breaking news
Adilabad District News
-
బాధ్యత మరవని గిరిజనులు
దండేపల్లి: ఊళ్లోనే పోలింగ్ కేంద్రం ఉన్నప్పటికీ కొందరు, కొన్ని సందర్భాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. కానీ దండేపల్లి మండలం కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఊట్ల గ్రామ ఆదివాసీ గిరిజనులు ఏ ఎన్నికలు వచ్చినా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడిపల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటెయ్యాలి. ఆగ్రామంలో సుమారు 50 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఎమ్మెల్యే, ఎంపీ, పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏం జరిగినా.. దూరం అని భావించకుండా ఓటు వేయడం మాత్రం మరువడం లేదు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో బాధ్యతగా ఓటేసి పాలకులను ఎన్నుకుంటున్నారు. -
● మొదటి విడతకు సర్వం సిద్ధం ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా పకడ్బందీ చర్యలు ● అందుబాటులో టోల్ఫ్రీ నం.18004251939 ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ రాజర్షిషా
కై లాస్నగర్: ‘తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. సిబ్బందికి మూడు విడతల్లో శిక్షణ అందించాం.. బుధవారం మధ్యాహ్నం వరకు వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..’ అని కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షిషా అన్నారు. మంగళవారం ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? కలెక్టర్: ఈ నెల 11న జిల్లాలోని గాదిగూడ, నా ర్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పీవో, ఓపీవోల మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసి విధులు కేటాయించాం. వారు బుధవారం ఉదయం 9.30 గంటలకు ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకొని ఎన్నికల సామగ్రి తీసుకుంటారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సాక్షి: ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? కలెక్టర్: ఆరు మండలాల పరిధిలో 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఇందులో 46 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, 33 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పకడ్బందీగా సాయుధ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. సాక్షి: మద్యం, డబ్బు ప్రలోభాలను ఏవిధంగా కట్టడి చేస్తారు? కలెక్టర్: ఇప్పటికే ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల పరిధిలోని వైన్స్లను మూసివేయాలని ఆదేశించాం. ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. ఎక్కడైనా డబ్బులు, మద్యం పంచినట్లయితే ప్రజలు డయల్ 100, టోల్ఫ్రీ నం.18004251939 కు సమాచారం అందించాలి. సాక్షి: రోడ్డు సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది.. వాటిపై ఏవిధంగా దృష్టి సారించారు..? కలెక్టర్: ఆరు మండలాల పరిధిలో కేవలం ఉట్నూర్ మండలంలోని ఒక పోలింగ్ కేంద్రానికే ఈ పరిస్థితి ఉన్నట్లుగా గుర్తించాం. సిబ్బంది వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. సాక్షి: ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.. ఈ పరిస్థితిని ఏవిధంగా అధిగమిస్తారు..? కలెక్టర్: ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు నిధులు విడుదల చేసింది. ఈసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రతీ మండలానికి అవసరమైన నిధులు కేటాయించాం. వారికి సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. సాక్షి: పోలింగ్ శాతం పెంపునకు ఏ విధంగా ముందుకెళ్తున్నారు..? కలెక్టర్: అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో పోల్ చీటీలను ఓటర్లకు అందించాం. ఇప్పటివరకు 95 శాతం ప్రక్రియ పూర్తయింది. ఒకరోజు సమయం ఉండడంతో ప్రతిఒక్కరికీ అందజేస్తాం. గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 గుర్తింపుల్లో ఏదైన ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లి ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ అందించాం. -
అగ్నివీర్లుగా ఎంపిక
ఆదిలాబాద్: అగ్నివీర్–వాయుగా జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. సోమవారం రాత్రి విడుదలై న ఫలితాల్లో అగ్నివీర్ వాయు విభాగంలో జిల్లాకు చెందిన ఇద్ద రు యువకులు, ఓ యువతి ఎంపికై ఉద్యోగా లు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఊశన్న, దేవత దంపతుల కుమార్తె శ్రే య చందల్వార్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి–బి గ్రామానికి చెందిన ఆకుల సురేష్ కుమారుడు వినయ్ కుమార్, బజార్హత్నూర్ మండలం బోస్రా గ్రామానికి చెందిన సోన్టాకే అశోక్, సుగుణ దంపతుల కుమారుడు మన్మత్ ఉద్యోగాలు సాధించారు. శిక్షకుడు వీ జీఎస్ రాకేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పూలే విగ్రహం ఏర్పాటుకు అనుమతివ్వాలిశ్రీరాంపూర్: శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని సింగరేణి కాల రీస్ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం జీఎం ఎం శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా బీసీ లైజన్ అధికారి ఎన్.సత్యనారాయణ, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కార్యదర్శి బద్రి బుచ్చయ్య పాల్గొన్నారు. -
పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.. ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ పాటించా లి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు.. గొడవలకు దారి తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొ ద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హె చ్చరించారు. మంగళవారం ‘సాక్షి’కిచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: తొలివిడత ఎన్నికలకు ఎలాంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.? ఎస్పీ: మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లో ఈ నెల 11న జరగనున్నాయి. 920 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశాం. ఒక్కో మండలాన్ని డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు పర్యవేక్షిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. సాక్షి: పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి నిబంధనలు పాటించాలి..? ఎస్పీ: పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ సెక్ష న్ అమలులో ఉంటుంది. 200 మీటర్ల వరకు ప్రత్యేక నిబంధనలు పాటించాలి. ఓటర్లు క్యూ లో ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలి. సాక్షి: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.? ఎస్పీ: తొలివిడతలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది. ఎవరూ ప్రచారం చేయొద్దు. బయట వ్యక్తులు గ్రామాల్లో ఉండకూడదు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా, గొడవలకు దారితీస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి భద్రత చర్యలు చేపడుతున్నారు..? ఎస్పీ: సమస్యాత్మక కేంద్రాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నాం. సాక్షి: సోషల్ మీడియాపై ఎలా నిఘా సారిస్తున్నారు? ఎస్పీ: సోషల్ మీడియాలో ఇతరులను రెచ్చగొట్టేలా,కించపర్చేలా పోస్టులు పెట్టవద్దు. ఎవరైనా అతిక్రమిస్తే గ్రూప్ అడ్మిన్లతో పాటు మెంబర్లపై సైతం కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బృందంద్వారా సోషల్ మీడియాపై నిఘా పెట్టాం. సాక్షి: విజయోత్సవ ర్యాలీ చేపట్టవచ్చా..? ఎస్పీ: ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదు. సంబంధిత అధికా రుల అనుమతితో నిర్ధారించిన రోజున జరుపుకోవచ్చు. టపాసులు కూడా పేల్చ రాదు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి. -
‘బాండ్’ మోగిస్తున్న సర్పంచ్ అభ్యర్థి
నెన్నెల: నెన్నెల మండల కేంద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి దుగ్యాల బాపు బాండ్ పేపర్పై హామీలతో ప్రచారం చేస్తున్నారు. నెన్నెల సర్పంచ్గా గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులు, పేదలకు అందించే ఆర్థికసాయం వివరిస్తూ రూ.50 విలువైన బాండ్ పేపర్పై నోటరీ చేయించి అందరికీ పంచుతున్నారు. అత్యవసర వైద్యం, అంత్యక్రియలు, పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.5వేలు, ఆటో ఏర్పాటు చేసి గర్భిణులు, రోగులను ఆస్పత్రికి ఉచిత తరలింపు, ఊరి భద్రత కోసం వీధుల్లో సీసీ కెమెరాలు, విద్యార్థులకు స్కూల్బ్యాగులు, నోట్పుస్తకాలు తదితర హామీలు ఇస్తున్నారు. గెలిచిన తర్వాత ఇందులో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా సర్వేనంబరు 161, 155లో తన పేరిట ఉన్న రెండెకరాల 11గుంటల భూమి పంచాయతీ అప్పగిస్తానని, లేనిపక్షంలో ప్రజలు తనను కాలర్పట్టి నిలదీయవచ్చని పేర్కొన్నారు. -
కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం
ఆదిలాబాద్టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ అన్నారు. మెదక్లో మంగళవారం నిర్వహించిన సీఐటీయూ ఐదో రాష్ట్ర మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు పొంద డం లేదని పేర్కొన్నారు. వారిని వెంటనే ఆదుకో వాలన్నారు. అలాగే స్కీమ్, కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సునీత, మల్లేశ్, అగ్గిమల్ల స్వామి, నవీన్కుమార్, వెంకటమ్మ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ జట్టుకు సారథిగా..
సునీల్–నవనీత దంపతు ల కుమారుడు రాథోడ్ ఆ కాష్ ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. 2024లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించి న జూనియర్ నేషనల్ మీట్లో పాల్గొన్నాడు. మేడ్చల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయస్థానం కై వసం చేసుకో గా, అందులో కీలకంగా వ్యవహరించాడు. మహబూబ్నగర్లో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. నవంబర్ 28 నుంచి 30 వరకు పటాన్చెరులో నిర్వహించిన 44వ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించాడు. నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో రాణించాడు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈనెల 25 నుంచి 30 వరకు జరగనున్న జాతీయస్థాయి పోటీలకు సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉట్నూరులో నేషనల్ క్యాంపులో శిక్షణ పొందుతున్నాడు. రాథోడ్ ఆకాష్ -
నేషనల్ క్యాంపునకు ఎంపిక
ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ) చదువుతున్న సంపత్ నాయక్ చిన్న వయసులోనే గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు. 2022లో మహారాష్ట్రలోని నాసిక్ వేదికగా నిర్వహించిన అండర్ 17 ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీల్లో, 2024లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లోనూ మెరిశాడు. నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఔరా అనిపించాడు. కర్ణాటకలోని దావనగెరెలో నిర్వహించిన సౌత్ జోన్ సీనియర్ నేషనల్ మీట్కు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అత్యుత్తమంగా రాణించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. వరంగల్లోని కాజీపేటలో 2026 జనవరిలో నిర్వహించనున్న పోటీల్లోరాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం సీనియర్ జాతీయ జట్టు క్యాంపులో శిక్షణ తీసుకుంటున్నాడు. సంపత్ నాయక్ -
కేసీఆర్ దీక్షతోనే రాష్ట్రం ఏర్పాటు..
ఆదిలాబాద్టౌన్: నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం తలొగ్గి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విజయ్ దివస్ నిర్వహించారు. తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఢిల్లీ మెడలు వంచడంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. కార్యక్రమలో పార్టీ నాయకులు అజయ్, సాజిదొద్దీన్, ప్రహ్లాద్, రమేశ్, స్వరూప, మమత తదితరులు పాల్గొన్నారు. -
కలప పట్టివేత
జన్నారం: మండలంలోని దేవునిగూడలో అక్రమంగా నిలువ ఉంచిన కలపను మంగళవారం పట్టుకున్నట్లు ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ సిబ్బందితో కలిసి వెళ్లి దేవునిగూడ గ్రామానికి చెందిన గవ్వల మురళి ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా నిలువ ఉంచిన 8 టేకు దుంగలు లభ్యమైనట్లు తెలిపారు. కర్రతో పాటు కోత మిషన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలప విలువ రూ.30 వేల వరకు ఉంటుందన్నారు. నిందితుడు మురళిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో డీఆర్వో కుమారస్వామి, సెక్షన్ అధికారులు రవి, మధుకర్, పురుషోత్తం, ఎఫ్బీవోలు తన్వీర్పాషా, లవన్, తదితరులు పాల్గొన్నారు. -
రచ్చపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
చెన్నూర్రూరల్: ఈ నెల 17న జరుగనున్న పంచా యతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని రచ్చపల్లి సర్పంచ్గా గెల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ బీసీ మహిళకు రిజర్వేషన్ రాడంతో గెల్లు లక్ష్మి, ఆమె కోడలు గెల్లు కొమురక్క మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కొమురక్క తన నామినేషన్ను ఉప సంహరించుకోవడంతో గెల్లు లక్ష్మి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యారు. కాగా ఆరు వార్డుల్లో కూడా ఒక్కో నామినేషన్ రావడంతో సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాడు జెడ్పీటీసీ... నేడు సర్పంచ్గా బరిలోరెబ్బెన: గతంలో రెబ్బెన జెడ్పీటీసీగా పనిచేసిన అజ్మీర బాబురావు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గోలేటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అవిర్భావం నుండి పార్టీలో పనిచేస్తున్న ఆయన 2001లో మొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ డివిజన్లో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) సర్పంచ్గా ఎన్నికైంది ఇతనొక్కడే. 2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో రెబ్బెన జెడ్పీటీసీ స్థానం ఎస్టీకి రిజర్వ్ కాగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన బాబురావు టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం గోలేటి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్ కావడంతో మరోసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. సర్పంచ్ బరిలో మాజీ ఎంపీపీలు..!కుంటాల: మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి గంగామణి 2014లో ఎంపీపీగా, 2019లో జెడ్పీటీసీగా పదవులు చేపట్టారు. కుంటాలకు చెందిన అప్క చిన్న గజ్జారాం 2013లో సర్పంచ్గా, 2019లో ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. మండలంలోని అందకూర్ పంచాయతీ జనరల్ మహిళ, కుంటాల పంచాయతీ జనరల్ కేటాయించగా అందకూర్ నుంచి కొత్తపల్లి గంగామణి, కుంటాల నుంచి మాజీ ఎంపీపీ ఆప్క చిన్న గజ్జారాం బరిలో ఉన్నారు. -
రెక్కల పురుగు నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
జన్నారం: యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన వరినారును రెక్కల పురుగు ఆశిస్తుందని, దీని నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల ఏడీఏ ఎం.కృష్ణ సూచించారు. మంగళవారం జన్నారం మండలంలోని మొర్రిగూడలో వరి నారుమడిని పరిశీలించారు. ఈ సందర్భంగా నారును ఆశించే పురుగు, తెగుళ్ల గురించి రైతులకు వివరించారు. రెక్కల పురుగు ప్రస్తుతం గుడ్లుపెట్టే దశలో ఉందన్నారు. నాటు వేసే ఐదురోజుల ముందు నారుమడిలో క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. మొగి పురుగును మొదటి దశలోనే నివారించడానికి పొలంలో క్లోరాంట్రానిలిప్రోల్ ఎకరానికి 60 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలన్నారు. నాటు వేసే సమయంలో నారు కొనలు తుంచి నాటుకుంటే మొగి పురుగు అదుపులో ఉంటుందన్నారు. నాటు వేసిన 15 రోజులకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరాకు 4 కేజీల చొప్పున వేసుకుంటే కాండం తొలిచే పురుగుబాధ తగ్గుతుందన్నారు. ఆయిల్పాం తోటల పరిశీలన మండలంలోని దేవునిగూడలో ఆయిల్పాం తోటలను పరిశీలించి సాగులో రైతులు అవలంబించాల్సిన పద్ధతులు, దిగుబడికి సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తాలు, తప్పలేని, 17 శాతం లోపు తేమ ఉన్న వడ్లను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సయ్యద్ అక్రమ్, దివ్య, రైతులు గుర్రం గోపాల్రెడ్డి, కళ్ళెం బాపురెడ్డి, ముత్యం రాజన్న, భుక్య రాజు, బాదవత్ రాజు నాయక్, కొట్టె గంగన్న, తదితరులు పాల్గొన్నారు. -
సంతానం కలగడంలేదని ఒకరు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఫ్యాక్టరీ వెనుకాల ఈ నెల 8న రాత్రి రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు జీర్పీ హెడ్ కానిస్టేబుల్ జస్వాల్ సింగ్ మంగళవారం తెలిపారు. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన సాగే శ్రీనివాస్ (35) మంచిర్యాలలో ఇంటర్ నెట్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయి 14 సంవత్సరాలు కావస్తున్నా సంతానం కలుగడంలేదని రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం రాత్రి బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సరిత ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
‘ప్రథమ’ అదృష్టం దక్కేదెవరికో?
కై లాస్నగర్: జిల్లాలో ఇటీవల కొత్తగా ఐదు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వాటికి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే ఒక టి ఏకగ్రీవమైంది. మిగతా నాలుగింటిలో సర్పంచ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. తమకు మద్దతివ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఇందులో అదృష్టం ఎవరిని వరించనున్నదనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ఐదు పంచాయతీలు ఇవే.. ప్రజల విజ్ఞప్తులతో పాటు పాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలో ఐదు పంచాయతీలను ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసింది. ఇందులో ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడ, ఉట్నూర్ మండలంలోని వడ్గల్పూర్, బజార్హత్నూర్ మండలంలోని ఏసాపూర్, తాంసి మండలంలోని అట్నంగూడ, తలమడుగు మండలంలోని పునాగూడ పంచాయతీలు ఉన్నాయి. వీటికి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఎల్లమ్మగూడ, వడ్గల్పూర్–కే జీపీలకు తొలి విడతలో ఈ నెల 11న, అలాగే పునాగూడ, ఏసాపూర్ పంచాయతీలకు ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. అట్నంగూడ ఏకగ్రీవం.. తాంసి మండలంలోని లిమ్గూడ పంచాయతీ పరి ధిలో అనుబంధ గ్రామంగా ఉన్న అట్నంగూడను ప్రభుత్వం ఇటీవల జీపీగా ఏర్పాటు చేసింది. ఇక్కడి సర్పంచ్ పదవీని ఎస్టీ జనరల్గా రిజర్వ్ చేసింది. రెండో విడతలో భాగంగా ఈ నెల 14న ఈ పంచాయతీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ గ్రామస్తులు ఐక్యతను చాటారు. గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ తొలి సర్పంచ్గా సంజీవ్ అనే యువకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. -
ప్రలోభాలు ఘరూ
ముగిసిన మూడోవిడత ఉపసంహరణ.. సాక్షి,ఆదిలాబాద్: ఇన్నిరోజులు ఒక లెక్క.. ఇప్పు డు ఒక లెక్క.. ప్రచారంలో హోరెత్తించిన అభ్యర్థులు ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచా రం మంగళవారంతో ముగిసింది. సాయంత్రం నుంచి వీధులు మూగబోయాయి. ఇక ఓటరును నేరుగా ప్రసన్నం చేసుకోవడమే మిగిలింది. ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. గురువారం పోలింగ్ జరగనుంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27 నుంచి మొదలైంది. 29 వరకు ఆ ఘట్టం ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ త ర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు. గుర్తులు కేటాయించారు. డిసెంబర్ 4 నుంచి మొ దలైన ప్రచారం మంగళవారంతో పూర్తయింది. ఇంటింటి ప్రచారం చేపట్టిన అభ్యర్థులు తమను ఆదరించాలని ఓటర్లను వేడుకున్నారు. ఇక నేరుగా ప్రసన్నం.. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు ప్రచా రానికి ముగింపు పలికారు. ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు ఇవ్వాలని, తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. వారి ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లే పారు. డబ్బులు పంపిణీ మొదలైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రూ.300 నుంచి రూ.500 వరకు, మరికొన్నిచోట్ల రూ.500నుంచి రూ.వెయ్యి వరకు పంచుతున్నారు. మరోవైపు మద్యం పంపకాలు, విందులు జోరందుకున్నాయి. బుధవారం ఒక్కరోజే సమయం ఉండటం, తెల్లవారితే పోలింగ్ ఉండనుండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గెలు పే దిశగా పావులు కదుపుతున్నారు. మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనుండగా, రెండో విడత 14న, మూడోవిడత 17న జరగనున్నాయి. చివరి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ని లిచే అభ్యర్థుల ప్రకటన మంగళవారం పూర్తయింది. మొదటి విడతలో ప్రచారం పూర్తి కాగా, రెండో విడత, మూడో విడతలకు సంబంధించి ప్రచారం ఊపందుకోనుంది.30 పంచాయతీలు ఏకగ్రీవం కైలాస్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. జిల్లాలోని 151 పంచాయతీలు 1,220 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా 30 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో బజర్హత్నూర్లో 5, బోథ్లో 3, నేరడిగొండలో 9, తలమడుగులో 7, గుడిహత్నూర్లో 6 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. -
జట్టు విజయంలో కీలకం
రాథోడ్ రవీందర్–కవిత దంపతుల కుమారుడు ప్రదీప్ ఇప్పటివరకు రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్లో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ఐ అండర్–19 టోర్నీలో జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. గతంలో మహారాష్ట్రలోని సతారాలో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. 2024లో యూపీలోని అయోధ్యలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. మేడ్చల్ వేదికగా నిర్వహించిన జూనియర్ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీల్లో, మహబూబ్నగర్లో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొని మెప్పించాడు. నిజామాబాద్లో నిర్వహించిన 42వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో, పటాన్చెరులో నిర్వహించిన జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలోనూ ఆడియువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాథోడ్ ప్రదీప్ -
24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
కై లాస్నగర్(బేల): బేల మండలంలోని శ్రీ దుర్గా వైన్స్లో ఈనెల 7న జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. మంగళవారం పో లీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎ క్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో చో రీలకు పాల్పడుతున్న టేకం జశ్వ, షిండే అజ య్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేల విలువైన మద్యం, రూ.2లక్షల 40వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో బేల ఎస్సై ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం సమీపంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో సోమవారం ప్రారంభమైన 10వ వింటర్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా హైదరాబాద్ జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు డీటీఎస్వో పార్థసారథి, స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమేష్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీటీఎస్వో మాట్లాడుతూ జిల్లాలో స్విమ్మింగ్ క్రీడాభివృద్ధికి అసోసియేషన్ ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో స్విమ్మర్లు రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిని రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, డాక్టర్ క్రాంతి కుమార్, ఆదిత్య ఖండేశ్కర్, బారే శ్రీధర్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. గ్రూప్ 1 బాలుర విభాగంలో బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు 3 స్వర్ణాలు, 2 రజతాలు, గ్రూప్ 2 లో ఎస్ఎస్.సచిన్ సాత్విక్ 5 స్వర్ణాలు, గ్రూప్ 3లో అర్జున్ కాస్వన్ 5 స్వర్ణాలు, గ్రూప్ 4 విభాగంలో 2 స్వర్ణాలు సాధించారు. బాలికల్లో గ్రూప్ 1 విభాగంలో హర్షిత వర్మ 4 స్వర్ణాలు ఒక రజతం, గ్రూప్ 2లో శివాని కర్ర 5 స్వర్ణ, గ్రూప్ 3 విభాగంలో సంయుక్త 3 స్వర్ణాలు, ఒక రజతం, గ్రూప్ 4 విభాగంలో అడ్డూరి జాగృతి శ్రీనివాసరావు 2 స్వర్ణ పతకాలు సాధించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొమ్ము చరణ్తేజ్ 400 మీటర్ల ఐఎం ఈవెంట్లో, అనిరుధ్ 50 మీటర్ల బెస్ట్స్ట్రోక్ ఈవెంట్లో కాంస్య పతకాలతో మెరిసారు. మొత్తంగా హైదరాబాద్ జిల్లా జట్టు మొత్తం 51 స్వర్ణాలు, 45 రజతాలు, 23 కాంస్య పతకాలతో 266 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్, ద్వితీయస్థానంలో నిలిచిన రంగారెడ్డి 245 పాయింట్లతో 40 స్వర్ణాలు, 41 రజతాలు, 43 కాంస్య పతకాలు సాధించింది. తృతీయస్థానంలో కరీంనగర్, నాలుగో స్థానంలో ఆదిలాబాద్ జట్టు నిలిచాయి. -
అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో తొలివిడత పోలింగ్ ఏర్పాట్లను మంగళవా రం పరిశీలించారు. తాడిహత్నూర్ జెడ్పీఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. నార్నూర్, గాదిగూడలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నార్నూర్ ఎంపీపీఎస్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే గాదిగూడ కేజీబీవీ వసతి గృహం తనిఖీ చేశారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎంపీడీవోలు పుల్లారావు, శ్రీనివాస్, తహసీల్దార్ రాజలింగు తదితరులున్నారు. -
మూడోసారి జాతీయస్థాయి పోటీలకు..
సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రాథోడ్ రితేష్ నాయక్ ఆటలో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నాడు. తల్లిదండ్రులు గోవింద్ నాయక్, వనిత బాయి ప్రోత్సాహంతో క్రీడాపోటీల్లో సత్తా చాటుతున్నాడు. రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మూడోసారి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్లో నిర్వహించిన ఖోఖో పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లో, 2024లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించిన 43వ జూనియర్ నేషనల్ ఈవెంట్లోనూ పాల్గొన్నాడు. వనపర్తిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 రాష్ట్రస్థాయి పోటీల్లో, నిజామాబాద్లో నిర్వహించిన 42వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో ప్రతిభ కనబర్చాడు. 2023లో వరంగల్లో నిర్వహించిన సీనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో, ఈ ఏడాది నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. రాథోడ్ రితేష్ నాయక్ -
ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం
కై లాస్నగర్: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో రెండు, మూడోవిడత ఎన్నికల స్టే జ్–2 రిటర్నింగ్ అధికారులకు సోమవారం శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మో డల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఓటుహక్కు వినియో గం కోసం 18 రకాల గుర్తింపు పత్రాలు ఉన్నాయని, వాటిలో ఏదైనా ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకువచ్చేలా ఓటర్లకు అవగాహన కల్పించా లన్నారు. ఇందులో స్థానికసంస్థల అదనపు కలె క్టర్ రాజేశ్వర్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి మ నోహర్, డీపీవో రమేశ్, డిఎల్పీవో ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ విధానం పరిశీలన.. ఇంద్రవెల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు.మండలకేంద్రంలోని ఎంపీడీవో కా ర్యా లయాన్ని సోమవారం సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానం పరిశీలించారు. అ నంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అధికా రులకు పలు సూచనలు చేశారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, ఆర్వోలు,పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలిఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పీవో యువరాజ్ మర్మాట్తో కలసి కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎంపీడీవో రాంప్రసాద్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. వాటిని స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీసు అధికారులకు ఆయన ఫోన్ ద్వారా సూచనలు జారీ చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు గెలిచినా మనోళ్లే!
కై లాస్నగర్: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు ఆశిస్తూ ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురేసి అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా ఏళ్లుగా ఆయా పార్టీ జెండాలను మోసిన వారే కావడం గమనార్హం. అలాంటి వారికి రిజర్వేషన్ కలిసి రావడంతో సర్పంచ్గా ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. పార్టీల మద్దతును ఆశిస్తున్నారు. మొదటి, రెండో విడత ఎన్నికలకు సంబంధించిన గుర్తులు కూడా ఖరారు కావడంతో ఇంటింటి ప్రచారం ముమ్మురం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఆశీర్వదిస్తే ముఖ్యనేతల అండతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గెలిపించాలని వేడుకుంటున్నారు. -
బహుముఖ పోటీ
సాక్షి,ఆదిలాబాద్: ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ.. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం ఏకంగా 15 మంది బరిలో ఉన్నారు.. 12,622 మంది ఓటర్లు ఉండగా, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఓట్ల చీలికపై పోటీదారుల్లో బెంగ కనిపిస్తుంది. ఓటర్ నాడీ పట్టలేక సతమతం అవుతున్నారు. ప్రచారాన్నే నమ్ముకొని ముందుకు కదులుతున్నారు. మరోవైపు నార్నూర్ మండలం నాగల్కొండలో 1,419 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇలా మొదటి విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో పలుచోట్ల బహుముఖ పోటీ కనిపిస్తుంది. మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న ఎస్టీ రిజర్వుడ్ అయిన నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో జరగనున్నాయి. మొత్తం 166 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 33 చోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా 133 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 525 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇద్దరే అభ్యర్థులు.. మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో పదుల సంఖ్యల గ్రామాల్లో ఇద్దరే అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ పరిణామం అధికార కాంగ్రెస్కా.. లేనిపక్షంలో బీజేపీ, బీఆర్ఎస్లకు లాభిస్తోందా అనేది వేచిచూడాల్సిందే. కాగా, కొన్నిచోట్ల అనధికారిక పొత్తులే ఇలాంటి పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. త్రిముఖం.. చతుర్ముఖం పలుచోట్ల త్రిముఖం, చతుర్ముఖ పోటీ కనిపిస్తుంది. అలాంటి చోట్ల ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థు లే బరిలో ఉన్నారు. ఆయా చోట్ల అభ్యర్థులు తమ ను ఏ పార్టీ బలపర్చిందో స్పష్టంగా చెబుతూ బ రి లోకి దిగుతున్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉంటా యనేది ఆసక్తికరంగా మారింది. నేరుగా పార్టీ కండువా వేసుకొని ప్రచారంలో కదులుతున్నారు. అ యితే ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారో చూడాల్సిందే.తొలివిడత ఎన్నికలు జరిగే మండలాల్లో పరిస్థితి ఇలా..మండలం మొత్తం పోటీ నెలకొన్న ఇద్దరు ముగ్గురు నలుగురు అంతకంటే జీపీలు జీపీలు అభ్యర్థులు అభ్యర్థులు అభ్యర్థులు ఎక్కువ అభ్యర్థులు ఇచ్చోడ 33 28 05 10 07 06 సిరికొండ 18 11 03 03 03 02 ఇంద్రవెల్లి 29 25 06 06 02 11 ఉట్నూర్ 38 31 07 06 06 12 నార్నూర్ 23 17 05 00 07 05 గాదిగూడ 25 21 05 00 10 06 మొత్తం 165 133 31 25 35 42 -
జీపీవోల నూతన కార్యవర్గం
కైలాస్నగర్: గ్రామ పరిపాలన అధికారుల (జీ పీవో) సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గెస్ట్హౌస్లో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఇందూర్ గంగన్న, ప్రధాన కార్యదర్శిగా అయ్యూబ్, ఉపాధ్యక్షులుగా సాయి, సలీం, అ సోసియేట్ అధ్యక్షుడిగా శ్రీధర్, కోశాధికారిగా వామన్, మహిళా అధ్యక్షురాలిగా అనసూయ, ఉపాధ్యక్షురాలిగా సువర్ణ, ప్రధాన కార్యదర్శిగా అహల్య, సహాయకార్యదర్శులుగా నరేశ్కుమార్, పులి స్వామి, కార్యవర్గ సభ్యులుగా పురుషో త్తం, శంకర్, అరుణ్, వినోద్, అక్షయ్, రమేశ్, అరవింద్, జ్యోతి ఎన్నికయ్యారు. -
● 8 డిగ్రీలకు చేరువైన కనిష్ట ఉష్ణోగ్రత ● వణికిస్తున్న శీతలగాలులు ● చిన్నారులు, వృద్ధులకు తప్పని తిప్పలు
కై లాస్నగర్: జిల్లాపై చలిపంజా విసురుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. రెండు రోజులుగా 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్గా న మోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం గజగజ వణికిపోతున్నారు. శీతలగాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏజెన్సీ, అటవీప్రాంతాల్లోని పల్లెలు, పంట పొలాలపై మంచు దుప్పటి కప్పేస్తోంది. ఉదయం 10 దాటినా సూర్యుడు బయటకు రాని పరిస్థితి. పొగమంచు రహదారులను కమ్మేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో సైతం లైట్లు వేసుకుని ప్ర యాణంచాల్సి వస్తోంది. వేకువజామున పనులకు వెళ్లే కూరగాయాలు, పాల విక్రేతలు, పేపర్బా య్స్, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ కా ర్మికులు చలితీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. శీతల గాలుల ప్రభావంతో చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులకు అవస్థలు తప్పని పరిస్థితి. సా యంత్రం ఆరు దాటిందంటే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బయట కు వెళ్లే వారు స్వెట్టర్లు, ఇతర రక్షణ కవచాలు ధ రిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో గ్రామాల్లో జ నం చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నా రు. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిమంట కాగుతున్న యువకులు జిల్లాలో భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో 8డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బజార్హత్నూర్లో 8.5, బోథ్ మండలం పొచ్చెరలో 8.7, సాత్నాలలో 8.8, తాంసి, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరి, బేల, చెప్రాలలో 9.1, సొనాలలో 9.3, గాదిగూడ మండలం లోకారి, తలమడుగులో 9.4, ఆదిలాబాద్ అర్బన్లో 9.5, తలమడుగు మండలం భరంపూర్లో 9.7 మావలలో 9.8, నేరడిగొండలో 9.9, ఇచ్చోడలో 10 డిగ్రీలుగా నమోదైంది. -
డీఎంఈ పరిధిలోకి ‘వెల్నెస్’
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, జర్నలిస్టులకు నగదురహిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం 2019లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వైద్యులు, మందుల కొ రతతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకనుంచి ఆ స మస్యలకు చెక్ పడనుంది. ఇది వరకు వెల్నెస్ సెంటర్లు ఆరోగ్యశ్రీ సీఈవో పరిధిలో కొనసాగేది. ఇక నుంచి డైరెక్టర్ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వచ్చాయి. జిల్లాలో రిమ్స్ నుంచి వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందిన ఉత్తర్వులు.. ఈ మేరకు డీఎంఈ నుంచి రిమ్స్ డైరెక్టర్కు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి వెల్నెస్ సెంటర్ను తమ పరిధిలోకి తీసుకొని సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పెన్షనర్లు, ఉద్యోగులు, జర్నలిస్టులు కలిపి దాదాపు 6వేల మంది వరకు ఉంటారు. వెల్నెస్ సెంటర్కు వెళ్లినా వైద్యసేవలు అందక తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం. పెన్షనర్లకు బీపీ, షుగర్ తదితర మందులు లేక ఇబ్బందులు పడ్డారు. ఇకనుంచి ఆ అవస్థలు తీరనున్నట్లు తెలుస్తోంది. ఇక ‘స్పెషల్’ సేవలు.. వెల్నెస్ సెంటర్లో ప్రస్తుతం ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులకు గాను ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. ఇద్దరు డెంటిస్టులకు గాను ఒకరు సెలవులో ఉండగా, ఒకరు పనిచేస్తున్నారు. ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక నుంచి ఈ సెంటర్లో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డెంటల్, గైనిక్, చిల్డ్రన్ స్పెషలిస్టులు, ఇతర వైద్యుల ద్వారా సేవలు అందించనున్నారు. దీంతోపాటు రోగనిర్ధారణ పరీక్షలు సైతం చేపట్టనున్నారు. ప్రతిరోజు వెల్నెస్ సెంటర్కు 100 నుంచి 200 మంది వస్తున్నారు. స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో చాలా మంది ఇక్కడ వైద్యసేవలు పొందలేక పోతున్నారు. ఈ సేవలు ప్రారంభిస్తే వెల్నెస్ సెంటర్ కిటకిటలాడనుంది. మెరుగైన వైద్యసేవలు అందిస్తాం.. ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లకు వెల్నెస్ సెంటర్లో వైద్యసేవలు అందించడం జరుగుతుంది. ఇదివరకు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండగా, వారం క్రితం డీఎంఈ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. రిమ్స్ ద్వారా వెల్నెస్ సెంటర్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. స్పెషలిస్ట్ వైద్యులను నియమిస్తాం. మందుల కొరత, ఇతర ఇబ్బందులు లేకుండా చూస్తాం. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
మండలానికో బెస్ట్ స్కూల్
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు ముందుకు సాగుతోంది. మండలానికి ఒక బెస్ట్ స్కూల్ను ఏర్పాటు చేసి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాలు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాగా, అందులో జిల్లా ఉన్నట్లు విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ప్రాథమికస్థాయి నుంచి ఇంటర్ వరకు ఇందులో విద్యాబోధన అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఒకే ఆవరణలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్న వాటిని ఎంపిక చేశారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. మండలానికి ఒకటి చొప్పున విద్యార్థుల సంఖ్య ఎ క్కువగా ఉన్న పాఠశాలలు, అన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, పక్కా భవ నం, క్రీడా మైదానం ఉన్నవాటిని ఈ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు విద్యా శాఖాధికారులు జిల్లాలోని 19 ఉన్నత, మూడు ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఉత్తర్వులు అందగానే అందులో అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే పదో తరగతి పూర్తయిన తర్వాత గ్రామాల్లో బాలికలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల డ్రాపౌట్గా మిగులుతున్నారు. దీన్ని తగ్గించేలా యంత్రాంగం దృష్టి సారిస్తోంది. ఎంపికై న పాఠశాలలు ఇవే.. భీంపూర్ మండలంలోని యూపీఎస్ భీంపూర్, జైన థ్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ కూర, బేల మండలంలోని యూపీఎస్ ఉర్దూ మీడియం, గాదిగూడలోని యూపీఎస్ లోకారి(బి), నార్నూర్లోని జెడ్పీహెచ్ఎస్ భీంపూర్, ఇంద్రవెల్లిలోని ధనోర(బి), గుడిహత్నూర్లోని గుడిహత్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆదిలాబాద్రూరల్ మండలంలోని భీంసరి, ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మావలలోని జెడ్పీఎస్ఎస్ మావ ల, తాంసి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశా ల, తలమడుగులోని సుంకిడి, బజార్హత్నూర్లోని జెడ్పీఎస్ఎస్, బోథ్లోని ధనో ర(బి), నేరడిగొండ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్, ఇచ్చోడలోని జెడ్పీఎస్ఎస్ ఉర్దూ మీడి యం, సిరికొండ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్, ఉట్నూర్లోని శ్యాంపూర్, భోరజ్లోని గిమ్మ(కె), సాత్నాలలోని అడ, సొనాలలోని జెడ్పీఎస్ఎస్లు ఎంపికయ్యాయి. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను అధ్యక్షుడు సాయిని రవికుమార్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక ధారుడ్యం పెంపొందుతుందన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలపై దృష్టి సారిస్తే గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఐదు గ్రూపుల్లో పోటీల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.అంతకుముందు రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను డీటీఎస్వో పార్థసారథి పరిశీలించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, శ్రీధర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
ఆదిలాబాద్రూరల్: ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని చాందా(టి), జందాపూర్ సమస్యాత్మక గ్రామాలను ఆదివారం ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీ లించారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని వేలం ద్వారా నిర్ణయించడం చట్టరీత్యా నేరమని అ న్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూ చించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఆయన వెంట డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది ఉన్నారు. తాంసి: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలో ని కప్పర్ల గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రా మస్తులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఆయన వెంట తాంసి, తలమడుగు, రూరల్ ఎస్సైలు జీవన్రెడ్డి, రాధిక, విష్ణు ఉన్నారు. జైనథ్: ఎన్నికల నేపథ్యంలో స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎస్పీ ఓటర్లతో మా ట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పా టించాలన్నారు. వారి వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ శ్రవణ్కుమార్, ఎస్సై గౌతమ్, తదితరులున్నారు. -
ఓటరు.. బీ కేర్ ఫుల్!
బోథ్: ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు బంధుత్వాలు కలుపుతూ.. ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే గుడ్డిగా నమ్మి ఓటేయద్దు. వారి గుణగణాలను పరిశీలించాలి. పాలనలో సామర్థ్యాన్ని అంచనా వేయాలి. లేకుంటే సీన్ రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ రోజు మందు, డబ్బులు పంపిణీ చేసిన వారిని గెలిపిస్తే రేపు వాళ్లు చేయాల్సిన పనులకు సైతం రేట్లు నిర్ణయిస్తారు. ఇంతకు చాలా రెట్లు అధికంగా వసూలు చేస్తారనే విషయం మరువొద్దు. ఆలోచించండి.. నిర్ణయం తీసుకోండి పంచాయతీ ఎన్నికలనేవి పల్లె ప్రగతికి ప్రాతిపదిక. అందుకే తాత్కాలిక పలకరింపులు, డబ్బు, మద్యం ప్రలోభాలకు గురికావొద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటు వేసే ముందు ప్రధానంగా ఈ అంశాలు గమనించాలి. ‘అక్క.. బావ లేడా.. ఎటుపో యిండు.. అల్లునికి ఓటుంది కదా.. అత్తమ్మ.. మామయ్యవి కలిపి ఐదోట్లు మనకే పడాలే.. మీకేం కావాలన్నా చేసి పెడతా.. సాయంత్రం బావతో మాట్లాడుతా..’ అంటూ ఓ అభ్యర్థి ఇంటింటి ప్రచారం సాగుతుందిలా. ‘తమ్మీ.. మన దగ్గర ఎంత మంది ఉన్నరు.. యూత్ అందరినీ సాయంత్రం పిలువు.. ఓ కాడ కూకుండవెట్టు.. వాళ్లను చిల్డ్ చేద్దాం.. వాళ్లకేం కావాల్నో అడు గు.. ఇచ్చేద్దాం.. నిన్ను నేను చూసుకుంటా.. నువ్వు నా రైట్ హ్యాండ్ లెక్క.. గెలిచినంక ఏ పని కావాలన్నా చేసే బాధ్యత నాది..’ అంటూ మరో అభ్యర్థి యూత్ ఓట్ల కోసం గాలం వేస్తున్నాడు. -
టూరిజం అభివృద్ధికి చర్యలు
ఆదిలాబాద్ టౌన్: అటవీ సంపద వృద్ధి, టూరి జం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ట్లు రాష్ట్ర అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జోహా రి తెలిపారు. అటవీ ప్రాంతాలను పరి శీలించేందుకు జిల్లాలో పర్యటించిన ఆయన శనివా రం అటవీశాఖ గెస్ట్ హౌస్లో మీడియాతో మా ట్లాడారు. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పరి ధిలో టైగ ర్ జోన్ ఏర్పాటుకు పలు గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. పులుల సంరక్షణ, ఎకో టూరి జాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నా రు. అటవీ ప్రాంతంలో లక్కను ప్రోత్సహిస్తూ స్థానికులు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అటవీ సరిహద్దుల రక్షణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. బాసర జోన్లోని కవ్వాల్ టైగర్ అభివృద్ధికి ఇన్చార్జీగా తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ ప్రాంతంలో పులుల రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. డీఎఫ్వో ప్రఽశాంత్ బాజీరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లన్నీ మనకే పడాలే..
కై లాస్నగర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ఏ ఊరికెళ్లినా గ్రామ రాజకీయాలపైనే చర్చ నడుస్తోంది. తొలి, మలి విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు ఖరారు కావడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నిన్న, మొన్నటి వరకు చూసీచూడనట్లు పట్టించుకోకుండా వెళ్లిన వారు ప్రస్తుతం ఓటర్లను ఆపి మరీ పలకరిస్తున్నారు. లేని పోని ప్రేమలు ఒలకబోస్తూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. తమను సర్పంచ్గా గెలిపిస్తే మీరు అడిగిన పనులన్నీ చేసి పెడుతామని హామీ ఇస్తున్నారు. ఇంట్లోని ఓట్లన్నీ వేయాలని కోరుతున్నారు. అందుకు ఏం చేయమన్నా చేస్తామని నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టి ప్రచారం జో రుగా సాగిస్తే గెలుపు సునాయసమవుతుందనే ఉద్దేశంతో వారిని మందు, విందులతో ముంచెత్తుతున్నారు. అందుకు అవసరమైన డబ్బులను ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపిస్తున్నారు. క్రీడా కిట్లు అందిస్తున్నారు. విహారయాత్రలకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చులన్నింటినీ సమకూర్చుతామని వారిని మచ్చిక చేసుకుంటున్నారు. మహిళల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటే ఆ ఇంట్లోని ఓట్లన్నీ మనకే వస్తాయనే ధీమాతో వారి అనుగ్రహం కోసం ఆరాటపడుతున్నారు. అలాగే తమతమ సామాజికవర్గాల ఓటర్ల పై గురి పెడుతున్నారు. గంపగుత్తగా ఓట్లు రాబట్టుకుంటే గెలుపు ఖాయమనే భావనతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో పలుకుబడి కలిగిన పెద్ద మనుషులను మధ్యవర్తులుగా ఉంచి తమ సామాజిక ఓటర్లకు గాలం వేస్తున్నారు. వారికి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓట్లన్నీ పడాలంటూ వారడిగినంత ముట్టజెబుతున్నారు. ఆలయాలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు తమవంతు ఆర్థిక చేయూతనందిస్తున్నారు. తమను గెలిపిస్తే భవిష్యత్లో ఏం కావాలన్నా చేసి పెడతామని భరోసానిస్తున్నారు. ఇలా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా తమ చేతిచమురు వదిలించుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు బరిలో ఉంటామని చెబుతూ వచ్చిన అభ్యర్థులు గుర్తులు ఖరారు కావడంతో వాటిని ఓటర్ల వద్దకు చేర్చి, వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబీకులూ గ్రామంలోని ప్రతీ ఇంటిని పలుసార్లు సందర్శిస్తూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓట్లు ఏ విధంగా రాబట్టుకోవాలి, ఎవరి మద్దతు కూడగడితే మెజార్టీ ఓట్లు తమకు వస్తాయంటూ జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. దీంతో పల్లెల్లో పంచాయతీరాజకీయ ప్రచారపర్వం జోరుగా సాగుతోంది. -
హోంగార్డుల సేవలు కీలకం
ఆదిలాబాద్ టౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. 63వ హోంగార్డు రైజింగ్డేను పురస్కరించుకుని శనివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పరేడ్ కమాండర్ భూమన్న ఆధ్వర్యంలో మహిళా సిబ్బందితో కూడిన మూడు ఫ్లాటూన్ల జిల్లా హోంగార్డు బృందం పరేడ్ నిర్వహించి ఎస్పీకి గౌరవవందనం చేశారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16మంది హోంగార్డులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఉలెన్ జాకెట్లు, రెయిన్కోట్లు అందజేశారు. విధి నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, శ్రీకాంత్, హోంగార్డ్ ఆర్ఐ చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్లు రాకేశ్, గబ్బర్సింగ్, ఆశన్న, హోంగార్డు సిబ్బంది సురేందర్ తదితరులు పాల్గొన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో హెచ్చరించా రు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. జిల్లా అంతటా 30పోలీస్ యాక్ట్ అమలు లో ఉందని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో గొడవలు వద్దు బోథ్: పంచాయతీ ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా నిర్వహించేలా నాయకులు, గ్రామస్తులు సహకరించాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ సూచించారు. శనివారం సొనాల, బోథ్ మండల కేంద్రాలతోపాటు మండలంలోని కౌఠ బీ, కనుగుట్ట, ధన్నూర్ బీ గ్రామాల్లో శనివారం సా యంత్రం పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాల ను పరిశీలించారు. ఎన్నికలను వేలం ద్వారా దక్కించుకోవడం చట్టరీత్య నేరమని హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు. ఏదైన సమస్య ఉంటే ‘డయల్ 100’కు ఫోన్ చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. డీఎస్పీ జీవన్రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, బోథ్ ఎస్సై శ్రీసాయి, బజార్హత్నూర్ ఎస్సై సంజయ్కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
● సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తుల ఆదర్శం ● నిత్యం ప్రజలతో ఉండేవారికే అందలం ● గతంలో ఓడిన అభ్యర్థులకూ అవకాశం ● ఆయా గ్రామాల్లో ఓటర్ల సమష్టి నిర్ణయం
సాక్షి, ఆదిలాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్ని కల్లో జిల్లాలో ఇప్పటికే పలువురు సర్పంచులు, వా ర్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రత్యేకత చాటారు. ఆ గ్రామ అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ ఆదర్శంగా ముందుకు కదిలారు. నిత్యం ప్రజ లతో మమేకమై ఉండే వ్యక్తులు, సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారం చూపే చొరవ ఉన్నవారిని కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వారికి అండగా నిలుస్తూ ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకుని వారిని అందలమెక్కించారు. ఓ పంచా యతీ పరిధిలో అనుబంధ గ్రామాలుండగా, గతంలో ఓ గ్రామానికి సర్పంచ్ పదవి కట్టబెట్టిన గ్రామస్తులు.. ప్రస్తుతం మరో గ్రామానికి పదవి అప్పగి స్తూ ఒప్పందం ప్రకారం నడుచుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో అభివృద్ధి సమపాళ్లలో జరగనుండడంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో 33 స్థానాలు.. మొదటివిడతలో ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏకగ్రీవ సర్పంచుల స్పష్టత వచ్చింది. మొదటి విడతలో 33 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నా ర్నూర్ మండలంలో ఆరు, ఇచ్చోడలో ఐదు, గాది గూడలో నాలుగు, ఇంద్రవెల్లిలో నాలుగు, సిరికొండలో ఏడు, ఉట్నూర్ మండలంలో ఏడు సర్పంచ్ సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పుడు అటు.. ఇప్పుడు ఇటు ఇచ్చోడ మండలం దేవుల్నాయక్ తండా సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా రాథోడ్ లలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కిందటి ఎన్నికల్లో రాథోడ్ లలిత ఎన్నికల్లో పోటీ చేసి రాథోడ్ భీంబాయి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. గ్రామస్తులు మాత్రం ఈసారి ఆమైపె నమ్మకం చూపెడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ప్రత్యేకత చాటారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయిన ఆమైపె ఆదరణ చూపెట్టడం ద్వారా గ్రామస్తులు విలువలు కలిగిన రాజకీయాలను చాటారు. ముచ్చటగా మూడోసారి.. అప్పుడు ఓడిపోవడంతో.. గ్రామ రాజకీయాల్లో ఇదో ఔన్నత్యం. సాధారణంగా మనకు దగ్గరగా నివసించే వ్యక్తి సమస్యలు పరిష్కారిస్తారని, ఇక్కడే అభివృద్ధి పనులు చేపడతారని జనాలు నమ్మకం పెట్టుకుని ఆదరించడం చూస్తుంటాం. గతంలో గ్రామంలో ఒక వైపు నివసించే వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటే ఆ సమయంలోనే వచ్చే ఎన్నికల్లో మరోవైపు నుంచి వ్యక్తిని ఆదరిస్తామని ఒప్పందం చేసుకోవడం, దానికి అనుగుణంగా మాట నిలుపుకొని ఈ ఎన్నికల్లో ఆచరించడం గ్రామస్తులకే సాధ్యం. అలాంటిదే ఈ ఏకగ్రీవాలకు నిదర్శనం. ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా సర్పంచ్గా ఈసారి ఆత్రం అనితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమె ఆ గ్రామంలోని అనుబంధ గ్రామమైన చింతగూడకు చెందిన మహిళ. కిందటి సారి గట్టెపల్లికి చెందిన కుమ్ర మోహన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం మరోవైపు నివసించే వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. సమక గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్కు కేటాయించగా, సర్పంచ్గా ఈసారి కుమ్ర రాజేశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో సమకకు చెందిన సోయం రంభబాయిని సర్పంచ్గా ఎన్నుకోగా, అప్పుడే మరోవైపు ఉండే పాఠగూడకు చెందిన వారికి అవకాశం కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నారు. దానికి అనుగుణంగా ముందుకు కదిలారు. గ్రామంలో ఈ ఆదర్శ రాజకీయాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. -
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
కైలాస్నగర్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతా రణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు, జోనల్ అధి కారులకు శిక్షణ ఇవ్వగా కలెక్టర్ హాజరై మాట్లాడా రు. సూక్ష్మ పరిశీలకులు పంచాయతీ పరిధిలోని వా ర్డులను పరిశీలించాలని తెలిపారు. 28కాలం ప్రొఫా ర్మాను విధిగా నింపాలని, పోల్ డే రోజు వివరాలు ఎప్పటికప్పుడు తెలుపాలని సూచించారు. జోనల్ అధికారులకు 9నుంచి 10పోలింగ్ కేంద్రాలు కేటా యించనున్నట్లు తెలిపారు. తన పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ పక్కాగా అమలు జరిగేలా చూడాలని సూచించారు. ఎస్ఎస్టీ, ఎ ఫ్ఎస్టీ బృందాలతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను కలిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని తెలిపారు. ఫొటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, అభ్యర్థులు ఖర్చుల వివరా లు సంబంధిత అధికారులకు పంపేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు వెంకన్న, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా శిక్షణ నోడల్ అధికా రి మనోహర్, డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణీందర్రావు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా నియమావళి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినవారు విజయోత్సవ ర్యాలీలు, ప బ్లిక్ మీటింగులు నిర్వహించరాదని తెలిపారు. ప్రకటనలు, అభివృద్ధి హామీలు చేయరాదని పేర్కొన్నా రు. ఇలాంటి చర్యలను తక్షణమే నిరోధించాలని రి టర్నింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపా రు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంట నే సంబంధిత ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు మండలాల విధుల కేటాయింపునకు జెడ్పీ సమావేశ మందిరంలో రెండో విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎన్నికల సాధారణ పరిశీలకుడు వెంకన్న ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి ఆదిలాబాద్రూరల్: అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సాంఘిక సంక్షేమ కార్యాలయ ఆవరణలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటం, విగ్రహాలతోపాటు మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావు, దళితాభివృద్ధి శాఖ అధికారి సునీతాకుమారి తదితరులున్నారు. -
రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శం
ఆదిలాబాద్రూరల్: అంబేడ్కర్ రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శమని ఎంపీ గోడం నగేశ్, ఎ మ్మె ల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వ ర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహంపై పూలు చల్లి నివాళులర్పించారు. బౌద్ధ వందనం స్వీకరించి పంచశీల జెండా ఆవిష్కరించారు. సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరం పోస్టర్ ఆ వి ష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు కదలాల్సిన అవసరముందని తెలిపా రు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు భీంరావ్ వాఘ్మరే, ప్రధాన కార్యదర్శి దాదాసాహెబ్ జాబడే, భారతీయ బౌద్ధ మహా సభ నేత కాంతారావ్, మాతా రమాబాయి, మహిళా సంఘం అధ్యక్షురాలు దయశీల ఉకే, సభ్యులు కుష్వర్త బాయి లాంగ్డే, నీలాబాయి తదితరులు పాల్గొన్నారు. -
‘సీఎంను ఎందుకు పొగుడుతున్నవ్’
ఆదిలాబాద్ టౌన్: రాష్ట్ర బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే, ఎమ్మె ల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్రెడ్డిని ఎందుకు పొగుడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ప్రశ్నించా రు. ఎమ్మెల్యే వైఖరిని బీజేపీ నేతలే విమర్శిస్తున్నారని ఆరోపించారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఎమ్మెల్యే తనపై చేసిన వ్యాఖ్యలు ఖండించారు. హైదరాబాద్లో కార్యాలయం ప్రారంభించి ఢిల్లీలో పైరవీలు చేస్తున్న విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ శ్రేణులతో చ ర్చించారని, ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరనే విష యం ఆ పార్టీ నేతలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పరిశ్రమలు స్థాపించి యువతకు ఉ ద్యోగాలిప్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుతం పరిశ్రమను ప్రైవేట్ పరం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్ర శ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ కౌ న్సిలర్లు, స్థానిక నేతలను ఎమ్మెల్యే నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని, కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
ఆదిలాబాద్టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో యూనియ న్ రాష్ట్ర ఐదో మహాసభల పోస్టర్లను శుక్రవా రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 7 నుంచి 9 వరకు మెద క్ పట్టణంలో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గిమల్ల స్వామి, సహాయ కార్యదర్శులు సురేందర్, పొచ్చన్న, నగేశ్, స్వామి, రాకేష్, సురేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘అభివృద్ధిని జీర్ణించుకోలేకే అసత్య ఆరోపణలు’
ఆదిలాబాద్: నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని జీర్ణించుకోలేకనే మాజీ మంత్రి జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రగతి గురించి సీఎం రేవంత్రెడ్డిని కలిస్తే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి అడుగులు పడడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరవ్వడం వంటివి జరిగితే ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం సరి కాదన్నారు. గతంలో యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్కు ఇతర జిల్లాలకు తరలిపోతుంటే అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేకపోయారని దుయ్యబట్టారు. సమావేశంలో నాయకులు రఘుపతి, రవి, దినేష్ మటోలియా, జ్యోతి, రాకేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
నేరడిగొండ/తలమడుగు/బజార్హత్నూర్/బోథ్: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధి కారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వెంకన్న అన్నారు. నేరడిగొండ, తలమడుగు, బజార్హత్నూర్, బోథ్, సొ నాల మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. నేరడిగొండ ఎంపీడీవో కార్యాలయంలో భద్రపర్చిన ఎన్నికల సామగ్రిని తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ‘టిపోల్’ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవోలు శేఖర్, శంకర్, ఆర్వో పవన్, ఏఆర్వో గంగయ్య తదితర సిబ్బంది తదితరులున్నారు. -
నేల సంరక్షణ అందరి బాధ్యత
ఆదిలాబాద్టౌన్: నేల సంరక్షణ అందరి బాధ్య త అని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై.ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదిలా బాద్ వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పరిశోధన స్థానం, సీపీఎఫ్ ఎన్జీవో సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ నేలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సారవంతమై న, కాలుష్యం లేని నేలను అందించాలంటే ర సాయనాల అధిక వాడకాన్ని తగ్గించి, నేలలో కరగని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించాలన్నా రు. ఇందులో వ్యవసాయ పరిశోధన స్థానం ప్ర ధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్, హెచ్వోడీ డాక్టర్ జి.మంజులత, కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త రాజశేఖర్, సీపీఎఫ్ ఎన్జీవో ప్రతినిధి సుదర్శన్, జి.అనిత, డి.కుమారస్వామి, సుధాన్షు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
● పోలింగ్ సాఫీగా సాగేలా చర్యలు ● జిల్లాలో 50 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ● 64 కేంద్రాల్లో మైక్రోఅబ్జర్వర్స్
కై లాస్నగర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో తలెత్తిన ఘటనల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 229 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఆయా కేంద్రాలపై జిల్లా అధికారులు నిరంతరం నిఘా ఉంచేలా వెబ్కాస్టింగ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు సాగుతోంది. ప్రశాంత పోలింగ్ లక్ష్యం... జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మకమైన 102 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్ను నియమించనున్నారు. బ్యాంకు, రైల్వే, పోస్టల్శాఖల ఉద్యోగులను ఎంపిక చేశారు. వారికి శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే మరో 127 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఉన్నతాధికారులు ఆయా కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ తీరును పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షించే సిబ్బందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు. విడతల వారీగా ఇలా.. ఎన్నికలు సాఫీగా సాగేలా చర్యలు గతంలో స్థానిక ఎన్నికలు జరిగిన సమయంలో గ్రామాల్లో తలెత్తిన సంఘటనల ఆధారంగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశాం. అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా నిర్వహించేలా వెబ్ కాస్టింగ్తో పాటు మైక్రోఅబ్జర్వర్స్ను నియమిస్తున్నాం. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నాం. ఎన్నికలు సాఫీగా సాగేలా చర్యలు చేపడుతున్నాం. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
‘సీసీఐని ప్రైవేట్ పరం చేసే కుట్రలు’
ఆదిలాబాద్టౌన్: సీసీఐని ప్రైవేట్ పరం చేసే కుట్ర లను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్తో ఎమ్మెల్యే శంకర్ చే తులు కలిసి సీసీఐ పరిశ్రమను ప్రైవేట్కు అప్పగించే దిశగా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీసీఐ పునరుద్ధరణ కో సం కేటీఆర్తో వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవ సభల పేరిట మోసపూరిత కా ర్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ విజయోత్సవ సభలను విమర్శిస్తుంటే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేశంకర్ మాత్రం సీఎంను పొగడ్తలతో ముంచెత్తడం రెండు పార్టీల మధ్య ఉన్న కుట్ర ను బట్టబయలు చేస్తోందన్నారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు ప్రహ్లాద్, సాజితోద్దీన్, రమేశ్, జగదీష్, శ్రీని వాస్, ప్రశాంత్ తదితరులున్నారు. -
అలాగెలాగ..!
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధి లోని ఆదిలాబాద్రూరల్ మండలంలో గల ఓ గ్రా మపంచాయతీకి ఎస్టీ (జనరల్) రిజర్వేషన్ ఖరారైంది. ఇక్కడ మొదటి నుంచి మూడు ప్రధాన పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించాలని యోచించాయి. రెండో విడతలో ఈ పంచాయతీలో ఎన్నికలు ఉండగా, ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఉపసంహరణ ప్రక్రియ నేడు ఉంటుంది. ఇక్కడ రెండు కంటే ఎక్కువ నామినేషన్లు దాఖ లైనప్పటికీ ఓ ఇద్దరు అభ్యర్థులు తమకు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో ఏదైన పొరపాటు జరిగి తిరస్కరణకు గురవుతుందనే ఆలోచనతో తమ సంబంధికులతోనే బినామీగా నామినేషన్లు వేయించా రు. స్క్రూటీని పూర్తికాగా ఆ నామినేషన్లు అలాగే నిలిచినప్పటికీ ఉపసంహరణలో ఆ ఇద్దరు మాత్ర మే చివరికి బరిలో నిలుస్తారనేది ఆ గ్రామంలో ఇప్పుడు చర్చ సాగుతోంది. బినామీలు తమ నామి నేషన్లను పసంహరించుకుంటారనేది ప్రచా రం జరుగుతుంది. ఇద్దరు మాత్రమే బరిలో నిలుస్తుండగా, ఓప్రధానపార్టీకి తాము బలపరిచే అభ్యర్థి ప్రత్యేకంగా లేకపోవడంతో కంగు తినాల్సి వచ్చింది. ఈ గ్రామంలో అనధికారిక పొత్తులు చేసుకొని రెండు పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని సమర్థిస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రధాన పార్టీ సందిగ్ధంలో పడింది. అనధికార పొత్తులు.. గ్రామాల్లో అనధికారిక పొత్తులు ప్రధాన పార్టీలకు తలనొప్పి తెచ్చి పెడుతుంది. జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీల నుంచి బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందించాయి. తాము అనుకున్నది ఒకటైతే.. అక్కడ మరో లా జరిగిపోవడంతో చివరికి తమ ప్రాతినిధ్యానికే ఎసరు వస్తుందనే యోచనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతోనేనా.. గ్రామాల వారీగా పార్టీ బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించే విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం కొన్ని గ్రామాల్లో ఇప్పుడిప్పుడు బయట పడుతుండడంతో పార్టీ ఇన్చార్జీలు కంగు తినాల్సిన పరి స్థితి ఏర్పడుతుంది. అలాంటిదే ఆదిలాబాద్ రూర ల్ మండలంలోని ఓ గ్రామంలో తేటతెల్లం కావడంతో ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఓ పార్టీకి అక్కడి పొత్తు కారణంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇది ఆ ఒక్క గ్రామపంచాయతీ అని కాకుండా పలు పంచాయతీల్లో బయటకొస్తుండడంతో ఆయా పార్టీల కు తలనొప్పిగా మారాయి. ఇది పరిస్థితి.. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం చివరిదైన మూడో విడతకు సంబంధించి శుక్రవారంతో పూర్తయింది. ఇక నామినేషన్ల పరిశీలన పరంగా మొదటి, రెండో విడతలు పూర్తి కాగా, శనివారంతో మూడో విడత కూడా పూర్తి కానుంది. ఉపసంహరణ ఘట్టం రెండో విడతకు సంబంధించి శనివారం పూర్తి కానుండగా, మూడో విడతకు సంబంధించి వచ్చే మంగళవారంతో పూర్తి కానుంది. ఉపసంహరణ ఘట్టాల ప్రక్రియ కొలిక్కి వస్తుండడంతో గ్రామాల్లో ఇలాంటి సిత్రాలు బయటకొస్తున్నాయి. కొన్నిచోట్ల చివరికి ఇద్దరే అభ్యర్థులు నిలిచే పరిస్థితి ఉండడంతో మూడో పార్టీ నేతలు తాము ప్రత్యేకంగా బలపర్చిన అభ్యర్థి లేకపోవడంతో కిం కర్తవ్యం అంటూ ఆలోచనలో పడుతున్నారు. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
సాక్షి,ఆదిలాబాద్: పంచాయతీ ఎన్నికల్లో నామినేష న్ల పర్వానికి తెరపడింది. జిల్లాలో మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా, స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగిసింది. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తవగా ఈ విడతలోని పలు జీపీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలు కూడా స్పష్టమయ్యాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరెవరనేది తేటతెల్లమైంది. వారికి గుర్తులు కూడా కేటాయించారు. ఇక రెండో విడతకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రి య పూర్తి కాగా, శనివారం ఉపసంహరణ ఘట్టం సాగనుంది. మూడో విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ శుక్రవారం రాత్రి వరకు ఎన్ని వచ్చాయనే దానిపై సంఖ్యాపరంగా అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. ఏకగ్రీవం.. మొదటివిడతకు సంబంధించి పలు సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విడతకు సంబంధించి ఏకగ్రీవాల సంఖ్యపై పంచాయతీ అధికారులు స్పష్టంగా ప్రకటించారు. రెండో విడతలో ఏకగ్రీవాలు, అభ్యర్థులు పోటీలో ఎవరెవరనేది నేడు తేలనుంది. ఈ విడతకు సంబంధించి ఉపసంహరణ ఘట్టం ఈరోజు జరగనుండగా, ఆయా పంచాయతీల్లో పోటీ పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. ఇక మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం పూర్తి కాగా, శనివారం పరిశీలన ప్రక్రియ జరగనుంది. వచ్చే మంగళవారం ఉపసంహరణ ప్రక్రియ ఉంది. మొదటి విడతకు ఈనెల 11న, రెండో విడతకు 14న, మూడో విడతకు 17న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తయితే అదే రోజు ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలు జరిగే మండలాలు.. జిల్లాలో ఆదిలాబాద్అర్బన్ మినహా మిగతా 20 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా యి. మొదటి విడతలో 6 మండలాలు ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చో డ, రెండోవిడత 8 మండలాలు ఆదిలాబాద్రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్, మూడో విడత 6 మండలాలు బోథ్, సొ నాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగులో ఎన్నికలు జరగనున్నాయి.ప్రచారం షురూ.. మొదటి విడతలో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరెవరనేది స్పష్టత రావడంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో ప్రచార పర్వం మొదలుపెట్టారు. ఇక ఆయా పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం రంగంలోకి దిగాయి. నియోజకవర్గ, మండల, పంచాయతీ పార్టీ ముఖ్య నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించి ముందుకు కదులుతున్నారు. మొత్తంగా పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతుంది. విడతల వారీగా పంచాయతీ ఎన్నికల పరిస్థితి..విడత సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం వార్డు స్థానాల సంఖ్య ఏకగ్రీవంమొదటి 166 33 1390 953 రెండో 156 –– 1260 –– మూడో 151 –– 1220 –– మొత్తం 473 33 (ఇప్పటివరకు) 3870 953 (ఇప్పటివరకు) -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
కై లాస్నగర్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇందులో పాల్గొనే వారందరిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ, ష్యూర్ ఎన్జీవో సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యా రు. పండితులు, మౌలానా, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేస్తే వారి భవిష్యత్తుతో పాటు పు ట్టబోయే పిల్లల ఆరోగ్యం పాడవుతుందని తెలిపా రు. అనంతరం బాల్య వివాహం చట్టపరమైన నేరం హెచ్చరిక వాల్పోస్టర్ను సంబంధిత మత పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకట్ స్వామి, సభ్యులు సమీర్ ఉల్లాఖాన్, దశరథ్, డేవిడ్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కో ఆర్డినేటర్ వినోద్, అర్చక సంఘం సభ్యులు, చర్చి పాస్టర్లు, మౌలానా ఖాజీలు, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డి నేటర్ సతీశ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. దేశభక్తి అలవర్చుకోవాలి విద్యార్థి దశ నుంచే దేశభక్తి, సేవాభావం అలవర్చుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సాయుధ ద ళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని ఎన్సీసీ కేడెట్లు చేపట్టిన విరాళాల సేకరణను తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. దేశ రక్షణకు అంకితమైన సైనికుల కుటుంబాల సహా యార్థం ఎన్సీసీ కేడెట్స్ అధిక మొత్తంలో విరా ళా లు సేకరించాలని సూచించారు. వాటిని సైని క సంక్షేమ సహాయ నిధి ఖాతాలో జమచేస్తామని తెలిపా రు. మాజీ సైనికులు శంకర్, దేవన్న పాల్గొన్నారు.స్టేజ్–2 అధికారుల పాత్ర కీలకంగ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తొలి విడత ఎన్నికల అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టి ఫలితాలు ప్రకటించాక వాటి వివరాలు యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అంతకు ముందు ఆర్వోల ఎన్నికల విధుల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ వారికి శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు టి. వెంకన్న, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి మనోహర్, డీపీవో రమేశ్, డీఎల్పీఓ ఫణిందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవం దిశగా..
నేరడిగొండ: మండలంలో ఏడు సర్పంచ్ స్థానా లకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. రాజురా, ఆరెపల్లి, కొర్టికల్(కె), కుంటాల(కె), వెంకటాపూర్, కుంటాల(బి), లఖంపూర్(జి) గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వగ్రామమైన రాజురా సర్పంచ్, ఉపసర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకున్నా రు. సర్పంచ్గా జాదవ్ స్వరాజి, ఉపస ర్పంచ్గా రాథోడ్ బాపురావు, వార్డుసభ్యులుగా మీరా బాయి, సంజుల, రెనాబాయి, అశోక్ , మెగాజీ, రాథోడ్ బాపురావు, సాయమ్మ, అమర్సింగ్ను ఎన్నుకున్నారు. బజార్హత్నూర్లో రెండు జీపీలు .. బజార్హత్నూర్: మండలంలోని భూతాయి (కే), చింతలసాంగ్వి జీపీల్లో గ్రామపెద్దలు శు క్రవారం సింగిల్ నామినేషన్లు వేయించి సర్పంచ్, ఉపసర్పంచ్లతోపాటు వార్డుమెంబర్ల ను ఏకగ్రీవం చేసుకున్నారు. చింతలసాంగ్వీ స ర్పంచ్గా మడవి పద్మలత,ఉపసర్పంచ్గా నీలకంఠ, భూతాయి(కే) సర్పంచ్గా సింధుజైతు, ఉపసర్పంచ్గా భీంరావ్ ఎన్నికయ్యారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఇచ్చోడ: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సహ కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని గుండాల, కేశవపట్నం, అడేగామ(బి), ఇచ్చోడ పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించి మా ట్లాడారు. ఎన్నికల్లో వేలం పాటలు నిర్వహించడం చట్టా రీత్యా నేరమన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన తలమడుగు: మండలంలోని సుంకిడి, తలమడుగు గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పరిశీలించారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శంకర్ తదితరులున్నారు. -
పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలి
కై లాస్నగర్: ఆర్వో, స్టేజ్–2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలన్నారు. నిర్దేశించిన జాబితా ప్రకారం ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు ఉన్నాయో లేదో చూడాలని తెలిపారు. సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు అనువైన వాహనాలు వెంటనే సమకూర్చాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో జనరల్ అబ్జర్వ ర్స్ టి.వెంకన్న, ఎల్.విజయ, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకాంక్షకు అక్షరం తోడైంది..
ఆకాంక్షకు అక్షరం తోడైంది.. అడవి బిడ్డల దశాబ్దాల కలలు సాకారమవుతున్నాయ్.. ఆశలకు రెక్కలతోపాటు ఇక పెద్ద చదువులూ దగ్గరకానున్నాయ్.. ఎర్రబస్సు కాదండోయ్.. ఇక ఎయిర్బస్ సేవలు అందుబాటులోకి రానున్నాయ్.. ఉన్నత విద్య చేరువయ్యేలా వర్సిటీ కూడా మన చెంతకే వచ్చేస్తోంది. ఈ ప్రాంతవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ‘సాక్షి’ ఈ ఏడాది చర్చా వేదికలకు శ్రీకారం చుట్టింది. ప్రజల గొంతుకగా నిలి చి ‘రెక్కలొచ్చేనా..’ అంటూ ఎయిర్పోర్టు ఆవశ్యకతపై గళమెత్తింది.. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నత విద్య అందుబాటులోకి రావాలన్నా, ఉద్యోగావకాశాలు మెరుగుపడాలన్నా విశ్వవిద్యాలయ ఏర్పాటు తథ్యమని భావించి ‘వర్సిటీ.. కావాల్సిందే’ అంటూ నినదించింది. ‘సాక్షి’ వరుస కథనాలు పాలకులను ఆలోచింపజేశాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. ఆదిలాబాద్ గడ్డపై సీఎం గురువారం ఎయిర్పోర్టుపై కీలక ప్రకటన చేశారు. అంతేకాదు వర్సిటీ మంజూరు బాధ్యత తమదే అని అన్నారు. ఇంద్రవెల్లి అమరుల కేంద్రం అనుకూలంగా ఉంటుందని సూచించారు.. సామాజిక బాధ్యతగా ‘సాక్షి’ చొరవ సర్వత్రా చర్చనీయాంశమైంది.. ప్రజా గొంతుకపై అభినందనలు వెల్లువెత్తాయి. – ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్/ఆదిలాబాద్సీఎంకు ధన్యవాదాలు దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్న విశ్వవిద్యాలయ ఏర్పాటుపై సీఎం ప్రకటన చేసినందుకు యూనివర్సిటీ సాధన సమితి తరఫున ధన్యవాదాలు. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేయడం, అలాగే కుమురంభీం పేరును ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. – తొగరి భాస్కర్, యూనివర్సిటీ సాధన సమితి కోకన్వీనర్ దశాబ్దాల కల నెరవేరనుంది అడవుల జిల్లాలో త్వరలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించడం హర్షణీయం. వర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతపై ‘సాక్షి’ 2025 జూలై 9న చర్చావేదిక నిర్వహించింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. జిల్లావాసుల దశాబ్దాల కల సాకారంలో పాలు పంచుకున్నందుకు ‘సాక్షి’ మీడియాకు ధన్యవాదాలు. – రమణాగౌడ్, కోకన్వీనర్ వర్సిటీ ప్రకటన హర్షణీయం సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ వేదికగా ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడం హర్షించదగ్గ విషయం. విశ్వవిద్యాలయం అందుబాటులో లేకపోవడంతో స్థానిక యువత దశాబ్దాలుగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం ప్రకటన జిల్లా వాసులకు ఆనందం కలిగించింది. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రారంభించిన యూనివర్సిటీ ఏర్పాటు ఉద్యమానికి ముఖ్యమంత్రి మద్దతు పలకడం హర్షణీయం. – బద్దం పురుషోత్తంరెడ్డి, యూనివర్సిటీ సాధన సమితి జిల్లా కన్వీనర్ సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నాం.. జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు సంవత్సరం వరకు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ ప్రాంతం వాణిజ్య పరంగానూ అభివృద్ధి చెందుతుంది. అలాగే యూనివర్సిటీ ఏర్పడితే జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – ముడుపు ప్రభాకర్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణమైతే దూరభారం తగ్గుతుంది. ఈ ప్రాంతం వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే యూనివర్సిటీ ఏర్పాటుతో పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. ఎయిర్పోర్టు, యూనివర్సిటీ సాధన కోసం ‘సాక్షి’ కృషి అభినందనీయం. – చిల్క సతీశ్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు త్వరగా అందుబాటులోకి తేవాలి సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు ఎయిర్పోర్టు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సభలో హామీ ఇచ్చారు. వీటిపై ఈ ప్రాంతవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. హామీలకే పరిమితం కాకుండా త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజాసమస్యలపై జనం గొంతుకగా ‘సాక్షి’ కృషి అభినందనీయం. – రంగినేని మనిషా, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ‘సాక్షి’ చొరవ అభినందనీయం.. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం అనేది జిల్లావాసుల చిరకాల కోరిక. ఈ క్రమంలో ‘సాక్షి’ ఇటీవల అన్నివర్గాలతో చర్చావేదిక నిర్వహించింది. సాధన కమిటీని సైతం ఏర్పాటైంది. రా జకీయ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ప్రజాపాలన విజయోత్సవ సభలో సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి ఎయిర్పోర్టు పనులు ఏడాదిలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీ డియా పాత్ర ఎంతో కీలకమనేది స్పష్టమైంది. – విజయ్బాబు సల్ల, రిటైర్డ్ లెక్చరర్ వర్సిటీ ఏళ్ల నాటి కల.. యూనివర్సిటీ అనేది ఈ ప్రాంత ప్రజల ఏళ్ల నాటి కల. ముఖ్యమంత్రి ప్రకటనతో అది సాకారమవుతుందనే నమ్మకం కలిగింది. గతంలో మంజూరైన యూనివర్సిటీ చేజారిపోయినట్లు కాకుండా జిల్లాలోని రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా ప్రయత్నించాలి. యునివర్సిటీ సాధన విషయంలో ‘సాక్షి’ కృషి అభినందనీయం. – ఉదారి నారాయణ, కవి, రచయిత -
విజయోత్సహాం..
ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ సక్సెస్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన సభకు జనం భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రాక గంటన్నర ఆలస్యమైనా ప్రజలు ఓపిగ్గా ఎదురుచూశారు. జిల్లాలో రూ.260 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణతో సభ ను ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, జి.వినోద్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే అభిమానం..: సీఎం ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, పీసీసీ అధ్యక్షుడినయ్యాక ఇక్కడి నుంచే కార్యక్రమాలను ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. జిల్లాను దత్తత తీసుకున్నానని త్వరలోనే అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న జిల్లాకు ఏడాదిలోనే ఎయిర్బస్సు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీ మంజూరు చేయనున్నట్లుగా హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కేంద్రంగా నాగోబా సన్నిధిలో కుమురంభీం పేరిట ఉంటే బాగుంటుందని, ఇది తన సూచనగా పేర్కొన్నారు. అలాగే మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ సెక్టార్లో పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుని ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కొరటా–చనాఖ ప్రాజెక్ట్ను త్వరలోనే ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. అలాగే కుమురంభీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై ప్రాజెక్ట్ నిర్మించి ఉమ్మడి జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేలా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసినట్లుగా వివరించారు. ఇలా సీఎం జిల్లాకు అనేక వరాలు కురిపించడంతో ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను పోలీసులు వేకువజామునే ముందస్తు అరెస్ట్లు చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకను సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలకు తెలియజేసేలా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అంతకు ముందు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నాయకులు, ట్రెయినీ కలెక్టర్ సలోనిచాబ్రా హెలీప్యాడ్ వద్దకు చేరుకుని సీఎంకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. భూ సేకరణకు నిధులివ్వండి కొరటా–చనాఖా ప్రాజె క్ట్ నిర్మాణం 97శాతం పూర్తయింది. పెండింగ్లో ఉన్న ఆయకట్టు భూసేకరణ నిధులు త్వరగా విడుదల చేసి సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకా రం ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం ఆదిలా బాద్కు ఎయిర్పోర్టు భూ సేకరణ జీవో జారీ చేశారు. అలాగే పంటచేలకు రోడ్లు వేసేలా పొ లంబాటకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యేక ప్రేమ చూ పుతూ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎంకు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ సమస్యలపై సమీక్ష నిర్వహించాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సాగునీటి చెరువులు, కెనాల్స్, రోడ్లు, పాఠశాలల పరిస్థితులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల ను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉమ్మడి జిల్లాస్థాయి సమీ క్ష సమావేశం సీఎం అధ్యక్షతన నిర్వహించాలి. ఉ ట్నూర్ ఐటీడీఏకు ఆరేళ్లుగా పాలకవర్గం నియమించకపోవడంతో పీఎంకేఎస్వై, పోడు భూములు వంటి ఆదివాసీల సమస్యలపై చర్చించే అవకాశం లే దు. ఐటీడీఏ పాలకవర్గాన్ని నియమించాలి. ఎయిర్పోర్టు భూ సేకరణకు జీవోజారీ, ఇంటిగ్రేటేడ్ స్కూ ల్ మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ అన్నివర్గాలకు న్యాయం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం అన్నివర్గాల ప్ర జల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తుంది. జిల్లాలోని రైతులకు మేలు చేకూర్చేలా రూ.2,500 కోట్ల రుణమాఫీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి సా యాన్ని అందించాం. అర్హులైన పేదలందరికీ రేషన్కార్డులిచ్చాం. పేదలకు దొడ్డుబియ్యం కాకుండా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. – పి.సుదర్శన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం రూ. లక్షల కోట్ల అప్పులున్నా.. ప్రతీ నెలా రూ.కోట్ల రూపేనా వడ్డీలు చెల్లిస్తున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ, అభివృద్ధి ని ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులు రూపాయి ఖర్చులేకుండా కార్పొరేట్స్థాయిలో విద్యనభ్యసించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం. రెండేళ్లలోనే 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించేలా ప్రతిపాదనలు స్వీకరించాం. త్వరలోనే ఆ మొత్తాన్ని రైతులకు అందజేస్తాం. జిల్లాను పర్యాటకపరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. – జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు అహంకార, అవినీతి కారణంగానే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రూ.500లకు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో అమలు కానీ అనేక పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా యువతలో నైపుణ్యాలు మెరుగుపర్చేలా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశాం. – గడ్డం వివేక్, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఆదిలాబాద్టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ని ష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టుల ద్వారా తనిఖీలు చేపట్టాలని సూచించారు. మతపరమైన, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత చర్యలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో సాయుధ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో సమస్యలను సృష్టించే వారిని బైండోవర్ చేయాలని అన్నారు. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్మార్చ్ నిర్వహించాలని, ప్రజల్లో పోలీసులపై ధైర్యం నింపాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు చేయాలని, గ్రామాలను సందర్శిస్తూ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీ లు జరగకుండా పర్యవేక్షించాలని చెప్పారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలను సందర్శిస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. వీడీసీ ఆగడాలను అరికట్టాలని, మద్యం అక్రమ రవాణా ను అడ్డుకోవాలని, గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకుండా వేలం పాటలు వేసే వారిపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సెల్ఫోన్ నెట్వర్క్ లేని సందర్భంలో వీహెచ్ఎఫ్ సెట్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించాలని తెలిపారు. పోలీస్స్టేషన్ల వారీగా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని గ్రా మాల్లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవాల ని అన్నారు. పోలీసు సిబ్బంది ప్రత్యక్ష, పరోక్ష రాజ కీయాలకు దూరంగా ఉండాలని, ఎన్నికలు ప్రభావి తం చేసే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సూచించా రు. సమావేశంలో మల్టీ జోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, అదనపు ఎస్పీలు కాజల్సింగ్, బి.సురేందర్రావు, ఏఎప్పీ చిత్తరంజన్, పి.మౌనిక, డీఎస్పీలు వహీదుద్దీన్, వెంకటేశ్వర్, పోతారం శ్రీనివాస్, జీవన్రెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు, సీఐలు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి -
● ప్రాణభయంతో చెట్టెక్కిన పశువుల కాపరి
కోడైపె పులి దాడివేమనపల్లి: మండలంలోని చామనపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి జంపం పవన్ గురువారం సాయంత్రం పశువుల మందను తోలుకుని ఇంటికి వస్తుండగా పెద్దవాగు సమీపంలో పులి దాడి చేసింది. భయాందోళన చెందిన కాపరి చేతిలో ఉన్న గొడ్డలి, టిఫిన్బాక్స్ పక్కన పడేసి పక్కనే ఉన్న మద్దిచెట్టు ఎక్కాడు. పులి కదలికలను ఫోన్లో బందించాడు. చూస్తుండగానే దుర్గం బానయ్యకు చెందిన కోడైపె దాడి చేయడంతో అది తప్పించుకుంది. చెట్టు మీదనే ఉన్న పవన్ ఇంటికి ఫోన్ చేయడంతో గ్రామస్తులు డప్పులతో శబ్ధం చేస్తూ బయలుదేరారు. శబ్ధానికి పులి అక్కడి నుంచి పారిపోయింది. విషయం తెలుసుకున్న బద్దంపల్లి, చామనపల్లి అటవీ సెక్షన్, బీట్ అధికారులు స్వామి, స్వరూప, రాజ్కుమార్, హేమంత్ ఘటనా స్థలానికి వెళ్లి పులి పాదముద్రలకోసం వెతికారు. ఎండిన రేగడి, రాళ్ళు రప్పలు ఉన్న నేలపై ప్లగ్ మార్క్స్ పాదముద్రలు లభ్యంకానట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బమ్మెన అటవీ ప్రాంతం సమ్మక్క తల్లి గద్దెల వద్ద పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలుస్తోంది. -
‘తెల్ల’బోతున్నారు!
పత్తి రైతులను కష్టాలు వీడడంలేదు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక విత్తనా లు మొలకెత్తలేదు. మళ్లీ మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది. తర్వాత వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో ఉంది. దీంతో రైతులు సంతోషపడ్డారు. కానీ సెప్టెంబర్ చివరివారంలో, అక్టోబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు పూత, కాయలు రాలిపోయాయి. చివరకు మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో దిగుబడి సగానికి పడిపోయింది. ఇక వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు కూడా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం నాణ్యత లేదని సీసీఐ మద్దతు ధర తగ్గించింది. మరోవైపు ఎకరాకు 12 క్వింటా ళ్లకు మించి కొనబోమని నిబంధన విధించింది. దీంతో కాస్త బాగా దిగుబడి వచ్చిన రైతులు ఇప్పుడు తెల్ల బంగారాన్ని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. మరోవైపు చేలల్లో ఉన్న పత్తిని ఏరేందుకు కూలీలు కూడా దొరకడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
ఐఐఎస్ఎఫ్కు ఎంపిక
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడు జాడి ప్రవీణ్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2025కు ఎంపికయ్యారు. ఈనెల 6 నుంచి 9 వరకు హర్యానాలోని పంచకులాల్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరగనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకుల వినూత్న ఆలోచనలు, సాంకేతిక అభివృద్ధి పరిశోధనలను ప్రదర్శించే అతిపెద్ద వేదికల్లో ఐఐఎస్ఎస్ ఒకటన్నారు. గూడెంలో పౌర్ణమి జాతర దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం మార్గశిర పౌర్ణమి జాతర వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 201 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. దత్తాత్రేయ జయంతి వేడుకలు.. మండలంలోని గూడెం శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం శ్రీ దత్తసాయి జయంతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. అష్టోత్తర శతకలశ పూజలు, పాలాభిషేకం, పల్లకి సేవ, తదితర పూజలు చేశారు. 13 మంది బైండోవర్కై లాస్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 13 మంది పాత నేరస్తులను బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేల మండలంలోని చప్రాలకు చెందిన పలువురు పాత నేరస్తులను గురువారం బేల తహసీల్దార్ రఘునాథ్ రావు ఎదుట బైండోవర్ చేశారు. ఎన్నికల సందర్భంగా గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు తెలిపారు. -
పెండింగ్ క్లెయిమ్లు పరిష్కరించాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో పెండింగ్లో ఉన్న సీఎంపీఎఫ్, పెన్షన్ క్లెయిమ్లన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని గోదావరిఖని రీజియన్ సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్ అన్నారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో 4వ విడత ప్రయాస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్కు సంబంధించి 1,332 పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీలను ఏరియా జీఎంకు అందజేశారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికుడికి సీఎంపీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్ కోసం అందుబాటులోకి తెచ్చిన సీ–కేర్స్లోని పెండింగ్లను జీరో పెండింగ్లోకి తేవడం లక్ష్యంగా ప్రయాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏరియా పరిధిలో ఉన్న పెండింగ్ క్లైమ్లను సంక్షేమ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్వోటు జీఎం ఎం.సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, డీజీఎం (పర్సనల్) అనిల్కుమార్, సీనియర్ పీవో సురేందర్, పిట్ సెక్రెటరీ సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బొలెరో
భైంసాటౌన్: బొలెరో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన పట్టణంలోని సేవాలాల్ చౌక్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తానూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన మాజిద్ గురువారం తన బొలెరోలో ఓ రైతుకు చెందిన పత్తి భైంసాలో విక్రయానికి తెచ్చి తిరిగి వెళ్తుండగా, సేవాలాల్ చౌక్ వద్దకు రాగానే డ్రైవర్కు మూర్చ రావడంతో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో స్తంభం విరిగి వాహనంపై పడగా, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మాజిద్తోపాటు అక్కడే నిల్చుని ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అక్కడందరూ బంధువులే..
వాంకిడి: మండలంలోని ఖమాన గ్రామ పంచాయతీ సర్పంచ్ పీఠం కోసం ఐదుగురు బరిలో నిలువగా అందులో నలుగురు దగ్గరి బంధువులే ఉండడం గమనార్హం. గతంలో సర్పంచ్గా పనిచేసిన పెందూర్ ప్రకాష్ ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్ రావడంతో తన కూతురు అంకితను బరిలో నిలిపాడు. ప్రకాష్కు కుమారుడి వరుసైన పెందూర్ శ్రీనివాస్ గతంలో పలుమార్లు సర్పంచ్ పదవికి పోటీ చేయగా ఈసారి అతని భార్య రుక్మిణిని బరిలో నిలిపాడు. ఈసారి అంకిత, రుక్మిణితో పాటు వారికి సమీప బంధువులైన పెందూర్ నంద, గేడం సునీత సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. గేడం సునీతకు పెందూర్ అంకిత కూతురు వరుస అవుతుంది. పెందూర్ రుక్మిణికి పెందూర్ నంద అత్త వరుస అవుతుంది. -
108, 102 ఉద్యోగులకు శిక్షణ
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన 108, 102 ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధికారి గజేందర్, 108, 102 వాహనాల సాంకేతిక అధికారి లింగాచారి ఆధ్వర్యంలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్), సీపీఆర్లతో పాటు, సుఖ ప్రసవాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభను కనబర్చిన కాసిపేట పైలట్ జె.కొమురయ్యకు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో సంపత్, కొండలరావు, నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. మేం గుర్తురాలేదా?
అమాయకంగా ఈ మహిళ ఒడిలో కూర్చున్న చిన్నారులను చూస్తే ముద్దొస్తున్నారు. కానీ వాళ్లు ఇప్పుడు తల్లి శవం పక్కన కూర్చున్నారు. నిన్నటి వరకు అమ్మతో ముద్దు ముద్దు మాటలు మాట్లాడారు. రాత్రి అమ్మను హత్తుకుని నిద్రపోయారు. అమ్మ చేతి గోరుముద్దలు తిన్నారు. తెల్లారి విగత జీవిగా మారిన తల్లి మృతదేహం పక్కన కూర్చున్నారు. అమ్మకు ఏమైందో తెలియక అమాయకపు చూపులతో అందరికీ కన్నీరు తెప్పించారు. అమ్మ చేతి గోరు ముద్ద ఇక తినమని రెండేళ్ల కూతురుకు తెలియదు.. అమ్మ పాలు తాగలేనని ఆరు నెలల బాబుకు తెలియదు.. ఉరేసుకునే సమయంలో మేం గుర్తుకు రాలేదా అమ్మ.. అన్నట్లు మౌనంగా తల్లి మృతదేహం చూస్తూ ఉన్నారు. -
జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య
లక్ష్మణచాంద: జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు సోన్ మండలంలోని గంజాల్ గ్రామానికి చెందిన బందెల రవి (38) అప్పుల బాధతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 3న గ్రామ సమీపంలోని తన పొలంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు 108లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..కుభీర్: అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దొడర్నా తండాకు చెందిన జాదవ్ రేణబాయి (70) వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు భరించలేక బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మృతురాలి కుమారుడు జాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిలక్ష్మణచాంద: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మహిళ మృతి చెందిన సంఘటన సోన్ మండలంలోని గంజాల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం మతిస్థిమితం లేని ఓ మహిళ గురువారం రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంజాల్ గ్రామానికి చెందిన నేల లింగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు..ఉట్నూర్రూరల్: ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందుతాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంగన్నపేటకు చెందిన జాడి లక్ష్మీనారాయణ (17) కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను యువతి నిరాకరించడంతో గత నెల 7న పురుగుల మందు తాగాడు. విషయం స్నేహితులతో చెప్పడంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆదిలాబాద్లోని రిమ్స్కు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
● క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య ● తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు ● బిర్సాయిపేటలో విషాదం
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్, మృతురాలి కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. ఉట్నూర్ మండలం బిర్సాయిపేటకు చెందిన ఏళ్ల ర జిత (27)కు ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మాన్కుగూడకు చెందిన సుదర్శన్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలలపాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత సుదర్శన్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు రజితకు తెలిసింది. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దంపతులకు ఇద్దరు పిల్లలు (రెండేళ్ల పాప, ఆరు నెలల బాబు)ఉన్నారు. మరోవైపు సుదర్శన్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ‘నువ్వు సచ్చిపోతే.. నేను మరో అమ్మయిని పెళ్లి చేసుకుంటా’ అని వేధించేవాడు. పంచాయితీలు జరిగినా మారలేదు.. సుదర్శన్–రజిత దంపతుల గొడవలపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. పెద్ద ల ముందు సక్రమంగా ఉంటానని చెప్పే సుదర్శన్ తర్వాత తన పాత పద్ధతినే కొనసాగించాడు. ఎప్పటికై నా మారకపోతాడా అని రజిత ఎదురు చూసింది. కానీ, భర్త నిత్యం తాగి వచ్చి సూటిపోటి మా టలు అనడం.. సచ్చిపో అని వేధించడాన్ని తట్టుకో లేకపోయింది. ఈ క్రమంలో బుధవా రం ఉదయం దంపతులు గొడవ ప డ్డారు. అనంతరం సుదర్శన్.. తన భా ర్య తమ్ముడు రవికి ఫోన్ చేసి.. మీ అక్క ను తీసుకుపో అని చెప్పాడు. దీంతో ర వి సాయంత్రం వచ్చాడు. ర జితను బైక్ పై తీసుకుని పుట్టింటికి బయల్దేరారు. భర్త మాటలు భరించలేక.. ఈ క్రమంలో మండలంలోని ఘన్పూర్ గ్రామం వద్దకు రాగానే భర్త అన్న మాటలు, వేధింపులు గుర్తుకురావడంతో రజిత కన్నీటిపర్యంతమైంది. ఈ క్రమంలో బైక్ పైనుంచి ఒక్కసారిగా కిందికి దూకి అడవిలోకి పరుగెత్తింది. అప్పటికే చీకటి పడడంతో రవి ఆమెను వెతుక్కుంటూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో చున్నీతో ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తల్లి కోసం ఆరాటపడుతున్న పసి హృదయాలను చూసి చూసిన ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. -
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి
కై లాస్నగర్: జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్రెడ్డి అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కారు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరో సా, రుణమాఫీ, సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం వంటి అనేక సంక్షేమ పథఽకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులకు గుర్తుగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధికి రూ.18కోట్లు ఇచ్చామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం సభను జయప్రదం చేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇందులో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్చార్జిలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ , డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. బోథ్: మండలకేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పి.సుదర్శన్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయనకు నాయకులు స్వాగతం పలికారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. -
● జిల్లాలో పేరుకుపోయిన సమస్యలు ● నేడు ఆదిలాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగసభ
రిమ్స్ ఆసుపత్రి లోయర్ పెన్గంగపై నిర్మించిన కొరటా–చనాఖా ప్రాజెక్ట్ సీఎం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్లో బయలుదేరి 2గంటలకు జిల్లా కేంద్రంలోని ఎరోడ్రమ్కు చేరుకుంటారు. 2.10 గంటలకు కాన్వాయ్ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3.45గంటలకు స్టేడియం నుంచి హెలిప్యాడ్కు చేరుకుని హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. కైలాస్నగర్: ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఇక జిల్లాలో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, మౌలిక వసతుల పరంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతవాసులు సీఎం కల్పించే భరోసాపై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం ఆ దిశగా ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు
కైలాస్నగర్: ఆదిలాబాద్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. రూ.200 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జీవో జారీ చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రతిష్టాత్మక స్కూల్ మంజూరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఒకే చో ట నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మూడు మంజూరు కాగా తాజాగా నాలుగోది ఆదిలాబాద్ నియోజకవర్గానికి మంజూరైంది. ఈ పాఠశాల నిర్మాణం కోసం పట్టణంలోని నిషాన్ఘాట్లో 30 ఎకరాల స్థలాన్ని అధికారులు ఇది వరకే గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదననలు పంపించిన విష యం విదితమే. పాఠశాల మంజూరుపై ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు హర్షం వ్యక్తం చేశారు. -
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఉట్నూర్రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్ర భుత్వం చర్యలు చేపడుతుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంను స్థానిక వికాసం పా ఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మా ట్లాడారు. దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరి చిన విద్యార్థులను అభినందించి బహుమతి ప్రదానం చేశారు. ముందుగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఐటీడీఏ డీడీ అంబాజీ జాదవ్, ఏటీడీవోలు సదానందం, నిహారిక, జగన్, ఐటీడీఏ బీఈడి కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్రావు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. ఆత్మస్థైర్యంతో రాణించేలా ప్రోత్సహించాలి కై లాస్నగర్: దివ్యాంగుల్లోని లోపాలు ఎత్తిచూపకుండా వారిలో ఆత్మవిశ్వాసం నింపి అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దివ్యాంగ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధ న , అధికారులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు. -
రక్తం తక్కువైతంది!
ఆదిలాబాద్టౌన్: జిల్లాను ఎనీమియా వేధిస్తోంది.. ముఖ్యంగా గిరిజన యువతులు, మహిళలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. అనేక రుగ్మతల బారిన పడుతున్నారు.. అనారోగ్యంతో కొంతమంది మృతి చెందుతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. గర్భిణుల్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడంతో వారితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. పోషకాహార లోపంతోనే ఈ సమస్య తలెత్తుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితం కానరావడం లేదు. ప్రసవ సమయంలో రక్తం లేక తల్లడిల్లుతున్నారు. నవ మాసాలు మోసి పురిటి నొప్పుళ్లతోనే కొంత మంది కన్నుమూసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 60 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఎనీమియాతో బాధపడుతున్న చిన్నారులకు జిల్లా కేంద్రంలోని న్యూట్రీషియన్ సెంటర్లో పోషకాహారం అందిస్తున్నారు. పెరుగుతున్న కేసులు.. జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న వారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని గాదిగూడ, సిరికొండ, ఇంద్రవెల్లి మండలాల్లో ఎక్కువ శాతం మంది చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికలు ఎనీమియా బారిన పడుతున్నారు. తగ్గుతున్న హిమోగ్లోబిన్ శాతం.. జిల్లాలోని మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతోంది. వంద మంది మహిళల్లో దాదాపు 60 మందికి 10 గ్రాముల కంటే తక్కువగా హెచ్బీ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వెయ్యి మంది గర్భిణుల్లో 6 నుంచి 7 గ్రాముల రక్తం ఉన్నవారు 15 నుంచి 20 మంది వరకు ఉంటున్నారు. పౌష్టికాహార లోపంతోనే ఈ సమస్య ఎదురవుతుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా మాతా, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు ఆకుకూరలు, పోషకాహారం తీసుకోకపోవడం, తలసేమియా, సికిల్సెల్, జన్యుపరంగా వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. గర్భిణులకు ఐరన్ పోలిక్ మాత్రలు ఇచ్చినప్పటికీ వారు సక్రమంగా వేసుకోకపోవడం, వివిధ రకాల విటమిన్ల లోపంతో హిమోగ్లోబిన్ తగ్గుతోంది. ఈ ప్రభావం గర్భిణితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా పడుతోంది. రిమ్స్లోని చిల్డ్రన్స్ వార్డులో నవజాత శిశువులు మృత్యువాత పడుతున్నారు. తక్కువ బరువుతో పుట్టడం, శ్వాస సంబంధిత వ్యాధులు ఇతర వాటితో జన్మించి మృతి చెందుతున్నారు. ప్రత్యేక చొరవ చూపుతున్నాం.. ఏజెన్సీ ప్రాంతంలోని మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో ప్రతీ గురువారం ఎనీమియా ముక్త్ భారత్లో భాగంగా విద్యార్థులకు ఐరన్ మాత్రలు అందజేస్తున్నాం. నార్నూర్ పీహెచ్సీలో బ్లడ్ ట్రాన్స్లేషన్ మిషన్ను సైతం ఏర్పాటు చేశాం. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
పకడ్బందీ ఏర్పాట్లు
కైలాస్నగర్: ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధి కార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప ట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేశారు. ప్రజలు, వీఐపీలు సభ వేది కకు చేరుకునేలా ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్లైట్లను సైతం ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి శిలాఫలకాలను సిద్ధం చేశారు. ఏర్పాట్ల ను కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు ఎస్పీలు కాజల్సింగ్, మౌనిక ఉన్నారు. -
కేజీబీవీలకు బంకర్బెడ్లు
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీల్లో మెరుగైన సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యార్థినులు గదుల్లోని చాపలపై నిద్రించాల్సి వస్తోంది. విద్యార్థినుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం బంకర్ బెడ్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ తరహా బెడ్ల వల్ల స్థలం వృథా కాకుండా ఉంటుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని అవసరమో విద్యాలయాల వారీగా లెక్కలు తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. హైదరాబా ద్కు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు ఆర్డర్లు పొందగా నెలాఖరు వరకు ఆయా కేజీబీవీలకు సరఫరా చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. మొదటి దఫాలో ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని 45కేజీబీవీలకు 6860 బంకర్బెడ్లు సరఫరా చేయనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ బెడ్లు ఎన్ని అవసరమో ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఆయా కేజీబీవీలకు దశలవారీగా బంకర్ బెడ్లు సరఫరా చేయనున్నారు. మరోవైపు నాబార్డు నిధులతో మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యార్థినుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, శుద్ధ జల ట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటిసంపులు, బోర్వెల్లు, ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్, డా ర్మెటరీ, భోజనశాలలు, దోమలు రాకుండా మెష్ల ఏర్పాటు, భవన మరమ్మతులు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు చేపట్టనున్నారు. మొదటి దశలో జిల్లాల వారీగా వివరాలు జిల్లా విద్యాలయాలు పడకలు ఆదిలాబాద్ 13 2103 ఆసిఫాబాద్ 12 1749 నిర్మల్ 10 1553 మంచిర్యాల 10 1455 45 6860 -
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఇంద్రవెల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉ ట్నూర్ అదనపు ఎస్పీ కాజల్సింగ్ అన్నారు. మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, సిబ్బంది ఉన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు నార్నూర్: పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ కాజల్సింగ్ హెచ్చరించారు. మండలంలోని నాగల్కొండ గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, రెచ్చగొట్టేలా వ్యవహరించినా కేసులు తప్పవని అన్నారు. ఆమె వెంట సీఐ అంజమ్మ, సిబ్బంది గోవింద్, నాగోరావు తదితరులు ఉన్నారు. -
ఆ బడులకు మహర్దశ
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించిన ఆయన ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొ దటి విడత సక్సెస్తో మరోసారి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇటీవల హెచ్డీఎఫ్సీ వారు రూ.కోటి 20 లక్షల సీఎస్సార్ నిధులు కేటాయించగా వాటిని జిల్లా కేంద్రంలోని రెండు ప్ర భుత్వ యాజమాన్య పాఠశాలలను ఎంపిక చేశారు. ఆ బడుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. ఈనెల 4న సీఎం చేతుల మీదుగా ఆ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. రెండు పాఠశాలలు ఇవే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా నిధులు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల గెజిటెడ్ నం.1, మహాలక్ష్మివాడ పాఠశాలలను కలెక్టర్ ఎంపిక చేశారు. ఈ నిధులతో ఆ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయనున్నారు. నాలుగేళ్ల పాటు వీటిని దత్తత తీసుకొని అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.కోటి 20 లక్షల వరకు నిధులు ఖర్చు చేయనున్నట్లు విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాల నం.1లో తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ మీడియంలు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలల్లో 502 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మహాలక్ష్మివాడ పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలలో 358 మంది విద్యార్థులు చదువుతున్నారు. సీఎస్ఆర్ నిధులతో అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఇన్స్ట్రక్టర్లు, సైన్స్ల్యాబ్, యూనిఫాం, షూ, టై, బెల్ట్, కిచెన్ షెడ్లు, ఇతర మౌలిక వసతులు, వాటర్ప్లాంట్, డైనింగ్ హాల్, డ్యూయల్ డెస్క్ బెంచీలను కల్పించనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు ఈ నిధులు సమకూరనుండడంతో ఈ రెండు బడుల రూపురేఖలు మారనున్నాయి. పేద విద్యార్థులకు మేలు చేకూరనుంది. సీఎస్ఆర్ నిధులతో మౌలిక వసతులు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆదిలాబాద్ పట్టణంలోని రెండు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దత్తత తీసుకుంది. ఒక్కో పాఠశాలకు రూ.కోటికి పైగా నిధులతో అభివృద్ధి చేయనున్నారు. అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈనెల 4న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. – రఘురమణ, సెక్టోరియల్ అధికారి -
చేసింది చెప్పేందుకే ‘సంబరాలు’
కై లాస్నగర్: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజ లకు చెప్పేందుకే విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ నెల 4న పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి బహిరంగసభ కోసం చేపట్టిన ఏర్పాట్లను మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైందన్నారు. రూ.500 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ గత పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. వాటికి నెలనెలా వడ్డి చెల్లిస్తూనే తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిస్తుందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం, యువతకు ఉద్యోగాలు, ఉచిత కరెంట్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను రెండేళ్ల ప్రజా పాలనలో అమలు చేశామని తెలిపారు. ఈ పనులను ప్రజలకు తెలిపేందుకే ప్రజాపాలన విజయోత్సవాలు అని అన్నారు. రైజింగ్ తెలంగాణ నంబర్వన్–2047 లక్ష్యంగా ముందకు సాగుతున్నామని వెల్లడించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం సభను జయప్రదం చేయాలని కోరారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్, నిర్మల్ అసెంబ్లీ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ , శ్రీహరిరావు, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, గోక గణేశ్రెడ్డి, బోరంచు శ్రీకాంత్రెడ్డి, గండ్రత్ సుజాత పాల్గొన్నారు. కంది క్యాంపు కార్యాలయంలో సమీక్ష పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సభను జయప్రదం చే యడంతో పాటు రానున్న గ్రామ పంచాయతీతో పాటు పరిషత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరి ంచాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో పట ణంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మ హాజన్తో కలిసి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం మైదా నాన్ని సందర్శించారు. నిర్వాహకులు, అధికారులతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వా రికి సూచించారు వారి వెంట అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య తదితరులున్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్ అన్నారు. యూనియన్ జిల్లా మహాసభలను జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవన్లో మంగళవారం నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరించి, అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పై అందక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరీశ్, గణేశ్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళావతి, జిల్లా ఉపాధ్యక్షురాలు దీపలక్ష్మి, దత్తాత్రి, నగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఇద్దరు కానిస్టేబుళ్ల ఎంపిక
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు జాతీయస్థాయి పోలీస్ హాకీ పోటీలకు ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కో ట్లో ఈనెల 4నుంచి 15వరకు నిర్వహించను న్న 74వ ఆలిండియా పోలీస్ హాకీ చాంపియన్షిప్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన ఏఆర్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అశోక్కుమార్, సెకండ్ బెటాలియన్ కానిస్టేబుల్ నర్సింగ్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్రెడ్డి, పార్థసారథి తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ హాకీ క్రీడాకారులు అభినందనలు తెలిపారు. -
నేటి నుంచి మూడో విడత
కై లాస్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి షురూ కానుంది. జిల్లాలోని బోథ్, సొనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని 151 సర్పంచ్లు , 1220 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ కోసం ఆయా మండలాల పరిధిలో 37 క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అనుచరులతో కలిసి నామినేషన్లు సమర్పించేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ముగిసిన రెండో విడత నామినేషన్ల స్వీకరణ రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 8 మండలాల్లోని 156 పంచాయతీలు, 1260 వార్డుస్థానాలకు నామినేషన్లను స్వీకరించారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్ణీత సమయం దాటినప్పటికీ క్యూలో ఉండటంతో వారిని అనుమతించారు. దీంతో ఈ ప్రక్రియ పలు చోట్ల రాత్రి వరకు కొనసాగింది. ఆయా మండలాల్లో దాఖలైన నామినేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. రెండు రోజుల్లో సర్పంచ్లకు 324 నామినేషన్లు రాగా, వార్డు స్థానాలకు 523 నామినేషన్లు అందాయి. చివరి రోజున ఈ సంఖ్య రెట్టింపైనట్లుగా సమాచారం. కాగా బుధవారం ఈ విడతలోని నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సాగనుంది. పోటీకి అర్హులైన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే మొదటి విడతకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. సాయంత్రం పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. -
డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్జాదవ్ బాధ్యతలు
కై లాస్నగర్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి(డీసీసీ)గా నరేష్ జాదవ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా నియామక పత్రం అందుకుని బాధ్యతలు చేపట్టారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం, పార్టీ ప్రత్యేక చొరవ చూపాలని సీఎం, పీసీసీ అధ్యక్షుడిని కోరినట్లుగా ఆయన పేర్కొన్నారు. -
రిమ్స్ ఎదుట కార్మికుల నిరసన
ఆదిలాబాద్టౌన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కార్మికులు మంగళవారం రిమ్స్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యు డు రాములు మాట్లాడుతూ, రిమ్స్లో ఔట్సో ర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీ కార్మికుడికి 5వ తేదీ లోగా వేతనాలు చెల్లించాలన్నారు. సీనియారిటీ ప్రకారం పేషెంట్కేర్ పదోన్నతి ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అనుసూయ, రమ పాల్గొన్నారు. -
జత కలిసేనని..!
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో పులి తోడు కోసం సంచరిస్తోందా..? ఆడ పులి కోసం అన్వేషణ సాగిస్తోందా..? జత కలిసేందుకు అనువైన సమయమిదేనా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొన్ని రోజులుగా జన్నారం అడవుల్లో పులి మకాం వేసింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఎప్పటికప్పుడు కదలికలను గుర్తిస్తున్నారు. జన్నారం డివిజన్లో పర్యటిస్తున్నది మగపులిగా గుర్తించారు. ఆడపులి జత కోసం అన్వేషిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడే మకాం వేస్తుందా..? 2012 ఏప్రిల్లో కవ్వాల్ అభయారణ్యాన్ని కవ్వాల్ టైగర్ జోన్గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పులుల రాకపోకలే తప్ప ఇక్కడ ఆవాసం ఉన్న దాఖలాలు లేవు. ఒకట్రెండు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో సంచరించి తిరిగి వెళ్లేవి. కానీ గత నెల 26న జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఆవుపై దాడి చేసి చంపింది. పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి దాడిగా గుర్తించి ట్రాక్ చేశారు. సీసీ కెమెరాలు అమర్చగా వాటిలో పులి చిక్కినట్లు తెలిసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. టైగర్జోన్లో టైగర్ తిరగడం అంత ప్రత్యేకత కాకున్నా సంవత్సర కాలంగా పులి రాక కోసం ఎదురు చూస్తున్న అటవీ అధికారులకు మాత్రం ఈ పులి ఆరు రోజులుగా ఇక్కడే మకాం వేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. తోడు కోసమేనా..? జన్నారం అడవుల్లో తిరుగుతున్న పులిని మగ పు లిగా అధికారులు గుర్తించారు. ఆడ పులికి తోక చి న్నదిగా, పాదముద్ర 4 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది. ప్రస్తుతం జన్నారంలో తిరుగుతున్న పులి పాదముద్ర 5 సెంటీమీటర్ల వెడల్పు, తోక పొడవుగా ఉండడంతో మగ పులిగా నిర్ధారణకు వచ్చారు. ఆడపులి తోడు కోసమే వెతుక్కుంటూ ఈ ప్రాంతా నికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రపూర్ అటవీ ప్రాంతం నుంచి బేల మీదుగా జన్నారం అడవుల్లోకి వచ్చినట్లు పేర్కొంటున్నారు. గత నాలుగు నెలల క్రితం లక్సెట్టిపేట అడవుల్లో కనిపించింది ఆడపులి కావడంతో దాని తోడు కోస మే ఈ ప్రాంతానికి మగపులి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రతీ శీతాకాలంలో పులులు సంతతి పెంచుకోవడం జరుగుతుందని, జనవరి వరకు మేటింగ్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ మగపులి తోడు కోసం వెదుకుతూ ఈ ప్రాంతానికి చేరిందని పేర్కొంటున్నారు. ఆవాసం ఏర్పాటు చేసుకుంటే.. జన్నారం అటవీ డివిజన్ పులి ఆవాసాలకు అనువుగా ఉంది. గడ్డి మైదానాలతో వన్యప్రాణుల సంఖ్య పెరగడం, నీటిసౌకర్యం, దట్టమైన అడవులు పులికి ఆవాస యోగ్యంగా ఉంటాయి. ఆరు రోజులుగా మకాం వేసిన పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఆడపులి తోడయితే కొన్ని రోజుల్లో పులి పిల్లలను కనే అవకాశం ఉంది. అనువైన ప్రదేశం ఉన్నందున ఇక్కడే మకాం వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లోకి పశువులు, మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అలజడి తగ్గిస్తే పులి ఆవాసం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటుందని అంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. టైగర్ ట్రాకింగ్పై శిక్షణ జన్నారం అటవీ సిబ్బందికి టైగర్ ట్రాకింగ్పై శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగజ్నగర్కు చెందిన టైగర్ ట్రాకర్లతో నాలుగు రోజులు శిక్షణ ఇప్పించారు. పులి అడుగులు గుర్తించడం, ప్రత్యక్షంగా చూసే విధానం, కెమెరాలు ఏర్పాటు చేయడం, పులి మానిటరింగ్లో మెలకువలు నేర్పించారు. పులి జాడ ఎలా కనుగొనడం, జాగ్రత్తలు వివరించారు. పది రోజుల తర్వాత మరో నాలుగు రోజులు సైతం శిక్షణ ఇప్పించనున్నారు. -
జిల్లా కేంద్రంలో సుదర్శన్రెడ్డి పర్యటన
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలో పర్యటించా రు. సీఎం పర్యటన నేపథ్యంలో బహిరంగసభకు సంబంధించి పట్టణంలోని డైట్ కళాశాల, ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ ఛాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. అంతకు ముందు మావల బైపాస్ వద్ద ఎమ్మెల్యే బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్రెడ్డి, గండ్రత్ సుజాత, తదితరు లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. -
బాధితులకు సత్వర న్యాయం జరగాలి
ఆదిలాబాద్టౌన్: పోలీస్స్టేషన్లో అందే ఫిర్యాదుపై ప్రత్యేక సిబ్బందితో దర్యాప్తు జరిపించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది బాధితులు తమ సమస్యలను విన్నవించగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుల సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతీ ఫిర్యాదుపై జవాబుదారీతనం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, వామన్, తదితరులు పాల్గొన్నారు. అతివలకు అండగా షీ టీం ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని మహిళల భద్రత, రక్షణకు ఆదిలాబాద్ షీ టీం అండగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో 25 కాల్స్ రాగా మూడింటికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. 4 ఎఫ్ఐఆర్ కేసులు, 12 ఈ పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా వేధింపులను అరికట్టే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 97 హట్స్పాట్లను తనిఖీ చేసి మహిళలు, యువతులను వేధిస్తున్న 39 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వివరించారు. బాధిత మహిళలు, యువతులు ఆదిలాబాద్ షీ టీం బృందాన్ని 8712659953 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఔను..వాళ్లంతా ‘చేయి’ కలిపారు
● ఒక్కటైన కాంగ్రెస్ అసమ్మతి నేతలు కై లాస్నగర్: సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ఉప్పునిప్పుగా వ్యవహరించిన ఆ పార్టీ సీనియర్ నేతలు చేతులు కలుపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నుంచి సస్పెండై పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డి, రాజకీయంగా తలెత్తిన విభేదాలతో ‘కంది’ని వ్యతిరేకిస్తూ వచ్చిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి సోమవారం డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వారిని ‘కంది’ శాలువాలతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అరగంటపాటు సరదాగా మాట్లాడుకున్నారు. స్థానిక ఎన్నికల ముంగిట నేతలంతా ఒక్కటి కావడం పార్టీకి కలిసి రానుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఖరారు
కైలాస్నగర్: సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకోసం ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో శిలాఫలకాలను సిద్ధం చేస్తున్నారు. అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గం సభ వేదిక, పోలీస్ బందోబస్తు, పార్కింగ్, వేదికపై అతిథుల సిట్టింగ్ వంటి ఏర్పాట్లపై అధికారులతో చర్చించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్యామల దేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, తదితరులు పాల్గొన్నారు. ఽశంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు సీఎం పర్యటన సాగుతుందిలా.. మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరి 2గంటలకు జిల్లా కేంద్రంలోని ఎరోడ్రమ్లోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2.10 గంటలకు ఏఆర్ హెడ్క్వార్టర్స్కు చేరుకుంటారు. 2.10 నుంచి 2.35 వరకు పోలీస్ క్వార్టర్స్, భరోసా సెంటర్ను ప్రారంభిస్తారు. 2:35కు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. 2:40 వరకు శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 3.55 గంటలకు హెలిప్యాడ్కు బయలుదేరుతారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు కై లాస్నగర్: ఈ నెల 4న జరిగే సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం చేసేలా అన్ని ఽశాఖల అధికారులు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దన్నారు. స్టేజ్ ఏర్పాటు, వైద్య శిబిరం, పారిశుధ్యం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలన్నారు. పర్యటన రోజున అధికారులు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు. -
ప్రశాంత ఎన్నికలపై దృష్టి సారించాలి
సాత్నాల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టీ.వెంకన్న అన్నారు. సోమవారం మాంగుర్ల, మేడిగూడ ఆర్, సైద్పూర్ క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట్ రాజు పాల్గొన్నారు. పత్రాలు క్షుణ్నంగా పరిశీలించాలి తాంసి: అభ్యర్థులు వేసే నామినేషన్ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు టి.వెంకన్న ఎన్నికల సిబ్బందికి సూచించారు. సోమవారం తాంసి, కప్పర్ల, బండల్నాగాపూర్ లో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎంపీడీవో గడ్డం మోహన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి భీంపూర్: ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వెంకన్న అన్నారు. సోమవారం పిప్పల్ కోటి, దండోరా క్లస్టర్లను ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. -
● రేపటి నుంచి పాఠశాలలకు ప్రత్యేక బృందాలు ● రికార్డులు, వసతులతోపాటు ఇతర అంశాలు పరిశీలన ● వారానికోసారి అధికారులకు నివేదిక ● 36 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్
ఆదిలాబాద్టౌన్:సర్కారు బడుల బలోపేతానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పజెప్పింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎం, ప్రధానోపాధ్యాయులు తనిఖీలు చేపట్టనున్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం ఎనిమిది బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. బుధవారం నుంచి పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్కడి పరిస్థితులను విద్యా శాఖాధికారులకు నివేదిక రూపంలో అందించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యా పరిస్థితిపై పాఠశాల విద్యాశాఖకు ఎప్పటికప్పుడు రిపోర్టు అందజేస్తారు. బడి తీరు మారిందా?.. లేదా? అనే విషయాలపై ఆరా తీస్తారు. విద్యార్థుల ప్రగతితో పాటు రికార్డులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు, తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. రేపటి నుంచి.. ఆదిలాబాద్ జిల్లాలో డీఈవో పరిధిలో 708 పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు 6 మోడల్ స్కూళ్లు, 17 కేజీబీవీలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణను ఇప్పటికే మండల విద్యాధికారులు, సెక్టోరల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది నామ్కే వాస్తేగా తనిఖీలు చేపట్టడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సీనియర్ ఉపాధ్యాయులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. డిప్యూటేషన్పై ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు పనిచేయనున్నారు. జిల్లాలో 495 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వీటికి సంబంధించి 15 మంది ఉపాధ్యాయులను నియమించారు. 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఇద్దరు ఎస్జీటీలు, ఒక పీఎస్ హెచ్ఎం ఉంటారు. 103 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక పీఎస్ హెచ్ఎం, ఒక ఎస్జీటీ ఉంటారు. ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. 110 ఉన్నత పాఠశాలలు ఉండగా, రెండు టీమ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఏడుగురు ఎస్ఏలు, ఒకరు పీడీ, ఒక పీజీ హెచ్ఎం ఉన్నారు. మొత్తం 36 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్పై విధులను కేటాయించారు. వారంతా బుధవారం నుంచి పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. వారానికోసారి, లేనిపక్షంలో ప్రతీరోజు నివేదికను డీఈవో కార్యాలయంలో అందజేయనున్నారు. వీరి స్థానాల్లో సర్దుబాటు..బృందాలు సిద్ధం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలను తనిఖీ చేసేందుకు ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి 5 బృందాలు, యూపీఎస్కు ఒక బృందం, ఉన్నత పాఠశాలలకు 2 బృందాలను ఏర్పాటు చేశాం. బుధవారం నుంచి వీరు పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. పాఠశాలల్లో అకాడమిక్, పలు రికార్డులను పరిశీలించి డీఈవో కార్యాలయానికి వేదికలు సమర్పించాల్సి ఉంటుంది. వీరి స్థానంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేలా చర్యలు చేపడుతున్నాం. – అజయ్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి తనిఖీ బృందాలు పనిచేసే ఉపాధ్యాయుల స్థానంలో సర్దుబాటు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మూడుసార్లు జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో 2,628 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, 438 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 36 మందికి డిప్యూటేషన్ ఇవ్వడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడే అవకాశం ఉన్నట్లు పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 16 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలు అప్పజెప్పడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఏ మేరకు విద్యాశాఖ సర్దుబాటు చేయనుందో వేచిచూడాల్సిందే. -
అవగాహనతోనే ఎయిడ్స్ అంతం
ఆదిలాబాద్టౌన్: అవగాహనతోనే హెచ్ఐవీ, ఎయిడ్స్ను నియంత్రించవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కార్యాలయ సమావేశ మందిరంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమన్నారు. అనుమానితులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ ఏడాది ‘అడ్డంకులను అధిగమిద్దాం.. ఎయిడ్స్ ప్రతిస్పందనను మారుద్దాం’ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అంతకు ముందు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ రక్షణ లేని సెక్స్, కల్తీ రక్తం కారణంగా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందన్నారు. ఏఆర్టీ మందులు తీసుకుంటూ దీనిని దీర్ఘకాలిక వ్యాఽధిలా పరిగణించవచ్చన్నారు. ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేసిన వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. వ్యాసరచన, రంగోళి పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి సుమలత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, జిల్లా మలేరియా అధికారి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మరింత ఆర్థిక చేయూత
కై లాస్నగర్: పట్టణంలోని చిరు వ్యాపారులకు పీ ఎం స్వనిధి కింద అందించే రుణాల గడువును కేంద్ర ప్రభుత్వం 2030 వరకు పొడగించింది. రుణ ప రిమితిని సైతం పెంచింది. గతంలో చేపట్టిన సర్వేలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరోసారి సర్వే చేపట్టాలని ఆదేశించింది. ఆదిశగా మెప్మా సి బ్బంది కసరత్తు చేపట్టారు. సీవోల ఆధ్వర్యంలో స ర్వే చేస్తున్నారు. అర్హులను గుర్తించి ఐడీ కార్డులు జా రీ చేస్తారు. తద్వారా బ్యాంకుల ద్వారా రుణాలను అందించనున్నారు. దీంతో తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు, వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక స్వావలంబన కలుగనుంది. ఉద్దేశం ఏమిటంటే.. కరోనా వైరస్ ఉధృతితో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఆ సమయంలో వారికి ఆర్థిక చేయూతనందించాలని కేంద్రం నిర్ణయించింది. మెప్మా ద్వారా వారిని గుర్తించి ప్రత్యేకంగా ఐడీ కార్డులను జారీ చేసింది. అర్హులైన వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు మూడు విడతల్లో ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ (పీఎం స్వనిధి) పథకం ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు అందించింది. అయితే ఇటీవల ఈ పథఽకాన్ని నిలిపేసిన కేంద్రం తాజాగా ‘లోక్ కళ్యాణ్ మేళా’ పేరిట మళ్లీ పునరుద్ధరించింది. గతంలో రుణాలకు నోచుకోని వారిని కూడా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఐదు జోన్లుగా విభజన... ఆదిలాబాద్ పట్టణంలో వీధి వ్యాపారాలు నిర్వహించే ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల్లో సర్వే నిర్వహణ బాధ్యతలను సీవోలకు అప్పగించారు. దస్నాపూర్ వంతెన నుంచి కలెక్టర్చౌక్, పెద్ద మార్కెట్ ఏరియాకు ఆర్.పన్నాలాల్, కలెక్టర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ రైతు బజార్ వర కు టి.గంగన్న, వినాయక్చౌక్ నుంచి శివాజీచౌక్ వరకు దేవిచంద్, గాంధీ, అంబేడ్కర్ చౌక్ వరకు జె. పండరి, వివేకానంద చౌక్ నుంచి నేతాజీచౌక్, కలెక్టర్ చౌక్ నుంచి కలెక్టర్ క్యాంపు ఆఫీస్ వరకు డి.సునీత, ఎన్టీఆర్చౌక్ నుంచి రైల్వే స్టేషన్, పంజాబ్చౌ క్, అంబేడ్కర్చౌక్, నెహ్రుచౌక్ వరకు వై.సందీప్రెడ్డిని నియమిస్తూ మెప్మా పీడీ సీవీఎన్.రాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సీవోలు ఆయా ఏరియాల్లో వీధి వ్యాపారుల గుర్తింపునకు సర్వే చేస్తున్నారు. ఈ సర్వేను పర్యవేక్షించే బాధ్యతలు టీఎంసీ భాగ్యలక్ష్మి, ఏడీఎంసీ ఎ.వెంకటమ్మకు అప్పగించారు. రుణ పరిమితి పెంపు.. గతంలో మొదటి విడతలో రూ.10వేలు మంజూరు చేశారు. వాటిని సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి రెండో విడతలో రూ.15వేలు, వాటిని చెల్లించిన వా రికి మూడో విడత కింద రూ.50 వేలు మంజూరు చే శారు. తాజాగా ఈ పరిమితిని అదనంగా పెంచా రు. తొలి విడతలో రూ.15 వేలు అందించనున్నా రు. వాటిని 12 నెలల్లో తిరిగి చెల్లిస్తే రెండో విడతగా రూ.25 వేలు మంజూరు చేస్తారు. వీటిని 18 నెలల్లో చెల్లిస్తే మూడో విడత కింద రూ.50 వేలు మంజూ రు చేస్తారు. వీటిని 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లించిన వారికి వడ్డీపై 7 శాతం రాయితీ వర్తిస్తుంది. తొలి విడతలో రూ.50 వేల రుణ పరిమితి దాటితే రుణం అందించేవారు కాదు. కానీ ప్రస్తుతం యూపీఐ లింక్తో కూడిన రూ.30 వేల పరిమితితో ఉన్న రూపే క్రెడిట్ కార్డులను అందించనున్నారు. వాటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్థికంగా లబ్ధిపొందవచ్చు. పట్టణంలోని చిరు వ్యాపారుల వివరాలు మెప్మా సిబ్బంది గుర్తించిన చిరువ్యాపారులు : 9,075 మొదటి విడతలో రుణాలు పొందిన వారు : 6,993 రెండో విడతలో రుణాలు పొందిన వారు : 2,983 మూడో విడతలో రుణాలు పొందిన వారు : 84615 వరకు సర్వే పూర్తి కేంద్రం ఆదేశాల మేరకు పట్టణంలోని వ్యాపార ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించి సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 329 మందిని కొత్తగా గుర్తించాం. ఈ నెల 15 వరకు సర్వే పూర్తి చేసి అర్హులకు ఐడీ కార్డులు జారీ చేస్తాం. తద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తాం. మూడు విడతల రుణాలు పొందిన వారికి కొత్తగా రూ.30వేల పరిమితితో కూడిన క్రెడిట్కార్డులు అందిస్తాం. – కె.శ్రీనివాస్, మెప్మా డీఎంసీ -
రెండోవిడత నామినేషన్లు షురూ
కై లాస్నగర్: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం మొదలైంది. జిల్లాలో ఎనిమిది మండలాల్లోని 156 గ్రామ పంచాయతీలు, 1,260 వార్డు స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆశావహులు తొలిరోజునే ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. తొలి రోజున సర్పంచ్ స్థానాలకు 83 దాఖలు కాగా, వార్డు స్థానాలకు 30 నామినేషన్లు అందినట్లుగా జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్ తెలిపారు. అత్యధికంగా భీంపూర్ మండలంలో తొలి రోజునే 21 నామినేషన్లు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ నెల 2వరకు స్వీకరించనున్నారు. ఆయా మండలాల వారీగా అందిన నామినేషన్ల వివరాలు మండలం సర్పంచ్ వార్డుమెంబర్ఆదిలాబాద్రూరల్ 11 2 మావల 07 8 బేల 08 3 జైనథ్ 15 3 సాత్నాల 04 4 భోరజ్ 11 2 తాంసి 06 0 భీంపూర్ 21 8 -
అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట
ఆదిలాబాద్టౌన్: సైబ ర్ నేరాలను అప్రమత్తతతో అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. ఆది వారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరా లకు సంబంధించిన వి వరాలు వెల్లడించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అడ్డుకోవడానికి ‘ఫ్రాడ్కా ఫుల్స్టాప్’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వారంలో 25 సైబర్ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ వారంలో ఆదిలాబాద్ పట్టణంలోని వన్టౌన్ పరిధి లో ఇన్స్ట్రాగామ్లో దుస్తులు కొనుగోలు చేసి రూ.1,850లు నకిలీ వెబ్సైట్ ద్వారా చెల్లించగా, అతడి అకౌంట్ నుంచి రూ.29,600 పోగొట్టుకున్నట్లు తెలిపా రు. ఉట్నూర్లో పార్ట్టైమ్ జాబ్పేరిట ఇన్స్ట్రాగామ్లో మెస్సేజ్ రాగా మహిళ నుంచి రూ.50వేలు కాజేశారు. మావల మండలంలో వాట్సాప్లో వచ్చిన ఎస్బీఐ యోనో పేరుతో నకిలీ ఏపీకే ఫైల్ ద్వారా బాధితుడి అకౌంట్ నుంచి రూ.7వేలు కాజేసినట్లు తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఉద్యోగ విరమణ పొందిన పోలీసులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం ఉద్యోగ విరమణ పొందిన పీసీఆర్ ఎస్సై కె.నర్సయ్యను శాలువాతో సన్మానించి మెమోంటోను అందజేశారు. -
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్నగర్(బేల)/ఆదిలాబాద్రూరల్/ఇచ్చోడ/సిరికొండ: నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ టి.వెంకన్న అన్నారు. బేల మండలంలోని బేల, సిర్సన్న, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టి), యాపల్గూడ, ఇచ్చోడ మండల కేంద్రం, సిరికొండ మండల కేంద్రంలోని నామినేషన్ క్లస్టర్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీవైఎస్వో శ్రీనివాస్, ఎంపీడీవోలు ఆంజనేయులు, నరేశ్, మహ్మద్ రయిస్ఉల్లా, ఎన్నికల అధికారులు తదితరులున్నారు. -
విభేదాలు వీడుదాం.. సమష్టిగా సాగుదాం
కై లాస్నగర్: విభేదాలు వీడి పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్జాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆదివారం పార్టీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్గాలుగా ఉన్న నేతలంతా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పటిష్టత కోసం సమష్టిగా ముందుకు సాగుదామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించడంతో పాటు పరిషత్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ, గ్రంథాలయ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఆడె గజేందర్, సీనియర్ నాయకులు గండ్రత్ సుజాత, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బాలురి గోవర్ధన్ రెడ్డి, అల్లూరి సంజీవ్ రెడ్డి, చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సగం కూడా చేరలే!
● లక్ష్యం 1.16 కోట్లు.. వదిలింది 43.5లక్షలు ● చేప సీడ్ పంపిణీలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ● గడువు దాటుతున్నా పట్టించుకోని అధికారులు ● ఆందోళనలో మత్స్యకారులుకై లాస్నగర్: జిల్లాలో చేపపిల్లల సీడ్ పంపిణీలో తీవ్ర జాప్యమవుతోంది. సరఫరా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చెరువుల్లో వదలడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండగా.. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 1.16 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో వదలాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు అందులో సగం కూడా పూర్తి కాలేదు. సీడ్ వేసే అదును దాటుతుండటంతో చేపల ఎదుగుదలపై ప్రభావం చూపనుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కులవృత్తిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ఆర్థి కంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి గాను జి ల్లాలోని 224 చెరువులు, రిజర్వాయర్లలో కలిపి కోటి16 లక్షల 24వేల చేప పిల్లలను వదలాలని ప్ర భుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. వీటి సరఫరాకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించింది. దీంతో సదరు కాంట్రాక్టర్ అక్టోబర్ నెలాఖరులోగా సీడ్ పంపిణీ షురూ చేశారు. 35నుంచి 40 మి.మీ సైజ్ చేపపిల్లలు 83.54లక్షలను 216 చెరువుల్లో వదలాలని లక్ష్యంగా కేటాయించగా అందులో ఇప్పటి వరకు కేవలం 72 చెరువుల్లో మాత్రమే 34.65లక్షల సీడ్ వదిలారు. ఇంకా 144 చెరువులకు చేప చేరనేలేదు. అలాగే సాత్నాల, మత్తడివాగు, కరత్వాడ వంటి 8 ప్రధాన రిజర్వాయర్లలో 80 నుంచి 100 మి.మీ సైజ్ చేప సీడ్ 32.70లక్షలు వేయాల్సి ఉండగా అందులో మూడింటిలో కేవలం 8.40లక్షలు మాత్రమే వదిలారు. ఐదు రిజర్వాయర్లలో 24.30లక్షల చేప పిల్లలను వేయాల్సి ఉంది. మొత్తంగా చెరువులు, రిజర్వాయర్లలో కలిపి 1.16కోట్ల సీడ్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 43.50లక్షలను మాత్రమే వదిలారు. నవంబర్ నెలాఖరులోపు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచించినా ఇప్పటి వరకు సగం కూడా సీడ్ వదలకపోవడం గమనార్హం. ఎదుగుదలపై తీవ్ర ప్రభావం .. జిల్లాలోని చెరువుల్లో నీరు సాధారణంగా ఫిబ్రవరి నుంచే అడుగంటడం మొదలవుతుంది. మార్చి, ఏప్రిల్ నాటికి మెజార్టీ చెరువులు ఎండిపోయే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో చేప సీడ్ను ఆలస్యంగా వదలడం ద్వారా వాటి ఎదుగుదలపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశముంటుందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. చేపలు పట్టే సమయంలో అవి తగిన బరువు ఉండక నష్టం తప్పదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు నవంబర్ చివరి లోపు సీడ్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినా మత్స్య శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాంచేప సీడ్ పంపిణీ ప్రక్రియ ప్రారంభంలోనే కొంత ఆలస్యమైంది. జిల్లాలోని ఆయా చెరువులు, రిజర్వాయర్లలో సీడ్ వదిలే ప్రక్రియ కొనసాగుతుంది. త్వరితగతిన పూర్తి చేసేలా శ్రద్ధ వహిస్తాం. – భాస్కర్, జిల్లా మత్య్సశాఖ అధికారి -
అప్రమత్తంగా వ్యవహరించాలి
ఇంద్రవెల్లి: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వా తావరణంలో నిర్వహించేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలకేంద్రంలోని నామినేషన్ స్వీ కరణ కేంద్రాన్ని ఆదివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో జీవన్రెడ్డి తదితరులున్నారు. ఆదిలాబాద్రూరల్: మావల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ని ర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడారు. రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల అనుమానాలు ని వృత్తి చేసేలా హెల్ప్డెస్క్ల వద్ద ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆయన వెంట మావల ప్రత్యేక అధికారి రాజలింగు, తహసీల్దార్ వేణు, ఎంపీడీవో కృష్ణవేణి, తదితరులున్నారు. -
కలమడుగులో హార్వెస్టర్..
జన్నారం: మండలంలోని కలమడుగు గ్రామంలో శనివారం వరి పంట కోస్తుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించి హార్వెస్టర్ దగ్ధమైంది. ఫైర్ అధికారి దేవనంద్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. జక్కుల భూమన్నకు చెందిన హార్వెస్టర్ ప్రకారం కలమడుగులో వరి పంటను కోస్తుండగా డీజిల్ ట్యాంకర్ వేడెక్కి అకస్మత్తుగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పై నుంచి కిందికి దూకాడు. గ్రామస్తులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని మంటలార్పారు. ప్రమాదంలో సీట్లు, టైర్, పై భాగం దగ్ధమైంది. రూ.4.50 లక్షల నష్టం జరిగినట్లు ఫైర్ అధికారి తెలిపారు. -
ముగిసిన తొలివిడత
కైలాస్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో తొలివిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారంతో పూర్తయింది. రెండో విడ త ఆదివారం నుంచి షురూ కానుంది. ఆదిలాబా ద్ నియోజకవర్గంలోని ఆరు, బోథ్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్ రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్ వంటి ఎనిమిది మండలాల్లోని 156 గ్రామ పంచాయతీలు, 1,260 వార్డు స్థానా లకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 4,5 గ్రామ పంచాయతీలను కలిపి ఒక్కో క్లస్టర్గా ఏర్పాటు చేశారు. మొత్తం 39 క్లస్టర్లలో నా మినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2వ తేదీ వరకు ఆయా మండలాల్లోని పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పోటీకి సిద్ధపడుతున్న ఆశావహులు నామినేషన్ల దాఖలుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని సంసిద్ధంగా ఉన్నారు. రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివా రంతో ముగిసింది. ఏజెన్సీ పరిధిలోని ఆరు మండలాల్లో గల 166 గ్రామ పంచాయతీలు, 1,390 వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరించారు. శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాలకు చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. పలు చోట్ల రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఆయా మండలాల్లోని పంచాయతీలకు ఎన్ని నామినేషన్లు వ చ్చాయనేది ఆదివారం లెక్క తేలనుంది. -
సత్యనారాయణస్వామే తిరిగి రప్పించాడు..!
లక్సెట్టిపేట: ‘నన్ను ఆ గూడెం సత్యనారాయణ స్వామే తిరిగి రప్పించాడు. నా ఆరోగ్యం గురించి సహకరించిన వారికి, దేవుళ్లకు ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు..’ అంటూ మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) భావోద్వేగానికి గురయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఐబీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక దశలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. తన ఆరోగ్యం బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి, వైద్యులు వెళ్లవద్దని చెప్పినా సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ప్రజల కోసమే వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఒకసారి సర్జరీ అయిందని, మరోసారి చిన్నపాటి సర్జరీ కోసం మళ్లీ కోయంబత్తూరు వెళ్తున్నట్లు తెలి పారు. తనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఎవరికీ రావొద్దని, వచ్చినా చికిత్స అందుబాటులో ఉండేందుకు మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయని, సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. తన ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్నానని, అందుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాలుగు నెలల తర్వాత పట్టణానికి వచ్చిన పీఎస్సార్కు కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఐబీ వరకు బైక్ ర్యాలీ, డీజే చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల సర్పంచ్ అభ్యర్థుల పేర్ల జాబితాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఎండీ ఆరీఫ్, పింగిళి రమేష్, చెల్ల నాగభూషణం, చింత అశోక్కుమార్, పూర్ణచందర్, శ్రీనివాస్, దాసరి ప్రేంకుమార్, రాజు పాల్గొన్నారు. -
20 ఏళ్లుగా సేవలు..
ఇచ్చోడ: ఈయన పేరు పాముల మోతీరాం. ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్ సర్పంచ్గా 20 ఏళ్లుగా ప్రజలకు సేవలందించారు. 1974 నుంచి 1994 వరకు పైసా ఖర్చుచేయకుండా నాలుగు పర్యాయాలుగా సర్పంచ్గా ఎంపికయ్యారు. మొదట, రెండుసార్లు వార్డు సభ్యుడిగా, ఆపై సర్పంచ్గా ఎన్నికయ్యారు. అప్పట్లో వార్డు సభ్యుడిగా ఎంపికై న వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్ పదవిని పొందేవారు. అలా రెండుసార్లు చొప్పున జనరల్, ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్గా గెలుపొందారు. అప్పట్లో కోకస్మన్నూర్లో వేసవిలో నీటి ఎద్దడి ఉండేది. 1983లో బోథ్ నియోజకవర్గంలోనే మొదటిసారిగా వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. ఇంటింటికి నల్లాల ద్వారా నీరందించారు. -
భర్త రెండు పర్యాయాలు..భార్య ఏకగ్రీవానికి నిర్ణయం
ఇంద్రవెల్లి: ఈయన పేరు కినక జుగాదిరావ్. ఇంద్రవెల్లి మండలం వాల్గోండ సర్పంచ్గా రెండు పర్యాయాలు పనిచేసి ప్రజలకు సేవలందించారు. 2014లో వాల్గోండహిరపూర్ ఉమ్మడి పంచాయతీ సర్పంచ్గా ఈయన విజయం సాధించారు. సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మాణాలు నిర్మించారు. తాగునీటి సమస్య పరిష్కరించారు. హీరపూర్ నుంచి వేరు అయిన వాల్గోండ పంచాయతీకి 2019 ఎన్నికల్లో తొలి సర్పంచ్గా గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం వాల్గోండ పంచాయతీ (ఎస్టీ మహిళ) రిజర్వేషన్ వచ్చినప్పటికి ఆయన భార్య సునీతకు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఇటీవల పంచాయతీ పరిధి గ్రామాల ప్రజలు నిర్ణయించారు. -
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదిలాబాద్టౌన్: సమైక్య రాష్ట్రంలో అన్యాయాలను సహించక కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్జా దవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం దీక్ష దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహాం, అమరవీరుల స్తూపం చిత్రపటానికి పూ ల మాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం మాట్లాడారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలి పదేళ్ల పాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా 56 సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. పార్టీకి కార్యకర్తలే బలమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అంతకు ముందు జైనథ్ మండలం లక్ష్మిపూర్, రామాయి గ్రామస్తులు, దొబీ కాలనీ వాసులు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఇందులో పార్టీ నాయకులు మనోహర్, యూనీస్ అక్బా నీ, తుల శ్రీనివాస్, సాజిదొద్దీన్, కిరణ్, పవన్ నాయక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సివిల్ సర్వీసెస్ అధికారుల పర్యటన
కై లాస్నగర్: శిక్షణలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారు ల పర్యటన శనివారంతో ముగిసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, ప్రజల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన అంశాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్తో వారు పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వృత్తిపరమైన శిక్షణ నిమిత్తం జిల్లాకు వచ్చే అధికారులకు ఇక్కడ ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇవి ఉద్యోగ జీవితంలో ఎంతో తోడ్పడతాయని తెలిపారు. వారికి ఆల్ది బెస్ట్ తెలిపారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఏవో శ్రీధర్ స్వామి పాల్గొన్నారు. -
ఉదయం అలా.. సాయంత్రం ఇలా
నేరడిగొండ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని నాగమల్యాల్ గ్రామంలో శనివారం ఉదయం కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడంతోపాటు మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా సాయంత్రం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురు గ్రామస్తులు ఆయన్ను కలిసి మేము పార్టీలో చేరలేదని, వారే మాకు కండువా కప్పారని తెలిపారు. కాగా ఒకేరోజు రెండు పార్టీల కండువాలు కప్పుకోవడం పట్ల పలువురు చర్చించుకుంటున్నారు. -
ఆస్తులు లేకున్నా మంచి పేరుంది
మందమర్రిరూరల్: ఈయన పేరు లింగాల మల్లయ్య. మందమర్రి మండలం అందుగులపేట పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2006లో (జనరల్), 2012లో (ఎస్సీ జనరల్) జరిగిన పోటీల్లో ఇండిపెండెంట్గా గెలిచి ప్రజలకు సేవలందించారు. 2017లో (జనరల్ సీటు) కావడంతో ఓడిపోయాడు. 2001లో ఎస్సీ మహిళ రిజర్వేషన్తో ఆయన భార్య లక్ష్మి పోటీ చేసి గెలిచింది. ప్రస్తుతం అందుగులపేటకు రిజర్వేషన్ మారడంతో పోటీ చేయడం లేదు. ప్రస్తుతం ఇంటి వద్ద టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దంపతులకు ఎలాంటి ఆస్తులు లేవని, గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారు. -
యువతులు, బాలికలకు అండగా ‘పోలీస్ అక్క’
ఆదిలాబాద్టౌన్: మహిళలు, యువతులు, బా లికలకు తోబుట్టువుగా మారి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో ‘పోలీస్ అక్క’ విధులు నిర్వహిస్తున్న 19 మంది సిబ్బంది, షీ టీం బృందంతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలను సందర్శించి పోలీస్ అక్క కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 27 కౌన్సెలింగ్ కార్యక్రమాలు, 18 ఈ పెట్టి కేసులు నమోదు చేసి ఆకతాయిల ఆగడాలు అడ్డుకున్నట్లు తెలి పారు. ఇందులో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజ ల్ సింగ్, ఆదిలాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి ఇచ్చోడ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో జైనథ్, పిప్పర్వాడ, ఘన్పూర్, లక్ష్మిపూర్ అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో పాటు నేరడిగొండ మండలం రోల్మామాడ వద్ద మరో చెక్పోస్టు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, ఎస్హెచ్వో బండారి రాజు ఉన్నారు. -
సమన్వయం దిశగా..
సాక్షి, ఆదిలాబాద్: ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నరేశ్ జాదవ్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత దిశగా దృష్టి సారించారు. సీనియర్ నేతల మధ్య విభేదాలు తొలగించి ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్ర యత్నాలు ముమ్మరం చేశారు. పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై ఫోకస్ పెట్టారు. పాత, కొత్త, సీనియర్, జూనియర్ తేడా లేకుండా అందరు నేతలను కలుస్తూ కలిసి రావాలని కోరుతున్నారు. ప ట్టణంలోని స్థానిక టీఎన్జీవోస్ భవన్లో పార్టీ జిల్లా సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ వేదిక ద్వారా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుకోసం నేతలు కలిసికట్టుగా ముందుకెళ్లేలా చొరవ చూపుతున్నారు. నేతలను కలుస్తూ.. మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్రెడ్డిలను శనివారం కలిశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఆదిలాబాద్ వచ్చిన మొదట్లోనే సీని యర్ నాయకురాలు గండ్రత్ సుజాత, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డిల మద్దతు కోరారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా లేకపోయినప్పటికీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఆయన వర్గీయులు కూడా నరేశ్తో కలిసి ముందడుగు వేస్తున్నారు. బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్తో కూడా మంతనాలు జరిపారు. ఇక ఆదివారం జరిగే సమావేశం ద్వారా పార్టీలో సమన్వయాన్ని చాటి ఎన్నికలకు ఏకతాటిగా ముందుకెలుతున్నామనే సంకేతాలు ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు .. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో డీసీసీ అధ్యక్షులు పాల్గొనగా జిల్లా నుంచి నరేశ్ జాదవ్ కూడా హాజరయ్యారు. జిల్లాలో నేతలందరినీ సమన్వయం చేసుకోవాలని అధిష్టానం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాలో ముఖ్య నేతలందరినీ ఆయన కలుస్తున్నారు. సీఎం టూర్ నేపథ్యంలో .. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 4న జిల్లాకు రానున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల విషయంలోనూ ఆదివారం నిర్వహించనున్న సమావేశంలో ముఖ్య నేతలంతా కలిసి చర్చించనున్నారు. సభ విజయవంతం చేయడం ఇప్పుడు పార్టీ నేతల భుజస్కంధాలపై ఉంది. ఈ నేపథ్యంలో నరేశ్జాదవ్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అంతేకాకుండా జిల్లాకేంద్రంలో పార్టీ ఆఫీస్ ప్రారంభించేందుకు కూడా కార్యాచరణ చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ కేంద్రంగానే కార్యకలాపాలు ఉండాలనే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. -
పల్లెల్లో చెరగని ముద్ర
గ్రామాలు ప్రగతిపథంలో తీసుకెళ్లాలనే లక్ష్యం.. ప్రజల మద్దతు, సహకారంతో ఒకప్పుడు పంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవి. సర్పంచులు తమ పదవీకాలంలో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడం, పేదలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు సేవలందించారు. పల్లెల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తమదైన చెరగని ముద్రవేశారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న సర్పంచులపై సాక్షి ప్రత్యేక కథనం. తాంసి: ఈయన పేరు జింక జైహింద్. తాంసి సర్పంచ్గా 25 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదువు అంతంతే అయినే యువకుడి ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. 1975 నుంచి 2001 వరకు ఐదు పర్యాయాలు 25 ఏళ్ల పాటు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 40 కుటుంబాలకు ఇళ్లు నిర్మించడం, గ్రామస్తుల సహకారంతో పాఠశాల, కళాశాలకు స్థలం కేటాయించారు. మరో ఐదేళ్ల పాటు సర్పంచ్గా ఉండాలని ప్రజలు కోరిన స్వచ్ఛందంగా వద్దనుకుని వేరేవారికి అవకాశమిచ్చారు. గ్రామం చివరలో చాయ్ హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో 2022 ఆగస్టులో మృతిచెందాడు. ఆయన మంచితనం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తాంసితోపాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలు ఇప్పటికి చెబుతుంటారు. ఐదు పర్యాయాలు ఏకగ్రీవం -
స్వాహా చేసి .. పోటీకి దూరమై
కై లాస్నగర్: గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచ్లది కీలకపాత్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటా యించే నిధులతో పాటు స్థానికంగా వసూలయ్యే పన్నులను సక్రమంగా వినియోగిస్తూ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాల్సిన బాధ్యత వారిదే. అయితే జిల్లాలో కొంతమంది సర్పంచ్లు అడ్డదారి తొక్కారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీంతో డిఫాల్టర్లుగా మిగిలి సర్పంచ్ పదవీకి పోటీకి అనర్హులుగా మిగిలారు. వారి వివరాలను జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించారు. అయితే స్వాహా చేసిన సొమ్ము రికవరీని అధికారులు విస్మరించడం గమనార్హం. రూ.1.49 కోట్ల నిధుల దుర్వినియోగం జిల్లాలో 1990 నుంచి 2024 వరకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి చేపట్టిన వారి లో 46 మంది నిధులను దుర్వినియోగం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన రూ.1.49 కోట్ల నిధులను పక్కదారి పట్టించారు. అధికారులు విచారణ జరిపి నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్దారించినా వారు నయాపైసా తిరిగి ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. ఇందులో అత్యధికంగా 2006–10 సమయంలో 18మంది, 2013–18 సమయంలో నలుగురు నిధులను పక్కదారి పట్టించిన ట్లు తేలింది. ఇందులో అత్యధికంగా జైనథ్ మండలంలో 12మంది, తాంసిలో ఎనిమిది మంది, బో థ్లో ఆరుగురు, ఉట్నూర్లో నలుగురు, ఇచ్చోడలో ముగ్గురు, ఆదిలాబాద్ రూరల్లో నలుగురు, తలమడుగు, గుడిమత్నూర్, బేలలో ఇద్దరేసి చొప్పున, నేరడిగొండ, నార్నూర్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లిలో ఒక్కొక్కరు చొప్పున నిధులను స్వాహా చేసి డిఫాల్టర్లుగా నిలిచి పోటీకి దూరమయ్యారు. తాజా మాజీలు ముగ్గురు.. తాజా మాజీలుగా మారిన వారిలో ముగ్గురు అనర్హులుగా తేలారు. 2019–24 వరకు సర్పంచ్గా పనిచేసిన వారిలో ఉట్నూర్ మండలం హస్నాపూర్లో అత్యధికంగా రూ.37లక్షల 93వేల 930 నిధుల దు ర్వినియోగం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే ఇచ్చోడ మండలం నర్సాపూర్–టి సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి రూ.22లక్షల13వేల 831 నిధులను స్వాహాచేశారు. ఉట్నూర్ మండలంలోని శ్యాం నాయక్ తండా సర్పంచ్ రూ.2లక్షల 23వేల157 నిధులు దుర్వినియోగం చేసినట్లుగా తేలింది. వీరు కూడా ప్రస్తుతం పోటీకి అనర్హులుగా మిగిలారు. అటకెక్కిన రికవరీ ... దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాల్సిన జిల్లా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సర్పంచ్ల పదవీకాలం ముగిసి న వెంటనే వారితో తమకు సంబంధం లేదనట్లుగా వ్యవహరిస్తున్నారు. మొక్కుబడిగా నోటీసులు జారీ చేసి సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో దుర్వినియోగమైన సొమ్ములో ఇప్పటి వరకు నయాపైసా రికవరీ కాకపోవడం గమనార్హం. నిధుల రికవరీకి చర్యలు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. స్వాహా చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని తాజా మాజీ సర్పంచ్లకు నోటీసులు జారీ చేస్తాం. వాటికి స్పందించని పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్)ను ఉపయోగించైనా తిరిగి వసూలు చేసేలా చర్యలు చేపడుతాం. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
● ఐదో ప్రయత్నంలో ఐపీఎస్కు ఎంపిక ● పట్టుదలకు శ్రమ తోడైతే విజయం తథ్యం ● ‘సాక్షి’తో ఏఎస్పీ పి.మౌనిక
ఏఎస్పీ పి.మౌనిక ‘సివిల్స్ సాధించాలనేది నాన్న కల.. ఆయన మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.. చివరకు విరమించుకున్నారు.. అప్పుడే అనుకున్నా.. ఎలాగైనా దానిని నెరవేర్చాలని.. ఈ క్రమంలో పీహెచ్డీని సైతం వదిలేశా.. పుస్తకాలతో కుస్తీ పట్టా.. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు ప్రయత్నాల్లో పరాజయం.. అయినా వెనుకడుగు వేయలేదు.. లక్ష్యం వీడలేదు.. నాన్న మార్గదర్శకంలో ముందుకు సాగా.. ఐదోసారి సత్తా చాటా.. ఐపీఎస్కు ఎంపికయ్యా.. డాడీ కల నెరవేర్చా.. ఆయన కళ్లల్లో ఆనందం చూశా.. సాధించాలనే తపనకు శ్రమ తోడైతే కొంత ఆలస్యమైనా విజయం తథ్యమని ఏఎస్పీ పి.మౌనిక అన్నారు. అందుకు తానే నిదర్శనమని చెప్పారు. ఇటీవల జిల్లాలో బాధ్యతలు చేపట్టిన ఆమె ‘సాక్షి’తో శనివారం తన ప్రస్తానంపై ముచ్చటించారు. – ఆదిలాబాద్టౌన్కుటుంబ నేపథ్యం ... మాది హైదరాబాద్లోని ఎల్బీనగర్. నాన్న పోరిక రాంకుమార్. డిఫెన్స్లోని బీడీఎల్లో ఏజీఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అమ్మ వాణికుమారి. భద్రాచలంలో పెట్రోల్ బంక్ల నిర్వహణతో పాటు సేంద్రియ వ్యవసాయం చేస్తారు. తమ్ముడు మోహిత్ కుమార్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. నాన్న సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఎంపికవ్వలేదు. దీంతో నన్ను సివిల్స్కు ప్రోత్సహించారు. ఆటంకా లు ఎదురైనా కుంగిపోవద్దని వెన్నుతట్టారు. మార్గదర్శనం అందిస్తూ విజయబాటలో నడిపించారు. చదువంతా హైదరాబాద్లోనే.. నా చదువంతా హైదరాబాద్లోనే సాగింది. టెన్త్ వ రకు డీఏవీ పబ్లిక్ స్కూల్, ఇంటర్ శ్రీ చైతన్యలో పూ ర్తిచేశా. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ తర్వాత జర్మనీకి వెళ్లా. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ మూడేళ్లు చదివిన త ర్వాత మధ్యలోనే వదిలేశా. నాన్న కోరిక మేరకు హైదరాబాద్కు వచ్చి సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. నాలుగు సార్లు ప్రయత్నించినా లక్ష్యం చేరుకోలేదు. కొంత నిరుత్సాహంతో పాటు అటు పీహెచ్డీ సైతం వదిలి వచ్చాననే ఆందోళనకు గురయ్యా. ఈ క్రమంలో నాన్న వెన్నుతట్టి ప్రోత్సహించారు. లోపాలను సవరించుకుని ముందుకు సాగా. 2021లో సివిల్స్లో 637వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యా. పెద్దల అంగీకారంతోనే వివాహం ముస్సోరిలో వంద రోజుల పాటు ఐపీఎస్ శిక్షణ పొందాను. తర్వాత హైదరాబాద్లోని నేషనల్ పో లీస్ అకాడమీలో రెండేళ్ల పాటు ట్రైనింగ్ సాగింది. ఐపీఎస్ శిక్షణ సమయంలో ప్రస్తుతం ఐటీడీఏ పీవో గా పనిచేస్తున్న యువరాజ్ మర్మాట్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేయగా వారు అంగీకరించారు. 2023 ఆగస్టు 21న చత్తీస్గఢ్లో వివా హం చేసుకున్నాం. మర్మాట్ స్వగ్రామం రాజస్థాన్లోని సవాయిమాదాపూర్. పెళ్లయిన తర్వాత వేర్వే రు ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకే జిల్లాలో పని చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. వంట చేయడం, జిమ్కు వెళ్లడం నా హాబీ. యువత లక్ష్యసాధనపై దృష్టి సారించాలి కృషి , పట్టుదల ఉంటే లక్ష్యం నెరవేర్చడం కష్టమేమి కాదు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాల బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాకు ఆకర్షితులు కావద్దు. ముఖ్యంగా అమ్మాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయవద్దు. ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలి. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే ఆశ అనర్థాలకు దారి తీస్తుంది. క్రమశిక్షణ అలవర్చుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. -
అభివృద్ధిలో మార్క్
లక్ష్మణచాంద: ఈయన పేరు అట్ల రాంరెడ్డి. లక్ష్మణచాంద సర్పంచ్గా 31 ఏళ్లుగా పనిచేశారు. 1970 నుంచి 2001 వరకు సర్పంచ్గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. 1970లో ఎన్నికై 1981 వరకు సర్పంచ్గా కొనసాగాడు. 1988 వర కు, అదే ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995 జ రిగిన ఎన్నికల్లో గెలుపొందారు. గ్రా మ అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. ప్రాథమికను ఉన్నత పాఠశాలను అప్గ్రేడ్, బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటు, లక్ష్మణచాంద నుంచి న్యూ కంజర్, మండల కేంద్రం నుంచి ధర్మారం, తిర్పెల్లి నుంచి అనంతపేట్ వరకు రోడ్డు నిర్మించారు. గ్రామస్తుల సహకారంతో 1988లో సహకార జూనియర్ కళాశాలఏర్పాటు చేయించారు. 1998లో ఎస్వీజీ డిగ్రీ కళాశాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. -
సివిల్స్ ప్రిపరేషన్.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఓ విద్యావంతురాలు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన బానోత్ కావేరి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కోసం మహారాష్ట్రలో శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతోంది. ఈమె తండ్రి బానోత్ గజానంద్ నాయక్ 15ఏళ్లు నార్నూర్ సర్పంచ్గా పని చేశారు. ఈసారి రిజర్వేషన్ మారడంతో తన వారసురాలిగా కావేరిని బరిలోకి దింపారు. మండల కేంద్రం నార్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేశారు. పుట్టినగడ్డకుసేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు కావేరి తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని కన్కపూర్లో దూదిగాం చిన్న సాయన్నకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయన్న కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం వెళ్లారు. అదేగ్రామానికి చెందిన గండ్ల తులసిబాయి పక్కన అద్దెకు ఉంటుంది. ఈమె నూతనంగా ఇంటి నిర్మించుకుంటుంది. ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లింది. మధ్యాహ్నం ఒక్కసారిగా చిన్న సాయన్న పెంకుటిల్లు నుంచి మంటలు వచ్చాయి. ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని సింగిల్ ఫేజ్ మోటారుతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న భైంసా ఆగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేశారు. సాయన్నకు చెందిన రెండు తులాల బంగారు ఆభరణాలు, తులసిబాయి ఉన్న అద్దెంట్లో రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్ఐ లలిత ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కాగా, దేవుడి వద్ద వెలిగించే దీపం వల్ల షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండవచ్చనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
విద్యార్థినిని వేధించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని విద్యానగర్లోని పారామెడికల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమ పేరిట వేధింపులకు గురిచేసిన యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఫైజాన్.. నెల క్రితం కళాశాలలో పరీక్ష ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థిని ప్రేమిస్తున్నానని ఇబ్బందులకు గురిచేశాడు. చేతిలో ఉన్న సెల్ఫోన్ను తీసుకుని పగులగొట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసి ఫైజాన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రీలాన్స్ జర్నలిస్టుపై.. ఆదిలాబాద్రూరల్: పట్టణానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు ఫిరోజ్ఖాన్పై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 26న సాయంత్రం ఫిరోజ్ఖాన్తోపాటు మరో వ్యక్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. సరిగా డ్యూటీ చేయడం లేదని రెస్టారెంట్లు తనిఖీ చేయడం లేదని బెదిరించారు. రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష మావల పీఎస్లో ఫిర్యాదు చేసింది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కులంపేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం కారు నిలిపిన చోట ఫొటో తీసి, అధికారిగా ఉండి బ్లాక్ఫిల్మ్ పెట్టావని వార్త రాసి అధికారికే పోస్టు చేశారు. ‘రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం’నేరడిగొండ: రైతుల ఆత్మహత్యల గోసను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. మండలంలోని కిష్టాపూర్కు చెందిన కౌలు రైతు సోలాంకి శ్రీకాంత్ ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకోగా, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రెండు మూడేళ్లుగా పంట దిగుబడి రాలేదని మనోవేదనకు గురై ఉరేసుకున్నాడు. పంటకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబానికి జీవో నం.194 ప్రకారం రూ.6లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. నాయకులు బుపేందర్, సంతోష్, ప్రమోద్ ఉన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జీల నియామకంఆదిలాబాద్: బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇన్చార్జీలను శనివారం నియమించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్కు మాజీ ఎమ్మెల్యే అరుణతార, మంచిర్యాలకు కె.ఓదెలు, నిర్మల్కు గోపిడి స్రవంతిరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కోమల ఆంజనేయులను నియమించారు. -
దారి.. వేదన
కైలాస్నగర్/ఉట్నూర్రూరల్: జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో మౌలిక వసతులు కరువయ్యాయి. ఏళ్లుగా రహదారి సౌకర్యం లేక ఆదివాసీల ఇక్కట్లు వర్ణనాతీతం. గుట్టలు, వాగుల మధ్య ఉన్న మట్టి, గతుకుల దారులే వారికి దిక్కవుతున్నాయి. అత్యవసర సమయంలో అంబులెన్స్లు వెళ్లలేని దుస్థితి. ఈ క్రమంలో సకాలంలో వైద్యసేవలు అందక ప్రాణాలు గాలిలో కలుస్తున్న ఘటనలు అనేకం. పురిటి నొప్పులతో ఉన్న గర్భిణులను ఆసుపత్రులకు చేర్చడం కుటుంబీకులకు సవాలుగా మారుతోంది. ఎన్నికలప్పుడే కనిపించే నేతలు అనంతరం తమ వైపు చూడడం లేదని అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ, ఉట్నూర్ మండలాల్లోని ఆదివాసీ గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేదు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఇప్పటికీ గిరిపుత్రులు మట్టిరోడ్లపైనే ప్రయాణం సాగించాల్సి వస్తోంది. వర్షాకాలంలో బురదమయంగా మారిన దారిపై అడుగుతీసి అడుగువేయలేని దుస్థితి. పురిటి నొప్పుల సమయంలో గర్భిణులను, అలాగే గుండెపోటు, పిట్స్కు గురైన వారిని అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారుతోంది. అంబులెన్స్లు రాలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఉట్నూర్ మండలంలోని రాజులగూడ ఘటనే ఇందుకు నిదర్శనం. ఉట్నూర్ మండలం రాజులమడుగు గ్రామానికి వెళ్లే మార్గంలో ఇదీ పరిస్థితి.. రోడ్డు సౌకర్యం లేని గ్రామాలివే.. నార్నూర్ మండలంలోని భీంపూర్ పంచాయతీ పరిధి బొజ్జుగూడ(కొలాంగూడ)కు చెందిన ఆత్రం సోంబాయి ఈ ఏడాది ఆగస్టులో తీవ్ర అస్వస్థతకు గురైంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కుటుంబీకులు ఇలా ఓ తడకపై పడుకోబెట్టి రెండు కిలోమీటర్ల వరకు కాలినడకన తీసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. రహదారులు, వైద్యసేవలపై దృష్టి ఏజెన్సీ ప్రాంతంలోని రహదారులు, సెల్టవర్లతో పాటు వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. కలెక్టర్ శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాజులమడుగు గ్రామానికి సంబంధించిన గర్భిణి, శిశువు మృతి ఘటన బాధాకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం. మారుమూల గ్రామాల్లోని గర్భిణులను గుర్తించి ప్రసూతి సమయానికి ముందస్తుగానే ఆస్ప త్రులకు తరలించేలా వైద్యాధికారులను ఆదేశించాం. – యువరాజ్ మర్మాట్, ఐటీడీఏ పీవో -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఇచ్చోడ: ఎన్నికల నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తొలివిడత పంచా యతీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఆయా మండలా ల్లో గల పలు నామినేషన్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇచ్చోడ మండలంలోని కోకస్మన్నూర్ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ జాదవ్ రమేశ్, ఎంపీడీవో నరేశ్ తదితరులు ఉన్నారు. ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్ పంచాయ తీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అధికా రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయ న వెంట తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, తదితరులున్నారు. అలాగే నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ టి వెంకన్న సాయంత్రం పరిశీలించారు. నమోదైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలి ఉట్నూర్రూరల్: ఉట్నూర్, పులిమడుగు గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లను పరిశీ లించారు. అనంతరం ఎన్నికల నేపథ్యంలో ఉట్నూర్ ఎక్స్రోడ్ వద్ద విధులు నిర్వహిస్తున్న స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్తో మాట్లాడారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారుల ను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్, అధికారులు ఉన్నారు. సిరికొండ: మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ తుకారాం, ఎంపీడీవో మహ్మధ్ రయిస్ ఉల్లా, ఎంపీవో సంతోష్కుమార్, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్ ఉన్నారు. నార్నూర్లో ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ నార్నూర్: Ð]l$…yýlÌS MóS…{§ýl…ÌZ° ç³…^éĶæ$¡ M> Æ>Å-ÌS-Ķæ$…-ÌZ HÆ>µr$ ^ólíܯ]l ¯éÑ$¯ól-çÙ¯ŒS MóS…{§é-°² A§ýl-¯]lç³# MýSÌñæ-MýStÆŠ‡ Æ>gôæ-ÔèæÓÆŠ‡ çÜ…§ýl-ÇØ…^éÆý‡$. HÆ>µ-rϯ]l$ ç³ÇÖÍ…-^éÆý‡$. íܺ¾…¨MìS ç³Ë$ çÜ*^èl-¯]l-Ë$ ^ólÔ>Æý‡$. BĶæ$¯]l Ððl…r G…ï³-yîl-Ðø ç³#ÌêÏ-Æ>Ð]l#, çÜ*ç³-Ç…sñæ…yðl…sŒæ VýS…V>íÜ…VŠæ E¯é²Æý‡$. ˘ -
ఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ
కైలాస్నగర్: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నా మినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకుంది. ఏజెన్సీ పరిధిలోని ఆరు మండలాల్లో గల 166 పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, 1,390 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలి రోజున నామమాత్రంగా నామినేషన్లు రాగా రెండో రోజు పెరి గాయి. ఆశావహులు తమ మండలంలోని క్లస్టర్ కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ ప త్రాలు అందజేశారు. సర్పంచ్ స్థానాలకు శుక్రవారం 214 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 225 దాఖలైనట్లుగా జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్ తెలిపారు. శనివారంతో తొలివిడత నా మినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇప్పటివరకు ఆరు మండల్లాలో సర్పంచ్ స్థానాలకు 246 నామినేషన్లు అందగా, వార్డుమెంబర్లకు 240 అందాయి. చివరి రోజున ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. ఆయా మండలాల వారీగా శుక్రవారం అందిన నామినేషన్ల వివరాలు.. మండలం సర్పంచ్ వార్డుమెంబర్ ఇంద్రవెల్లి 49 42 ఉట్నూర్ 39 34 నార్నూర్ 32 26 గాదిగూడ 19 16 సిరికొండ 20 24 ఇచ్చోడ 55 83 -
ఎంబీ పత్రాలనే చించేశారు!
సాక్షి, ఆదిలాబాద్: ఎంబీ రికార్డు.. మెజర్మెంట్ బుక్.. ఇదీ నిర్మాణ, ఇంజినీరింగ్లో కీలకమైన పత్రం. అన్ని పనికొలతలు, పరిమాణాల అధికారిక రికార్డుగా పనిచేస్తుంది. కాంట్రాక్టర్ చెల్లింపులు, ఆడిట్లు, చట్టపరమైన సాక్ష్యాలకు ఆధారం. పని ప్రదేశం మొదలుకుంటే కాంట్రాక్టర్ పేరు, ప్రారంభ, పూర్తయిన తేదీ వంటి వివరాలుంటాయి. ప్రభుత్వ శాఖల్లో ఈ ఎంబీ రికార్డే అన్నింటికి ప్రామాణికం. అలాంటి ఎంబీ రికార్డు పత్రాలను చించేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ఈ వ్యవహారం రెండు రోజులుగా దుమారం రేపుతోంది. ట్రాక్టర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఓ అధికారి రికవరీ కోసం సూచిస్తూ జతచేసిన ఎంబీ పత్రాలను కాంట్రాక్టర్కు అనువుగా మరో ఉన్నతాధికారి ప్రోద్బలంతో తొలగించినట్లుగా చెప్పుకుంటున్నారు. ట్రాక్టర్ల కొనుగోలులో అక్రమాలు ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఈ ఏడాది మొదట్లో చెత్త సేకరణ కోసం మూడు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. డీఈగా ఉన్న ఓ అధికారి ఇన్చార్జి ఎంఈగా కూడా ఆ సమయంలో వ్యవహరించారు. మెజర్మెంట్ తీసుకుని ఆ ట్రాక్టర్లను ఓ షోరూం నుంచి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఆ అధికారి బదిలీపై వెళ్లారు. మరో అధికారి ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన గుర్తించారు. తక్కువ ధర కొటేషన్లు కాదని అసలు ధర కంటే ఎక్కువ కొటేషన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. బిల్లుల చెల్లింపులో ఈ అధిక మొత్తాన్ని రికవరీ చేయాలని ఆయన మెజర్మెంట్ బుక్లోని పత్రాల్లో నమోదు చేశారు. ఈ ప్రకారం ఆ రికవరీ జరిగి మిగతా బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించేలా వ్యవహారం సాగాలి. అయితే ఇక్కడే మొత్తం తారుమారైంది. ఆ అధికారి నమోదు చేసిన ఎంబీ పత్రాలను చించివేసి అదే బుక్లోని తదుపరి నంబర్లలో ఉన్న ఖాళీ పత్రాలను దానికి జతచేసినట్లుగా చెప్పుకుంటున్నారు. రూ.లక్షల్లో అవినీతి.. మున్సిపాలిటీలో మూడు ట్రాక్టర్లను కొనుగోలు చే శారు. వాస్తవంగా షోరూం ధర రూ.7.48లక్షలు ఉండగా అధికారులు రూ.8.70 లక్షలు చూయించ డం ద్వారా చేతివాటం ప్రదర్శించారని ప్రచారం సా గుతుంది. ఒక్కో ట్రాక్టర్లో రూ.92 వేల చొప్పున మూడు ట్రాక్టర్లకు కలిపి రూ. 2.76లక్షలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ము అధిక మొత్తం కాకపోయినప్పటికీ మున్సిపల్లో ఇలా ఎలాపడితే అలా ఎంబీ పత్రాలను చించడం ద్వారా ఇంకా ఎన్ని అక్రమాలు చేశారో అనే అనుమానాలు ఇప్పు డు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పలువురి నుంచి వ్యక్తమవుతుంది. చించలేదు మెజర్మెంట్ బుక్ పత్రాలను చించివేశారనేది అవాస్తవం. అయినప్పటికీ దీనిపై విచారణ జరుపుతాం. ట్రాక్టర్ల కొనుగోలులో అధిక మొత్తం చెల్లించి అక్రమాలకు పాల్పడ్డారనే వ్యవహారంలోనూ దృష్టి సారిస్తాం. – సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
ఏకగ్రీవ తీర్మానాలపై ఆరా
ఇంద్రవెల్లి: సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆయా పంచాయతీల్లో చేస్తున్న ఏకగ్రీవ తీర్మానాలపై అధికారులు ఆరా తీశారు. ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ ప్రవీణ్కమార్, ఎంపీడీవో జీవన్రె డ్డి శుక్రవారం మండలంలోని మెండపల్లి, తేజా పూర్ పంచాయతీలను సందర్శించారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పో టీ చేయవచ్చని తెలిపారు. బలవంతపు తీర్మానాలు చెల్లవని పేర్కొన్నారు. ఓటర్లు ప్రలోబా లకు లొంగవద్దని, ఎవరైనా బలవంతపు తీర్మానాలు చేసి ఎన్నికలను భంగం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
కైలాస్నగర్: పట్టణంలోని భుక్తాపూర్కాలనీలో రోడ్డును ఆక్రమించి చేపట్టిన నాలుగు మడిగెల నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. కమిషనర్ సీవీఎన్. రాజు, టౌన్ప్లానింగ్ అధికారి సుమలత, టీపీఎస్ నవీన్కుమార్లు మున్సిపల్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. మడిగెల్లోని సామగ్రిని తొలిగించాలని దుకాణదారులకు సూచించారు. వారు సామగ్రిని తీసిన వెంటనే పొక్లెయిన్తో షటర్లతో పాటు నిర్మాణాలను పాక్షికంగా తొలగించేశారు. భవిష్యత్తులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని కమిషనర్ స్పష్టం చేశారు. పట్టణానికి చెందిన కుంచెమ్ వీరేందర్ రోడ్డును ఆక్రమించి నాలుగు మడిగెలు నిర్మించారని తెలిపారు. దీనిపై గంధం మోహన్ అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. 2015 నుంచి దీనిపై కోర్టులో కేసు నడుస్తుందన్నారు. విచారణలో భాగంగా ఈ మడిగెలను కూల్చివేయాలని హైకోర్టు సూచించిందని, న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని వివరించారు. డిసెంబర్ 1న దీనిపై తుది విచారణ ఉందని, కోర్టుకు ఆధారాలు సమర్పించేందు కోసమే కూల్చివేసినట్లుగా ఆయన తెలిపారు. ఇందులో టీపీబీవో సాయికృష్ణ తదితరులున్నారు. -
మాతాశిశు మరణాలు నియంత్రించాలి
కై లాస్నగర్: మాతాశిశు మరణాలు నియంత్రించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని పీహెచ్సీ వైద్యులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హైరిస్క్ కేసులను గుర్తించి మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు తరలించాలన్నారు. వైద్యుల సూచన మేరకు బీపీ, షుగర్, స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు సమయానుసారం నిర్వహించాలన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై ఆశాలు, ఏఎన్ఎంలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రిమ్స్, బోథ్, ఉట్నూర్ ఆసుపత్రుల్లో ఎనీమియా రోగుల సౌకర్యార్థం ఎఫ్సీఎం ఇంజక్షన్ అందుబాటులో ఉంచాలన్నారు. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల రోడ్లు బాగా లేవని అంబులెన్స్ సిబ్బంది, ఆశాలు తెలియజేయగా రోడ్డుకు సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డెలివరీ అనంతరం కుటుంబ నియంత్రణ చికిత్సపై అవగాహన కల్పించి, ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వైద్యులు, ఏఎన్ఎం, ఆశాలు, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
కైలాస్నగర్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా పని చేయాల ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవాభవ న్లో ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల మండలాల పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై వారి అభిప్రాయాలు స్వీకరించారు. పా ర్టీ మద్దతుతో ఎవరు పోటీ చేసినా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా వారి గెలుపుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీచేసే ఆశావహుల వివరాలు సేకరించారు. -
సీనియర్లను మినహాయించాలి
ఆదిలాబాద్టౌన్: సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని టీఎస్ యూ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ పోరాట కార్యాచరణలో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన లె టర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. సీనియర్ టీచర్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వే యాలని కోరారు. దీని కోసం దేశవ్యాప్తంగా అ న్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రధానమంత్రికి లే ఖలు రాస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శులు స్వామి, గౌస్ మొహియుద్దీన్, సోషల్ మీడియా కన్వీనర్ శంకర్, వివిధ మండలాల బాధ్యులున్నారు. -
ఈపీఎఫ్పై అవగాహన
ఉట్నూర్రూరల్: ఈపీఎఫ్పై ప్రతి ఒక్కరూ అ వగాహన కలిగి ఉండాలని ఈపీఎఫ్ ప్రాంతీ య కార్యాలయ నోడల్ అధికారులు శ్రీధర్, అ మిత్ సూచించారు. మండలం కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో ఆవరణలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమావేశమై వారి స మస్యలు తెలుసుకున్నారు. వారికి ఈపీఎఫ్పై అవగాహన కల్పించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాలో పొ దుపు చేయాలని సూచించారు. ఈపీఎఫ్ ద్వా రా ఉద్యోగులకు అధిక వడ్డీతోపాటు అనేక సౌ కర్యాలు కల్పించినట్లు తెలిపారు. అవుట్ సో ర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎ ప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో బొంకంటి సుభాష్, భానుప్రసాద్, రంజిత్, సతీశ్, మోతీలాల్, అరుణ్, అనిల్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సమాచార వ్యవస్థ సాధ్యం గాని ప్రదేశాలు, షాడో జోన్లలో ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వా రా వీహెచ్ఎఫ్ సెట్లను వినియోగించాలని తెలిపా రు. అత్యధిక జనాభా కలిగిన పంచాయతీల్లో బైక్ పెట్రోలింగ్ ద్వారా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేశామని ఎలాంటి సమాచారమున్నా వారికి తెలుపాలని సూచించారు. అన్ని గ్రామాలను కలిసి ఉండేలా రూట్ మొబైల్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను తని ఖీ చేస్తూ ఉండాలని సూచించారు. అడిషనల్ ఎస్పీలు కాజల్సింగ్, సురేందర్రావు, మౌనిక, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్వోలు, కమ్యూనికేషన్, డీసీఆర్బీ, ఎన్ఐబీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎవరిని నిలబెడుదాం..!
కైలాస్నగర్: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. గురువారం నోటిఫికేషన్ జారీ కా గా, తొలివిడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. పార్టీ ఎన్నికలు కానప్పటికీ సర్పంచులు భవిష్యత్ రాజకీయాల్లో పా ర్టీ బలోపేతంలో కీలకం కానున్నారు. దీంతో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలుపాలని భావిస్తున్నాయి. అలాగే, ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తే ఆర్థిక వెసులుబాటు కలగనుండటంతో పాటు విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆశావహులు ముఖ్య నాయకుల మద్దతు కోసం ప్ర యత్నిస్తున్నారు. ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండటంతో పోటీలో ఎవరిని నిలిపితే బాగుంటుంది.. గెలిచే అవకాశాలు ఎవరికున్నాయనే దిశగా పా ర్టీలు అభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి. ఇందు కు గ్రామాలు, సామాజికవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల బలబలాలపై ఫీడ్ బ్యాక్ తీసుకునే పనిలో పడ్డాయి. దీంతోపల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థుల కోసం అన్వేషణ త్వరలోనే పరిషత్ ఎన్నికలూ జరగనుండటంతో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పా ర్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం బలమైన అభ్యర్థులను సర్పంచ్గా బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. జనరల్ స్థానాల్లో ఆర్థిక, అంగబలమున్న వారిపై దృష్టి సారించాయి. రిజర్వ్డ్ స్థానాల్లో సామాజికవర్గాల వారీగా గ్రామస్తులతో నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పా ర్టీల్లోని గెలిచే అవకాశమున్న వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువ నాయకులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల్లో వారికున్న పలు కుబడి, ఆర్థిక స్థిరత్వం కలిగిన అంశాలను బేరీజు వేస్తున్నారు. దీంతో ఆయ పార్టీల ముఖ్య నేతలు, ఎ మ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలను ప్రసన్నం చే సుకునే పనిలో పడ్డారు. ప్రధానంగా అధికార పార్టీ లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఆయా పార్టీల క్యాడర్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున నిధులు రానుండడంతో.. సర్పంచుల పదవీ కాలం ముగిసి దాదాపు రెండేళ్లవుతోంది. పాలకవర్గాలు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు అందాల్సిన ఎస్ఎఫ్ సీ, ఎఫ్ఎఫీసీ నిధులు పూర్తిగా నిలిచాయి. కొత్త పా లకవర్గాలు కొలువుదీరాక పంచాయతీలకు పెద్ద ఎ త్తున నిధులు విడుదలయ్యే అవకాశముంది. దీంతో ఈసారి సర్పంచ్గా బరిలో నిలిచేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతుండగా ఇందులో యువతే ఎక్కువగా ఉండడం గమనార్హం. రెండేళ్లుగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. నామినేషన్ ఎప్పుడు వేద్దా మా.. అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. ఆశావహు ల సంఖ్య ఎక్కువగా ఉండగా అభ్యర్థుల ఎంపిక పా ర్టీలకు తలనొప్పిగా మారనుంది. ఒకరిని ఎంపిక చే స్తే మరొకరు రెబల్గా బరిలో నిలిచే అవకాశాలు న్నాయి. దీంతో గ్రామంలోని ముఖ్య నాయకులతో సమావేశమై మెజార్టీ అభిప్రాయాలకు తగినట్లు అభ్యర్థిని నిలిపేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఏకగ్రీవం దిశగా యత్నాలు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలువాలనుకునే అభ్యర్థులు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీ పడుతుండగా కొన్నిచోట్ల ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు ఆలోచిస్తున్నారు. వీడీసీలు బలంగా, ఐక్యంగా ఉన్న చోట తమకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్గా ఎ న్నుకోవాలని భావిస్తున్నారు. తాజాగా ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ గ్రామస్తులు ఒకే అభ్యర్థిని ఎంపిక చేసుకోగా దాదాపు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లే. ఇదే బాటలో మరిన్ని గ్రామాల్లోనూ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకోవడం ద్వారా గ్రామాభివృద్ధికి కలిసి వస్తుందని, తద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని పలు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. -
ఏకగ్రీవం దిశగా అడుగులు
ఇంద్రవెల్లి: మండలంలోని తేజాపూర్ సర్పంచ్గా కోవా రాజేశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు గ్రామస్తులు ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం మండలంలోని మెండపల్లి, వాల్గోండ గ్రా మాల ప్రజలు సమావేశమై సర్పంచ్, ఉప సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయించారు. మెండపల్లి సర్పంచ్గా కొడప శ్రీరాం, ఉప సర్పంచ్గా ముండే మోహన్, వాల్గోండ సర్పంచ్గా కినక సునీత–జుగాదిరావ్, ఉప సర్పంచ్ జుగ్నాక నిర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో వీరిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ఏకగ్రీవ పంచాయతీలకు అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యత ఇస్తానని, అదనంగా తన తరఫున రూ.25లక్షలతో అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఏఎంసీ చైర్మన్ ముఖ డే ఉత్తం, నాయకులు కినక లచ్చుపటేల్, మెస్రం సోమేశ్వర్, కొడప జాకు, ఉర్వేత నాగోరావ్, కనక పాండురంగ్, తుకారాం, అర్జున్ తదితరులున్నారు. సిరికొండలో 19కి నాలుగు.. సిరికొండ: మండలంలోని గిరిజన గ్రామపంచాయతీలైన రాయిగూడ సర్పంచ్గా పెందుర్ లక్ష్మణ్, రి మ్మ సర్పంచ్గా పెందుర్ జంగుబాయి, కుంటగూడ సర్పంచ్గా కుంరం మీరాబాయి, కన్నాపూర్ సర్పంచ్గా సిడాం బాలదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటా మని ఆయా గ్రామాల ప్రజలు ప్రకటించారు. ఈ మేరకు సమావేశాలు నిర్వహించుకుని తీర్మానాలు చేసుకున్నారు. మండలంలో 19 పంచాయతీలుండగా నాలుగు దాదాపు ఏకగ్రీవమైనట్లే తెలుస్తోంది. కాగా, మండలంలోని మరిన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశముందని సమాచారం. -
ఆపరేషన్లకు ముందుకురావాలి
ఆదిలాబాద్టౌన్: వేసెక్టమీ ఆపరేషన్లకు పురుషులు ముందుకురావాలని డీఎంహెచ్వో నరేందర్ రాథో డ్ సూచించారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో వేసెక్టమీ పక్షోత్సవాల నిర్వహణపై జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశంని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పురుషులకు కోత, కుట్టు లేకుండా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి ముప్పు ఉండదని, ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు. దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకం రాదని, అపోహలు వీడి ఆపరేషన్లు చేసుకునేందుకు పురుషులు ముందుకు రావాలని సూచించా రు. అన్ని పీహెచ్సీల్లో కనీసం ఐదు ఆపరేషన్లు చేసే లా శ్రద్ధ వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి వచ్చే నెల 4వరకు వేసెక్టమీ షక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమా వేశంలో అడిషనల్ డీఎంహెచ్వో సాధన, ప్రోగ్రాం అధికారి దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం
కై లాస్నగర్: పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందు కు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ బూత్లు, సిబ్బంది నియామకం, భద్రతాచర్యలు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామగ్రి పంపిణీ తదితర అంశాలపై మండలాలవారీగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో 24గంట ల పాటు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా ని యమావళి ఉల్లంఘనలు గమనించినా వెంటనే చ ర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారాలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని సూచించారు. 14 ఎఫ్ ఎస్టీలు, మూడు ఎస్ఎస్టీలు నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీవో స్రవంతి, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. తనిఖీ వాహనాలు ప్రారంభం కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద కలెక్టర్ రాజర్షి షా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ తనిఖీ వాహనాలను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలు నిత్యం గ్రామాల్లో తిరుగు తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరగకుండా పరిశీ లిస్తాయని తెలిపారు. మోడల్ కోడ్ను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.50వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తున్నవారు తప్పనిసరిగా వాటి ఆధారాలు చూపాలని సూచించారు. పార్టీల ప్రతినిధులతో సమావేశం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై మా ట్లాడారు. ప్రచారానికి అవసరమైన అనుమతుల మంజూరు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంసీసీ ఉల్లంఘనపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. డబ్బు, మద్యం పంపిణీ, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా వ్యవస్థ, ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో.. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎ స్టీ బృందాలతో కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించవద్దని సూచించారు. ప్రచార పత్రాల్లో ప్రింటింగ్ ప్రెస్ వివరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టనున్న గ్రీవె న్స్ పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరి ష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
ఆదిలాబాద్టౌన్: రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టణంలోని మహాలక్ష్మివాడ, ఎస్సీ కాలనీ, శాంతినగర్లో ఉన్న రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లను తనిఖీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హె చ్చరించారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రధాన కూ డళ్లు, వీధులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడటం పోలీసుల బాఽ ద్యత అని అన్నారు. రాత్రి వేళల్లో ఇష్టానుసారం బ యట తిరగవద్దని ప్రజలకు సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, పట్టణ సీఐలు బి.సునిల్కుమార్, కె.నాగరాజు, సిబ్బంది ఉన్నారు. లక్ష్యసాధనపై దృష్టి సారించాలి ఇచ్చోడ: విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించారు. విద్యార్థినులు వేధింపులకు గురైతే షీటీంను సంప్రదించాలని సూచించారు. ఇందులో సీఐ రాజు, ఇన్చార్జి ఎస్సై అంజమ్మ, పాఠశాల నిర్వాహకులు శ్యాంరెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. మావల పోలీస్స్టేషన్లో అదనపు గదులు ప్రారంభం ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్లో ఏర్పా టు చేసిన అదనపు గదులను ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ప్రారంభించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు, ఎస్సైల కోసం వీటిని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ స్వామి, ఎస్సైలు మధు, కృష్ణ, యూనస్ ఖాన్, సిబ్బంది ఉన్నారు. -
రాజ్యాంగం ద్వారా సమన్యాయం
● జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు ఆదిలాబాద్టౌన్: భారత రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్నివర్గాలకు సమన్యాయం అందుతుందని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప గుర్తింపును కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజ్యలక్ష్మి, కుమార్ వివేక్, హుస్సేన్ పాల్గొన్నారు. -
లేబర్కోడ్లు రద్దు చేయాలి
ఆదిలాబాద్రూరల్: కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈమేరకు మావల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై లేబర్ కోడ్ల గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను దహనం చేశారు. కార్మికవర్గం అనేక పో రాటాలు, ప్రాణత్యాగాల ద్వారా సాధించుకు న్న హక్కులు, చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర శ్రామి క మహిళా కన్వీనర్ రమ, విజయలక్ష్మి, పద్మ శ్రీ, ర మేశ్, రాఘవులు, సచిన్, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
వేటు పడిందా.. లేదా?
సాక్షి, ఆదిలాబాద్: సాధారణంగా ఏదైనా ప్రభుత్వ శాఖలో ఆరోపణలు ఎదుర్కొని ఉద్యోగి సస్పెన్షన్కు గురైతే ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అవుతాయి.. దానికి సంబంధించి ఎలాంటి గోప్యత ఉండదు.. ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖలో వివిధ ఆరోపణలపై ఆదిలాబాద్లో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా వ్యవహరించిన ప్రవీణ్ను సస్పెండ్ చేసినట్లు ఇన్చార్జి డీఆర్ ప్రసన్న స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదనేది ఆ శాఖలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. అసలు సస్పెన్షన్ వేటు పడిందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ కరీంనగర్ ఇన్చార్జి డీఐజీ రమేశ్రెడ్డి, ఆదిలాబాద్ ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్ ప్రసన్నను వివరణ కోరినప్పుడు కాపీ ఇవ్వడం కుదరదని పేర్కొనడం గమనార్హం. ఆదిలాబాద్ చుట్టుపక్కల వివిధ సర్వేనంబర్లలోని అనధికారిక లేఅవుట్లలో ఇటీవల పెద్ద ఎత్తున వందలాదిగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొదట్లో అక్రమ రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగిపోవడంతో మరోసారి వందలాది డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు స్కెచ్ రెడీ చేశారు. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ఆ రోజు నుంచి అసలు కార్యాలయానికే రాలేదు. ఆ తర్వాత అతడిని భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి డిప్యూటేషన్పై పంపించారు. దీనికి సంబంఽధించి ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్న నిజామాబాద్ డీఆర్ ప్రసన్న నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే కేవలం డిప్యూటేషన్పై తరలించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారని ‘సాక్షి’లో మరో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డీఆర్ ప్రసన్న ఆదిలాబాద్కు వచ్చి ఈ వ్యవహారంలో విచారణ చేపట్టారు. అదే రోజు కలెక్టర్ రాజర్షి షాను కలిసి వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత విచారణ నివేదికను రిజిస్ట్రేషన్ల శాఖ కరీంనగర్ డీఐజీకి నివేదించారు. దీని ఆధారంగా సస్పెన్షన్ చేసినట్లు ‘సాక్షి’ వివరణ కోరినప్పుడు డీఆర్ ప్రసన్న స్పష్టం చేశారు. ఇది నాలుగు రోజుల క్రితం చోటు చేసుకుంది. అయితే అసలు ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ ప్రవీణ్ సస్పెండ్ అయినట్లు ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటి వరకు రాలేదని ఆ శాఖలో తాజాగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయంలో ఉత్తర్వు ప్రతి ఇవ్వాలని ఇన్చార్జి డీఆర్ ప్రసన్నను ‘సాక్షి’ కోరగా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఎందుకీ దోబూచులాట.. ఓ ఉద్యోగి సస్పెన్షన్ వ్యవహారంలో ఉన్నతాధికారులు గోప్యత పాటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ కాపీ ఇవ్వడం కుదరద ని వారు పేర్కొనడం పలు అనుమానాలకు తా విస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖా పరంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు పెరిగాయి. ఇటీవల మంచిర్యాలలో ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడి చేశారు. ఆ రోజు అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు జరిగా యా.. ఎల్ఆర్ఎస్ లేకుండా చేస్తున్నారా అనే అంశాల్లో పరిశీలన చేశారు. అయితే ఆదిలాబా ద్ కార్యాలయంలో ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ జీపీఏ ద్వారా లింక్ సృష్టించి తిరిగి వాటిని సేల్డీడ్గా రిజిస్ట్రేషన్లు చేయడం, అవి కూడా ఒకటి, రెండు కాకుండా వందలా ది డాక్యుమెంట్లు అప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగిపోవడం, మరిన్ని రిజిస్ట్రేషన్ల కోసం స్కెచ్ వేయ డం వంటివి జరిగాయి. అయితే ఈ వ్యవహారంలో శాఖాపరంగా నామ్కే వస్తే విచారణ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ను సస్పెన్షన్ చేశామని నోటిమాటగా చెప్పడం తప్పితే రాత పూర్వకంగా ఆదేశాలు బయటకు రానివ్వకుండా పకడ్బందీగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఆ సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ను ఈ వ్యవహరం నుంచి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది డాక్యుమెంట్లు ఒక సబ్ రిజిస్ట్రార్ ఇంతకు తెగించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
జిల్లా కేంద్రంలో పర్యటించిన సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం
కై లాస్నగర్: ఆలిండియా సివిల్ సర్వీసెస్ అధికా రుల బృందం బుధవారం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పర్యటించింది. తొలుత మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న వారికి కమిషనర్ సీవీఎన్. రాజు స్వాగతం పలికారు. మున్సిపల్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పట్టణంలోని ఇందిరానగర్లో గల ఆహార ఉత్పత్తుల కేంద్రాన్ని సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, వాటి సద్వినియోగం తీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి మున్సిపల్ పాత కార్యాలయ భవనంలో ఎస్ఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాప్కిన్ తయారీ కేంద్రంతో పాటు స్టీల్బ్యాంక్ను పరిశీలించారు. వాటి నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అనంతరం పట్టణానికి తాగునీటిని అందిస్తున్న ఫిల్టర్బెడ్, డంపింగ్యార్డ్ను పరిశీలించారు. వారి వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ బైరి శంకర్, పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్ రాజు, మెప్మా సీవో గంగన్న తదితరులున్నారు. -
● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కై లాస్నగర్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేడు తొలివిడత నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అలాగే నామినేషన్ల స్వీకరణ కూడా నేటి నుంచి షురూ కానుంది. ఈ నెల 29న సాయంత్రం 5గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడతలో భాగంగా ఆరు మండలాల్లోని 166 గ్రామ పంచాయతీలు, 1,390 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. 4నుంచి 5 గ్రామ పంచాయతీలను కలిపి క్లస్టర్గా ఏర్పాటు చేశారు. ప్రతీ క్లస్టర్కు గెజిటెడ్స్థాయి హోదా కలిగిన పీజీ హెచ్ఎంలు, డిగ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకులు, ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలను స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. వారికి సహాయకులుగా స్కూల్ అసిస్టెంట్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా కేటాయించారు. వీరు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎంపీడీవో కార్యాలయంలో అందుబాటులో ఉండి నామినేషన్లు స్వీకరిస్తారు. ముహూర్తంపై దృష్టి ప్రస్తుతం బుధవారం నుంచి మూఢం ప్రారంభమైనట్లుగా వేదపండితులు చెబుతున్నారు. ఈ రోజుల్లో సాధారణంగా కొత్తగా ఎలాంటి పనులు మొదలుపెట్టరు. కానీ నామినేషన్ల స్వీకరణకు మూడు రోజులే గడువు ఉన్నందున బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఆ రోజుల్లో మంచి ముహూర్తాలపై దృష్టి సారిస్తున్నారు. తొలి విడత ఎన్నికలు ఏజెన్సీ పరిధిలోని ఆరు మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహ అభ్యర్థులు వేదపండితులను ఆశ్రయిస్తున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తదనుగుణంగా నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఇటీవల సడలించింది. ఇది వరకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలనుకునే వారు ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన అమలులో ఉండేది. ఇటీవల దాన్ని సడలించడంతో గతంలో అవకాశం లేక నిరాశ చెందిన ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు ప్రస్తుతం పోటీకి సై అంటున్నారు. కోవ రాజేశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్న గ్రామస్తులు ఎన్నికలు నిర్వహించే మండలాలు 6ఇంద్రవెల్లి: తొలివిడత ఎన్నికల్లో భాగంగా మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవమైంది. మాజీ ఎంపీటీసీ కోవ రాజేశ్వర్ను ఎన్నుకున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గ్రామంలో సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గ్రామస్తులు మడావి చిత్రు, మడావి దశరథ్, సోము, దేవ్రావ్, నాగోరావ్, దత్తు తదితరులున్నారు.తొలి విడతలో.. గ్రామ పంచాయతీలు 16తేజాపూర్ సర్పంచ్ ఏకగ్రీవంఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లుజిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి ఆమె పాల్గొన్నారు. జిల్లాలో ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లోని 166 పంచాయతీలకు తొలి విడత నామినేషన్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పోలింగ్ సామగ్రి ఇప్పటికే సంబంధిత మండల కేంద్రాలకు పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, ఆర్డీవో స్రవంతి, డీఎల్పీవో ఫణిందర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. నిన్నొక్కసారి చూడాలమ్మా!
ఉట్నూర్ ఆసుపత్రిలో తల్లిని కోల్పోయిన శిశువు‘అమ్మా.. నీ పొత్తిళ్లలో నవమాసాలు మోశావు.. నాతో పాటే తమ్ముడికీ జన్మనిచ్చావు.. ఇంతలోనే ఎక్కడికి వెళ్లావమ్మా.. తొమ్మిది నెలలు ఒక్క క్షణం కూడా వదిలి ఉండని నువ్వు.. మూడు రోజులైతందమ్మా చూడక.. వాడూ కనబడట్లేదు.. నాకు ఆకలవుతుందమ్మా.. గొంతెండుకు పోతుందమ్మా.. నాన్న కూడా ఎందుకో ఏడుస్తున్నాడు.. త్వరగా వచ్చేయ మ్మా.. నిన్నొక్కసారి చూడాలమ్మా..’ అనే ఈ వేదన ఆస్పత్రిలో వెక్కివెక్కి ఏడుస్తున్న మూడు రోజుల ఓ పసికందు ఆక్రందనకు అక్షర రూపం. సోమవారం ప్రసూతి సమయంలో కవలలకు జన్మనిచ్చిన తల్లి.. పురిటిలోనే తనువు చాలించింది. ఓ శిశు వు అమ్మతోనే తానంటూ లోకం వీడగా.. మరో శిశువు బుధవారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడ్చిన తీరు అందరి హృదయాలను కలిచివేసింది. తల్లిపాల కోసం గుక్కపట్టిన ఆ చిన్నారిని చూసిన కళ్లన్నీ చెమ్మగిల్లాయి. – ఉట్నూర్రూరల్ ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన టెకం జంగుబాయి సోమవారం కవలలకు జన్మనిచ్చింది. అయితే సకాలంలో వైద్యసేవలు అందక తనతో పాటు ఓ శిశువు పురిటిలోనే ప్రాణాలు విడిచిన ఘటన విదితమే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో శిశువు వద్ద ఆ తండ్రి బుధవారం విలపించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. సిగ్నల్స్ అంది.. అంబులె న్స్ వచ్చి ఉంటే నా కుటుంబం ఆగం అయ్యేది కాదని.. ఈ కష్టం ఎవరికీ రావొద్దంటూ విలపించిన తీరు ఏజెన్సీ ప్రాంతంలో రవాణా, వైద్య పరిస్థితులకు అద్దం పడుతోంది. కనీస సౌకర్యాలు కరువు.. గ్రామంలో 30 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ ఊరికి కనీసం రోడ్డు లేదు. ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి. సెల్ఫోన్ సిగ్నల్స్ రావు. ఈ క్రమంలో పురిటి నొప్పులు మొదలైన జంగుబాయిని ఆస్పత్రికి తరలించడం కష్టమైంది. సకా లంలో వైద్యం అందక కవలలకు జన్మనిచ్చిన ఆ తల్లీ మరో బిడ్డతో కలిసి తనువు చాలించింది. సో మవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆ ఊరి దీన స్థితికి అద్దం పడుతోంది. అయితే ఆ బాధితుడు ఎవరోకాదు..ఆ గ్రామపటేల్ ఆనందర్రావు. చని పోయింది ఆయన భార్య జంగుబాయి. కళ్లుతెరవకముందే లోకంవిడిచింది తన మరోకుమారుడు. ప్రాణాలు పోతున్నా పట్టింపేది? ఓ వైపు సాంకేతికంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా గిరిజన బతుకులు మాత్రం మారడం లేదు. ఐటీడీఏ ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామని సర్కారు చెబుతున్నా ఆచరణలో కనిపించని పరిస్థితి. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పాలకుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
‘ఐసీడీఎస్ను ప్రైవేట్పరం చేసే కుట్ర’
ఆదిలాబాద్రూరల్: ఐసీడీఎస్ను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి ఆరో పించారు. యూనియన్ రాష్ట్ర ఐదో మహాసభ రెండో రోజు కార్యక్రమం మావలలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారంనిర్వహించారు. సభకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు హాజరై అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు పౌష్టికాహారం అందించడంలో కీలకంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి రాష్ట్ర మహా సభల్లో చర్చించి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా గ్రాట్యూటీ ఇవ్వాలని, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, ఐసీడీఎస్ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, అంగన్వాడీ ఉద్యోగులను 3వ, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి ఏఆర్ సింధు, శ్రామిక మహిళా కన్వీనర్ రమ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, పద్మ, లంకా రాఘవులు, పూసం సచిన్, బండి దత్తాత్రి, ఆశన్న, కిరణ్, దర్శనాల మల్లేష్, శకుంతల, మంజుల, జమున, సంకే రవి, రాజన్న, సురేందర్, తదితరులు పాల్గొన్నారు. -
పత్తి ‘మద్దతు’లో కోత
ఆదిలాబాద్టౌన్: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది పత్తి రైతుల పరిస్థితి. సీసీఐ ఇప్పటికే తేమ పేరిట కొర్రీలు పెడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మద్దతు ధరలో క్వింటాలుకు రూ.50 కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చాలా మంది ధర పెరుగుతుందనే ఆశతో పత్తిని విక్రయించకుండా ఇళ్లలోనే నిల్వ ఉంచారు. అయితే తగ్గిన మద్దతు ధర ఈనెల 27 నుంచి అమలులోకి రానున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. పత్తి పింజ పొడవు తగ్గడంతో ధరలో కోత విధించినట్లు పేర్కొంటున్నారు. అయితే సీసీఐ నిర్ణయంతో తమకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత పేరిట ధరలో కోత.. అక్టోబర్ 24న ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దాదాపు నెలరోజుల్లోనే సీసీఐ ధరలో కోత విధించింది. బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్ మార్కెట్ యార్డుల్లో ఈనెల 6న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇంత త్వరగా నాణ్యత పేరిట కోత విధించడంపై రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పత్తికి మద్దతు ధర లభించడం లేదు. 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తోంది. ఇందులో 8 శాతం ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.8110 చెల్లిస్తుండగా, ఆ తర్వాత 9 నుంచి 12 శాతం వరకు ఉంటే ధరలో కోత విధిస్తున్నారు. నెలరోజుల్లోనే నాణ్యత పేరిట కోత విధిస్తుండగా, రానున్న రోజుల్లో మరింత కోత ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో.. ఇప్పటివరకు కొనుగోలు చేసిన పత్తి : 1,90,804 క్వింటాళ్లు సీసీఐ కొనుగోలు చేసిన పత్తి: 1,67,796 క్వింటాళ్లు ప్రైవేట్ కొనుగోలు చేసిన పత్తి: 28,008 క్వింటాళ్లు ప్రస్తుత మద్దతు ధర : రూ.8,110 ఈనెల 27 నుంచి అమలులోకి రానున్న ధర: రూ.8,060 రేపటి నుంచి మద్దతు ధర రూ.8,060 ఈనెల 27 నుంచి క్వింటాలు పత్తి ధర రూ.8,060తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సీసీఐ వారు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చే పత్తిని శాంపిల్ చేశారు. ల్యాబ్కు టెస్ట్ కోసం పంపించారు. పింజపొడవు 29.1 నుంచి 29.49 ఎంఎం తక్కువగా రావడంతో ధరలో కోత విధించారు. రైతులు ఇంటివద్దనే ఆరబెట్టి నాణ్యమైన పత్తిని మార్కెట్కు తీసుకురావాలి. – గజానంద్, మార్కెటింగ్ ఏడీ -
మరుగున పడేశారు..!
కై లాస్నగర్: మానవ విసర్జిత వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువుగా ఉపయోగించాలనే ఉద్దేశంతో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిరుపయోగంగా మారింది. కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో పాటు పర్యవేక్షించాల్సిన బల్దియా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో ఈ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యాయి. ఆరంభం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో కేవలం కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చేందుకే ప్లాంట్ను ఏర్పాటు చేశారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్యం ఘనం.. ఆచరణలో విఫలం పట్టణంలోని ఇళ్లలో గల సెఫ్టిక్ ట్యాంకుల్లో సేకరించిన మానవ వ్యర్థాల(మలం)ను ట్యాంకర్ల నిర్వాహకులు తీసుకెళ్లి ఊరి బయట పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత పరిసరాలు కంపుకొడుతున్నాయి. వ ర్షాలు కురిసిన సమయంలో నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. ఈ పరిస్థితిని గమనించిన బల్దియా మలంతో సేంద్రియ ఎరువు తయారు చేయాలని నిర్ణయించింది. దానిని పొలాలు, మొక్కల పెంపకానికి సరఫరా చేస్తూ అదనపు ఆదాయం గడించాలనే ఉద్దేశంతో పట్టణంలోని బంగారుగూడ డంపింగ్యార్డులో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించారు. 90వేల లీటర్ల వ్యర్థాలు నిల్వచేసే సామర్థ్యంతో కూడిన ట్యాంక్, ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేశారు. సెప్టిక్ ట్యాంకుల ద్వారా వచ్చే వ్యర్థాలను అందులో శుద్ది చేసి నీటిని మొక్కలకు వినియోగిస్తారు. శుద్ధి చేసిన మలాన్ని ప్రత్యేక షెడ్డులో15 రోజుల పాటు ఎండబెడుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా సోలార్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. పూర్తిగా ఎండిన తరువాత పొడి చేసి పంటలకు ఎరువు కోసం తరలిస్తారు. రూ.2.56 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను 2021 ఆగస్టు 17న అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. 2022 డిసెంబర్ 18 వరకు విద్యు త్ సరఫరా లేకపోవడంతో తయారీ షురూ కాలేదు. సుమారు 16 నెలల తర్వాత ఈ ప్లాంట్ కోసం ప్ర త్యేకంగా హై టెన్షన్ లైన్ (హెచ్టీ) ఏర్పాటు చేశా రు. ఆ తర్వాత రెండు రోజులు మాత్రమే ఎరువుల తయారీని చేపట్టారు. ఆది నుంచి అలంకారప్రాయమే ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతను బీఓటీ పద్ధతిన భారత్ ప్రెస్టిన్ ఇన్ఫ్రా అనే సంస్థకు అప్పగించారు. 2023 డిసెంబర్లో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో సేంద్రియ ఎరువుల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించారు. 25 కిలోలకు ఒక బ్యాగ్ చొప్పున ప్యాకింగ్ చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. ఇది కేవలం రెండు రోజులకే పరిమితమైంది. నిర్వహణ లాభసాటిగా లేదనుకున్నారో లేక ఇతర కారణాలేంటో తెలి యదు కానీ కాంట్రాక్టర్ అప్పటి నుంచి కేంద్రాన్ని నిర్వహించడం నిలిపివేశారు. దీంతో నాలుగేళ్లుగా ఈ కేంద్రానికి తాళం వేసి ఉండడంతో అలంకారప్రాయంగా మారింది. మరోవైపు ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా హై టెన్షన్ లైన్ (హెచ్టీ) ఏర్పాటుతో విద్యుత్ బిల్లు నెలకు రూ.లక్షకుపై గానే వస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకు సంబంధించిన బిల్లులు రూ.లక్షల్లో పేరుకుపోయి బల్దియాకు అదనపు భారంగా మారాయి తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదు. అందుబాటులోకి తీసుకురావాల్సిన బల్దియా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యంత్రం చెడిపోవడంతోనే.. కొద్ది రోజుల పాటు ఎరువుల తయారీ జరిగింది. అయితే యంత్రం చెడిపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది. బాగు చేసి తయారీని ప్రారంభించాలని సంబంధిత ఏజెన్సీకి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. విషయాన్ని మున్సిపల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూస్తాం. – అవికిరణ్, బల్దియా పర్యావరణ ఇంజినీర్ -
క్రమశిక్షణ పాటించాలి
ఆదిలాబాద్టౌన్: పోలీసులు విధుల్లో చురుకుదనం, నిజాయతీ, క్రమశిక్షణ పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశా రు. కార్యాలయంలోని రికార్డులు, పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా భద్రతలో నేర నియంత్రణ ముఖ్యమైనదని అన్నారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంకెన్ డ్రైవ్, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాయితీ బియ్యం తరలించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్ సీఐ సునిల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, రమ్య, ఇసాఖ్ అలీ, హరుణ్ అలీ తదితరులున్నారు. -
ఆ
చీర కావాలంటే.. ఫొటో దిగాల్సిందే ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారు తప్పనిసరిగా ఫొటో దిగాల్సిందేనని స్పష్టం చేసింది. ప్షన్ శావహులకు కై లాస్నగర్: సర్పంచ్ ఎన్నికలను తొలుత నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటి రిజర్వేషన్లు సైతం ఖరారు చేసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ఆశావహులకు సర్కారు నిర్ణయం మంచి ఆప్షన్లా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీ క్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఓటమి పాలైనా.. త్వరలోనే నిర్వహించనున్న పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల తరఫున మరోమారు పోటీ చేయచ్చనే ఉద్దేశంతో పల్లెపోరుకు జై కొడుతున్నారు. షెడ్యూల్ సైతం ప్రకటించడంతో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆశపడి.. నిరాశకు గురై రాజకీయ పార్టీల పరంగా జరిగే పరిషత్ ఎన్నికలను మొదట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ దిశగా నోటిఫికేషన్ సైతం సెప్టెంబర్లో విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావించిన ఆశావహులు అందుకు సన్నద్ధమయ్యారు. ప్రధాన పార్టీల తరఫున టికెట్లను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపును కోర్టు సమర్థించకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో వారు నిరాశ చెందారు. తాజాగా పరిషత్కు బదులు తొలుత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్లు, వార్డుమెంబర్ల రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఖరారు చేస్తు గెజిట్ కూడా ప్రకటించింది. బీసీల్లో ఆవేదన.. అక్టోబర్లో 42శాతం రిజర్వేషన్లను ప్రకటించడంతో బీసీ స్థానాలు భారీగా పెరిగాయి. రిజర్వేషన్ కలిసిరావడంతో ఆయా కులస్తులు పోటీకి సిద్ధమయ్యారు. తాజాగా ఆ స్థానాలు తగ్గించి ఖరారు చేయడంతో ఆయా కులాలకు సంబంధించి ఆశావహుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. నిన్నమొన్నటి వరకు పోటీకి ఉత్సాహం చూపిన వారి అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. కొత్త రిజర్వేషన్లతో పోటీకి అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్గా ఓడినా.. పరిషత్పై ధీమా గ్రామ ప్రఽథమ పౌరుడి హోదా దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల్లోని చోటామోటా నాయకులు ఆశపడుతుంటారు. పార్టీయేతర ఎన్నికలు అయినప్పటికీ పార్టీల మద్దతు ఉంటే గెలుపు సునాయాసమవుతుందని భావిస్తుంటారు. పరిషత్ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండటంతో ఆ ఎన్నికల్లో పార్టీల గుర్తుపై పోటీ చేసి ఓడిపోతే సర్పంచ్గా మళ్లీ అవకాశం దక్కే పరిస్థితి ఉండదు. దీంతో పంచాయతీ పోరు అలాంటి అభ్యర్థులకు మంచి ఆప్షన్లా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గెలిస్తే సర్పంచ్గా గ్రామంలో పెత్తనం చేసే అవకాశం లభిస్తోంది. ఒకవేళ ఓడిపోతే పరిషత్ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవచ్చని భావిస్తున్నారు. మొదలైన సందడి.. పంచాయతీ పోరుకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లు.. ఎవరు పోటీ చేస్తున్నారు.. వంటి అంశాలపైనే చర్చ సాగుతోంది. ఆయా పార్టీ లనుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులుంటే సర్పంచ్గా ఎవరు పోటీ చేయాలి, ఎంపీటీసీగా ఎవరు బరిలో నిలువాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. కొంతమంది రెండింటిలోనూ పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. అలాంటి వారు గెలుపుకోసం ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. నిన్నటి వరకు చూసిచూడనట్లుగా వెళ్లే వారు ఆగి మరి పలకరించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. శుభకార్యాలయాలు ఉందని తెలిస్తే చాలు వారి ఇళ్లు, ఫంక్షన్హాళ్లకు పిలవకుండానే హాజరవుతున్నారు. -
మున్సిపల్ ఆర్డీ రహస్య పర్యటన
కైలాస్నగర్: మున్సిపల్ శాఖ హైదరాబాద్ జోన్ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఆది లాబాద్ మున్సిపల్ పరిధిలో రహస్యంగా పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్–2 కింద చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణాల ప్రగతి పరిశీలన కోసం ఆయనను మున్సిపల్ ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం జిల్లాకు నియమించింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పలు ప్రాంతాల్లో గుట్టుగా పర్యటించారు. పట్టణంలో చేపట్టిన ట్యాంకుల నిర్మాణాల ప్రగతి నత్తనడకన సాగుతుంది. కనీసం బెస్మెంట్ స్థాయికి కూడా అవి చేరని పరిస్థితి. అలాగే బల్దియా డంపింగ్యార్డ్ నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా మారింది. గత జూన్ నుంచి బయో మైనింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. బల్ది యా, పబ్లిక్ హెల్త్ అధికారుల వైఫల్యం బయటపడే అవకాశముందనే ఉద్దేశంతో ఆర్డీ వచ్చిన విషయాన్ని బల్దియా అధికారులు బయటకు రాకుండా జా గ్రత్తపడినట్లుగా తెలుస్తోంది. కాగా ఆర్డీ ట్యాంకు ల నిర్మాణాలతో పాటు డంపింగ్యార్డును పరిశీ లించారు. వాటి ప్రగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు ము న్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఆయా పనుల వివరాలపై ఆరా తీశారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఈఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు తదితరులున్నారు. -
మహిళలు వ్యాపారం వైపు మొగ్గు చూపాలి
ఆదిలాబాద్రూరల్: వడ్డీలేని రుణాలతో మహిళలు వ్యాపారం వైపు దృష్టి సారించాలని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు మంగళవారం రూ.3కోట్లకు పైబడి వడ్డీ లేని రుణాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయన్నారు. రుణాలు తీసుకున్న ఆయా సంఘాలు వ్యాపారం వైపు దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఎంపీడీవో వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో
డ్రైవర్ మృతికాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలంలోని పెంచికల్పేట్ ప్రధాన రహదారి పక్కన టిప్పర్లోంచి కంకర డంపు చేస్తున్న డ్రైవర్ రాములు (43) విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. చింతగూడ గ్రామానికి చెందిన కొట్రంగి రాములు తన సొంత టిప్పర్లో ఇటుక బట్టీల యజమానికి కంకర సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇతర ప్రాంతం నుంచి కంకర లోడ్తో వచ్చి చింతగూడ మూలమలుపు వద్ద డంపు చేస్తున్నాడు. ఈ క్రమంలో పైనున్న విద్యుత్ వైర్లకు టిప్పర్ హైడ్రాలిక్ తగలడంతో విద్యుత్ షాక్తో రాములు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఈజ్గాం ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాములు భార్య చిలుకుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అంజనీతండాలో మనస్తాపంతో ఒకరి ఆత్మహత్యనర్సాపూర్(జీ): మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంజనీతండా గ్రామానికి చెందిన చవాన్ గణేశ్ (50) రెండేళ్లుగా తన కుటుంబంతో ఉపాధి నిమిత్తం కుస్లీ గ్రామంలో నివాసముంటున్నాడు. సోమవారం అతడి కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో గొడవ జరిగింది. ఈక్రమంలో చవాన్ గణేశ్ ఇంటినుంచి బయకువెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం గాలించారు. మంగళవారం కుస్లీ గ్రామ శివారులోని పత్తి చేనులో విగతజీవిగా పడి ఉన్నాడు. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి మరణించి ఉంటాడని అతడి భార్య చవాన్ లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.విద్యుత్ తీగలకు తగిలిన టిప్పర్ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొట్టపెల్లి (కే) గ్రామానికి చెందిన చించోలి సాయన్న (69)–బుచ్చవ్వ దంపతులు మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై నిర్మల్కు వెళ్లారు. బస్టాండ్లో బుచ్చవ్వను దింపి సాయన్న ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని కనకాపూర్ జాతీయ రహదారిపై చౌరస్తా వద్ద రోడ్డు దాటే క్రమంలో ఖానాపూర్ వైపు నుంచి నిర్మల్ వైపునకు అతివేగంగా పత్తి లోడుతో వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సా యన్న తీవ్రంగా గాయపడ్డాడు. కనకాపూర్ వాసులు 108కు సమాచారం ఇవ్వగా సిబ్బంది అంబులె న్స్లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించగా అప్పటికే సాయన్న మృతి చెందిన ట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో మంచివ్యక్తిగా పేరున్న సాయన్న మృతితో అతడి కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛా యలు అలుముకున్నాయి. మృతుడికి కుమారుడు సాగర్ ఉన్నాడు. బుచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
శ్రీరాంపూర్: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. మంగళవారం శ్రీరాంపూర్లోని గనులు, డిపార్ట్మెంట్లపై జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్ పత్రాల ను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని మోదీ సర్కార్ రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను 2020లో తీసుకువచ్చి వీటిని అమలు చేస్తూ ఈ నెల 21న గెజిట్ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇవి అమలైతే కార్మికులు 12గంటలు పని చేయాల్సి వస్తుంద ని తెలిపారు. వేతనాల పెరుగుదల ఉండదని, కార్మి కులు బానిసల్లాగా పని చేసే సంస్కృతి మొదలవుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే లా కేంద్రం ఈ లేబర్ కోడ్లను అమలు చేస్తోందని ఆరోపించారు. గ్రాట్యుటీ చట్టం, బోనస్ చట్టం, పే మెంట్ ఆఫ్ వేజెస్, వర్క్ మెన్ కాంపెన్సేషన్ చట్టం తదితర అనేక హక్కులను కార్మికవర్గం కోల్పోతుందని తెలిపారు. కార్మికులు ఈ లేబర్ కోడ్ల అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చే యాలని పిలుపునిచ్చారు. అవసరమైతే నిరవధిక స మ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని కోరారు. ఆయా గనులపై వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మ య్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, సహాయ కార్యదర్శి కొట్టె కిషన్రావు, మోత్కూరి కొముర య్య, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు, కేంద్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు గరిగే స్వామి, టీబీజీకేఎస్ ప్రధా న కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, వెంగళ కుమార్స్వామి, సీఐ టీయూ నాయకుడు బానేశ్, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నాయకుడు అఫ్రోజ్ఖాన్ పాల్గొన్నారు. -
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాలికలకు బంగారు పతకాలు
మంచిర్యాలఅర్బన్: హైదరాబా ద్లోని జింఖానా గ్రౌండ్లో మంగళవారం నిర్వహించి న రాష్ట్రస్థాయి కాలే జీ స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పో టీల్లో మంచిర్యాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిలాక్లు చెందిన బాలికలు రెండు బంగారు పతకాలు సాధించినట్లు ఉ మ్మడి జిల్లా క్రీడల కార్యదర్శి బాబురావు తెలి పారు. సారంగపూర్ ప్రభుత్వ జూనియర్ కళా శాలలో ద్వితీ య సంవత్సరం చదువుతున్న పగ్గం వర్థిని 77కిలోల విభాగంలో 125 కేజీల బరువు ఎత్తి మొదటి స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మొదటిసంవత్సరం చదువుతున్న వడ్ల జాహ్నవి 69కిలోల విభాగంలో 117కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. -
ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్థుల ఆందోళన
ఇచ్చోడ: కొద్దిరోజులుగా ప్రిన్సిపాల్ నారాయణ వే ధిస్తున్నారని మండల కేంద్రంలోని మహాత్మా జ్యో తిబాపూలే కళాశాల విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్లో రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ప్రిన్సి పాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశా రు. పోలీసులు చేరుకుని విద్యార్థులను పోలీస్స్టేష న్కు తరలించారు. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థులు పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థులకు నచ్చజెప్పిన పోలీసులు వారి ని కళాశాలకు పంపించారు. ఈ సమాచారం తె లుసుకున్న ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, ఆర్సీవో శ్రీధర్ సాయంత్రం కళాశాలకు చేరుకుని తరగతికి ఇద్దరు చొప్పున విద్యార్థులను పిలిపించి ప్రిన్సిపాల్ రూంలో మాట్లాడారు. కాగా, కొద్దిరోజులుగా ప్రిన్సిపాల్ మానసికంగా వేధిస్తున్నట్లు విద్యార్థులు ‘సాక్షి’కి వివరించారు. తరచూ ఉడకని అ న్నం పెడుతున్నారని, ఆటవస్తువులు లేవని తెలి పారు. వీటిపై ప్రశ్నించిన తమను టార్గెట్ చేసి కళాశాల నుంచి బయటికి పంపిస్తానని, చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. కొద్దిరోజుల కిత్రం ప్రిన్సిపాల్ వ్యవహారంపై కొందరు విద్యార్థులు రహస్యంగా ఆర్సీవోకు ఫిర్యాదు చేయగా, అప్పటినుంచే వేధింపులు మొదలైనట్లు తెలిపారు. -
2నుంచి ట్రిపుల్ఐటీలో ‘స్పీక్ మాకే’
బాసర: భారతీయ సంప్రదాయ కళలను యువత కు చేరువ చేయడంలో అగ్రగామిగా నిలిచిన ‘స్పీక్ మాకే’ తెలంగాణ రాష్ట్ర స్థాయి నాలుగో సమ్మేళనా న్ని డిసెంబర్ 2నుంచి 5వరకు బాసర ట్రిపుల్ఐటీ వేదికగా నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. దేశంలోని వివిధ ప్రఖ్యాత గురుపరంపరలకు చెందిన 70మంది దిగ్గజ కళాకారులు, శాసీ్త్రయ సంగీత విధ్వాంసులు, నృత్యకారులు పా ల్గొననున్నారు. రాష్ట్రంలోని ఆయా పాఠశాలల నుంచి 300మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు. వారికి గు రుకుల శైలిలో నడిచే వర్క్షాప్లు, నాదయోగ సె షన్లు, హఠయోగ, ప్రదర్శనలు, ప్రతిభావంతులైన కళాకారులతో సంభాషణలు తదితర కార్యాచరణ లు అందుబాటులో ఉండనున్నాయి. సమ్మేళనం పో స్టర్ను వీసీ గోవర్ధన్, ఓఎస్డీ మురళీదర్శన్ ఆవిష్కరించారు. సీఎస్వో రాజేశ్, కోఆర్డినేటర్ రాకేశ్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థి వలంటీర్లు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌ టుప్పల్ మండలం పంతంగి గ్రామ ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో ఉమ్మ డి పది జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు పా ల్గొన్నాయి. చివరిరోజు జరిగిన సెమీ ఫైనల్స్, ఫైన ల్స్ మ్యాచ్లను తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డై రెక్టర్ లింగయ్య, యాదాద్రి భువనగిరి డీఈవో స త్యనారాయణ ప్రారంభించారు. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో మహబూబ్నగర్ జిల్లా, తృతీయ స్థానంలో నల్లగొండ జిల్లా జట్లు ని లిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లా, ద్వితీయ స్థానంలో రంగా రెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా జ ట్లు నిలిచాయి. విజేతలకు యాదాద్రి భువనగిరి డీ ఈవో సత్యనారాయణ బహుమతులు అందజేశా రు. డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి 12మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఎంఈవో గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాశ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
వాంకిడి: జీవితంపై విరక్తితో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బంబార గ్రామానికి చెందిన నీలం శ్రీలత (31)కు ఐదేళ్ల క్రితం జగిత్యాలకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కాగా, మనస్పర్థల కారణంగా నెల రోజులకే విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి శ్రీలత తన తల్లి సత్తమ్మ వద్ద ఉంటోంది. గత ఆగస్టులో జైపూర్ మండలం కిష్టాపూర్కు చెందిన షేర్ల రంజిత్ ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో రంజిత్ ఈ నెల 23న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. తనకు కాబోయే భర్త ఆత్మహత్య చేసుకోగా మనస్తాపానికి గురైన శ్రీలత సోమవారం రాత్రి 8గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కళాకారుల కడుపు నిండేదెలా?
ఆదిలాబాద్రూరల్: కొలాం ఆదివాసీలకు అన్ని అంశాల్లో అవగాహన కల్పిస్తున్న కళాజాత బృందం సభ్యులు నేడు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట ఐటీడీఏ ఆదరణ బాగానే ఉన్నా రెండేళ్లుగా కళాకారులు నిరాదరణకు గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోగల ఏజన్సీ గ్రామాల్లోని కొలాం విద్యార్థులు అంతంతా మాత్రంగానే చదువుకుంటూ మధ్యలోనే చదువు మానేస్తున్నారు. వైద్యం చేసుకునేందు కు కూడా ముందుకురావడం లేదు. దీనిని గ్రహించిన ఐటీడీఏ అధికారులు వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని, చదువు ప్రాముఖ్యత తె లుపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే అప్పటి ఐటీడీఏ అధికారులు వారి బాషలోనే వైద్యం, విద్య తదితర అంశాలపై అవగాహన క ల్పించేందుకు 1992–93లో కళాజాత బృందాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాకారుల సంఖ్య తగ్గింపు సమాచార పౌరసంబంధాల శాఖ పర్యవేక్షణలో ఆటాపాటలతో గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు మొదట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40మంది కొలాం కళాకారులను నియమించారు. కళాకారు లు బృందాలుగా ఏర్పడి కొలాం ఏజెన్సీ గ్రామాల్లో ఆటాపాటల ద్వారా అవగాహన కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అనారోగ్యానికి గురైన వారు సకాలంలో వైద్య చికిత్స చేయించుకునేందుకు ముందుకు వచ్చేలా అవగాహన క ల్పిస్తున్నారు. దీని ద్వారా కొలాం ఆదివాసుల నుంచి మంచి స్పందన లభించడంతో కళాకారులను అప్పటినుంచి నేటివరకు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమ సంఖ్య 40నుంచి 20కి తగ్గించారని కళాకారులు వాపోతున్నారు.తగ్గించిన పారితోషికంవైద్యం, విద్యపై ఆటాపాటల రూపంలో అవగాహన కల్పించేందుకు కొలాం కళాకారులకు అధికారులు ఐటీడీఏ ద్వారా వాహన సౌకర్యం కల్పించారు. మైక్సెట్ సమకూర్చారు. వారికి మొదట్లో రోజుకు రూ.600 పారితో షికం అందజేసేవారు. రెండేళ్లుగా రూ.200 పారితోషికం మాత్రమే ఇస్తున్నట్లు కొలాం కళాకారులు వాపోతున్నారు. ఇది తమకు ఏమాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. ఈ విషయంపై ఇటీవల ఐటీడీఏ పీవోకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. -
బాలిక అదృశ్యం కలకలం
దండేపల్లి: ఇంటిముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక మిస్సింగ్ ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు.. మండలంలోని నంబాల గ్రామానికి చెందిన మేకల కాపరి శనిగారపు శేఖర్–రజిత దంపతుల కూతురు మహన్విత (7) సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఇంటిముందు ఆడుకుంది. కొద్దిసేపటి తర్వాత కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసినొద్దీన్, పోలీసు సిబ్బంది నంబాల గ్రామానికి చేరుకుని బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, స్థానికులతో మాట్లాడారు. బాలిక మిస్సింగ్పై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మంగళవారం డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. రాత్రి మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ నంబాలకు వెళ్లి ఘటనపై ఆరా తీశారు. రాత్రి వరకూ బాలిక ఆచూకీ లభించలేదు.


