల్లా కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని సంఘటి త, అసంఘటిత రంగాల కార్మికులంతా పా ల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో ఖాసీం, అఫ్రోజ్, మహేందర్, సలీం, జమీల్ తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులో విధి నిర్వహణలో వీరమరణం పొందిన సైనికుల సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి జోగు రామ న్న అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన భారతీయులు, సరిహద్దుల్లో మరణించిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం వినాయక్ చౌక్లోని కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇందులో సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, మజారుద్దీన్, వామన్రెడ్డి, రమేశ్, వినోద్, నాయకులు అలాల్ అజయ్, మెట్టు ప్రహ్లాద్, యూనుస్ అక్బానీ, కస్తాల ప్రేమల, చందాల రాజన్న, దాసరి రమేష్, సలీం పాషా, కొండ గణేశ్ తదితరులున్నారు. -
‘యువ వికాసం’పై కసరత్తు
కై లాస్నగర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా రూ.50వేల నుంచి రూ.4.లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గత నెల 7నుంచి 14వరకు ఆఫ్లైన్, ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో అర్హులను గుర్తించేందుకు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారుల వివరాలు, స్థితిగతులను ఆరా తీస్తున్నారు. వారు ఎంపిక చేసిన జాబితాలను సోమవారం (నేటి)లోగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్కు అందజేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖలన్నింటివి కలిపి 47,762 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 39,727 పరిశీలించారు. మిగతా దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. వాటి పరిశీలనను నేటితో పూర్తిచేసేందుకు అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ ఇటీవల సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో పలుమార్లు సమీక్షించారు. ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. 13 నుంచి మండల స్థాయిలో.. ఎంపీడీవోలకు అందిన దరఖాస్తుల ఆధారంగా ఈనెల 13 నుంచి 19వరకు మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపీడీవో నేతృత్వంలోని ఈ కమిటీలో ఎంపీవో, మండల ప్రత్యేక అధికారి, బ్యాంక్ మేనేజర్లు సంబంధిత శాఖల నుంచి ఎంపిక చేసిన అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. సంక్షేమ శాఖలకు సంబంధించి మండల స్థాయి కమిటీలో హెచ్డబ్ల్యూవోలను నియమించారు. మున్సిపాలిటీలో గెజిటెడ్ అధికారులను కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరి ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి మండలాలకు కేటాయించిన యూనిట్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇలా ఎంపిక చేసిన వారి వివరాలను జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. అయితే యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండి, దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులను గుర్తిస్తేనే నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 20 నుంచి జిల్లా స్థాయిలో.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి 30 వరకు మండల కమిటీలు అందజేసిన అర్హుల వివరాలను జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్గా, డీఆర్డీవో నోడల్ అధికారిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ మండల స్థాయి నుంచి అందిన దరఖాస్తులను, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అర్హత ఆధారంగా యూనిట్ల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ ప్రక్రియను ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు పూర్తి చేయనుంది. ఆయా తేదీల్లోనే ప్రొసీడింగ్లను సైతం సిద్ధం చేయనుంది. జిల్లా కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందజేయనున్నారు. తొలివిడతలో రూ.50వేలు, రూ.లక్ష లోపు రుణాలు అందజేయనున్నట్లుగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారి సంఖ్య తక్కువగా ఉండటంతో తొలివిడతలోనే వారికి లబ్ధి చేకూరే అవకాశముంది. నేటితో ముగియనున్న క్షేత్రస్థాయి పరిశీలన 13 నుంచి మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ 20 నుంచి జిల్లా స్థాయిలో గుర్తింపు శాఖల వారీగా అందిన దరఖాస్తులు, పరిశీలన వివరాలు శాఖ అందిన పరిశీలించినవి దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్ 9804 8143 ఎస్టీ సంక్షేమ శాఖ 12855 11039 బీసీ 18581 15773 ఈబీసీ 653 376 మైనార్టీ 5814 4364 క్రిస్టియన్ మైనార్టీ 55 32 జిల్లాలో కులాల వారీగా కేటాయించిన యూనిట్లు ఎస్సీ 2,662 ఎస్టీ 6,480 బీసీ 2,403 ఈబీసీ 724 ముస్లిం మైనారిటీ 1,003 క్రిస్టియన్ మైనారిటీ 31 పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వ ఆర్థికసాయం కోసం అందిన దరఖాస్తులకు సంబంధించిన వివరాల క్షేత్రస్థాయి పరిశీలన సోమవారంలోగా ముగియనుంది. ఈ నెల 13 నుంచి 20వరకు మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. 20 నుంచి 30వరకు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. కలెక్టర్ నేతృత్వంలో పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందించేలా ముందుకు సాగుతున్నాం. – మనోహర్రావు, రాజీవ్ యువ వికాసం జిల్లా కన్వీనర్ -
సర్కారు బడుల్లోనే చేర్పించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అందులోనే చేర్పించాలి. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు 97శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 58 బడుల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన అందిస్తున్నాం. మరింత నాణ్యమైన బోధన అందించేందుకు ఐదు రోజుల పాటు వారికి శిక్షణ కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టారు. – ఏనుగు శ్రీనివాస్రెడ్డి, డీఈవో -
పర్యవేక్షణపై దృష్టి సారించాలి
అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి. ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో పోస్టులు భర్తీ చేస్తేనే సర్కారు విద్య గాడిన పడుతుంది. డైట్ కళాశాలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యావ్యవ్థ కుంటుపడుతుంది. వీటిపై దృష్టి సారిస్తే సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. – బి.రవీంద్ర, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
సైన్యానికి మద్దతుగా పూజలు
తాంసి: ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా సరి హద్దులో పోరాటం చేస్తున్న భారత త్రివిధ దళాలకు, ఆపరేషన్ సిందూర్కు ప్రతి ఒకరూ మద్దతుగా నిలవాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. త్రివిధ దళాలకు మద్దతుగా మండలంలోని పొన్నారి సంకట్యోచన్ హనుమా న్ ఆలయంలో ఎంపీ ఆదివారం ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పాక్ ఉగ్రవాదులు సరిహద్దు వెంట దాడులకు పాల్పడుతుండగా భారత త్రి విధ దళాలు ధీటుగా తిప్పికొడుతున్నాయన్నారు. ఇందులో మాజీ జెడ్పీటీసీ రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రకిరణ్, నాయకులు సదానంద్, అరుణ్, నారాయణ, ప్రవీణ్ రెడ్డి తదితరులున్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం●
● డీఎస్పీ జీవన్రెడ్డి ఆదిలాబాద్టౌన్: అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపుతామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి అన్నారు. పట్టణంలోని వడ్డెర కాలనీలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్ కార్డెన్సెర్చ్ నిర్వహించారు. ఇళ్లలో సోదాలు చేపట్టారు. కాలనీకి చెందిన ఒల్లెపు బాబన్న బైక్ నంబర్ మార్ఫింగ్ చేసి మరో నంబర్ బిగించినట్లు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలనీకి చెందిన దారంగుల గంగమ్మ ఇంట్లో సోదాలు చేయగా 17దేశీదారు బాటిళ్లతో పా టు ఒక బీర్ లభించినట్లు పేర్కొన్నారు. ఆమె పై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. స్క్రాప్ యజమానులు దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజుల పాటు ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని స్క్రాప్ దుకాణాలను తనిఖీ చేయగా, సర్వీస్ వైర్లు, అగ్రికల్చర్కు సంబంధించిన సబ్మెర్సిబుల్ మో టార్లు, కాపర్ తీగలు కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. తొ మ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎవరైనా కాపర్వైర్లు, ఇతర వస్తువులు అమ్మడానికి వస్తే వారి వివరాలు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు. అలాగే దుకాణాల్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలన్నారు. డీఎస్పీ వెంట టూ టౌన్ ఎస్సైలు తిరుపతి, విష్ణుప్రకాశ్, హెడ్కానిస్టేబుల్ బబిత తదితరులున్నారు. -
ఎనిమిది కాళ్ల వింత మేకపిల్ల జననం
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని బొక్కల్గూడలో నివాసం ఉంటున్న రాజలింగుకు చెందిన మేక ఆదివారం ఎనిమిది కాళ్లతో వింత మేకపిల్లకు జన్మనిచ్చింది. కొద్ది సేపటికే మృతి చెందింది. మేక ఈత కోసం యజమాని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. వైద్యుడు దూద్రాం రాథోడ్ సిజేరియన్ అవసరం ఉందని గ్రహించి ఆపరేషన్ చేశాడు. ఒక తల, ఎని మిది కాళ్లతో వింతగా జన్మించింది. జన్యులోపం కారణంగా ఇలాంటివి జన్మిస్తాయని, శాస్త్ర పరిభాషలో అక్టోగోట్ ఫీటస్, పాలిమేలియా అంటారని వైద్యుడు తెలిపారు. మేక కు శస్త్ర చికిత్స చేసిన వారిలో రాథోడ్ లావణ్య, సిబ్బంది ఉన్నారు. -
ఆ వ్యాపారులకు సహకరిస్తే కేసులు
● కలెక్టర్ రాజర్షి షా ● జొన్నల విక్రయాలపై అధికారులతో సమీక్ష కైలాస్నగర్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మ ద్దతు ధరతో జొన్నలు విక్రయించే వ్యాపారులకు సహకరించే రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జొన్న ల కొనుగోళ్లపై సంబంధిత శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 15 కేంద్రాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. క్వింటాల్కు రూ.3,371 మద్దతు ధరతో రైతుల నుంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు జొన్నలను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. విజిలెన్స్ బృందాల ద్వారా నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. అక్రమంగా తీసుకువస్తే జొన్న బస్తాలతో పాటు వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటికే భీంపూర్ మండలంలో రెండు బొలేరో వాహనాలు, ట్రాక్టర్, అలాగే ఇచ్చోడలోని మాదాపూర్లో 500 బస్తాల జొన్నలు, ఇంద్రవెల్లిలో 87 బస్తాలు, బజార్హత్నూర్లో 54 బస్తాలను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 7780 మంది రైతుల నుంచి రూ.83.21 కోట్ల విలువైన 2.46లక్షల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు వివరించారు. సమావేశంలో డీఏవో శ్రీధర్ స్వామి, డీసీవో మోహన్, మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూసర్వే సమస్యకు ఇక చెక్
● త్వరలోనే లైసెన్స్డ్ సర్వేయర్లు ● శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ ● ఈ నెల 17వరకు గడువుశిక్షణ ఫీజు వివరాలు అభ్యర్థులు ఫీజు ఓసీ రూ.10వేలు బీసీ రూ.5వేలు ఎస్సీ, ఎస్టీ రూ.2,500 కై లాస్నగర్: జిల్లాలో సర్వేయర్ల కొరత వేధిస్తోంది. సరిపడా లేకపోవడంతో భూసర్వే పనులకు ఆటంకం కలుగుతుంది. ధరణితో ఏర్పడ్డ భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు మండల సర్వేయర్ల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా సర్వేయర్ వచ్చే పరిస్థితి లేదు. ఈ ఇక్కట్లను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై దృష్టి సా రించింది. ప్రైవేట్ సర్వేయర్లతో పాటు ఆసక్తి, అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇచ్చి లైసెన్స్లు జారీ చేయాలని నిర్ణయించింది. మండలానికి కనీసం ఇద్దరు ఉండేలా ... భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై దృష్టి సారించింది. 60 శాతం మార్కులతో గణితం ఓ సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), డిప్లొ మా, బీటెక్ సివిల్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పాత సర్వేయర్లతో పాటు ఆసక్తి గల వారు ఈ నెల 17లోపు మీసేవ కేంద్రాల్లో రూ.100 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఈ నెల 26 నుంచి జూలై 26వరకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కో మండలానికి కనీసం ఇద్దరు చొప్పున నియమించనున్నట్లుగా తెలుస్తోంది. మూడు విడతల్లో శిక్షణ ... ఎంపిక చేసిన వారికి మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, ఫిల్డ్ లెవల్లో ట్రెయినింగ్ ఉంటుంది. అనంతరం 40 రోజుల పాటు మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విజయవంతంగా పూర్తి చేసిన వారికి జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్టు నిర్వహిస్తారు. ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా లైసెన్స్లు జారీ చేస్తారు. అలాంటి వారికి రైతుల భూములను సర్వే చేసేందుకు అధికారికంగా గుర్తింపు లభించనుంది. సర్వేయర్ల కొరత లేకుండా ... ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో సర్వేయర్ల కొ రత తీరనుంది. ప్రస్తుతం 21 మండలాలకు గాను 8మంది మండల సర్వేయర్లు, ఇద్దరు డిప్యూటీ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్ర భుత్వం తెచ్చిన ధరణి చట్టంతో జిల్లాలో భూ సమస్యలు కుప్పలుగా పేరుకుపోయాయి. ల్యాండ్ మి స్సింగ్, పట్టాదారు పేరు తారుమారు, విస్తీర్ణంలో తేడా వంటి అనేక సమస్యలున్నాయి. దీంతో సర్వే కోసం అందిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. దీనికి తోడు రియల్ ఎస్టేట్ కారణంగా జిల్లాలో వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున వెంచర్లుగా మారుతున్నాయి. నాలా కన్వర్షన్ కోసం సైతం అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే భూ సర్వే పనులు వేగవంతంగా సాగే అవకాశముంది. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న భూభారతి చట్టంలో అర్హులైన వారి సేవలను సర్వేయర్లుగా వినియోగించుకో వాలని భావిస్తోంది. వారికి శిక్షణ ఇచ్చి లైసెన్స్లు జారీ చేయనుంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. అర్హులైన వారు ఈనెల 17వరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఎం.రాజేందర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఆదిలాబాద్ -
లైంగికవేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ఓ మహిళ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. శనివారం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ఓ మహిళ బంధువులు పంజాబ్లో నివసిస్తున్నారు. కొన్ని అవసరాల నిమిత్తం అమృత్సర్కు చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్ను వీరు సంప్రదించారు. సదరు అధికారి డబ్బులు ఆశించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో పనులు చేసేందుకు నిరాకరించాడు. దీంతో అతన్ని మహిళ తరపు బంధువులు విజిలెన్స్ అధికారులకు పట్టించారు. వారిపై కక్ష పెంచుకున్న మునీష్ కుమార్ ఆదిలాబాద్కు చెందిన మహిళ పేరిట పేస్బుక్లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి, సదరు మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ బృందం సహకారంతో, వన్టౌన్ పోలీసులు నిందితుడిని గుర్తించి అమృత్సర్ నుంచి ఆదిలాబాద్కు తీసుకువచ్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
ఎడారి దేశంలో జిల్లావాసి జైలు జీవితం
● చేయని నేరానికి గల్ఫ్ బాధితుడి నరకయాతన ● న్యాయ సహాయం కోసం కుటుంబసభ్యుల వేడుకోలు నిర్మల్ఖిల్లా: చేయని నేరానికి అకారణంగా ఎడారి దేశంలో జైలుశిక్ష అనుభవిస్తున్న తమ కుటుంబ సభ్యుడికి న్యాయ సహాయం అందించాలని గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలో శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ స్వదేశ్ వర్కిపండ్లతో కలిసి కలిసి వివరాలు వెల్లడించారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గజకరెడ్ల సాయన్న (51) ఉపాధి నిమిత్తం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఏప్రిల్ 16న స్థానిక పోలీసులు అరెస్టు చేసి అబుదాబీ జైలుకు తరలించారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఎవరిని సంప్రదించాలని తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి సమస్యను వివరించారు. నిరక్షరాస్యత కారణంగా తన పేరిట ఇతరులకు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో వేసినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశ్ మాట్లాడుతూ బాధితుడి సమగ్ర వివరాలతో అక్కడి ఎంబసీకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. న్యాయసహాయం ద్వారా జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. బాధితుడి తల్లి భోజవ్వ, భార్య మంజుల, కుమారుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టుదలకు ప్రోత్సాహం
బెల్లంపల్లి: తాండూర్ మండలం మాదారం టౌన్షిప్కు చెందిన ఎనగంటి శ్యామలకు దేశమన్నా.. దేశభక్తి అన్నా ఎనలేని అభిమానం. అణువణువునా మాతృదేశంపై మమకారం పెంచుకుంది. ఎనగంటి శ్యామల, సమ్మిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సమ్మిరెడ్డి సింగరేణి కంపెనీలో కార్మికుడిగా పని చేసేవారు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే 1988లో అకాల మరణం చెందారు. దీంతో కుటుంబ బాధ్యతలు శ్యామలపై పడ్డాయి. భర్త వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యో గం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు రాజశేఖర్ డిగ్రీ చదువుతూనే 2006లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించాడు. తల్లి ఆశించినట్లుగానే దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజశేఖర్ పెద్దనాన్న కుమారులు ఒకరు ఇండియన్ ఎయిర్ఫోర్స్, మరొకరు నేవీలో పని చేసేవారు. వారి స్ఫూర్తితో మూ డో ప్రయత్నంలో ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించి తల్లి కలను సాకారం చేశాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో సార్జెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దేశ సేవ చేయాలనే పట్టుదల కుమారుడికి ఉండడంతో ప్రోత్సహించింది. రెండు సార్లు విఫలమైనా వెన్నుతట్టి అండగా నిలబడడంతో నేడు దేశ సేవలో ముందున్నాడు.