Adilabad District News
-
దివ్యాంగ పిల్లల్లో రెండింతల మేధస్సు
ఆదిలాబాద్టౌన్: దివ్యాంగ పిల్లల్లో మేధ స్సు రెండింతలు ఉంటుందని డీఈవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలికా విద్యా, విలీన విద్యా ది నోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని భవిత రిసోర్స్ సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. వైకల్యం గల పిల్లలను చిన్నచూపు చూడొద్దన్నారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. అనంతరం వారికి అక్షరభ్యాసం చేయించారు. కా ర్యక్రమంలో ఆదిలాబాద్అర్బన్ ఎంఈవో సో మయ్య, డైట్కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, సెక్టోరియల్ అధికా రులు సుజాత్ఖాన్, తిరుపతి, శ్రీకాంత్,కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయుడు లచ్చిరాం, ఎన్జీవో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషా ● దస్నాపూర్లో రెవెన్యూ సదస్సుఇంద్రవెల్లి: భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. మండలంలోని దస్నాపూర్లో ఏర్పా టు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సును ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి మంగళవారం సందర్శించారు. రైతులు సమర్పించిన దరఖాస్తులు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. స్వీ కరించిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. కాగా, గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా లో ఆటంకం ఏర్పడుతుందని, మిషన్ భగీరథ నీరు సైతం సరిగా రావడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరి ష్కరించాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించారు. అ మరవీరుల కుటుంబాలతో పాటు ఇతర లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం,డిప్యూటీతహసీల్దార్ రమేశ్, వైద్యు డుప్రతాప్నాయక్, అధికారులు తదితరులున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలి●కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 కార్యక్రమంలో భా గంగా కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులకు మంగళవారం దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారి శుధ్య నిర్వహణ స్థితిని అంచనా వేయడంతో పాటు మరింత మెరుగుపర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామీణా భివృద్ధి లక్ష్యాలు సాధించడంలో పంచాయతీల పురోగతిపై సమీక్షించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, సంబంధిత జిల్లా, మండలాల అధికారులు పాల్గొన్నారు. -
కొత్త భవనం.. ప్చ్!
ఇది జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం నూతన భవనం. నిర్మాణం పూర్తయి రెండున్నర ఏళ్లు దాటింది. సుమారు రూ.40లక్షల వ్యయంతో నిర్మించారు. పాత కార్యాలయం నుంచి ఈ నూతన భవనంలోకి మారేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ భవన ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. లక్షల వ్యయంతో నిర్మించిన భవనం ఇలా అలంకారప్రాయంగా మారింది.కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న ఎకై ్సజ్ సీఐ కార్యాలయం ఇది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. అలాంటప్పుడు అధికారులు ఈ ఆఫీసును కొత్త భవనంలోకి మార్చేందుకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెచ్చులూడి పడిపోయే భవనాన్ని సొంత నిధులతో రిపేర్ చేయిస్తున్నారు తప్పితే కొత్త భవనంలోకి మారేందుకు యత్నించకపోవడం గమనార్హం. -
రైతు నేస్తం.. సాగుకు హస్తం
● ప్రతీ మంగళవారం కార్యక్రమం ● సమస్యలను దృష్టికి తేనున్న రైతులు ● సలహాలు, సూచనలు ఇవ్వనున్న అధికారులు ఆదిలాబాద్అర్బన్: సాగులో అన్నదాతల సమస్యలు ఇట్టే పరిష్కారం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమం దోహదపడనుంది. రైతులు తమ సమస్యలు, సందేహాలను ప్రతీ వారం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉండగా మరింత విస్తరించేలా చర్యలు చేపట్టింది. జిల్లాలో మరో 32 చోట్ల రైతు నేస్తం యూనిట్లను సోమవారం ప్రారంభించింది. గతంలో ఉన్న వాటితో కలుపుకొని ప్రస్తుతం 49 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతీ వారం రైతునేస్తం.. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా రైతు వేదికల్లో ప్రతీ మంగళవారం ఉదయం 10నుంచిమధ్యాహ్నం 12 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ సీజన్లో రైతులకు తలెత్తిన సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో రైతులతో పాటు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, టెక్నికల్, వ్య వసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు. సాగులో ఏ చిన్న సమస్య ఎదురైనా రైతులు ఇందులో దృష్టికి తీసుకువస్తే సత్వర పరిష్కారం లభించనుంది. 49 చోట్ల అందుబాటులోకి.. జిల్లాలో రైతు నేస్తం కార్యక్రమాలు 2024 ఫిబ్రవరి నుంచి మొదలయ్యాయి. మొదట నాలుగు షురూ కాగా, ప్రస్తుతం 49 చోట్ల అందుబాటులోకి వచ్చా యి. తొలి విడతలో నియోజకవర్గంలో మండలానికి ఒకటి చొప్పున సదుపాయం కల్పించారు. రెండో విడతలో మండలానికి రెండు చొప్పున ఆయా రైతు వేదికల్లో సదుపాయాలు ఉండాలని వీసీ యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలానికి మూడు చొప్పున ఉండాలని కొత్తగా 32 యూనిట్లు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక రైతు వేదికలో 120 మంది రైతులు కూర్చునేందుకు సదుపాయం ఉండగా, అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే రైతునేస్తం సదుపాయం ఉన్న ఊరి రైతులే కాకుండా పక్క ఊళ్ల రైతులు కూడా రావడంతో అందులోనే సర్దుకుపోయిన సందర్భాలు లేకపోలేదు. జిల్లాలో.. రైతు వేదికలు : 101 రైతునేస్తం కొనసాగుతున్నవి: 17 కొత్తగా ప్రారంభించినవి : 32 సదుపాయం లేనివి : 52 సాగు సమస్యలు పరిష్కారం రైతు నేస్తంతో సాగులో తలెత్తే సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చు. అధికారులే కాకుండా అనుభవజ్ఞులు, సీనియర్లు పాల్గొంటారు. రైతునేస్తం సమస్యల పరిష్కారానికి మంచి వేదిక. రైతులు సైతం తమ అనుభవాలు పంచుకోవచ్చు. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
● ఎకై ్సజ్ సర్కిల్ నూతన భవనంలోకి మార్పునకు వెనుకంజ ● నిత్యం బాస్ దృష్టిలో ఉంటామనే కారణమా..? ● శిథిలావస్థలో ప్రస్తుత కార్యాలయం ● లక్షలు వెచ్చించినా అలంకారప్రాయంగానే..
సాక్షి,ఆదిలాబాద్: సాధారణంగా శిథిలావస్థలో కొనసాగుతున్న కార్యాలయానికి నూతన భవ నం నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిందంటే ఎగిరి గంతేసి అందులోకి మారుతారు. అయితే జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం ఇందుకు విరుద్ధంగా ఉంది. వారు అస్సలు శిథిలావస్థలో ఉన్న భవనాన్ని విడిచి కొత్త భవనంలోకి వెళ్లాలనే ఆలోచననే చేయట్లేదు. అదేమని ఎవరైనా అడిగితే.. అందులో వాస్తు లే దని దాటవేస్తున్నారు. అలాంటప్పుడు ముందుగా అన్ని చూసి నిర్మాణం చేయలేదా.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా కాంట్రాక్టర్ ఆ భవనాన్ని హ్యాండోవర్ చేయలేదని అధికారులు చెబుతుండగా, కాంట్రాక్టర్ మాత్రం అధికారులే చేసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అసలు లోగుట్టు ఇది.. దీని లోగుట్టు మరోలా ఉంది. ఎకై ్సజ్ జిల్లా అధికారి కార్యాలయం పక్కనే సీఐ కార్యాలయం భవనం ఉండడంతో నిరంతరం జిల్లా అధికారి కంట్లో ఉంటామనే భావనతోనే ఈ కార్యాలయాన్ని అందులోకి మార్చడం లేదనే ప్రచారం ఉంది. కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలకు వెళ్లే దారిలో జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయం రోడ్డు పక్కనే ఉంటుంది. దాని పక్కనే ఎకై ్సజ్ సర్కిల్ ఆఫీస్ కోసం నాలుగేళ్ల క్రితం మంజూరు లభించింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాలకు నిధులు మంజూరు చేస్తూ సొంత స్థలంలో కొత్త భవనాల నిర్మాణానికి ఆ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిర్యాల, లక్సెట్టిపేట, ఆదిలాబాద్లలో ఒకేసారి భవన నిర్మాణాలు ప్రారంభమయ్యా యి. ఆ రెండుచోట్ల సర్కిల్ కార్యాలయాలను కొత్త భవనాల్లోకి షిఫ్ట్ కూడా అయ్యాయి. ఆదిలా బాద్లో మాత్రం కొత్త భవనంలోకి వెళ్లేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మరో వైపు నూతన భవనం సాయంత్రం అయిందంటే చా లు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మా రిందనే విమర్శలున్నాయి. హ్యాండోవర్ చేయలేదు భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కాంట్రాక్టర్ మాకు హ్యాండోవర్ చేయలేదు. అందులో కరెంటు, వాటర్ సదుపాయాలు కూడా లే వు. అన్ని పనులు పూర్తి చేసి భవనాన్ని మార్పు చేస్తాం. – హిమశ్రీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి -
● మితిమీరుతున్న ‘ప్రైవేట్’ ఆగడాలు ● బడిలోనే నోట్బుక్లు, యూనిఫాం విక్రయాలు ● ఇష్టారీతిన ధరలు ● లబోదిబోమంటున్న తల్లిదండ్రులు ● చర్యలకు వెనుకాడుతున్న విద్యాశాఖ
ఆదిలాబాద్టౌన్: ప్రస్తుతం విద్య వ్యాపారంగా మా రింది. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవే ట్ యాజమాన్యాలు అవి చాలవన్నట్టుగా బడులను ఏకంగా సూపర్ మార్కెట్లను తలపించేలా చేస్తున్నా యి. అక్కడే నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, బెల్టు, టై, షూ, వంటివి అధిక ధరలకు విక్రయిస్తూ అంది నకాడికి దండుకుంటున్నారు. కొన్ని యాజమాన్యాలు వారు చెప్పిన చోటనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు హు కుం జారీ చేస్తున్నారు. చీటీలు రాసిచ్చి ఫలానా బుక్సెంటర్, బట్టల షాపు, షూ దుకాణాల్లో నే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. కమీషన్ల కోసం తల్లి దండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నారు. నిబంధన ల ప్రకారం విద్యా సంస్థల్లో చదువు తప్పితే ఎలాంటి వస్తువులు విక్రయించరాదు. విద్యాశాఖ అధికా రుల పర్యవేక్షణ లోపం, అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని యాజమాన్యాలు తమవ్యాపారాన్ని సాఫీగా కానిచ్చేస్తున్నాయి. మితిమీరుతున్న ప్రైవేట్ ఆగడాలు.. జిల్లాలో 162 ప్రైవేట్, రెండు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో కొన్నింటి ఆగడాలు మి తిమీరుతున్నాయి. తల్లిదండ్రుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకుంటున్నాయి. ఇష్టానుసారంగా ఫీజుల వసూలుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా బడిలోనే అన్ని విక్రయిస్తున్నారు. నియంత్రించాల్సిన విద్యాశాఖ ‘మామూలు’గా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. సూపర్ మార్కెట్ను తలపించేలా.. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లాలోని చాలా ప్రైవేట్ పాఠశాలలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాలలో నిల్వ ఉంచిన నోట్బుక్లను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఫిర్యాదు చేస్తే తప్పా తనిఖీలు చేపట్టడం లేదు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఈ దందా సాగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నామ్కే వాస్తేగా సీజ్ చేయడం, తర్వాత వారితో మిలాఖతై జేబులు నింపుకుంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు ఫీజులు సైతం నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల్లో విక్రయాలు చేపట్టొద్దుప్రైవేట్ పాఠశాలల్లో నోట్ బుక్లు, పాఠ్య పుస్తకాలు, టై, బెల్టు, షూ వంటి వస్తువులు విక్రయించరాదు. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించే వాటిపై చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వస్తువులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు నిల్వ ఉంచిన గోదాంను సోమవారం సీజ్ చేశాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈవో -
చదువుతోపాటు ఆటలూ ముఖ్యమే
● ఎస్పీ అఖిల్ మహాజన్ గుడిహత్నూర్: పిల్లలకు చదువుతోపాటు ఆటలూ ముఖ్యమేనని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న చిల్డ్రన్ పార్క్ను ఉట్నూర్ ఏఎస్పీ కాజల్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల శారీరక సామర్థ్యాలు పెంచుకోవడం కోసం ప్రతీ పోలీసుస్టేషన్లో చిల్డ్రన్పార్క్ ఏర్పాటు చేశామని, వాటిని చిన్నారులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి ని ర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఇందులో ఇచ్చోడ సీఐ రాజు, పీఎస్సై మధుకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి
● 500 మంది ఓటర్లకు ఒక కేంద్రం ● వార్డు పరిధిలోని ఓటర్లంతా ఒకే చోట ఓటు వేసేలా చర్యలు ● ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం కై లాస్నగర్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అందుకు అవసరమైన కసరత్తు చేపట్టింది. పోలింగ్కేంద్రాలు, సిబ్బందిని ఇప్పటికే గుర్తించిన అధికారులు, తాజాగా ఓటర్ల సంఖ్యకనుగుణంగా ఆయా కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా 500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాల వారీగా రూట్లను ఎంపిక చేయడంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా ఒకే విడతలో పూర్తిచేసేలా సంసిద్ధమవుతున్నారు. వందశాతం పోలింగ్ సాగేలా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చనుంది. దీంతో ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు. 2023 డిసెంబర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా అనుసరించి గ్రామం, వార్డులు, ఎంపీటీసీ స్థానం వారీగా కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,51,744 మంది పరిషత్ ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,31,068 మంది, పురుష ఓటర్లు 2,20,619 మంది, ఇతరులు 17మంది ఉన్నారు. ఇందులో 500మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక వార్డు పరిధిలోని ఓటర్లంతా అదే వార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 875 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వాటి పరిధిలోని ఓటర్లందరినీ ఎంపీటీసీ స్థానాలకనుగుణంగా మ్యాపింగ్ చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారీగా కూడా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బందిని మ్యాపింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మల్లాపూర్ ఇంద్రవెల్లిలోనే.. మండలాల పునర్విభజనలో భాగంగా సిరికొండ మండలంలో చేర్చిన మల్లాపూర్ గ్రామాన్ని ప్రభుత్వం తిరిగి ఇంద్రవెల్లి మండలంలోనే విలీనం చేసింది. అయితే ఆ మండలంలో కొనసాగేందుకు అక్కడి ప్రజలు విముఖత వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్తో పాటు ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్కకు పలుమార్లు కలిసి వారు విన్నవించారు. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం మల్లాపూర్ను యథావిధిగా ఇంద్రవెల్లి మండలంలో విలీనం చేయాలని ఆదేశించింది. దీంతో మల్లాపూర్ పంచాయతీతో పాటు దాని పరిధిలోని నిజాంగూడ, ధర్మసాగర్ హ్యాబిటేషన్లను సైతం ఇంద్రవెల్లిలోనే చేర్చారు. ప్రస్తుతం ఆయా మండలాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సంఖ్యకనుగుణంగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. సిరికొండ, ఇంద్రవెల్లి ఎంపీడీవోల నుంచి అందుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లుగా సమాచారం. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియతో సిరకొండ మండలంలో ఓ ఎంపీటీసీ స్థానం తగ్గనుండగా, ఇంద్రవెల్లిలో మరో స్థానం పెరుగనుంది. జిల్లాలో.. గ్రామీణ మండలాలు : 20 ఎంపీటీసీ స్థానాలు : 166 జెడ్పీటీసీ స్థానాలు : 20 పోలింగ్ కేంద్రాలు : 875 ఓటర్లు : 4,51,704 -
రైతుకు భరోసా..
● బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ ● ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా లబ్ధి ● అన్నదాతల్లో ఆనందం రైతుల వివరాలు.. మండలం గ్రామాలు పట్టా రైతులు ఆదిలాబాద్రూరల్ 44 11,467ఆదిలాబాద్అర్బన్ 03 502 బజార్హత్నూర్ 41 10,692 బేల 53 11,530 భీంపూర్ 23 8,741 భోరజ్ 28 6,992 బోథ్ 42 11,294గాదిగూడ 61 7,737 గుడిహత్నూర్ 29 7,865 ఇచ్చోడ 44 10,985 ఇంద్రవెల్లి 47 9,359 జైనథ్ 26 9,853 మావల 06 1,019 నార్నూర్ 40 7,060 నేరడిగొండ 58 11,377 సాత్నాల 12 3,206 సిరికొండ 26 5,943 సొనాల 10 3,707 తలమడుగు 33 11,503 తాంసి 12 6,023 ఉట్నూర్ 58 11,383 మొత్తం 696 1,68,238ఆదిలాబాద్టౌన్: వానాకాలం పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసింది. అయితే ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తోంది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతుంది. మొదటి విడతగా రెండెకరాల్లోపు రైతులకు అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. మిగతా రైతులకు వారంలోగా జమ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,68,238 మంది రైతులు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.342 కోట్ల 30లక్షల 71వేల 305 విడుదల చేసింది. ఆయా మండలాల ఏఈవోలు 1,61,775 అకౌంట్లను అప్గ్రేడ్ చేశారు. కాగా 1,61,552 అకౌంట్లను మండల వ్యవసాయ అధికారులు పరిశీలించారు. 1,10,647 మంది రైతులకు సంబంధించిన అకౌంట్లను ట్రెజరీ అధికారులకు పంపించారు. ఇందుకు గాను రూ.148కోట్ల 41లక్షల 307 రైతుల అకౌంట్లో జమకానున్నాయి. తొలివిడతగా సోమవారం సాయంత్రం రెండెకరాల లోపు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఎకరానికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం మూడోసారి విడుదల చేసింది. గత యాసంగిలో జిల్లాలో 96,682 మంది రైతులకు రూ.124.50 కోట్ల నిధులను రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే గతంలో పూర్తిస్థాయిలో రైతులకు రైతు భరోసా జమ కాలేదు. నాలుగు ఎకరాల్లోపు మాత్రమే నిధులు జమైనట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు సమయంలో నిధులు ఖాతాల్లోకి చేరడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడుతుండటంపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కాగా, కొత్త రైతులకు సంబంధించి ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో రైతులు : 1,68,238 రైతు భరోసా నిధులు :రూ.342.30 కోట్లు -
ఉన్నత చదువా.. పట్నమే దారి!
● ఇప్పటికే చేజారిన గిరిజన వర్సిటీ ● ఉత్తర్వులకే పరిమితమైన ‘ఇంజినీరింగ్’ ● జిల్లాలో కానరాని పీజీ, ఫార్మా కళాశాలలు ● ఇబ్బందుల్లో విద్యార్థులు.. పట్టించుకోని పాలకులుఆదిలాబాద్టౌన్: ప్రతీ విద్యార్థి జీవితంలో రాణించాలంటే ఉన్నత చదువు ఎంతో అవసరం. ప్ర స్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంసై తం అందిపుచ్చుకోవాలి. అయితే అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లాలో అందుకు అవసరమైన అవకాశాలు కానరాని పరిస్థితి. వనరులు న్నాసంబంధిత విద్యాసంస్థలు నెలకొల్పడం లేదు. పీజీ, ఇంజినీరింగ్, ఫార్మా, ఎంబీఏ,ఎంసీఏ వంటి కోర్సుల్లో విద్యను అభ్యసించాలంటే హైదరాబా ద్, వరంగల్ తదితర నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలో చాలామంది పేద విద్యార్థులు డిగ్రీకే పరిమితమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం జిల్లాకు గిరిజన యూనివర్సిటీని మంజూ రు చేసింది. అయితే జిల్లా పాలకుల పట్టింపులేమి, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెరసీ ఆ వర్సిటీ ఉమ్మడి వరంగల్కు తరలిపోయింది. ఇలా ఈప్రాంతానికి విద్యాపరంగా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. గళమెత్తాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఉన్నత చదువులకు దూరం.. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉండగా ఆదిలాబాద్లో మాత్రం కానరాని పరి స్థితి. జిల్లాలో కేవలం రిమ్స్, అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. గతంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ఉండగా అది హైదరాబాద్ కు తరలిపోయింది.జిల్లాకేంద్రంలో ప్రభుత్వడీఎడ్ కళాశాల ఉన్నా అందులో కేవలం ఇద్దరు రెగ్యులర్ లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. వారికి కూడా ఇతర జిల్లాల్లో డీఈవోలుగా అదనపు బాధ్యతలు ఉండ డం గమనార్హం. బీఎడ్ విషయానికి వస్తే రెండు ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసినవారికి ఇంజినీరింగ్ చదవాలంటే ఇతర జిల్లాలకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో మంచి ర్యాంకులు వచ్చిన వారు సైతం ఆర్థిక పరిస్థితులు సరి గా లేని కారణంగా చదువుకోలేకపోతున్నారు. ఇంజినీరింగ్ కళాశాల ఊసేది.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరుచేస్తూ ఉత్తర్వులు జా రీచేశారు. ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తూ ఇక్కడే తరగతులు నిర్వహిస్తారని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రస్తుతం ఆ అంశం అటకెక్కింది. పీజీ కూడా లేదాయే.. డిగ్రీ పూర్తయిన తర్వాత జిల్లా విద్యార్థులు పోస్టు గ్రాడ్యూయేట్ చేయలేని దుస్థితి. ఏటా వేలాది మంది డిగ్రీ కోర్సు పూర్తి చేసిన తర్వాత పీజీ ఎంట్రెన్స్ రాస్తున్నారు. అయితే జిల్లాలో పీజీ కళాశాల లేకపోవడంతో హైదరాబాద్, వరంగల్కు వెళ్లి ఉన్నత చదువులు చదవాల్సిన పరిస్థితి. ఆదిలా బాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బాటనీ, జువాలజి, ఆర్ట్స్ డిగ్రీ కళాశాలో ఎకనామిక్స్ పీజీ కోర్సులు మాత్రమే ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ద్వారా కేవలం ఆర్ట్స్కు సంబంధించిన పీజీ కోర్సులు ఉండడంతో చాలా మంది సైన్స్ విద్యార్థులు డిగ్రీకే పరిమితం అవుతున్నారు. యూనివర్సిటీ మంజూరు చేయాలి జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేస్తేనే విద్యాపరంగా అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు డిగ్రీ తర్వాత ఉన్నత చదువులు కొనసాగించలేకపోతున్నారు. అలాగే బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఇన్సూరెన్స్ తదితర కొలువుల కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి. – సంతోష్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సైన్స్ కళాశాల గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలి జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. గతంలో జిల్లాకు కేటాయించినా వరంగల్కు తరలిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. గత ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో గిరిజన యువత ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. – గణేశ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
‘ఆదివాసీలపై దాడులు సరికాదు’
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులను ఖండిస్తున్నామని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. మావల మండలం బట్టిసావర్గాం శివారులోని కుమురంభీం గూడలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆదివాసీలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటడం, కందకాలు తవ్వడం వంటి చర్యలు సరికాదన్నారు. ఏటూరునాగారం మండలంలోని అటవీశాఖ పరిధిలో ఆదివాసీలు నివసిస్తున్న గుడిసెలను తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనూ అటవీ అధికారుల దాడులు పెరిగాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరుణ్, డివిజన్ అధ్యక్షులు గణపతి, తదితరులున్నారు. -
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
తలమడుగు: రైతులు సాగులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సుంకిడి గ్రామ రైతు వేదికలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నేల ఏ పంటకు అనుకూలమో వాటినే సాగు చేయాలన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగులు పడుతున్నాయని, ఈ విషయంలో ముందస్తు జాగ్రతలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గణేశ్రెడ్డి, మాజీ ఎంపీపీ రాజేశ్వర్, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
● మారనున్న జెడ్పీ స్వరూపం ● ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి ● జిల్లాలో పెరగనున్న జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ● రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ ● ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
కై లాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం తొలుత పరిషత్ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా రాష్ట్రమంత్రులు ప్రకటించడంతోఆశావహుల్లో జోష్ మొదలైంది. ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతా వరణం నెలకొంది. అయితే ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలను పాత రిజర్వేషన్ల ప్రకారం నిర్వహిస్తుందా లేక కొత్తగా ప్రకటిస్తుందా అనేదానిపై ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. మరోవైపు పరిషత్ ఎన్నికల నిర్వహణతో జెడ్పీ స్వరూపం మారనుంది. మండలాల పునర్విభజనతో కొత్తగా పలు ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు అదనంగా పెరిగాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల రిజర్వేషన్లు అనివార్యం కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమతుంది. దీంతో ఏ మండలానికి ఏ రిజర్వేషన్ వస్తుందోననే ఆందోళన ఆశావహుల్లో వ్యక్తమవుతుంది. పెరిగిన స్థానాలు ... జిల్లాలో గ్రామీణ మండలాలు గతంలో 17 ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు కొత్తగా ఏర్పాటు చేసింది. బోథ్మండలాన్ని పునర్విభజన చేసి సొనా ల మండలంను, జైనథ్ను విభజించి సాత్నాల, భో రజ్ మండలాలను ఏర్పాటు చేశారు. బేల, ఆదిలా బాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను ఆ యా మండలాల పరిధిలోకిచేర్చారు. దీంతో ఆయా మండలాలకు జెడ్పీటీసీ, ఎంపీపీలు ఎన్నికయ్యే అవకాశముంది. కాగా ఆయా మండల్లాలోని గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను సైతం పునర్విభజన చేశారు. జిల్లాలో గతంలో 158 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పునర్విభజనతో 11 మండల ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ను అదనంగా పెంచారు. దీంతో ఈ సంఖ్య ప్రస్తు తం 169కి చేరింది. మావల మండలంలో రెండు, ఉట్నూర్ గ్రామ పంచాయతీలో నాలుగు స్థానాలను పెంచగా పునర్విభజన జరిగిన మండలాల్లో సొనాల, భోరజ్, సాత్నాల మండలాల్లో మరో ఐదు స్థానాలు పెంచారు. తద్వారా మండల సర్వసభ్య సమావేఽశాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఎలక్షన్ ఫీవర్ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ నెలాఖరులోగా ఎప్పుడైనా షెడ్యూల్ రావచ్చంటూ మంత్రులు సీతక్క, పొంగులేని చేసిన ప్రకటనలు ఆశావహుల్లో జోష్ నింపింది. పోటీకి సై అంటున్న వారు గ్రామాల్లోని ఓటర్ల ను మచ్చిక చేసుకునేపనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి శుభకార్యాలైనా అక్కడ వాలిపోతున్నారు. ఇక గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు ముగిసే వరకు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోసారి వారింటికెళ్లి పరామర్శిస్తున్నారు. మరికొంత మంది ఆశావహులు గ్రామ సమస్యలపై స్థానికులతో వెళ్లి కలెక్టర్, అధికారులను కలుస్తున్నారు. పరిష్కరించాలని కోరుతున్నారు. దీంతో పల్లెల్లో ప్రస్తుతం ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది.జెడ్పీ స్వరూపం ఇలా.. జిల్లాలో.. మండలాలు : 20 ఎంపీటీసీ స్థానాలు : 169 (కొత్తవి 11 ) జెడ్పీటీసీ స్థానాలు : 20 (కొత్తవి 3 ) గతంలో 17 మండలాలుండగా 17 మంది చొప్పు న జెడ్పీటీసీలు, ఎంపీపీలు సభ్యులుగా ఉండేవా రు. ఇందులో నుంచే ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. త్వరలో నిర్వహించనున్న పరిషత్ ఎన్నికల్లో ఈ సంఖ్య 20కి చేరనుంది. కొత్తగా మరో ముగ్గురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు జిల్లా పరిషత్లోకి అడుగుపె ట్టనున్నారు. మండలాల సంఖ్య పెరగడం, గ్రా మ పంచాయతీలు, అక్కడి జనాభాకనుగుణంగా ఎంపీటీసీల పునర్విభజన జరగడంతో ఆయా సా ్థనాల రిజర్వేషన్లు మారనున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అయితే ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎ న్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అదే జరిగితే బీసీలకు కలిసోచ్చే అవకాశం ఏర్పడి సభలో వారి సంఖ్య పెరిగే అవకాశముంటుంది. అయితే ఇప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాకపోవచ్చని పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశముందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్ర భుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విని వెంటనే సంబంధిత పోలీ సు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 54 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికా రిని జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగికి డబ్బులు వాపస్
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ కిలేడీ బాధితుల డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ‘నిరుద్యోగులకు ఎర..’ శీర్షికన ‘సాక్షి’లో శని వారం కథనం ప్రచురితమైంది. ఆదిలాబాద్కు చెందిన ఓ నిరుద్యోగి నుంచి ఉ ద్యోగం ఇప్పిస్తానని రూ.2లక్షలకు బేరం కుదుర్చుకుంది. మొదటగా రూ.20వేలు తీసుకుంది. మిగతావి ఉద్యోగ నియామక పత్రం ఇచ్చాక ఇవ్వాలని తెలిపింది. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె ఫోన్పే ద్వారా రూ.20వేలు పంపినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కాగా, ఆమె నార్నూర్ మండలానికి చెందినట్లు సమాచారం. -
జీవిత గమ్యాన్ని నిర్దేశించారు
మాది రాజస్థాన్లోని సవాయి మాదాపూర్ జిల్లా మలర్నా చౌర్ గిరిజన గ్రామం. నాన్న సీతారాం మీనా. డీపీఆర్వోగా పనిచేశా రు. 1నుంచి 7వరకు హిందీ మీడియంలో, 8 నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివాను. బీహెచ్యూలో ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. నాన్న నాకు బాల్యం నుంచే క్రమశిక్షణతో కూడిన జీవిత గమ్యాన్ని నిర్దేశించారు. ఆ దిశగా ప్రోత్సహించారు. ఐఐటీ అనంతరం సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంట్లో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ విషయాన్ని నాకు తెలియనివ్వకుండా చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగంతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పేవారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేఽసేవారు. సివిల్స్లో ఐదు సార్లు నిరాశ ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే దిశగా మరింత కష్టపడాలని వెన్నుతట్టారు. ఆ ప్రోత్సాహంతోనే ఆరో ప్రయత్నంలో 458వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్గా ఎంపికయ్యా. నా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో మా నాన్నే నాకు రోల్మోడల్. – యువరాజ్ మర్మాట్, సబ్కలెక్టర్, ఉట్నూర్ తల్లిదండ్రులతో యువరాజ్ మర్మాట్ -
బాధితులకు కలెక్టర్ పరామర్శ
● రిమ్స్లో అపరిశుభ్రతపై అసహనం ● వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం ఆదిలాబాద్టౌన్: పిడుగుపాటుకు గురై రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకుని వారి ఆరోగ్య స్థితిగతులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యమందించి త్వరగా కొలుకునేలా చూడాలన్నారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డులోని మరుగుదొడ్లను పరిశీలించారు. అక్క డ అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సమయానికి వస్తున్నారా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ఐదు సార్లు విఫలమైనా వెన్నుతట్టారు
మాది ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామం. నాన్న సత్యనారాయణ జర్నలిస్టు. చిన్నప్పటి నుంచి ఆయనే నాకు స్ఫూర్తి. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను ఐఆర్ఎస్గా ఎంపికయ్యానంటే అది నాన్న అందించిన ప్రోత్సాహమే. చదువు ప్రాధాన్యతతో పాటు ఎన్నికష్టాలు ఎదురైనా లక్ష్యసాధనను మాత్రం వీడొద్దని ఆయన నుంచే నేర్చుకున్నా. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇంద్రవెల్లిలో చదివాను. 6నుంచి 10 వరకు కాగజ్నగర్ జవహర్ నవోదయలో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్లో పూర్తిచేశా. ఐఐటీ గౌహతిలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక సివిల్స్కు సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలో 12 మార్కులతో వెనుకబడ్డాను. రెండో ప్రయత్నంలో మెయిన్స్ కూడా రాలేదు. ఇలా ఐదు ప్రయత్నాల్లో నిరాశే ఎదురైంది. ఆరో ప్రయత్నంలో ఢిల్లీలో కోచింగ్ తీసుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అయినా నా చదువు, భవిష్యత్తు విషయంలో నాన్న ఎప్పుడూ రాజీ పడలేదు. అనునిత్యం నాలో ఆత్మవిశ్వాసం నింపుతూ ప్రోత్సహించారు. పరీక్షలు రాసే సమయంలో భోజనం కూడా చేయకుండా ఓపికగా సెంటర్ వద్దే బయట వేచి ఉండేవారు. ఆరో ప్రయత్నంలో 790వ ర్యాంకు సాధించాను. ప్రస్తుతం నాగ్పూర్లోని ఐఆర్ఎస్ శిక్షణ సంస్థలో ఇన్కంటాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా శిక్షణ పొందుతున్నా. ఇది ముమ్మాటికీ మా నాన్న అందించిన విజయమే. – శుభం రేకుల్వర్, ఐఆర్ఎస్ -
● గమ్యం నిర్దేశించి.. దిక్సూచిగా నిలిచి ● లక్ష్యసాధనలో ఆ త్యాగం అనిర్వచనీయం ● నేడు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం
– మరిన్ని కథనాలు 8లోuనాన్న.. రెండక్షరాల పదమే అయినా ప్రతీ ఒక్కరి జీవితంలో విడదీయరాని బంధం. బాల్యంలో వేలుపట్టి నడక నేర్పే తొలిగురువుగా.. తప్పట డుగులు సరిదిద్దే మార్గదర్శిగా.. లక్ష్యసాధనలో దిక్సూచిగా నిలిచే ఆ స్ఫూర్తి ప్రదాత పాత్ర అనిర్వచనీయం. కనుపాపలను తీర్చిదిద్దే ఆ కనురెప్పల మాటున కనిపించని త్యాగాలెన్నో. బిడ్డల విజయ తీరాన అది ఆనంద బాష్పమై వికసిస్తోంది. జీవిత పయనంలో బాధలెన్ని ఎదురైనా పిల్లల వికాసానికి బాటలు వేసే ఆ అలుపెరగని బాటసారికి సలాం చేయాల్సిందే. తాను సాధించని విజయాలను వారి రూపంలో చూసుకుని మురిసిపోయే ఆ ప్రేక్షకుడికి నీరాజనం పలకాల్సిందే. ఉన్నతస్థాయికి ఎదిగిన తమ విజయంలో ఆయనదే అగ్రస్థానమంటున్నారు ఆ బిడ్డలు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ సక్సెస్లో నాన్న పాత్రపై పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – కైలాస్నగర్ -
అనుక్షణం అండగా నిలిచారు..
మాది తలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన పల్సి(బి)తండా. నాన్న జాదవ్ గోవింద్ రావు హెడ్ కానిస్టేబుల్. మా ఊరిలో తొలి ప్రభు త్వ ఉద్యోగి నాన్నే. చదువుతోనే గొప్ప భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి. చిన్నతనం నుంచే నాకు విద్యా ప్రాధాన్యతను వివరించారు. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూర్లో, ఆరు నుంచి పదో తరగతి వరకు కాగజ్నగర్ నవోదయలో చదివాను. ఇంటర్ హైదరాబాద్లో, తిరుచ్చి ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా ను. నాన్న పోలీస్ శాఖలో పనిచేస్తుండటంతో జిల్లాకు వచ్చిన ఎస్పీ, కలెక్టర్ల గొప్పతనం, వారికి సమాజంలో ఉండే గౌరవం గురించి చెప్పేవారు. ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించేవారు. దీంతో బీటెక్ పూర్తికాగానే ఐఏఎస్ సాధించాలని నిర్ణయించుకున్నాను. తొలి నాలుగు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఐదో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్కు ఎంపికై నా అందులో చేరలేదు. 2024లో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణలో ఉన్నా. పోలీస్ ఉద్యోగమంటే సెలవులుండేవి కావు. కానీ నేను పరీక్షలు రాసే సమయంలో నాన్న నా వెంటే ఉండేవారు. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అనుక్షణం నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన పడిన కష్టం, అందించిన మార్గదర్శనంతోనే నేను విజయం సాధించగలిగాను. – జాదవ్ సాయి చైతన్య, ఐఏఎస్ -
‘కాకా’ మా రియల్ హీరో
నెన్నెల: మా నాన్న గడ్డం వెంకటస్వామి(కాకా) మా కుటుంబానికి రియల్ హీరో. ఆయన పెద్ద కొడుకుగా పుట్టడం నా అదృష్టం. తమ్ముడు వివేక్తోపాటు సోదరీమణులకు ఇంత చక్కటి జీవితాలను ఇచ్చినందుకు ఆయనకు ఎల్లకాలం రుణపడి ఉంటాం. వివేక్కు, నాకు ప్రస్తుతం సమాజంలో లభిస్తున్న గౌరవం, మర్యాదల క్రెడిట్ మొత్తం మా నాన్నగారికే పోతుంది. చిన్ననాడు నడక నేర్పిన నాటి నుంచి పాఠశాల, కళాశాల విద్య ఆయన మార్గనిర్దేశంలోనే కొనసాగాయి. నాన్న ఆశీర్వాదంతోనే రాజకీయాల్లోకి రాగలిగాను. ఎస్సీఏ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలు అందించగలిగాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వెంకటస్వామి చేసిన కృషి అందరికీ తెలుసు. ఆయన చివరి శ్వాస వరకు నిరుపేదల అభ్యున్నతి కోసం తాపత్రయ పడిన వ్యక్తి. కాకా సూచన మేరకు డాక్టర్ అంబేద్కర్ పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేసి 1.50లక్షల మందికి ఉన్నత చదువులు అందించగలిగాం. ఫాదర్స్డే సందర్భంగా నాన్నగారిని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తాను. అందరికీ ఫాదర్స్డే శుభాకాంక్షలు. – గడ్డం వినోద్, బెల్లంపల్లి ఎమ్మెల్యే కాకాతో వినోద్, వివేక్(ఫైల్) -
నాన్నే.. రోల్మోడల్..
నిర్మల్: మానాన్న బీఎన్.సర్కార్. జార్ఖండ్ కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. మేం నలుగురం పిల్లలం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. మా అందరినీ నాన్న బాగా చదివించారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మా గురించి ప్రతిరోజు ఆలోచించేవారు. అందుకు తగ్గట్లుగానే ఈరోజు అందరం ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాం. న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చదివిన నాన్న మమ్మల్ని కూడా చదువులో ప్రోత్సహించారు. అందుకే పబ్లిక్ పాలసీలో డబుల్ మాస్టర్స్, సోషియాలజీలో మాస్టర్స్ చదివాను. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకోవాలని నాన్నే నాకు సూచించారు. ఐఏఎస్ సాధించడంలోనూ నాన్న అడుగడుగునా వెన్నుతట్టి ప్రోత్సహించారు. నా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికీ చాలా విషయాల్లో నాన్నే రోల్మోడల్. – అభిలాష అభినవ్, కలెక్టర్, నిర్మల్ -
సలహాలిచ్చి.. చైతన్యపరిచి
తక్కువ మోతాదులో వాడాలి సాగులో రసాయన ఎరువుల మోతాదు తగ్గించుకుంటే పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రధానంగా యూరియాను ఎక్కువ వినియోగించొద్దు. పంట మార్పి డి పద్ధతితో సుస్థిర ఆదాయం పొందవ చ్చు. విత్తనాల కొనుగోలులో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించాం. – డాక్టర్ రాంప్రసాద్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆదిలాబాద్అర్బన్: అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వ్యవసాయ రంగం మాత్రం ఆ దిశగా ముందుకు సాగడం లేదు. ఇందుకు కార ణం సాగుపై రైతులకు అవగాహన లేకపోవడమేనని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వానాకాలం సాగుకు ముందే అన్నదాతలను సంసిద్ధం చేయాలనే ఆలోచనతో శాస్త్రవేత్తల బృందాలను నేరుగా గ్రామాలకు పంపించి అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం మే 5న ప్రారంభం కాగా, శుక్రవారంతో ముగిసింది. రైతులతో నేరుగా.. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లోని రైతులతో నేరుగా శాస్త్రవేత్తలు చర్చలు జరిపారు. వ్యవసాయ అధికారులతో పాటు కృషి విజ్ఞానకేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సంయుక్తంగా రెండేసి బృందాలుగా ఏర్పడి రోజుకో గ్రామాన్ని సందర్శిస్తూ రైతులతో సమావేశమయ్యారు. సాగుపై సలహాలు, సూచనలు ఇస్తూ, వారికున్న సందేహాలను నివృత్తి చేశారు. రైతుల చెప్పిన విషయాలను సైతం నమో దు చేసుకున్నారు. రసాయన ఎరువులు మోతాదులోవినియోగించడం, పంటలమార్పిడి, పత్తి, సో యా, మొక్కజొన్న, జొన్న తదితర పంటల వ్యర్థాలను పొలాల్లో కాల్చకుండా ఏ విధంగా తీసివేయాలనే దానిపై అవగాహన కల్పించారు. విత్తనాలు కొనుగోలు సమయంలో ఏ అంశాలు పరిశీలించాలి.. కొన్న తర్వాత రశీదు, ప్యాకెట్లను భద్రపర్చుకోవడం, పొలంగట్లపై మొక్కలు నాటడం, తదితర విషయాలను వివరించారు. ప్రధానంగా యూరి యా అధిక వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. నేల సారవంతం, పర్యావరణం, మానవ ఆరోగ్యంపై చూపే ప్రతి కూల ప్రభావాలను వివరించారు. ఈ సమావేశాలు జిల్లాలో ఆరు వారాల పాటు కొనసాగాయి. రైతులతో నేరుగా సమావేశాలు వానాకాలం సాగుపై సందేహాల నివృత్తి ఆరు వారాల పాటు అవగాహన కార్యక్రమాలు ముగిసిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ జిల్లాలో.. నిర్వహించిన అవగాహన సదస్సులు : 52 పాల్గొన్న రైతులు : 2,600 -
రాజీమార్గమే రాచమార్గం
ఆదిలాబాద్టౌన్: రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. బీమా, యాక్సిడెంట్ తదితర రాజీ పడదగిన పలు కేసులను పరిష్కరించారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ మూడు నెలలకోసారి జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు, బీమా కంపెనీలు, న్యాయవాదుల సహకారంతో అత్యధికంగా కేసులను రాజీ మార్గంలో పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నపాటి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జిలు శివరాంప్రసాద్, రాజ్యలక్ష్మి, వివే క్, లక్ష్మి, హుస్సేన్, ఏఎస్పీ సురేందర్రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. 12,490 కేసులు పరిష్కారంజిల్లాలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో జిల్లావ్యాప్తంగా 12,490 కేసులు పరిష్కారమైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 2,944 క్రిమినల్, 19 సివిల్, 9527 ప్రిలిటిగేషన్ కేసులున్నాయి. కేసుల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలో జిల్లా 22వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ● జిల్లా జడ్జి ప్రభాకర రావు -
ఇన్చార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావు ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం..ఉట్నూర్రూరల్: పిడుగుపాటుకు గురైన మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని వి ధాలా ఆదుకుంటుందని ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గాదిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో నలుగురు, బేల మండలంలోని పొన్కాస్, సాంగ్విడి గ్రామంలో ఇద్ద రు పిడుగు పాటుతో మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసిన అనంతరం మాట్లాడారు. -
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామని ఆ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో 33 కేవీ, 11కేవీ సుదూరమైన లైన్లలో ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రేక్డౌన్, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాలతో లైన్లు మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేట్ ఇస్తుందని పేర్కొన్నారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 18 ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక వ్యూహాత్మక 50 ప్రదేశాలను గుర్తించినట్లు వివరించారు. -
బడుగులపై పిడుగులు
జాగ్రత్త మరవద్దుఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప డుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ము ప్పు తప్పించుకోవచ్చు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలు వినిపిస్తే వెంటనే అక్కడ నుంచి దూరంగా వెళ్లాలి. పంట చేన్లలో ఉన్నప్పుడు వీలైనంత తొందరగా ఇళ్ల కు చేరుకోవాలి. సమీపంలో ఉన్న నివాస స్థలాలకు వెళ్లాలి. ఇళ్లలో విద్యుత్ పరికరాలు వినియోగించరాదు. సెల్ఫోన్లు, చార్జింగ్ చే యడం, ఐరన్, వాటర్ హీటర్లు, గీజర్లు వాడరాదు. ఇళ్లకు లైటనింగ్ కండక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా పిడుగుపాటుకు ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అధికంగా పంట చేన్లలో పని చేస్తుండగానే మృత్యువాత పడుతున్న ఘటనల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు చనిపోతుండడం తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. పేద, మధ్య తరగతి రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. బాధిత కుటుంబాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. వానా కాలంలో పశువులు, జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ప్రతీ సీజన్లో అనేకమంది తమ జీవాలను కోల్పోతున్నారు. పిడుగుపాటుపై చాలామందికి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఎక్కువగా చేన్లలో పని చేస్తున్న సమయంలోనే నష్టం జరుగుతోంది. పంట చేన్లలో పని చేసే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిడుగు అంటే.. ఆకాశంలో సహజసిద్ధంగా ఏర్పడే విద్యుత్పాతమే పిడుగుగా పేర్కొంటారు. సూర్యరశ్మి అధికంగా తాకి, తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్లి, అధిక బరువున్న రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి. ఈ రెండింటి మధ్య దూరం పెరిగితే ధనావేశం గాలి కోసం భూమి వైపు రుణావేశ మేఘాలు వచ్చే క్రమంలో శక్తివంతమైన విద్యుదుత్పాతం ఏర్పడుతుంది. దీనినే పిడుగు అంటారు. ఒక్కో పిడుగు వేల డిగ్రీల సెల్సియస్ శక్తిని విడుదల చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా పిడుగులు పడతాయి. రూ.6లక్షలు పరిహారం గతంలో కేవలం ఆపద్బంధు పథకం కింద నామమాత్రంగానే పరిహారం చెల్లించేవారు. ప్రస్తుతం పిడుగుపాటుకు మరణించిన వారికి రూ.6లక్షలు పరిహారంగా అందజేస్తున్నారు. పిడుగుపాటుతో మరణించినట్లు స్థానిక రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులు ధ్రువీకరించాలి. అయితే పరిహారం పొందడంలో కొన్నిసార్లు జాప్యం జరుగుతోంది. స్మార్ట్ఫోన్లలోనూ.. వాతావరణ మార్పులు ఇప్పుడు స్మార్ట్ఫోన్లలోనూ తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్, వాట్సాప్ల్లోనూ అల ర్ట్ పొందవచ్చు. ఐఎండీ(ఇండియన్ మెటీరియలా జిక్ డిపార్ట్మెంట్)తోపాటు పిడుగు పడే ప్రాంతా లను ముందుగానే తెలియజేసే ‘దామిని’తోపాటు ఇతర యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా స్థానిక కేవీకే, వ్యవసాయ, ప్రణాళిక శాఖ అధికారుల వద్ద వాతావరణ పరిస్థితులు ముందస్తుగా తెలుసుకోవచ్చు. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ముందస్తుగా తెలుసుకుంటూ ప్రాణాలతోపాటు ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఏటా ఉమ్మడి జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం పంట చేన్లలో మరణాలు, జీవాల మృత్యువాత అవగాహన లేక పెరుగుతున్న ముప్పుచెట్ల కింద ఉండొద్దువర్షం పడితే చాలామంది చెట్ల కింద తడవకుండా ఉండేందుకు వెళ్తుంటారు. అయితే చెట్లు, ఎత్తయిన కొండలు, నీటి నిల్వ ప్రదేశాలు మరింతగా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. చెట్ల కింద చెరువులు, కాలువల వద్ద ఉండకూడదు. ఒకే చోట అందరూ గుంపులుగా ఉండకూడదు.ఒకే రోజు ఆరుగురుఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్పిరిలో పంట చేనులోనే నలుగురు, బేల మండలం సాంగిరిలో ఇద్దరు మొత్తం గురువారం ఒకే రోజులో ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఉట్నూరు మండలం కుమ్మరితండాలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు. -
కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి
బాసర: విద్యార్థులకు తమ ప్రసంగాల్లో పదాలు, వాక్యాల నిర్మాణంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతగానో అవసరమని ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సూచించారు. ఇంగ్లిష్ విభాగం, ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు, అధికారులకు వివిధ సందర్భాల్లో సరైన భాష, వ్యాకరణం, శైలి, ఫార్మాట్ లోపం లేకుండా లేఖలు రాయడానికి ఉపయోగపడే లేఖ నమూనాలను రూపొందించి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ.. నమూనా లేఖలు స్టూడెంట్ హబ్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాటి ఆధారంగా విద్యార్థులు, అధికారులకు వివిధ అవసరాల కోసం సరైన రూపంలో, నిష్పాక్షికంగా లేఖలు తయారు చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, ఇంగ్లిష్ విభాగాధిపతి శ్రీఅప్సింగర్ విజయ్కుమార్, ఇంగ్లిష్ విభాగ అధ్యాపకులు, ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
● వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డిఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారా యణ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భా గంగా జిల్లా కేంద్రంలోని ఎన్జీవో పాఠశాలతో పా టు పలు పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన సామూహిక అక్షరభ్యాస కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆర్జేడీ ఓనమాలు దిద్దించారు. అనంతరం మాట్లాడుతూ సర్కారు బడుల బలోపేతం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్రూరల్: మండలంలోని తంతోలి ఎంపీయూపీఎస్లో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆర్జేడీ పాల్గొన్నారు. విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో డీఎడ్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి ఈ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4,085 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాల్సి ఉండగా, 3,155 మంది హాజరైనట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. 20న సీట్ల కేటాయింపు, 21 నుంచి 24 వరకు ఫీజు చెల్లింపు, 26న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
విద్యాభివృద్ధికి కృషి
బజార్హత్నూర్: బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ అన్నా రు. మండలంలోని జాతర్ల గ్రామంలో పార్డి(బి), పట్నాపూర్, మాడగూడ గిరిజన బాలుర, బాలిక ఆశ్రమ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన సా మూహిక అక్షరాభ్యసన కార్యక్రమంలో బోథ్ ఎమ్మె ల్యే అనిల్ జాదవ్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, ఏసీఎంవో అర్క జగన్, జీసీడీవో చాయ, ఏటీడీవో అమిత్, ఎంఈవో కిషన్గుప్తా, ప్రధానోపాధ్యాయులు కిషన్రెడ్డి, చందన్, శ్రీనివాస్, సుదర్శన్, కృష్ణారావ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యబోథ్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీ నగేశ్ అన్నారు. సొనాల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఇందులో జీవీ.రమణ, రాజు తదితరులు పాల్గొన్నారు. సూచనలు పాటించాలి రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఎంపీ నగేశ్ అ న్నా రు. సొనాల మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, వికసిత్ కృషి సంకల్ప కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మొక్కలు నాటారు. ఇందులో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
● ‘జిల్లా ఇన్చార్జి మంత్రి’పై సర్వత్రా చర్చ ● హాట్టాపిక్గా సీతక్క మార్పు ● గతంలోనే ఆమైపె ‘మీనాక్షి’కి ఫిర్యాదు ● అప్పట్లోనే తప్పుకుంటానన్న మినిస్టర్ ● తాజాగా ఆమె నిజామాబాద్కు.. అక్కడి నుంచి ‘జూపల్లి’ ఇక్కడికి
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ఆ బాధ్యతల నుంచి త ప్పించారా..లేనిపక్షంలో ఆమే తప్పుకున్నారా.. అనే చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జిలు సీతక్క తమను పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నట రాజన్కు అప్పట్లో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. అప్పుడే తాను జిల్లా ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆమె మీనాక్షి ముందే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అటు నుంచి ఇటు.. ఇటునుంచి అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించారు. అక్కడి నుంచి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి ఆదిలాబాద్కు ఇన్చార్జిగా కేటాయించారు. ప్రస్తుతం పార్టీలో ఈ నిర్ణ యం హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జూపల్లి ఇక్కడి నేతలను సమన్వయం చేస్తూ పార్టీ విజయానికి ఏ విధంగా కృషి చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీతక్కకు కలిసిరాని ఎన్నికలు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కకు ఆదిలాబాద్ పార్లమెంట్, పట్టభద్రుల, ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎన్నికల ప్రణాళిక సరిగా రూపొందించడంలో సీతక్క ఫెయి ల్ అయిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా నియోజకవర్గాల్లో సీనియర్ నేతల రాజకీయ అనుభవం ఉపయోగించుకోవడంలో ఆమె సమన్వ యం చేయలేకపోయారనే అపవాదు వ్యక్తమైంది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో గ్రూపురాజకీయాలు పెరగడం కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని చర్చ సాగింది. ఇదే విషయంలో మీనాక్షి నట రాజన్ పార్టీ ఓటమికి కారణాలపై ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా వి శ్లేషించారు. అంతేకాకుండా ఇటీవల హైదరా బాద్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అ సెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలను ఒక్కొక్కరి నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాతనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మార్పు ఖాయమనే ప్రచారం సాగింది. తాజాగా అదే జరిగింది. కొత్త ఇన్చార్జి మంత్రికి సవాలు.. ఉమ్మడి జిల్లాకు కొత్త ఇన్చార్జి మంత్రిగా రానున్న జూపల్లికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే ఆయన ముందున్న ప్రధాన సవాలు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో నాలుగు చోట్ల బీజేపీ, రెండు చోట్ల బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ప్రాతి నిధ్యం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినవారు నియోజకవర్గ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.వీటిపై ప్రభావం పడేనా..పార్టీ పరంగా ప్రస్తుతం పట్టణ, మండల, బ్లాక్ కమిటీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. కమిటీలకు సంబంధించి ఇప్పటికే ప్రతి మండలం, పట్టణంలో సమావేశాలు నిర్వహించి ఐదేసి పేర్లను అధిష్టానానికి నివేదించారు. అది ఖరారు కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈనెల చివరిలో డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక మంచిర్యాలకు కొక్కిరాల సురేఖ, నిర్మల్కు శ్రీహరిరావు, కుమురంభీం ఆసిఫాబాద్కు విశ్వప్రసాద్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ నెలలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం జరగనుండగా, కొత్త ఇన్చార్జి మంత్రి రానుండడంతో వీటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది పార్టీలో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. -
రైతులను మోసగించిన వ్యక్తి అరెస్ట్
భైంసాటౌన్: కుభీర్ మండలంలోని జాంగామ్కు చెందిన రైతులను మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్కుమార్ తెలిపారు. శుక్రవా రం పట్టణంలోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కుభీర్కు చెందిన సంగి శ్రీనివాస్ జల్సాగా తిరుగుతూ, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడేవాడు. కొద్దిరోజులకు కుభీర్ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థకు సీఈవోగా, భైంసాలోని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) సంస్థకు ఏజెంట్గా పని చేస్తున్నాడు. రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి మ్యాక్స్కు విక్రయించి, రైతులకు డబ్బులు చెల్లించేవాడు. ఇలా కొ ద్దిరోజులు రైతులను నమ్మించాడు. ఈ క్రమంలో గ తంలో బెట్టింగ్తో చేసిన అప్పులు తీర్చేందుకు రైతులను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు కుభీర్ మండలం జాంగామ్లో రైతుల నుంచి రూ.13,37,144 విలువైన 690క్వింటాళ్ల మొక్కజొ న్నలు కొని డబ్బులు చెల్లించకుండా పారిపోయా డు. దీంతో రైతులు కుభీర్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కుభీర్లోని పార్డి(బి) ఎక్స్రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించామని తెలిపారు. అతడి నుంచి రూ.9లక్షల నగదు, రిసిప్ట్ బుక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లోకేశ్వరం మండలం మన్మధ్, బామ్ని గ్రామాల్లో 32మంది రైతుల నుంచి 3,685 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి మో సగించినట్లు తెలిపారు. కేసు విచారణ, నిందితుడిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన రూరల్ సీ ఐ నైలు, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి, నిర్మల్ ఐటీ టీంను ఎస్పీ జానకీ షర్మిల అభినందించినట్లు చెప్పారు. -
రక్తదానం.. ప్రాణదానం
ఇప్పటివరకు 46సార్లు.. పాతమంచిర్యాల: నాది ఏబీ నెగెటివ్ బ్లడ్ గ్రూప్. ఇప్పటివరకు 46సార్లు రక్తదానం చేశాను. కలెక్టర్లు, గవర్నర్ ద్వారా ప్రశంసాపత్రాలు అందుకున్నాను. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాను. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో నిల్వలు ఉండేలా కృషి చేస్తున్నాను. రక్తదాతలకు ప్రమాద భీమా పాలసీ అందజేస్తున్నాం. – మధుసూధన్రెడ్డి, లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధి ఎవరు ఫోన్ చేసినా వెళ్తా.. పాతమంచిర్యాల: నాకు రక్తదానంపై అవగాహన ఉంది. ఇప్పటివరకు 15 సార్లు రక్తదానం చేశా ను. 10 సార్లు ప్లేట్లెట్లు దానం చేశా ను. నాది ఏ నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి ఎవరు ఫోన్ చేసినా వెళ్లి రక్తం ఇస్తున్నాను. – మహ్మద్ మజార్, జాఫర్నగర్, మంచిర్యాల ● ఆపదలో ‘సామాజిక’ నేస్తాల అండ ● ప్రత్యేక గ్రూపుల ద్వారా బాధితులకు భరోసా ● ప్రాణదాతలుగా నిలుస్తున్న యువత ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పాతమంచిర్యాల/ఆసిఫాబాద్అర్బన్/నిర్మల్ఖిల్లా: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమయాల్లో వైద్యులు ఒకరి నుంచి రక్తాన్ని సేకరించి మరొకరికి ఎక్కించి ప్రాణాపాయం నుంచి కాపాడుతారు. సికిల్సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీవారం లేదా ప్రతీ నెల క్రమంతప్పకుండా రక్తం ఎక్కించాల్సిందే. అలాంటి వారికి రక్తదాతలు నిజంగా ప్రాణదాతలే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు తమ రక్తాన్ని దానం చేసి ఇతరుల ప్రాణాలు నిలుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఉమ్మడి జిల్లాలో సేవలు ఇలా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ ఇంటర్నేషనల్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు కొ ద్ది సంవత్సరాలుగా రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులు, ప్రభుత్వాస్పత్రుల్లోని గర్భిణులు, వివిధ ప్ర మాదాల బాధితులకు అందిస్తున్నారు. అలాగే కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కొన్ని స్వ చ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే శిబిరాల్లో యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తూ పలు వురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతీ శిబిరంలో తప్పనిసరిగా 20నుంచి 50 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రక్తదానం ఆవశ్యకతను మరో నలుగురికి తెలియజేయాలనే సంకల్పంతోనే పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా బాధితులకు చేరువవుతున్నారు. నిర్మల్ జి ల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్ర మోద్కుమార్, బైంసా పట్టణానికి చెందిన యోగేశ్ రక్త గ్రూపుల వారీగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ‘ప్రేరణ యువసేన’ పేరిట బాధితులకు రక్తాన్ని స మకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు వందలాది మందికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలకేంద్రానికి చెందిన మునిగెల శ్రీధర్ శుద్ధోధన్, శ్రీనివా స్, నిర్మల్ జిల్లాకు చెందిన కొప్పుల నవీన్, సాగర్ తదితరులు ‘జైహింద్’ గ్రూపును 2018లో ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా రక్తదానం చేసినట్లు వీరు తెలిపారు. ఎవరు రక్తదానం చేయొచ్చంటే..ఆరోగ్యవంతులుగా ఉన్న 18–60 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నా రు. అయితే.. దీర్ఘకాలిక వ్యాధులు, హెచ్ఐవీ, రక్తపోటు, హైపటైటీస్ ఉన్నవారు రక్తదానం చేయరా దని పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి రక్తదానం చేసిన తర్వాత తిరిగి మూడు నెలలకు మళ్లీ రక్తదానం చేయవచ్చని సూచిస్తున్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనని పేర్కొంటున్నారు. రక్తదానం చేసే సమయంలో ఇతర వ్యాధులు సోకుతాయనే మాటల్లో నిజం లేదని తెలిపారు. అవన్నీ అపోహలేనని చెబుతున్నారు. రక్తదానం ప్రాణదా నంతో సమానమని, పైగా రక్తదానం చేస్తే శరీరంలో ని అవయవాలు సక్రమంగా పనిచేయడంతో పాటు రక్తం శుద్ధి అవుతుందని సూచిస్తున్నారు.అత్యవసరాల్లో తప్పకుండా చేస్తా పాతమంచిర్యాల: నాది ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం. అత్యవసర సమయాల్లో ఏ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చినా రాత్రి, పగలు అనే తేడా లేకుండా వెళ్లి రక్తదానం చేస్తున్నాను. రక్తం అవసరమైనపుడు బ్లడ్బ్యాంక్ వారు సమాచారమిచ్చినా వెంటనే వెళ్లి రక్తం ఇస్తున్నాను. – నంది రాజేంద్రప్రసాద్, ఇటిక్యాల 25 ఏళ్లుగా ఇస్తున్న పాతమంచిర్యాల: నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఇప్పటివరకు 80 సార్లు రక్తదానం చేశాను. పుట్టినరోజు, అయ్యప్ప దీక్ష తీసుకునే రోజు తప్పనిసరిగా రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తం ఇస్తాను. నా స్నేహితులతో కూడా రక్తదానం చేయిస్తున్నాను. రక్తదానం.. మహాదానం. – పెద్దపల్లి లక్ష్మీకాంత్ పదేళ్లుగా సేవలో.. పాతమంచిర్యాల: పదేళ్లుగా రక్తదా నంపై అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు 2,600 మందికి రక్తదానం చేయించా ను. అత్యవసర వేళల్లో దాతలను పిలిపించి రక్తం ఇప్పిస్తున్నాను. – అబ్దుల్ రహీం, రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ, మంచిర్యాల 40 సార్లు చేశాను ఆసిఫాబాద్అర్బన్: ఇప్పటివరకు నేను 40 సార్లు రక్తదానం చేశాను. 16 ఏళ్లుగా రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. రక్తాన్ని దానం చేయడం అదృష్టంగా భావిస్తాను. – వైరాగడే ప్రతాప్, ఆసిఫాబాద్సేవలోనే సంతృప్తి భైంసాటౌన్: ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని భావించాం. ఇందుకు ఐక్య త సేవాసమితి గ్రూపును ఏర్పాటు చేశాం. రక్తదానం చేస్తున్నాం. ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రక్తం అవసరమైన వారికి వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్నాం. – యోగేశ్, ఐక్యత సేవాసమితి అడ్మిన్, భైంసారక్తదాతలను ప్రోత్సహిస్తా ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్బ్యాంక్కు దాతలతో వెయ్యి యూనిట్ల రక్తం ఇప్పించాను. అత్యవసర సమయాల్లో ఎంతోమందిని ఆదుకున్నాను. నేను 10 సార్లు రక్తదానం చేశాను. ఎవరికైనా రక్తం అవసరమైతే 8639434390 నంబర్లో సంప్రదించాలి. – మాడిశెట్టి ప్రశాంత్, సామాజిక కార్యకర్త 100 సార్లు ఇవ్వడమే నా లక్ష్యం ఆసిఫాబాద్అర్బన్: నేను ఇప్పటివరకు 34 సార్లు రక్తదానం చేశాను. 100 సార్లు రక్తం ఇవ్వాలన్నదే నా లక్ష్యం. రక్తదానంపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాను. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు నిలపడం ఎంతో సంతృప్తినిస్తుంది. – ఎండీ మొయినొద్దీన్, ఆసిఫాబాద్ వెంటనే స్పందిస్తాం భైంసాటౌన్: బ్లడ్ డోనర్ గ్రూప్ ద్వారా అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నాం. రక్తం అవసరమని గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వెంటనే స్పందిస్తాం. ఇప్పటివరకు వందలాదిమందికి గ్రూపులోని సభ్యులు రక్తదానం చేశారు. ఇలాగే సేవలను కొనసాగిస్తాం. – సురేశ్, బ్లడ్ డోనర్ గ్రూప్ అడ్మిన్, భైంసా రక్తదాన దినోత్సవ నేపథ్యం1901లో ఆస్ట్రేలియాకు చెంది న నోబెల్ విజేత కార్ల్ లాండ్స్టీనర్ మొదటిసారిగా ర క్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతికి గుర్తుగా ప్రపంచ రక్తదాత ల దినోత్సవాన్ని ఏటా జూన్ 14వ తేదీన నిర్వహిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపం చ దేశాలు జూన్ 14వ తేదీన రక్తదాన దినోత్సవాన్ని 2004నుంచి నిర్వహిస్తున్నాయి. -
చికిత్స పొందుతూ మృతి
ఇంద్రవెల్లి: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడు మృతి చెందిన ట్లు ఎస్సై సాయన్న తెలిపా రు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. మండలంలోని హర్కపూర్ ఆంద్గూ డ గ్రామానికి చెందిన మస్కే రామేశ్వర్ (25) ఈ నెల 11న ఇంద్రవెల్లికి చెందిన షేక్ సాజిద్తో కలిసి ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్కు వెళ్లాడు. రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో మండలంలోని శంకర్గూడ సమీపంలో ప్రధాన రహదారిపై ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కా రు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామేశ్వర్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు, కుటుంబ సభ్యులు ఆ దిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండగా నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చిక్సిత పొందుతూ మృతి చెందాడు. తల్లి విమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిడుగు పడి ఎద్దు మృతి నార్నూర్: మండలంలోని తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రకాశ్ అనే రైతుకు చెందిన ఎద్దు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడు గు పడి మృతి చెందింది. వారంరోజుల ముందే విద్యుత్షాక్తో ఒక ఎద్దు మృతి చెందగా.. పిడుగు పడి ఇప్పుడు మరో ఎద్దు మృతి చెందిందని బాధిత రైతు వాపోయాడు. మృతి చెందిన ఎద్దు విలువ రూ.50వేలు ఉంటుందని పేర్కొన్నాడు. బైక్ చోరీ నిందితుల అరెస్ట్ మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో బైక్ చోరీలకు పా ల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ట్లు స్థానిక సీఐ ప్రమోద్రావు తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ, ముఖరాం చౌరస్తా ప్రాంతాల కు చెందిన భరత్రేణ్వా, కుడుదుల శ్రీనుకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలు ఇటీవల చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఐబీ చౌరస్తా వ ద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న స్థానిక సూ ర్యనగర్కు చెందిన గుండేటి రాకేశ్, బొల్లి ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా కుడుదుల శ్రీను కు చెందిన బైక్, భరత్ రేణ్వాకు చెందిన స్కూటీని దొంగిలించినట్లు వారు ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
● పాఠశాలల్లో పోస్టులంటూ ప్రకటన ● ఉద్యోగాల పేరిట వసూళ్లు ● మోసపోతున్న యువత ● స్వచ్ఛంద సంస్థల పేరిట దందా ● తాజాగా ‘మల్టీలెవల్’ మోసం
ఆదిలాబాద్టౌన్: నిరుద్యోగ యువత అవసరం.. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కేటుగాళ్లు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. ఈ ఘటనలు జిల్లాలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. వివిధ శాఖల్లో అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని ఎర వేస్తున్నారు. డబ్బులు తీసుకొని కనిపించకుండా పోతున్నారు. కొందరు రేపుమాపు అంటూ తిప్పుకుంటున్నారు. తీరా బాధితులు మో సపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేటుగాళ్లు కటకటాల పాలవుతున్నారు. తాజాగా మళ్లీ కొంత మంది ఉద్యోగాల పేరిట మోసం చేసేందుకు రంగంలోకి దిగారు. వి ద్యాశాఖలో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం పేరిట ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు రూ.2లక్షలు డిమాండ్ చేస్తూ మొదటగా రూ.లక్ష వరకు అడ్వాన్స్తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీ వల పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేసి రి మాండ్కు తరలించారు.ఇచ్చోడలో లెక్చరర్గా పని చేస్తున్న ఇంగోలు సత్యనారాయణ మల్టీలెవల్ మా ర్కెటింగ్కు ఆకర్షితుడై అమాయకులను మోసం చే యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాలల్లో ఉద్యోగాల పేరిట టోకరా.. రెండేళ్లుగా పాఠశాలలు పునఃప్రారంభమైన సమయంలో కేటుగాళ్లు నిరుద్యోగులకు వల విసురుతున్నారు. గతేడాది విద్యాంజలి పేరిట పలు స్వచ్ఛంద సంస్థలు నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకున్నా యి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2లక్షల వరకు తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ పేరిట నకిలీ నియామక పత్రాలు అందించారు. విద్యాశాఖ అధికారులకు సమాచారం లేకుండానే ఈ దందా చేపట్టారు. మళ్లీ ఈ ఏడాది సైతం ఓ స్వచ్ఛంద సంస్థ అలాంటి దందాకే తెర లేపింది. జిల్లాలోని ఏడుపాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా యని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ దందావెనుక నార్నూర్కు చెందిన ఓ కిలేడీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ.2లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే గురువారం హైదరాబాద్లో ఇంటర్వ్యూ పేరిట పరీక్షలు రాయించి కొంత అడ్వాన్స్గా తీసుకున్నట్లు తెలు స్తోంది. ఈ ఘటన విద్యాశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎలాంటి నోటిఫికేషన్, సమాచారం లేకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. శుక్రవా రం శుభ ముహూర్తం కావడంతో అమ్మవారికి మొ క్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సరస్వతీ, మహాలక్ష్మీ, మహాకాళీ అమ్మవార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారి ని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరినదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి దర్శనా నికి మూడు గంటలు పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక అక్షరాభ్యాసం, సాధారణ అక్షరా భ్యాసం, అద్దెగదులు, చండీహోమం, శ్రీసత్యనారా యణ పూజ, వాహన పూజ టికెట్ల ద్వారా మొత్తం రూ.9,78,727 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. వేలం ద్వారా ఆదాయంఆలయ పరిధిలోని దుకాణాసముదాయాలకు ఏడా ది కాలపరిమితితో సీల్డ్, బహిరంగ వేలం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పండ్లు అమ్ముకునే హ క్కుల ద్వారా రూ.12.50లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా రూ.2.16లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు కోసం రూ.16.11లక్షలు, లక్ష్మి సదనం వెనుక వైపు గల షాప్నకు రూ.3,21,07 ఆదాయం సమకూరినట్లు సుధాకర్రెడ్డి తెలిపారు. మొత్తం టెండర్ల ద్వారా రూ.33,98,007 ఆదాయం వచ్చనట్లు పేర్కొన్నారు. ఆలయ ఏఈవో సుదర్శన్గౌడ్, జిల్లా దేవాదాయశాఖ పరిశీలకుడు రవికిషన్, ఎస్బీఐ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మృతుల వివరాలు
సాక్షి, ఆదిలాబాద్/నార్నూర్/బేల: వారంతా మట్టి మనుషులు.. మట్టినే నమ్ముకుని జీవించేవారు.. ఆ మనుషుల మధ్య ఉన్న ఆత్మీయత ఎంతచెప్పినా త క్కువే.. భార్యాభర్తలిద్దరు పిల్లలతో కలిసి తమ చేనులో విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలు వేసే మిగతావారు కూడా ఈ కుటుంబానికి దగ్గరి సంబంధీకు లే. అంతా ఆదివాసీ గిరిజనులే. వీరంతా హుషారుగా విత్తనాలు వేశారు. మధ్యాహ్నం కావడంతో 14 మంది ఒకే దగ్గర భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో వర్షం రావడంతో అంతా వెళ్లి సమీపంలోని చిన్న గు డిసెలో ఒకే దగ్గర కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి పక్కనున్న టేకు చెట్టుపై భారీ శబ్దంతో పి డుగు పడింది. ఉలిక్కిపడేలోపే గుడిసెలోని నలుగు రు ప్రాణాలు విడిచారు. ఆ మట్టిపైనే నేలకొరిగారు. మిగతా వారు చెల్లాచెదురుగా పడిపోయి గాయాలతో బయటపడ్డారు. ఇది గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘటన. జిల్లాలో మరో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో బేల మండలంలోని ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మొత్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని కలిగించాయి. బాధిత కుటుంబాల్లో విషాదం.. గాదిగూడ మండలం పిప్పిరికి చెందిన పెందూర్ మాధవరావు తన చేనులో భార్య, కుమారులు, కూ తురుతో పాటు దగ్గరి సంబంధీకులైన 14 మందితో కలిసి గురువారం మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. పిడుగుపాటుకు గురై మాధవరావు, ఆయన కూతురు పెందూర్ సంజన అలియాస్ సుజాత, సంబంధీకులు సిడం రంభాబాయి, మంగం భీమ్బాయి మృతిచెందారు. ఈ ఘటనలో మాధవరావు భార్య పెందూర్ రేణుక, ఇద్దరు కుమారులు పెందూర్ జంగు, పెందూర్ శేఖు గాయపడ్డారు. సిడం రాంబాయి కుమారుడు సిడం శంకర్, మంగం భీమ్బాయి కూతురు మంగం నందిని కూడా గాయాలపాలయ్యారు. వీరితో పాటు దగ్గరి సంబంధీకులైన హెచ్కే ఈశ్వర్, మర్సుకోల అంజలి, మర్సుకోల సోము, గెడం శంభు, గుణవంత్రావు కూడా గాయపడ్డారు. ఇక బేల మండలంలోని సాంగిడి, సోన్కా స్ గ్రామాల్లో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపాటుకు మహిళా కూలీలు గెడం నందిని, కోవ సునీత మృతిచెందారు. వీరిరువురికి భర్త, పిల్లలున్నారు. కాగా, క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని పలువురు పరామర్శించారు.పిడుగుపడి కుమ్మరితండాలో ముగ్గురికి గాయాలుఉట్నూర్రూరల్: మండలంలో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడగా మండలంలోని కుమ్మరితండాకు చెందిన ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరితండాకు చెందిన ధర్మరాజు, కృష్ణబా యి, నిర్మల గురువారం చేను పనులకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పంటచేనులోని పశువులపాక సమీపాన ఉన్న చెట్టుపై పిడుగు పడగా అ క్కడే ఉన్న ముగ్గురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతున్నారు. పిడుగు పడిన ఘటనలో గాదిగూడ మండలం పి ప్పిరి గ్రామానికి చెందిన తండ్రి, కూతురు పెందూర్ మాధవ్రావు (45), సుజాత అలియాస్ సంజన (16), మాధవ్రావుకు దగ్గరి సంబంధీకులైన సిడం రంభాబాయి (40), మంగం భీమ్బాయి (45) అ క్కడికక్కడే మృతి చెందారు. అలాగే బేల మండలం సాంగిడి గ్రామంలో పిడుగుపాటుకు గురై గెడం నందిని (30), సోన్కాస్ గ్రామంలో కోవ సునీత (40) ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రెండు వేర్వేరు ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇందులో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడున్నారు. -
ప్రొసీడింగ్స్ అందజేత
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధి లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ ప్రారంభమైంది. వార్డులవారీగా ప్రత్యేకాధికారులను నియమించి వీటిని అందజేస్తున్నారు. 45వ వార్డు భుక్తాపూర్లో 10మందికి ఇళ్లు మంజూరు కాగా, ఒకరు ఆసక్తి చూపకపోవడంతో గురువారం తొమ్మిది మందికి స్పెషలాఫీసర్ నవీన్కుమార్, మాజీ కౌన్సిలర్ బండారి సతీశ్ పత్రాలు అందజేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. వార్డు ఆఫీసర్ ప్రశాంత్, ఆర్పీ రాధ, రాహుల్, జీవిత తదితరులున్నారు. 37వ వార్డు ఓల్డ్ హౌసింగ్ బోర్డు, రవీంద్రనగర్ కాలనీల్లోనూ స్పెషలాఫీసర్ రాజ్కుమార్, వార్డు ఆఫీసర్ జ్యోతి, మాజీ కౌన్సిలర్ అంబకంటి అఽశోక్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పత్రాలు అందజేశారు. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ‘జూపల్లి’
● మంత్రి వివేక్కు మెదక్ జిల్లా బాధ్యతలు ● నిజామాబాద్కు మంత్రి సీతక్కకై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన ధనసరి అనసూయ సీతక్కకు నిజా మాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్ర భుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆదివాసీ ల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్కు సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. పార్లమెంట్ ఎన్నికల వర కు ఆమె ఉత్సాహంగానే పనిచేశారు. జిల్లా అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో నిరాశకు గురైన ఆమె నాటి నుంచి జిల్లాపై అంతగా ఆసక్తి చూపలేదు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం దాదాపుగా తగ్గించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సీతక్క బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాల ఇన్చార్జి మంత్రుల మార్పు జరిగితే సీతక్క జిల్లా బాధ్యతల నుంచి తప్పుకుంటారనే చర్చ గత కొంతకాలంగా సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్ర కటించిన ఇన్చార్జి మంత్రుల జాబితాతో ఆ విష యం స్పష్టమైంది. కొత్తగా రానున్న జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎలాంటి ప్రభా వం చూపనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూపల్లి సీనియర్ మంత్రి కావడంతో జిల్లా కు మేలు జరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. కాగా, ఇటీవల కార్మిక శాఖ మంత్రిగా బా ధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్వెంకటస్వామికి మెదక్ జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
మోగిన బడిగంట
ఆదిలాబాద్టౌన్: బడి గంట మోగింది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇన్నిరోజుల పా టు వేసవి సెలవుల్లో ఆటాపాటలతో గడిపిన వి ద్యార్థులు గురువారం బడుల వైపు అడుగులు వే శారు. తొలిరోజు బడికి వెళ్లేందుకు చాలామంది చిన్నారులు మొగ్గుచూపలేదు. తల్లిదండ్రులు వా రిని బలవంతంగా బడులకు తీసుకువెళ్లాల్సి వ చ్చింది. సర్కారు బడులతోపాటు ప్రైవేట్ పాఠశాలలనూ అలంకరించి విద్యార్థులను ఆకర్షించేలా ముస్తాబు చేశారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు గేటు వద్ద పూలు అందించి విద్యార్థులకు స్వాగతం పలికారు. దీంతో సంతోషంగా వారు తరగతి గదుల్లోకి అడుగిడారు. మొదటిరోజు పా ఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగా కనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినప్పటికీ యూనిఫాంలు కొందరికే ఇచ్చారు. యూనిఫాంలు కుట్టడం పూ ర్తయిన తర్వాత అందరికీ అందించనున్నారు. ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు క లగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సమస్యలుంటే పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, జిల్లాలో 14 పాఠశాలలు మూతపడగా, జిల్లా కేంద్రంలోని వెంకట్రావుకాలనీలో ప్రాథమిక పాఠశాలను 12 ఏళ్ల తర్వాత పునఃప్రారంభించారు. కాలనీలోని విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలకు తీసుకువచ్చారు. దాదాపు 25 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరికి పుస్తకాలు పంపిణీ చేశారు. పూలు ఇస్తూ.. బొట్టు పెడుతూ.. విద్యార్థులకు గురువుల స్వాగతం మొదటిరోజు హాజరు అంతంతే సందడిగా మారిన పాఠశాలలుబొట్టు పెట్టి విద్యార్థులకు స్వాగతం తాంసి: మండలంలోని కప్పర్ల జెడ్పీ హై స్కూల్, నిపాని, బండల్నాగాపూర్, జామి డి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు అధికసంఖ్యలో ప్రవేశాలు పొందారు. మొదటిరో జు పాఠశాలకు వచ్చిన వీరందరికీ ఉపాధ్యాయులు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ఈ విద్యాసంవత్సరంలో కప్పర్ల పాఠశాలలో 53 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు హెచ్ఎం ఆనంద్ తెలిపారు. -
సెర్ప్ సీఈవో చొరవతో చిరుద్యోగికి ఆర్థికసాయం
కై లాస్నగర్: సెర్ప్ సీఈవో, పాత కలెక్టర్ దివ్యదేవరాజన్ చొరవతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ చిరుద్యోగికికి ఆర్థిక చేయూత అందింది. గతేడాది డిసెంబర్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో బోథ్ మండల సమాఖ్య కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే బొల్లారం అశోక్ తల పగలడంతో హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. ఇందుకు రూ.7.50లక్షల వరకు ఖర్చు కాగా, బాధితుడు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితికి చలించిన డీఆర్డీవో రాథోడ్ రవీందర్ బాధితుడిని ఆదుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్కు లేఖ రాశారు. అందుకు ఆమె స్పందిస్తూ బాధితుడిని ఆదుకోవాలంటూ సీ్త్రనిధి ఎండీ విద్యాసాగర్రెడ్డిని కోరారు. సీఈవో విజ్ఞప్తికి స్పందిస్తూ ప్రభుత్వపరంగా రూ.3లక్షల ఆర్థికసాయాన్ని మంజూరు చేశారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో డీఆర్డీవో చేతుల మీదుగా ఆ చెక్కును అశోక్–జ్యోతి దంపతులకు అందజేశారు. అధికారుల చొరవకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ వీ పూర్ణచందర్, హెచ్ఆర్ శ్రీనివాస్, ఏపీడీ గోవింద్రావు తదితరులున్నారు. -
ఆర్వోబీ ఆలస్యం
ఆర్యూబీపై పట్టింపేది? తాంసి బస్టాండ్ రైల్వే క్రాసింగ్ (ఎల్సీ గేట్ 30) వద్ద రూ.20.81 కోట్లతో చేపట్టాల్సిన పరిమిత ఎత్తులో సబ్వే (ఎల్హెచ్ఎస్) నిర్మాణం బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకునేందుకే పరిమి తమైంది. వంతెనకు కేంద్రం నిధులు కేటా యించలేదు. వాహనాల రాకపోకలు వన్వేలో సాగేలా మార్కెట్ యార్డ్ వైపు 184.792 మీటర్లు, పంజాబ్చౌక్ వైపు 107.442 మీటర్లు మేర బ్రిడ్జి, మరో 1.40 మీటర్ల మేర డ్రైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇంకా పనులు మొదలు కాలేదు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాగా భూసేకరణ ప్రక్రియ పూర్తికా క అక్కడి వ్యాపారులు అభ్యంతరం తెలి పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు భూసేకరణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వంతో విడుదల చేయించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
● పూర్తి దశలో ఒకవైపు పనులు ● రెండోవైపు చేపట్టని నిర్మాణం ● అందని భూసేకరణ నిధులు ● అతీగతీ లేని రైల్వే అండర్ బ్రిడ్జి
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని రైల్వే క్రాసింగ్ల వద్ద చేపట్టాల్సిన బ్రిడ్జీల నిర్మాణ పనులు ఒక అడు గు ముందుకు.. మూడడుగులు వెనక్కి.. అన్నచందంగా సాగుతున్నాయి. ఆర్టీవో కార్యాలయం వద్ద గతేడాది చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ని ర్మాణం ఓ వైపు పూర్తి కావస్తుండగా.. మరోవైపు ప నులు ప్రారంభించలేదు. ఇక తాంసి బస్టాండ్ ప్రాంతంలో నిర్మించాల్సిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూ బీ) పనులకు మోక్షమే కలగలేదు. భూసేకరణకు నిధుల రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఓ వైపు వేగంగా ఆర్వోబీ పనులు స్పిన్నింగ్ మిల్ గేట్ రైల్వే క్రాసింగ్ (ఎల్సీ గేట్ 29) వద్ద రూ.56.31 కోట్లతో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి ఆర్అండ్బీ ఆధ్వర్యంలో రూ.27.63 కోట్లతో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ గతేడాది జనవరిలో పనులు ప్రారంభించారు. భూసేకరణ సమస్య లేని మార్కెట్యార్డు వైపు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 30 పిల్లర్లు నిర్మించి వా టిపై స్లాబ్ పనులు పూర్తి చేశారు. రూ.12 కోట్ల మేర పనులు పూర్తి కాగా ఇందులో రూ.4కోట్ల బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించారు. మరో రూ.8 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ వైపు 711.313 మీట ర్ల మేర పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 400 మీటర్లు పూర్తి చేశారు. మిగతా పనులు కొనసాగతున్నాయి. ఇక ఎల్ఐసీ వైపు 220.512 మీటర్ల మేర వంతె నిర్మించాల్సి ఉండగా భూసేకరణ చే యాల్సి ఉండగా ఇంకా పనులు మొదలుకాలేదు. రె వెన్యూ, ఆర్అండ్బీ అధికారులు సర్వే చేసి వంతెన కు అవసరమైన భూమికి మార్కింగ్ చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏడాదిన్నరగా భూసేకరణ ప్రక్రియ నిలిచి ఇటువైపు పనులు ప్రారంభించలే దు.రాకపోకలకు తీవ్ర అంతరాయం ఆర్వోబీ వివరాలు ఇలా.. అంచనా వ్యయం రూ.56.31కోట్లు నిర్మాణం పొడవు 931.825 మీటర్లు కలెక్టర్చౌక్ వైపు 220.512 మీటర్లు మార్కెట్యార్డు వైపు 711.313 మీటర్లు రైల్వేట్రాక్ భాగం 37.280 మీటర్లు పట్టణంలో రెండు రైల్వే క్రాసింగ్లున్నాయి. రైలు వచ్చిందంటే చాలు వాటి గేట్లు వేయడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడుతోంది. దశాబ్దాలుగా నెలకొన్న ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్వోబీ, పరిమిత ఎత్తులో సబ్వే (ఎల్హెచ్ఎస్)లను నిర్మించాలని సంకల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జిలకు రూ.97.20 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇందులో రాష్ట్రం వాటా రూ.57.71 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.39.49 కోట్లు. 2016–17 బడ్జెట్లో వీటి నిర్మాణానికి అనుమతినిచ్చిన కేంద్రం 2022లో తన వాటా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడంతో అదే ఏడాది అధికారులు టెండర్ ప్ర క్రియ పూర్తి చేశారు. తొలుత కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఆ తర్వాత వారు ముందుకువచ్చినా పరిపాలన అనుమతుల్లో జరిగి న జాప్యంతో పనులు ఆలస్యమయ్యాయి. నిధులు విడుదలైతేనే.. రైల్వే బ్రిడ్జిల నిర్మాణా నికి అవసరమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. వంతెనలు త్వరగా పూర్తి చేయాల నే ఉద్దేశంతో వందశాతం కేంద్రం నిధులు మంజూరు చేయించేందుకు స్థానిక ఎ మ్మెల్యే, ఎంపీ ప్రయత్నిస్తున్నారు. ప లుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. నిధులు విడుదలైతే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. – ఎస్.నర్సయ్య, ఈఈ, ఆర్అండ్బీ, ఆదిలాబాద్ -
‘సర్కారు’లోనే నాణ్యమైన విద్య
సాత్నాల: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం మాంగుర్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. వి ద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పా ఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు బోధిస్తారని తెలి పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూని ఫాంలు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. డ్రా పౌట్స్ లేకుండా బడీడు పిల్లలందరినీ పా ఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు సూ చించారు. డీఈవో శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. -
12 ఏళ్ల తర్వాత మళ్లీ ఓపెన్
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని వెంకట్రావు కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2013లో మూతబడింది. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండటంతో నాడు ఆ బడికి తాళం పడింది. ఆ తర్వాత ఆ కాలనీకి చెందిన తల్లి దండ్రులు పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు, సమీ పంలోని ప్రభుత్వపాఠశాలలకు పంపించారు. దీంతోఈపాఠశాల 12 ఏళ్లుగా తెరుచుకోలేదు. ఈ (2025–26) విద్యా సంవత్సరంలో పునః ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాలనీలో ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు సర్వే చేపట్టడంతో 28 మంది విద్యార్థులను తల్లిదండ్రులు ఇందులో చేర్పించేందుకు ముందుకొచ్చారు. దీంతో ఆదిలాబాద్అర్బన్ మండల విద్యాధికారి సోమయ్య బుధవారం పాఠశాలను సందర్శించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను సిద్ధం చేశారు. పాఠశాలలో మరమ్మతు పనులను చేపట్టారు. విద్యార్థుల సంఖ్య 40కి పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర పాఠశాలల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు. మూత బడుల ఓపెన్కు చర్యలు : డీఈవో జిల్లాలో 14 పాఠశాలలు మూతబడ్డాయి. వీటి ని తెరిపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్, స్టేషన్ రోడ్, వెంకట్రావుపేట్, కేఆర్కే హిందీ మీడియం, బజార్హత్నూర్ మండలంలోని ఇందిరానగర్, భీంపూర్లోని పిప్పల్కోటి ఉర్దూ మీడియం, గాదిగూడలోని చిన్నుకుండి, కునికాస, ఇచ్చో డ మండలంలోని తలమద్రి, నార్నూర్లోని భీంపూర్ ఎస్సీకాలనీ,నేరడిగొండలోని దాబా, సావర్గాం పాఠశాలలు కొన్నేళ్లుగా మూతబ డ్డాయి. ఇందులో నాలుగింటిని ఈ విద్యా సంవత్సరంలో పునఃప్రారంభిస్తుండగా, మిగతా వీటిని సైతం తెరిపించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. -
‘సాక్షి’పై దాడి సిగ్గుచేటు
కైలాస్నగర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను హరించేలా అక్కడి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని పలువురు జర్నలిస్టులు మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, సాక్షి కార్యాలయాలపై అల్లరి మూకల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు బుధవారం నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రెస్క్లబ్ నుంచి తెలంగాణ చౌక్ వర కు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌక్లోని రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మెడపట్ల సురేశ్, నూకల దేవేందర్, బేత రమేశ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సాక్షి పత్రి కపై కక్షకట్టి కార్యాలయాలపై దాడులు చేయించడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ జి.కృష్ణకాంత్గౌడ్, ఆర్సీ ఇన్చార్జి యేర సుధాకర్, చింతల అరుణ్రెడ్డి, కె.జైపాల్, గంట వినోద్, సంద సురేష్, సీనియర్ జర్నలిస్టులు సారంగపాణి, ఫెరోజ్ ఖాన్, బి.వెంకటేశ్, సత్యనారాయణ, దేవిదాస్, రాజు ముదిరాజ్, కిరణ్ రెడ్డి, సిడాం రవి, వెంకటేశ్, అభిలాష్, లాయర్ ప్రవీణ్, మహేందర్, సతీష్ రెడ్డి, కార్తీక్, నరేష్, మహేష్, రవి, సతీష్రెడ్డి, పిట్ల రాము, గజానన్, కె.ప్రమోద్, కార్తీక్, పొచ్చన్న, మల్లయ్య, మురళీకృష్ణ, సుభాష్, అస్మత్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ● ఏపీ ప్రభుత్వ తీరుపై జర్నలిస్టుల నిరసన -
‘సహజ’ వ్యవసాయం
● కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం ● రైతులతో ప్రత్యేక కమిటీలు ● త్వరలోనే అవగాహన కార్యక్రమాలు ● ఈ వానాకాలం నుంచే అమలుకు చర్యలు ఆదిలాబాద్అర్బన్: ఆరుగాలం శ్రమించే అన్నదాత ఆరోగ్యంతో పాటు సాగులో తక్కువ పెట్టుబడితో అధికదిగుబడి సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘సహజ వ్యవసాయం’ (నేచురల్ ఫార్మింగ్) అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రసాయనాలు వినియోగించి పండించే పంటలు కాకుండా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో సాగు చేయడం ఇందులో ప్రత్యేకం. వ్యవసాయ ఉత్పత్తులు పెంచ డం, స్థిరత్వం, నీటి ఆదా, నేల సారవంతం కాపాడడం, ఖర్చులు తగ్గించడం, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలు కాపాడుకోవడం అనేది ఈ విధానంతోనే సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఈ వానాకాలం నుంచి అమలు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సహజ వ్యవసాయం ఇలా.. తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూ అధిక దిగుబ డి సాధించి ఉపాధి పెంచడం సహజ వ్యవసాయంలో భాగమని అధికారులు చెబుతున్నారు. ఇందుకు స్థానికంగా లభించే విత్తన రకాలు వాడడం, విత్తనశుద్ధి కోసం పొలంలో ఉత్పత్తి చేసిన సూక్ష్మజీవుల వినియోగం, వాటి కార్యకలాపాల కోసం సూక్ష్మ వా తావరణాన్ని సృష్టించడం, సేంద్రియ ఎరువుల వాడకం, పంటల మార్పిడి, ఆవు పేడ, మూత్రం కోసం స్థానిక జాతి పశువులను పెంచడం, నేలను సుసంపన్నం చేయడం, నీరు, తేమ సంరక్షణ వంటివి సహజ వ్యవసాయం కిందకే వస్తాయని అధికా రులు పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా పండిన కూరగాయలు, ధాన్యాలు, ఇతర ఆహార పదా ర్థాలు అధిక పోషణ సాంద్రత కలిగి ఉండడం వల్ల మానవాళికి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది. రసాయన మందులు విని యోగించకుండా సాగు ఏ విధంగా చేయాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. పురు గు మందులు, రసాయన ఎరువులు వాడడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తడం వంటి సమస్యలకు సహజ వ్యవసాయం పరిష్కా రం చూపుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజన్ నుంచే అమలు.. జిల్లాలో ఈ వానాకాలం సీజన్ నుంచి సహజ వ్యవసాయం అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు, శాస్త్రవేత్తలకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చినట్లు చెబుతున్నారు. వారు మండలానికి ఇద్దరు చొప్పున రైతులను ఎంపిక చేసి జిల్లాలో శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు అర్బన్ మినహా ప్రతీ మండలంలో రైతులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 125 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. శిక్షణ పొందిన వారితో వీరికి అవగాహన కల్పిస్తారు. జిల్లాలోని రైతులు : 1.45 లక్షలు మండల కమిటీలు : 20 ఒక్కో కమిటీలో సభ్యులు : 125త్వరలోనే గ్రామాల్లో సమావేశాలు రైతులతో ఇప్పటికే ప్రత్యేక కమిటీలు ఏర్పా టు చేశాం. ఒక్కో కమిటీలో 125 మంది వర కు ఉంటారు. త్వరలోనే ఇవి సమావేశాలు కానున్నాయి. ఆయా గ్రామాల్లో నిర్వహించే సమావేశాల్లో సహజ వ్యవసాయంపై అధికారులు అవగాహన కల్పిస్తారు. జిల్లాలో ఈ వానాకాలం నుంచే సహజ వ్యవసాయం అమలు దిశగా చర్యలు చేపట్టాం. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమైన విద్యార్థులు ● తొలిరోజే యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీ కి ఏర్పాట్లు
జిల్లా కేంద్రంలోని మరాఠీ మీడియం పాఠశాలను బెలూన్లతో ముస్తాబు చేస్తున్న ఉపాధ్యాయులు బడికి వెళ్తానని ఏడ్చేవాడిని.. ఆదిలాబాద్టౌన్: మాది నేరడిగొండ మండలంలోని చిన్నబుగ్గారం. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను చిన్నవాడిని. 1, 2వ తరగతులు మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ఆ తర్వాత నన్ను చదువు మానేసి వ్యవసాయ పనులు చేయాలని ఇంట్లో అన్నారు. నేను ఏడవడంతో మా పెద్దనాన్న సొనాలలోని పాఠశాలలో చేర్పించారు. అక్కడ 3,4 తరగతులు చదివాను. 5 నుంచి 10వ తరగతి వరకు నిర్మల్లోని జుమెరాత్పేటలో చదివాను. మొదటి రోజు మా నాన్న నన్ను బడిలో చేర్పించారు. ఆరోజు ఏడ్చుకుంటూ వెళ్లాను. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ చదువుతో పాటు లోకజ్ఞానం నేర్పేవారు.. ఆదిలాబాద్టౌన్: నేను ఆదిలాబాద్ పట్టణంలోని గెజిటెడ్ నం.1 పాఠశాలలో చదివాను. మా గురువులు బావురావ్, నారాయణ, సదాశివ్ మాస్టార్, రాఘవరావ్ చదువుతో పాటు లోకజ్ఞానం నేర్పించారు. నైతిక విలువల గురించి తెలియజేశారు. తప్పనిసరిగా ఆటలు, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు, క్రాఫ్ట్ విద్య నేర్పించారు. మాలో ఉన్న ప్రతిభను గుర్తించి అవసరమైన సూచనలు చేసేవారు. గురువులంటే భయం, భక్తి ఉండేది. పాఠశాలకు హుషారుగా వెళ్లేవాడిని. – జయచంద్ర కుమార్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆదిలాబాద్టౌన్: ఇన్నిరోజులు వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన చిన్నారులు ఇక బడిబాట పట్టనున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా తిరిగి ఇంటికి చేరారు. ఐడీ కార్డు, టై, బెల్టు, షూ, వాటర్ బాటిల్, నోట్ బుక్స్వంటివి సిద్ధం చేసుకొని ఇప్పటికే బ్యాగులు సర్దుకున్నారు. నేటి నుంచి బడి గంట మోగనుండగా.. ఇన్నిరోజులు బోసిపోయిన పాఠశాలఇక విద్యార్థులతో సందడిగా మారనుంది. ప్రభుత్వ బడులను ఇప్పటికే సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు మామిడి తోరణాలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. మరోవైపు ఈ ఏడాది సర్కారు పాఠశాలల్లో ప్ర భుత్వం మౌలిక వసతులు కల్పించింది. అమ్మ ఆద ర్శ పాఠశాల కమిటీ, మన ఊరు–మనబడి ద్వారా సౌకర్యాలపై ఫోకస్ పెంచింది. తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీలు, విద్యుత్ సౌకర్యం వంటివి కల్పించారు. పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తొలిరోజే యూనిఫాం, పాఠ్య పుస్తకాలు.. పాఠశాలలు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు పా ఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాకు 4లక్షల 83వేల 110 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4లక్షల 60వేల 931 చేరుకున్నాయి. ఆయా మండల కేంద్రాలకు పాఠ్య పుస్తకాలను సరఫరా చే యగా, అక్కడి నుంచి సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు స్కూళ్లకు తీసుకెళ్లారు. అలాగే యూని ఫాం కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. 66,282 మంది విద్యార్థులకు యూనిఫాం అందించాల్సి ఉండగా, 63 శాతం కుట్టడం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. పాఠశాలలకు 56 శా తం యూనిఫాం చేరుకున్నాయని పేర్కొంటున్నా రు. మిగితావి త్వరలోనే అందించనున్నట్లు చెబుతున్నారు. మొదటిరోజు కొంత మంది విద్యార్థులకు ఒక జత యూనిఫాం అందించనున్నారు. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో ప్రైవేట్కు ధీటుగా కొన్ని సర్కారు బడుల నిర్వహణ కొనసాగుతుంది. ఇంద్రవెల్లి జెడ్పీఎస్ ఎస్లో 1,112 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ఇచ్చోడలో 1,096, బేల ఉన్నత పాఠశాలలో 582, జైనథ్ ఉన్నత పాఠశాలలో 566, ఆదిలాబాద్ పట్ట ణంలోని గెజిటెడ్ నం.1 పాఠశాలలో 525 మంది, సొనాల ఉన్నత పాఠశాలలో 518 మంది, యాపల్గూడ ఉన్నత పాఠశాలలో 418 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇచ్చోడలోని కేశవపట్నంలో 309 మంది, ఎంపీపీఎస్ యా పల్గూడలో 298 మంది, ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్ పాఠశాలలో 277, సిరి కొండ ప్రాథమిక పాఠశాలలో 209, భీంపూర్ మండలం నిపానిలో 105 మంది విద్యార్థులున్నారు. మేము చదివింది.. సర్కారు బడిలోనేసర్కారు బడి అంటే చిన్నచూపు వద్దు. అందులో పుస్తక పాఠాలే కాదు జీవిత పాఠాలు సైతం నేర్పుతారు. నైతిక విలువలు అలవడుతాయి. లోకజ్ఞానం బోధపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నతస్థాయిలో నిలిచిన వారు జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. అందులో పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే..డీఈవో పరిధిలోని పాఠశాలలు: 739 ప్రాథమిక :500, యూపీఎస్:119 హైస్కూళ్లు:120స్కూల్కు వెళ్లేందుకు మారాం చేసేవాడిని.. ఆదిలాబాద్టౌన్: మాది నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామం. ఊరిలోనే 1 నుంచి 8వ తరగతి వరకు చదివాను. చిన్నప్పుడు బడికి వెళ్లేందుకు మారాం చేసేవాడిని. నాన్న శంకర్, కుటుంబ సభ్యులు బడికి తీసుకెళ్లేవారు. టీచర్లు బాగా చెప్పేవారు. ఆ తర్వాత 10వ తరగతి వరకు బెల్లంపల్లి రెసిడెన్షియల్లో చదివాను. సర్కారు బడిలో అన్ని వసతులుంటాయి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా అందులోనే చదివించాలి. – డాక్టర్ నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో మొదట్లో భయం వేసేది.. బోథ్: మాది సొనాల మండలంలోని గుట్టపక్కతండా. చిన్న గ్రామం. నా చిన్నప్పు డు మా ఊరిలో బడి లేదు. సొనాలకే పోవాల్సి వచ్చేది. ఒకటి నుంచి పదో తరగతి వరకు అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివా. మొదట్లో స్కూల్కు వెళ్లాలంటే కొంత భయం వేసేది. ఆ సమయంలో మా మాన్సింగ్ సార్ చొరవ చూపారు. ఆయన ప్రోత్సాహం మరువలేనిది. ఇప్పుడు ఈ స్థాయిలో స్థిరపడ్డానంటే కారణం అప్పుడు ఆ బడిలో విలువలతో కూడిన విద్య అందించడమే. – తగిరె ప్రతాప్సింగ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉట్నూర్ పాఠశాలలు ముస్తాబు.. వేసవి సెలవుల తర్వాత నేడు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బడులను ఇప్పటికే ముస్తాబు చేశా రు. ఆవరణ, పరిసరాలను శుభ్రంగా మార్చారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు మామిడి తోరణాలు, కొన్ని పాఠశాలల్లో బెలూన్లతో స ర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.ఇక ఇటీవల బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1వ తరగతిలో చేర్పించేందుకు 1286 ఎన్రోల్మెంట్ చేశారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్ర భుత్వ పాఠశాలల్లో 115 మంది విద్యార్థులను చే ర్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి వరకు చదివిన విద్యార్థులు 6వ తరగతిలో చేరేలా ప్రణాళికలు రూపొందించారు. బడిబాటలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,556 మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల వివరాలు.. యాజమాన్యం పాఠశాలల విద్యార్థుల సంఖ్య సంఖ్య లోకల్బాడీ 673 47,809 కేజీబీవీ 18 4,331 మోడల్ స్కూల్స్ 06 3,962 యూఆర్ఎస్ 01 101 ప్రైవేట్ స్కూల్స్ 162 48,931 ఎయిడెడ్ 02 202 సోషల్ వెల్ఫేర్ 03 1,762 ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ 13 4,609 ట్రైబల్ వెల్ఫేర్ 540 19,369 మహాత్మా జ్యోతిబాఫూలే 07 2,916 మైనార్టీ రెసిడెన్షియల్ 06 1,848 మొత్తం 1,471 1,46,880అక్కలతో కలిసి బడికి వెళ్లేది.. నేరడిగొండ: మాది జగిత్యాల జిల్లా గోపాల్రావు పేట గ్రామం. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. ఇంటర్ ట్రిపుల్ఐటీ బాసరలో పూర్తి చేశా. చిన్నప్పుడు ఇద్దరక్కలతో కలిసి బడికి వెళ్లేవాడిని. ప్రైవేట్తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందని నా అభిప్రాయం. శ్రీకాంత్, నేరడిగొండ ఎస్సై సర్కారు బడిలో జీవిత పాఠాలు.. బోథ్: మాది సొనాల. అమ్మానాన్న చదువుకోలేదు. నా విద్యాభ్యాసం ఒకటి నుంచి పీజీ వరకు అంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే. మా ఊరిలో చాలా మంది విద్యావంతులు, ఉద్యోగస్తులు ఉన్నారు. వారిని చూసి ఎలాగైనా సర్కారు కొలువు కొట్టాలని చిన్నప్పటి నుంచే అనుకునే వాడిని. సార్లు చెప్పే విషయాలపై ఆసక్తి ఉండేది. వారిలాగా పాఠం చెప్పాలని అప్పుడే అనుకున్నా. ఆ కల నెరవేర్చుకున్నా. సర్కారు బడిలో పుస్తక పాఠాలే కాదు జీవిత పాఠాలు నేర్పుతారు. – రడాపు సంతోష్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆదిలాబాద్ -
‘ఉదారి’కి సారస్వత పరిషత్ పురస్కారం
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ ఉదారి నారాయణకు సారస్వత పరిషత్ పురస్కారం వరించింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అందజేసే ఈ పురస్కారాన్ని బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. పురస్కారంతోపాటు రూ.20వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా కవులు నారాయణకు అభినందనలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
● చెల్లాచెదురైన మృతదేహాలు ● దిలావర్పూర్లో విషాదం దిలావర్పూర్: మండల కేంద్రానికి సమీపంలో నిర్మల్–భైంసా రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దిలావర్పూర్కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్పూర్కు చెందిన షేక్ సానిఫ్ (20), స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న షేక్ అబ్రార్ (27) ద్విక్రవాహనంపై మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల దాబాహోటల్కు చికెన్ తీసుకెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాలు 200 మీటర్ల మేర చెల్లాచెదురయ్యాయి. అటుగా వెళ్తున్న ద్విచక్రవాహదారులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల్లో షేక్ అబ్రార్ నిత్యం దాబా హోటల్కు చికెన్ సప్లయ్ చేస్తుంటాడు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. షేక్ అబ్రార్కు భార్యతోపాటు ఐదేళ్లలోపు ముగ్గులు పిల్లలున్నారు. షేక్ సానిఫ్కు రెండు నెలల క్రితమే వివాహమైంది. వీరిరువురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిలావర్పూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
తేనెటీగల దాడిలో ఆరుగురికి గాయాలు
తానూరు: మండలంలోని ఝరి(బి)తండా గ్రామ శివారులో మంగళవారం పత్తి విత్తనాలు విత్తుతున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన బాధితులను గ్రా మస్తులు 108 అంబులెన్స్లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. తేనెటీగల దాడిలో రాథో డ్ గోవర్ధన్, హరిదాస్, సుభాష్, ధన్రాజ్, దేవుకబాయి, శివరాజ్కు గాయాలయ్యాయి. బాధితులు ప్రస్తుతం భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జీసీసీ డీఎంగా పీహెచ్వోకు అదనపు బాధ్యతఉట్నూర్రూరల్: ఉట్నూర్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజన్ మేనేజర్గా ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ ఉద్యాన అధికారి (పీహెచ్వో) సందీప్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఎంగా పని చేసిన వీఎల్ఎన్ ప్రసాద్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లినందున తాత్కాలికంగా సందీప్కుమార్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు త్వరలో తెరచుకోనున్న నేపథ్యంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సూచన మేరకు సందీప్కు అదన పు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందీప్ను జీసీసీ సిబ్బంది గోవింద్రావు, లింబారావు, సత్యనారాయణ తదితరులు సన్మానించారు. మొక్కలు తొలగించి, చెట్లు నరికి నిరసనకడెం: రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తుల ఆందోళన రెండోరోజూ కొనసాగింది. మంగళవారం గ్రామస్తులు మరిన్ని గుడిసెలు వేసి అక్కడే వంట చేసుకుని మకాం వేశారు. ఉడుంపూర్ ఎఫ్ఆర్వో అనిత ఎదుటే రాంపూర్ గిరిజనులు ప్లాంటేషన్లో మొక్కలు తొలగించారు. చెట్లు నరికి నిరసన తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎఫ్డీవో భవానీశంకర్ ఇరు గ్రామాల గిరిజనులతో మాట్లాడినా వారు వినలేదు. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని తేల్చిచెప్పారు. -
హాకీ చాంపియన్గా ‘హైదరాబాద్’
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్ జట్టుతో జరిగిన పోరులో 3–0 గోల్స్తో విజయదుందుభి మోగించింది. రెండో స్థానంలో నిజామాబాద్, మూడో స్థానంలో నల్గొండ జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ను విజయవంతంగా పూర్తి చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్కుమార్, జనరల్ సెక్రటరీ సీఆర్ భీంసింగ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, యూనుస్ అక్బాన్, రాష్ట్రపాల్, క్రీడాకారులు, శిక్షకులు పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. ఇది కొత్తగా ఏర్పడిన సాత్నాల మండలంలోని పిప్పల్గావ్ రోడ్డు దుస్థితి. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే మోకాల్లోతు గుంతలతో బురదమయంగా మారింది. పిప్పల్గావ్ నుంచి మేడిగూడ వరకు తొమ్మిది కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కాదు కదా కనీసం ఆటో, ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని దుస్థితి. ఏటా వానాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాల ప్రజలకు దారి ఇక్కట్లు షరా మామూలే అన్నట్లుగా మారుతున్నాయి. -
మహిళా సమాఖ్యకే ‘ట్రిపుల్ఐటీ యూనిఫాం’
నిర్మల్: రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ సేవలతో దూసుకుపోతున్న జిల్లా మహిళా సమాఖ్య మరో గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికే స్కూల్ యూనిఫాంలను కుడుతున్న సమాఖ్య తాజాగా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా గుర్తింపు ఉన్న బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల యూనిఫాంలనూ కుట్టించి ఇచ్చే పనిని దక్కించుకుంది. వేలాదిమంది విద్యార్థులుండే ట్రిపుల్ఐటీకి సంబంధించి రూ.54 లక్షల విలువైన యూనిఫాం కాంట్రాక్టు జిల్లా మహిళా సమాఖ్యకు దక్కడంపై డీఆర్డీవో విజయలక్ష్మి, సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గంగామణి హర్షం వ్యక్తంచేశారు. కలెక్టర్ అభిలాషఅభినవ్, ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ సహకారంతో మహిళా సమాఖ్యకు ఈ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. -
బస్టాండ్ బాత్రూంలో బోనోఫిక్స్ కలకలం!
● మత్తు కోసం వినియోగిస్తున్న యువతఖానాపూర్: మద్యం, గుట్కాతో పాటు గంజాయి లాంటి పలు మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే తరహాలో సైకిల్ టైర్ పంక్చర్ కోసం వినియోగించే బోనోఫిక్స్తో ద్వారా మత్తును ఆస్వాదిస్తున్న ఘటన ఖానాపూ ర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరుగుదొ డ్లు, మూత్రశాలల ప్రాంతంలో బోనోఫిక్స్ వినియోగించి పడేసిన ఖాళీ కవర్లు కనిపించాయి. ఈ ఘట న తెలియడంతో పట్టణవాసులు, విద్యార్థుల తల్లి దండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నా రు. దుకాణాల్లో కొనుగోలు చేసిన బోనోఫిక్స్ను కర్చీఫ్లు, కవర్లలో వేసుకుని యువత మత్తు కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బోనోఫిక్స్ పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు చెడిపోవడంతో పాటు ఇతర వ్యాధులు వస్తాయని, సైడ్ఎఫెక్ట్లకు దారితీసే ప్ర మాదముందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి కై నా సంబంధిత అధికారులు బోనోఫిక్స్ విక్రయాలపై నిఘా పెట్టాలని, యువతకు దురలవాట్లపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
హస్తం.. ఫోకస్
● ఇక కాంగ్రెస్ జిల్లా కమిటీలు ● నెలాఖరులో డీసీసీ అధ్యక్షుడి ఖరారు ● ఉమ్మడి జిల్లా ఆధారంగా సామాజిక సమీకరణాలు ● అంతకుముందే మండల, బ్లాక్ కమిటీలుసాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ జిల్లా కమిటీ, డీసీసీ అధ్యక్షుడి ఖరారు ఈ నెల చివరిలోగా పూర్తి చేయనున్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల లోనే అన్ని మండలాలతో పాటు పట్టణంలో సమావేశాలు పూర్తి చేసిన హస్తం పార్టీ ఆ నెల చివరిలోనే కమిటీలు ఖరారు పూర్తి చేస్తామని తొలుత వెల్లడించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ సమావేశాలు పూర్తి కాకపోవడం, ఇతర అంశాల కారణంగా ఆలస్యమైనట్లు ముఖ్య నేతలు పే ర్కొంటున్నారు. ఈ నెల మూడో వారం వరకు మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు మొద ట ఖరారు కానున్నాయి. చివరిలో జిల్లా అధ్యక్షుడిని నియమించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ పూర్తి కావడంతో పార్టీ అధిష్టానం ఇక జిల్లా కమిటీలపై దృష్టి సారించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట.. రాష్ట్ర కమిటీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ అధిష్టానం జిల్లా కమిటీల ఎంపికలో నూ అదే విధానం అవలంభించనున్నట్లు ముఖ్య నే తలు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకం ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఎస్టీ,బీసీ, వెల్మ, రెడ్డి సామాజిక వర్గాల వారిని జిల్లా అధ్యక్షులుగా నియమించాలని భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ నుంచి ఈనెల చివరిలో పరి శీలకులు జిల్లాకు రానున్నారు. వారే ఉమ్మడి జిల్లాలో అధ్యక్షుల నియామకాన్ని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రసు తం ఆదిలాబాద్లో డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. నిర్మల్లో శ్రీహరిరావు, కుమురంభీంలో విశ్వప్రసాద్, మంచిర్యాలలో సురేఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు ఒకే సామాజిక వ ర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మా త్రం ఉమ్మడి జిల్లాలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు.. టీపీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి సామాజిక సమీకరణాల ఆధారంగా ఏడుగురికి చోటు కల్పించారు. గతపార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సుగుణకు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చోటు దక్కింది. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు, సీని యర్ నాయకుడు నరేశ్జాదవ్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చోటు లభించింది. -
చదువుతోనే ఆదివాసీల అభివృద్ధి
భీంపూర్: చదువుతోనే ఆదివాసీల అభివృద్ధి సా ధ్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీ సులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మండలంలోని గుబిడి, టెకిడి రాంపూర్, కరంజి, భగవాన్పూర్లో మంగళవా రం పర్యటించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేని మారుమూల గ్రామాలకు స్వయంగా తానే బైకు నడుపుతూ చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా పోలీ సులు ప్రజలతో మమేకమై సేవలందిస్తున్నారన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా 87126 59953 నంబర్కు తెలియజేయాలని కోరారు. అనంతరం యువకులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్సై పీర్సింగ్ నాయక్, గ్రామ పెద్దలు, సిబ్బంది ఉన్నారు. నేరాల నియంత్రణకు ‘సబ్కంట్రోల్’ ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణకు పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్లు దోహద పడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్లో ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ రూమ్ను మంగళవారం ప్రారంభించారు. మార్కెట్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుందని, ప్రజలకు తక్షణ సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, నేరాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దోహద పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు సునిల్కుమార్, కరుణాకర్రావు, మున్సిపల్ డీఈ కార్తీక్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాంచంద్రరావు, సత్యనారా యణ, సురేష్, శ్రీధర్, ఉప్పల్ పాల్గొన్నారు. -
రిమ్స్లో మెరుగైన వైద్యసేవలు
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ను పరిశీలించారు. కేంద్రం రూ.23 కోట్ల నిధులతో ఈ పనులు చేపడుతుందని పే ర్కొన్నారు. జిల్లాకు సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి, క్రిటికిల్ కేర్ యూనిట్ను ప్రధాని మోదీ అందించారని తెలిపారు. ఆస్పత్రి నిర్మాణానికి సహకరిస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను ఆహ్వానిస్తామన్నారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులున్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
కుంటాల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరా ల ప్రకారం.. కుంటాలకు చెందిన బాస హన్మాండ్లు (58) సోమవారం రాత్రి వర్షంలోనే నిత్యావసరాల కోసం కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. తల వెనుక, ముందు భాగం బలమైన గాయాలయ్యాయి. అతడిని 108 అంబులెన్స్లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అతడి కుమారుడు గజేందర్ బతుకుదెరువు కోసం ఏడాదిన్నర క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిడుగుపాటుకు మహిళ మృతిభీంపూర్: మండలంలోని నిపా ని గ్రామానికి చెందిన కలిమి నాగమ్మ (48) మంగళవారంపిడుగుపాటుకు గురై మృతి చెందింది. వివరాలు.. నిపాని గ్రామానికి చెందిన నాగమ్మ అత్త కర్మకాండలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీపూర్ గ్రామ సమీపంలోని చేను వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం రావడంతో బస్టాండ్ వద్ద ఆగిన సమయంలో పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలీవాడ కు చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు స్థానిక ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. హమాలీవాడకు చెందిన తారచాంద్శర్మ భార్య అంకిత (40) ఈ నెల 7న ఉదయం కూ రగాయలు తీసుకువచ్చేందుకు మార్కెట్కు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తారచాంద్శర్మ మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఫిర్యాదువేమనపల్లి: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగా యంటూ మండలంలోని కొత్తపల్లి గ్రామ రైతులు మంగళవారం తహసీల్దార్ సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సెంటర్లో జరిగే అవకతవకల గురించి వివరించి ఆధారాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో పీఏసీఎస్ ద్వారా 19 లారీల వడ్లు కొనుగోలు చేసిన నిర్వాహకులు 15 రోజులైనా రైతులకు రషీదులు, ట్రక్షీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటివె న్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విచారణ చేపడితే అక్రమాలు బయటపడతాయని తెలిపా రు. అక్రమాలపై సెంటర్ నిర్వాహకులను ప్రశ్నిస్తే రైతులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిలదీస్తే బెదిరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం కలెక్టర్ను కూడా కలిసి తమ గోడు విన్నవించుకుంటామని వారు తెలిపారు. -
అంతా అతలాకుతలం
● గాలివాన బీభత్సం.. విద్యుత్శాఖకు తీవ్ర నష్టం ● జిల్లాలో విరిగిపడ్డ 236 స్తంభాలు ● ఎగిరిపడిన రేకులు, నేలకూలిన వృక్షాలు ● 18 గంటలు నిలిచిన కరెంట్ సరఫరా ● ఇబ్బందులు పడ్డ జనంఆదిలాబాద్టౌన్: గాలివాన బీభత్సం జిల్లాను అతలాకుతలం చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈదురుగాలులతో మొదలైన భారీ వర్షం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఉరుములు, పిడుగులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో 236 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆరు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. కరెంట్ తీగలు తెగిపడడంతో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 18 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా జాగరణ తప్పని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారులు వర్షం తగ్గిన తర్వాత మరమ్మతు చర్యలు చేపట్టినప్పటికీ విద్యుత్ సరఫరా జరగలేదు. అర్ధరాత్రి 12 గంటలకు కొన్నిచోట్ల సరఫరా అయినప్పటికీ, గంటలోపే మళ్లీ నిలిచిపోయింది. ఈ కారణంగా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్ పడింది. విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం ఆదిలాబాద్ అర్బన్తో పాటు ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనథ్ తదితర మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 236 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్లు ఆ శాఖ అధికారులు వెల్ల డించారు. సుమారు రూ.కోటి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఉట్నూర్లో నాలుగు, ఇచ్చోడలో రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. జైనథ్ మండలంలో 125విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. భీంపూర్ మండలంలోని అర్లి(టి) నుంచి వడూర్ వెళ్లే రహదారిలో 17 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. 33కేవీ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు మంగళవారం మధ్యాహ్నం వరకు 11కేవీ ద్వారా సరఫరా పునరుద్ధరించారు. ప్రస్తుతం తాత్కాలికంగా సరఫరా చేస్తున్నారు. చాలాచోట్ల స్తంభాలను ఇంకా సరిచేయాల్సి ఉంది. జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్కు వెళ్లే దారి లో 20 స్తంభాలు నేలకొరిగాయి. ఆ గ్రామంలో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఈదురుగా లులతో 32కేవీ సమస్యలు తలెత్తాయి. ఆదిలాబాద్ పట్టణంలో 10 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మావల మండలంలోని కేఆర్కే నుంచి బాలాజీనగర్కు వెళ్లే దారిలో ఎనిమిది స్తంభాలు పడిపోయాయి. దుర్గానగర్ దారిలో కరెంటు తీగలు తెగిపడ్డాయి. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో నీలగిరి చెట్లు పడిపోవడంతో పట్టణంలోని కై లాస్నగర్, మావల ఫీడర్, ఖానాపూర్ ఫీడర్ సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇన్సులేటర్లు లాస్ఓవరై పగిలిపోయాయి. పలుచోట్ల పిడుగులు పడడంతో విద్యుత్ సమస్య తలెత్తింది. ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ సబ్స్టేషన్ నుంచి ఇతర మండలాలకు సరఫరా చేసే 133 కేవీ ఇన్సులేటర్లు చెడిపోవడంతో అంతరాయం ఏర్పడింది. అయితే ఇంకా ఎక్కడైనా విద్యుత్ సమస్య ఉంటే 1912 టోల్ఫ్రీ, 8712481799కు సమాచారం ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్ తెలిపారు. ఇదిలా ఉండగా పలు గ్రామాల్లో పూరిగుడిసెల పైకప్పు, రేకుల షెడ్లు గాలి బీభత్సానికి ఎగిరిపడ్డాయి. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ రేకులు, ఫ్లెక్సీలు నేలవాలాయి. ఎగ్జిబిషన్ ఆనవాళ్లు లేకుండాపోయాయి. రోడ్లపై చెట్ల తొలగింపు పనులు.. కైలాస్నగర్: జిల్లాకేంద్రంలో పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు బల్దియా సిబ్బంది సహకారంతో వాటి తొలగింపు పనులు చేపట్టారు. బొక్కల్గూడలో ఓ ఇంటికప్పు ఎగిరిపడగా, మహాలక్ష్మివాడలో అంగన్వాడీ టీచర్ కిరణ్ సింగ్ ఇంటిపైకప్పు రేకులు 250 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఇంద్రవెల్లి: మండలంలోని ఏమాయికుంట సమీపంలోని విజయలక్ష్మీ జిన్నింగ్ మిల్లు షెడ్డు రేకులు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. తుమ్మగూడ గ్రామానికి చెందిన కాత్లే సంగీత కాలుపై రేకులు పడడంతో గాయమైంది. బోథ్: విద్యుత్ వైర్లు పడి బోథ్ మండలం మర్లపెల్లి గ్రామానికి చెందిన సిరిసె దీపేందర్కు చెందిన గేదె మృతి చెందింది. -
మూడో యూనిట్కు ముహూర్తమెప్పుడో!
● ఎస్టీపీపీలో 2015లో శంకుస్థాపన ● పనులు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ ● పదేళ్లయినా ప్రారంభంకాని పనులు ● ఉపాధి కోసం నిరుద్యోగుల నిరీక్షణ జైపూర్: పదేళ్లయినా మండల కేంద్రంలోని ఎస్టీపీపీలో మూడో యూనిట్ ప్లాంట్ నిర్మాణం టెండర్ల దశలోనే నిలిచింది. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ను విస్తరిస్తూ రెండు యూనిట్లకు అదనంగా మూడో యూనిట్ ఏర్పాటుకు 2015 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 600 మెగా థర్మల్ పవర్ ప్లాంట్ల ఎదుట మరో 600 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో భాగంగా సూపర్క్రిటికల్ విధానంతో 800 మెగావాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నూతనంగా నిర్మించనున్న 800 మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు అన్ని అనుమతులు పొందడానికి ఎనిమిదేళ్లు పట్టగా టెండర్లు ఖరారు కావడానికి మొత్తం 10 ఏళ్లు పట్టింది. రెండు దఫా లుగా సింగరేణి నిర్వహించిన టెండర్లలో రెండోసా రి బీహెచ్ఈఎల్ కంపెనీ దక్కించుకోగా సుమారు రూ.8,500కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్లాంట్ నిర్మించనున్నారు. టెండర్ల దశకు చేరుకోవడానికి పదేళ్లు పట్టగా పనుల ప్రారంభోత్సవానికి ముహూర్తం కాలిసి రావడం లేదు. ఓసారి ఉపముఖ్యమంత్రి ప్రోగ్రాం ఖరారై చివరి నిమిషంలో నేతల మధ్య వర్గపోరుతో రద్దయింది. ఉపముఖ్యమంత్రి పవర్ ప్లాంట్ సందర్శన, పలు ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉండగా వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. మళ్లీ సీఎం చేతుల మీదుగా కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవం ఉంటుందని అందరూ భావించారు. గత నెలలో అధికార యంత్రాంగం సీఎం ప్రోగ్రాం ఉంటుందని హడావుడి చేసినా అది కూడా ఖరారు కాలేదు. అసలు కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవానికి సమయమే కలిసిరావడం లేదని అభిప్రాయపడుతున్నారు. కాగా, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఇటీవల మంత్రి వర్గంలో చోటు దక్కింది. మంత్రి హోదాలో అతడు సీఎం రేవంత్రెడ్డి చే తుల మీదుగా ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరు నెలలుగా కసరత్తు జరుగుతున్నా.. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కాంతులు పంచుతోంది. సింగరేణి సంస్థకు ఇక్కడి వనరులు అనుకూలించడం ప్రధానంగా అంచనాకు మించి సేకరించిన భూములతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను విస్తరించే దిశగా ఆదిలోనే అడుగులు వేసింది. అందులో భాగంగానే నూతనంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ను రూ.8,500కోట్ల అంచనాతో నిర్మించాల ని నిర్ణయించింది. కానీ, నిధుల సమీకరణలో జా ప్యం చోటు చేసుకుందో?.. లేదా ఆశించిన స్థాయిలో సింగరేణి సంస్థకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించిందో.. లేదో కానీ 800 మెగావాట్ల ప్లాంట్ పనులు 10 ఏళ్లుగా టెండర్ల దశలోనే నిలిచాయి. ఎట్టకేలకు మళ్లీ బీహెచ్ఈఎల్ కంపెనీ పనులు దక్కించుకోగా పనుల ప్రారంభోత్సవానికి ఆరు నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పవర్ప్లాంట్లో కొత్త ప్లాంట్ నిర్మించే ప్రాంతాన్ని చదును చేసి అధికార యంత్రాంగం ఎదురుచూస్తోంది. రాజకీయ నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అధికారిక కార్యక్రమాలూ రద్దుకావడం అంతటా చర్చనీయాంశమైంది. కొత్త ప్లాంట్ నిర్మించనున్న ప్రాంతం ఉపాధి కోసం యువత నిరీక్షణఎస్టీపీపీలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ పూర్తయితే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని స్థానిక నిరుద్యోగ యువకులు, భూనిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా కొత్త ప్లాంట్ ప్రారంభమవుతుందని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ దాని పనులు ప్రారంభం కాకపోవడంతో వారికి నిరాశే మిగులుతోంది. కొత్త ప్లాంట్ ని ర్మాణంతో ప్రభావిత గ్రామాలతో పాటు పరిసరప్రాంతాల్లో ఇక నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరుతుందని అందరూ భావిస్తున్నారు. అయి నప్పటికీ ప్లాంట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం గమనార్హం. -
● మంత్రి వివేక్కు పోర్ట్పోలియోపై చర్చ ● కేటాయింపుపై కొనసాగుతున్న కసరత్తు ● ఉమ్మడి జిల్లాకు ‘ఇన్చార్జ్జి’ కానున్న వైనం
సాక్షిప్రతినిధి, మంచిర్యాల: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన తదితరవన్నీ జిల్లా కు మంత్రి లేకపోవడంతో జాప్యం అవుతోంది. ప్రస్తుతం అన్ని పథకాల అమలులో ఇన్చార్జి మంత్రి కీలకం. ఉమ్మడి జిల్లాకు ప్రస్తుతం మంత్రి సీతక్క కొనసాగుతున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధి, పథకాల అమలుపై సమీక్షలు, సమావేశాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చే యాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇకపై వివేక్ ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో పథకాల అమలు, అభివృద్ధి పర్యవేక్షణలో సులువు కానుంది. ప్రభుత్వ పరంగా వేడుకలు, అధికారిక కార్యక్రమాలు మంత్రి హోదాలో జరగనున్నాయి. శాఖలపై కసరత్తు రెండో విడతలో మంత్రులుగా అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ ప్రమాణం స్వీ కారం చేశారు. వీరికి శాఖలు కేటాయించాల్సి ఉంది. మంత్రి మండలిలో ఖాళీగా హోం, మున్సిప ల్, గనులు, కార్మిక, పశుసంవర్ధక, పాడి, సంక్షే మం, ఇతర శాఖలు ఖాళీగా ఉండడంతోపాటు రెండేసి, మూడేసి శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చే పట్టనున్న వారికి ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని ఆస క్తి నెలకొంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం దీని పై కసరత్తు చేస్తుండగా,త్వరలోనే స్పష్టత రానుంది. వివేక్పైనే ఆశలు 17 నెలలుగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా లేకపోవడంతో నాయకులతోపాటు ప్రజలకు లోటు ఏర్పడింది.కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిలో ఒక రికై నా మంత్రి పదవి వస్తుందని ముందు నుంచి ప్రచారం ఉంది. అయితే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా వివేక్కే అమాత్య యోగం ద క్కడంతో ఆయనపై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఆశలు నెలకొన్నాయి. తన నియోజకవర్గం చెన్నూరుతోపాటు మిగతా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, గిరిజన ప్రాంతాలు, సింగరేణి తదితర అనేక సమస్యలు ఉన్నాయి. సీఎంను కలిసిన మంత్రి, ఎంపీలుచెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాద పూ ర్వకంగా కలిశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన అధి ష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. -
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు
ఆదిలాబాద్రూరల్: ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆది లాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో రౌ డీయిం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధి లోని ఇందరమ్మ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి అతడి నుంచి రూ.2వేలు లా క్కున్న బంగారుగూడకు చెందిన షేక్ సలీంతో పా టు మరో ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసి రౌడీయిజం చేస్తే పోలీసులకు ఫి ర్యాదు చేయాలని, అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐ ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్ ఉన్నారు. -
పంచాయతీ కార్యదర్శుల నిరసన
కై లాస్నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఏవో వర్ణ, డీపీవో కార్యాలయ ఉద్యోగి కల్పనకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. ట్రెజరీలో పెండింగ్లో ఉన్న చెక్కులు వెంటనే క్లియర్ చేయాలన్నారు. అలాగే కార్యదర్శుల ఆన్లైన్ హాజరు నమోదు కోసం తెచ్చిన ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. దీని పై ప్రభుత్వం స్పందించకుంటే సామూహిక సెలవుపై వెళతామని స్పష్టం చేశారు. -
ఆటో బోల్తాపడి ఒకరి మృతి
● ఐదుగురికి గాయాలు ముధోల్: మండలంలోని బోరిగాం, వడ్తాల గ్రామాల మధ్య ఆటో బోల్తా పడ్డ ఘటనలో బ్రహ్మణ్గావ్కు చెందిన రొడ్డ ముత్యం (50) మృతి చెందగా, ఐదుగురికి గాయాలైనట్లు ఎస్సై పెర్సీస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాసర మండలం కిర్గుల్(కే) గ్రామానికి చెందిన ఆటోలో మంగళవారం లోకేశ్వరం మండలం అబ్ధుల్లాపూర్ గ్రామానికి తమ బంధువు అంత్యక్రియలకు ముత్యం వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడడంతో గాయాల పాలైనవారిని భైంసా ఏరియాస్పత్రికి తరలిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ ముత్యం మార్గ మధ్యలో మృతి చెందాడు. గాయపడ్డ వారిలో బాసర మండలం కిర్గుల్(కే) గ్రామానికి చెందిన బుజ్జవ్వ, కాశీ, ముధోల్ మండలంలో బ్రహ్మణ్గావ్ గ్రామానికి చెందిన లక్ష్మి, గంగన్న, రువ్వి గ్రామానికి చెందిన శ్యామల ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
రాజకీయ ‘క్రీడ’
ఆదిలాబాద్టౌన్: జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్వో) పోస్టుపై రాజకీయం నెలకొంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత క్రీడా రంగానికి సంబంధించిన రెగ్యులర్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి విధుల్లో చేరేందుకు జిల్లాకు చేరుకోగా, బాధ్యతలు తీసుకోవద్దంటూ ఆ శాఖకు సంబంధించిన రాష్ట్ర ఉన్నతాధికారులు హుకుం జారీ చేయడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జిల్లాలో క్రీడా రంగ అభివృద్ధికి పాటుపడాల్సిన కీలకమైన అధికారిని విధుల్లో చేరకుండా కొంత మంది రాజకీయం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ సంగతి.. ఇటీవల వరకు డీవైఎస్వోగా పనిచేసిన వెంకటేశ్వర్లు గతనెల 31న ఉద్యోగ విరమణ పొందారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో యువజన సర్వీసుల శాఖ అధికారిగా ఉన్న ఆయనను ప్రభుత్వం డీవైఎస్వోగా నియమించింది. దీంతో ఎలాంటి క్రీడా పరిజ్ఞానం లేకుండా ఎనిమిదేళ్లుగా ఆయన విధులు నిర్వహించారు. ఇదిలా ఉండగా, ఆయన ఉద్యోగ విరమణతో జిల్లా కలెక్టర్ తాత్కాలికంగా ఓ సీనియర్ పీడీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న రెండు రోజులకే ప్రభుత్వం రెగ్యులర్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15ఏళ్ల తర్వాత క్రీడా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అధికారిగా రాబోతుండడంతో జిల్లా క్రీడా రంగానికి మంచిరోజులు రానున్నాయని క్రీడాకారులతో పాటు తల్లిదండ్రులు సంబరపడ్డారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొంత మంది కుల సంఘాల నాయకులు, మరికొంత మంది పీడీలు, రాజకీయ నాయకులు ఆయనను విధుల్లో చేరకుండా రాష్ట్రస్థాయిలో పైరవీలు చేసి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రెగ్యులర్ అధికారి వచ్చిన తర్వాత కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు బాధ్యతలు తీసుకోవద్దని, హోల్డ్లో ఉండాలని, తిరిగి రావాలని మౌఖికంగా ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పలు శాఖల్లో ఇన్చార్జి అధికారులతోనే కొనసాగుతుంది. దీంతో ఆయా శాఖల్లో పర్యవేక్షణ లోపించి పాలన పూర్తిగా గాడి తప్పింది. అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటి.. జిల్లాలో ఉన్న క్రీడా పాఠశాలలో కోచ్లు లేకపోవడంతో క్రీడా పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నా రు. బాస్కెట్ బాల్ కోచ్గా సుదీర్ఘ అనుభవం ఉండడంతో పాటు ఉమ్మడి జిల్లా వాసి అయిన ప్రశాంత్ను జిల్లాకు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు క్రీడా పాఠశాలల్లో పనిచేసిన అనుభవంతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సలహాదారుగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని జిల్లా అధికారిగా నియమించడంతో క్రీడా పాఠశాలకు మంచిరోజులు రావడంతో పాటు జిల్లా క్రీడా రంగానికి మేలు జరుగుతుందని అంతా భావించారు. అయితే సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి డీవైఎస్వోగా బాధ్యతలు చేపడితే నిరంతర పర్యవేక్షణ ఉండి తమ ఆటలు సాగవనే ఉద్దేశంతో కొంత మంది పీడీలు రాజకీయంగా తమ పలుకుబడి ఉపయోగించి కుల సంఘం ద్వారా రాష్ట్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి సదరు అధికారిని విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్నట్లు చర్చ సాగుతుంది. అయితే ఈ రెగ్యులర్ అధికారిని విధుల్లో చేర్చుకుంటారా.. లేక ఇన్చార్జి అధికారితోనే క్రీడా పాఠశాలను ముందుకు తీసుకెళ్తారా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. కాగా, జిల్లాలో కొనసాగుతున్న క్రీడా పాఠశాలను తమ జిల్లాకు తరలించేందుకు కేబినెట్లో సీనియర్గా ఉన్న ఓ మంత్రి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికారిని రాకుండా అడ్డుపడుతున్నారనే చర్చ కూడా ఉంది. ఈ విషయమై డీవైఎస్వోగా వచ్చిన ప్రశాంత్ను వివరణ కోరేందుకు ఫోన్లో యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. జిల్లాకు వచ్చిన రెగ్యులర్ డీవైఎస్వో విధుల్లో చేరకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి ? వెనక్కి వెళ్లాలని హుకుం..! -
డీఎడ్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: డైట్లో ప్రవేశం కోసం ని ర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జిల్లాకేంద్రం లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈనెల 13 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి తెలి పా రు. రోజుకు 850 మంది చొప్పున అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు 4,085 మందిని కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్కు 850 మందికి గాను 580 మంది హాజరైనట్లు వివరించారు. -
సమస్యల సత్వర పరిష్కారానికి కృషి●
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: ఫిర్యాదుదారులపై బాధ్యతగా వ్యవహరించి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. దాదాపు 40 మంది వరకు ఎస్పీకి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. అనంతరం ఎస్పీ ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఇందులో సిసి కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, వామన్ సిబ్బంది పాల్గొన్నారు. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయి.. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని ఎస్పీ అన్నారు. సీఐగా పదోన్నతి పొందిన జె.అంజమ్మ, డి.పద్మకు స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం పదో న్నతి చిహ్నం అలంకరించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అధికారులకు ఇద్దరికీ పోలీ సు సేవలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందు కు ప్రభుత్వం గుర్తించి సేవా పథకాలు అందజేసి గౌరవించిందని పేర్కొన్నారు. కార్యక్ర మంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. పిల్లలను ఉన్నతంగా చదివించాలి పోలీసులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చ దివించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో ఇచ్చోడ సీఐ బండారి రాజు కుమారుడు రుష్మిత్ 77వ ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. -
● అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ● గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
కైలాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆ మె అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తె లుసుకున్నారు. ఉపాధి చూపాలని కొందరు, వసతి గృహాల్లో సీట్లు కల్పించాలని ఇంకొందరు, ఇంది రమ్మ ఇళ్లు కేటాయించాలని మరికొందరు అర్జీలు అందజేశారు. వాటిని స్వీకరించిన ఆమె అధికారులకు అందజేస్తూ సత్వ రం పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్ లేకపోవడంతో పలువురు జిల్లా అధికారులు గైర్హాజరు కాగా మరికొంతమంది మధ్యలోనే వెళ్లిపోవడం గమనార్హం. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..వినతి స్వీకరించి సమస్య అడిగి తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవిమాకు న్యాయం చేయండి మేమంతా ఎస్సీ కులానికి చెందిన నిరుపేదలం. సొంత ఇండ్లు కాని వ్యవసాయ భూములు కాని లేవు. కూలీనాలీ చేసుకుని పొట్టగడుపుతున్నాం. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లకు అన్ని విధాలా అర్హులైనప్పటికీ అధికారులు మంజూరు చేయలేదు. ఇండ్లు ఉన్నవారికే మంజూరు చేసి మాకు అన్యాయం చేశారు. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. – కుమారి గ్రామస్తులు, నేరడిగొండ రోడ్డును కబ్జా చేశారు మా గ్రామంలోని రోడ్డును అల్లూరి రవీందర్రెడ్డి, గంగారెడ్డిలు తమ చేనులోని స్థలమంటూ కబ్జా చేశారు. మా తాతల కాలం నుంచి ఆ రో డ్డు గుండానే రాకపోకలు సాగిస్తున్నాం. బస్సులు,ఆటోలు సైతం ఆ మార్గం గుండానే వెళుతుంటాయి. అలాంటి రోడ్డును ఆక్రమించిన సదరు వ్యక్తులు మీ గ్రామానికి రోడ్డు లేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారణ జరి పించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. –దిమ్మ గ్రామస్తులు, ఆదిలాబాద్ రూరల్ వేధింపులకు గురి చేస్తున్నారు.. నేను మాజీ మావోయిస్టును. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలువడంతో ప్రభుత్వం నాకు రాంనగర్లోని సర్వే నంబర్ 19/1లో భూమిని కేటాయించింది. ఆటో నడుపుకుంటూ 35 ఏండ్లుగా అందులోనే నివసిస్తున్న. ఇంటి పన్నుతోపాటు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, కరెంట్ బిల్లు వంటి స్థలం డాక్యుమెంట్లన్నీ నా పేరిటే ఉన్నాయి. అయితే ఆ స్థలం నాదంటూ ఆదిల్ అనే ఆర్ఎంపీ నన్ను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీనిపై ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాను. విచారణ జరిపించి వేధింపుల నుంచి కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. – మావురపు నర్సయ్య, రాంనగర్ -
● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్ సమస్య ● మూతపడుతున్న చౌక దుకాణాలు ● గంటల తరబడి కార్డుదారుల నిరీక్షణ ● పట్టించుకోని అధికారులు
ఇది బేల మండల కేంద్రంలోని ఐటీడీఏ పరిధిలో గల డీఆర్ డిపో. ఉదయం 9 గంటలకు తెరువగా అప్పటికే 20 మంది వరకు కార్డుదారులు వచ్చి ఉన్నారు. ఒక్కో కార్డుదారుకు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టడంతో వారికి మధ్యాహ్నం వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి. బియ్యం నిల్వలు నిండుకోవడంతో మూసి ఉంచిన ఈ రేషన్షాపు పట్టణంలోని కై లాస్నగర్లోనిది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో బియ్యం కోసం వచ్చిన కార్డుదారులు గంటల తరబడి నీరిక్షిస్తూ చేసేది లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. వీరంతా ఆదిలాబాద్లోని దస్నాపూర్ రేషన్ షాపు వద్ద బియ్యం కోసం నిరీక్షిస్తున్న కార్డుదారులు. దుకాణం తెరువక ముందే చేరుకుని నిరీక్షిస్తున్నారిలా. వీరంతా బియ్యం తీసుకునేందుకు మధ్యాహ్నం 2గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. డీలర్లకు అవగాహన లేకపోవడంతోనే.. జిల్లాలోని రేషన్ కార్డుదారుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్లకు వస్తూనే ఉన్నాయి. ఈ నెల 8న 15లారీలు రాగా, 9న 14 లారీల బియ్యం వచ్చాయి. రేషన్ షాపుల్లో బియ్యం అయిపోయిన వెంటనే డీలర్లు సంబంధిత యాప్లో బియ్యం కోసం విజ్ఞప్తి పంపాల్సి ఉంటుంది. అందుకనుగుణంగా వారికి సరఫరా చేస్తాం. కొత్తగా వచ్చిన యాప్ విధానంపై డీలర్లకు సరైన అవగాహన లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుంది. బియ్యం కొరత లేదు. డీలర్లు షయాన్ని గమనించి తమకు అవసరమైన కోటా తీసుకెళ్లాలి. – వాజిద్ అలీ, డీఎస్వో కై లాస్నగర్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. మూడు నెలల కోటా ఒకేసారి అందించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు తదనుగుణంగా చర్యలు చేపట్టకపోవడం సమస్యకు దారి తీసింది. రేషన్షాపులకు వెళ్లిన కార్డుదారులకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. సర్వర్ సమస్య ఇబ్బందికి గురి చేస్తోంది. సకాలంలో బియ్యం చేరకపోవడంతో కొన్నిచోట్ల దుకాణాలు మూతపడుతున్నాయి. ఈ నెలాఖరులోపు కార్డుదారులందరికీ బియ్యం అందించాలనే లక్ష్యం చేరుకోవడం కష్టతరంగా కనిపిస్తోంది. ఇదీ పరిస్థితి.. వర్షాకాలం నేపథ్యంలో రేషన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు నెలల కోటా ఒకేసారి అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్డుదారులకు అవసరమైన కోటా బియ్యం విడుదల చేసింది. ఈ నెల 1నుంచి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని చౌక దుకాణాల ద్వారా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరువరకు పూర్తి చేయాలని ఆదేశించింది. రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తుండటంతో వాటిని పొందేందుకు కార్డుదారులు ఉదయాన్నే దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్కో కార్డుదారు ఈ–పీవోఎస్ యంత్రంపై ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి రావడంతో పంపిణీలో తీవ్ర జాప్యం అవుతోంది. సర్వర్ సమస్య సైతం తోడవడంతో ఒక్కో కార్డుదారుకు బియ్యం ఇచ్చేందుకు సుమారు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుందని డీలర్లు చెబుతున్నారు. దీంతో కార్డుదారులు గంటల తరబడి షాపుల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు రేషన్ షాపుల్లో స్థలం కొరత కారణంగా డీలర్లు విడతల వారీగా బియ్యం బస్తాలు తీసుకువస్తున్నారు. తెచ్చిన బియ్యం త్వరగా నిండుకుంటున్నాయి. మళ్లీ స్టాక్ వచ్చే వరకు షాపులను మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో చేసేదేమిలేక కార్డుదారులు వెనుదిరుగాల్సి వస్తోంది. బియ్యం కోసం రెండు, మూడు సార్లు రావాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. పూర్తిస్థాయిలో చేరని బియ్యం .. మూడు నెలల కోటా ఒకేసారి అందించాలని నిర్ణయించినప్పటికీ బియ్యం పూర్తిస్థాయిలో రేషన్షాపులకు చేరలేదు. ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించి ఒక నెల కోటా మాత్రమే పంపిణీ జరిగినట్లుగా తె లుస్తోంది. జిల్లాకు అవసరమైన కోటా నిజామాబా ద్, జగిత్యాల జిల్లాల నుంచి ఆదిలాబాద్, బోథ్, ఉ ట్నూర్, జైనథ్, ఇచ్చోడ ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరుతుంది. ఇక్కడి నుంచి వాటి పరిధిలోని చౌక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మూడు నెలల కోటా ఏఒక్క షాపునకు చేరలేదని డీలర్లు చెబుతున్నారు. మరోవైపు వచ్చిన స్టాక్ వచ్చినట్లుగా కార్డుదారులకు అందజేస్తుండటంతో షాపుల్లో బియ్యం నిల్వలు నిండుకుంటున్నా యి. ఫలితంగా కొన్నిచోట్ల దుకాణాలు మూతపడి దర్శనమిస్తున్నాయి. అధికారులు ఇప్పటికై నా తగు చర్యలు చేపట్టాలని కార్డుదారులు కోరుతున్నారు. 1.35 లక్షల మంది దూరంగానే... సన్నబియ్యం బియ్యం పంపిణీ ప్రారంభమైన తొమ్మిది రోజుల్లో జిల్లావ్యాప్తంగా కేవలం 57,519 మంది కార్డుదారులు మాత్రమే బియ్యం తీసుకున్నారు. ఇంకా 1,35,238 మంది తీసుకోవాల్సి ఉంది. 12వేల మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటి వరకు కేవలం 2,620 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ జరిగింది. ఇంకా 9,380 మెట్రిక్ టన్నుల బియ్యంను కార్డుదారులు పొందాల్సి ఉంది. అయితే ఇందులో సగం కూడా ఇంకా జిల్లాకు చేరనట్లుగా అధికారులు చెబుతున్నారు. జిల్లాలో.. మండలాలు :21 చౌక ధరల దుకాణలు: 356 రేషన్ కార్డులు :1,92,757 ఇప్పటి వరకు బియ్యం పొందిన కార్డుదారులు : 57,519 సన్నబియ్యం కోసం నిరీక్షిస్తున్న వీరంతా జైనథ్ మండల కేంద్రంలోని రెండో నంబర్ రేషన్ దుకాణ పరిధిలోని కార్డుదారులు. ఇక్కడ 765 కార్డులుండగా ఇప్పటి వరకు కేవలం 298 మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేశారు. సర్వర్ సమస్యతో పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది. -
● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’ భారం ● ఇష్టానుసారంగా బడి ఫీజులు ● ఈనెలలోనే యూనిఫాం, పుస్తకాలు ● తోడైన సాగు పెట్టుబడులు ● సామన్యులు విలవిల
ఆదిలాబాద్టౌన్: జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల్లో దడ పుడుతుంది. పాఠశాలలు ఇక పునఃప్రారంభం కానుండడంతో పుస్తకాలు, యూనిఫాం, ఫీజులు పేరిట వారిపై అదనపు భారం పడనుంది. మరో వైపు వర్షాకాలం సీజన్ షురూ కావడంతో రైతులు సాగుపై దృష్టి సారిస్తున్నారు. దుక్కిదున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు పనుల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఓ వైపు పిల్లల చదువులు, మరో వైపు సాగు పెట్టుబడి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్లో ఎల్కేజీ, యూకేజీలకే వేలాదిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువులకు సైతం భారీగా ఖర్చు పెట్టా ల్సి వస్తోంది. అయినా సరే తమ పిల్లలను ప్రైవేట్లో ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్తు అందించాలని సామాన్యులు కలలు కంటున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అందినకాడికి దండుకుంటున్నాయి. డొనేషన్లు,ఫీజుల పేరిట ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. జీవో నం.1కు తూట్లు పొడుస్తూ విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాయి. నామమాత్రమైన పేరెంట్ కమిటీలు ఆ పాఠశాలలకు కొమ్ముకాయడంతో ‘ఫీ’జులుం సాగుతుంది. విద్యా శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. అందినకాడికి దండుకోవడమే.. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార సంస్థలుగా మారాయి. అడ్డగోలు ఫీజుల వసూలుతో పాటు యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్లు, టై, బెల్టు, షూ ఇలా ప్రతీది విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బడి ప్రారంభం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు జిల్లాకేంద్రంలో వారు సూచించిన బుక్స్టాల్, బట్టల షాపుల్లోనే కొనుగోలు చేయాలని చీటీలు అందిస్తున్నారు. అక్కడ తప్పితే మరోచోట కొనుగోలు చేయవద్దని హుకుం జారీ చేస్తున్నారు. ఆ పుస్తకాలు మిగతా స్టోర్లలో దొరక్కపోవడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. 1వ తరగతి చదివే విద్యార్థుల నోట్, పాఠ్య పుస్తకాాలకే రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వెచ్చించాల్సిన దుస్థితి. ఇంత జరుగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపార సంస్థలుగా మారిన ప్రైవేట్ బడులు.. జిల్లాలో.. ప్రైవేట్ పాఠశాలలు 162 విద్యార్థులు 48,931 ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు ఇలా.. తరగతి ఫీజు (రూ.లలో) ఎల్కేజీ 20వేలు– 30వేలు యూకేజీ 25వేలు– 30వేలు ఒకటో తగరతి 30వేలు– 35వేలు రెండో తరగతి 30వేలు– 35వేలు మూడో తరగతి 35వేలు– 38వేలు నాలుగో తరగతి 38వేలు– 40వేలు ఐదో తరగతి 40వేలు– 42వేలు ఆరో తగరతి 40వేలు– 45వేలు ఏడో తరగతి 40వేలు– 45వేలు ఎనిమిదో తరగతి 45వేలు– 50వేలు తొమ్మిదో తరగతి 50వేలు– 60వేలు పదో తరగతి 60వేలు– 70 వేలు జిల్లాలో ప్రైవేట్ పాఠశాల్లో ఎల్కేజీ, యూకేజీ చదువులకే ఏడాదికి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ–టెక్నో, బీజీ, మోడల్, కాన్సెప్ట్, టెక్నో, గ్రామర్, ఐఐటీ, నీట్, జెఈఈ ఇలా తోక పేర్లు తగిలిస్తూ తల్లిదండ్రుల కలలను సొమ్ము చేసుకుంటున్నారు. హాస్టళ్లు కూడా ఏర్పాటు చేసి ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు తీసుకోకూడదు. అయినా కొన్ని పాఠశాలలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలల్లో కనీస వసతులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇరుకు గదులు, క్రీడా మైదానం లేకపోవడం, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, తదితర సౌకర్యాలు లేనప్పటికీ ఫీజుల వసూలులో మాత్రం వెనుకాడడం లేదు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యాశాఖ అనుమతించిన బుక్స్టాల్లోనే పాఠ్య పుస్తకాలు విక్రయించాలి. ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు చేపడతాం. – ఏనుగు శ్రీనివాస్రెడ్డి, డీఈవో ప్రైవేట్ దోపిడీ అరికట్టాలి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులను అరికట్టాలి. విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు విక్రయిస్తున్నారు. అయినా అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. – గణేశ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
వివేక్ అనే నేను...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇప్పటికే గడ్డం ఫ్యామిలీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా ఎంపీగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వివేక్కు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఊహాగా నాలు వెలువడ్డాయి. అయినప్పటికీ జిల్లా నుంచే మరో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, వినోద్ సైతం పోటీలో ఉండగా చివరకు అధిష్టానం వివేక్కే మంత్రి పదవి కట్టబెట్టింది. వివేక్ వర్గీయులు శనివారం నుంచే సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చెన్నూర్కు చెందిన కాంగ్రెస్పార్టీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమారంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. దండేపల్లిలో మాల సామాజిక వర్గం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మంత్రిని కలిసిన నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్రావు, మందమర్రి కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు నీలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్, కోటపల్లి మాజీ సర్పంచ్లు కుమ్మరిసంతోశ్, గట్టు లక్ష్మణ్ గౌడ్, తదితరులు కలిశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే చెన్నూర్ నుంచి అన్నయ్య తరువాత తమ్ముడికి అవకాశం ప్రేమ్సాగర్ రావు, వినోద్కు ఆశాభంగంతీవ్ర నిరాశలో ప్రేమ్సాగర్రావు... కొంతకాలంగా కేబినెట్లో తనకు తప్పనిసరిగా స్థానం ఉంటుందని ఆశించిన మంచి ర్యాల ఎమ్మెల్యేకు తీవ్ర ఆశాభంగం కలిగింది. దీంతో ఆయన వర్గీయులు శనివారం నుంచే తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రేమ్సాగర్రావును బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగి ఆయ నకు పలు విధాలుగా నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.హామీలు నెరవేర్చడమే లక్ష్యం.. నియోజక వర్గ ప్రజలకు తానిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని మీడియాతో మంత్రి వివేక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని ఈ సందర్భంగా తెలియజేశారు. -
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్యాబోధన
నేరడిగొండ: సర్కారు బడుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నట్లు డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని తేజాపూర్ గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్లను ఆదివారం సందర్శించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 16 మంది విద్యార్థులను తల్లిదండ్రులు తేజాపూర్ ఎంపీపీఎస్లో చేర్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో భూమారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. పీఎస్సార్ను కలిసిన మీనాక్షి నటరాజన్మంచిర్యాలటౌన్: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివా సంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లు కలిశారు. పీఎస్సార్కు కాకుండా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంతో వారిద్దరూ ఆయనను కలిసి బుజ్జగింపు యత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, మొదటి నుంచి పార్టీని ఉమ్మడి జిల్లాలో కాపాడుకుంటూ వచ్చిన పీఎస్సార్కే మంత్రి పదవి వస్తుందనే అంతా భావించారు. తీరా రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది. -
నీటి సంరక్షణ పనుల పరిశీలన
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 2018 నుంచి 2025 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ‘జల్ సంచాయ్ జల్ భగీదారి’ పథకంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ పనులను కేంద్ర జల కమిషన్ శాఖ ప్రతినిధి జతిన్ ఆదివారం పరిశలించారు. ఇంకుడు గుంతలు, పూడికతీత, చెక్డ్యాంలు, ఫారంపండ్ వంటి మొత్తం 7,285 నీటి సంరక్షణ పనులు చేపట్టగా ఎంపిక చేసిన 92 పనులను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష 5 వేల పనులు పూర్తి చేసి కేంద్ర జల కమిషన్కు ఫొటోలు అప్లోడ్ చేయడంలో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే నాలుగో స్థానంలో, రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. ఎంపిక చేసిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కమిషన్కు నివేదిక అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో ఏపీవో జాదవ్ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్లు మహేందర్, ధమ్మనంగ్, విఠల్, ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. -
స్టేడియం సరే.. వసతులేవి?
● ఐపీ స్టేడియంలో అరకొర సౌకర్యాలు ● సామర్థ్యం మేర రాణించలేకపోతున్న అథ్లెట్లు ● దృష్టి సారించాలంటున్న క్రీడాకారులు ● సింథటిక్ ట్రాక్ ఏర్పడితే ప్రయోజనం ఆదిలాబాద్: క్రీడాకారులు రాణించాలంటే అనువైన ఆటస్థలంతో పాటు శిక్షకులు ఎంతో అవసరం. అలాగే ఆయా క్రీడలకు అవసరమై క్రీడా సామగ్రి సైతం అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ వంటి వ్యక్తిగత క్రీడాంశాల్లో వీటి అవసరం మరింత అధికం. అథ్లెటిక్స్లో 23 పైగా ఈవెంట్స్ ఉంటాయి. వాటి కోసం ప్రత్యేకంగా క్రీడా పరికరాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులు ఉన్నప్పటికీ వసతులలేమి, శిక్షకుల కొరతతో రాష్ట్ర స్థాయి పోటీలకు మాత్రమే పరిమితమవుతున్న దుస్థితి. క్రీడల్లో రాణించాలని పట్టుదల ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో సరైన సదుపాయాలు ప్రోత్సాహం కరువై నిరుపేద అథ్లెట్లు అర్ధంతరంగా క్రీడలను వదిలేస్తున్నారు. అధ్వానంగా రన్నింగ్ ట్రాక్.. అథ్లెటిక్స్లో రాణించాలంటే ఒక్కో అథ్లెట్ సగటున 10 నుంచి 12 ఏళ్ల వరకు శ్రమిస్తే జాతీయ స్థాయికి ఎదగవచ్చనేది క్రీడా నిపుణుల అభిప్రాయం. అయితే క్రీడాకారులు సన్నద్ధం అవ్వాలంటే రన్నింగ్ ట్రాక్తో పాటు ఫిజియోథెరపిస్ట్, జిమ్, ఆయా క్రీడాంశాలకు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉండాలి. అలాగే ప్రత్యేక కోచ్ పర్యవేక్షణ తప్పనిసరి. అప్పుడే క్రీడాకారులు అత్యున్నతంగా రాణించగలుగుతారు. అయితే జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని(ఐపీ) స్టేడియంలో మొరం ట్రాక్ పైనే సాధన చేయాల్సిన దుస్థితి. దీంతో ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నా జాతీయ స్థాయి పోటీల వరకు వెళ్లలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరువైన సదుపాయాలు.. అథ్లెటిక్స్లో రన్నింగ్తో పాటు జంప్స్, త్రోస్, కంబైన్డ్ ఈవెంట్స్ వంటి నాలుగు విభాగాలుంటాయి. ఆయా క్రీడల్లో రాణించాలంటే అవసరమైన హార్డిల్స్, హైజంప్, లాంగ్జంప్ పిట్ పోల్వాల్ట్ బెడ్ల ఏర్పాటు ఎంతో ముఖ్యం. అయితే ఐపీ స్టేడియంలో అరకొర వసతుల నడుమ సాధన చేయాల్సి వస్తుంది. ఇక ఇదే స్టేడియంలోనే ఉన్న క్రీడా పాఠశాల విద్యార్థులకు అథ్లెటిక్స్ విభాగంలో ప్రత్యేకంగా కోచ్ ఉన్నారు. అయితే జిల్లాకు చెందిన అథ్లెటిక్స్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రం శిక్షకుడు లేకపోవడం గమనార్హం. దీంతో వారే సొంతంగా మైదానంలో సాధన చేసుకోవడం గానీ, ఇతర ప్రైవేట్ శిక్షణ సంస్థల్లో చేరాల్సిన పరిస్థితి. జిల్లాలోనే విశాలమైన మైదానం ఉన్న స్టేడియంలో అథ్లెటిక్స్ ఆడేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని క్రీడాభిమానులు, క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. సింథటిక్ ట్రాక్ ఏర్పాటు అయితే.. స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటయితే సాధన ఎంతో మెరుగ్గా సాగుతుంది. సాంకేతికతతో కూడిన శిక్షణ అందుతుంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించే అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయి. ప్రస్తుతం సాధారణ ట్రాక్పై సాధన చేస్తున్న క్రీడాకారులు పూర్తిస్థాయిలో తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. సాయ్ కేంద్రమూ రావొచ్చు.. క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించవచ్చు. సింథటిక్ ట్రాక్తోపాటు అథ్లెటిక్స్ క్రీడలకు సంబంధించి మరిన్ని వసతులు అందుబాటులోకి వస్తే అకాడమీ ఏర్పాటుకు బలం చేకూరుతుంది. ఒకవేళ సాయ్ సెంటర్ మంజూరు అయితే 40 మంది ఆటగాళ్లకు వసతితో కూడిన శిక్షణ అందించవచ్చు. ఎంతో ఉపయోగకరం.. సింథటిక్ ట్రాక్ ఏర్పడితే అథ్లెట్స్ జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణిస్తారు. శిక్షణ, సాధన చాలా సులువు అవుతుంది. ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు అయితే ఎంతో ఉపయోగకరం. – రాకేశ్, అథ్లెటిక్స్ శిక్షకుడు అసోసియేషన్ తరఫున కృషి.. సింథటిక్ ట్రాక్ ఏర్పాటు విషయమై అసోసియేషన్ తరఫు నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నాం. జిల్లాలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు అయితే ఎన్నో జాతీయస్థాయి పోటీలను నిర్వహించవచ్చు. ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే వీలైనంత త్వరగా ట్రాక్ నిర్మాణం అయ్యే అవకాశం ఉంది. – రాజేశ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
పట్టణంలో భారీ బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: బక్రీద్ సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, మసీదుల వద్ద పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి బందోబస్తును పరిశీలించారు. జిల్లా ప్రజలు మతసామరస్యం కలిగి ఉండి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకున్నారని తెలిపారు. ఈద్గా వద్ద ప్రార్థనలకు హాజరైన పలువురు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు సునీల్కుమార్, కరుణాకర్రావు తదితరులున్నారు. -
వరద ముప్పు తప్పేనా!
వివరాలు..ఆదిలాబాద్లోని వార్డులు 49 కుటుంబాలు 48,393 జనాభా 1,50,383 ప్రధాన డ్రైనేజీలు 20వెంటనే పనులు ప్రారంభిస్తాం పట్టణంలోని భారీ డ్రెయిజీల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులు చేపట్టేందు కోసం రూ.20లక్షల వ్యయంతో కూడిన టెండర్లు ఆహ్వానించాం. ఈ ప్రక్రియ సైతం ఇటీవల పూర్తి చేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్కు పనులు అప్పగించాం. ఆదివారం నుంచి వరద ముంపు డ్రెయినేజ్లీలో పూడిక తీత పనులు ప్రారంభిస్తాం. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ కై లాస్నగర్: వర్షాకాల సీజన్ ప్రారంభమైంది. పట్టణంలోని పలు డ్రెయినేజీలు పొంగి ప్రవహించే అవకాశముంది. అయితే అందులో ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన చెత్తాచెదారం కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయింది. దీంతో చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీల్లోని మురుగునీరంతా రోడ్లపైకి చేరి కాలనీల్లోని ఇళ్లలోకి చేరే ప్రమాదం లేకపోలేదు. సీజన్కు ముందే వేసవిలో పూడికతీత పనులు చేపట్టాల్సిన బల్దియా అధికారులు ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించలేదు. వర్షాలు ప్రారంభమైతే పారిశుధ్య పనులు ముందుకు సాగే అవకాశముండదు. బల్దియా అధికారుల నిర్వాకంతో తమకు ముంపు భయం పొంచి ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తాచెదారంతో డ్రెయినేజీలు.. గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పట్టణవాసుల అవసరాలకు అనుగుణంగా డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. విద్యానగర్, రాంనగర్, సుభాష్నగర్, రిక్షాకాలనీ, రిమ్స్ ఆసుపత్రి, పంజాబ్చౌక్, శాంతినగర్, మహలక్ష్మివాడ, హౌసింగ్బోర్డు, ఖానాపూర్ వంటి పలు కాలనీల్లో సుమారు 20కి పైగా భారీ డ్రెయినేజీలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేస్తున్నప్పటికీ మరికొన్నింటిని మాత్రం బల్దియా అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో అవి చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. ఈ సమయంలో ఓ మోస్తరు స్థాయిలో వర్షం కురిస్తే డ్రెయినేజీల్లోని నీరంతా రోడ్లపై ప్రవహించే అవకాశముంది. అలాగే పలుచోట్ల ఇళ్లు సైతం వరద ముంపునకు గురయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపుపై దృష్టి సారించని యంత్రాంగం వర్షాలు షురూ కావడంతో పట్టణవాసుల్లో గుబులు -
అతివకు చేయూత
● సీ్త్రనిధి రుణ లక్ష్యం ఖరారు ● రూ.36కోట్లు అందించేలా కార్యాచరణ ● ఇప్పటికే రూ.2కోట్ల రుణాలు అందజేత కై లాస్నగర్: జిల్లా సీ్త్రనిధి రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.36 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన స్వయం సహాయక సంఘాలకు ఆ మొత్తాన్ని అందించే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మండలాల వారీగా అందించాల్సిన రుణ లక్ష్యాన్ని ఖరారు చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటికే రూ.2కోట్ల రుణాలు అందజేసి అతివల అభ్యున్నతికి అండగా నిలుస్తున్నారు. స్వయం సమృద్ధి సాధించేలా.. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. స్వయం సమృద్ధి సాధించేలా వారికి అండగా నిలుస్తోంది. కుటీర పరిశ్రమలు, కిరాణ, టైలరింగ్ షాపులు, వస్త్ర దుకాణాలు, సెంట్రింగ్ యూనిట్, పాడి ఆవులు, గేదెలు, పెరటి కోళ్ల పెంపకం, లేడిస్ ఎంపోరియం వంటి వ్యాపారాలు ప్రారంభించేలా బ్యాంకు లింకేజీతో పాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తూ వారికి ఆర్థిక చేయూత అందిస్తోంది. గతంలో అందించే రూ.20వేల వ్యక్తిగత రుణాలను ఈ సారి రూ.40వేలకు పెంచారు. ఆదాయం ఆర్జించే వ్యాపారాల కోసం రూ.3లక్షల వరకు అందజేస్తున్నారు. జిల్లాలోని అర్హత సాధించిన స్వయం సహాయక సంఘాలకు రూ.36 కోట్లను అందించాలని నిర్ణయించారు. ఇందులో మున్సిపాలిటీ పరిధిలో గల మెప్మా ఆధ్వర్యంలోని సంఘాలకు రూ.9కోట్లు కేటాయించగా, 20 గ్రామీణ మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు రూ.27 కోట్లు కేటాయించారు. సంఘాల అర్హత ఆధారంగా ఏ మండలానికి ఎంత నిధులు కేటాయించాలనే టార్గెట్లు ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు మండల, పట్టణంలోని వార్డుల వారీగా లక్ష్యం ఖరారు కానప్పటికీ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఈ మూడు నెలల్లో రూ.2కోట్ల రుణాలను సభ్యులకు అందజేశారు. గతేడాది లక్ష్యాన్ని అధిగమించి... 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 30.14 కోట్ల రుణాలను సీ్త్రనిధి ద్వారా అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందులో 222 గ్రామ సంఘాల పరిధిలోని 1045 స్వ యం సహాయక సంఘాలకు గాను రూ. 32.74 కోట్ల రుణాలు అందజేశారు. కేటా యించిన లక్ష్యానికి మంచి 100.79 శాతం సాధించారు. రుణాల మంజూరులో ఆశించిన దానికంటే మెరుగైన ప్రగతి సాధిస్తున్నప్పటికీ వాటి రికవరీలో మాత్రం వెనకబడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, వీవీఓలు, సీసీలు, ఏపీఎంలు పట్టింపులేని తనంగా వ్యవహరించడంతో ఏటా ఈ రుణ బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా రూ. 51కోట్ల 8లక్షల బకాయిలు పేరకుపోయి ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది. సద్వినియోగం చేసుకోవాలిమహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్రనిధి ఎంతగానో తోడ్పడుతుంది. వ్యక్తిగత రుణాలతో పాటు వ్యాపారపరంగానూ రూ.40వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు అందజేస్తున్నాం. స్వయం సహాయక సంఘాల సభ్యులు వా టిని సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలి. తీసుకున్న రుణాలు పెండింగ్లో ఉంచకుండా సకాలంలో చెల్లించాలి. – పూర్ణచందర్, సీ్త్రనిధి ఆర్ఎం -
● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్ ఎమ్మెల్యేకు కేబినెట్లో చోటు ● ప్రేమ్సాగర్రావు, వినోద్ను పక్కన బెట్టిన అధిష్టానం ● నేడు ప్రమాణ స్వీకారం..
మూడో వ్యక్తి.. చెన్నూర్ నుంచి గెలిచిన వారిని మంత్రి పదవులు వరిస్తున్నాయి. గతంలో బోడ జనార్దన్, గడ్డం వినోద్ మంత్రులుగా పనిచేశారు. తాజాగా గడ్డం వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ దక్కింది. 1999 నుంచి 2004 వరకు అప్పటి ఎమ్మెల్యే బోడ జనార్దన్ చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు ప్రస్తుత బెల్లంపల్లి, ఎమ్మెల్యే నాటి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వివేక్కు కూడా కేబినెట్ బెర్త్ ఖరారైంది. దీంతో చెన్నూర్ను మూడోసారి మంత్రి పదవి వరించనుంది.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. మంత్రి పదవి కోసం మొదటి నుంచి కొనసాగుతున్న పీట ముడి వీడింది. ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థా నం దక్కింది. ఏడాదిన్నరగా తర్జనభర్జనలు కొనసాగగా ఆదివారం కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మాల సామాజిక వర్గం నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాదిగ సామాజికవర్గం కోటాలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి కేబినెట్ బెర్త్లు ఖరారు అయినట్లు తెలిసింది. ముగ్గురి మధ్య పోటీ.. జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మె ల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పోటీ పడ్డారు. గాంఽధీభవన్ నుంచి ఢిల్లీ వరకు పీసీసీ స్థాయి నుంచి ఏఐసీసీ అధిష్టానం దాకా ముగ్గురూ ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకున్నారు. చివరకు అధి ష్టానం వివేక్నే ఖరారు చేసింది. దీంతో ప్రేమ్సాగర్, వినోద్ కంగుతిన్నారు. అనుచరులు సైతం ఊహించని షాక్కు గురయ్యారు. కొద్ది రోజులుగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు. వివేక్కు పదవీ రావడం వారికి మింగుడు పడటం లేదు. మరోవైపు చెన్నూర్ ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ రాజకీయ ప్రస్థానం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయనకు పదవీ వస్తుందా, రాదా? అనే ఊహాగానాలు వచ్చాయి. అధిష్టానం తొలి విడతలోనే పదవీ ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణలు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమోదం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సైతం ప్రయత్నాలు తీవ్రంగా చేశారు. అయితే సామాజిక, రాజకీయ కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. -
నైపుణ్యాలతో బోధన ప్రమాణాలు మెరుగు
బాసర: కమ్యూనికేషన్ నైపుణ్యాలు బోధన ప్రమాణాలు మెరుగుపర్చడంలో కీలకమని ఇన్చార్జి వీసీ గోవర్ధన్ పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో శుక్రవారం ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్’అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ ఫ్యాకల్టీలు తమ ప్రొఫెషనల్ అభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం బోధనలో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందన్నారు. కార్యక్రమ సమన్వయకులుగా హెచ్ఓడీ విజయ్ కుమార్ అప్సింగర్, అసోసియేట్ డీన్లు విఠల్, మహేశ్, నాగరాజు, పీఆర్వో విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన చిన్నారిని అప్పగింత
మందమర్రిరూరల్: తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పట్టణంలోని మొదటిజోన్ సీఎస్ఐ చర్చికి సమీపంలోని మూడేళ్ల చిన్నారి ఆరాధ్య శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి తప్పిపోయింది. స్థానిక సాయిబాబా ఆల యం వద్ద ఆ చిన్నారి అక్కడివారికి కనిపించింది. వారు బ్లూకోట్ పోలీసులకు అప్పగించా రు. పోలీసులు వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రచా రం చేయడంతో తల్లిదండ్రులు జమున–రాజులు సాయంత్రం పోలీస్స్టేషన్కు వెళ్ల్లగా చిన్నారిని అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. -
పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
తానూరు: పెళ్లి కావడం లేదని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రైయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన వాగ్మారే ఆకాశ్ (25) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి కొడ్యబాయికి కొంత కాలంగా మానసిక పరిస్థితి బాగాలేదు. ఇంట్లో పనులు చేసేవారు లేక వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉందని, తల్లి మానసిక పరిస్థితి బాగా లేకపోవడం, తనకు పెళ్లి కావడం లేదని సోదరికి గురువారం రాత్రి ఫోన్లో చెప్పాడు. తల్లి బంధువుల ఇంటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఆకాశ్ మనస్తాపంతో రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటిపక్క వారు చూసి సమాచారమివ్వడంతో ట్రైయినీ ఎస్సై అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోదరి గాయక్వాడ్ గీతాంజలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైయినీ ఎస్సై తెలిపారు. జీవితంపై విరక్తితో వ్యక్తి.. కడెం: జీవితంపై విరక్తితో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపా రు. ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని చిట్యాల్కు చెందిన బానవత్ రవి(35) నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెందాడు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. తల్లి జీజాబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్సపొందుతూ వృద్ధుడి మృతి మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుర్తుతెలియని పురుగుల మందు తాగిన వృద్ధుడు చికిత్స పొందు తూ మృతిచెందాడు. హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ కథనం ప్రకారం..మండలంలోని ముల్కల్ల గ్రామంలోని వాగొడ్డుపల్లెకు చెందిన పెట్టం మల్లయ్య(68), భార్య మల్లక్క దంపతులు. వారితో ఉన్న పాత గొడవలను మనసులో పెట్టుకుని వాగొడ్డుపల్లెకు చెందిన లగిశెట్టి అమ్మక్క, ఆమె కుటుంబ సభ్యులు గురువారం మల్లయ్య, మల్లక్కపై గురువారం భౌతిక దాడి చేసి దుర్భాషలాడి మానసిక ఇ బ్బందులకు గురిచేశారు. పిల్లలు లేని మల్లయ్య చా వక ఎందుకు బతుకుతున్నావని ఊరందరి ముందు తిట్టడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. మల్లయ్య తన ఇంటి వెనుక పశువుల కొట్టంలో మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ రాత్రి మృతిచెందాడు. భార్య మల్లక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తిచేయాలి
● పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణఆదిలాబాద్టౌన్: వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణ అన్నారు. బాసర జోన్ పరిధిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల అటవీ శాఖ అధికారులతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన మహోత్సవానికి సంబంధించి లక్ష్యాలను సాధించాలన్నారు. 46 లక్షల మొక్కలు నాటే లక్ష్యం పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఎవరైనా కొత్తగా పోడు కోసం అటవీ భూ ములు సాగు చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మావల హరితవనం పార్కు, కుంటాల జలపాతాల్లో సఫారీలను ఏర్పాటు చేస్తామన్నారు. వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఆదిలాబా ద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల డీఎఫ్ఓలు ప్రశాంత్ బాజీరావు పాటిల్, వికాస్ మీనన్, నాగిబాను, రవిప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: ఆదివాసీలకు ఐటీడీఏ ద్వారా కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 25 పీవీటీజీ గ్రామాలకు మంజూరైన పీఎం జన్మన్ పథకం ద్వారా 25 వన్దన్ వికాస్ (వీడీవీకే) కేంద్రాలు మంజూరైనట్లు తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో అధికారులు, వీడీవీకేల అధ్యక్షులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మినీ దాల్మిల్, పచ్చళ్లు, పౌల్ట్రీ ఫార్మ్, పేపర్ ప్లేట్, ఇప్ప పరక నూనె, వెదురు కర్ర తయారీ కేంద్రాలకు కావల్సిన పరికరాలు, మిషనరీలు వాటికి కావల్సిన మెటీరియల్ గురించి చర్చించారు. అదేవిధంగా మిషనరీలు, పరికరాలు కొనుగోలు కోసం టెండర్ ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ డీడీ దిలీప్కుమార్, ఎస్ఎంఎం ట్రైకార్ లక్ష్మి ప్రసాద్, సాయిచరణ్, ఆర్ఎం ట్రైఫెడ్ సందీప్శర్మ, డీపీవో ప్రవీణ్, జేఎస్ఎస్, వీడీవీకే సభ్యులు పాల్గొన్నారు. -
నేడు బక్రీద్
● మసీదులు, ఈద్గాలు ముస్తాబు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు నెన్నెల/ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బక్రీద్కు మసీదులు, ఈద్గాలు ముస్తాబు చేశారు. శనివారం పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ తదితర పట్టణాల్లో ఏర్పాట్లు చేశారు. ఇస్లాం క్యాలెండర్లోని బక్రీద్ మాసంలో 11వ రోజు పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. త్యాగనీరతికి ప్రతీకగా ముస్లింలు పండుగ జరుపుకుంటారు. పండుగ రోజు జంతువులను బలి ఇచ్చి మాంసాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పేదలకు సమభాగాలుగా పంపిణీ చేస్తారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీకగా నెన్నెల మత గురువు షగీర్ అహ్మద్ పేర్కొన్నారు. చెడును నిరోధించడం, మంచిని పెంచడం, కష్టాల్లో సహనం వహిస్తూ త్యాగనీరతిని చూపించాలన్న సందేశమే ఖుర్బానీలో దాగి ఉందని, ప్రతీ ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని తెలిపారు. పండుగను శాంతియుత వాతావరణంలో కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఉట్నూర్లోని జామ మసీద్ మౌలానా కలీం పేర్కొన్నారు. -
గోండి వికీపీడీయన్కు అరుదైన అవకాశం
ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని మత్తడి శంభుగూడకు చెందిన గోండి వికీపీడీయన్ సిడాం వరప్రసాద్కు అరుదైన అవకాశం దక్కింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ద్వారా ప్రచురించిన గ్రంథం తిరుక్కురల్ను గోండి భాషలోకి అనువదించడానికి అధికారిక ఆమోదం పొందారు. ఆయన ఇప్పటికే 250 ద్విపదల అనువాదాన్ని 25 అధ్యాయలు కేవలం 15 రోజుల్లో పూర్తి చేశారు. తిరుక్కురల్, ఆదిలాబాద్ మాండలికం గోండి లిపిలో రాబోతున్న సందర్భంగా వరప్రసాద్ను బోలి చేతో ఫౌండేషన్ సీఈవో సాయికిరణ్, సభ్యులు ఆత్రం మోతీరాం, ఆత్రం రాజ్కుమార్, మడావి రవి సన్మానించారు. -
పండ్ల తోటల పెంపకంతో ‘ఉపాధి’
● జిల్లాకు 560 ఎకరాల సాగు లక్ష్యం ● రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ● మూడేళ్ల వరకు ప్రభుత్వానిదే సంరక్షణకై లాస్నగర్: జిల్లాలో రైతులు పత్తి, సోయా, కంది వంటి సంప్రదాయ పంటలనే సాగు చేస్తున్నారు. అయితే వాటి దిగుబడులు ఆశించిన స్థాయిలో రాక పలువురు నష్టపోతున్నారు. ఈ క్రమంలో పండ్ల తోటల పంపెకం ద్వారా రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పండ్ల ఉత్పత్తి జరగకపోవడంతో భారీగా ధర పలుకుతున్నాయి.ఈ క్ర మంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్ర భుత్వం అన్నదాతకు ఆర్థిక చేయూత అందిస్తూ అండగా నిలుస్తోంది. రైతు నయాపైసా ఖర్చు లేకుండా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టే అవకాశం కల్పిస్తుంది. జిల్లాలో ఈ సీజన్కు 560 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సాగుకు ప్రభుత్వ చేయూత .. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. జిల్లాలో ఉపాఽధి హామీ జాబ్ కార్డు కలిగి న ఎస్సీ, ఎస్టీ, చిస్న, సన్నకారు రైతులకు ఈ పథ కం కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. 2025 –26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 560 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలను పెంచేదిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు పండ్ల తోటల సాగుకు ప్రోత్సహిస్తుంది. ఎకరాకు 70 నుంచి 160 మొక్కల చొప్పున రైతులకు అందించనున్నారు. ప్రధానంగా మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, తైవాన్ జామ, మునగ, సీతాఫలం, సపో ట, డ్రాగన్ ప్రూట్స్ , కొబ్బరి తోటల పెంపకం చేపట్టేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జిల్లాలోని ఆసక్తి గల రైతుల నుంచి ఎంపీడీవోల ద్వారా అధికారులు దరఖాస్తలు స్వీకరిస్తున్నారు. ఎంపీడీవోల నుంచి అందిన దరఖాస్తుల ఆధారంగా మొక్కలు అందించేలా చర్యలు చేపట్టనున్నారు. సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే.. పండ్ల తోటల పెంపకానికి సంబంధించి మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తవ్వేందుకు రూ.233.32, మొక్కలు నాటేందుకు రూ.47.53 జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. అలాగే ఆ మొక్కలు ఎదిగేలా నీటిని అందించేందుకు సైతం ఆర్థిక చేయూతనందిస్తుంది. రైతులు చేపట్టిన ఈ పండ్ల తోటలకు సంబంధించి ఒక ఎకరాకు మూడేళ్ల పా టు నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే సంరక్షణ బా ద్యతలను పర్యవేక్షిస్తూ రైతుకు వెన్నుదన్నుగా ని లుస్తోంది. అయిదెకరాల్లోపు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ , చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. సదరు రైతులు సాగునీటి వసతి కలిగి ఉండాలి. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసిన డీఆర్డీఏ అధికారులు వ్యవసాయ, ఉద్యానవనశాఖల సమన్వయంతో దాన్ని అధిగమి ంచేలా ముందుకు సాగుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలిపండ్ల తోటల పెంపకాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో రైతులకు ఆర్థికచేయూత అందిస్తుంది. నీటి వసతి కలిగి జాబ్ కార్డు కలిగిన రైతులు ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో మామిడి, నిమ్మ, జామ, మునగ మొక్కలకే ప్రధాన డిమాండ్ ఉంది. వాటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటితో పాటు ఇతర మొక్కలు నాటేందుకు ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా అందజేస్తాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. – కుటుంబరావు, అడిషనల్ డీఆర్డీవో -
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: పోలీసు సిబ్బంది నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు రికార్డులను నవీకరిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. పోలీసు యంత్రాంగానికి స్పెషల్ బ్రాంచ్ నిఘా వ్యవస్థలా పనిచేస్తుందని తెలిపారు. అనునిత్యం ప్రజలతో కలిసి ఉంటూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్రావు, స్పెషల్బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ నాగేందర్, ఇన్స్పెక్టర్లు మోహన్, సునిల్ కుమార్, కరుణాకర్రావు, వెంకటి, ఎస్సై అన్వర్ ఉల్హఖ్, ఏఎస్సై సురేందర్, సిబ్బంది పాల్గొన్నారు. ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్లో నమోదు చేయాలిఆదిలాబాద్టౌన్: ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బాధితులు పోగొట్టుకు న్న రూ.13లక్షల విలువ గల వంద మొబైల్ ఫోన్లను స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లో బాధితులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి రాబట్టడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15 రోజుల్లోనే వంద ఫోన్లను స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 800 ఫోన్లు బాధితులకు అందించినట్లు వివరించారు. దొంగలించిన, పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందేందుకు బాధితులు www.ceir.gov.in వెబ్సైట్తో పాటు సమీపంలోని పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు సునిల్ కుమార్, కరుణాకర్రావు, ఫణిందర్, రిజ ర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, ప్రత్యేక బృందాల సభ్యులు గోపీకృష్ణ, సంజీవ్, మజీద్, త్రిశూల్, నవనీత్ తదితరులు పాల్గొన్నారు. -
వివాదాస్పద స్థలం పరిశీలన
కైలాస్నగర్: ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని జీఎస్ ఎస్టేట్లో గల వివాదాస్పద రోడ్డు స్థలా న్ని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ జేఆర్ చౌహాన్ శుక్రవారం పరి శీలించారు. కొంతమంది రియల్ వ్యాపారులు రోడ్డు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించా రంటూ పలువురు ఇటీవల కలెక్టర్ రాజర్షి షా ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చే పట్టాలనే కలెక్టర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ ఆ స్థలాన్ని పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీపీవో సుమలత, డీపీబీవో సాయికృష్ణ తదితరులున్నారు. -
ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఫ్లాగ్మార్చ్..
ఆదిలాబాద్టౌన్: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంపొందించేందుకే ఫ్లాగ్మార్చ్ నిర్వహించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బక్రీద్ సందర్భంగా 300 మంది పోలీసు సిబ్బందితో శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఫ్లాగ్మార్చ్ చేపట్టారు. శాంతినగర్, బొక్కల్గూడ, మహాలక్ష్మివాడ, క్రాంతినగర్, ఖానాపూర్లో ని ర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. అన్నివర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, పోతారం శ్రీని వాస్, వన్టౌన్, టూటౌన్ సీఐలు సునిల్ కుమార్, కరుణాకర్రావు తదితరులు ఉన్నారు. -
మైక్రోఫైనాన్స్లపై తప్పుడు ప్రచారం సరికాదు
● కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మూడు ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లుకై లాస్నగర్: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేలా జిల్లాలోని ఇచ్చోడ, ఉట్నూర్, జైనథ్ మండలాల్లో ప్లా స్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వచ్ఛ భారత్ మి షన్, అమ్మ ఆదర్శ పాఠశాల, వన మహోత్స వ నిర్వహణపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను కూలీల ద్వారా సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఏడాది 46.57 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనుల రికార్డుల నమోదు సక్రమంగా జరగలేదని మరోసారి చేపట్టాలని సూచించారు.ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.కై లాస్నగర్: స్వార్థంతోనే కొంతమంది వడ్డీవ్యాపారులు, దళారులు మైక్రోఫైనాన్స్ సంస్థలపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఆర్బీఐ గుర్తించిన మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆర్థిక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేనటువంటి మారుమూల, పట్టణ ప్రాంతాల్లో, బ్యాంకు సేవలు పొందలేనటువంటి వారికి ప్రయోజనం కల్పించేందుకే మైక్రోఫైనాన్స్ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఎలాంటి తాకట్టు, కండిషన్ లేకుండా వారిచ్చే రుణలతో తమ వ్యాపారాలకు నష్టం కలు గుతుందనే ఉద్దేశంతో వడ్డీ వ్యాపారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే రుణాలు ఇవ్వాలని, వాటిని చెల్లించే విధానంపై ముందుగానే వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మే నేజర్ ఉత్పల్ కుమార్, ఎంఎఫ్ఐఎన్ నెట్వర్క్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికతోనే సీజనల్ వ్యాధుల కట్టడిసీజనల్ వ్యాధుల కట్టడికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సీజనల్ వ్యాధుల సంసిద్ధతపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు డెంగీ, మలేరియా, చికున్గున్యా, విషజ్వరాల బారిన పడకుండా పా టించాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ముందస్తు వైద్య శిబి రాలు నిర్వహించాలన్నారు. వైద్యులు, సిబ్బంది ప్ర జలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. హై రిస్క్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జెడ్పీసీఈవో జితేందర్రెడ్డి, డీపీవో రమేశ్, మున్సి పల్ కమిషనర్ సీవీఎన్.రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి
ఆదిలాబాద్టౌన్: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభు త్వ పాఠశాలల్లో చదివించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పిల్లలంతా ఒకేచోట చదువుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేపట్టిన ప్రచారజాత శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఇందుకోసం ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమావేశంలో పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యామ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశోక్, సూర్యకుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంతరాలు లేని విద్యావిధానం రావాలి నేరడిగొండ/ఇచ్చోడ: అంతరాలు లేని విద్యా విధానం రావాలని నర్సిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యపర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రచారజాతా శుక్రవారం నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లడారు. ఇందులో టీఎస్ యూటీఎఫ్ నేరడిగొండ మండల అధ్యక్షుడు బి.రాజ్కుమార్, కోశాధికారి ఉదయకిరణ్, ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్ఎం అంబారావు, ఈశ్వర్, చంద్రశేఖర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రనిఽధి అక్రమాలపై నివేదిక కోరిన డీఆర్డీవో
కైలాస్నగర్: జిల్లాలోని వివిధ మండలాల్లో సీ్త్రనిధి రుణాల్లో జరుగుతున్న అక్రమాలను వివరిస్తూ ‘స్వాహాపై మౌనమేలా’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. వివరాలతో కూడిన నివేదికను పంపించాలని డీఆర్డీవో రాథోడ్ రవీందర్, అడిషనల్ డీఆర్డీవో జాదవ్ గోవింద్రావు సీ్త్ర నిధి జిల్లా మేనేజర్ పూర్ణచందర్కు సూచించారు. దీంతో ఆయన జిల్లా మేనేజర్ ఐలమ్మ, ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లు సంతోష్, చిరంజీవిలతో తన ఛాంబర్లో సమీక్షించారు. సభ్యుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే రుణాలను స్వాహా చేసిన వీవోఏలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. -
నిజాయతీ ఉద్యోగులకు సజ్జనార్ సన్మానం
ఆదిలాబాద్: ఇటీవల బస్సులో బ్యాగ్ మర్చిపోయిన ప్రయాణికురాలికి నిజాయతీగా తిరిగి అందించిన ఆదిలాబాద్ డిపోకు చెందిన ఇద్దరు ఉద్యోగులను గురువారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు. ఇటీవల నిర్మల్–ఆదిలాబాద్ ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించిన అక్రమ్ బేగ్ తన బ్యాగును బస్సులో మర్చిపోయింది. గమనించిన కండక్టర్ వీ.రమణ డ్రైవర్ ఎం. గులాబ్ డిపో అధికారులకు సమాచారం అందించడంతో తిరిగి ప్రయాణికురాలికి అప్పగించారు. ఆ బ్యాగులో 12 గ్రాముల బంగారం, ఫోన్ రూ. వెయ్యి నగదు ఉన్నట్లు బాధితురాలు పేర్కొంది. నిజాయతీ చాటుకున్న సదరు ఉద్యోగులను ఎండీ సజ్జనార్ బస్ భవన్లో అభినందించారు. -
బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి
ఆదిలాబాద్రూరల్: బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిలాబాద్ రూరల్ ఎంపీడీవో సమావేశ మందిరంలో ప్రధానోపాధ్యాయులతో బడిబాట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యులు, 15 సంవత్సరాలు నిండిన వయోజనులు తప్పనిసరిగా అక్షరాస్యులుగా మారాలన్నారు. అందుకు గ్రామంలోని అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఐకేపీ సిబ్బంది తప్పనిసరిగా డోర్ టు డోర్ విజిట్ చేయాలన్నారు. కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సుజాత ఖాన్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామసభ నిర్వహించాలన్నారు. 7న విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ను అప్డేట్, 8 నుంచి 10 వరకు డోర్ టు డోర్ సర్వే, 11న సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ కందుల గజేందర్, అధికారులు సత్యనారాయణ, ఎంఈవో కంటె నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్రూరల్: రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం మండలంలోని అర్లి (బి), లాండసాంగ్వి, చాందా (టి), తంతోలి, మావల మండలంలోని సరస్వతీ నగర్లో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి (బి)లో విత్తనాల దుకాణం, చాందా (టి)లోని వ్యవసాయ సహకార కార్యాలయాన్ని సందర్శించి ఎరువుల నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు. -
● జీపీఏ ఆధారంగా పక్కదారి.. ● ఆదిలాబాద్ పట్టణంలో మాయాజాలం ● ఒకే డాక్యుమెంట్లో 80 ప్లాట్లు ● కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్లకు ఫిర్యాదు ● సబ్రిజిస్ట్రార్ తీరుపై విమర్శలు
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత మే 31న ఓ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఒకే ఒక డాక్యుమెంట్లో ఒక లేఅవుట్లోని 80 ప్లాట్లు ఈ దస్తావేజులో రిజిస్ట్రేషన్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ లేఅవుట్కు డీటీసీపీ అనుమతి లేదని, ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోలేదని, లొసుగులను ఆధారంగా చేసుకుని అలాంటి ప్లాట్లను జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ) ద్వారా వీటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ డాక్యుమెంట్ విషయంలో కొంతమంది ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. తాజాగా గురువారం కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివాదం ఇలా.. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్లో 59 సర్వే నంబర్లో ఓ లేఅవుట్ను కొంతమంది రియల్టర్లు రూపొందించారు. దీనికి డీటీసీపీ అనుమతి లేదు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కూడా చేయలేదు. అలాంటి పరిస్థితిలో ఈ లేఅవుట్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలులేదు. దీంతో ఆ రియల్టర్లు ఎత్తుగడ వేసి వాటిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటు డీటీసీపీ లేకపోవడం, అటు ఎల్ఆర్ఎస్ లేకపోవడంతో ఆ రియల్టర్లు ఆ పట్టాదారు మరో వ్యక్తికి ఆ లేఅవుట్పై జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ) ఇవ్వడం జరిగింది. దాని డాక్యుమెంట్ ఆధారంగా ఈ అనధికారిక లేఅవుట్లోని ప్లాట్లను గంపగుత్తగా ఒకే డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఓ సబ్రిజిస్ట్రార్కు పెద్ద మొత్తంలో మామూళ్లు అందడంతోనే ఇలా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని జిల్లా అధికారులకు కొంతమంది ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
బజార్హత్నూర్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని టెంబిలో పీహెచ్సీ వైద్యాధికారి అలేఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును సందర్శించారు. అనంతరం వీధుల్లో తిరుగుతూ మురికి కాలువల్లో పూడిక, చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది దివ్య, సుశీల, రాణి, రవీందర్, అభిషేక్, రవి, గాజుల రమేశ్, విజయ, మంజుల పాల్గొన్నారు. డ్రెయినేజీ పరిశీలిస్తున్న డీఎంహెచ్వో నరేందర్ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● ఎంపీ గోడం నగేశ్బజార్హత్నూర్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జాతర్లలో మొక్కలు నాటారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, మాజీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, పెందూర్ ఈశ్వర్, అల్కే గణేశ్, నానం రమణ, కొత్త శంకర్, నంది నర్సయ్య, ఎట్టం రాములు, సుఖ్దేవ్, భోజారెడ్డి, వినాయక్ పాల్గొన్నారు. -
సాగుకేది ‘నీటి వసతి’..?
● దళితబస్తీ భూముల వైపు చూడని ప్రభుత్వం ● సాగుదారులకు తప్పని ఇబ్బందులు ● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు ఆదిలాబాద్అర్బన్: భూమిలేని నిరుపేదలను సాగుదారులుగా మార్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం దళిత బస్తీ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గుంట భూమిలేని మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత కల్పిస్తూ మూడెకరాల భూమిని పంపిణీ చేసింది. భూముల కొనుగోలు సమయంలో కొన్ని భూముల్లో అప్పటికే బోర్లు, బోరుబావులు ఉన్నా యి. అయితే నీటి వసతి లేని భూముల్లో కొత్త బోర్లు వేయాలని ఎస్సీ కార్పోరేషన్ అధికారులకు జిల్లాలో వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేపట్టారు. నివేదిక తయారు చేసి భూగర్భజల శాఖ అధికారులకు వాటర్ సర్వే నిమిత్తం పంపించారు. నీటి సర్వే చేసిన గ్రౌండ్ వాటర్ అధికారులు ఆ వివరాలను ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు పంపించారు. అప్పుడు అర్హుల జాబితా తయారు చేసి కలెక్టర్ ఆమోదం తీసుకుని ఆరు నెలల క్రితం మంజూరు కోసం ఆ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపారు. దీనిపై ఇప్పటి వరకు స్పందన లేదు. ప్రస్తుతం సాగునీటి వసతి ఇలా.. ప్రభుత్వం భూములు కొన్న సమయంలో అప్పటికే ఆయా భూముల్లో కొన్నింటికీ సాగునీటి బోర్లు, బోరుబావులు ఉన్నాయి. భూములు అమ్మిన యాజమానులు ఆయా బోర్లకు, బోరుబావులకు ఉన్న మోటర్లు, పైపులు, విద్యుత్ వైర్లు తీసుకెళ్లిపోయారు. దీంతో లబ్ధిదారులే సొంతంగా మోటర్లు, పైపులు కొనుగోలు చేసి సాగునీటిని పంటలకు అందిస్తూ వస్తున్నారు. అయితే భూములకు సరిపడా సాగునీరు లేకపోవడంతో ముగ్గురు లబ్ధిదారులకు (తొమ్మిది ఎకరాలకు) కలిపి ఒక్కో సాగునీటి బోర్ను అధికారులు కేటాయించారు. భూ పంపిణీ చేసినప్పటి నుంచి ఆయా బోర్లనుండి సాగునీటిని వినియోగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎండాకాలంలో భూగర్భజలాలు అడుగంటడంతో రబీ సీజన్లో ఒక లబ్ధిదారు(మూడు ఎకరాలు) సాగు చేసే పంటకే నీరు సరిపోతుంది. మిగతా ఇద్దరు రైతులు సీజన్లో పంటలు వేయలేని పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ భూముల్లో సైతం సాగునీటి బోర్లు వేయాలని లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో భూముల పరిశీలన.. బోర్వెల్ల కోసం లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్ అధికా రులు ఎవరెవరి భూముల్లో నీటి వసతి లేదో వారి జాబితాను సిద్ధం చేశారు. దాని ప్రకారం నీటి వసతి కోసం డ్రిల్లింగ్ చేసేందుకు బోర్ పాయింట్లు గుర్తించాలని భూగర్భజల శాఖ అధికారులకు నివేదిక అందజేశారు. కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం భూగర్భజల శాఖ అధికారులు లబ్ధిదారుల భూముల్లోకి వెళ్లి గ్రౌండ్ వాటర్ సర్వే చే పట్టారు. ఆ సమయంలో వాటర్ సర్వే మిషన్లు జి ల్లాలో అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి తెప్పించి మరీ సర్వే చే శారు. ఒక్కో రోజుకు 25 ఎకరాల నుంచి 30 ఎకరా ల వరకు సర్వే చేసి బోర్వెల్ పాయింట్లు గుర్తించా రు. గుర్తుగా రాళ్లు, రాడ్లు, బండలను పాతారు. అ లా సర్వే చేసిన అధికారులు ఆ వివరాలను ఎస్సీ కార్పోరేషన్కు అధికారులకు పంపించారు. పరిశీ లించిన అధికారులు ఎవరెవరి భూముల్లో బోర్లు వేయాలో ఆ వివరాలు సిద్ధంచేసి కలెక్టర్ ఆమోదం కోసం పంపించారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం మంజూరు నిమిత్తం ఆ శాఖ కమిషనరేట్కు పంపారు. కాగా జిల్లాలో జైనథ్, బేల, భీంపూర్, తాంసి, తలమడుగు, గుడిహత్నూర్, బజార్హత్నూర్, తదితర మండలాల్లో కొన్నిచోట్ల కొత్త బోర్లు వేయగా మరికొంత మంది భూముల్లో గ్రౌండ్ వాటర్ సర్వే చేయాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపించాం దళితబస్తీ పథకం కింద భూములు పొందిన లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బోర్లు వేయాలని నిర్ణయించాం. ఆరునెలల క్రితం 600 బోర్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే లబ్ధిదారుల భూముల్లో కొత్తగా బోర్లు వేస్తాం. విద్యుత్ సౌకర్యం నిమిత్తం కూడా ప్రభుత్వానికి నివేదించాం. – మనోహర్రావు, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ -
డీవైఎస్వోగా శ్రీనివాస్ బాధ్యతలు
ఆదిలాబాద్: డీవైఎస్వో (ఇన్చార్జి)గా తాంసి జెడ్పీ హైస్కూల్లో పీడీగా విధులు నిర్వర్తిస్తు న్న జక్కుల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డీవైఎస్వోగా వ్యవహరించిన వెంకటేశ్వర్లు ఇటీవల ఉద్యోగ విరమణతో ఆయన స్థానంలో శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా యువజన క్రీడల అధికారిగా బాధ్యతలు స్వీకరించడంపై క్రీడా సంఘాల బాధ్యులు స్వామి, రాజేశ్, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
ప్రభుత్వ బడి బలోపేతమే లక్ష్యం
● ప్రైవేట్కు దీటుగా వసతుల కల్పన ● డిజిటల్, ఏఐ ద్వారా విద్యాబోధన ● ‘బడిబాట’పై స్పెషల్ ఫోకస్ ● టీచర్ల సర్దుబాటుకు కసరత్తు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో శ్రీనివాస్రెడ్డి ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.. ప్రైవేటుకు ధీటుగా అన్ని వసతులు అందుబాటులో ఉంచుతున్నాం.. డిజిటల్ తరగతులు, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా కూడా విద్యాబోధన అందిస్తున్నాం. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచడంపై ఫోకస్ పెంచాం.. బడిబాటను పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశాం.. నాణ్యమైన బోధనే లక్ష్యంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ సైతం పూర్తి చేశాం.. పాఠశాల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. అని డీఈవో ఏనుగు శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలేంటి? డీఈవో: ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. మరింత నాణ్యమైన విద్యాబోధన కోసం వారికి ఈ వేసవిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ ద్వారా బోధన, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులతో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్బుక్స్, కంప్యూటర్ విద్యతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ వారి హాజరు పెంచేందుకు కృషి చేస్తున్నాం. సాక్షి: విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు..? డీఈవో: బడిబాట కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రోత్సహిస్తున్నాం. గతేడాది ప్రవేశాలు తగ్గిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ఉంటుంది. దీనిని పకడ్బందీగా అమలు చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సాక్షి: పాఠశాలల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు..? డీఈవో: పాఠశాలల్లో సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆయా మండల విద్యాధికారులు, ఉపాధ్యాయుల ద్వారా అవసరమైన మౌలిక వసతుల వివరాలను సేకరించాం.వాటిని ఉన్నతాధికారులకునివేదించాం.నిధులు మంజూరు రాగానే పనులు చేపడతాం.అలాగే విద్యా ప్రమాణాలపై పర్యవేక్షణ పెంచాం. సాక్షి: జిల్లాలో మూతబడిన పాఠశాలలను తెరిచేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? డీఈవో: జిల్లాలో 12 పాఠశాలలు మూతబడ్డాయి. వీటిలో ఒక ఉన్నత పాఠశాల ఉంది. ప్రస్తుతం బడిబాట లో భాగంగా నాలుగు ప్రాథమిక పాఠశాలలను తెరిచేందుకు చర్యలు చేపడుతున్నాం. నేరడిగొండ, నార్నూర్లో ఒక్కోటి చొప్పున, ఆదిలాబాద్అర్బన్లో 2 పాఠశాలలు పునఃప్రారంభించేలా చూస్తున్నాం. ఈ పాఠశాలలకు అవసరమైన మౌ లిక వసతులు, ఉపాధ్యాయులను నియమిస్తాం. సాక్షి: జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉందా.. సర్దుబాటు చేపడుతున్నారా..? డీఈవో: మెగా డీఎస్సీ ద్వారా జిల్లావ్యాప్తంగా 236 పోస్టులు భర్తీ అయ్యాయి. జిల్లాలో మొత్తం 3067 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు ఉండగా, 2,667 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్దుబాటు చేపడతాం. ఈమేరకు వివరాలు పంపించాలని ఎంఈవోలను ఆదేశించాం. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ప్రక్రియ ఉంటుంది. సర్ప్లేస్ ఉన్నచోట ఉపాధ్యాయులను అదే మండలంలో సర్దుబాటు చేస్తాం. సాక్షి: తల్లిదండ్రులకు మీరిచ్చే భరోసా ఏమిటి..? డీఈవో: ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్కు దీటుగా నాణ్యమైన బోధన అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రభుత్వ బడుల్లో చేర్పించి వారి భవిష్యత్తును మెరుగుపర్చాలి. అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తాం.సాక్షి: గతేడాది యూనిఫాం, పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? డీఈవో: పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో 62,282 మంది విద్యార్థులున్నారు. మొదటగా ఒక జత ఇస్తాం. 45 శాతం కుట్టు పని పూర్తయ్యింది. జిల్లాకు 4లక్షల 83వేల 110 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4లక్షల 65వేల 221 వచ్చాయి. 3లక్షల 72వేల 200 పుస్తకాలను ఎంఈవో కార్యాలయాలకు పంపించాం. మండల విద్యాధికారులు 2లక్షల 79వేల 150 పుస్తకాలను ఆయా పాఠశాలలకు సరఫరా చేశారు. -
వండుకుంటున్నారా.. అమ్ముకుంటున్నారా?
● రేషన్ లబ్ధిదారులను అడిగిన సివిల్ సప్లై ఓఎస్డీ శ్రీధర్రెడ్డి ● సన్నబియ్యం వినియోగంపై ఆరా ● చౌక ధరల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు కై లాస్నగర్: మూడు నెలల రేషన్ కోటాను కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై సివిల్ సప్లై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ విభాగం ఓఎస్డీ శ్రీధర్రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంతో పాటు జైనథ్ మండలంలోని పలురేషన్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి సన్నబియ్యం నాణ్యత, వినియోగంపై ఆరా తీశారు. తూకంలో ఏమైనా తేడాలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. బియ్యంను వండుకుంటున్నారా.. లేదా అమ్ముకుంటున్నారా అనే దానిపై పలువురు కార్డుదారులను ప్రశ్నించారు. అయితే తామంతా నిరుపేదలమేనని సన్నబియ్యం బాగున్నాయని వాటిని వండుకుని తింటున్నామని చెప్పారు. అనంతరం నాణ్యత పరిశీలన కోసం బియ్యం శాంపిల్స్ సేకరించారు. కాగా, తమ వద్ద మిగిలిన దొడ్డుబియ్యం కారణంగా సన్నబియ్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని డీలర్లు ఆయన దృష్టికి తెచ్చారు. ఒకే కార్డుదారు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి రావడంతో పంపిణీలో ఆలస్యం అవుతుందని వివరించారు. ఆయన వెంట డీఎస్వో వాజీద్ అలీ, డీఎం సుధారాణీ, డీటీ రాథోడ్ బాబుసింగ్ తదితరులున్నారు. -
కుష్ఠురహిత సమాజమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: కుష్ఠు రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. కుష్ఠు కే సుల నమోదులో భాగంగా నిక్షిత్–2 పాయింట్ జీరోపై డేటాఎంట్రి అపరేటర్లకు బుధవా రం డీఎంహెచ్వో కార్యాలయంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు ప్రొజెక్టర్ ద్వారా డెటా ఎంట్రీ నమోదును వివరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ, 2027 నాటికి కుష్ఠురహిత దేశం లక్ష్యంగా ప్ర భుత్వాలు ప్రణాళికలు రూపొందించాయన్నా రు. వైద్య సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో ఈ అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే ఎన్సీడీసీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అదే తరహాలో కుష్ఠు కేసులను గుర్తించి వాటిని నిక్షిత్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. స్పర్శ లేని మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం వామన్రావు తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియం.. రైతుకు సాయం
● వినియోగిస్తే లాభాలెన్నో.. ● జిల్లాలో అందుబాటులో ఎరువు ● అన్నదాతకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ ఆదిలాబాద్అర్బన్: అన్నదాతలను అప్పుల ఊబి లోకి లాగుతున్న వాటిలో రసాయన ఎరువులు ప్రధానమైనవి. మోతాదుకు మించి వాడడం, భూసారం తగ్గిపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా చేసిన అప్పులు తీరక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యవసాయ శాఖ సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పి స్తున్నా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 5.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొంత మంది రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తగా, మరికొంత మంది సాగుకు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ సారైన రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియంపై దృష్టి సారిస్తారా.. లేదా అనేది చూడాలి. సేంద్రియ సాగుతో లాభాలెన్నో.. సేంద్రియ ఎరువుల వాడకం వలన పంటలను చీడపీడల బెడద నుంచి తప్పిండంతో పాటు మంచి దిగుబడులు సాధించవచ్చు. పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఆరుతడి, కూరగాయల సాగు కు ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా తయారవడంతో భూసారం సైతం పెరుగుతుంది. పశువుల పేడ, వానపాములు, ఆకులు, తడి, పొడి చెత్త, ఇ తర వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చనివ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అయితే రైతులకు అవసరమైనప్పుడల్లా రసాయన ఎరువులు అందుబాటులో ఉండడంతో సేంద్రియంపై శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. ఈ సారైనా రసాయన ఎరువులు తగ్గేనా.? జిల్లాలో ప్రస్తుతం మార్కెట్ నిండా రసాయన ఎ రువులున్నాయి. వ్యవసాయశాఖ సైతం ఎరువులను మండలాలు, గ్రామాల వారీగా సరఫరా చేసి రైతులకు అందుబాటులో ఉంచింది. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా అన్నదాతలు వాటికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో పాటు పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారు. పర్యావరణంపైనా ప్రభావం చూపుతుంది. వీటిని అధిగమించాలంటే సేంద్రియ ఎరువుల వినియోగం ఒక్కటే మా ర్గమని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఇప్పటికే అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఎరువులు ఎరువు రకం అందుబాటులో ఉన్నది (మెట్రిక్ టన్నుల్లో) యూరియా 25,374 డీఏపీ 4,843 ఎంవోపి 1,047 ఎస్ఎస్పీ 1,786 కాంప్లెక్స్ ఎరువులు 23,665 సేంద్రియ ఎరువు 800 అవగాహన కల్పిస్తున్నాం. సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రసాయన ఎరువులు అధికంగా వాడితే భూసారం తగ్గి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే సేంద్రియ ఎరువు వాడితే భూసారం పెరగడంతో పాటు మంచి దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. రైతులతో ఏర్పాటు చేసిన ఆయా కమిటీల ద్వారా గ్రామాలో అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
● సీ్త్రనిధి రుణం.. అక్రమాలమయం ● సభ్యుల ఖాతాల్లో జమకాని నగదు ● చేతివాటం ప్రదర్శిస్తున్న వీవోఏలు ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ ● రికవరీపైనా పట్టింపు కరువు
కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీ్త్రనిధి రుణాలు అందజేస్తోంది. చిరు వ్యాపారాలతో స్వ యం ఉపాధి సాధించాలనే ఉద్దేశంతో రుణాలను మంజూరు చేస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకొ ని రాణించాల్సిన మహిళలకు క్షేత్రస్థాయిలోని సి బ్బంది ద్వారా అవరోధం కలుగుతుంది. సభ్యులు చెల్లించిన నెలవారీ కిస్తీల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సిన వీవోవోలు పక్కదారి ప ట్టిస్తున్నారు. తమ సొంత ఖాతాలకు మళ్లించుకొని సంఘ సభ్యులకు బురిడీ కొట్టిస్తున్నారు. ఆలస్యంగా ఈవ్యవహారం వెలుగు చూస్తుండంతో చేసేదేమి లేక నష్టపోవాల్సిన పరిస్థితి. జిల్లాలో ఇలా రూ. కోట్లలో అక్రమాలు చోటుచేసుకోవడం ఉన్నతాధికా రుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఏటా ఇదే తంతు.. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో అర్హత సాధించిన సంఘాలకు ప్రభుత్వం సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తుంది. రూ.30వేల నుంచి రూ.2లక్షల వరకు అందజేస్తూ వారు స్వయం ఉపాధితో రాణించేలా ప్రోత్సహిస్తోంది. జిల్లాలో ఏటా రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల రుణాలను సభ్యులకు అందజేస్తుంది. అయితే కొన్ని సంఘాలు వాటి ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధిస్తుండగా, మరికొన్ని సంఘాల్లో మాత్రం అక్రమాలు చో టు చేసుకుంటున్నాయి. రుణాలు పొందిన సభ్యులు ప్రతి నెలా కిస్తీలు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ వాటిని బ్యాంకుల్లో జమ చేయాల్సిన వీవోఏలు పక్కదారి పట్టిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిధులను తమ సొంత ఖాతా ల్లోకి మళ్లించుకుంటున్నారు. కొందరు అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. మరికొంత మంది ఇతర వ్యా పారాలు చేస్తున్నారు. దీంతో మహిళా సంఘాలు ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. బాధ్యులపై చర్యలేవి..? గ్రామంలోని స్వయం సహాయక సంఘాలకు మంజూరైన నిధులు, చెల్లించాల్సిన కిస్తులు, రికవరీని పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత సీసీలపై ఉంటుంది. అయితే వీవోఏలు దుర్వినియోగం చేసి న నిధులు ఇప్పటివరకు సంబంధిత మహిళా సంఘాల ఖాతాల్లో జమ కావడం లేదు. ఇందుకు బా ధ్యులైన సీసీలపై చర్యలు తీసుకోవాల్సిన డీఆర్డీఏ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం అనుమానా లకు తావిస్తోంది. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాల్సిందిపోయి ‘మామూలు’గా వ్యవహరించడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు సీ్త్రనిధి రుణాల మంజూరు, రికవరీ, లక్ష్యసాధనను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రీజినల్ మేనేజర్ను నియమించింది. వాటిపై నిరంతరం పర్యవేక్షిస్తూ సంఘాలకు అండగా నిలవాల్సిన సదరు అధికారి ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. అదనపు ఆర్ఎం ఉన్నప్పటికీ సదరు అధికారిదీ అదే పరిస్థితి. సంఘాలపై పర్యవేక్షణ కొరవడడంతో ఇలా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు న్నాయి. ఈ క్రమంలోనే వీవోఏలు, సీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సద రు అధికారి తీరుపై సంఘాల సభ్యులే కాదు సాక్షాత్తు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సైతం ఆగ్రహంగా ఉన్నట్లు ఆ శాఖ ఉద్యోగులే బాహటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పేరిట విధులకు గైర్హాజరయ్యే సదరు అధికారి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అసలు కనిపించరని ఆ శాఖ అధికారే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ విషయమై సీ్త్రనిధి జిల్లా మేనేజర్ను పలుమార్లు ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఫోన్ కట్ చేయడం గమనార్హం. డీఆర్డీవోను సంప్రదించగా అదనపు డీ ఆర్డీవోను సంప్రదించాలని పేర్కొనడం వారి మధ్య విబేధాలకు అద్దం పడుతుంది. రికవరీపై ప్రత్యేక దృష్టి జిల్లాలో సీ్త్ర నిధి రుణ చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై దృష్టి సారించాం. సోషల్ ఆడిట్ సీఆర్పీల నుంచి మండలాల వారీగా ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటున్నాం. వాటి ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి సంఘాల సభ్యులతో విచారణ చేస్తున్నాం. అక్రమాలకు బాధ్యులైన వారు స్వాహా చేసిన మొత్తాన్ని చెల్లించాలని సూచిస్తున్నాం. నిర్ణీత గడువు విధిస్తున్నాం. సకాలంలో చెల్లించకుంటే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్తాం. ఎవరినీ ఉపేక్షించబోం. – జాదవ్ గోవింద్రావు, అదనపు డీఆర్డీఓ -
పేదలకు అండగా ప్రభుత్వం
● కలెక్టర్ రాజర్షి షాబజార్హత్నూర్: ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రతీ పేదవాడికి సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తుందని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దత్తత గ్రామమైన మండలంలోని పిప్రి గ్రామంలో బుధవారం 17 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఈటీఐ (గ్రామీణ అభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ)ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన 35 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. అక్కడి నుండి టెంబి, అనంతపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రైతులు భూభారతి చట్టం ద్వారా భూసమస్యలను పరి ష్కరించుకోవాలని సూచించారు. అనంతపూర్ గ్రామస్తులు అంగన్వాడీ భవనం, పంచాయతీ కార్యాలయ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మోహన్సింగ్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, పరిశ్రమల శాఖ డీఎం పద్మభూషణ్, ఉత్తం కుమార్, ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ మహ్మద్ గౌస్, హీరాలాల్, విద్యాసాగర్, నూర్సింగ్ పాల్గొన్నారు. -
‘ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే కుట్ర’
కైలాస్నగర్: ఆదివాసీలను అడవుల నుంచి దూ రం చేసేందుకు కేంద్రం కుట్రలుచేస్తుందని మాజీ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను ఆయన మర్యాదపూర్వకంగా కలి శారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 49తో ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూడాల ని వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయ భూ ములను సాగు చేయనీయకుండా, టైగర్ జోన్లు, కంజర్వేషన్, రిజర్వ్డ్, అటవీప్రాంతాల పేరిట సి ర్పూర్, కాగజ్నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో దాదాపు 250 గ్రామాల్లోని ఆదివాసీలను అడవులనుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విషయాన్ని సీఎం దృష్టికి తీ సుకువెళ్లి ఆదివాసీలకు న్యాయం జరిగేలా చూ స్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సోయం పేర్కొన్నారు. -
భూభారతితో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషానేరడిగొండ: భూభారతితో భూ సమస్యలు త ర్వితగతిన పరిష్కారమవుతాయని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. మండలంలోని అరెపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ప్రతీ ఒక్కరికి తమ భూమిపై హక్కు చట్టబద్ధంగా, స్పష్టంగా ఉండేలా భూ భారతి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్థానికుల నుంచి వచ్చిన దరఖాస్తుల ను పరిశీలించారు. ప్రజలు భూరికార్డులపై పూర్తి సమాచారం కలిగి ఉండటం ద్వారా భవిష్యత్తులో సమస్యలకు తావు లేకుండా ఉంటుందని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, స్థానిక అధికారులు, సిబ్బంది ఉన్నారు. అడేగామ(కే)లో.. ఇచ్చోడ: మండలంలోని అడేగామ(కే)లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ రాజర్షి షా హాజరై పలు రికార్డులను పరిశీలించారు. అలాగే గ్రామస్తులతో మాట్లాడారు. భూభారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేలా కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణరావు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి కైలాస్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అమ్మ ఆదర్శ కమిటీలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బడిబాట నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ..జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్షెడ్స్ శుభ్రపర్చాలన్నా రు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఈవో శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో రాథో డ్ రవీందర్, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
వానొస్తే.. తిప్పలే!
పాలకుల నిర్లక్ష్యం గిరిపుత్రులకు శాపంగా మారుతోంది. ఏటా వర్షాకాలంలో మారుమూల గ్రామాలకు వెళ్లే మార్గంలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. మండలంలోని మామిడిగూడ (ఏ) గ్రామం నుంచి మామిడిగూడ(బి), మా మిడిగూడ(జి) గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న వడగాం వాగు చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతుంది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజ లు వాగుదాటేందుకు ఇబ్బందులకు గురవుతున్నా రు. పలువురు అందులో కొట్టుకుపోయిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. వడగాం బ్రిడ్జి నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు 2023లో రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రస్తుత ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తుండడంతో కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టడం లేదని తెలుస్తోంది. అలాగే గౌరాపూర్ పంచాయతీ పరిధిలో గల వాగు సైతం చిన్నపాటి వర్షానికి పొంగుతుంది. ఈ క్రమంలో చిట్టబట్ట, చిట్ట బట్టగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచి స్థానికుల కు తిప్పలు తప్పట్లేదు. ఇప్పటికై నా పాలకులు స్పందించి వానాకాలం ఇక్కట్లు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – ఇంద్రవెల్లిబరంపూర్లో..దేవాపూర్లోని లోలెవల్ వంతెన ఉప్పొంగే కాలం.. ప్రమాదాలకు మూలంఏటా వర్షాకాలంలో భారీ వర్షాలకు లోలెవల్ వంతెనలు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చడం లేదు. చిన్నపాటి వర్షాని కే వరద ప్రవాహం పెరిగి వంతెనలు మునుగుతున్నాయి. దాటడానికి వీలు లేకుండా మారుతున్నాయి. ఆదిలాబాద్లోని టైలర్స్ కాలనీ, తలమడుగు మండలం బరంపూర్, దేవాపూర్ లోలెవల్ వంతెనలే ఇందుకు నిదర్శనం. వాటికి సైడ్వాల్స్ సైతం లేకపోవడం ప్రమా దకర పరిస్థితికి అద్దం పడుతోంది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
● ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సేవలు ● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్:జిల్లాలో హోంగార్డుల కోసం ఆరో గ్య భద్రత పథకం ప్రారంభించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీసు కా ర్యాలయంలో పలువురికి మంగళవారం ఆరోగ్య భద్రతకార్డులు అందజేశారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 240 మంది హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సే వలతో పాటు ఇతర వైద్యసేవలపై రాయితీ లభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, సీసీ కొండ రాజు, హోంగార్డు ఆర్ఐ ఎన్.చంద్రశేఖర్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సాంకేతికత వినియోగించుకోవాలి సైబర్నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన 15 రోజుల సైబర్ శిక్షణలో జిల్లా పోలీసులు పాల్గొ ని ప్రతిభ కనబరిచారు. రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ పి. గోపీకృష్ణ, సైబర్ ల్యాబ్ కానిస్టేబుళ్లు ఎంఏ రియా జ్, జి.త్రిశూల్లు పలు అంశాల్లో ప్రతిభ కనబరిచి తొలి మూడుస్థానాల్లో నిలిచారని పేర్కొన్నారు. వారి ని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హోంగార్డులకు అందజేసిన ఆరోగ్య భద్రత కార్డులతో ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్సింగ్ కమశిక్షణతోనే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు క్రమశిక్షణతోనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాల్లో నెల రోజుల పాటు నిర్వహించిన వేసవి శిబిరాలు మంగళవారంతో ముగిశాయి. ఆదిలాబాద్ పోలీ సు హెడ్క్వార్టర్స్, నార్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ శిబిరాల్లో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమాన్ని పోలీసు హెడ్క్వార్టర్స్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ హాజరై మాట్లాడారు. చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని విద్యార్థులకు సూ చించారు.అనంతరం విద్యార్థుల నృత్య, యోగా, కరాటే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రిజర్వ్ సిబ్బంది, ప్రైవేట్ ఉపాధ్యాయులు, యో గా, కరాటే, గేమ్స్ టీచర్లను ఎస్పీ అభినందించా రు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్రెడ్డి, సీఐ సీహెచ్.కరుణాకర్రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి తదితరులు పాల్గొన్నారు. -
● వడ్డీ వ్యాపారుల ఆగడాలు ● అసలు కంటే కొసరే ఎక్కువ ● రుణగ్రహీతల నుంచి స్థిరాస్తులు కై వసం ● జిల్లాలో ఇప్పటికే 50కి పైగా కేసులు ● పోలీసుల దాడులతోనైనా బ్రేక్ పడేనా..?
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడటం లేదు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇటీవల వడ్డీ వ్యాపారుల ఇళ్లలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా సుమారు 50 కేసుల వరకు నమోదయ్యాయి. అయినప్పటికీ వ్యాపారుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్టుగా.. అప్పుపై వడ్డీ వసూలుతో పీల్చి పిప్పి చేయడమే కాకుండా రుణగ్రహితకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. పోలీసుల దాడుల్లో విలువైన ప్రామిసరీ నోట్లు, చెక్కులు, ఆస్తుల పత్రాలు వంటివి బయటపడిన విషయం విదితమే. దీన్ని పూర్తిస్థాయిలో అరికట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైతులకు వల.. ప్రస్తుతం వానకాలం సీజన్ పంటసాగు మొదలు కానుంది. ఈ సమయంలో రైతులకు బ్యాంకు అప్పు పుట్టని పరిస్థితిలో ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయిస్తారు. ప్రధానంగా వ్యాపారులు మార్కెట్లో కాటన్ కమీషన్ ఏజెంట్ల ద్వారా రైతులకు అప్పు ఇస్తుంటారు. పంట కాలం తర్వాత తిరిగి చెల్లించడం జరుగుతుంది. దీనికి గాను 18 నుంచి 24 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంటారు. ఓ వడ్డీ వ్యాపారి ఈ సీజన్లో ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా కాటన్ కమీషన్ ఏజెంట్లకు అప్పు ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ ఏజెంట్లు రైతులకు అప్పు ఇచ్చి పంట విక్రయ సమయంలో అధిక వడ్డీ వసూలు చేస్తుంటారు. అలాగే ఏజెంట్ సూచించిన వ్యాపారికే పంట విక్రయించడం వంటివి జిల్లాలో ఏటా జరుగుతున్న సంఘటనలే. ప్రధానంగా కాటన్ కమీషన్ ఏజెంట్ నుంచి అప్పు తీసుకున్న రైతు అతని వలలో చిక్కుతాడు. పంట దిగుబడి చేతికొచ్చిన తర్వాత వాటిని విక్రయించడంలోనూ కమీషన్ ఏజెంట్దే పైచెయ్యి అవుతుంది. మద్దతు ధర కంటే తక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఏజెంట్లు భారీగా ఆర్జిస్తుంటారు. ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతుకు మాత్రం ఏమి మిగలడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘అతను ఆదిలాబాద్లో ఓ పెట్రోల్బంక్ యజమాని.. హైదరాబాద్లో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఓ పేరుమోసిన వడ్డీ వ్యాపారి నుంచి రూ.లక్షల్లో అప్పు తీసుకున్నాడు. అయితే సదరు వ్యక్తి ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలో వడ్డీ వ్యాపారి అసలుకు వడ్డీ కలిపి ఈ అప్పును రూ. కోటికి చేర్చాడు. ఆ డబ్బులు కట్టాలని వారిపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆదిలాబాద్లో తమకు ఉన్న విలువైన ఇంటిని అమ్మి అతడి అప్పు తీర్చాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ వడ్డీ వ్యాపారికి ఆ విలువైన ఇంటిపై కన్ను పడింది. అప్పుకంటే రెండింతలు మార్కెట్లో అధిక రేటు పలికే ఆ ఆస్తిని తనకు తక్కువ ధరకే విక్రయించాలని ప్రస్తుతం ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ అంశం తాజాగా ఆదిలాబాద్లో చర్చనీయాంశంగా మారింది. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు ఈ ఘటన ఓ నిదర్శనం. అధిక వడ్డీ తీసుకుంటే కఠిన చర్యలు వడ్డీ వ్యాపారులు నిబంధనలను అతిక్రమించి వ్యాపారం చేయవద్దు. కొంత మంది పేదల భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని అధిక వడ్డీలకు ఇస్తున్నారు. ఈ క్రమంలో రుణం కట్టకపోవడంతో వారి భూములను లాక్కుంటున్నట్లు దృష్టికి వస్తుంది. బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలి. అధిక వడ్డీ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
రైతుకు ‘గుర్తింపు’
● అన్నదాతకూ ఐడీ నంబర్ ● సాగు డిజిటలైజేషన్పై కేంద్రం దృష్టి ● సంక్షేమ లబ్ధి నేరుగా రైతుకే చేరేలా చర్యలు ● జిల్లాలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదిలాబాద్అర్బన్: కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ పథ కం నేరుగా రైతులకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫార్మర్ రిజి స్ట్రేష న్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మనిషికి ఆధార్ మాదిరిగానే ప్రతీ రైతుకు 11అంకెల విశిష్టసంఖ్య ఉండాలని నిర్ణయించింది. వ్యవసాయరంగా న్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం. అయితే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుంటే ఎలాంటి చట్టబద్ద హక్కు కల్పించినట్లు కాదని, కే వలం రైతు గుర్తింపు కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లుగా ప్రభుత్వం పేర్కొంటుంది. ఫార్మర్ ఐడీ కి, రాష్ట్రం అమలుచేస్తున్న రైతు పథకాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ఇలా.. జిల్లాలో రైతు వివరాల నమోదు ప్రక్రియను రెవె న్యూ, వ్యవసాయ అధికారులు చేపడుతున్నారు. మండల పరిధిలోని ప్రతీగ్రామంలో రోజువారీగా రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 2025 జనవరి వరకు రెవెన్యూ శాఖ వద్ద అందుబాటులో ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రమాణికంగా తీసుకొని వారికి నంబర్లు కేటాయిస్తున్నా రు. రైతుల నుంచి ఆధార్కార్డు, పట్టదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేస్తూ ఫార్మర్ ఐడీ కేటాయిస్తున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ గత నెల 4నప్రారంభంకాగా ఇంకాకొనసాగుతుంది. ఇప్ప టి వరకు సగం మంది కూడా నమోదు చేసుకో లేదు.అయితే ఈప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర పథకాలకు వర్తింపు.. రైతులకు కేటాయించే ఐడీ నంబర్ ఇక నుంచి కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ పథకానికి తప్పనిసరి కా నుంది. రానున్న రోజుల్లో కేంద్ర పథకాలకు ఈ నంబర్ను అనుసంధానం చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సహజ వ్యవసాయం, ఫసల్ బీమా యోజన వంటి తదితర పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ నంబర్ ప్రమాణికంగా తీసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో సంబంధం లేకుండా కేవలం కేంద్ర పథకాల కోసమే ఈ నంబర్ కేటాయిస్తోంది. ఈనెలాఖరులో విడుదల చేయనున్న పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే రైతులకు ఈ నంబర్ తప్పనిసరి అని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలో మొత్తం రైతులు : 1,42,462 రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు : 41,530 ఇంకా చేసుకోవాల్సిన వారు: 1,00,932కొనసాగుతున్న నమోదు ప్రక్రియ ఫార్మర్ ఐడీ నంబర్ను కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రమాణికంగా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మా న్ పథకానికి ఈ నంబర్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. జిల్లాలో ఇప్ప టి వరకు వివరాలు నమోదు చేసుకోని వారు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి ఫార్మర్ ఐడీ పొందవచ్చు. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
స్కూటీని ఢీకొట్టిన లారీ
● ముగ్గురికి గాయాలుసారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం డ్యాంగాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో కల్వర్టు వద్ద మంగళవారం స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గుగ్లోత్ శశికాంత్, ఆయన తండ్రి పాల్సీరాం, తల్లి శవంతాబాయి గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుగ్లోత్ శశికాంత్ తన స్కూటీపై తల్లిదండ్రులను ఎక్కించుకుని ఆదిలాబాద్ వైపు వెళ్తున్నాడు. ఇదేసమయంలో ఎదురుగా నిర్మల్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ తిరుపతి లారీని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు ఎగిరి కిందపడ్డారు. తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్ తిరుపతిపై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఆదిలాబాద్రూరల్: గత నెల 29న మావల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కుడ్మేత దత్తు (23) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సీఐ కర్రె స్వామి తెలిపిన ప్రకారం వివరాలు.. మావల మండలంలోని వాఘపూర్ గ్రామానికి చెందిన దత్తు ఆటో ట్రాలీతో భోరజ్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మావల శివారులో రోడ్డుకు పక్కన వాహనాన్ని నిలిపి ఆటోపై ఉన్న పరద సరి చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు అతడిని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దత్తుకు తీవ్ర గాయాలవగా వెంటనే స్థానికులు రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు అదే రోజు హైదరాబాద్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను కుటుంబసభ్యులు సోమవారం మళ్లీ రిమ్స్కు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతి చెందినట్లు సీఐ తెలిపారు. -
పసుపు సాగుకు సమయమిదే..
● జిల్లాలో పెరుగుతున్న సాగువిస్తీర్ణం.. ● కొత్త విధానంతో అధిక దిగుబడి మామడ:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పొరుగున్న ఉన్న నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, పసుపునకు మద్దతు ధర లభిస్తుండడంతో ఈ ఏడాది కూడా పసుపు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తన పసుపు తెచ్చుకుని విత్తేందుకు సిద్ధం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో గత సంవత్సరం 5,542 ఎకరాల్లో పసుపు సాగు చేయగా, ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల విస్తరణ, వర్షాలతో రైతులు పసుపు సాగుకు సిద్ధమవుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని అధికారులు సూచిస్తున్నారు. అనుకూల నేల పసుపు సాగుకు నీరు నిల్వ ఉండని నల్లరేగడి, ఎర్ర చెల్క, ఇసుక నల్లని నేలలు, ఉదజని సూచిక (పీహెచ్) 6 నుంచి 7.5 వరకు, సేంద్రియ పదార్థాలు అధికంగా ఉన్న భూములు అనుకూలం. క్షార గుణం, రాళ్లు ఉన్న నేలలు పసుపు పంటకు సరిపడవు. భూసార పరీక్షల ద్వారా నేల స్వభావాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. విత్తన ఎంపికలో జాగ్రత్తలు పసుపు సాగులో విత్తన ఎంపిక కీలకం. ప్రతీ మూడేళ్లకు విత్తన మార్పిడి చేయడం వల్ల తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. జిల్లాలో దీర్ఘకాలిక రకాలైన దుగ్గిరాల ఎరుపు, ఆర్మూర్, సేలం రకాలను రైతులు సాగు చేస్తున్నారు. తల్లి (మండ) దుంపలు విత్తనాలుగా వాడితే పిల్ల (కొమ్ము) దుంపల కంటే అధిక దిగుబడి లభిస్తుంది. ఎకరానికి తల్లి దుంపలు 8 క్వింటాళ్లు, పిల్ల దుంపలు 5 క్వింటాళ్లు అవసరం. విత్తనాలను కనీసం రెండు కణుపులతో కత్తిరించి వాడితే విత్తనం ఆదా అవుతుంది. పంట మార్పిడి పాటించడం ద్వారా మినుము, పెసర, సోయా, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయడం లాభదాయకం. విత్తన శుద్ధి పద్ధతులు పసుపు విత్తనాలను నాటే ముందు లీటరు నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజడ్, 2 ఎంఎల్ డైమి థోయేట్ కలిపి ద్రావణం తయారు చేసి, 45 నిమి షాలు విత్తన కొమ్ములను నానబెట్టి శుద్ధి చేయాలి. అనంతరం ట్రైకోడెర్మా విరిడే శిలీంద్ర నాశినితో శుద్ధి చేసి నాటాలి. నాటడానికి 2–4 వారాల ముందు 1 కిలో ట్రైకో ప్రైమ్ పొడిని 10 లీటర్ల నీటిలో కలిపి 25 కిలోల విత్తనాలను శుద్ధి చేయాలి. దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, పశువుల పేడ వాడాలి. 40 రోజుల తర్వాత 200 కిలోల వేపపిండి, 50 కిలోల యూరియా, 80 రోజుల తర్వాత 50 కిలోల యూ రియా, 25 కిలోల పొటాష్, నాలుగు నెలల తర్వాత 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ వాడి మెళుకువలు పాటిస్తే మంచి దిగుబడి సాధ్యం. మల్చింగ్ పద్ధతితో.. బెడ్, మల్చింగ్ పద్ధతులతో పసుపు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బెడ్ కొలతలు 110 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. ఎత్తు, 30 సెం.మీ. దూరంతో ఉండాలి. ఈ పద్ధతి ద్వారా దుంపకుళ్లు తగ్గి, 20% అధిక దిగుబడి లభిస్తుంది. ఎకరానికి 35 వేల పసుపు మొక్కలు వచ్చేలా చూసుకోవాలి. పొడవైన మడులు తయారు చేసి, 30 ఎంఎం ప్లాస్టిక్ కవర్తో కప్పాలి. బిందు సేద్యం ద్వారా నీరు, పోషకాలు అందించాలి. మల్చింగ్ వల్ల కలుపు మొక్కలు తగ్గి, రసాయనాల వాడకం, కూలీల ఖర్చు తగ్గుతుంది. బెడ్ పద్ధతిలో సాగు చేస్తున్నా.. నేను ఐదెకరాల్లో పసుపు పంటను సాగు చేస్తున్నాను. పసుపు విత్తనం నాటే ముందు విత్తన శు ద్ధి చేయడం ద్వారా దు ంపకుళ్లు వంటి తెగులు రాకుండా ఉంటుంది. పసుపు బెడ్ పద్ధతి లో సాగు చేయడం ద్వారా దిగుబడి ఎక్కువగా వచ్చింది. – చిన్నారెడ్డి, రైతు, కొరటికల్ మల్చింగ్ పద్ధతిలో.. పసుపు సాగులో రైతులు జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువులు, సూక్ష్మపోషకాలు అందించడంలో మెలకువలు పాటించాలి. మల్చింగ్ పద్ధతిలో పసుపు పంటను సాగు చేయడం ద్వారా రైతులు కలుపు మొక్కలను సులభంగా నివారించవచ్చు. పెట్టుబడి ఆదా చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. – మౌనిక, ఉద్యానశాఖ అధికారి, నిర్మల్ డివిజన్ -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఆదిలాబాద్టౌన్: యోగాతో సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయూష్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని రిమ్స్లో ఎమ్మెల్యే ప్రారంభించి మా ట్లాడారు. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనన్నా రు. ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం కేటాయించాలని సూచించారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్, ఆయూష్ ప్రోగ్రాం అధికారి త్రిశూల్ తది తరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల నమోదు పెంచాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉట్నూర్రూరల్: వందశాతం గిరిజన విద్యార్థుల నమోదు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని డీడీలు, డీటీడీవో లు, ఏటీడీవో, పీఎంఆర్సీ సిబ్బందితో ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించి విద్యార్థులను బడిలో చేర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సదుపాయాలు, విద్యా బోధన తీరును వివరించాలన్నారు. ప్రతీ గిరిజన గ్రామానికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని, డివిజన్ల వారీగా ఏటీడీవో ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చే యాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రోజు వా రి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. యువకుడి దారుణ హత్యకాగజ్నగర్ రూరల్: మండలంలోని సీబాపు కాలనీ సమీపంలో మంగళవారం సాయంత్రం ఽకాగజ్నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్కు చెందిన సయ్యద్ దావుద్(18)దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారం లేదా గంజాయి మత్తులో ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? అనే కోణంలో స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకు న్న రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నా రు. ఈ విషయమై కాగజ్నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై సందీప్కుమార్ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. హత్యకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని శివాజీచౌక్లో ప్రమాదవశాత్తు రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. జిల్లా కేంద్రానికి చెందిన వి జయ్కేతన్ తన ఎలక్ట్రిక్ స్కూటీని శివా జీచౌక్లోని చించరవాడ హనుమాన్ ఆలయం ఎదు ట మంగళవారం పార్కింగ్ చేశాడు. ఆ సమయంలో షార్ట్సర్క్యూట్తో ఎలక్ట్రిక్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనున్న మరో యాక్టీవ బైక్కు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పి వేసేందుకు యత్నించగా, అప్పటికే రెండు వా హనాలు కాలిబూడిదయ్యాయి. వాహనాల య జమానులు అయోమయానికి గురయ్యారు. -
అంతర్జాతీయ సదస్సులో ఆర్జీయూకేటీ విద్యార్థులు
● హైదరాబాద్ ఐఐటీలో స్పిక్ మెకే పదో అంతర్జాతీయ సమ్మేళనం ● వారం రోజులపాటు సాంస్కృతిక ఉత్సవం బాసర: ఐఐటీ హైదరాబాద్లో స్పిక్ మెకే 10వ అంతర్జాతీయ సమ్మేళనం వారం రోజులపాటు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) నుంచి 35 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్థన్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ సాంస్కృతిక చైతన్యం, దేశీయ కళలపై గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. ఈ అవకాశం వారి వ్యక్తిత్వ వికాసానికి ఒక గొప్ప వేదికగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్లుగా సేవలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు సహాయం అందించడంలో ఆర్జీయూకేటీ విద్యార్థులు వాలంటీర్లుగా చురుగ్గా పాల్గొన్నారు. వారు తమ సేవల ద్వారా అందరి మన్ననలు పొందారు. అంతేకాకుండా, మీడియా విభాగంలో చేరి స్పిక్ మెకే సమ్మేళనంపై విస్తృతంగా ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించారు. కళల వర్క్షాప్లలో.. సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన వర్క్షాప్లలో విద్యార్థులు కథక్, కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం, గోండు పెయింటింగ్ వంటి సంప్రదాయ కళలను నేర్చుకున్నారు. ఈ వర్క్షాప్లు విద్యార్థులకు కళల పట్ల లోతైన అవగాహన, నైపుణ్యాన్ని అందించాయి. కళాకారులతో సమావేశం.. స్పిక్ మెకే సమ్మేళనం భారతీయ కళలను ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు, విద్యార్థులకు ప్రముఖ కళాకారులను కలిసే అవకాశాన్ని కల్పించింది. ఈ అనుభవాలు తమ జీవితంలో ఎంతో స్ఫూర్తినిస్తాయని, కళల పట్ల అభిరుచిని మరింత పెంపొందించాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వారు విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ, కార్యక్రమ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం ద్వారా వారు నేర్చుకున్న కళలు, పొందిన అనుభవాలు వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని ప్రొఫెసర్ గోవర్థన్ అభిప్రాయపడ్డారు. ఈ సమ్మేళనంలో ఆర్జీయూకేటీ నుంచి అధ్యాపకులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ రాకేశ్రెడ్డి, పూర్వ విద్యార్థులు శివ బాలాజీ, వంశీకృష్ణ, రచన, మణికంఠ పాల్గొన్నారు. -
హత్యకు దారితీసిన పాత పరిచయం
● సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి చోరీ, హత్య ● ఏడు నెలల తర్వాత వీడిన మిస్టరీ ● వివరాలు వెల్లడించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన మహిళ హత్య మిస్టరీని ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు స్థానిక రైల్వేస్టేషన్లో అరెస్టు చేశారు. మంగళవారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. లక్సెట్టిపేట మండలం జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన కూస లక్ష్మి(55) భర్తను వదిలి మంచిర్యాలలోని గణేష్నగర్లో ఒంటరిగా ఉంటూ కూరగాయలు, బియ్యం వ్యాపారం చేసేది. ఈ క్రమంలో కాలేజీరోడ్లో నివాసం ఉండే పెద్దపల్లి జిల్లా స్తంభంపల్లికి చెందిన మండలి నరేష్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత హైదరాబాద్లోని సుచిత్ర ప్రాంతంలో కుటుంబంతో నివాసం ఉంటూ బార్బర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. నరేష్ కుమారుడికి ఆరోగ్యం బాగాలేక అక్కడే ఆస్పత్రికి తీసుకెళ్లగా నర్సు అతినారపు అలివేలుతో పరిచయం పెంచుకుని సహజీవనం చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. సులువుగా డబ్బు సంపాదనకు దొంగతనం చేయాలని నరేష్ చెప్పగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అలివేలు సైతం అంగీకరించింది. మంచిర్యాలలోని లక్ష్మికి భర్త లేడని, డబ్బులు, బంగారం ఉన్నాయని, ఒంటరిగా ఉంటోందని చెప్పి చోరీకి పథకం వేశారు. గత ఏడాది నవంబర్ 26న మంచిర్యాలకు వచ్చి చోరీకి యత్నించి విఫలమయ్యారు. మరునాడు 27న సాయంత్రం 7గంటల ప్రాంతంలో లక్ష్మి ఇంటికి వచ్చిన నరేష్, అలివేలు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ దోచుకుని ఇంటికి తాళం వేసి పారిపోయారు. అదే నెల 30 ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడు నెలల తర్వాత చిక్కుముడి విప్పారు. నిందితుల నుంచి రెండు తులాల బంగారు నగలు, 20తులాల వెండి పట్టగొలుసులు, మూడుసెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు రికవరీ చేయాల్సి ఉందని డీసీపీ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిస్టరీని ఛేదించిన సీఐ ప్రమోద్రావు, సీసీఎస్ ఎస్సై మధుసూదన్రావు, ఎస్సైలు ప్రవీణ్కుమార్, తిరుపతి, కిరణ్కుమార్, సిబ్బంది మహేష్బాబు, రాము, సురేష్, జాఫర్, సతీష్లను సీపీ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ భాస్కర్ అభినందించడంతోపాటు రివార్డు అందజేశారు. -
‘పోడు’ భూములను లాక్కోవద్దు
ఇచ్చోడ: మండలంలోని కేశవపట్నం అటవీ పరిధిలో పోడు భూముల్లో ఏళ్లుగా సాగు చేస్తుకుంటున్న తమను అటవీ అధికారులు అడ్డుకో వడం సరికాదని పలువురు రైతులు పేర్కొన్నా రు. ఈమేరకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హ న్సరాజ్ గంగారాంకు మంగళవారం ఫ్యాక్స్ద్వారా వినతిపత్రం పంపినట్లు తెలిపారు. అ నంతరం వారు మాట్లాడారు. ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం మొక్కలు నాటుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానామామడ:నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన ఎర్రం సతీశ్ బైండోవర్ ఉల్లంగించినందుకు మంగళవారం రూ.40 వేల జరిమానా విధించినట్లు నిర్మల్ ఎక్సైజ్ సీఐ రంగస్వామి తెలిపారు. సతీశ్ గతంలో నల్ల బెల్లం, పటిక విక్రయిస్తూ పట్టుబడగా కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. బైండోవర్ ఉల్లంఘించి మళ్లీ నల్ల బెల్లం, పటిక విక్రయిస్తూ పట్టుబడటంతో కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట మంగళవారం హాజరు పర్చారు. తహసీల్దార్ శ్రీనివాస్రావు రూ.40 వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో నిర్మల్ ఎకై ్సజ్ ఎస్సై అభిషేకర్, సిబ్బంది ఇర్ఫాన్, వెంకటేశ్, హరీశ్ పాల్గొన్నారు. -
కాలువలో పడి వ్యక్తి మృతి
లక్ష్మణచాంద:నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే వడ్యాల్ గ్రామానికి చెందిన రావులబండి ముత్తన్న(51) మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని సరస్వతీ కాలువవైపు కాలకృత్యాల కోసం వెళ్లాడు. ఆకస్మాత్తుగా కాలువలోకి జారీపడిపోయాడు. అటువైపుగా వెళ్లిన స్థానికులు సరస్వతీ కాలువలో మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు. సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట మామడ ఎస్సై అశోక్, ఏఎస్సై నారాయణరెడ్డి ఉన్నారు. -
నీటిగుంతలో పడి బాలుడు మృతి
కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం హల్దా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ బాలుడు గుంతలో పడి మృతిచెందాడు. గ్రామానికి చెందిన షల్కె సాయినాథ్(09) బహిర్భూమికి వెళ్లాడు. తర్వాత చెరువులోని నీటిగుంత వద్దకు వెళ్లాడు. అదుపు తప్పి గుంతలో పడ్డాడు. మొరం కోసం తవ్విన గుంత కావడం, ఇటీవల కురిసిన వర్షాలకు గుంత నిండడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. తండ్రి అనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతితాండూర్: మండలంలోని రేపల్లెవాడ శివారు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. తాండూర్ ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి వైపు నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ భుక్య రాజేష్(37) అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కన కూర్చున్న రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సోమగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోటోవేటర్ కింద పడి యువకుడి మృతిభైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్(28) మంగళవారం ట్రాక్టర్ రోటవేటర్ కింద పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో భూమి చదును చేస్తుండగా ట్రాక్టర్పై ప్రవీణ్ కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపతప్పి కిందపడి రోటావేటర్లో చిక్కుకున్నాడు. గమనించిన డ్రైవర్ ట్రాక్టర్ను ఆపి చూసేసరికి మృతిచెందాడు. ప్రవీణ్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి కుటుంబీకులు ట్రాక్టర్ యజమాని న్యాయం చేయాలని, అప్పటి వరకు మృతదేహం తరలిచొద్దని పట్టుబట్టారు. ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ సంఘటన స్థలానికి చేరుకుని సముదాయించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. ‘నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం’కు శ్రీకారంకైలాస్నగర్: రైతులు విత్తన ఖర్చు తగ్గించుకో వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల యం, వ్యవసాయ శాఖ సంయుక్త అధ్వర్యంలో చేపట్టిన ‘నాణ్యమైన విత్తనం– రైతన్న కు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ అర్బన్, మావ ల, అదిలాబాద్ రూరల్, ఇంద్రవెల్లి మండలా లకు చెందిన పలువురు రైతులకు పెసర, కంది విత్తన సంచులను పంపిణీ చేశారు. అనంత రం మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో గ్రా మ స్థాయిలోనే విత్తన లభ్యత సాధించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించా రు. జిల్లాలోని 103 క్లస్టర్ల పరిధిలో ఎంపిక చే సిన రైతులకు 1,540 విత్తన కిట్లను మంగళవారం నుంచి ఆయా రైతు వేదికల్లో ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేయనున్నట్లు జిల్లానోడల్ అధికారి శ్రీధర్చౌహాన్ తెలిపారు. కలెక్టర్కు సన్మానం ఇటీవల ప్రధానమంత్రి అవార్డు అందుకున్న కలెక్టర్ రాజర్షిషాను షబ్బీర్ అలీ శాలువాతో సత్కరించారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆయన సేవలను ప్రశంసించారు. పలు కార్యాలయాల్లో ఆవిర్భావ వేడుకలు..కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజ ర్షిషా మువ్వన్నెల పతాకం ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించారు. పలువురు వి ద్యార్థులకు పెన్నులు, నోటుబుక్లు అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి జాతీయ పతాకం ఎగురవేశారు. అలాగే జిల్లా పరిషత్లో జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సీవీఎన్ రాజు, డీఆర్డీఏలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఆర్అండ్బీ కార్యాలయంలో ఈఈ నర్సయ్య జెండా ఆవిష్కరించారు. -
అమరుల త్యాగాలు చిరస్మరణీయం●
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పో లీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించి జవాబుదారితనం అలవర్చుకోవాలన్నారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, నాగేందర్, ఇన్స్పెక్టర్లు సునిల్కుమార్, కరుణాకర్రావు, వెంకటి, మురళి, శ్రీపాల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అభివృద్ధికి అండగా కేంద్రం
ఆదిలాబాద్: తెలంగా ణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సో మవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రం సాధిస్తే తమ బతుకులు మారుతాయనుకున్న ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, వేదవ్యాస్, లాలమున్నా, దయాకర్, జోగు రవి, రవి రెడ్డి, జ్యోతి, స్వప్న, సాయి, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్లాట్ బుకింగ్ షురూ
● జిల్లాలో తొలిరోజున 16 రిజిస్ట్రేషన్లు కై లాస్నగర్: ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. తొలిరోజున ఆదిలాబాద్లో 18 బుకింగ్లు కాగా 13 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేశారు. సమయం మించి పోవడంతో మరో ఐదింటిని మరుసటి రోజుకు వాయిదా వేశారు. కొత్త విధానంలో తొలి రిజిస్ట్రేషన్ చేసుకున్న గన్నేర రాములుకు సబ్ రిజిస్ట్రార్లు విజయ్కాంత్ రావు, శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు. బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు బుకింగ్లు కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు సబ్రిజిస్ట్రార్ సాయి వివేక్ తెలిపారు. -
అర్హులా.. కాదా
● ‘రేషన్’ ఎందుకు తీసుకోవట్లేదు? ● జిల్లాకు చేరిన అనుమానాస్పద కార్డుదారుల జాబితా ● అనర్హుల తొలగింపునకు కసరత్తు ● క్షేత్రస్థాయిలో మొదలైన విచారణ కై లాస్నగర్: రేషన్కార్డుదారులకు ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందజేస్తోంది. అయితే వీటిని తీసుకోవడానికి చాలా మంది కార్డుదారులు నెలల తరబడి ముందుకు రావడం లేదు. దీంతో వారికి విడుదల చేసిన కోటా బియ్యం డీలర్ల వద్ద మిగిలిపోతుంది. ఇలాంటి వాటిని అనుమానాస్పద కార్డులుగా గుర్తించిన ప్రభుత్వం వారి వివరాలతో కూడిన జాబితాను జిల్లాకు పంపించింది. దీంతో మండలాల వారీగా వివరాలు సిద్ధం చేసిన జిల్లా పౌరసరఫరాల అధికారులు కార్డుల వివరాలను తహసీల్దార్లకు అందజేశారు. దీంతో అసలు వారు అర్హులా.. కాదా తేల్చే దిశగా రెవెన్యూశాఖ ఫోకస్ పెంచింది. క్షేత్రస్థాయి విచారణ అనంతరం అర్హులు కాకుంటే ఆ కార్డుల తొలగింపునకు సిద్ధమవుతుంది. జిల్లాలో 3,319 కార్డులు .. జిల్లాలో 3,319 రేషన్కార్డుదారులు ఆరు నెలలుగా బియ్యం తీసుకోనట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ కార్డులకు సంబంధించి 5,675 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా బియ్యం కోటా విడుదల చేస్తున్నా తీసుకోవడం లేదు. దీంతో అసలు కార్డుదారులు బతికే ఉన్నారా.. లేక శాశ్వతంగా వలస వెళ్లారా.. వందేళ్లు పైబడిన, 18 ఏళ్లలోపు పిల్లల పేరిట కార్డులేమైనా ఉన్నాయా అనే దానిపై ఆరా తీయనున్నారు. ఈమేరకు తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణకు సిద్ధమవుతన్నారు. ఒకవేళ అనర్హులని తేలితే వెంటనే వాటిని రద్దు చేయనున్నారు. అలాగే మరణించిన వారి పేర్లుంటే కార్డు నుంచి తొలగించనున్నారు. సన్నబియ్యం పంపిణీ నుంచి ఇదీ పరిస్థితి.. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఓ వైపు కార్డుదారులు బియ్యం కోసం దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. మరోవైపు రెండు నెలల్లో జిల్లాలో వేలాది గా కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇక కొత్త కార్డు కోసం దరఖా స్తులు వెల్లువెత్తుతుంటే కార్డులున్న వారు బియ్యం పొందేందుకు ముందుకు రాకపోవడమేంటనే సందేహం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇత ర రాష్ట్రాలకు చెందిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారు కూడా కార్డులు పొందినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఇందులో అనర్హులు ఎంతమంది ఉన్నారో తేలనుందని అధికారులు వెల్లడిస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమయ్యాక పరిస్థితి ఇలా..ప్రభుత్వం జిల్లాకు పంపించిన అనుమానాస్పద రేషన్కార్డుల వివరాలు మండలం రేషన్కార్డులు యూనిట్లు ఆదిలాబాద్అర్బన్ 945 1804 ఆదిలాబాద్రూరల్ 345 503 బజార్హత్నూర్ 93 153 బేల 187 282 భీంపూర్ 105 187 భోరజ్ 110 149 బోథ్ 113 157 గాదిగూడ 168 364 గుడిహత్నూర్ 104 167 ఇచ్చోడ 112 182 ఇంద్రవెల్లి 114 171 జైనథ్ 119 184 మావల 139 269 నార్నూర్ 120 237 నేరడిగొండ 30 56 సాత్నాల 72 103 సిరికొండ 48 81 సొనాల 64 102 తలమడుగు 95 148 తాంసి 44 66 ఉట్నూర్ 192 310తహసీల్దార్లకు అందజేశాం ప్రభుత్వం నుంచి అందిన అనుమానస్పద కార్డుల వివరాలను మండలాల వారీగా సిద్ధం చేసి తహసీల్దార్లకు అందజేశాం. వారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనర్హులను తొలగిస్తారు. అలాగే సన్నబియ్యం తీసుకునేందుకు ముందుకు రాని వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. అనర్హులు రేషన్కార్డులను పొంది ఉంటే వాటిని స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలి. విచారణలో తేలితే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –వాజీద్అలీ, డీఎస్వో నెల మొత్తం కార్డులు బియ్యంతీసుకున్నవారు తీసుకోనివారు ఏప్రిల్ 1,91,755 1,73,339 18,416 మే 1,91,762 1,72,142 19,620 -
ఉత్తమ సేవలకు గుర్తింపు
● భూ భారతితో సమస్యలు పరిష్కారం ● ఈనెల 20 వరకు మూడో విడత రెవెన్యూ సదస్సులు ● త్వరలో గ్రామపాలన అధికారుల నియామకం ● ఉట్నూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ● జిల్లాకు నూతనంగా నాలుగు 108 వాహనాలు ● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ సాక్షి,ఆదిలాబాద్: తెలంగాణ రైజింగ్– 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం సమగ్ర సంక్షేమ అభివృద్ధి ల క్ష్యంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ స లహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగా ణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవా రం నిర్వహించిన వేడుకలను ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. మొదట తెలంగాణ చౌక్లోని అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయా రంగాల్లో జిల్లా ప్రగతిని వివరించారు. ● అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రైతులను రుణ విముక్తులను చేసినట్లు తెలిపారు. పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12వేలు ఆర్థికసాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం అందజేస్తున్నట్లు వివరించారు. ● ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3,500 చొ ప్పున నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చే స్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని చెంచుల కు 10వేల గృహాలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నా రు. గిరిజన భూములకు సాగునీరు, విద్యుత్ స దుపాయం కోసం ఇందిర సౌర గిరిజలవికా సం కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు. ● జిల్లాలోని 17 మండలాల్లో ఒక్కో ప్రభుత్వ పాఠశాలను గుర్తించి కృత్రిమ మేధ (ఏఐ) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా 302 మంది విద్యార్థులు ఏఐ విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొదటిసారిగా ఆ రోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఉట్నూర్ మండలంలోని పులిమడుగులో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు మంజూరు ఉత్తర్వులు జారీ అయినట్లు పేరొన్నారు. ● జిల్లాకు నూతనంగా నాలుగు 108 వాహనాలు మంజూరైనట్లు తెలిపారు. టీజీఎంఎస్ఐడీసీ ద్వారా రూ.34 కోట్లతో నర్సింగ్ కాలేజ్, హాస్టల్ భవన నిర్మాణ పనులు డిసెంబర్లోగా పూర్తి చే యనున్నట్లు పేర్కొన్నారు. ఉట్నూర్లోని 50 ప డకల ఆస్పత్రిని 100 పడకలకు ఉన్నతీకరించేందుకు రూ.13.5 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే బోథ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రూ.10.5 కోట్లతో 50 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఆగస్టులోగా పూర్తి చేసి ప్ర జలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. బ్యాంక్ లింకేజీ కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 101 స్వయం సహాయక సంఘాలకు రూ.8.39 కోట్లు, శ్రీనిధి కింద రూ.2 కోట్ల రుణా లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ● భూభారతి నూతన చట్టం అమలు ద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈనెల 20 వరకు ఆయా మండలాల్లో మూడో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలి పారు. అలాగే రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామపాలన అధికారులను నియమిస్తున్నాం. అలాగే ప్రతీ గ్రామానికి పోలీసు అధికారిని కేటాయించి విలేజ్ పోలీసు ఆఫీసర్ వ్యవస్థను పటిష్టం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆది లాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అటవీశాఖ అధి కారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జెండా వందనం చేస్తున్న షబ్బీర్ అలీ తదితరులు -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యల పరిష్కారాని కే ప్రజా ఫిర్యాదుల నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవా రం గ్రీవెన్స్డే నిర్వహించారు. ఆయా ప్రాంతా ల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధి తుల సమస్యలను పరిష్కరించి సత్వర న్యా యం చేసినప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ వారం 15 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఇందులో సీసీ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్టౌన్: పట్టణంలో కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముఠాను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమయత్ నగర్కు చెందిన జాదవ్ గంగాధర్, గణేశ్, దిగంబర్ జల్సాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో డమ్మీ తాళాలను ఉపయోగించి 8 బైక్లను అపహరించారు. వాటిని అమ్మేందుకు స్థానిక బంగల్పేట్ శివారుకు వెళ్లినట్లు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. -
సీవోఈ విద్యార్థుల ప్రభంజనం
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్–2025 పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ప్రకటించింది. ఇందులో కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా సీవోఈ విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు గత మే 18న నిర్వహించారు. 14 మంది పరీక్షకు హాజరుకాగా ఐదుగురు అత్యుత్తమ ర్యాంకులు, మరో నలుగురు ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. సదరు విద్యార్థులను ర్యాంకుల ప్రాతిపదికన మంగళవారం నుంచి కౌన్సిలింగ్కు పిలవనున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు షేక్ సుభాన్ 32,278, ఎస్.ఆదర్శ్ 3,285, కె.రంజిత్ 3,438, జి.చరణ్ 4,346, డి.రాజేందర్ 5,414 ర్యాంకులు సాధించి విజయ దుందుభి మోగించారు. కె.రామ్చరణ్ తేజ 296, సీ.హెచ్.సాయికుమార్ 311, ఎస్.వెంకటేశ్వర్ 1,952, బి.అంజిబాబు 4,790 ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్కుమార్, లెక్చరర్లు ప్రత్యేకంగా అభినందించారు. -
ఎస్ఆర్ విద్యార్థుల విజయకేతనం
ఐఐటీ అడ్వాన్స్డ్లో అల్ఫోర్స్కు ర్యాంకులుజేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ విజయభేరికొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సోమవారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్డ్–2025 ఫలితాల వివిధ కేటగిరీల జా తీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. అజ్మీరా పురుషోత్త్తంనాయక్ 166వ ర్యాంకు సాధించగా.. పి.ఎన్.సాయిధృవ 557, ఎన్.అనిరుధ్సాయి 657, బి.ఆదిత్య 945, బి.విష్ణు 1,203, ఎం.అక్షిత 1,224, వి.హృషికేశ్ 1,329, ఆర్.గోవర్ధన్ 1,506, జె.వామిక 1,604, బి.చైశ్రవ్ రాజు 1,640, ఇ. శశిలాల్ 1,899, కె.విరేంద్రప్రసాద్ 2,120, డి.కార్తీక్రెడి్డ్ 2,150, ఎస్.విఘ్నేశ్ 2,293, డి.అభిరామ్ 2,349, ఎ.శశిప్రితమ్ 2,463, ఇ.అంకిత్సాయి 2,613, మహ్మద్ అబ్ధుల్ హక్ 2,766, డి.విశాల్ 2,917 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. వెయ్యి లోపు నలుగురు, 2వేల లోపు 11 మంది, 3వేల లోపు 19 మంది వి ద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. కరీంనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎస్.పవన్ 204వ ర్యాంక్, ఎం.కార్తీక్ 1,009, బానోవత్ సుమన్ 1,049, బుర్ర మాధవ్ 1,471, నీరటి శ్రీచరణ్జోష్ 1,321, గుగులోతు శేఖర్ 1,328, ముదిగంటి రుషిశ్వర్రెడ్డి 2,318, దొనకొండ సాయిచందన 3,218, దయ్యాల రాజ్కుమార్ 6,519వ ర్యాంకు సాధించి విద్యాసంస్థల ప్రతిభను మరింత పెంచారని విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అహర్నిశల కృషి ఇంతటి ఘన విజయానికి తోడ్పడ్డాయని వివరించారు. అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ సంతోష్ రెడ్డి, డీజీఎం, సీఈవో, జోనల్ ఇన్చార్జిలు, అకాడమిక్ డీన్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. కరీంనగర్: జేఈఈ–అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 40వ ర్యాంకు, నిఖిత్నాయక్ 194, డి.మహేశ్ 225, రఘుపతి 226, బి.సిద్ధిక 1,107, సీహెచ్.ఐశ్వర్య 1,129, ఠాగూర్ 1,274, నవదీప్ 1,701, నిస్సీ జాస్పర్ 2,172, ఎ.అజయ్ 3,077, అక్షర 4,524 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రణాళిక, మెరుగైన విద్యా బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఉత్తమ ర్యాంకులు సాధించామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులు అవలంబించిడం జరుగుతుందని, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమ కాలేజీలో ఫీజు రాయితీ ఇస్తున్నామని వివరించారు. ఈఏడాది నుంచి ఐఐటీ–అడ్వాన్స్డ్ లాంగ్టర్మ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే నీట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ర్యాంకుల సాధన కేవలం ట్రినిటీ కళాశాలలకే సాధ్యమని, విద్యార్థుల కృషి, యాజమాన్యం భరోసా, అధ్యాపకుల శ్రద్ధ వల్లే ఈ ఫలితాలు అని తెలిపారు. క్యాంపస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
బాక్స్ కార్నర్లో పడి ఒకరు మృతి
ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువు సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బాక్స్ కార్నర్లో పడి కాంబ్లే సదాశివ్ (51) సోమవారం మృతి చెందినట్లు మావల పోలీస్ స్టేషన్ ప్రొహిబిషన్ ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. భీంపూర్ మండలం అర్లి (టి) గ్రామానికి చెందిన సదాశివ్ కొంతకాలంగా మతిస్థిమితం కొల్పోయాడు. ఇదే క్రమంలో ఎర్రకుంట చెరువు వైపు కాలి నడకన వస్తుండగా కార్నర్ బాక్స్లోపడి మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు ..బోథ్: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. మండలంలోని పిప్పల్దరి గ్రామానికి చెందిన జుగ్నక్ శ్రీనివాస్ (25) ఈ నెల 1న అదే గ్రామానికి చెందిన కుంరం గంగాప్రసాద్తో కలిసి ట్రాక్టర్తో పెందూర్ భీంరావ్ చేనులో దుక్కి దున్నడానికి వెళ్లారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో శ్రీనివాస్కు తీవ్రంగా గంగాప్రసాద్కు స్వల్పంగా గాయాలయ్యాయి. పక్క చేనులో ఉన్న నవీన్ గమనించి శ్రీనివాస్ అన్న సంతోష్కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను బోథ్లోని సీహెచ్సీ తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుని సోదరుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దేశీదారు పట్టివేతసాత్నాల: భోరజ్ మండలంలోని సావాపూర్లో సోమవారం దేశీదారు పట్టుకున్నట్లు ఎస్సై రమ్య తెలిపారు. తాజీల ప్రవీణ్ వద్ద 30 దేశీదారు సీసాలు (90 ఎంఎల్) లభ్యమైనట్లు తెలిపారు. వాటి విలువ రూ.1500 వరకు ఉంటుందన్నారు. నిందితుడిని తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి ఎదుట బైండోవర్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దేశీదారు అమ్మకం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ ఆదిలాబాద్: జిల్లాకు చెందిన తైక్వాండో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటారు. మేడ్చల్–మల్కాజ్ గిరి జిల్లాలో మే 31, జూన్ 1వ తేదీల్లో జరిగిన పోటీల్లో నలుగురు క్రీడాకారులు ఒక స్వర్ణం, 3 కాంస్యాలతో మెరిశారు. సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో అన్నారపు సహన బంగారు పతకం, వడ్నాల శ్రీ, డేగే సాత్విక్, రావుల అవంతిక కాంస్య పతకాలు సాధించారు. వీరంతా వచ్చే నెల ఉత్తరాఖండ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు శిక్షకుడు వీరేష్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో మెరవడం గొప్ప విషయం.. జిల్లాకు చెందిన తైక్వాండో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవడం గొప్ప విషయమని జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి అన్నారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను సోమవారం ఇ ందిరా ప్రియదర్శిని స్టేడియంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర సాధనతోనే విజయం సాధించవచ్చన్నారు. -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు?
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్లో గతేడాది నవంబర్లో మహిళ హత్యకు గురైన సంఘటన సంచలనం సృష్టించింది. కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కూస లక్ష్మి (55) స్నేహితురాలు భీమక్కతో కలిసి మంచిర్యాలలోని గణేశ్నగర్లో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. కొంత కాలం తర్వాత ఇద్దరు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. నవంబర్ 30న అదే ఇంట్లో లక్ష్మి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో పోలీసులకు సవాల్గా మారింది. ఎట్టకేలకు హత్యకు సహకరించిన ఓ మహిళతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలి
ఉట్నూర్రూరల్: ఏజెన్సీ ప్రాంతంలో డీఎస్సీ నిర్వహించి ట్రైబల్ నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఏజెన్సీ సాదన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ సోమేశ్ సోమవారం ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2,345 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందని, ఇప్పటి వరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో జూలైలో ఐటీడీఏ ఎదుట నిరాహారదీక్ష చేపడుతామన్నారు. కార్యక్రమంలోనాయకులు కొచ్చెర కిషోర్, ఆత్రం జాలింషావ్, మడావి మనోహర్, మెస్రం ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ద ర్శించుకునేందుకు సోమవారం తెలంగాణ, ఆ ంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆల య అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. 1000 రూపాయల అభ్యాసం టికెట్లు 280, 150 అక్షరాభ్యాసం టికెట్లు 425, వివిధ ఆర్జిత సేవల టికెట్ల ద్వారా ఆలయానికి రూ.8.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కొనసాగుతున్న క్రికెట్ ఎంపిక పోటీలుమంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అ సోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేష న్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. సోమవారం గుడిపే ట్ బెటాలియన్లో గ్రీన్, యెల్లో జట్లకు పోటీలు నిర్వహించగా మొదటి ఇన్నింగ్స్లో గ్రీన్ జ ట్టు 328 పరుగులు, యెల్లో జట్టు 274 పరుగులు సాధించాయి. రెండో ఇన్నింగ్స్లో యెల్లో జ ట్టు 158 పరుగులు, గ్రీన్ జట్టు 274 పరుగులు సాధించగా, గ్రీన్ జట్టు విజయం సాధించినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా జి.చరణ్, బెస్ట్ బ్యాట్స్మెన్గా అవినాశ్ జాదవ్, బెస్ట్ బౌలర్గా అనిరుధ్ నిలిచారు. ఒకరిపై కేసు ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన మహ్మద్ అలీమొద్దీన్ సోమవారం మహారాష్ట్ర నుంచి పశువులను తీసుకువచ్చి వధించేందుకు సిద్ధంగా ఉంచాడు. తన ఇంటి ముందు కట్టి ఉంచిన ఎనిమిది ఎద్దులను వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొని గోశాలకు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. చెక్పోస్టును తనిఖీ చేసిన సీఐ జన్నారం: మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఏ ర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి తని ఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను తరలించే అవకాశం ఉన్నందువల్ల ముందస్తుగా ప్ర తీ వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. -
వేడుకలకు సర్వం సిద్ధం
● రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ముస్తాబైన కలెక్టరేట్ ● ముఖ్య అతిథిగా హాజరుకానున్న షబ్బీర్ అలీ కై లాస్నగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించన్నారు. ఈ మేరకు అధికా రులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేదికతో పాటు అమరవీరుల స్తూపాన్ని రంగులతో తీర్చిదిద్దారు. హాజరయ్యే వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు కూర్చునేందుకు వీలుగా కుర్చీల ను సిద్ధం చేశారు. ఉదయం 10గంటలకు నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తొలుత పో లీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అమరవీరు ల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం జా తీయ పతాకం ఆవిష్కరిస్తారు. జిల్లా ప్రగతిపై సందేశం ఇవ్వనున్నారు. వేడుకల నేపథ్యంలో కలెక్టరే ట్, జెడ్పీ కార్యాలయంతో పాటు ప్రధాన చౌక్లను రంగురంగుల విద్యుత్దీపాలతో అలంకరించారు. ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్ తమతమ కా ర్యాలయాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొని ము వ్వన్నెల జెండా ఎగురవేయనున్నారు. కలెక్టరేట్లో చేపట్టిన ఏర్పాట్లను ఆర్డీవో వినోద్ కుమార్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు. -
ఆవుదూడను చంపిన కేసులో నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ఆవుదూడను చంపిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భోరజ్ మండలం సిర్సన్న గ్రామానికి చెందిన సాయికుమార్కు చెందిన ఆవుదూడను అదే గ్రామానికి చెందిన రాథోడ్ సంజయ్ గిమ్మ శివారులో కత్తితో పొడిచాడు. జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై గౌతమ్ అక్కడికి చేరుకోగా కొద్ది సేపటికే ఆవుదూడ మృతిచెందింది. పోలీసులు సంజయ్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు వివరించారు. ఆవుదూడను చంపి అటవీ జంతువుల మాంసంగా అమ్మేందుకు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో మేకల దొంగతనం, గుడిలో దొంగతనం, ఫారెస్ట్ కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఆవులను అక్రమంగా తరలించినా, చంపినా చట్టరీత్యా నేరమని అన్నారు. ఇలాంటి వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. -
మత్తు వదలరా..!
● జిల్లాలో యథేచ్ఛగా గంజాయి విక్రయం, వినియోగం ● వాట్సాప్లో అమ్మకం, అడ్డాలు, సమయంపై సమాచారం ● నియంత్రణకు ట్రాకింగ్ డాగ్స్ వినియోగం మంచిర్యాలక్రైం: జిల్లాలో గంజాయి దందాపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, ఈ చీకటి వ్యాపారం తగ్గడం లేదు. గంజాయి మత్తులో యువత దాడులకు తెగబడటం, బెదిరింపులతో డబ్బులు లాక్కోవడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత, జిల్లాను గంజాయి రహితంగా మార్చడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అయినా క్షేత్రస్థాయిలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. చిన్న ప్యాకెట్లలో గంజాయి రవాణా, విక్రయాలను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. యువతే లక్ష్యంగా వ్యాపారం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులను గంజాయి స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివే యువత నుంచి రోడ్లపై తిరిగే యువకుల వరకు గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి సేవనంతో కలిగే ఆరోగ్య సమస్యలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక బాధ్యతగా, మత్తులో ఉన్న యువతను సన్మార్గంలోకి తీసుకొచ్చేందుకు వివిధ చర్యలు చేపడుతున్నారు. సోషల్ మీడియా వేదిక.. సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ గంజాయి అమ్మకాలకు అడ్డాగా మారింది. గంజాయి సేవించే వారు వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకుని, కోడ్ భాషలో సమాచారం పంపుతూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 100 గ్రాముల ప్యాకెట్లను రూ.200 నుంచి రూ.300కి విక్రయిస్తూ, రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య నిర్దిష్ట ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్నారు. శ్రీరాంపూర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, కాలేజీ రోడ్, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్, జాఫర్ నగర్, అండలమ్మ కాలనీ, తిలక్నగర్, బైపాస్ రోడ్ వంటి ప్రాంతాలు గంజాయి అమ్మకాలకు అడ్డాలుగా మారాయి. గతంలో గంజాయి వాడకం మాస్ ఏరియాలకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు క్లాస్ ఏరియాల్లోనూ జోరుగా సాగుతోంది. సిగరెట్లలో గంజాయి.. పట్టణ కేంద్రాల్లోని పాన్ షాపులు, టీ స్టాల్స్ వద్ద గంజాయిని సిగరెట్లలో దాచి రహస్యంగా విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ టీ స్టాల్ గంజాయి సిగరెట్ల విక్రయ కేంద్రంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. రోజూ వందల మంది యువత ఇక్కడికి వచ్చి, కోడ్ భాషలో గంజాయి సిగరెట్లను కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న బానిసలు.. పోలీసు లెక్కల ప్రకారం, జిల్లాలో గంజాయి వా డకం గణనీయంగా పెరిగింది. గతంలో పట్టణ ప్రా ంతాలకే పరిమితమైన గంజాయి వాడకం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి వ్యసనం యువతను సామాజిక, ఆరోగ్య సమస్యల వైపు నడిపిస్తోంది. పోలీసులు ఈ వ్యసనాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలతో పాటు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ, గంజాయి దందా పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. రంగంలోకి ట్రాకింగ్ డాగ్స్.. గంజాయి విక్రయాలు, రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. పోలీస్ శాఖ గంజాయి నియంత్రణకు నార్కోటిక్ టీమ్లను ఏర్పాటు చేసింది. స్పెషల్గా గంజాయి నియంత్రణకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ట్రాకింగ్ డాగ్స్ను వినియోగిస్తున్నాం. జిల్లాకు అధికంగా మహారాష్ట్ర నుంచి వస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పోలీసులకు గంజాయి సమాచారం అందించి నియంత్రణకు కృషి చేయాలి. యువతను పేడదోవ పట్టకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల ట్రాకింగ్ డాగ్స్తో తనిఖీలు గంజాయి వాసన పసిగట్టే ట్రాకింగ్ డాగ్స్ సాయంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్థుల ఇళ్లు, పాన్ షాపుల్లో రాత్రిపగలు తేడా లేకుండా తనిఖీలు చేస్తున్నారు. అయినా, కచ్చితమైన సమాచారం లే నప్పుడు గంజాయి విక్రయాలను నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే 20 వరకు 30 కేసులు నమోదు కావడం, 95 మంది నిందితులను అరెస్ట్ చేయడం జిల్లాలో దందా ఏరీతిని సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి దందా నడిపిన 22 మంది ముఠాను పట్టుకుని, 23.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా, రూ.10.37 లక్షల విలువై న 34 కిలోల గంజాయిని ఈ ఏడాది స్వా ధీనం చేసుకున్నారు. -
నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా
● వారం రోజుల్లో మూడు కేసులు, ఐదుగురి అరెస్ట్ ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: జిల్లాలో నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల్లో మూడు కేసులు నమోదు కాగా, ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 78 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, పది కిలోల లూజ్ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు నకిలీ, లూజ్ విత్తనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. విత్తన ప్యాకెట్లపై సరైన లేబుల్, తయారీ, ఎక్స్పైరీ తేదీ ఉండేలా చూసుకోవాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే 8712659965 నంబర్లో సమాచారం అందించాలని తెలిపారు. సీసీఎస్ బృందం ఆధ్వర్యంలో పోలీసు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇచ్చోడలో నలుగురు, బేలలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే శనివారం తలమడుగు మండలంలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. -
నల్ల బ్యాడ్జీలతో లెక్చరర్ల నిరసన
ఆదిలాబాద్టౌన్: నూతనంగా రెగ్యులరైజ్ అయిన లెక్చరర్లకు 2వ ఇంక్రిమెంట్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆదివారం లెక్చరర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ స్పాట్ క్యాంప్లో డీఐఈఓ జాదవ్ గణేశ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రె గ్యులరైజ్ అయిన లెక్చరర్లకు 2వ ఇంక్రిమెంట్ డీడీవోలు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఇందులో లెక్చరర్ల సంఘం నాయకులు సంజీవ్ రెడ్డి, నరహరి, రత్నాకర్, సుజాత, సువర్ణ, నారాయణ రెడ్డి, రామారావు, సంతోష్, వినోద్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాస్తో అక్షర వెలుగు
ఆదిలాబాద్టౌన్: అక్షర క్రమంలో ముందున్న ఆది లాబాద్ జిల్లా అక్షరాస్యతలో మాత్రం వెనుకబడి ఉంది. రాష్ట్రస్థాయిలో 15వ స్థానంలో నిలిచింది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే చదువుతోనే సాధ్యమనేది లోకవిధితం. గతంలో అక్షరాస్యత పెంచేందుకు వయోజన విద్య, చదువుల పండగ, సాక్షర భారత్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేదు. మరోసారి కేంద్రం నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా మార్చేందుకు ఉల్లాస్ (అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నవభారత్ సాక్షరత కా ర్యక్రమాన్ని చేపడుతోంది. 2026–27 వరకు అమలు చేయనుంది. జిల్లాలో అక్షరాస్యత శాతం 63.29 ఉండగా.. ఈ కార్యక్రమం ద్వారా పెంచేందుకు వయోజన విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మహిళా సంఘాల ద్వారా అక్షరాస్యత పెంపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు.. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువత తదితరులతో బోధన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అంగన్వాడీలు, మహిళా సంఘాలు, ఆర్పీల ద్వారా ఎంత మంది నిరక్షరాస్యులు ఉన్నారనేది 2009 జనాభా లెక్కల ప్రకారం గుర్తిస్తున్నారు. జిల్లాలో 554 గ్రామ సమైఖ్య, 18 మండల సమైఖ్య సంఘాలు ఉన్నాయి. 1,176 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,19,604 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ సంఘాల్లో ఎంత మంది అక్షరాస్యులు ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. వారితో సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులకు బోధన చేయనున్నారు. జూన్ 15 నుంచి అమలు.. ఉల్లాస్ కార్యక్రమాన్ని జూన్ 15 నుంచి ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా అమలు చేయనున్నారు. బోధన చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి తో నిరక్షరాస్యులకు చదువు చెప్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలు, సామాజిక కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాల్లో బోధన కొనసాగనుంది. ఇందుకు సంబంధించి ఎస్సీఈఆర్టీ వయోజన విద్యకు సంబంధించిన పుస్తకాలను రూపొందించింది. అయితే ఆన్లైన్ ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషలను నేర్చుకునే అవకాశం సైతం ఉంది. అభ్యసనకు సంబంధించిన సామగ్రి, డిజిటల్ పరికరాలు, మౌలిక, సాంకేతిక సదుపాయాలు, లర్నింగ్ టూల్స్, అవగాహన కార్యక్రమాలు, అక్షరాస్యత మేళాలు, సామాజిక చైతన్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. రోజుకు రెండు గంటల పాటు బోధన చేయనున్నారు. ఆరు నెలల పాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్స్కూల్ (ఎన్ఐఓఎస్) పరీక్ష నిర్వహిస్తారు. హాజరైన వారికి అక్షరాస్యులుగా సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఈనెల 15 నుంచి అమలు మహిళా సంఘాలు, స్వచ్ఛంద బోధకులతో.. 15 ఏళ్లు పైబడిన వారికి చదువు పకడ్బందీగా అమలు చేస్తాం.. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రస్తుతం నిరక్షరాస్యుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నాం. జూన్ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాను అక్షరాస్యత శాతంలో ముందుంచేందుకు కృషి చేస్తున్నాం. – శ్రీనివాస్రెడ్డి, వయోజన విద్య డీడీ, ఆదిలాబాద్ ఉల్లాస్ ఉద్దేశం: 15 ఏళ్లు పైబడిన వారికి చదువు నేర్పించడం. (అక్షరాలను గుర్తించడం, చదవడం, రాయడం రావడం, కూడికలు చేయడం, కనీస సామర్థ్యాలు పెంపొందించడం) జిల్లా అక్షరాస్యత వివరాలు.. నిరక్షరాస్యులు 1,27,491 పురుషులు 44,635 మహిళలు 82,827 ఇతరులు 29 అక్షరాస్యత శాతం 63.29 -
నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
ఆదిలాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు నిజాయతీ చాటుకున్నారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్కు వెళ్లే బస్సులో శనివారం ప్రయాణించిన అక్రమ్ బేగం అందులోనే తన బ్యాగు మర్చిపోయింది. గుర్తించిన కండక్టర్ వి.రమణ, డ్రైవర్ ఎం. గులాబ్ ఆ బ్యాగును డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్కు అప్పగించారు. వివరాలు తెలుసుకున్న డిపో అధికారులు సదరు మహిళకు ఆదివారం బ్యాగు అందించారు. అందులో 12 గ్రాముల బంగారం ఒక సెల్ఫోన్, రూ. వెయ్యి నగదు ఉన్నట్లు ప్రయాణికురాలు పేర్కొన్నారు. సిబ్బంది, యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
లెదర్ పార్క్ జేఏసీ ఏర్పాటు
మందమర్రిరూరల్:లెదర్ పార్క్ సాధన సమితి ఆధ్వర్యంలో మందమర్రి, మంచిర్యాల లెదర్ ఇండస్ట్రీయల్ పార్క్ జేఏసీ కమిటీలను మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో ఆదివారం ఎన్నుకున్నారు. మందమర్రి పట్టణ జేఏసీ కన్వీనర్గా నెరువెట్ల శ్రీనివాస్, కోకన్వీనర్గా మంతె సుమన్, ముల్కల్ల రమేశ్, రామకృష్ణ, నందిపేట రాజు, నెరువెట్ల సుజిత్, గడ్డం అనిల్, కొలుగూరి పృథ్వీరాజ్, బత్తుల సరిత, బొడ్డు వినోద, సకినాల సాయికృష్ణ, ఎంవీ.గుణ, కాసిపేట స్వామి, తోకల నిరోష, గౌరవాధ్యక్షులుగా ఉప్పులేటి నరేశ్ ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా గౌరవ అధక్షులుగా పుల్లూరి లక్ష్మణ్, కన్వీనర్గా చిప్పకుర్తి ఐలయ్య, కోకన్వీనర్లుగా జంగంపల్లి రామస్వామి, పల్లె సమ్మయ్య, నందిపేట రవి, దరిపెల్లి కనుకయ్య, సిర్ర దివాకర్, నేరెల్ల శంకరయ్య, ఎలుకలపల్లి మల్లేశ్, సుద్దాల జనార్దన్, ఆసంపల్లి రాయమల్లు, బచ్చలి నరసయ్య, వేల్పుల కిరణ్, చిలుముల కుమార్, మామిడిపల్లి ప్రకాశ్, కొంకటి శ్రీనివాస్, కాసిపేట స్వామి ఎన్నికయ్యారు. -
● డెంగీ జ్వరాలపై ప్రత్యేక దృష్టి ● అందుబాటులో హెల్ప్లైన్ నంబర్ 76709 04306 ● పది ఆస్పత్రుల్లో బర్త్ వెయిటింగ్ రూమ్స్ ● కరోనా ప్రబలకుండా చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్
సాక్షి: డెంగీ నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? డీఎంహెచ్వో: జిల్లాలో గతేడాది 366 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో 231 కేసులు అర్బన్ ఏరియాలోనివే. జిల్లావ్యాప్తంగా 165 డెంగీ రిస్క్ విలేజ్లను గుర్తించాం. ఈ గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికే ర్యాపిడ్ రెస్పాండ్ టీమ్ను ఏర్పాటు చేశాం. ఇందులో డీఎంహెచ్వో, అపిడాలమిస్ట్, మైక్రోబ యాలజిస్ట్, హెల్త్ సూపర్వైజర్, డీఎంవో సభ్యులుగా ఉన్నారు.అలాగే డీఎంహెచ్వో కార్యాలయంలో 24 గంటల పాటు హెల్ప్లైన్ నంబర్ 7670904306ను అందుబాటులో ఉంచాం. ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలి. ఆదిలాబాద్టౌన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి.. జిల్లాలో వర్షాల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే 201 కటాఫ్ గ్రా మాలను ఇప్పటికే గుర్తించాం.. గర్భిణులను ప్రసవాల కోసం వారం ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్స్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రాథోడ్ నరేందర్ అన్నారు. ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? డీఎంహెచ్వో: ఈ సీజన్లో నీటిజనిత, కీటకజనిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు, వైరల్ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే వేడిచేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. ఇక ప్రతీ శుక్రవారం ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపడతాం. సాక్షి: కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే విమర్శలున్నాయి.. దీనిపై ఏమంటారు..? డీఎంహెచ్వో: ఇటీవల మెడికల్ ఆఫీసర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించాం. పీహెచ్సీల్లో ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి. విధులు విస్మరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం. సాక్షి: జిల్లాలో ఏమైనా మందుల కొరత ఉందా..? డీఎంహెచ్వో: అలాంటిది ఏం లేదు. సీజనల్ ముందస్తుగానే డ్రగ్ స్టోరేజీలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్హెల్త్ సెంటర్లకు సరిపడా అందజేస్తున్నాం. ఓఆర్ఎస్, జింక్, మెట్రోజిల్ మాత్రలు అందుబాటులో ఉన్నాయి. సాక్షి: మాతా శిశు మరణాల నివారణ కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? డీఎంహెచ్వో: మాతా శిశు మరణాలు అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలిస్తున్నాం. జూన్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 150 ప్రసవాలు జరగనున్నాయి. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సుఖ ప్రసవం జరిగేలా చర్యలు చేపడుతున్నాం. సాక్షి: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? డీఎంహెచ్వో: మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్న క్రమంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ నిబంధనలు పాటించాలి. గతంలో మాదిరిగా కరోనా ప్రభావం ప్రస్తుతం లేదు. నిబంధనలు పాటిస్తే భయపడాల్సిన అవసరం లేదు.సాక్షి: వాగులు, వంకలు ఉప్పొంగే గ్రామాల్లోని గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా..? డీఎంహెచ్వో: వర్షాకాలంలో వాగులు, వంకలు ఉప్పొంగే గ్రామాలను ముందస్తుగానే గు ర్తించాం. అలాంటివి జిల్లాలో 201 ఉన్నా యి. ఆయా చోట్ల మొత్తం పది బర్త్ వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఝరి, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్హత్నూర్, నేరడిగొండ, బోథ్, జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ప్రసవ నిరీక్షణ కేంద్రాలను అందుబాటులో ఉంచాం. ప్రత్యేకంగా బెడ్లు వేయించాం. గర్భిణులతో పాటు అటెండెంట్కు కూడా భోజన సౌకర్యం ఉంటుంది. -
వర్షాకాలం.. పశువులు పైలం
చెన్నూర్రూరల్/ లక్ష్మణచాంద: వర్షాకాలం ఆరంభమైంది. ఈసారి ముందస్తుగానే వర్షాలు కు రుస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులు కూడా మొ దలయ్యాయి. మరోవైపు అకాల వర్షాలకు నేల కూడా పచ్చబడింది. లేదగడ్డి పశువులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో, పశువులకు అంటు వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉందని కత్తెరసాల, లక్ష్మణచాంద పశువైద్యాధికారి సతీశ్, ఓంప్రకాశ్ సూచించారు. పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు సంబంధించిన సాధారణ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స విధానాలు వెల్లడించారు. గాలిపుండు (ఫుట్రాట్) వ్యాధి లక్షణాలు: వర్షాకాలంలో చిత్తడి నేలలపై తిరిగే మేకలు, గొర్రెలకు గాలిపుండు వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఈ బ్యాక్టీరియల్ వ్యాధి వల్ల గొర్రెలు కుంటుతూ, మూడు కాళ్లపై గెంటుతాయి. గిట్టల మధ్య ఎర్రగా కందిపోయి, చీము పట్టి నల్లగా మారుతుంది. తీవ్రమైతే గిట్టలు ఊడిపోయే ప్రమాదం ఉంది. నివారణ చర్యలు వ్యాధి సోకిన పశువులను వెంటనే గుర్తించి, ఆరోగ్యవంతమైన వాటికి దూరంగా ఉంచాలి. చిత్తడి నేలలు, నీరు నిలిచే ప్రాంతాల నుంచి పశువులను దూరంగా ఉంచాలి. వర్షం నుంచి రక్షణ కల్పించే ఆరు ప్రాంతాల్లో పశువులను ఉంచాలి. చికిత్స తర్వాత నయమైన పశువులను మాత్రమే ఆరోగ్యవంతమైన వాటితో కలపాలి. చికిత్స విధానం వైద్యుని సలహాతో పెన్సిలిన్, నొప్పి నివారణ మందులు వాడాలి. వ్యాధి సోకిన గిట్టలను 10% ఫార్మలిన్ లేదా కాపర్సల్ఫేట్ ద్రావణంలో ముంచాలి. నీలి నాలుక వ్యాధి (బ్లూ టంగ్ డిసీజ్) వ్యాధి లక్షణాలు: నీలి నాలుక వ్యాధి, వైరస్ వల్ల సంక్రమించే ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో ఈవ్యాధి విస్తరణ అవకాశం ఎక్కువ. లక్షణాలు: అధిక జ్వరం, చొంగ కారడం, పెదవులు, చిగుళ్లు వాచడం, ఎర్రటి గుల్లలు ఏర్పడడం. తీవ్ర సందర్భాల్లో గిట్టలు వాచి, నాలుక నీలం రంగులోకి మారుతుంది. పశువులు నడవలేక, మేత మేయక, అచేతన స్థితికి చేరి కిందపడిపోతాయి. నివారణ చర్యలు: ఈగలు, దోమల నివారణకు రోజుకు రెండుసార్లు వేప ఆకులతో పొగ వేయాలి. బురద, నీరు నిలిచే ప్రాంతాలను శుభ్రం చేయాలి. చికిత్స విధానం పశువైద్యుడిని సంప్రదించి, యాంటీబయోటిక్, నొప్పి నివారణ మందులు వాడాలి. నోటి పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, జింక్ పౌడర్ రాయాలి. గిట్టల పుండ్లకు హామాక్స్, లేమనెంట్ వంటి ఆయింట్మెంట్లు వాడాలి. చిటుకు వ్యాధి.. తొలకరి గడ్డిలో క్లాస్ట్రీడియం ఫర్ ఫ్రింజర్స్ టైప్–డి అనే రకం సూక్ష్మజీవులు ఉంటాయి.ఈ సూక్ష్మ జీవులు గాలి లేని వాతావరణంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. తొలకరి పిచ్చి గడ్డిని జీవాలు తిన్నప్పుడు జీవాల పేగుల్లో గాలి లేని వాతావరణం ఏర్పడి అక్కడ సూక్ష్మజీవుల వల్ల ఏర్పడిన విష పదార్థాల వల్ల ఈ చిటుకు వ్యాధి వస్తుంది. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన గొర్రెలు కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండానే ఆకస్మికంగా మరణిస్తాయి. కొన్ని ఎగిరి కిందపడి కాళ్లు కిందకు కొట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ చనిపోతాయి. వ్యాధి సోకిన గొర్రెలు చొంగ కారుస్తాయి. శ్వాస అధికంగా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... చికిత్స కంటే నివారణ ముఖ్యం. మే నుంచి జూలై వరకు వ్యాధినిరోధక టీకా(మల్టీ కాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో పశు వైధ్యాధికారికి తెలియ చేసి చికిత్స చేయించాలి. తొలకరి చినుకులకు మొలిచిన గడ్డి మేయకుండా చూసుకోవాలి. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేయాలి. -
సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలి
కైలాస్నగర్: చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ నాయబ్ తహసీల్దార్ రాథో డ్ బాబుసింగ్ కోరారు. మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని శాంతినగర్, రాంనగర్ కాలనీల్లోని పలు చౌకదుకాణాలను ఆదివారం ఆయన పరిశీలించారు. బియ్యం పంపిణీపై ఆరా తీశారు. కార్డుదారులు ఈపీవోఎస్ మిషన్పై మూడుసార్లు వేలిముద్రలు వేసి బియ్యం పొందాలని సూచించారు. డీల ర్లు పొరపాట్లకు తావివ్వకుండా సకాలంలో పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం ఎంఎల్ఎస్ పాయింట్ను సందర్శించి చౌకదుకాణాలకు బియ్యం తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్అర్బన్లో 43 షాపులకుగాను 38 షాపులకు, మావలలో 10 షాపులకు గాను ఒకటి, రూరల్లో 25 షాపులకు గాను 12 షాపులకు ఇంకా బియ్యం చేరాల్సి ఉందని తెలిపారు. సకా లంలో బియ్యం ఆయా దుకాణాలకు చేరవేసేలా చూడాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి మెస్రం మధుకర్ను ఆదేశించారు.