breaking news
Adilabad District News
-
జిల్లా పోలీసులకు సేవా పతకాలు
ఆదిలాబాద్టౌన్: జిల్లాకు చెందిన ఇద్దరు కాని స్టేబుళ్లకు రాష్ట్ర సేవా పతకాలు లభించాయి. టీజీ ఎఫ్టీఎఫ్ హెడ్క్వార్టర్స్ హైదరాబాద్లో పనిచేస్తున్న వీరు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, డీజీ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నారు. జైనథ్ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ కాయకార్ సంజయ్, ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లికి చెందిన గటిక రాజు పతకాలు అందుకోవడంపై పలువురు వారికి అభినందనలు తెలిపారు.సేవా పతకాలు అందుకుంటున్న కానిస్టేబుళ్లు -
గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ముందుగా పీవో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 934 ప్రాథమిక పాఠశాలల్లో 12,017 మంది విద్యార్థులు చదువుతుండగా 1,449 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. 133 ఆశ్రమ పాఠశాలల్లో 31,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పెంచిన చార్జీల ప్రకారం నూతన ఆహార మెనూ అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పా రు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మినీ బాలికల గురుకులాలు, నాలుగు ఏకలవ్య పాఠశాలలు (కో–ఎడ్యుకేషన్), ఎనిమిది అప్గ్రేటెడ్ బాలికల జూని యర్ కళాశాలలు, నాలుగు అప్గ్రేటెడ్ జూనియర్ కళాశాలలు, ఒక బాలుర జూనియర్ కళాశాల, ఒక బాలికల జూనియర్ కళాశాల, రెండు మహిళా డిగ్రీ కళాశాలలు, ఒక పురుషుల డిగ్రీ కళాశాల ఉన్నట్లు తెలిపారు. గురుకులాల్లో 11,114 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 32 పీహెచ్సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటి ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 42 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. భూ బదలాయింపు చట్టం కింద ఈ సంవత్సరం 25 కేసులు నమోదు చేసి 12 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా 13 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జీసీసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ పంపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, మంజూరైన 11 పెట్రోల్ పంపులను ప్రారంభించి నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మగతా ఆరు పంపులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏవో దామోదరస్వామి, ఏడీఎంహెచ్వో మనోహర్, పీహెచ్వో సందీప్, పీవీటీజీ ఏపీవో మనోహర్, డీపీవో ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, ఆశ్రమ, గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భార్యతో గొడవపడ్డందుకు చితకబాదిన ఎస్సై!
వేమనపల్లి: భార్యతో గొడవపడ్డందుకు తనను ఎస్సై చితకబాదాడని మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య ఆరోపించాడు. ఈ మేరకు ఎస్సైపై ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశంతో కలిసి సీపీ, డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య నాలుగేళ్ల క్రితం నీల్వాయి కొత్త కాలనీకి చెందిన భారత ప్రమీలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రమీల పుట్టింటికి వెళ్లడం, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తిరిగి కాపురానికి రావడం జరుగుతుండేది. 20 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రమీల పుట్టింటికి వెళ్లింది. దీంతో కిష్టయ్య గత ఆదివారం ఆమె వద్దకు వెళ్లి కాపురానికి రావాలని గొడవ పడ్డాడు. దీంతో ప్రమీలతోపాటు ఆమె తల్లిదండ్రులు నీల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేశ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేశాడు. అయితే గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశ్ ద్వారా రూ.10వేలు ఇవ్వాలని ఎస్సై తనను డిమాండ్ చేసినట్లు కిష్టయ్య ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన భార్య, అత్తమామలు, మరికొందరి ముందే ఎస్సై తనను రోకలిబండతో తీవ్రంగా కొట్టాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయమై మూడురోజుల క్రితం రూరల్ సీఐ బన్సీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. శుక్రవారం రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీకి పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించినట్లు పేర్కొన్నాడు. ఎస్సై సురేశ్తో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
నిందితుడి ఆచూకీ తెలిపితే నజరానా
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలో ఈనెల 8న ఓ వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తామని డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం వన్టౌన్, టూటౌన్ సీఐలు సునీల్కుమార్, నాగరాజుతో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడి ఆమె మృతి కారణమైన నిందితుడు స్థానిక రైల్వేస్టేషన్ గుండా పర్లి వైద్యనాథ్ ట్రైన్లో పరారైన విషయం సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడి ఎత్తు దాదాపు 5.4 అడుగులు ఉంటుందని, మరాఠీ భాష మాట్లాడే వ్యక్తిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలిస్తే ఆదిలాబాద్ డీఎస్పీని 87126 59914, ఆదిలాబాద్ వన్టౌన్ సీఐని 87126 59918, టూ టౌన్ సీఐని 8712659920, సీసీఎస్ ఇన్స్పెక్టర్ను 87126 59965 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సమాచారం తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణలలో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు. రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది ఉన్నారు. -
‘హమాలీల సమస్యలు పరిష్కరిస్తా’
బెల్లంపల్లి: హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీ సంఘం నాయకులను సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత కార్మికు ల మాదిరిగానే ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాల ని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాల ని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బజారు ఏరియా ప్రాంతం నుంచి పుర వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షులు, హమాలీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
రాజీవ్ సద్భావన యాత్రకు వీడ్కోలు
కై లాస్నగర్: రాజీవ్ సద్భావన యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ముగిసింది. రాజీవ్ జ్యోతి యాత్ర చైర్మన్ ఆర్.దొరై ఆధ్వర్యంలో ఈ నెల 9న తమిళనాడులోని పెరంబుదూర్లో మొదలైన యాత్ర ఈనెల 19న దేశ రాజధానిలోని న్యూఢిల్లీలోని రాజీవ్గాంధీ సమాధి వీర్ భూమికి చేరుకుంటుంది. ఈ యాత్ర గురువారం రాత్రి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో యాత్రీకులు రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం క్యాంపు ఆఫీస్ ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పా ల్గొన్నారు. వారికి మాజీ ఎంపీ సోయం బాపూరా వు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు జ్యోతిని దర్శించుకుని వీడ్కోలు పలికారు. 33 ఏళ్లుగా యాత్ర కొనసాగించడం అభినందనీయమని సోయం బాపూరావు కొనియడారు. నాయకులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో ప్రస్తావించాలి
నేరడిగొండ: జిల్లాలో విశ్వ విద్యాలయం ఏర్పా టు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్ రాథోడ్ సందీప్ విన్నవించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో నేరడిగొండ మండల చైర్మన్ నర్సింగ్ దాస్, వైస్ చైర్మన్ సతీష్, కోఆర్డినేటర్ కృష్ణ, విలేజ్ కమ్యూనిటీ మెంబర్స్ కృష్ణ, సంతోష్ తదితరులున్నారు. -
యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని యూనివర్సిటీ సాధన సమితి సభ్యులు శుక్రవారం కలిసి విన్నవించారు. పంద్రాగస్టు వేడుకలకు హాజరైన ఆయనకు జిల్లా కేంద్రంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష మేరకు జిల్లాలో విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన జిల్లాలో ఎక్కడ యూనివర్సిటీ కావాలని అడగగా, జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఖానాపూ ర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం జిల్లా కేంద్రంలోనే అనువుగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమితి కన్వీనర్ పురుషోత్తంరెడ్డి తెలిపారు. ఈ విషయమై సలహాదారు కలెక్టర్ ను ఆరా తీయగా, విషయం తన దృష్టిలో ఉందని పేర్కొన్నారని సమితి సభ్యులు తెలిపారు. ఇందులో సమితి కోకన్వీనర్ తొగరి భాస్కర్, సవీన్రెడ్డి, డాక్టర్ నరేందర్రెడ్డి, సతీ్శ్ సతీశ్రెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల సమీపంలోగల మసీదు ఎదురుగా నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని శుక్రవారం వేకువజామున నిర్మల్ నుంచి మెట్పల్లి వైపు అరటిపండ్ల లోడుతో వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో గద్దె కూలి స్తంభం కిందపడింది. డీసీఎం వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
చికిత్స పొందుతూ యువతి మృతి
నిర్మల్ రూరల్: మండలంలోని చిట్యాల గ్రామం వద్ద రాఖీ పండుగ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అర్చన (18) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లికి చెందిన మహేశ్ వరుసకు చెల్లెళ్లయిన అర్చన, ఆద్యతో కలిసి జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న అర్చన చెల్లెలు అక్షయతో రాఖీ కట్టుకునేందుకు బైక్పై బయలుదేరారు. చిట్యాల వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మహేశ్, ఆద్యకు స్వల్ప గాయాలు కాగా.. అర్చనకు తీవ్రగాయాలయ్యాయి. అర్చన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అర్చన ఇంటర్ పూర్తి చేసి ఇటీవలే హైదరాబాద్లో బీటెక్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందింది. మరో వారంరోజుల్లో కాలేజీలో జాయిన్ కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. కాగా, ప్రమాదానికి కారణమైన వాహనం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలానికి చెందిన ఓ వ్యక్తిదిగా రూరల్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వాహనాన్ని స్వాధీనం చేసుకుని రవాణాశాఖ అధికారికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మంచిర్యాలరూరల్(హాజీపూర్): పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్కు చెందిన కుక్కల రాకేశ్ (21) ఇద్దరు స్నేహితులతో కలిసి నిజామాబాద్కు వెళ్లి తిరిగి రామకృష్ణాపూర్కు కారులో వస్తుండగా హాజీపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వేంపల్లి శివారులోగల కల్వర్టును అతివేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాకేశ్కు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి వివాహం కాలేదు. అతని తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండాకెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి కుడ్మేత మనోహర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఏఎన్సీ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు మె రుగైన వైద్యం అందించాలని, గ్రామాలకు వెళ్లి వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎ ప్పటికప్పుడు ఆశ కార్యకర్తల ద్వారా తెలుసుకోవాలని పేర్కొన్నారు. విధులను నిర్లక్ష్యం చే స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీహెచ్సీ డీడీవో డాక్టర్ జితేందర్రెడ్డి, హెచ్ఈ తులసీ దాస్ రాథోడ్, చౌహాన్ నాందేవ్, హెల్త్ సూపర్వైజర్ చరణ్దాస్ చౌహాన్ తదితరులున్నారు. -
క్రమశిక్షణతో ట్రైనింగ్ పొందాలి
ఆదిలాబాద్రూరల్: ఎన్సీసీ కెడెట్లు దేశ సమైక్యతకు క్రమశిక్షణతో ట్రైనింగ్ పొందాలని కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ వీపీ సింగ్ సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తె లంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళా శాల (పురుషులు) ఎన్సీసీ యూనిట్ను సందర్శించారు. ఆయనకు ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ పుట్ట లక్ష్మణ్, ఎన్సీసీ కె డెట్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం వీపీ సింగ్ కళాశాల యూనిట్ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంజేశారు. సామాజిక బాధ్యత పెంచుకోవాలని కెడెట్లకు సూచించారు. ఎన్సీసీ కెడెట్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అధిక తేమ పంటలకు చేటు
చెన్నూర్రూరల్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంటచేలల్లో నీరు నిలిచింది. నీరు ఎక్కువైతే తేమ ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లనుంది. అధిక తేమతో పంటలు నష్టపోకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసా ద్ సూచిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... వర్షాలకు పత్తి చేనులో నీరు నిలిస్తే వెంటనే కాలువలు తీసి నీటిని బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన వెంటనే భూమిలో తేమను తగ్గించు కోవడానికి అంతర సేద్యం చేయాలి. బురద పదనులో ఎకరాకు 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే ఎకరానికి సీ ఓసీ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకరోజు తర్వాత కిలో స్వర్ణపాల్ను 150 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. పంటను వేరుకుళ్లు తెగులు ఆశిస్తే 3 గ్రాముల ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్ను లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో తడపాలి. మొక్కజొన్న అధిక తేమను తట్టుకోలేదు. సాధ్యమైనంత త్వరగా అంతరకృషి చేసుకోవాలి. ఎకరాకు 25 కిలోల యూ రియా, 10 కిలోల పొటాష్ ఎరువును మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. కాండం తొలిచే పురుగు ఉంటే కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి 3 కిలోలు ఆకు సుడుల్లో వేయాలి. పెసర, మినుము పైర్లకు అధిక తేమతో పేనుబంక, లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప పంట మిరప చేనులో నీరు నిలిస్తే వెంటనే నీటిని కాలు వల ద్వారా తొలగించాలి. నారుకుళ్లు తెగులు ఆశిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు గ్రాముల రిడోమిల్ లీటరు నీటికి కలిపి వారంలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అధిక తేమ నుంచి పంటలను కాపాడుకోవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని ఉట్నూర్ వెళ్లే రహదారిపై గురువారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన ఇంగ్వే శ్రీధర్ (24) ఓ ప్రముఖ దినపత్రిక ప్రతులను కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలించడానికి వ్యానులో బయలు దేరాడు. మండల కేంద్రానికి సమీపంలోకి రాగానే ఓ చెట్టును ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై వాహనంలోనే మృతి చెందాడు. వ్యానులో అతనితో పాటు ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
సొసైటీ పాలకవర్గాల గడువు పొడిగింపు
● ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం కై లాస్నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్)ల పాలకవర్గాల గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గురువారంతో వీటి కాల పరిమితి ముగియగా మరో ఆరు నెలల పాటు సొసైటీ, డీసీసీబీ చైర్మన్ల పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సొసైటీ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయనను కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. -
రాజకీయంలో నిబద్ధత పెరగాలి
భారత రాజ్యాంగం ఎంతో ఉన్నతమైంది. ఎన్నో ఆకాంక్షలు, అ భివృద్ధి, ప్రణాళికలు, అందరి హక్కులు, బాధ్యతలకు సమ ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడింది. రా జ్యాంగం నిబంధనలకు అనుగుణంగా రాజకీ య నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిబద్ధతతో మెలగాలి. – ఎ.స్రవంతి ఆర్థికంగా అగ్రస్థానంలో నిలవాలి ఆర్థికాభివృద్ధిలో దే శం వేగంగా ముందుకు సాగుతోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఫలితంగా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. 2047 వరకు మన దేశం ఆర్థికంగా అగ్రస్థానంలో నిలవాలి. పేదరిక నిర్మూలనకు విప్లవాత్మక చర్యలు చేపట్టాలి. – వై.వైష్ణవి దేశభక్తిని మనసులో నింపుకోవాలి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కొందరు సోషల్ మీడియాలో దేశభక్తిని చాటుతుంటారు. సాధారణ రోజుల్లోనూ ఇది కనిపించాలి. మన సంస్కృతి, విలువలను కాపాడుకుంటూ గొప్పగా ప్రవర్తించాలి. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ ప్రగతికి పాటుపడాలి. దేశభక్తిని మనసులో నింపుకోవాలి. – డీ అనుదీప్తి సాంకేతికత వైపు సాగాలి రోజురోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీ దేశాభి వృద్ధికి తోడ్పడాలి. అవసరమైన టెక్నాలజీని వి నియోగించుకుని నిరుద్యోగ యువత ఆర్థిక స్వావలంభన దిశగా ముందుకుసాగాలి. విద్యతోనే అన్నిరంగాల్లో ముందుకు సాగవచ్చు. అందరికీ ఉన్నతవిద్య అందించేంలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – కే సింధు -
మద్యానికి దూరం.. చారిగాం
అదో మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయమే. ప్రతీరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. మహాత్మాగాంధీ సూచనలు నమ్మిన కాగజ్నగర్ మండలంలోని చారిగాం గ్రామస్తులు మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చారిగాం గ్రామం ఉంది. ఈ గ్రామంలో 234 మంది జనాభా, 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారంతా మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ, బెల్టుషాపుల ఏర్పాటు చేయవద్దని మూడున్నర దశాబ్ధాల క్రితమే పెద్దలు తీర్మాణించారు. ఇప్పటికీ అవే ఆచారాలను పాటిస్తున్నారు. గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ప్రధానంగా కూ రగాయాలు సాగుచేసి పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 35 ఏళ్లుగా గ్రామస్తులు మ ద్యపాన నిషేధం పాటిస్తున్నారు. స్థానిక యువత బయట తాగినట్లు తెలిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి వారిచే మాలధారణ చేయిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో కలిగే లాభాలను వివరిస్తూ మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా మంచి నడవడికతో ఉంటున్నారు. -
ముందస్తు చర్యలు చేపట్టాలి
కై లాస్నగర్: భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చ ర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం హై దరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించి పలు సూచనలు చేశారు. సహాయక చర్య ల కోసం జిల్లాకు రూ.కోటి విడుదల చేసినట్లు తెలి పారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి, సెలవుపై వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలని సూచించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్ట ర్ శ్యామలాదేవి, వివిధ శాఖల అధికారులున్నారు. అత్యవసర సాయం అందించాలి ఆదిలాబాద్రూరల్: జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు ఎస్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉండేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మండలంలోని యాపల్గూడలోగల రెండో పోలీస్ బెటాలియన్ ఆవరణలో 600 మామి డి మధుబన్ మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై బెటాలియన్ సిబ్బందికి అవగాహ న కల్పించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో కలిసి శిక్షణ పొందిన వంద మంది అత్యవసర సందర్భాల్లో ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డెమో తిలకించారు. అ నంతరం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ తదితర అంశాలపై శిక్షణ పొందిన సిబ్బందిచే డెమో కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, బెటాలియన్ కమాండెంట్ నితిక పంత్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ పాల్గొన్నారు. -
శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన గర్భిణి సువర్ణకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త కరణ్ బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలీవరీ చేస్తామని చెప్పి చేర్చుకున్నారు. అదే రోజురాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మంచిర్యాలకు రెఫర్ చేయకుండా వైద్యులు అశ్రద్ధ చేసి తమ బిడ్డ మృతి చెందడానికి కారకులయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా మగశిశువు స్టిల్బర్త్తో పుట్టాడని, తల్లిగర్భంలో ఉన్నప్పుడు మలం తినడంతో మృతి చెందినట్లు తెలిపారు. -
ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది
మా తాతల కాలం నుంచి గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. అదే ఆచారం ఇప్పటి వరకూ కొనసాగుతోంది. గ్రా మంలో అందరం కలిసి మెలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడే అందరం కలిసి ప రిష్కరించుకుంటాం. ఆంజనేయ స్వామి గు డిలో పూజలు నిర్వహిస్తాం. అందరం కలిసి పండుగలు ఆనందంగా జరుపుకుంటాం. – మొర్ల పోచయ్య, చారిగాం స్నేహభావంతో ఉంటాం గ్రామంలోని యువకులమంతా కలిసి మెలిసి స్నేహభావంతో ఉంటా ం. గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే యువకులమంతా ఒకేచోట చేరి పరిష్కరించుకుంటాం. గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. బెల్టుషాపులు పెట్టరు. ఇదే ఆచారాన్ని అందరం పాటిస్తాం. – మొర్ల శంకర్, చారిగాం -
అభివృద్ధి చెందిన దేశంగా మారాలి
మన దేశం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతోంది. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో శ్రమించాలి. ప్రభుత్వాలూ ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలి. ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేస్తే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా తప్పనిసరిగా మారుతుంది. – జీ శ్రీజ శక్తివంతంగా తయారు కావాలి ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలున్నా మన ఐక్యతే దేశానికి పెద్దబలం. భిన్నాభిప్రాయాలున్నా సోదరభావంతో మెలుగుతున్నాం. ఏ దేశం బలప్రయోగం, బలవంతపు ఒత్తిడులు ఇండియాపై పడకుండా ప్రభుత్వం పటిష్ట విదేశాంగ విధానం అమలు చేయాలి. ప్రపంచ యవనికపై దేశం శక్తివంతంగా ఎదగాలి. – కూర ఐశ్వర్య రవాణా సౌకర్యం మెరుగుపర్చాలి రవాణా రంగం అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంటుంది. రవాణా రంగం ఎంతగా ప్రగతి సాధిస్తే అంత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు, జల, వాయు మార్గాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. వీటితో ఎగుమతులు, దిగుమతులు పెరిగి విదేశీ ద్రవ్యం పోగుపడుతుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలి. – పీ చైత్ర -
పట్టణం.. త్రివర్ణ శోభితం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించగా ప్రధాన వీధులు త్రివర్ణ శోభితమయ్యాయి. విద్యార్థుల దేశభక్తి నినాదాలతో చౌరస్తాలు మార్మోగాయి. ర్యాలీని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయం అద్వితీయమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం నాయకత్వం వహించేలా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పయనిస్తోందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి సూచికగా ప్రతీ గ్రామంలో తిరంగా ర్యాలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేదవ్యాస్, దినేశ్ మటోలియా, ముకుందరా వు, మహేందర్, కృష్ణయాదవ్, మురళీధర్, ఆదిత్య ఖండేశ్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పంద్రాగస్టు’కు అంతా సిద్ధం
కైలాస్నగర్: పంద్రాగస్టు వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. పోలీసు ల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా మైదానాన్ని చదును చేసి రంగురంగుల ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రాంతంతో పాటు ముఖ్య అతి థులు ఆసీనులయ్యే వేదికను సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రభు త్వ శాఖల అధికారులు, జర్నలిస్టులు కూర్చునేందు కు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్ర భుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని తె లియజేసేలా స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు గాను శాఖ ల వారీగా టెంట్లు వేశారు. వేడుకలు తిలకించేందు కు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల ప్రగతి తీరు తెన్నులను తెలిపే శకటాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 9.30గంటలకు జరిగే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఉత్తమ సే వలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాళ్లను తిలకించి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేయనున్నారు. జిల్లాకు చేరుకున్న ముఖ్య అతిథి పంద్రాగస్టు వేడుకల ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ గురువారం జి ల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక పెన్గంగా గెస్ట్హౌస్కు రాగా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మ హాజన్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. -
మళ్లీ పొడిగింపేనా?
పీఏసీఎస్ పాలకవర్గాల గడువు నేటితో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరునెలల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. .. నిందితుడి అరెస్ట్ ఉద్యోగాల పెరిట నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపా రు. హెడ్క్వార్టర్స్లో వివరాలు వెల్లడించారు. గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాత్నాల: భారీ వర్షం కారణంగా సాత్నా ల ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఈ మేరకు బుధవారం ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజె క్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.046 టీఎంసీలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఇన్ఫ్లో 1000 క్యూసెక్కులు ఉండగా.. అంతే మొత్తంలో అవుట్ఫ్లో కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, ఎస్పీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. నీటి మట్టాన్ని పరిశీ లించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. వారి వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, ఇతర అధి కారులు ఉన్నారు. తాంసి: మండలంలోని మత్త డి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో బుధవారం వేకువజామున ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 757 క్యూసెక్కులు ఉండగా..1,240 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉన్నట్లు ఏఈ హరీశ్కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం 277.40 మీటర్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక నీటి నిల్వ సామర్థ్యం 0.571 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.451 టీఎంసీగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం గవర్నర్ను కలిసిన ఎంపీ నగేశ్ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్వర్మను ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గవర్నర్తో చ ర్చించారు.అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్ పరి ధిలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని కో రారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించి వర్షాకాలం ముగిసిన తర్వాత పర్యటిస్తానని మాట ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.అలాగే గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందించారు. ● సిరికొండ మండలంలోని చిక్మాన్ వాగు రాంపూర్ లోలెవెల్ వంతెనపై నుంచి పొంగి ప్రవహించింది. వాగు దాటకుండా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, డీఎల్పీవో ఫణిందర్ పరిశీలించారు. సిరికొండ : రాంపూర్ లోలెవెల్ వంతెనపై వరద ఉధృతి ● కరుణించిన వరుణుడు ● 20 రోజుల తర్వాత వర్షం ● ప్రాజెక్టులకు జల కళ ● అన్నదాతల్లో హర్షం న్యూస్రీల్‘సాత్నాల’ గేట్ ఓపెన్మత్తడివాగు.. పరవళ్లు -
మళ్లీ పొడిగింపేనా?
● ఫిబ్రవరిలో ఆరు నెలలు పెంచిన ప్రభుత్వం ● నేటితో ముగియనున్న సొసైటీ పాలకవర్గాల గడువు ● జాతీయ పతాకావిష్కరణపై చైర్మన్ల ధీమాఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివరాలుకై లాస్నగర్/నిర్మల్చైన్గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14న ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీటి గడువు ముగిసినప్పటికీ డీసీసీబీ చైర్మన్ల విజ్ఞప్తి మేరకు ఆరునెలల పాటు అదనంగా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు సైతం గురువారంతో ముగియనుంది. ప్రస్తుతం వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు మరోసారి అనివార్యం కానుంది. ప్రత్యేకాధికారులను కూడా నియమించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు వేడుకల్లో తామే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని సొసైటీ చైర్మన్లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పాలకవర్గాల గడువు మరోసారి పొడిగింపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండోసారి పదవీకాలం పొడిగింపు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించారు. వీరితో పాటు పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. కాగా ఈ సొసైటీలకు ఎన్నికలు జరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ఐదేళ్ల గడువు పూర్తయ్యింది. దీంతో వాటి కాలపరిమితి ముగియడంతో రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. తాజాగా ఈ గడువు నేటితో ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో మరోసారి తమ పదవీకాలాన్ని పొడిగించాలని డీసీసీబీ చైర్మన్లతో పాటు సొసైటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో మరోసారి మూడు లేదా అరునెలల పాటు పదవీకాలం పొడిగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవీ కాలం ముగియడంతో 15వ తేదీన జరిగే పంద్రాగస్టు వేడుకల్లో చైర్మన్ల హోదాలో జాతీయ పతాకావిష్కరణ చేసే అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం ఎలాగైనా తమ పదవీకాలాన్ని పొడిగిస్తుందనే ధీమాలో ఉన్న సొసైటీ చైర్మన్లు తామే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.సహకార సంఘాలు : 77 డీసీసీబీ : 01 డీసీఎంఎస్ : 01 సొసైటీల పరిధిలోని సభ్యులు : 55 వేలు అన్నదాతకు వెన్నుదన్నుగా ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 55 వేలకు పైగా రైతులు ఉన్నారు. వారికి వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలను క్షేత్రస్థాయిలో అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. పలు సొసైటీలు ధాన్యం కొనుగోళ్లను సైతం చేపడుతున్నాయి. ఈ సొసైటీలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. అవకాశముంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఇటీవలే ఆరు నెలల పాటు సొసైటీల గడువును ప్రభుత్వం పొడిగించింది. మరోసారి సైతం పదవీకాలాన్ని పొడిగించేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. – బి.మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్ -
● ఇళ్ల నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి ● పనులు ప్రారంభించకుంటే రద్దు ● వారి స్థానంలో మరొకరికి అవకాశం ● వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు
కెలాస్నగర్: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టింది. తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి మంజూరు చేస్తుంది. అయితే ప్రొసీడింగ్ అందుకున్న చాలా మంది నెలలు గడుస్తున్నా పనులు షురూ చేయడం లేదు. అలాంటి వారిపై యంత్రాంగం దృష్టి సారించింది. నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచిస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రారంభించకుంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేస్తోంది. అలాగే వారి స్థానంలో అర్హులైన వారికి మంజూరు చేయాలని భావిస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొదటి, రెండు విడతల్లో కలిపి 9,093 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటి వరకు 2024 ఇళ్ల పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పనులు ప్రారంభించకుంటే అవి రద్దయ్యే అవకాశముంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏడాది జనవరి 26న మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలే అత్యధికంగా ప్రారంభానికి నోచుకోవడం గమనార్హం. నిర్మాణాలకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడం, సామగ్రి ధరలు పెరగడం, ఎస్హెచ్జీల నుంచి సకాలంలో రుణాలు మంజూరు కాకపోవడం వంటి కారణాలతో పలువురు ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రెండో విడతదీ అదే పరిస్థితి. దీంతో నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రొసీడింగ్ అందుకుని 45 రోజుల్లోగా నిర్మాణాలు ప్రారంభించకుంటే ఆ ఇళ్లను రద్దు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా నిర్మాణం చేపట్టనటువంటి వారి ఇళ్లను రద్దు చేసి వారి స్థానంలో మరొకరికి మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలుత వారికి నోటీసులు జారీ చేసి ఇళ్లను రద్దు చేస్తారు. అయితే పూరి గుడిసెల్లో నివసించేవారు, అత్యంత పేదలకు ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులతో ఇటీవల సమీక్షించిన ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికీ పనులు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేసి, 45 రోజుల్లోగా షురూ చేయకుంటే వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే ఇళ్ల మంజూరు పేరిట ఎవరైనా వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. తద్వారా పారదర్శకత ఏర్పడి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కలెక్టర్ తాజా నిర్ణయాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి ఏ మేరకు పుంజుకుంటుందనేది వేచి చూడాల్సిందే. హస్నాపూర్లో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ రాజర్షి షాజిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీరిది.. మంజూరైనవి : 9,093 మార్కవుట్ ఇచ్చినవి : 7,069 బెస్మెంట్ వరకు చేరినవి : 2,959 రూప్ లెవల్కు చేరినవి : 255 రూప్ పూర్తయినవి : 90 నిర్మాణాల వేగవంతంపై దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పనులు ప్రారంభించకుంటే వారి స్థానంలో మరొకరికి ఇంటిని మంజూరు చేస్తాం. అయితే వారిని ఎల్–1 స్టేజ్లో పెడుతాం. మళ్లీ ఆసక్తి చూపితే మంజూరు చేస్తాం. పేదలకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఎవరైనా వసూళ్లకు పాల్పడినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జి.జితేందర్రెడ్డి, జెడ్పీ సీఈవో -
ఆర్జీయూకేటీలో నషా ముక్త్ భారత్ అభియాన్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో బుధవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలని కళాశాల వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్సై శ్రీనివాస్ విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. మా దక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమంగా రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామి అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. -
బుచ్చిబాబు టోర్నీకి వైస్కెప్టెన్గా హిమతేజ
ఆదిలాబాద్: దేశవాళి క్రికెట్లో సత్తా చాటుతున్న జిల్లాకు చెందిన కొడిమెల హిమతేజ ప్రతిష్టాత్మక బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ టోర్నీకి జట్టును ప్రకటించింది. రాహుల్ సింగ్ నాయకత్వం వహించనుండగా వైస్ కెప్టెన్గా హిమతేజ వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ చైన్నె వేదికగా ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా నుంచి రంజీలో మెరిసిన ఈ యువ క్రికెటర్ తాజాగా వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంపై శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు అభినందించారు. -
చిన్నారిపై వీధికుక్క దాడి
లక్ష్మణచాంద: మండలంలోని ధర్మారంలో బాలు ని పై వీధికుక్క దాడి చే యడంతో గాయాలయ్యా యి. గ్రామానికి చెందిన మల్లెల శ్రీకాంత్–శిరీష దంపతుల కుమారుడు కౌశిక్ మంగళవారం ఇంటిముందు ఆడుకుంటుండగా వీధికుక్క వచ్చి దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలుఆదిలాబాద్రూరల్: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్రావు బుధవారం తీర్పునిచ్చినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్వాడకు చెందిన జాదవ్ ఆనంద్రావు మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదేక్రమంలో తలపై సుత్తెతో కొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దంపతుల కుమారుడు మహేష్ 18 డిసెంబర్ 2024న పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి సంతోష్ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెల్లడించారు. -
పాసైంది నలుగురే..!
● పరీక్ష రాసింది 129 మంది ● విడుదలైన లైసెన్స్డ్ సర్వేయర్ ఫలితాలు ● ఫెయిలైనా అప్రెంటిస్షిప్ యథాతథం కై లాస్నగర్: లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష ఫలితాలను హైదరాబాద్కు చెందిన జేఎన్టీయూ బుధవారం ప్రకటించింది. జిల్లాలో 155 మంది సర్వేయర్ శిక్షణ పొందారు. వారికి గత నెల 26, 27, 28 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 129 మంది హాజరయ్యారు. ఇందులో కేవలం నలుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గుడిహత్నూర్కు చెందిన జాదవ్ కిర్తీ (71, 63,77)మార్కులు సాధించగా, ఆదిలాబాద్కు చెందిన రంగసాయి కిరణ్ (65,77,73), ఇంద్రవెల్లికి చెందిన మేస్రం రాజు (66, 76, 83), తలమడుగుకు చెందిన తమ్మల సాయిప్రీతం(61,64,82)మార్కులను సాధించి ఉత్తీర్ణులయ్యారు. మిగతా 125 మంది ఫెయిలయ్యారు. ప్రాక్టికల్స్లో అందరూ ఉత్తీర్ణులైనప్పటికీ థియరీ, ప్లాటింగ్ పరీక్షల్లో రాణించలేకపోయారు. ఫలితాలను అభ్యర్థుల వాట్సాప్ నంబర్లకు పంపించారు. అయితే ఈ నెల 6నుంచి అందిస్తున్న అప్రెంటిస్షిప్ యథాతధంగా కొనసాగుతుందని జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తెలిపారు. ఫెయిలైన వారికి వచ్చే నెల 13, 14 తేదీల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు షెడ్యూల్ను తెలంగాణ అకా డమీ ఫర్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ జా యింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అందులో ఉత్తీర్ణులయ్యే వారిని కొనసాగించే అవకాశమున్నట్లుగా ఆయన వెల్లడించారు. కాగా పరీక్షల తీరుపై అభ్యర్థులు ఇది వరకే ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి నిర్వహించాలంటూ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు భా వించినట్లుగానే ఫలితాల్లో కేవలం నలుగురే ఉత్తీర్ణులు కావడం గమనార్హం. అయితే గతంలో జరిగిన పొరపాట్లకు అవకాశం లేకుండా ఈ సారి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
కడెం కెనాల్లో పడి ఒకరు మృతి
దండేపల్లి: మద్యం మత్తులో కడెం కెనాల్లో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సేదం నర్సయ్య (48) కూలీ పని నిమిత్తం దండేపల్లి మండలంలోని కుంటలగూడకట్టకు చెందిన తన బంధువైన బొబ్బిలి బక్కవ్వ ఇంటికి వచ్చాడు. మంగళవారం మద్యం సేవించి కడెం కెనాల్ సమీపంలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆతరువాత కొద్దిసేపటికి అతను కనిపించక పోవడంతో బంధువులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం వెతుకుతుండగా బుధవారం కుంటలగూడకట్ట సమీపంలోని కడెం కెనాల్ లో చెట్లపొదలకు తట్టుకుని మృతదేహం దొరికింది. మద్యం మత్తులో ప్రమాద వశాత్తు కెనాల్లో జారిపడడంతో ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడని మృతుని బంధువు భూమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడిన వెన్నెల నారాయణ (51) చికి త్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడకు చెందిన నారాయణ మంగళవారం ఉదయం తన మోటార్ సైకిల్పై అడెల్లి పోచమ్మ దర్శనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో స్థానిక శర్మ దాబా వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొని సింగరేణి కార్మికుడు..రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రిలోని గాంధీనగర్కు చెందిన సాయి వెంకటేష్ (28) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు .శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే–7 గనిలో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకటేష్ బైక్పై మంచిర్యాల నుండి మందమర్రి వైపు వెళ్తుండగా బొక్కలగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుని తండ్రి బానేష్ గతంలోనే అనారోగ్యంతో మృతి చెందగా తల్లి అన్నపూర్ణ అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. గూడ్స్ రైలు ఢీకొని ఒకరు..సిర్పూర్(టి): ఆరెగూడ సమీపంలో డౌన్లైన్పై ఆపోజిషన్ డైరెక్షన్లో రైల్వే కాంట్రాక్ట్ లేబర్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గూడ్స్ రైలు రివర్స్లో వచ్చి ఢీకొనడంతో షేక్ జంషేద్ (44) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం 5.40 గంటలకు షేక్ జంషేద్, ప్రవీణ్, పర్వేస్ నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రవీణ్కు చేయి విరగడంతో హైదరాబాద్కు తరలించారు. కాగజ్నగర్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.సురేష్ గౌడ్ విచారణ జరిపారు. షేక్ జంషేద్ మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకరిపై వేధింపుల కేసుజైనథ్: అదనపు కట్నం కోసం వేధించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రంగ బాలరాజు గౌడ్ కుమార్తె స్రవంతికి అంకోలి గ్రామానికి చెందిన బాలాజీతో 2018లో వివాహమైంది. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో రెండు సంవత్సరాల క్రితం స్రవంతి పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. వారం రోజుల క్రితం బాలాజీ జైనథ్కు వచ్చి చంపుతానని బెదిరించడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
కాసిపేట: అప్పులబాధతో లారీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కాసిపేట పోలీస్స్టేషన్ పరి ధిలోని సోమగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ రంజాన్(41) ఇటీవల లారీని కొనుగోలు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్లో ఆర్టీసీ బస్సుతో యాక్సిడెంట్ అయిందని కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికే అప్పుల పాలైన తాను యాక్సిడెంట్తో మరింత అప్పులు పెరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయి బుధవారం ఉదయం తన ఇంటిముందు రేకులకు లుంగీతో ఉరేసుకున్నాడు. మృతుని కుమారుడు హసన్బాబా ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు..నేరడిగొండ: మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోలాంకి శ్రీకాంత్ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చే సుకున్నట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఫాస్టాగ్ తరహాలో టైగర్ జోన్ ఎంట్రీ ఫీజుకడెం: టోల్గేట్ మాదిరిగా ఫాస్టాగ్ తరహాలో చెక్పోస్ట్ల వద్ద సెస్ వసూలు చేసేందుకు అట వీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కవ్వాల్ టైగర్ జోన్ గుండా ప్రయాణించే వాహనాలకు చెక్ పోస్ట్ల వద్ద ఎన్విరాల్మెంట్ సెస్ వసూలు చేస్తున్నా రు. గతంలో టైగర్జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతులు లేవు. ఇటీవలే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పాండ్వపూర్ లోని చెక్పోస్ట్ వద్ద టైగర్జోన్లోకి ఎంట్రీ అయ్యే వాహనాలు ఇప్పటి వరకు సిబ్బంది సెస్ వసూలు చేసేవారు. ఫాస్టాగ్ తరహాలో ఏర్పాటు చేయబోతున్న చెక్పోస్ట్తో వాహనదారులు వెంటవెంటనే వెళ్లేందుకు వీలుంది. -
ఉద్యోగాల పేరిట మోసగించిన నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ఎస్కే మైక్రోఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలంలోని శంకర్గూడకు చెందిన జవాడే కృష్ణ అలియాస్ జాదవ్ కృష్ణ ఎన్ఆర్ఐ అంటూ సామాజిక సేవ పేరుతో పరిచయాలు పెంచుకొని మైక్రో ఫైనాన్స్, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. 2024 డిసెంబర్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో కార్యాలయాలను ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా 300 మంది నుంచి రూ.20 వేల చొప్పున మెంబర్షిప్ చేయించాడు. రెండు కార్యాలయాల్లో ఐదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నిరుద్యోగుల నుంచి రూ.69 లక్షలు వసూలు చేశాడు. ఆరునెలల పాటు కనిపించకపోవడంతో జూలైలో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శంకర్గూడలో రూ.9 లక్షల నగదు, రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇంట్లోనే దాచిపెట్టి రూ.15 లక్షలతో పరారయ్యాడు. నిందితుడిని భోరజ్ చెక్పోస్టు వద్ద అరెస్ట్ చేసి రూ.9లక్షల నగదుతో పాటు 10.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఐదు సెల్ ఫోన్లు, ఒక ఖరీదైన వాచ్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి విడతల వారీగా వసూలు చేసి మోసం చేసిన డబ్బుల్లో రూ.6లక్షలు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ యజమానికి ఇచ్చాడని, మరో రూ.6లక్షలు మహరాష్ట్రలోని నాగ్పూర్లో భవన యజమానికి, రూ.3.5 లక్షలు ఆదిలాబాద్, ఉట్నూర్ కార్యాలయాల నిర్వహణకు, రూ.2.1 లక్షలు నిందితుడి తమ్ముడి అవసరాల నిమిత్తం ఇచ్చినట్లు తెలిపారు. మిగితా డబ్బులు జల్సాల కోసం, తప్పించుకోవడానికి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిందితుడు కరోన సమయంలో ముంబాయ్లో ఫేక్ రెమిడి ఇంజక్షన్లను విక్రయించాడని, నాగ్పూర్లో రుణాల పేరిట అక్కడి ప్రజలను మోసం చేశాడని తెలిపారు. నిందితుడిపై ఉట్నూర్లో 3, ఇంద్రవెల్లిలో 3, నార్నూర్లో 2, మావల పోలీసు స్టేషన్లో 3, ఆదిలాబాద్ వన్టౌన్లో 2, జైనథ్లో 3 చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్, ఐటీకోర్ ఎస్సై గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
‘నవోదయ’లో ప్రవేశానికి గడువు పొడిగింపు
కాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ బు ధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు సత్కారంఆసిఫాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025 కోసం బుధవారం హైదరాబాద్లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయంలో జాతీయ స్వతంత్య్ర జ్యూరీ నిర్వహించారు. కుమురంభీం జిల్లా నుంచి జన్కాపూర్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్ర నుంచి 160 మంది దరఖాస్తు చేసుకోగా ఆరుగురిని ఎంపిక చేశారు. ఇందులో వెంకటేశ్వర్లు ఒకరు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు పాఠశాల విద్యాప్రగతిని, విద్యార్థుల ప్రగతిలో వినూత్న సేవలను వివరించారు. అనంతరం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు మదన్మోహన్, ఆర్జేడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఐచర్ ఢీకొని వ్యక్తి మృతి
● న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించిన కుటుంబ సభ్యులుతానూరు: భైంసా–నాందేడ్ రహదారిపై బెల్తరోడా ఎక్స్రోడ్డు వద్ద బుధవారం ఐచర్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. మహలింగి గ్రామానికి చెందిన బన్సోడే ప్రభుదాస్ (35) భార్య లక్ష్మి, కుమారుడు అరుతో కలిసి భైంసాకు వెళ్లాడు. బుధవారం స్వగ్రామానికి వెళ్లేందుకు బెల్తరోడా ఎక్స్రోడ్డు వద్ద బస్సు దిగారు. భార్య, కుమారుడిని అక్కడే కూర్చోబెట్టి మక్కబుట్టా తీసుకువచ్చేందుకు రోడ్డు దాటుతుండగా భైంసా నుంచి నాందేడ్ వైపు అతివేగంగా వెళ్తున్న ఐచర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ఆపకుండా వెళ్తుండడంతో స్థానికులు వెంబడించి మహారాష్ట్ర సరిహద్దులోని రాఠి గ్రామ శివారులో పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై షేక్ జుబేర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. న్యాయం చేయాలని రహదారిపై బైఠాయింపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు రహదారిపై బైఠాయించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం చోటు చేసుకుందని, పరిహారం అందేవరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు
ఆదిలాబాద్రూరల్: మావల శివారు ప్రాంతంలోని సర్వేనంబర్ 170లో నకిలీ ఇంటి పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన స్వామికి 2013 బీపీఎల్ కింద ప్రభుత్వం 905 నంబర్ గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో బాధితుడు స్వామి గుడిసె వేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం 2015లో అనుమతులు సైతం తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయాడు. రహెమాన్ఖాన్ ఆ స్థలంలో ఉన్న గుడిసెను తొలగించి వెంకటమ్మకు రూ. 2.30 లక్షలకు విక్రయించాడు. వెంకటమ్మ ఆ స్థలాన్ని కిష్టన్నకు రూ.3.50 లక్షలకు విక్రయించింది. బాధితుడు స్వామిని బెదిరింపులకు గురిచేయడంతో ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో సుంకరి సంతోష్, రహిమాన్ ఖాన్, తాటి లక్ష్మణ్, కిష్టన్న, పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్, వంశీకృష్ణపై కేసు నమోదు చేశా రు. ఇందులో నలుగురిని అరెస్టు చేయగా కిష్టన్న పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్ పరారీలో ఉన్నారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై.. నెన్నెల: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కొందరు యువకులు బొప్పారం అడవిలో గంజాయి సేవిస్తున్నారని అందిన సమాచారం మేరకు వెంటనే దాడి చేయగా మంచిర్యాల గద్దెరాగడికి చెందిన ఐటీఐ విద్యార్థి పాల్తెపు ప్రణయ్ దొరికిపోయాడు. అతడిని సోదా చేయగా 1.5 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితో పాటు పల్సర్ బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించి వివరాలు సేకరించారు. ప్రణయ్తో పాటు పారిపోయిన నెన్నెల మండలం గన్పూర్ గ్రామానికి చెందిన పోతురాజుల అకాశ్, గొల్లపల్లికి చెందిన సల్లూరి పెత్రుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్లాట్ ఇస్తానని మోసం చేసిన ఒకరిపై..ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ యజమాని సయ్యద్ షాహిద్పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. 2008లో నార్నూర్కు చెందిన ఎక్బాల్ ఖాన్ షాహిద్ వద్ద రూ.50 వేలకు ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ.20వేలు అడ్వాన్స్ ఇవ్వగా రూ.30 వేలు కిస్తులుగా చెల్లించాడు. ఆ తర్వాత ప్లాట్ ఇవ్వకుండా 2016లో మరో వ్యక్తికి విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తొడసం కై లాస్కు సన్మానం
ఉట్నూర్రూరల్: రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్న తొడసం కై లాస్ను ఆదివాసీ బిరుదుగోండి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాంజీగోండ్ భవన్లో మంగళవారం సన్మానించారు. గోండిభాషలో మహాభారత్ గ్రంథాన్ని రచించి ఏఐ ద్వారా అనేక పాటలు సృష్టించిన తొడసం కై లాస్ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు. ఆర్చరీ (విలువిద్య)లో అనేక మందికి శిక్షణనిచ్చి, ఇటీవల పురస్కారం అందుకున్న చించుఘాట్ గ్రామానికి చెందిన కాత్లే మారుతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మర్సుకోలా తిరుపతి, ప్రధాన కార్యదర్శి తొడసం శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు పెందూర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిని పరిరక్షించుకోవాలి
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ప్రసాద్ శ్రీరాంపూర్: సింగరేణిని పరిరక్షించుకోవాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్ అ న్నారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణకు సేవ్ వర్కర్స్...సేవ్ సింగరేణి కార్యక్రమంలో భాగంగా ఈనెల 14న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 22న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీ స్ను ముట్టడించనున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న పలు నిర్ణయాలు కా ర్మికులకు ఇబ్బందిగా మారాయన్నారు. పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించడం, కారుణ్య ఉద్యోగాల కల్పనలో ఇబ్బందులకు గురి చేయడం, 3,600 మందిని విజిలెన్సు కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కంపెనీలో కార్మికుల సంఖ్యను కుదించినట్లు అధి కారులను ఎందుకు తగ్గించడం లేదన్నారు.సమావేశంలో ఆ యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్రావు, ఉపాధ్యక్షులు గరి గే స్వామి, కలవేన శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏ నుగు రవీందర్రెడ్డి, నాయకులు జీవన్జోయల్, తి రుపతి రాజు, అశోక్, మెండె వెంకటి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా బేస్బాల్ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఇంది రా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి బేస్బాల్ ఎంపిక పోటీలను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వీరికి బుధవారం నుంచి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక ఐపీ స్టేడియంలోనే ఈనెల 16నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి, అజయ్, గౌతమ్, నాగరాణి పాల్గొన్నారు. -
కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏటీడీవో క్రాంతికుమార్ అన్నారు. మంగళవారం కొలాం హబిటేషన్ గ్రామాలైనా కొత్తపల్లి–హెచ్ కొలాంగూడ, భీంపూర్ కొలాంగూడ, బొజ్జుగూడలలో నూతనంగా ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలాం గిరిజన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. సీఆర్టీలను నియమించి విద్యాబోధన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పీఎం జన్మన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బలిరాం, ఎస్సీఆర్పీ రాజబాబు, విజయ్కుమార్, సీఆర్టీ రోహిదాస్ చౌహాన్, రామేశ్వర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. -
కుడి.. ఎడమైతే!
● నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ● అందరిలో ప్రత్యేకతగా.. ● ఉమ్మడి జిల్లాలోనూ ఎడమచేతివాటం వ్యక్తులు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు నిర్మల్ జిల్లాలోని గుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు, విద్యార్థులు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు పదిమంది విద్యార్థులు ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. పాఠ్యాంశ బోధనలోనూ ఎడమవైపు చేతిద్వారానే అనువుగా ఉంటుందని చెబుతున్నారు. మిగతా వారితో పోల్చితే ఎడమచేతివాటం కలిగిన విద్యార్థులు విద్య, విద్యేతర విషయాల్లో చురుగ్గా ఉన్నారని వారు పేర్కొంటున్నారు.నిర్మల్ఖిల్లా: కుడిఎడమైతే పొరపాటు లేదోయ్...అన్నాడో సినీ కవి.. అంటే వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తాం. ఎడమ చేతివాటం అనేది జన్యు ప్రభావ ఫలితంగా ఏర్పడిందని వైద్య పరిశోధనలు సైతం రుజువు చేస్తున్నాయి. సమాజంలోని మనుషులలో ప్రతిఒక్కరూ భిన్నమైన గుణాన్ని కలిగి ఉంటారు. అందులో కొందర్ని మాత్రం ప్రత్యేకతను బట్టి సులభంగా గుర్తిస్తాం. చిన్ననాటి నుంచే జన్యు ప్రభావ ఫలితంగానే కుడి, ఎడమ చేతివాటాలు సంభవిస్తాయని సైన్స్ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడమ చేతి వాటం కలిగినవారు పలువురు ఉన్నారు. నేడు ప్రపంచ ఎడమ చేతివాటం వ్యక్తుల దినోత్సవం (వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే)గా జరుపుకుంటున్న నేపథ్యంలో సాక్షి కథనం. ప్రోత్సహిస్తేనే మంచిది.. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేతివా టాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాన్పించేందుకు ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
తాంసి: మద్యం మత్తులో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొన్నారిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గుమ్ముల నరేశ్ (31) కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈక్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణకు గ్రామంలో పలువురి వద్ద అప్పులు సైతం చేశాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.ప్రభాకర్ మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టెబుల్ తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు..భైంసారూరల్: జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుంబి గ్రామానికి చెందిన ఉప్పులవార్ మాధవరావు (49) గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచూస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని ఒకరు..కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన నరేందర్(40)కు పదిహేనేళ్ల క్రితం వాంకిడి మండలానికి చెందిన సంతోషితో వివాహమైంది. ఏడాదిక్రితం అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా బాధపడుతూ ఊర్లు తిరుగుతుండేవాడు. ఈక్రమంలో కాగజ్నగర్కు వచ్చి లాడ్జిలో బస చేశాడు. మంగళవారం గదిలో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకున్నాడు. మృతుని సోదరుడు భూంపల్లి ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని జీఎస్ ఎస్టేట్లో నివాసముంటున్న ఆనంద్ త్రిపాఠి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఈ నెల 6న ఇంటికి తాళం వేసి మధ్యప్రదేశ్కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం అతని స్నేహితుడు శివకుమార్ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా కిటికి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. లోపలికి వెళ్లిచూడగా తాళం పగులగొట్టి ఉండడంతో విషయాన్ని స్నేహితుడికి సమాచారం అందించాడు. లాకర్లో ఉన్న రూ.10వేల నగదు, రిస్ట్ వాచ్, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. జఠాశంకర ఆలయంలో..ముధోల్: మండల కేంద్రంలోని జఠాశంకర ఆలయంలో మంగళవారం చోరీ జరిగినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దొంగ ఆలయంలో ఉన్న హుండీ పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆలయానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. -
అక్రమ లేఅవుట్లలో హద్దురాళ్ల తొలగింపు
కైలాస్నగర్: జిల్లాకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్ల ఏర్పాటుతో పాటు అనుమతులు లేకుండా ప్లాట్లను విక్రయిస్తూ రియల్లర్లు సొమ్ము చేసుకుంటున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు న్నాయి. అయితే కలెక్టర్ రాజర్షి షా విషయాన్ని గుర్తించి చర్యలకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని బంగారుగూడ సమీపంలో రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా రెండు లేఅవుట్లను ఏర్పాటు చేశారు. ప్రజలను ఆకర్షించేలా రంగురంగుల జెండాలను పాతారు. అధికారి క పర్యటనలో భాగంగా ఆ మార్గంలో పయనించిన కలెక్టర్ విషయాన్ని గమనించారు. వాటిపై చర్యలకు ఆదేశించారు. వెంటనే మేల్కొన్న టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పొక్లెయిన్తో లేఅవుట్లలో పాతిన హద్దురాళ్లు, జెండాలను తొలగింపజేశారు. కాగా, ఈ చర్యల విషయాన్ని బయటకు రానీయకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రణాళికాబద్ధంగా చదవాలి
● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. పట్టణంలోని రణదీవెనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు ఓ ప్రైవేట్ పాఠశాల సౌజన్యంతో బెల్టులు, ఐడెంటిటీ కార్డులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్ హాజరై మాట్లాడారు. కష్టపడి చదివితే విజయం సొంతమవుతుందన్నా రు. అలాగే ఆరోగ్యంపై దృష్టి సారించాలనానరు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ పార్కు అందుబాటులోకి తీసుకురావాలి జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలోని సైన్స్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని ట్రె యినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవా రం సైన్స్ పార్కును పరిశీలించారు. పిచ్చిమొక్కలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. సై న్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం భవిత రిసోర్స్ సెంటర్ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డైట్ ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, జిల్లా సైన్స్ అధి కారి భాస్కర్, కిరణ్, పుష్పవేణి, తదితరులున్నారు. -
మస్తిష్క నియంత్రణ అమరిక ఫలితంగానే...
గర్భస్థదశలో శిశువు ఉన్నప్పుడు ఏర్పడిన జన్యు ప్రభావంతోనే ఎడమచేతివాటంగా జన్మిస్తారు. కొందరిలో వంశపారంపర్యంగా, పరిసర కారకాల ప్రభావంతో కూడా ఏర్పడుతుంది. వారు ప్రతీపనిని ఎడమచేతితో చేసేందుకు ప్రయత్నిస్తారు. మస్తిష్కనియంత్రణ అమరిక ఫలితంగా కూడా ఎడమ చేతివాటం ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. వీరు అందరిలోకన్నా భిన్నత్వాన్ని, మేధాశక్తిని అధికంగా కలిగి ఉంటారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సమాజంలో ప్రత్యేక నైపుణ్యాలతో పేరు ప్రతిష్టలు పొందిన వారిలో చాలామంది ఎడమచేతివాటం వారే. – అప్పాల చక్రధారి, సీనియర్ పిల్లల వైద్యనిపుణులు, నిర్మల్ -
కాలినడకన వెళ్లి..చికిత్స అందించి
నార్నూర్: ఏజెన్సీలో కొలాం గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. సదరు వైద్యసిబ్బంది మంగళవారం మండలంలోని కొత్తపల్లి (హెచ్) కొలాంగూడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీంపూర్ బొజ్జుగూడ (కొలాంగూడ) గ్రామానికి కాలినడకన వెళ్లి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స అందించారు. 15 రోజులకు ఒకసారి కొలాం గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తామని స్టాఫ్నర్స్ జంగుబాయి తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆమె వెంట ఎల్టీ గంగాదేవి, పారామెడికల్ అసిస్టెంట్ సావిత్రిబాయి, ఆశ కార్యకర్త లక్ష్మీబాయి, తదితరులు ఉన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ పంజాబీ దాబా వద్ద మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. రెబ్బెన మండలం ఖైర్గాంకు చెందిన గన్నా శ్రవణ్కుమార్, మహారాష్ట్రలోని రాజూరకు చెందిన అరున్ రామారావు ముమారే వద్ద నుంచి 60 గ్రాముల (10 ప్యాకిట్లు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ అక్రమాలపై విచారణ జరిపించాలి
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ఐటీడీఏలో జరుగుతున్న అవినీతి, అక్రమాలతో పాటు ఎస్టీ రి జర్వేషన్ ఉల్లంఘనలపై జాతీయ ఎస్టీ కమిషనర్ హుస్సేన్నాయక్ను కలిసి ఫిర్యాదు చేసిన ట్లు ఏజెన్సీడీఎస్సీ సాధన కమిటీ ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లా సభ్యుడు జాదవ్ సుమేష్ తెలి పారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి వందశాతం ఎస్టీ రి జర్వేషన్ అమలు చేయాలని, జీవో నంబర్ 3 పునరుద్ధరించి అన్ని హక్కులు గిరిజనులకే క ల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆయన వెంట దేవురావ్, కుమార్ పాల్గొన్నారు. -
వేధింపులతో మహిళ మృతి
తలమడుగు: వేధింపులతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు తలమడుగు మండలంలోని కజర్ల గ్రామానికి చెందిన మొట్టె మానస(25)కు అదే గ్రామానికి చెందిన గంపల ప్రశాంత్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రశాంత్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో మానసను జమ్మూకశ్మీర్కు తీసుకెళ్లాడు. అక్కడ భర్త, అత్తామామలు శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆరోగ్యం క్షిణించింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు కజ్జర్లకు తీసుకువచ్చి ఆదిలాబాద్లోని రిమ్స్లో చేర్పించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పూర్ణచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడ సమీపంలో రహదారిపై ఈ నెల11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయికుంటకు చెందిన రామటెంకి రాజవ్వ (84) మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వృద్ధురాలు సోమవారం చున్నంబట్టి వాడ సమీపంలో రోడ్డు దాటుతుండగా మంచిర్యాల వైపు నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. రాజవ్వకు తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కూతురు మల్లక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బ్యాంక్ సిబ్బందిపై దాడి!ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ షాపు యజమాని బ్యాంక్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. మంగళవారం బ్యాంక్ రుణానికి సంబంధించి రికవరీ కోసం వెళ్లగా బ్యాంక్ ఉద్యోగులు, షాపు యజమానికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో షాపు యజమాని కత్తెరతో దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ను వివరణ కోరగా.. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. అదుపుతప్పి వ్యాన్ బోల్తాబెల్లంపల్లి: బెల్లంపల్లి శివారులోని నేషనల్హైవే బైపాస్ రోడ్డుపై మంగళవారం తెల్లవారు జా మున సరుకుల లోడ్తో వెళ్తున్న వ్యాన్ 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో రోడ్డుపక్కన బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డా డు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలే వీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
అధికారికంగా పొలాల పండుగ
● ఈ నెల 23న తాంసిలో నిర్వహణ ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ తాంసి: జిల్లాలో రైతులు సంప్రదాయంగా భావించే పొలాల అమావాస్య పండుగను ఈ సారి అధికారికంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23న పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లను అధికారులు, గ్రామస్తులతో కలిసి కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. స్థానిక వాగు, మందిరం స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పొలాల అమావాస్యకు సంబంధించిన లఘు చిత్రాన్ని ఎంపీడీవో కార్యాలయంలో వీక్షించారు. పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఏటా పొలాల పండుగను రైతులు ఘనంగా నిర్వహించుకుంటారని, ఈ సారి రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చేలా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. గ్రామస్తులు ఐక్యతగా ఉంటూ ఏర్పాట్లలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారు ప్రొఫెసర్ తిరుమల్రావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి రవి, డీఆర్టీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ, ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. పొన్నారిలో ఇళ్ల నిర్మాణాలు పరిశీలన..మండలంలోని పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక కోసం రూ.7వేలు చెల్లిస్తున్నామని వారు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను అధిక ధరకు విక్రయిస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అవసరమైన వారికి కూపన్లు అందించి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మికి సూచించారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ నజీర్, పంచాయతీ కార్యదర్శి గంగన్న, గ్రామస్తులు ఉన్నారు. -
ఎన్ఆర్ఐ కృష్ణపై కేసు నమోదు
ఇంద్రవెల్లి: రిమ్స్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన మండలంలోని శంకర్గూడకు చెందిన ఎన్ఆర్ఐ, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్ జవాడే కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన డిగ్రీ విద్యార్థి తుంగపిండి ఉదయ్కుమార్కు కృష్ణతో పరిచయం ఏర్పడింది. మే నెలలో వారింటికి వెళ్లి రిమ్స్లో ఏఎన్ఎం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మీ అమ్మకి ఇప్పిస్తానని చెప్పడంతో జూన్ 3న ఉదయ్కుమార్ తన తల్లితో కలిసి ఆదిలాబాద్లోని రామ్నగర్లో ఉన్న డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి రూ.2.30 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం పలుమార్లు కార్యాలయానికి వెళ్లగా అక్కడ కృష్ణ కనిపించలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు. వినాయక మండపం కూల్చివేతబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 21 వార్డు బూడిదగడ్డ బస్తీలో నిర్మిస్తున్న వినాయక మండపాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ కృష్ణ , వన్టౌన్ ఎస్హెచ్వో శ్రీనివాసరావు పరిశీలించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అనుమతి లేకుండా మండపం నిర్మించడం సరికాదని నిర్వాహకులకు సూచించారు. కడెం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేతకడెం: ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్కు మంగళవారం రాత్రి 4,812 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తి 12,833 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.775 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. యూరియా కోసం రైతుల వెతలుతాండూర్: ఖరీఫ్ సీజన్లో వివిధ రకాల పంటలు సాగుచేసిన మండల రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మండల సహకార సంఘానికి ప్రస్తుతం 12 టన్నుల (260 బస్తాలు) యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో అన్నదాతలు గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంద్రవెల్లి: మండల కేంద్రంలోని పీఏసీఎస్, హక రైతు సేవ కేంద్రం, ఫర్టిలైజర్ దుకాణాల్లో గత 10 రోజులుగా యూరియా కొరత ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు మానేసి దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కొన్నిషాపుల్లో యూరియా ఉన్న అవసరంలేని మందులతో లింకులుపెట్టి వాటిని అంటగడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి యూరియా కొరతలేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
డీసీసీ ఇప్పట్లో లేనట్టే..!
● జిల్లా అధ్యక్షుడి నియామకం మరింత ఆలస్యం ● అన్నిరకాల కమిటీలు కూడా.. ● ‘స్థానిక’ ఎన్నికల తర్వాతేననే ప్రచారం ● ‘హస్తం’ శ్రేణుల్లో నిరాశ సాక్షి,ఆదిలాబాద్: ‘త్వరలో పార్టీ పదవుల కేటా యింపు ఉంటుంది.. జెండా మోసిన కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.. బూత్ స్థాయి నుంచి అన్నిరకాల కమిటీల బలోపేతానికి చర్యలు తీ సుకుంటాం.. వాటికి పునర్ వైభవం తీసుకురావడమే మా ముందున్న లక్ష్యం.. జిల్లా అధ్యక్షుడిని ని యమిస్తాం..’ఇది కాంగ్రెస్పార్టీ పరిశీలకులు, ఉమ్మ డి జిల్లా ఇన్చార్జీలు పార్టీ సమావేశాల్లో కార్యకర్తలను ఉద్దేశించి అన్న మాటలు. దీంతో ఇక పార్టీకి మంచి రోజులు రానున్నాయన్న సంతోషం కార్యకర్తల్లో కనిపించింది. మళ్లీ ఏమైందో ఏమో గానీ ఈ విషయంలో స్తబ్ధత నెలకొంది. జిల్లా అధ్యక్షుడి ని యామకం ఇప్పట్లో లేనట్టేననే సంకేతాలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కమిటీల నియామకంపై కూడా స్పష్టత లేదు. దీంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. గత ఏప్రిల్, మే నెలల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ కమిటీల నియామకం కోసం మండల, పట్టణ సమావేశాలను విస్తతంగా నిర్వహించారు. ఆ ప్రక్రియ పూర్తి చేసి ఆయా కమిటీలకు గాను ఒక్కో దానికి ఐదేసి పేర్ల చొప్పున దరఖాస్తులు కూడా స్వీకరించారు. శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది.ఇక పార్టీకి సంబంధించి గ్రామ, మండల, వార్డు, పట్టణ,బ్లాక్ కమిటీలను పూర్తి చేస్తా రని భావించారు. అయితే అధిష్టానం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు,డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఆసక్తి చూపడం లేదని పార్టీలో ప్రచారం సాగుతుంది. ఇలా అయితే ఎలా.. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పార్టీ పరంగా ఎలాంటి కమిటీలు లేకపోవడం, జిల్లాకు దిక్సూచిగా ఉండాల్సిన అధ్యక్షుడి పదవి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి ఖాళీగా ఉండటంపై కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. నియోజకవర్గ ఇన్చార్జీల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు సాగుతుండడంతో కొంతైనా ప్రభుత్వ పథకాలపై ప్రచారం జరుగుతుందనే అభిప్రా యం ఉంది. అయితే అన్ని స్థాయిల్లో కమిటీల నియామకం జరిగితేనే పార్టీ బలపడుతుందని, అలాగే కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తుందనే టాక్ వినిపిస్తుంది. అయితే అధిష్టానం ఈ విషయంలో వెనుకడుగు వేయడం గమనార్హం. గ్రూపు తగాదాల నేపథ్యంలోనే.. పార్టీలో గ్రూపు తగాదాల నేపథ్యంలోనే అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, కమిటీల నియామకంలో మళ్లీ వెనుకంజ వేస్తుందన్న ప్రచారం సాగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో నాయకుల మధ్య గ్రూపు తగాదాలు ఉండడంతో ఈ పరిస్థితి ఉందని అభిప్రాయ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కమిటీలు నియమించి, జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేస్తే గ్రూపు తగాదాలు మరింత పెరుగుతాయా అనే సందేహం అధిష్టానంలో ఉందని, దీంతోనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయానికి ముందడుగు పడడం లేదని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే మిగతా జిల్లాల్లో గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారు ఉండడంతో కనీసం మాజీ జిల్లా అధ్యక్షులు అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్లో మాత్రం ఈ పదవి ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో అసలు దిశానిర్దేశం చేసే నాయకత్వం కరువైంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడి నియామకంలో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయ పడుతున్నారు.పీఏసీ సమావేశం తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ పార్టీ అధ్యక్షుల నియామకం జరగలేదు. త్వరలో హైదరాబాద్ లో పీఏసీ సమావేశం ఉంది. అందులో ఏదైన ని ర్ణయం జరగవచ్చు.అప్పటివరకు ఏమీచెప్పలేం.– తాహెర్బిన్ హందాన్, పార్టీ జిల్లా పరిశీలకులు -
● ఆర్టీసీకి కలిసి వచ్చిన వరుస సెలవులు ● ‘పౌర్ణమి’ రోజున రూ.2.89 కోట్ల ఆదాయం ● రీజియన్ వ్యాప్తంగా రూ.9.26 కోట్ల ఆమ్దాని
బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు ఆదిలాబాద్: వరుస సెలవులు, పండుగలు ప్రజా రవాణా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీపౌర్ణమి, 10న ఆదివారం కలిసి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7నుంచి 11వరకు రీజియన్ వ్యాప్తంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 101 నమోదవడం రద్దీ తీరుకు నిదర్శనం. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆరు డిపోల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రతీ కిలోమీటర్కు రూ.66.48 ఆదాయం వచ్చింది. మొత్తం 639 బస్సులు 13,93,000 కిలోమీటర్లు తిరిగి 18.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జూలై నెలలో ఒక్క సాధారణ రోజు ఇన్కమ్ రూ.1.85 కోట్లుగా ఉంది. అయితే రాఖీ పండుగ ఒక్కరోజే రీజియన్ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. గతేడాది ఈ పండుగకు రూ.1.57 కోట్ల ఆదాయం రాగా ఈ సారి అదనంగా మరో రూ.1.32 కోట్లను ఆర్జించి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో రీజియన్ పరిధిలో రూ.9.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా నిర్మల్ డిపో రూ. 2.49 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో నిర్మల్ డిపో.. ఐదు రోజుల్లో నిర్మల్ డిపో రూ.2.49 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రూ.1.25 కోట్లతో సరిపెట్టుకోగా, ఈసారి రెట్టింపు సమకూర్చుకోవడం విశేషం. గతంలో రూ.కోటి 80 వేల ఆదాయంతో నిలిచిన ఆదిలాబాద్ ఈసారి పుంజుకుని రూ.2.15 కోట్లకు చేరుకుంది. ముందస్తు ప్రణాళికతో.. వరుసగా రెండు పండుగలు, ఆదివారం కూడా తోడవడంతో రద్దీని ముందే పసిగట్టిన ఆర్టీసీ అధి కారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగారు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడిపింది. ముఖ్యంగా హైదరాబాద్కు 118 స్పెషల్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 బస్సులు ఏర్పాటు చేయగా, 10 నుంచి 12వ తేదీ వరకు రీజియన్ నుంచి హైదరాబాద్కు 72 బస్సులను ఆపరేట్ చేశారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్డెస్క్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఉద్యోగుల ఇబ్బందులను సైతం పరిగణలోనికి తీసుకొని ఈ సారి వారికి ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు ఆర్టీసీకి ఆమ్దాని వచ్చింది. ‘మహాలక్ష్మి’లే అధికం..తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రయాణమైనా మహిళలు ఆర్టీసీలో ప్రయాణించడం సంస్థకు లాభించింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 18.84 లక్షల మంది ప్రయాణించగా, అందులో 12.60 లక్షల మంది ‘మహాలక్ష్మి’లే ఉన్నారు. అత్యధికంగా పౌర్ణమి రోజున 4.27 ల క్షల మంది ప్రయాణించగా, ఇందులో 2.93 ల క్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులున్నారు. ఇక ఆ క్యూపెన్సీ రేషియో విషయానికి వస్తే ఉట్నూరు డిపో పరిధిలో అత్యధికంగా 109 ఉండగా, ని ర్మల్ 106, భైంసా 102, ఆదిలాబాద్ 101, మంచిర్యాల 97,ఆసిఫాబాద్ 95గా నమోదయ్యాయి. రీజియన్ పరిధిలో ఇలా.. (ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు) డిపో బస్సులు ఆదాయం ప్రయాణించిన (రూ.కోట్లలో) కి.మీ.(లక్షల్లో) ఆదిలాబాద్ 3.22 2.15 భైంసా 1.47 0.90 నిర్మల్ 3.47 2.49 ఉట్నూర్ 0.77 0.53 ఆసిఫాబాద్ 1.69 1.06 మంచిర్యాల 3.31 2.13 రీజియన్ 13.93 9.26 ప్రయాణికులను సురక్షితంగా చేర్చాం.. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులను ఆపరేట్ చేశాం. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు. ఆదాయం సైతం గతంతో పోలిస్తే ఘననీయంగా పెరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. – ఎస్. భవానీప్రసాద్, ఆర్ఎం, ఆదిలాబాద్ -
అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు
రామకృష్ణాపూర్: అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు న మోదు చేసినట్లు మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మంగళవారం పో లీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మి స్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ) సంస్థ వారు గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్కు సమాచారం ఇచ్చారు. వారు ఆ కేసును తమకు అప్పగించడంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్లో ఉంచవద్దని ఎన్పీడీసీఎల్ వరంగల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యు త్ శాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించారు. 33కేవీ ట్రి ప్పింగ్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్ స్తంభాలకు సెప్టెంబర్ 30లో గా నంబరింగ్ పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఈ అశోక్ కుమార్, డీఈలు ఈదన్న, ప్రభాకర్, సుభాష్, ఏడీ లక్ష్మణ్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రెండేళ్లయినా బిల్లులు రావట్లేదు..
సార్.. మేమంతా పీవీటీజీ ఆదిమ గిరిజనులం. ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో 2023లో సీసీడీపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసింది. చేతిలో డబ్బుల్లేకపోయినా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందనే భరోసాతో అప్పు చేసి మరి ఇండ్లను కట్టుకున్నాం. నిర్మాణాలు పూర్తయి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయడం లేదు. మా పరిస్థితి అర్థం చేసుకుని త్వరితగతిన బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – ఆదివాసీ లబ్ధ్దిదారులు, ఉట్నూర్ -
● గల్ఫ్ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్యాటకవీసాలపై నైపుణ్యరహిత పనుల్లో చేరిక ● చట్టాలపై అవగాహన లేక చేయని నేరానికి జైలుకు ● క్షేమసమాచారం తెలియక బాధిత కుటుంబసభ్యుల ఆందోళన
ఉపాధివేటలో ఆగిన గుండె ● ఉజ్బెకిస్తాన్లో వలస కార్మికుడి మృతి నిర్మల్ఖిల్లా: ఉపాధివేటలో విదేశాలకు పయనమైన జిల్లాకు చెందిన యువకుడి గుండె అక్కడే ఆగింది. దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామ పంచాయతీ పరిధి కొత్తపెద్దూర్ గ్రామానికి చెందిన సంగ సురేశ్ (33) ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గల్ఫ్ దేశం వెళ్లేందుకు సురేశ్ కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన సబ్ ఏజెంట్ను సంప్రదించి రూ.2.50 లక్షలు ముట్టజెప్పాడు. సదరు సబ్ఏజెంటు మొదట 9 రోజులు ఢిల్లీలో ఉంచి అక్కడి నుంచి టూరిస్ట్ వీసా మీద ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంటుకు పంపాడు. అక్కడ క్లీనింగ్ పని కోసం 15 రోజులు శిక్షణ పొందాడు. అనంతరం డ్యూ టీలో చేరిన నాల్గొవ రోజు (గత నెల 21) గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో సురేశ్ మృతి చెందినట్లు కంపెనీప్రతినిధులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కాగా అక్కడి ఏజెంట్ మృతదేహాన్ని కార్గోలో పంపడానికి డబ్బు ఖర్చువుతుందని, ఢిల్లీ వరకు మాత్రమే పంపగలమ ని రోజుకో మాట చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు. కలెక్టర్, రాష్ట్ర ఎన్ఆర్ఐ సభ్యులకు వినతి.. తాజాగా సోమవారం మృతుడి భార్య సంగ మమత, ఇద్దరు పిల్లలు, మామ జింక భూమన్నలతో కలిసివచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు సమస్య విన్నవించా రు. స్పందించిన కలెక్టర్ వివరాలు తీసుకొని మృతదేహం త్వరగా ఇండియా పంపేలా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అ నంతరం రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ స భ్యుడు స్వదేశ్ పర్కిపండ్లకు వివరాలతో కూ డిన పత్రాలు అందించి మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. ఏజెంట్కు కట్టిన నగదు తిరిగి ఇప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు. నిర్మల్ఖిల్లా: ఉన్న ఊరిలో పనులు లేక కుటుంబాలను పోషించుకునేందుకు గ్రామీణ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు దేశం కాని దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. కంపెనీ వీసాలు దొరక్క విజిట్ వీసాలపై వెళ్లిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఉపాధి వేటలో ఎలాగైనా గల్ఫ్ దేశం వెళ్లాలన్న యువకుల బలమైన కాంక్షను ఆసరాగా చేసుకున్న నకిలీ ఏజెంట్లు తాత్కాలిక, పర్యాటక వీసాలను అంటగట్టి రూ.లక్షలు దోచేస్తున్నారు. అలా వెళ్లిన జిల్లా వలస కార్మికులు నైపుణ్య రహిత పనుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం వీసా లేకుండా పనిచేయడం నేరం కావడంతో అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వారి జాడ, క్షేమ సమాచారం స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియక తల్లడిల్లుతున్నారు. జిల్లాలో ఇలాంటి కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఏజెంట్ల వలలో చిక్కి.. కంపెనీ ఉద్యోగాల పేరిట అధిక వేతనాల ఆశ చూపుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెంట్లు గ్రామీణ మధ్యతరగతి యువతకు ఎరవేస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉన్నతంగా స్థిరపడిన వా రిని చూసి యువత తామూ అలాగే ఎదగొచ్చని ఆశపడుతూ అప్పుచేసి రూ.లక్షలు ముట్ట చెబుతున్నా రు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోతున్నా రు. గత ఆరు నెలల కాలంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన జిల్లాకు చెందిన పలువురు యువకులు అక్కడి పోలీసులకు చిక్కడంతో ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. నైపుణ్య రహిత పనుల్లోనే.. విదేశాలకు వెళ్లాలన్న తపనతో రూ.లక్షలు వెచ్చించి అక్కడ నైపుణ్య రహిత పనులైన భవన నిర్మాణ రంగం, ఆఫీస్ బాయ్, క్లీనింగ్ తదితర పనులు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, ఉన్నతచదువులు లే కపోవడం, నైపుణ్య రంగాల్లో అనుభవం లేకపోవ డం కూడా ఇందుకు మరో కారణంగా గల్ఫ్ సంక్షేమ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా వివిధ వృత్తి పనుల్లో అనుభవం కలిగి ఉండాలని, అలాంటి పనుల నిమిత్తమే రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారావిదేశాలకు ఉపాధి కోసం వెళ్లాలని సూచిస్తున్నారు.ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలు.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన పన్నాల శ్రీనివాస్ సౌదీ అరేబియా దేశం వెళ్లి గత మేలో పనిలో చేరాడు. అక్కడి యజమాని తన వ్యవసాయ క్షేత్రానికి పంపగా ఒకసారి భార్య పిల్లలకు ఫోన్ చేశాడు. అనంతరం అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి క్షేమ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన కిస్టాపురం లక్ష్మన్న సబ్ ఏజెంట్ ద్వా రా రూ.2లక్షలు వెచ్చించి దుబాయ్కి లేబర్ సప్లయ్ కంపెనీ వీసా ద్వారా వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సరైన వేతనం కూడా లేకపోవడంతో స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన గొర్రె రాజేందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆయన వేతన ఖాతాలో అక్రమ నగదు బదిలీ కాగా కేసులో ఇరుక్కున్నాడు. స్వదేశానికి తిరిగి రాలేక అక్కడి పోలీసుల అదుపులో ఉన్నాడు. తమ కొడుకుని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని తండ్రి గంగన్న, కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన సాయినాథ్, సారంగాపూర్ మండలం దేవితండాకు చెందిన జాదవ్ మధుకర్ గల్ఫ్ దేశాల్లో వివిధ రకాల కేసుల్లో ఇరుక్కొని అష్టకష్టాలు పడుతున్నారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గొర్రెకర్ శ్రీనివాస్ దుబాయ్లో సైబర్ నేరం కేసులో కటకటాలపాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి నకిలీ ఏజెంట్లను నమ్మి విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దు. వృత్తిపరమైన శిక్షణతో కూడిన పనులకు మాత్రమే వెళ్లాలి. రిజిస్టర్డ్ ఏజెంట్లు, కంపెనీల ద్వారా వీసా రుసుము చెల్లించిన తర్వాతనే పయనమవ్వాలి. ప్రవాసీ భారత బీమా యోజన ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. గల్ఫ్ దేశాల నియమ, నిబంధనలు, చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి. – మంద భీమ్రెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ ప్రతినిధి, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్చైర్మన్ -
తిమ్మిని బమ్మి చేసి..
ఇది ఉట్నూర్ మండలం కుమ్మరితాండలో ఓ డొమెస్టిక్ కొత్త లైన్ కోసం వేసిన ట్రాన్స్ఫార్మర్. పది రోజుల క్రితం బిగించారు. అయితే ఇక్కడ లాజిక్ ఉంది. వాస్తవానికి 25 కేవీ లోడ్ ట్రాన్స్ఫార్మర్ బిగించాలి. అయితే ఇదే మండలంలోని ఉమ్రి గ్రామంలో ఓవర్లోడ్ కారణంగా తొలగించిన 15 కేవీ ట్రాన్స్ఫార్మర్ను బిగించేశారు. అలాగని ఈ వర్క్ సాంక్షన్ జరిగి అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుందా అంటే.. అదేమిలేదు. మొత్తం పని పూర్తయిన తర్వాత ఇప్పుడు సాంక్షన్, అగ్రిమెంట్ పనులు చేపట్టడంలో చోద్యమేమిటో.ఇది ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామంలోనిది. ఒక వర్క్కు సంబంధించి ఈ 25కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఇటీవల బిగించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ వర్క్ ఇంకా మంజూరు కాకపోవడంతో ఇదే గ్రామంలో మంజూరైన ఇతర పనులకు సంబంధించి మరో కాంట్రాక్టర్ నుంచి ఓ ట్రాన్స్ఫార్మర్ను తీసుకొని ఇలా పెట్టేశారు. సాధారణంగా ఏ పనికోసమైతే ఆ ట్రాన్స్ఫార్మర్ను వాడాలో దానికి సంబంధించి ఎక్యూప్మెంట్ నంబర్ నమోదై ఉంటుంది. ఇప్పుడు ఈ బిగించిన ట్రాన్స్ఫార్మర్ వివరాలు విచారణ చేస్తే అది మరొక పనికోసం మంజూరు చేసినదని ఇట్టే తెలిసిపోతుంది. -
వర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే..
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పా టు చేయాల్సిందేనని యూనివర్సిటీ సాధన సమి తి జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సమష్టిగా పోరాడితే విశ్వవి ద్యాలయ ఏర్పాటు సాధ్యపడుతుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అన్ని కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీసభ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో వర్సిటీ సాధన స మితి కోకన్వీనర్ తొగరి భాస్కర్, సభ్యులు శ్రీ కాంత్ రెడ్డి, అఫ్సర్ఖాన్, డాక్టర్ ప్రపుల్వఝే, సతీశ్రెడ్డి, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆ విత్తనాలు మొలకెత్తలే..
ఈ సీజన్లో నాకున్న 4.31 ఎకరాల్లో సోయాబిన్ సాగు చేశా. అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్ ఆదిలాబాద్ వారి నుంచి రూ.1600 నగదు చెల్లించి జేఎస్ 335 రకం ఐదు సంచుల విత్తనాలను కొనుగోలు చేశాను. వాటికి లాట్ నంబర్ లేకుండానే నాకు రశీదు ఇచ్చారు. ప్రభుత్వ విత్తనాలని నమ్మితే అవి మొలకెత్తనేలేదు. స్థానిక ఏఈఓ, తలమడుగు ఏవోలను కలిసి లిఖితపూర్వకంగా సమస్యను వివరించినా వారు పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన నాకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – గోనెల నర్సింలు, రుయ్యాడి, తలమడుగు -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని అక్కడే ఉన్న అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 78 అర్జీలు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ వారం బాధితుల్లో కొందరి నివేదన.. కలెక్టర్కు రాఖీ కట్టిన అధికారులు రక్షాబంధన్ పురస్కరించుకుని అదనపు కలెక్టర్ శ్యామలదేవితో పాటు పలువురు జిల్లా మహిళా అధికారులు కలెక్టర్ రాజర్షి షాకు రాఖీలు కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో కలెక్టర్తో పాటు ప్రజావాణికి హాజరైన అధికారులందరికీ రాఖీలు కట్టి మిఠాయిలు పంచారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రాఖీలను అంగన్వాడీ కేంద్రం చిన్నారులు కలెక్టర్కు కట్టారు. కలెక్టర్ రాజర్షి షా ప్రజావాణికి 78 దరఖాస్తులు -
‘దేశీదారు’ పట్టివేత
ఆదిలాబాద్టౌన్: అక్రమంగా తరలిస్తున్న 530 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన అలిశెట్టి అభిలాష్ అనే వ్యక్తి రూ.24వేల విలువ గల మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నాడు. కొరట గ్రామ శివారులో ఎకై ్సజ్ అఽ దికారుల రాకను గమనించి బైక్తో పాటు మ ద్యం సీసాలను వదిలి పరారయ్యాడు. అభిలా ష్పై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితుడిని జైలుకు పంపిస్తామన్నారు. సిబ్బంది తానాజీ, ధీరజ్, హన్మంతు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 43 అర్జీలు
ఆదిలాబాద్టౌన్: ప్రజాసమస్యలపై పోలీసు అధి కారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పరి ష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 43 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. ఆయన వాటిని స్వీకరించి ఫోన్ ద్వారా సంబంధితాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. దూరప్రాంతాల వారు వాట్సాప్ ద్వారా తమ సమస్యలను 8712659973నంబర్పై తెలియజేయవచ్చ ని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 43 అర్జీలు
ఆదిలాబాద్టౌన్: ప్రజాసమస్యలపై పోలీసు అధి కారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పరి ష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 43 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. ఆయన వాటిని స్వీకరించి ఫోన్ ద్వారా సంబంధితాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. దూరప్రాంతాల వారు వాట్సాప్ ద్వారా తమ సమస్యలను 8712659973నంబర్పై తెలియజేయవచ్చ ని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
‘కార్మిక సమస్యలపై పోరాడుతాం’
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సీసీసీ కార్నర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులతో చేయించాల్సిన బొగ్గు ఉత్పత్తిని కూడా కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి 50 శాతం పర్మినెంట్ ఉద్యోగులు, సంస్థ ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకులు మండ రామాకాంత్, పులి రాజిరెడ్డి, అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, శ్రీరాంపూర్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి రాజేందర్, నాయకులు కమలాకర్, కిరణ్కుమార్, మహేందర్, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీలో ఉత్తమ విద్య
● ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ బాసర: ఆర్జీయూకేటీ అందించే ఉత్తమ విద్య, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వనరులను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బాసర క్యాంపస్లో నూతన విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ జ్ఞానంతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధించేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు ప్రతీరోజు కనీసం 5 నిమిషాలు పిల్లలతో మాట్లాడి, వారి విద్యాప్రగతి, మానసిక స్థితి, లక్ష్యాలపై చర్చించాలని సూచించారు. అసోసియేట్ డీన్స్ డా. విటల్, డా. నాగరాజు, డాక్టర్ మహేశ్, శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. మెటా గేట్ అకాడమీతో ఒప్పందం ఆర్జీయూకేటీలోని మెటలర్జీ –మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మెటా గేట్ అకాడమీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సమక్షంలో ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళీధర్షన్, మెటా గేట్ అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎన్. గురుప్రసాద్ సంతకాలు చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు గేట్ ఉచిత శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. మెటలర్జీ విభాగాధిపతి శ్రీ కిరణ్ కుమార్, అసోసియేట్ డీన్లు డాక్టర్ మహేశ్, డాక్టర్ విట్టల్, అధ్యాపకులు డాక్టర్ ఆర్.అజయ్, వి.అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఎత్తివేత
జన్నారం: జన్నారం గుండా పగటిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం ఎత్తివేస్తున్నట్లు వైల్డ్లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఏలుసింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎఫ్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్నారం మీదుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు భారీ వాహనాలు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గతంలో మాదిరి భారీ వాహనాలకు రూ.150 పర్యావరణ శిస్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహనాల అనుమతి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రేంజ్ అధికారులు సుష్మారావు, శ్రీధరచారి, దయాకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
రుణం చెల్లించినా జమ కాలే..
మేమంతా సరోజినిదేవి గ్రామ సమాఖ్య పరిధిలోని మహాత్మాగాంధీ గ్రామ స్వయం సహాయక సంఘ సభ్యులం. సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రూ.2లక్షల రుణాలను మూడేళ్లలో పూర్తిగా చెల్లించాం. 2020లో కొత్త రుణం కోసం బ్యాంకుకు వెళ్లగా పాత రుణం పూర్తిగా చెల్లించలేదని అధికారులు తెలిపారు. మేం కట్టిన రశీదులు చూపించగా ఆ డబ్బులు మరో సంఘం ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. దీనిపై ఐకేపీ సీసీ, సీఏలను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా ఆ రుణంపై వడ్డీ పెరుగుతోంది. విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి. – ఎస్హెచ్జీ సభ్యులు, ఖోడద్, తలమడుగు -
వర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే..
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పా టు చేయాల్సిందేనని యూనివర్సిటీ సాధన సమి తి జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సమష్టిగా పోరాడితే విశ్వవి ద్యాలయ ఏర్పాటు సాధ్యపడుతుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అన్ని కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీసభ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో వర్సిటీ సాధన స మితి కోకన్వీనర్ తొగరి భాస్కర్, సభ్యులు శ్రీ కాంత్ రెడ్డి, అఫ్సర్ఖాన్, డాక్టర్ ప్రపుల్వఝే, సతీశ్రెడ్డి, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
మామడ: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1079.80 అడుగుల నీటి మట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.49 టీఎంసీలుగా ఉంది. కాగా సరస్వతీ కాలువ కింద సాగు చేసిన పంటల కోసం 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బాసర గోదావరిలో భక్తుల మొక్కులుబాసర: వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నూతనంగా నీరు ప్రవహిస్తుండడంతో శ్రావణమాసం పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద నీరు భారీగా వస్తోంది. ‘కార్మికుల శ్రమను దోచుకుంటున్న సంఘాలు’మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, టీబీజీకేఎస్ సంఘాలు యాజమాన్యంతో కుమ్మకై ్క సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ఆదాయ పన్ను రద్దు, సొంతింటి కల, ప్రైవేటీకరణ అడ్డుకుని కొత్తగనులు ఏర్పాటు, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి వాగ్దానాలు ఇచ్చి గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు, నాయకులు సీతారామయ్య, జనక్ప్రసాద్లు కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ అవినీతి వాటాలతో తోడుదొంగలుగా మారారని విమర్శించారు. డిమాండ్ల సాధనలో సింగరేణి కార్మికవర్గం, కాంట్రాక్ట్ కార్మికులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
నులిపురుగుల నివారణకు కృషి
ఆదిలాబాద్టౌన్: నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. సోమవారం నులిపురుగుల నివారణ దినో త్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీ బీవీలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1నుంచి 19 ఏళ్లలోపు ఉన్నవారికి ఆల్బెండజోల్ మాత్రలను వైద్యశాఖ ఆధ్వర్యంలో అందించనున్నట్లు తెలిపా రు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, కళాశాలల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారు 2లక్షల 6వేల 127 మంది ఉన్నట్లు తెలిపారు. ఏదైనా కారణాలతో మాత్రలు వేసుకోని వారికి ఈనెల 18న తప్పకుండా వేయించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఇందులో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఐవో వైసీ శ్రీనివాస్, కేజీబీవీ ప్రత్యేక అధికారి దీప్తి, సీఆర్టీలు, విద్యార్థినులు పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు కై లాస్నగర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజ ర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తనచాంబర్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి ఆయా శాఖలు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆ విత్తనాలు మొలకెత్తలే..
ఈ సీజన్లో నాకున్న 4.31 ఎకరాల్లో సోయాబిన్ సాగు చేశా. అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్ ఆదిలాబాద్ వారి నుంచి రూ.1600 నగదు చెల్లించి జేఎస్ 335 రకం ఐదు సంచుల విత్తనాలను కొనుగోలు చేశాను. వాటికి లాట్ నంబర్ లేకుండానే నాకు రశీదు ఇచ్చారు. ప్రభుత్వ విత్తనాలని నమ్మితే అవి మొలకెత్తనేలేదు. స్థానిక ఏఈఓ, తలమడుగు ఏవోలను కలిసి లిఖితపూర్వకంగా సమస్యను వివరించినా వారు పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన నాకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – గోనెల నర్సింలు, రుయ్యాడి, తలమడుగు -
● విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొందరు గురువులు ● జిల్లాలో ఇటీవల వెలుగులోకి పలు ఘటనలు ● పలువురిపై పోక్సో కేసులు ● ఆందోళనలో తల్లిదండ్రులు
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఆదిలాబాద్టౌన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన గురువుల్లో కొంతమంది తప్పడుగులు వేస్తున్నారు. వెకిలి చేష్టలతో కీచకులుగా మారుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి వారి భవితకు బాటలు వేయాల్సిన వారు దారి తప్పుతున్నారు. తండ్రి లాంటి వయస్సులో ఉన్నవారు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన వృత్తికి మచ్చ తెచ్చిపెడుతున్నారు. ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన పలు సంఘటనలే ఇందుకు నిదర్శనం. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంత మంది పిల్లలు తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లబోసుకుంటుండగా, మరికొందరు ఎవరికి చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. కొంత మంది గురువుల ఈ చేష్టలతో మిగతా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యార్థులు షీటీమ్, పోలీసులను సంప్రదించడంతో నిందితులపై పోక్సో కేసులు నమోదై కటకటాల పాలవుతున్నారు. జిల్లాలో ఘటనలు.. ● మావలలోని జెడ్పీఎస్ఎస్లో ఓ ఉపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినులు షీటీమ్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమో దు చేశారు. దీంతో ఆయన జైలు పాలయ్యాడు. ● ఇంద్రవెల్లి మండలంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడిపై విద్యార్థినులు షీటీమ్కు ఫిర్యాదు చేశా రు. ఆతర్వాత స్థానిక పోలీసు స్టేషన్లో కేసు న మోదైంది. ఇటీవల పోక్సోకేసు నమోదుతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ● తాంసి మండల కేంద్రంలోని ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల సదరు ఉపాధ్యాయుడిని విద్యాశాఖాధికారులు సస్పెండ్ చేశారు. ● ఉట్నూర్లో పనిచేసే ఎస్జీటీ ఓ విద్యార్థినిపై ఇటీవల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసు స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ● ఉట్నూర్ మండలం లక్కారం పాఠశాలలో ఓ ఉ పాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవ ర్తించడంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ● మావలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ ప్రిన్సి పాల్ విద్యార్థిని వేధించడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ ఉపాధ్యాయుడికి జైలు శిక్ష సైతం పడింది. ● తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు, వాగాపూర్లో పని చేసే మరో ఉపాధ్యాయుడు గతంలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై సస్పెన్షన్ వేటువేశారు. వేరేపాఠశాలకు బదిలీ చేశారు. ● జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే ఇద్దరు కోచ్లు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై వేటు పడింది. విధుల నుంచి తొలగించారు. ఇటీవల ఓ కోచ్పై వన్టౌన్లో పోక్సో కేసు నమోదైంది. న్యూస్రీల్అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు టీచర్లు పోక్సో కేసుపై అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థినులను బ్యాడ్ టచ్ చేయవద్దు. శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తే పోక్సో కేసు నమోదు చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. – ఎల్.జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ బడిలో కీచకపర్వం.. విద్యార్థులకు చదువు, సంస్కారం నేర్పాల్సిన పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మంచి, చెడు చెప్పాల్సిన వారే సమాజంలో తలదించుకునే పనులు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో వరుసగా విద్యార్థినులపై గురువుల అఘాయిత్యాలు పెరగడంతో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. టీచర్లు ఇలాంటి పనులు చేయడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. -
వాగు దాటి.. వైద్యం అందించి
నార్నూర్: వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులపై వంతెనలు లేని గ్రామాల వాసులు ప్రమాదకరంగా వాగులు దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాగా సోమవారం గాదిగూడ మండలంలోని ఆర్జుని గ్రామ పంచాయతీ పరిధి మారుగూడ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో పెద్దవాగు ఉండగా వైద్య సేవలు అందించేందుకు ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెచ్ఈ రవీందర్ రాథోడ్, ఏఎన్ఎం సులోచన, అరవింద్, గంగాధర్లు ప్రమాదకరంగా వాగు దాటారు. దాదాపు కిలోమీటరు కాలినడకన వెళ్లి వైద్యశిబిరం నిర్వహించారు. వారి వెంట ఉపాధ్యాయులు మెస్రం శేఖర్, జాదవ్ జ్యోతి, శ్యావ్రావు తదితరులు ఉన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య
జైపూర్: అనారోగ్య సమస్యలతో, హాస్టల్లో ఉండలేక ఇంటికి వచ్చిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన దామెరకుంట శ్రావణి –రవి దంపతులకు వైష్ణవి, లక్ష్మీప్రసన్న ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మీప్రసన్న(13) జైపూర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ఆమె కొద్ది రోజులుగా పంటినొప్పి, చెవి నొప్పితో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయించేందుకు నెల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చూపించారు. అనారోగ్య సమస్యలకు తోడు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి ఇనుపరాడ్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ వెల్లడించారు. ‘దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి’ ఉట్నూర్రూరల్: ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో దరఖాస్తులు స్వీకరించారు. బేల మండలం నుంచి హరిత, ఇంద్రవెల్లి మండలం జాలంతండాకు చెందిన కుమ్మర రేణుక, గాదిగూడ మండలంలోని జరీ గ్రామానికి చెందిన కుడిమేత అశ్విని, ఆత్రం భగవంతురావు ఇంద్రవెల్లి మండలం మర్కాగూడకు చెందిన సంగీత తదితరులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు సమర్పించారు. పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ఆదిలాబాద్రూరల్: 20 ఆటోల చోరీల్లో నిందితుడిగా ఉన్న జైనూర్కు చెందిన సయ్యద్ అలీ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆటో చోరీలకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా, అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిలో సయ్యద్ అలీ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. -
యూట్యూబర్ పేరిట మోసం
కౌటాల: యూట్యూబ్ స్టార్ హర్షసాయి అనుచరుడని ఆన్లైన్లో మోసాలకు పాల్పడిన మొహమ్మద్ తౌఫిక్ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు కౌటాల సీఐ సంతోష్కుమార్ తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలు వె ల్లడించారు. హర్యానాలోని మేవార్ జిల్లా లోహికాకాల గ్రామానికి చెందిన మొహమ్మద్ తౌపిక్ ఖాన్ అదే రాష్ట్రానికి చెందిన సహచరులు ముబారక్ ఖాన్, వసీమ్ఖాన్, అహ్మద్ ఖాన్, ఇమ్రాన్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. యూట్యూబర్ హర్షసాయి పేరుతో నకిలీ నంబర్లు, వాట్సాప్ వాడుతూ ప్రజలకు ఆర్థికసాయం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫోన్ పే, ఇతర ఆన్లైన్ మధ్యమాల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. గత మేలో జిల్లాలోని బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సాయిని నమ్మించి రూ. 28వేలు వసూలు చేశారు. అనంతరం అతని ఫోన్ నంబర్ కలవకపోవడంతో మోసపోయానని గుర్తించి సాయి బెజ్జూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు పై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని హర్యానాలో పట్టుకున్నారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందుతుడి వద్ద నుంచి సెల్ఫోన్, సిమ్లు, ఆన్లైన్ లావాదేవిల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన ఎస్సైలు సర్తజ్పాషా, తేజస్విని, కానిస్టేబుల్ వినోద్, సందీప్ను సీఐ అభినందించారు. -
ఇక్కడ కనిపిస్తున్నది బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాల. నాలుగేళ్లుగా వైద్యుడి నియామకం లేక ఆస్పత్రి ఇలా మూతపడి దర్శనిమిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలకు ఆయుర్వేద సేవలు అందకుండా పోయాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగ
ఇచ్చోడ: ఆయుష్ వైద్యం జిల్లా ప్రజలకు అందని దాక్షగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఆయుర్వేద, హోమిమోపతి(ఎన్ఆర్హెచ్ఎం) ఆసుపత్రులు 15 ఉన్నాయి. వీటిలో ఆరు ఆస్పత్రుల్లో మాత్రమే వై ద్యులు ఉండగా తొమ్మిదిచోట్ల వైద్యులు, సిబ్బంది లేక మూతపడ్డాయి. ఏళ్లుగా వైద్యుల పోస్టులు భర్తీ కావడం లేదు. ఓ పక్క అల్లోపతి వైద్యం ఖరీదు కా వడం, తరచూ మాత్రలు వాడే వారు సైడ్ఎఫెక్ట్కు గురవుతుండడంతో పలువురు ఆయుర్వేద, హోమి యోపతి వైద్యం వైపు మళ్లుతున్నారు. ఈ వైద్యంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. అయితే జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఆయుష్ సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయి. ఏళ్ల నుంచి డాక్టర్లు లేరు.. జిల్లా వ్యాప్తంగా ఆయుర్వేద, హోమియోపతి ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సొనాల ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. అలాగే నార్నూర్లో వైద్యుడి పోస్టు ఏడేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక బేల, జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, ఝరి, ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్, తాంసి, నేరడిగొండ మండలకేంద్రాలతో పాటు వాంకిడిలో ఉన్న ఆస్పత్రులకు సైతం వైద్యులు కరువయ్యారు. వైద్యులు, సిబ్బంది కరువు మూతపడుతున్న ఆయుర్వేద ఆస్పత్రులు ఆయుర్వేద, హోమియోపతి సేవలకు బ్రేక్జిల్లాలో.. హోమియోపతి, ఆయుర్వేద ఆస్పత్రులు 15 ప్రస్తుతం సేవలందిస్తున్న వైద్యుల సంఖ్య 6 ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు 9ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యపోస్టుల భర్తీ కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం ఖాళీలు ఉన్న చోట కొంత మందికి ఆదనపు బాధ్యతలు అప్పగించాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – ప్రీతల్ రాథోడ్, డీపీఎం -
అన్నదాతకు ‘సంకటహరణ’
● నానో ఎరువులు ప్రోత్సహించేలా ఇఫ్కో చర్యలు ● ఎరువుల కొనుగోలుతో ఉచిత బీమా ● రైతులందరికీ ప్రయోజనం రైతులకు ప్రయోజనకరం సహకార సంఘాల ద్వారా ఇఫ్కో సంస్థ నానో యూరియా ప్లస్, నానో డీఏపీలను రైతులకు విక్రయిస్తుంది. వీటి ద్వారా రైతులకు ఎన్నో లాభాలున్నాయి. పైగా ఎరువులు కొనుగోలు చేస్తే ఆ సంస్థ ఉచిత ప్రమా ద బీమా అందిస్తోంది. ఇది రైతులందరికీ ప్రయోజనకరం. సద్వినియోగం చేసు కోవాలి. – అంజిత్కుమార్, ఏవో దండేపల్లిదండేపల్లి: అన్నదాతకు ఎవుసం భారంగా మారుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు చేతికి వచ్చిన పంటకు మద్ద తు ధర అందడం లేదు. ఎరువులు, కూలీల ధరలు పెరుగుతున్నంతగా పంటల మద్దతు ధర పెరగడం లేదు. అయినా రైతుకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనే క పథకాలు ప్రవేశపెట్టాయి. బోనస్ చెల్లిస్తున్నాయి. పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమి టెడ్(ఇఫ్కో)తన నానోఫ్లస్యూరియా,నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహించేందుకు రైతులకు ఉచిత బీమా కల్పిస్తోంది. ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ‘సంకటహరణ’ ప్రమాద బీమా పథకాన్ని ఉచి తంగా అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కే వలం ఇఫ్కోఎరువుల కొనుగోలుద్వారా బీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవించినా బీమా వర్తిస్తుంది. ఈ మేరకు ఇఫ్కో ప్రతినిధులు, వ్యవసాయాధికారులు నానో యూరియా ప్లస్, నానో డీఏపీ వాడకంతో పాటు బీమా పథకంపై అవగాహన కల్పిస్తున్నారు బీమా అర్హతలు.. సహకార సంఘాల ద్వారా రైతులు ఇఫ్కో సంస్థ అందించే నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వయో పరిమితి లే కుండా ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. ప్రతీ నానో ఎరువు బాటిల్ కొనుగోలుపై రూ.10 వేల బీమా కవరేజ్ లభిస్తుంది, గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా పరిమితి ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 100శాతం, రెండు అవయవాలు కోల్పోతే 50 శాతం, ఒక అవయవం కోల్పోతే 25 శాతం పరి హారం అందుతుంది. ఎరువులు కొనుగోలు చేసిన నాటి నుంచి 12 నెలలు చెల్లుబాటు అవుతుంది. కొనుగోలు సమయంలో జాగ్రత్తలు.. ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు రశీదుపై కొనుగోలు తేదీ, కొనుగోలుదారుని పేరు, తండ్రి లే దా భర్త పేరు, చిరునామా, కొనుగోలు చేసిన ఇఫ్కో ఎరువుల సంఖ్య, నామినీ పేరు, కొనుగోలుదారుని సంతకం లేదా వేలిముద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రమాదం జరిగిన సందర్భంలో బీ మా పరిహారం పొందడానికి అసలు రశీదు తప్పని సరి. దీంతోపాటు విక్రయాల రిజిస్టర్ జిరాక్స్, పోలీ స్స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, డాక్టర్ చికిత్స నివేదిక, పోస్ట్మార్టం నివేదిక, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈ క్లెయిం పత్రాలు ప్రమా దం జరిగిన తేదీ నుంచి రెండు నెలల్లోగా సికింద్రాబాద్లోని ఇఫ్కో బీమా కంపెనీకి పంపించాలి.ఉమ్మడి జిల్లాలో రైతులు, సాగు విస్తీర్ణం, వినియోగించే ఎరువుల వివరాలు.. జిల్లా రైతుల సంఖ్య సాగు విస్తీర్ణం యూరియా డీఏపీ (ఎకరాల్లో..) (మెట్రిక్ టన్నుల్లో) (మెట్రిక్ టన్నుల్లో) మంచిర్యాల 1.64 లక్షలు 3.31 లక్షలు 43 వేలు 13 వేలు నిర్మల్ 1.90 లక్షలు 4.40 లక్షలు 35 వేలు 10 వేలు ఆసిఫాబాద్ 1.32 లక్షలు 4.45 లక్షలు 60 వేలు 12 వేలు ఆదిలాబాద్ 1.65 లక్షలు 5.85 లక్షలు 35 వేలు 13 వేలు -
● ఆగని రైతుల బలవన్మరణాలు ● పెట్టుబడి పెరిగి.. దిగుబడి తగ్గి ● ఈ ఏడాది ఇప్పటికే 17 ఆత్మహత్యలు ● రోడ్డున పడుతున్న బాధిత కుటుంబాలు
జిల్లాలో ఈ ఏడాది రైతుల ఆత్మహత్యల వివరాలు.. ● జనవరి 4న తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన గడ్డం పోతారెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జనవరి 11న ఇంద్రవెల్లి మండలం పిప్పిరికి చెందిన కినక శంకర్ రుణమాఫీ రెన్యూవల్ కాకపోవడం, సాగుకు తెచ్చిన అప్పులు పెరగడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ● జనవరి 18న సాత్నాల మండలంలోని రేణుగూడకు చెందిన రైతు దేవ్రావు బ్యాంక్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జనవరి 19న ఉట్నూర్లోని సేవదాస్నగర్కు చెందిన రాథోడ్ గోకుల్ కౌలు రైతు పంట దిగుబడి లేక కౌలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ● జనవరి 23న బేల మండలంలోని శంషాబాద్కు చెందిన కోడే గోవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ● జనవరి 25న బజార్హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్కు చెందిన మైల నర్సయ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంది పంటను అడవి పందులు ధ్వంసం చేయడం, అప్పులు పెరగడంతో తనువు చాలించుకున్నాడు. ● ఫిబ్రవరి 18న సాత్నాల మండలంలోని పార్డి(కె)కు చెందిన రైతు బోడ గిరి రాజు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడెకరాల్లో జొన్న సాగు చేయగా నీరందక పంట ఎండిపోయింది. అప్పులు పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● నేరడిగొండ మండలంలోని వడూర్కు చెందిన ఈదాపు పోశెట్టి–ఈదారపు ఇందిర భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్చి 5న భర్త చనిపోగా, 7న భార్య చనిపోయింది. పంటకు తెచ్చిన అప్పులు పెరగడంతో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ● తలమడుగు మండలంలోని సుంకిడికి చెందిన రైతు కుమ్మరి లింగన్న మార్చిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ● మార్చి28న బజార్హత్నూర్ మండలంలోని దేగామకు చెందిన మేకు విఠల్ పత్తి పంట దిగుబడి రాక, రుణమాఫీ కాక, మాడిగేజ్ లోన్, పంట రుణాలు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఏప్రిల్ 12న గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామానికి చెందిన కుమ్ర గోవింద్ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● మే 19న సాత్నాల మండలం సుందగిరికి చెందిన కొక్కుల లస్మన్న పత్తి, సోయా పంటల దిగుబడి రాక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జూన్ 3న ఉట్నూర్ మండలం శంభుగూడకు చెందిన షెడ్మకి పులాజీరామ్ అనే రైతు ప్రైవేట్ అప్పులు, బ్యాంకు రుణాలు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జూన్ 27న తాంసి మండలం జామిడికి చెందిన మునేశ్వర్ అరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జూలై 20న తలమడుగు మండలం కుచులాపూర్కు చెందిన సంతోష్ యాదవ్ రుణమాఫీ కాకపోవడం, పంటదిగుబడి రాకపోవడం, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఆగస్టు 5న బజార్హత్నూర్కు చెందిన రైతు పడిపెల్లి విలాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కారణాలెన్నో.. రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతినడం, ప్రభుత్వాల నుంచి పరిహారం అందకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడం, పంట కోసం తెచ్చిన అప్పులు తీరకపోవడం, మెట్ట ప్రాంతాల్లో నీటి వసతులు లేకపోవడం, మార్కెట్లో దళారులు, వ్యాపారులు మోసం చేయడం వంటివి ఉంటున్నాయి. అలాగే పంటలు పండినా గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రైవేట్ దళారుల నుంచి తీసుకున్న అప్పులకు ఇబ్బందులు పెట్టడం, నకిలీ ఎరువులు, విత్తనాలతో పంటలు పండకపోవడం తదితర కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవో 194 అమలు చేయాలి.. ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు. బతికి సాధించాలి. ప్రభుత్వం జీవో నం.194 అమలు చేయాలి. మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.6లక్షల పరిహారం చెల్లించాలి. మరణించిన రైతు కుటుంబంలో ఒకరికి రూ.5వేల పింఛన్ ఇవ్వాలి. వారి పిల్లలకు ఉచితంగా చదువులు, వైద్యం అందించాలి. డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలి. ప్రభుత్వ చిరు ధాన్యాలను ప్రోత్సహించాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా అవగాహన కల్పించాలి. – బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి●
● తెలియని లింక్లు వినియోగించొద్దు ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. తెలియని వారికి ఓటీపీ చెప్పవద్దని, అలాగే తెలియని లింక్లు, అప్లికేషన్లు సెల్ఫోన్లలో వినియోగించవద్దన్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ బారినపడ్డ వారు వెంటనే 1930కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఈ వారంలో 21 సైబర్ ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. బాధితులు గంటలోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజినెస్ ఆఫర్లు, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో యువత మోసపోతున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆన్లైన్ వర్క్, వర్క్ఫ్రం హోం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కష్టపడి చదివి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించాలని, వ్యాపారం, వ్యవసాయం నిర్వహిస్తూ ఎదగాలని సూచించారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి రూ.15లక్షలు మోసపోయాడని, భీంపూర్కు చెందిన మరో వ్యక్తి రూ.15వేలు, టూటౌన్ పరిధిలో ఒకరు రూ.62వేలు, బోథ్కు చెందిన యువకుడు రూ.26,750.. ఇలా అనేక మంది నష్టపోయారని తెలిపారు. ఆదివాసీల సమస్యలపై నిరంతర పోరాటం●● రాజ్గోండ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ సమస్యలపై రా జ్గోండ్ సేవాసమితి నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ అ న్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడా రు. ఆదివాసీ జాతికి రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమన్నారు. ఇప్పటికీ ఆదివాసీలపై అటవీ అఽ దికారుల దాడులు కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు ఆపకపోతే జా తీయస్థాయిలో వారిపై కేసులు పెట్టిస్తామన్నా రు. అలాగే దేశ వ్యాప్తంగా ఆదివాసీలు ఏకమై హక్కులపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సిడాం అర్జు, సెడ్మాకి ఆనంద్రావ్, తదితరులు ఉన్నారు. ఆకట్టుకుంటున్న ‘దూరబంతి’భీంపూర్: మండలంలోని గుబిడి గ్రామానికి వె ళ్లే అటవీ ప్రాంతంలో దూర బంతులు అటుగా వెళ్లేవారిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురి సిన వర్షాలకు ఈ ప్రాంతమంతా పచ్చదనంతో పాటు పూలతో కనువిందు చేస్తున్నాయి. -
యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో యూనివర్సిటీ ఏ ర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ తెలిపినట్లు యూనివర్సిటీ సాధన సమితి కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. జిల్లాలో యూనివర్సిటీ ఆవశ్యకతను ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వర్సిటీ సాధన పోరాటానికి మద్దతు తెలిపి పార్లమెంట్లో గళం వినిపించాలని కోరి నట్లు తెలిపారు. ఈ మేరకు ఎంపీ సానుకూలంగా స్పందించారని, పూర్తి మద్దతు ఉంటుందని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. -
టీచర్లకు టీఎల్ఎం మేళా
● ఈనెల 18లోపు మండల, 20లోపు జిల్లాస్థాయిల్లో ఏర్పాటు ● ఉత్తర్వులు జారీ చేసిన ‘సమగ్ర శిక్ష’ ఆదిలాబాద్టౌన్: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో టీచర్లు ఏవిధంగా పాఠాలు బోధిస్తున్నారో అనే అంశాలపై అభ్యసన సామగ్రి (టీచింగ్ లర్నింగ్ మెటీరియల్) మేళా నిర్వహించేందుకు వి ద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇది విద్యార్థులు నేర్చుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనా సామగ్రిని ప్రదర్శించే కార్యక్రమం. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేయగల బోధనా ఉపకరణాలను ప్రదర్శిస్తారు. ఈ మేళాలో ఉపాధ్యాయులు తమ సృజనాత్మకత, నైపుణ్యాలను చాటుతారు. అలాగే ఉపాధ్యాయులు కొత్త ఆలోచనలు నేర్చుకోవడానికి, పంచుకోవడాని కి అవకాశం ఉంటుంది. ఆదివారం తెలంగాణ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు టీఎల్ఎం మేళాలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులకు బోధించే టీఎల్ఎంను మేళాలో ప్రదర్శించాలి. ఈనెల 18లోగా మండల స్థాయిలో 20లోగా జిల్లాస్థాయిలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ మండలం నుంచి 10 ఉత్తమ ప్ర దర్శనలు జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వాటిని రాష్ట్రస్థాయికి పంపించనున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి ఈ టీఎల్ఎం మేళాను విద్యా శాఖ నిర్వహిస్తుంది. జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఈ మేళాతో సర్కారు బడుల్లో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు దోహద పడనుంది. కాగా సోమవారం ఈ టీఎల్ఎం మేళా నిర్వహణకు సంబంధించి జూమ్ మీటింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ఖర్చుతో బోధన సామగ్రి ఉపాధ్యాయులు తక్కువ ఖర్చుతో తయారు చేసిన బోధన సామగ్రితో మేళాలో ప్రదర్శనలు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థులు తయారు చేసిన నమూనాలు చార్ట్లు, గేమ్స్, పటా లు, వివిధ అంశాలకు సంబంధించి మేళాలో ప్రదర్శించాలి. భాషా, అక్షరమాల, పదాల ద్వారా ఏర్ప డే చిత్రాలు, గణితం, కొలతలు, పర్యావరణం, జంతువులు, పక్షులు, సైన్స్కు సంబంధించిన అంశాల ను ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ మేళాతో ఆ యా పాఠశాలల ఉపాధ్యాయులు ఏవిధంగా విద్యాబోధన చేస్తున్నారనే అంశాలు తెలియనున్నాయి. కొత్త అంశాలను ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల్లో అమలు చేసే అవకాశం ఉంది. అయితే జిల్లా స్థాయిలో నిర్వహించే మేళా కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మేళా నిర్వహణ, భోజనం ఖర్చులను సమకూర్చనుంది. -
బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు పోరాటం
ఆదిలాబాద్టౌన్: బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజ ర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందంటూ చే తులు దులుపుకోవడం సరికాదన్నారు. అధికా రంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు బిల్లుకు చట్టబ ద్ధత తెస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలో అన్ని బీసీ సంఘాలతో కాంగ్రెస్ ఇచ్చి న మోసపూరిత హామీలపై నిలదీస్తామని పే ర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు గోవర్ధన్, మనోహర్, మెట్టు ప్రహ్లాద్, జగదీష్, రాజన్న, స్వామి,లక్ష్మణ్, విఠల్, అశోక్,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించాలి
● టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ కైలాస్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆది వాసీల కు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేస్తూ ఏజెన్సీలో గిరిజన యువతకు ఉపాధి అవకా శాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని టీఏజీఎస్, టీఏవీఎస్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను వనవాసీలుగా చిత్రీ కరించేందుకు చూస్తుందన్నారు. ఆదివాసీలు వనవాసీలు కాదని, ఈ దేశ మూలవాసులు అనే విషయాన్ని గ్రహించాలన్నారు. అలాగే ఆదివాసీ లను అడవికి దూరం చేసే విధానాలు మానుకోవాలన్నా రు.ఏజెన్సీలో జీవో3ను పునరుద్ధరించాలని, 1/70, పిసా, చట్టాలను పక్కాగా అమలు చేయాలని డి మాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.కార్యక్రమంలో జన విజ్ఞాన వేది క రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ రెడ్డి, వ్యవసా య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, టీఏవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం తనుష్, నాయకులు ఉయిక విష్ణు, మడవి నాగోరా వ్, కొట్నాక్ పుష్పలత, కొట్నాక్ సక్కు, కుమ్ర భీంరావు, నర్మద, మానిక్రావు పాల్గొన్నారు. -
● యూనివర్సిటీ సాధనకు అన్ని విధాలా ప్రయత్నిస్తాం ● జిల్లాలో ఉన్నత విద్యావకాశాల కల్పనకు కృషి చేస్తాం ● జిల్లావాసులకు భరోసానిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
జిల్లాలో విశ్వవిద్యాలయ సాధన కోసం ఈ ప్రాంతవాసులు గొంతెత్తి నినదిస్తున్నారు. ‘సాక్షి’ డిబెట్తో ఏర్పడిన యూనివర్సిటీ సాధన సమితి ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణతో ముందడుగు వేసింది. ఉద్యమబాట పట్టింది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఇప్పటి వరకు జరిగిన నష్టంపై విద్యార్థులు, నిరుద్యోగులకు అవగా హన కల్పిస్తోంది. వర్సిటీ ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతోంది. విద్యావంతులు, మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతుండగా.. ప్రజాప్రతినిధులు సైతం అండగా ఉంటామంటున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో తాము భాగస్వాములమవుతామని పేర్కొంటున్నారు. వర్సిటీ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. – కై లాస్నగర్/బజార్హత్నూర్ -
కుమురంభీం స్ఫూర్తితో పని చేయాలి
ఆదిలాబాద్రూరల్: జల్, జంగల్, జమీన్ కోసం పో రాటం చేసిన కుమురంభీంను స్ఫూర్తిగా తీసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీలు పని చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను హీరా సుకా ఆది వాసీ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హీరా సుకా దేవస్థానం వద్ద శనివారం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నా రు. కుమురంభీం, రాంజీగోండ్, బీర్సాముండా వి గ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఆదివాసీలతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆదివాసీ మహిళలు కలెక్టర్, ఎస్పీలకు రాఖీలు కట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు సి డాం రాంకిషన్, నాయకులు కుర్సేంగే తానాజీ, షె డ్మకి గోద్రు, గోడం లక్ష్మణ్, మెస్రం శంకర్, కుర్సేంగే యాదవ్రావ్, సుభాష్, మనోహర్, ప్రకాశ్, వనితబాయి, గీత, అనుసూయ, సంగీత పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
ఆదివాసీ మహిళకు ప్రశంస
బోథ్: మండలంలోని బాబెర గ్రామానికి చెంది న స్వచ్ఛగృహి అవార్డుగ్రహీత ఆదివాసీ మ హి ళ ఆత్రం సుశీల ఉత్తమ ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో అవార్డులు పొందిన వా రిని సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా నుంచి సుశీలకు ఆహ్వానం అందింది. శనివారం భోపాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గతంలో ఈమె గవర్నర్ చేతుల మీదుగా స్వచ్ఛగృహి అవార్డు అందుకున్నారు. -
‘సంక్షేమ’ తిప్పలు!
● ప్రభుత్వ పథకాల కోసం పాత మండలాలకే.. ● కొత్త మండలాల్లో అందుబాటులోకి రాని సేవలు ● జిల్లాలోని 46 గ్రామాల ప్రజలకు అవస్థలు కై లాస్నగర్: తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం ద్వారా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి రూ.500కే సిలిండర్, 200 యూని ట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ అందిస్తోంది. ఈ పథకాలకు అర్హులైనప్పటికీ రేషన్కార్డులు లేకపోవడంతో జిల్లాలో చాలామంది పేదలు ఇన్ని రోజులు సంక్షేమ లబ్ధికి దూరమయ్యారు. ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డులు జారీ చేయడంతో వీరికి అవకాశం లభించింది. దీంతో కార్డులు పొందిన వారు తమ మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను ఆశ్రయించి వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. అయితే కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో మాత్రం ఈ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎంపీడీవో కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ ఆయా పథకాల లబ్ధి కోసం పాత మండలానికే పయనమవ్వాల్సిన పరిస్థితి. దీంతో పేదలకు వ్యయ, ప్రయాసలు తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మూడు మండలాల్లో ఇదే పరిస్థితి.. జిల్లాలో ఇటీవల సాత్నాల, భోరజ్, సొనాల మండలాలు కొత్తగా ఏర్పడిన విషయం విదితమే. సొనాల మండలంలో 12 గ్రామాలు ఉండగా, సాత్నాలలో 17, భోరజ్లో 17 గ్రామాలు కలిపి మూడు మండలాల పరిధిలో 46 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ప్రభుత్వ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా గ్రామాల్లోని కొత్తగా రేషన్ కార్డులు కలిగిన అర్హులైన వారంతా తిరిగి తమ పాత మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. సాత్నాల మండల వాసులు ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్కు వెళ్లాల్సి రాగా.. భోరజ్ మండల వాసులు జైనథ్కు, సొనాల మండలవాసులు బోథ్ మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. అయితే కొత్త మండలాల్లో ఎంపీడీవోలు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నప్పటికీ ప్రజాపాలన కేంద్రాల నిర్వహణకు అవసరమైన లాగిన్లను ప్రభుత్వం ఇంకా కేటాయించలేదు. దీంతో అక్కడ దరఖాస్తులను స్వీకరించే అవకాశం లేకుండా పోయింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే ... ప్రభుత్వం గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే రాయితీ పథకాలను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. కొత్తగా రేషన్కార్డులు పొందిన వారు ప్రజాపాలన రశీదుతో పాటు ఉచిత విద్యుత్ కోసమైతే విద్యుత్ బిల్లు, కుటుంబీకుల ఆధార్ జిరాక్స్ ప్రతులను అందజేయాల్సి ఉంటుంది. అలాగే రూ.500 సిలిండర్ పథకం కోసమైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీ నమోదు చేసుకుని ఉండాలి. వీటి కోసం ప్రస్తుతం ఆయా మండలాల వాసులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వానికి పంపించాం కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లాగిన్లు కేటాయించినప్పటికీ ప్రజాపాలన కేంద్రాల లాగిన్లను ఇంకా ఇవ్వలేదు. వాటి కోసం ప్రభుత్వానికి సీజీజీ ద్వారా ప్రతిపాదనలు పంపించాం. వాటిని కేటాయించేలా ఫాలోఅప్ చేస్తున్నాం. త్వరలోనే ఆయా మండలాలకు లాగిన్లు కేటాయించే అవకాశముంది. అప్పటి వరకు అర్హులైన వారికి పాత మండలాల్లోనే ఆయా సేవలను అందిస్తున్నాం. – జి.జితేందర్ రెడ్డి, జెడ్పీసీఈవో -
రాఖీ కట్టి.. శుభాకాంక్షలు చెప్పి
ఎమ్మెల్యే శంకర్కు రాఖీ కడుతూ..తమ్ముడికి రాఖీ కడుతున్న అక్క ఎంపీ గొడం నగేశ్కు రాఖీ కడుతున్న సోదరీమణి..సోదర, సోదరీమణుల మధ్య ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ వేడుకలను జిల్లా వాసులు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటామని సోదరులు అభయమిచ్చారు. ఎంపీ గోడం నగేశ్కు స్వగ్రామమైన జాతర్లలోని నివాసంలో ఆయన సోదరీమణులు కృష్ణకళ, కమలబాయిలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఆయన సోదరీమణులు రాఖీలు కట్టారు. నేరడిగొండలో ఎమ్మెల్యే అనిల్జాదవ్ నివాసంలో ఆయన సోదరీమణులు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. – ఆదిలాబాద్/బజార్హత్నూర్ -
జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఏ చిన్న పనికైనా 300 కిలోమీటర్ల దూరంలో గల వరంగల్కు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులకు సమయం వృథాతో పాటు దూరభారం అవుతుంది. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే అధిక సంఖ్యలో గిరి జనులు, గిరిజనేతర విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తాను. అలాగే జిల్లాలో నవోదయ ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేస్తున్నాను. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
సీఎం దృష్టికి తీసుకెళ్లాను..
యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ జిల్లావాసుల్లో సుదీర్ఘకాలం నుంచి వ్యక్తమవుతుంది. అది న్యాయబద్దమైంది కూడా. ఇదే అంశాన్ని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. జిల్లాలో విశ్వవిద్యాలయ ఆవశ్యకతను సీఎంకు వివరించాను. ప్రజల డిమాండ్, జిల్లా అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే. ఇందుకోసం నా వంతుగా అన్నివిధాలా కృషి చేస్తా. జిల్లాకు న్యాయం జరిగేలా చూస్తాను. – వెడ్మ బొజ్జుపటేల్, ఎమ్మెల్యే, ఖానాపూర్ -
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
సారంగపూర్: మహారాష్ట్రలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు స్వర్ణ ప్రాజెక్ట్లోకి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు మూడో గేటు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు (1.484 టీఎంసీలు) కాగా, ఉదయం 6గంటల వరకు ఏకంగా 80వేల క్యూసెక్కులు రావడంతో 1,182.5 అడుగులకు చేరింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ మూడో గేటు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని వదిలారు. ప్రస్తుతం 1,182.5 అడుగుల వద్ద నీటిమట్టం స్థిరంగా ఉంచామని ఏఈ మధుపాల్ తెలిపారు. -
గోండి, కొలామి భాష పరిరక్షణలో..
ఆదిలాబాద్ రూరల్: మావల మండలం వా ఘాపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కై లాస్ గోండి, కొలామి భాషల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నారు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబా డా భాషల్లో వందలాది పాటలు రాసి ఏఐ లో పొందుపర్చారు. మహాభారత గ్రంథాన్ని తెలుగు లిపితో గోండి భాషలో అనువదించారు. 18 పర్వాలు నాలుగు నెలలపాటు అనువదించి వంద పుస్తకాలు ప్రచురితం చేశారు. మన్కీబాత్లో పీఎం మోదీ కై లాస్ను ప్రశంసించారు. అప్పటి కలెక్టర్లు దివ్యదేవరాజన్, దేవసేన, ప్రస్తుత కలెక్టర్ రాజర్షిషా కై లాస్ను అభినందించారు. -
పోడు కోసం పోరు
తాండూర్: దశాబ్దాలుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న తమకు వాటిపై హక్కులు కల్పించాలని రైతులు పోరుబాట పట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన సుమారు 40మంది రైతులు మూడురోజుల క్రితం చేపట్టిన పాదయాత్ర గురువారం రాత్రి తాండూర్కు చేరుకుంది. మండలంలోని రేపల్లెవాడ సమీపంలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సేద తీరిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున రైతులు తమ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గ్రామ శివారులోని సుమారు 1,200 ఎకరాలను సాగు చేసుకుంటూ 600 కుటుంబాలవాళ్లం జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అటవీశాఖ అధికారులు వాటిని సాగు చేసుకోకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసి భూ హక్కు పత్రాలు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి, అటవీశాఖ మంత్రి, అధికారులకు తమ గోడు చెప్పుకొంటామని వారు పేర్కొన్నారు. -
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఒకరి మృతి
భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారి మాటేగాం సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ద్విచక్రవాహనంతో ఢీకొని యశ్వంత్ (21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పేండ్పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్, కుంసర గ్రామానికి చెందిన విలాస్ శుక్రవారం భైంసాకు వచ్చారు. పనులు ముగించుకుని భైంసా నుంచి ద్విచక్రవాహనంపై పేండ్పెల్లికి వెళ్తున్నారు. మాటేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై ట్రాక్టర్ ట్రాలీ ఫంక్షర్ కావడంతో అక్కడే నిలిపి ఉంచారు. రోడ్డుపై ఉన్న ట్రాలీని వీరు ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా పేండ్పెల్లికి చెందిన యశ్వంత్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కుభీర్: మండలంలోని పార్డి (బీ) గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగశివుని తండాకు చెందిన పవార్ సచిన్ అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ తన బైక్పై సాయంత్రం కుభీర్ సంతకు వస్తుండగా పార్డి(బీ) సమీపంలో పంది తగిలి క్రిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని భైంసాకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా మృతి చెందాడు. అతడి భార్య సిమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, తల్లితండ్రులు ఉన్నారు. గడ్డి మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య భైంసారూరల్: మండలంలోని బడ్గాం గ్రామానికి చెందిన షానే మరీబా (84) అనే వృద్ధుడు గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. షానే మరీబా భార్య ఏడాది క్రితం మృతి చెందింది. అప్పటినుంచి కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఒంటరి తనం భరించలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే భైంసా ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు పరమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో మహిళ.. కాసిపేట: మండలంలోని దేవాపూర్ ప్రసన్నాంజనేయనగర్కు చెందిన గంగాధరి వాణి(44) అనే మహిళ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం దేవాపూర్కు చెందిన శంకర్తో వాణి వివాహం జరిగింది. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వాణి టైలరింగ్ పని చేస్తూ ఇంటి భారాన్ని మోసింది. తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడం, అప్పులు ఉండడంతో మనోవేదనకు గురై ఈనెల 6న మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గమనించిన భర్త వెంటనే గ్రామంలోని కంపెనీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరిస్థితి విషమించగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందింది. మృతురాలికి 11 ఏళ్ల కొడుకు విజ్ఞతేజ్ ఉన్నాడు. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బాలికల గురుకులంలో చొరబడిన నలుగురి అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లిలోని ప్రభు త్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకు ల విద్యాలయంలో బుధవారం అర్థరాత్రి అక్రమంగా చొరబడి విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేసిన నలుగురిని శుక్రవారం తాళ్లగురిజాల పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లగురిజాల ఎస్సై రా మకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బె ల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రా మానికి చెందిన దుగుట సంజయ్, కో నూరి కిరణ్, కన్నెపల్లి మండలం చర్లపల్లి, ఎల్లారం గ్రామాలకు చెందిన గొల్లపల్లి కిరణ్, కొజ్జన కిరణ్ మద్యం మత్తులో బాలికల గురుకుల విద్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు. కేకలు వేస్తూ, బూతులు తిడుతూ విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కోనూరి కిరణ్ పట్టుబడగా ముగ్గురు పారిపోయారు. అక్రమంగా విద్యాలయంలో చొరబడిన ఘటనపై విద్యాలయ ప్రిన్సిపాల్ నిరుపమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో యువత ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరిగి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రాత్రి వేళ గస్తీ, భద్రతను ముమ్మరం చేసినట్లు తెలిపారు. -
అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు
● సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ● యాస.. భాష పరిరక్షణకు చర్యలు ● భావితరాలకు అందించే యత్నం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంఇంద్రవెల్లి/ఉట్నూర్రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొండ, కోనల నడుమ ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రకృతిని దైవంగా భావించి జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార, వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు. ఏ పని చేసినా, ఈ కార్యం తలపెట్టినా ముందుగా ప్రకృతి దేవతలకు పూజలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వనదేవతలకు పూజలు చేశాకే సాగు పనులు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలాం, తోటి, నాయక్పోడ్, గోండు, పర్ధాన్, అంధ్, లంబాడీ తెగలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులు ప్రతీ పండుగ, కుల దేవతల పూజలు, పెళ్లి వేడుకలు ఇలా ఏవైనా వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వైభవంగా నిర్వహిస్తారు. ఆదివాసీ తెగలు.. పండుగలుగోండు, కొలాం, పర్ధాన్, తోటి ఆదివాసీ తెగలవారు కుల దేవతలతోపాటు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. ఏ పూజ చేసినా.. తరతరాలుగా గ్రామస్తులంతా సామూహికంగా చేసే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభంలో అకాడి (వన దేవత) పూజలతో మొదలుకుని నాలుగు నెలలపాటు యేత్మసుర్ దేవతలను ఆరాధిస్తారు. శ్రావణ మాసానికి ముందు గావ్ సాత్ పేరుతో పోచమ్మ తల్లికి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో నెలపాటు గ్రామ దేవతలు శివ బోడి, నొవోంగ్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా యేత్మసుర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ వేషధారణలతో వారంపాటు సంప్రదాయ వాయిద్యాల మధ్య డండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. వైశాఖ, పుష్య మాసాల్లో సంవత్సరానికి రెండుసార్లు కులదేవతలైన జంగుబాయి, పెర్సాపేన్, భీందేవుడి పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. పుష్యమాసంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, రాష్ట్రంలో రెండో పండుగైన నాగోబా మహాపూజ, నాగోబా జాతరను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహిస్తారు. అంద్ సమాజ్ ఆదివాసీలు తమ కులగురువు శ్రీశ్రీ సంత్ సద్గురు పులాజీబాబాను ఆరాధిస్తారు. వారివారి గ్రామాల్లో నిర్మించిన ధ్యాన్ మందిరాల్లో ప్రతీ సంవత్సరం వార్షికోత్సవ పూజలు చేస్తారు. నాగుల పంచమి మరుసటిరోజు శీరల్ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అంధ్ ఆదివాసీ సమాజ్ వారి వివాహాలు పులాజీబాబా ధ్యాన్ మందిరాల్లో సామూహికంగా జరిపిస్తారు. నాయక్పోడ్ ఆదివాసీ భీమన్న దేవుడిని ఆరాధ్యదైవంగా కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లంబాడా గిరిజనులు కులగురువు సంత్ సేవలాల్ మహరాజ్ను ఆరాధించడంతో పాటు ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి తరువాత వారంపాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. ప్రతిరోజూ గ్రామాల్లోని ఆలయాల్లో సేవాలాల్, జగదాంబదేవిని ఆరాధిస్తారు. యాస.. భాషకు డిజిటల్ రూపం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు మాట్లాడే యాస.. భాష.. సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపర్చడానికి బోలి చేతో (భాష–చైతన్యం) ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చెరిగిపోకుండా భావితరాలకు అందించడానికి గోండి, కొలామీ భాషలో వికీపీడియా, విక్షనరీలను అంతర్జాలంలో భద్రపర్చి భావితరాలకు భాష, సాహిత్య సంపదను అందించడానికి కార్యశాల నిర్వహిస్తూ ఆదివాసీ యువకులను ప్రోత్సహిస్తోంది. – ఆత్రం మోతీరాం, బోలిచేతో ఫౌండేషన్ బోర్డు సభ్యుడువాయిద్యాలు.. ప్రత్యేకతలుగోండులు పెర్స్పెన్ పండుగలో దండారీ డప్పు ల దరువులతో తుడుం వాయిద్యాన్ని నిర్వహిస్తుంటారు. కొలాంలు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో మోగిస్తుండగా, గోండులు జంగుబాయి, పెర్స్పెన్, దండారీ ఉత్సవాల్లో తుడుంను డోలుకు సహ వాయిద్యంగా మోగిస్తుంటారు. అలాగే డెంసా నృత్యాలు చేస్తుంటారు. ఆదివాసీ లకు ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వంగా వస్తున్నాయి. తుడుంను పురుషవాద్యంగా భావిస్తారు. ఈ సంగీత వాద్యాన్ని పూజా కార్యక్రమంలో ఉంచి పూజిస్తారు. ఆదివాసీల చైతన్యానికి ‘తుడుం’ ఒక సంకేతంగా నిలిచింది. ఆదివాసీ ఉద్యమాల్లో ర్యాలీ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాల్లో ‘తుడుం’ మోగిస్తుంటారు. గోండి పూజారులైన ప్రధాన్లు, తోటి తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువులు, కర్మకాంఢలు, వివాహాలు, చావుల సందర్భంలో దీనిని వాయిస్తారు. గోండి సంప్రదాయాలు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు ‘పెప్రే’ అనే రెండు సన్నాయి వాయిద్యాలు, డక్కి అనే చర్మవాయిద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు. డోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద గేయాలు, నృత్యాలు ఉంటాయి. హోలీ, వివాహ వేడుకలకు డోలు నృత్యాలతో కళాకారులు అలరిస్తుంటారు. ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల సందర్భంగా దీనిని వాయిస్తారు. డోలును వివాహ వేడుకల సందర్భంగా రాత్రి వేళ నృత్యాలు చేయడానికి వినియోగిస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఒక గ్రామంతో మరో గ్రామం మధ్య పాటల పోటీలు జరుగుతుంటాయి. డోలు వాయిస్తూ పురుషులు సీ్త్ర వేషధారణలో, ఒకరు జోకర్గా నృత్యాలు చేస్తుంటారు. -
ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి
ఆదిలాబాద్టౌన్: ఈ నెల 11న జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయం నుంచి మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నులిపురుగులతో విద్యార్థుల్లో ఎదుగుదల లోపిస్తుందని, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్, జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నులిపురుగుల నిర్మూలనే ధ్యేయం నులిపురుగుల నిర్మూలనే ధ్యేయమని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పుత్లీబౌళి పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యసిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ఈ నెల 11న జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం దుర్వినియోగం కానివ్వొద్దు
కైలాస్నగర్: పేదలు పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.కోట్ల రాయితీ భరించి పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మావల, ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ మండలాల లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులు పంపిణీ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవె న్యూ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, డీసీఎస్వో వాజీద్అలీతో కలిసి లబ్ధిదా రులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలోని అ ట్టడుగువర్గాలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అర్హులకే లబ్ధి చేకూర్చాలని సూచించారు. డబ్బులు డిమాండ్ చేసే దళా రులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని అధి కారులను ఆదేశించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే పోషకాలతో కూడిన సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. సన్నబియ్యం విక్రయించే లబ్ధిదారుల రేషన్కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ ని రంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్లు శ్రీనివా స్, గోవింద్, వేణుగోపాల్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ బాబుసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ సంస్కృతిని చాటిన యోగా
ఆదిలాబాద్రూరల్: యోగా భారతదేశ సంస్కృతి, కీర్తిని ప్రపంచమంతా గొప్పగా చాటిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. మా వల మండలంలోని రత్న గార్డెన్లో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి యోగాసన ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాల ని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్రెడ్డి, తిరుపతి, లాలాము న్నా, చిట్యాల సుహాసినీరెడ్డి, దయాకర్, వివిధ జిల్లాల యోగా టీచర్లు పాల్గొన్నారు. -
వర్షాభావమే..
సాక్షి, ఆదిలాబాద్: వరుణుడు ముఖం చాటేశాడు. ఈ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యి. అసలుకే వర్షాలు లేక ఎదుగుతున్న, పూత, కాత కాస్తున్న పంటలను చూసి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతి ఉన్నవారు ఏదో రకంగా పంటలకు తడులు అందిస్తున్నారు. నీటి వసతిలేని రైతులు బిక్కచూపులు చూస్తున్నారు. సరైన సమయంలో పంటలకు నీటి తడులు అందక దిగుబడులపై దిగులు చెందుతున్నారు. లోటు దిశగా.. జిల్లాలో ఈ వానాకాలం సరైన వర్షాలు కురవలేదు. జూన్ రెండో వారంలోనే మంచి వర్షాలు కురిశాయి. మిగతా మూడు వారాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జూలై మొదటి, రెండో వారంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. అయితే మూ డు, నాలుగో వారాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులోనైతే ఇప్పటికీ తీవ్ర వర్షాభావమే కనిపిస్తోంది. మొత్తంగా ఈ వానాకాలం మొదలైన జూన్ నుంచి ఇప్పటివరకు 36 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. ఇందులో భారీ వర్షాలు అసలే లేవు. దీంతో ఇప్పటికీ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. మండలాల వారీగా పరిస్థితి జిల్లాలో 13 మండలాల్లో సాధారణ వర్షపాతం న మోదు కాగా, ఎనిమిది మండలాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. భీంపూర్, జైనథ్, బేల, నా ర్నూర్, భోరజ్, తాంసి, తలమడుగు, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఆదిలాబాద్రూర ల్, ఆదిలాబాద్అర్బన్, సాత్నాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. సొనాల, నేరడిగొండ, బోథ్, గాదిగూడ, ఉట్నూర్, మావల, సిరికొండ, ఇంద్రవెల్లిలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ముఖం చాటేసిన వర్షాలు పూత, కాత దశలో సోయా పంట స్ప్రింక్లర్లతో నీటిని అందిస్తున్న వైనం ఆందోళనలో నీటి వసతిలేని రైతులు జిల్లాలో వర్షపాతం వివరాలు (జూన్ 1నుంచి ఆగస్టు 7 వరకు) సాధారణం 618.1 మి.మీ.లు కురిసింది 499.7 మి.మీ.లు వ్యత్యాసం 19 శాతం తక్కువ ఈ రైతు పేరు సోమ ప్రవీణ్రెడ్డి. తాంసి శివారులో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తొమ్మిదెకరాల్లో పత్తి, అంతర పంటగా కంది, మూడెకరాల్లో సోయాబీన్ సాగు చేశాడు. పత్తి పంట ఎదిగే దశలో ఉండగా సోయా పూత, కాత దశకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో సోయా పంటకు నీటి తడులు అందించాల్సి ఉండగా వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో బోర్ల ద్వారా స్ప్రింక్లర్లకు పనిచెప్పాడు. ఈ విధానంలో మూడెకరాల్లోని సోయా పంటకు నీటిని అందిస్తున్నాడు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● కలెక్టర్ రాజర్షి షా ● కొత్త రేషన్కార్డుల పంపిణీ తలమడుగు: అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫ లాలు అందించనున్నట్లు కలెక్టర్ రాజార్షి షా పేర్కొన్నారు. గురువారం మండలంలోని సుంకిడి గ్రామ రైతువేదికలో తాంసి, తలమడుగు మండలాల లబ్ధి దారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. అ నంతరం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సుంకిడి జిల్లా పరిషత్ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ ఆత్మ చైర్మన్ అశోక్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి జరుగుతోందని చెబుతుండగా బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ అంశంపై ఎమ్మెల్యే, డీసీసీబీ చై ర్మన్ ఆడ్డి బోజారెడ్డి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే అనిల్జాదవ్ జోక్యం చేసుకుని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సము దాయించగా గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తాంసి, తలమడుగు తహసీల్దా ర్లు లక్ష్మి, రాజ్మోహన్, ఎంపీడీవో శంకర్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్రెడ్డి, కిరణ్కుమార్, కేదారేశ్వర్రెడ్డి, ప్రకాశ్, వామన్ తదితరులు పాల్గొన్నారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి ఆదిలాబాద్టౌన్: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ప్ర భుత్వ డైట్ కళాశాలలో గురువారం ఉల్లాస్ నవభా రత్ సాక్షరత జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలవారు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి నిరక్షరాస్యుల వివరాలు సేకరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఆర్పీలు వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని తెలిపా రు. జిల్లాలో 1,192 మంది వలంటీర్లు చదువు చె ప్పేందుకు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పే ర్కొన్నారు. వీరు 26,312 మందికి చదువు నేర్పించాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శా తం 66 ఉందని, వంద శాతానికి చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసు ఎత్తి వేయాలి
తాంసి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గీతేశ్పై పోక్సో కేసు ఎత్తి వేయాలని పాఠశాల విద్యార్థులు గురువారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గీతేశ్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు మంగళవారం అతడిపై పోక్సో కేసు నమోదు చేసిన తాంసి పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యార్థులు ‘మా తెలుగు సార్ మాకే కావాలి’ అంటూ నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుడు గీతేశ్ ఎలాంటి తప్పు చేయలేదని, వెంటనే కేసు ఎత్తి వేయాలని కోరారు. -
హాజరుశాతం పెంచాలి
తాంసి: విద్యార్థుల హాజరుశాతం పెంచాలని డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వ కళా శాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆవరణ, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రవేశాల సంఖ్య తెలుసుకున్నారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై మాట్లాడారు. సిలబస్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్ర తీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలి పారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చే యాలని ఆదేశించారు. డీఐఈవో వెంట ప్రిన్సి పాల్ సుదర్శన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సంతోష్, అధ్యాపకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రమణ, దేవేందర్, సిబ్బంది ఉన్నారు. -
‘రాఖీ’ సందడి
ఆదిలాబాద్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ సందడి జిల్లాలో మొదలైంది. ఈ నెల 9వ రాఖీ పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతం కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతోంది. దస్నాపూర్, కలెక్టరేట్ చౌక్, వినాయక చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, రైతు బజార్ ఏరియా, రద్దీగా ఉండే వి విధ ప్రాంతాల్లోనూ రాఖీ దుకాణాలు వెలిశాయి. వి విధ డిజైన్లలో రూ.10 నుంచి రూ.500 ధర కలిగిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ దూది బొండాలతో పాటు లాకెట్, రుద్రాక్ష, ము త్యాలు, రంగుల రాళ్లు, జరీ రాఖీలు ఎక్కువగా అ మ్ముడుపోతున్నాయి. చిన్నారులు మెచ్చేలా కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా ని లుస్తున్నాయి. కాగా, పలువురు వెండి, బంగారు రాఖీల కోసం స్వర్ణకారులకు ఆర్డర్లు ఇస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాల వి ద్యార్థులు జనగాం వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జావెలిన్త్రో పోటీల్లో సత్తా చాటారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబరిచిన వీ దీక్షిత బంగారు, ఎం.హన్మంతు రజత పతకాలు సా ధించినట్లు కోచ్ రమేశ్ తెలిపారు. వీరిని డీవైఎస్వో శ్రీనివాస్ అభినందించారు. బజార్హత్నూర్: ఈ నెల 5, 6 తేదీల్లో భైంసా పట్టణంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఖోఖో అండర్–11 విభాగంలో మండల కేంద్రంలోని సరస్వతీ శి శుమందిర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతి భ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. క్రీడాకారులను గురువారం ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, పాఠశాల ప్రబంధకారిణి స భ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిఆదిలాబాద్టౌన్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో కీటకజనిత వ్యా ధుల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. బ్రీడింగ్ చెక్కర్స్ ఆయా కాలనీల్లో పర్యవేక్షించాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా చూడాలని సూచించారు. నీటి నిల్వతో డెంగీ, మలేరియా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
● మంజూరు లేదు.. అగ్రిమెంట్ లేదు ● క్షేత్రస్థాయిలో స్తంభాలైతే పాతేశారు ● విద్యుత్శాఖలో దొడ్డిదారిన పనులు ● అవసరం లేకున్నా అదనపు పోల్స్ ● సొంత లాభానికే కొందరు పెద్దపీట
సాధారణంగా ఒక పని కార్యరూపం దాల్చాలంటే వివిధ ఘట్టాలను దాటాల్సి ఉంటుంది. ముందుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎస్టిమేట్ (అంచనా వ్యయం) రూపొందించి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. వారు పరిశీలన చేసి మంజూరు ఇ స్తారు. తర్వాత టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఆసక్తిగల కాంట్రాక్టర్లు అందులో పాల్గొనడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం పనులు దక్కించుకు న్న కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకుంటారు. వర్క్ఆర్డర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్, ఇలా ఏవి అవసరం ఉంటాయో ఆ సామగ్రిని స్టోర్ నుంచి డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడికి వాటిని తరలించాలి. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి హస్నాపూర్లో ఈ పైన పేర్కొన్న తతంగం అంతా జరగకుండానే క్షేత్రస్థాయిలోకి సామగ్రి ఎలా వచ్చిందనేది అధికారులు తెలియదంటే మనం నమ్మాల్సిందే. జిమ్మిక్కులు ఇలా.. అసలు వర్కే మంజూరు లేదు.. మరి సామగ్రి ఎక్క డి నుంచి తీసుకొచ్చి పని చేశారనే సందేహం రావ చ్చు. ఇక్కడ మనకు అధికారులు, వారి బినామీ కాంట్రాక్టర్ల జిత్తులమారి తంతు తెలుస్తోంది. అదేమిటంటే.. వేరే పనికి సంబంధించి నిబంధనల ప్రకా రం మంజూరు లభించడం, సామగ్రి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ పనికి సంబంధించి వివిధ అభ్యంతరాలను సృష్టిస్తారు. దీనిని క్షేత్రస్థాయిలోని వినియోగదారులు నమ్ముతారు. మన పనికి సంబంధించి సామగ్రి రావడంలో ఆలస్యమవుతుందని వారు కూడా అంతగా పట్టించుకోరు. ఇదంతా విద్యుత్ శాఖ అధికారుల జిమ్మిక్కు. ఇక ఆ సామగ్రిని ఇలా ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టే వర్కుల్లో వాడేస్తారు. తమ సొంత లాభం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు సిద్ధమవుతారు. లూటీ ఇలా.. మంజూరు లేకుండా వర్క్ చేపట్టడం ఒక ఎత్తయితే.. ఆ పనిలో అక్రమాలకు పాల్పడటం ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లకు వెన్నెతో పెట్టిన విద్య.అదెలాగంటే.. అవసరం లేకున్నా అద నంగా సామగ్రిని క్రియేట్ చేసి దాని ద్వారా అదనపు లాభం పొందడమే. దీనికి ప్రస్తుతం హస్నాపూర్లో జరుగుతున్న పనే నిదర్శనం. ఇక్కడ ఇదివరకే ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి సపోర్ట్గా ఉన్న పోల్ డ్యామెజ్ అయ్యిందని, దాన్ని వేరే స్థలా నికి మార్చేందుకు అదనంగా స్తంభాలు అవసరమ ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అదనంగా వేసే పోల్స్ ద్వారా వర్క్ అంచనా వ్యయం పెంచి తమ జేబులు నింపుకోవడమే. ఇవన్నీ విద్యు త్ శాఖలో సర్వసాధారణమే అనే విమర్శ లేకపోలేదు. పర్యవేక్షించే అధికారులే ఇలా అడ్డదారులు తొక్కే పరిస్థితి ఉండడంతో సంస్థ ఆదాయానికి గండి పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నా దృష్టికి రాలేదు.. హస్నాపూర్లో వర్క్ జరిగినట్టుగా నా దృష్టికి రాలేదు. దాని గురించి తెలుసుకుంటాను. అయితే రోడ్డు వెంబడి ప్రమాదకర స్థలాల్లో అత్యవసరంగా పనులు చేపట్టాలని సీఎండీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. – జాదవ్ సుభాష్, ఉట్నూర్ డీఈ, విద్యుత్ శాఖ -
వర్సిటీ ఏర్పాటు చేసే దాకా పోరు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సి టీ ఏర్పాటు చేసేంత వరకు పోరాడుతామని యూ నివర్సిటీ సాధన సమితి కన్వీనర్ బద్దం పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీ ఆవశ్యకతపై విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులు విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విశ్వవిద్యాలయ సాధన కో సం పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి రావాలని కోరారు. త్వరలో భారీ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఇందులో యూనివర్సిటీ సాధన సమితి సభ్యులు చిట్యాల సుహాసినిరెడ్డి, నరేందర్, ఉదారి నారాయణ, సాత్వి క్ రెడ్డి, సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంగీత, లెక్చరర్లు సంతోష్కుమార్, మంజుల, రాజ్కుమార్, సంజీవ్, స్రవంతి, జ్యోత్స్న, పాల్గొన్నారు. -
మూడో రోజుకు ‘ఎండీఎం’ సమ్మె
కై లాస్నగర్: పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యా హ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట గల శిబిరంలో కార్మి కులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు కుంటాల రాములు మాట్లాడుతూ, పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీదేవి, శశికళ, పుష్కలత, రాంబాయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జయశంకర్కు ఘన నివాళి
కై లాస్నగర్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను బుధవారం అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్రను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, డీబీసీడబ్ల్యూవో కె.రాజలింగు, డీసీవో మోహన్, విశ్వబ్రాహ్మణ సంఘ బాధ్యులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో నివాళులర్పించిన పీవో ఉట్నూర్రూరల్: ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పీవో ఖుష్బూ గుప్తా పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఇందులో ఏపీవో మెస్రం మనోహర్, అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఈఈ తానాజీ, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రజట్టుకు అసిస్టెంట్ కోచ్గా జాదవ్ రవీందర్ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్న జాదవ్ రవీందర్ రాష్ట్ర జూనియర్ హాకీ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. ఈనెల 12నుంచి పంజాబ్లోని జలంధర్లో నిర్వహించనున్న జాతీయ జూనియర్ హాకీ పోటీల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్న జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించనున్నారు. ఈమేరకు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. -
అందుబాటులో బుకింగ్ కౌంటర్లు..
పండుగకు సొంత గ్రామాలకు వెళ్లలేని మహిళలు తమ సోదరులకు రాఖీలను బుక్ చేసి పంపించే విధంగా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పా టు చేసింది. రీజియన్ పరిధిలో మూడు బస్టాండ్లు, 26 ఏజెంట్ కౌంటర్లలో వీటిని ఇప్పటికే ప్రా రంభించారు. ఇందులో రాఖీలతో పాటు మిఠాయిలు సైతం పంపించుకునే వెసులుబాటు కల్పించారు. బుకింగ్లో సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో సెల్ నంబర్ 9154298531, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 9154298547, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో 9154298541, రీజినల్ మేనేజర్ కార్యాలయం సెల్ నంబర్ 9154298553 పై సంప్రదించాలని కరీంనగర్జోన్ కార్గో మేనేజర్ వెంకటనారాయణ కోరారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
బోథ్: మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సొనాల మండలం కోట (కె)గ్రామంలో ఏర్పాటు చేసిన హరహర మహాదేవ్ పౌల్ట్రీ యూనిట్ షెడ్ను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. శకుంతలాబాయిని ఇతర గ్రామాల మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, ఎంపీడీవో రాజేశ్వర్ పాల్గొన్నారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత బజార్హత్నూర్: మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎకై ్సజ్, అటవీ, డీఆర్డీఏ శాఖల అధ్వర్యంలో మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధి కనకాయి జలపాతం సమీపంలో బుధవారం వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొలం బాటలో భాగంగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, డీఆర్డీవో రవీందర్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.● కలెక్టర్ రాజర్షి షా -
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
● పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ● రాఖీల బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లు ఆదిలాబాద్: రాఖీ పండుగతో పాటు వరలక్ష్మి వ్రతం వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. అలాగే వరుస సెలవుల దృష్ట్యా ఉద్యోగులు, కుటుంబాలతో ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ మేరకు రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సుల ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 7నుంచి షురూ.. ఈనెల 8న వరలక్ష్మివ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే 10, 11, 12 తేదీల్లో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ డిపోల నుంచి హైదరా బాద్కు 72 బస్సులను నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అదనంగా మరిన్ని సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రిజర్వేషన్ ఇలా.. పండుగల దృష్ట్యా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారి కోసం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే www. tgsrtcbus. in వెబ్సైట్ ద్వారా బస్సుల సీట్లను బుక్ చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. 118 ప్రత్యేక బస్సులు.. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమి దృష్టిలో ఉంచుకొని 118 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని జేబీఎస్, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ప్రధాన బస్స్టేషన్లలో మే ఐ హెల్ప్ యూ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రీజియన్ పరిధిలోని బస్స్టేషన్ల నుంచి పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీ బట్టి బస్సులను ఏర్పాటు చేస్తాం. – ఎస్.భవానీప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ -
ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా
● డీఎంహెచ్వో ఆధ్వర్యంలో తనిఖీలు ● ఓ ఆస్పత్రి, మరో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ ఆదిలాబాద్టౌన్: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం పట్టణ సమీపంలోని శేషన్న చెన్నవార్ కంటి ఆస్పత్రిని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్తో పాటు వైద్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. అయితే వైద్యుడి వివరాలు డీఎంహెచ్వో కార్యాలయంలో నమోదు లేకపోవడంతో నోటీసు జారీ చేశారు. అలాగే ఫీజు ఎక్కువగా తీసుకుంటున్నారని రోగులు ఫిర్యాదు చేశారు. అనంతరం దస్నాపూర్లోని హరిహరన్ ప్రైవేట్ ఆస్పత్రిని తనిఖీ చేయగా, డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే ఆస్పత్రికి సంబంధించి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో సీజ్ చేశారు. అదే ప్రాంతంలో నాలుగు ఆర్ఎంపీ క్లినిక్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఓ క్లినిక్ను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఐవో వైసీ శ్రీనివాస్, మలేరియా నివారణ అధికారి శ్రీధర్ తదితరులున్నారు. -
మెగా జాబ్మేళాకు స్పందన
కైలాస్నగర్:నిరుద్యోగ యువతకు ప్రైవేట్రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టాస్క్ సౌజన్యంతో మంగళవారం నిర్వహించిన మెగా జా బ్మేళాకు స్పందన లభించింది. జిల్లాయంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్టీయూభవన్లో నిర్వహించిన మేళా కు జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు భారీ గా తరలివచ్చారు. ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన 34 కంపెనీల ప్రతినిధులు హాజరై పదోతరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతల ఆధారంగావారికి ఇంట ర్వ్యూలు నిర్వహించారు. నైపుణ్యం ఆధారంగా ఉ ద్యోగాలకు ఎంపిక చేశారు. కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించి మాట్లాడారు. ప్రజావాణిలో అందుతున్న వినతుల నేపథ్యంలో జాబ్మేళా ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభంలో వేతనం తక్కువ ఉన్నా వృత్తినైపుణ్యం పెంపొందించుకుంటే మంచి ప్యాకేజీ పొందవచ్చన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్, డీడబ్ల్యూవో మిల్కా,పరిశ్రమలశాఖ జీఎం పద్మభూషణ్ రాజు, మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్.రాజు, డీవైఎస్వో శ్రీనివాస్, డీఎల్పీవోలు ఫణిందర్రావు, ప్రభాకర్రావు, స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
● ఎన్ఆర్సీకి బడ్జెట్ సమస్య ● సరుకులు లేక సిబ్బంది అవస్థలు ● చిన్నారులకు అందని న్యూట్రీషియన్ ఫుడ్
ఆదిలాబాద్టౌన్: వివిధ రుగ్మతలతో బరువు పెరగని పిల్లలను జిల్లా కేంద్రంలోని రిమ్స్లో గల న్యూట్రీషియన్ రీహాబిటేషన్ సెంటర్ (ఎన్ఆర్సీ)లో చేర్పిస్తారు. వీరికి వివిధ రకాల పోషకాహారంతో పాటు వైద్య చికిత్స అందజేస్తారు. ఆయా గ్రామాల నుంచి అంగన్వాడీలు, ఏఎన్ఎంలు పిల్లలను ఇక్కడ చేర్పించి వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఎత్తుకు తగ్గ బరువు ఉండని ఐదేళ్లలోపు పిల్లల్ని గుర్తిస్తారు. ఎన్ఆర్సీలో 14 రోజుల పాటు పౌష్టికాహారం అందజేస్తారు. అయితే రెండు నెలలుగా ఆ సెంటర్లో పిల్లలకు పోషకాహారం అందడం లేదు. బడ్జెట్ లేకపోవడంతో సిబ్బంది పిల్లలకు రిమ్స్లో రోగులకు అందించే భోజనం పెడుతున్నారు. పప్పు, అన్నం, పాలు తప్పా మరే పౌష్టికాహారం అందడం లేదని ఎన్ఆర్సీలో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్ద కూడా ఈ భోజనం తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. బడ్జెట్ లేక తంటాలు.. ఈ సెంటర్లో ప్రస్తుతం 13 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఒక మెడికల్ ఆఫీసర్తో పాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఆయాలు, ఒక కుక్, ఒక న్యూట్రీషనిస్ట్ పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్ పద్ధతిన కొనసాగుతున్నారు. బడ్జెట్ లేక వీరికి నెల వేతనం సైతం అందలేదని చెబుతున్నారు. నెలకు చిన్నారులకు భోజనం పెట్టేందుకు రూ.15వేలు ఖర్చవుతుందని, అయితే నెలరోజులుగా బడ్జెట్ లేకపోవడంతో తమ డబ్బులతోనే సరుకులు తెచ్చి పిల్లలకు పెడుతున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ఎన్ఆర్సీలో చిన్నారులతో తల్లిదండ్రులుఅమలుకు నోచుకోని మెనూ ఎన్ఆర్సీలో నెల వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలను చేర్పి స్తారు. పాలు, గుడ్లు, ఉప్మా, నెయ్యి, పోహా, సేమియా, ముర్కులు, దొడ్డు రవ్వ, హల్వా, కిచిడి, అన్నిరకాల కూరగాయలతో తయారు చేసిన భోజనం అందించాల్సి ఉంటుంది. అలాగే ఆలు రైస్, దాల్రైస్, సాబుదాన, రాగిజావ, టమాట రైస్, బెల్లం రైస్, వెజిటేబుల్రైస్ ఇలా అనేక రకాల పోషకాలు కూడిన భోజనాన్ని పెట్టాల్సింది. అయితే రెండు నెలలుగా సరిపడా సరుకులు లేకపోవడంతో ఉన్నవాటితోనే నెట్టుకొస్తున్నారు. వారం రోజులుగా పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కనీసం అక్కడ బియ్యం కూడా లేవని సిబ్బంది చెబుతున్నారు. కేవలం పాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు గంటలకోసారి పిల్లలకు వివిధ రకాల ఆహార పదార్థాలు అందించాల్సి ఉంటుంది. అయితే సరుకులు నిండుకుండడంతో రిమ్స్లో రోగులకు పెట్టే పప్పు, అన్నంనే చిన్నారులకు అందించాల్సి వస్తోంది. దీంతో వారిలో బరువు కూడా పెరగడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ రాలేదు.. ఎన్ఆర్సీకి సంబంధించి బడ్జెట్ రాలేదు. దీంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న మాట వాస్తవమే. బియ్యంతో పాటు ఇతర స రుకులు లేవు. రిమ్స్లో రోగులకు అందిస్తున్న భోజనంలో నుంచి పిల్లలకు పెడుతున్నాం. మా సొంత ఖర్చుతో సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపడతాం. – శ్రీనివాస్చారి, ఎన్ఆర్సీ మెడికల్ ఆఫీసర్ -
వేగ నియంత్రణకు పోలీస్ కటౌట్లు
● జాతీయ రహదారిపై రెండు చోట్ల ఏర్పాటు ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: జాతీయ రహదారిపై వేగాన్ని ని యంత్రించేందుకు, రోడ్డు ప్రమాదాలు అరికట్టడాని కి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కటౌట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జా తీయ రహదారిపై హాట్స్పాట్ల వద్ద పోలీసు వా హనం, ట్రాఫిక్ కానిస్టేబుల్తో కూడిన కటౌట్లు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, నేరడిగొండ మండలం బంధ ం ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని చూసి వాహనదారులు బ్రేక్లు వేస్తున్నార ని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారని తెలిపారు. ఆదివాసీ దినోత్సవానికి ఆహ్వానం ఈనెల 9న నిర్వహించే ఆదివాసీ దినోత్సవానికి హాజరు కావాలని ఆదివాసీ సంఘాల నాయకులు ఎస్పీ అఖిల్ మహాజన్ను కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఇందులో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆదివాసీ సంఘాల నాయకులు గోడం గణే శ్, పుర్క బాపురావు, జయవంత్రావు, పెందూర్ దాదిరావు, గేడం రేణుకబాయి, వెట్టి మనోజ్, ఉయిక ఇంద్రబాయి, మడావి ఆనంద్రావు, సలాం వరుణ్, సిడాం శంభు,తదితరులు పాల్గొన్నారు. -
● విద్యుత్ శాఖలో అంతా ఇష్టారాజ్యం ● సబ్ డివిజన్ వర్క్స్ దొడ్డిదారిన కేటాయింపు ● తన స్థాయి మించి ఓ డీఈ పనులు అప్పగింత ● అనువైన కాంట్రాక్టర్లకు అందలం ● పాత అగ్రిమెంట్పైనే ఎక్స్టెన్షన్ ద్వారా పనులు
సాక్షి,ఆదిలాబాద్: విద్యుత్ శాఖలో సబ్ డివిజన్స్థాయి టెండర్లలో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి అధికారులే ఆజ్యం పోస్తున్నారనే విమర్శలున్నాయి. తమ పరిధి కాకపోయినప్పటికీ, తమకు ఆ టెండర్లు ఇచ్చే అధికారం లేకపోయినా కొంత మంది అధికారులు ఇవేమి పట్టించుకోవడం లేదు. ఉట్నూర్ పరిధిలోని సబ్డివిజన్ వర్క్స్ కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలే అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలోనూ ఈ డివిజన్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం, దానిపై సీఎండీ, జేఎండీ స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా అక్కడ మార్పు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బినామీలకు పెద్దపీట.. విద్యుత్ శాఖలో టెండర్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అధికారులే తమ బంధువులను బినామీలుగా రంగంలోకి దించి దొడ్డిదారిన పనులు అప్పగిస్తున్నారనే విమర్శలు ముందునుంచి ఉన్నాయి. పైస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు కొందరు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. రేట్లు సరిపోవడం లేదనే సాకు.. విద్యుత్ శాఖ జిల్లా పరిధిలో ఐదు సబ్ డివిజన్లు ఆదిలాబాద్, జైనథ్, ఆదిలాబాద్రూరల్, ఇచ్చోడ, ఉట్నూర్ ఉన్నాయి. ఈ సబ్ డివిజన్ల పరిధిలో 30 మంది గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లు ఉన్నారు. గతంలో టెండర్లు జరిగినప్పుడు రూ.20లక్షల విలువైన పనులను ఒక్కొక్కరికి అప్పగించారు. ఇది ఎస్ఈ స్థాయిలోనే కేటాయించారు. ఆ పనులు పూర్తయిన తర్వాత మళ్లీ వారికి వివిధ పనులకు సంబంధించి ఎక్స్టెన్షన్ ఇస్తారు. అదికూడా ఎస్ఈ స్థాయిలోనే జరగాలి. ఆ పరిమితి పూర్తి చేసుకున్న వాటికి సంబంధించి మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహిస్తారు. ఇలా సబ్ డివిజన్ల పరిధిలో కాంట్రాక్టర్ల గుర్తింపునకు సంబంధించి మళ్లీ టెండర్లు నిర్వహించాలి. ఆ టెండర్లలో పాత కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చు. కొత్త కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది. అయితే ఇక్కడ పాత కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టర్లకు చెక్ పెట్టేందుకు ఎత్తుగడ అవలంభించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వర్క్స్కు సంబంధించి రేట్లు తమకు సరిపోవడం లేదని, తాము ఆ పనులను చేపట్టమంటూ టెండర్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదంతా విద్యుత్ శాఖ అధికారులకు, పాత కాంట్రాక్టర్లకు అంతర్గతంగా లోపాయికారి ఒప్పందంతోనే జరుగుతుందనే ప్రచారం ఉంది. ఆ ముసుగులో పనులు అప్పగింత.. ఇలా పాత కాంట్రాక్టర్లు తమకు రేట్లు సరిపోవడం లేదని టెండర్లకు దూరంగా ఉండటం, దానికి సంబంధించి పైస్థాయిలో అధికారులకు నివేదికలు పంపడంతో ప్రస్తుతం సబ్ డివిజన్ స్థాయి కొత్త టెండర్లు కొద్ది రోజులుగా నిలిచిపోయాయి. తద్వారా ఆయా వర్క్స్పై దీని ప్రభావం పడింది. కాంట్రాక్టర్లు రేట్లు సరిపోవడం లేదని పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదనే సాకుతో పాత కాంట్రాక్టర్లకు పాత అగ్రిమెంట్ల పైనే మళ్లీ కొత్త పనులను ఎక్స్టెన్షన్ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంనా దృష్టికి రాలేదు.. సబ్ డివిజన్ స్థాయి వర్క్స్ టెండర్లు ఎస్ఈ స్థాయిలోనే జరుగుతాయి. ఉట్నూర్ డివిజన్లో ఆ పనులు డీఈ ఇచ్చినట్లు నా దృష్టికి రాలేదు. జిల్లాలో సబ్ డివిజన్ల పరిధిలో కొత్త టెండర్లకు సంబంధించి మూడుసార్లు కాల్ఫర్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రధానంగా వారు రేట్లు సరిపోవడం లేదని చెబుతున్నారు. దీంతో పనులు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వం ఆ పనులను చేపట్టాలని చెప్పడంతో కొంత మంది కాంట్రాక్టర్లకు ఎక్స్టెన్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. – జేఆర్ చౌహాన్, ఎస్ఈ, ఆదిలాబాద్ -
నేటి నుంచి ‘సర్వేయర్’ అప్రెంటిస్షిప్
● ఒక్కో సర్వేయర్కు 15 మంది శిక్షణ అభ్యర్థులు అటాచ్డ్ కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఎంపిక చేసిన వారికి 56 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో శిక్షణ ఇచ్చింది. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 4నుంచి అప్రెంటిస్షిప్ అందించాలని తొలుత నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు ఫలితాలు వెల్లడించలేదు. అయినా పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ అప్రెంటిస్షిప్ అందించాలని నిర్ణయించింది. ఆ దిశగా జిల్లా సర్వే ల్యాండ్ రికార్డు అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైన 129 మందికి బుధవారం నుంచి అప్రెంటిషిప్ శిక్షణ ఇవ్వనున్నారు. మండల సర్వేయర్ల పరిజ్ఞానం, వారి పనితీరు ఆధారంగా ఒక్కో సర్వేయర్కు 15 నుంచి 21 మంది అభ్యర్థులను కేటాయించారు. ఈమేరకు వారిని మంగళవారం కార్యాలయానికి పిలిపించారు. ఏ మండలంలో అప్రెంటిస్షిప్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే వివరాలు సేకరించారు. తదనుగుణంగా వారిని జిల్లాలో పనిచేస్తున్న 10 మంది సర్వేయర్లకు అటాచ్డ్ చేశారు. మంగళవారం రాత్రి వరకు ఈ ప్రక్రియ పూర్తికాగా అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా వారి సర్వేయర్ పేరు, మండలం వంటి సమాచారం అందించనున్నారు. పరీక్ష ఫలితాలు ప్రకటించకుండానే అభ్యర్థులందరికీ అప్రెంటిస్షిప్ ఇవ్వనుండటంతో అందరినీ విధుల్లోకి తీసుకుంటారా లేక ఫలితాల అనంతరం ఎవరినైనా రిజెక్ట్ చేస్తారా అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. ఈ విషయమై జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్ ఏడీ రాజేందర్ను ‘సాక్షి’ సంప్రదించగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పది మంది సర్వేయర్లకు శిక్షణ అభ్యర్థులను అటాచ్డ్ చేశామని తెలిపారు. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పర్యాటకం.. అభివృద్ధికి దూరం
ప్రకృతి అందాలకు నెలవైన కడెం ప్రాజెక్టు పర్యాటక ంగా గుర్తింపు పొందింది. అయితే సరైన సౌకర్యాలు లేక సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 202510లోu విద్యుత్ శాఖలో సబ్డివిజన్ స్థాయి టెండర్లను సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ) మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఉట్నూర్ సబ్ డివిజన్లో ఓ కాంట్రాక్టర్కు రూ.10లక్షల విలువైన పనులను డివిజనల్ ఇంజినీర్ (డీఈ) స్థాయి అధికారి తన సీరిస్ నంబర్పై ఖరారు చేశారు. ఇతర పనుల్లో డీఈకి రూ.5లక్షల్లోపే పనులను అప్పగించే అధికారం ఉంది. అయితే సదరు డీఈకి నిబంధనలన్నీ బలాదూర్గా మారాయి. తనకు అనువైన ఓ కాంట్రాక్టర్కు తన సీరిస్ నంబర్పై ఎలాంటి అధికారం లేకున్నప్పటికీ పెద్ద మొత్తంలో పనులను అప్పగించడం గమనార్హం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీయే ఈ ఫొటోలో ఉన్నది. ●న్యూస్రీల్ -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ రాజర్షి షా ● తాంసి పీహెచ్సీ, పీఏసీఎస్ తనిఖీ తాంసి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల ని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ, పీఏసీఎస్ను మంగళవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. తరచూ విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ అసిస్టెంట్ సాయితేజకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. అనంతరం సహకార సంఘం కార్యాలయంలో ఎరువుల నిల్వలు పరిశీలించారు. స్టాక్ రికార్డులు తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో మోహన్రెడ్డి, డీసీవో మోహన్, ఏవో రవీందర్, వైద్యసిబ్బంది నర్మద, సుజాత, సహకార సంఘం సీఈవో కేశవ్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
‘స్పోర్ట్స్’లో కీచకపర్వం
● అమ్మాయిలపై లైంగిక వేధింపులు ● గతంలో ఓ శిక్షకునిపై వేటు ● తాజాగా మరో కోచ్పై పోక్సో కేసు ● క్రీడా పాఠశాలపై కరువైన పర్యవేక్షణ ఆదిలాబాద్: ఓ వైపు కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటుంటే క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడా శిక్షణలో తర్ఫీదు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా మూడు క్రీడా పాఠశాలలను నెలకొల్పారు. ఒకటి హకీంపే ట, రెండోది కరీంనగర్లో ఉండగా, మరొకటి జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2016లో ఏర్పాటు చేశారు. అయితే మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన స్పోర్ట్స్ స్కూల్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. అధికా రుల పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తరచూ ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్న ఈ క్రీడా పాఠశాలలో తాజాగా ఓ విద్యార్థినిపై శిక్షకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో కేసు నమోదు కావడం గమనార్హం. క్రీడా శిక్షణ అందించాల్సిన శిక్షకులపై ఇలాంటి ఆరోపణలు రావడం, కేసులు నమోదు అవుతుండడం మిగతా విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచీ అదే తీరు.. ● 2023 సంవత్సరంలో ఈ పాఠశాలలో అథ్లెటిక్స్లో శిక్షణ అందించే శిక్షకుడు ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తొలుత విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు తర్వాత బయటకు పొక్కడంతో శిక్షకుడిపై వేటు వేశారు. ● గతంలో ఈ పాఠశాలలో ఓ విద్యార్థినిపై ఓ విద్యార్థి వేధింపులకు దిగాడని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని బయటకు రాకుండా అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదని నాడు అధికారులు, సిబ్బంది చెప్పుకొచ్చారు. ● తాజాగా బాక్సింగ్ నేర్పించే శిక్షకునిపై లైంగిక ఆరోపణలు చేస్తూ ఓ బాలిక తల్లిదండ్రులు జూలై 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సదరు శిక్షకునిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. క్రీడాకారులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు.. క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తే తమ పిల్లలు చదువుతోపాటు మంచి క్రీడాకారులుగా ఎదుగుతారనే ఆలోచనతో తల్లిదండ్రులు ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన చేస్తూ జూడో, అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో శిక్షణ అందిస్తున్నారు. అయితే కొంతమంది శిక్షకుల అనుచిత ప్రవర్తన కారణంగా విద్యార్థులు పూర్తిస్థాయిలో అటు చదువుపై, ఇటు క్రీడలపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగానే పలువురు విద్యార్థులు టీసీలు తీసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరువైన పర్యవేక్షణ.. ఇంత జరుగుతున్నా పట్టించుకోని సంబంధిత అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. డీఎస్ఏ పరిధిలో, క్రీడా పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా సమాచారం బయటకు రాకుండా సిబ్బంది, అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మెమో జారీ చేశాం.. బాక్సింగ్ శిక్షకునికి మెమో జారీ చేశాం. అ తని వివరణ తీసుకున్నాం. అంతర్గతంగా వి చారణ జరుపుతున్నాం. మా నివేదికతో పా టు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ నివేదికను కలెక్టర్కు అందిస్తాం. వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్వో -
కార్గో ద్వారా రాఖీల బుకింగ్
ఆదిలాబాద్: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో అన్నదమ్ములకు రాఖీలు పంపాలనుకునే సోదరీమణుల కోసం ఆర్టీసీ కార్గో కౌంటర్లను ప్రారంభించినట్లు ఆదిలాబాద్ డిపో మేనేజర్ ప్రతి మారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రం లోని బస్టాండ్లో కార్గో బుకింగ్కౌంటర్ ప్రారంభించారు. రీజియన్ పరిధిలో 29 కౌంటర్లలో రాఖీలు బుక్ చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బస్టాండ్ కంట్రోలర్ పీఎస్ రెడ్డి, రీజనల్ మార్కెటింగ్ ఎగ్జి క్యూటివ్ సాయన్న,అన్సార్ తదితరులున్నారు. -
రెండు ఆస్పత్రులకు నోటీసులు
ఆదిలాబాద్టౌన్: నిబంధనలు పాటించని రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యశాఖ అధికారులునోటీసులు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాల మే రకు జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం తనిఖీ చేశారు. పట్ట ణంలోని వెంకటేశ్వర చిల్డ్రన్ హాస్పిటల్, శివప్రియ నర్సింగ్హోమ్, సుజాత నర్సింగ్ హో మ్ అండ్ సర్జికల్ ఆస్పత్రులను పరిశీలించారు. నిబంధనలుపాటించని సుజాతనర్సింగ్ హోమ్, శివ ప్రియ నర్సింగ్ హోమ్ యాజమాన్యాలకు నో టీసులు అందించినట్లు డీఎంహెచ్వో నరేంద ర్ రాథోడ్ తెలిపారు. వారి వివరణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధ న, డీఐవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
మహాగర్జనకు తరలిరండి●ఆదిలాబాద్రూరల్: పింఛన్ పెంపు హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మహాగర్జన సన్నాహక సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ‘సాక్షి’లో వృద్ధులు, దివ్యాంగుల గురించి కథనాలు రావడంతో చలించి వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6వేలు, వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పింఛన్ పెంచి అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడస్తున్నా పింఛన్ పెంపు ఊసే లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్కు పేదల బాధలు తెలియవని, ఎందుకంటే వారి ఇంట్లో ఎవరు కూడా పేదలు లేరన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఆమె భద్రతకు భరోసా
● పోకిరీల చేష్టలకు ‘షీటీం’తో చెక్ ● పలువురిపై పోక్సో కేసులు ● విద్యాసంస్థల్లో అవగాహన ● వేధింపులా.. డయల్ 8712659953 ఆదిలాబాద్టౌన్: షీటీమ్.. మహిళలపై దాడులు, వేధింపులు, ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది జిల్లాలో పటిష్టంగా పనిచేస్తోంది. గడిచిన ఆరు నెలల్లో నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీసుశాఖ వారి రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేసింది. ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తున్నా రు. మైనర్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న వారిపై పోక్సో కేసులు పెట్టి కటకటాల పాలు చేస్తున్నారు. మరోవైపు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందు కు వెనుకంజ వేస్తున్న వారికి సైతం అండగా నిలు స్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తూ వారి వివరాలు గోప్యంగా ఉంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు.. ● ఆదిలాబాద్లోని ఓ పాఠశాలలో షీటీమ్ సభ్యులు గుడ్టచ్, బ్యాడ్ టచ్పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుండగా, తనను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని బృంద సభ్యులకు సదరు విద్యార్థిని తెలిపింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి వన్టౌన్లో పోక్సో కేసు నమోదు చేశారు. ● ఇంద్రవెల్లి మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్ను ఆశ్రయించారు. దీంతో సదరు టీచర్పై పోక్సో కేసు నమోదు చేశారు. ● ఓ గ్రామం నుంచి యువతి టైలరింగ్ కోసం జిల్లా కేంద్రానికి వస్తుంది. ఈ క్రమంలో ఆమెను వేధిస్తున్న యువకుడిని షీటీమ్ మారువేషంలో వెళ్లి పట్టుకుని అరెస్టు చేశారు. ● ఓ బస్టాండ్లోని వాష్రూమ్లో ఓ మహిళకు సంబంధించిన ఫోన్ నంబర్ను ఓ వ్యక్తి రాశాడు. దీంతో ముగ్గురు ఆ మహిళకు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడ్డారు. సదరు మహిళ షీటీంను ఆశ్రయించింది. ముగ్గురిని అరెస్టు చేయడంతో పా టు అక్కడి నుంచి ఫోన్ నంబర్ తొలగించారు. ● గుడిహత్నూర్లో ఓ బాలిక ఫొటోలు తీసి నిందితుడు వేధింపుకు పాల్పడ్డాడు. స్నేహితులకు వాటిని షేర్ చేశాడు. దీంతో పోలీసులు తొమ్మిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ● ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వివాహితను ఏడేళ్లుగా ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నా డు. దీంతో బాధితురాలు షీటీంను సంప్రదించగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. విస్తృత స్థాయిలో అవగాహన.. మహిళలు, యువతులు, విద్యార్థినులపై జరుగుతు న్న అఘాయిత్యాలు, వేధింపులు, గుడ్టచ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా తదితర విషయాలపై షీటీ మ్ సభ్యులు విస్తృతంగా అవగాహన సదస్సులు ని ర్వహిస్తున్నారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, దుకాణ సముదాయాలు, గ్రామాలకు వెళ్లి కూలీల కు సైతం అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తు తం ఒక షీటీమ్ పనిచేస్తుంది. ఇందులో ఏఎస్సై బి.సుశీల,హెడ్కానిస్టేబుల్ వాణిశ్రీతో పాటు ఇద్దరు ఏఆర్ మహిళా పోలీసులున్నారు. వీరికోసం ప్రత్యేక వాహనం కేటాయించారు. వీరు జిల్లాలో ఎక్కడ సంఘటన జరిగినాచేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. జిల్లాలో కేసుల వివరాలు.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 18 కౌన్సెలింగ్లు, 51 పెట్టి కేసులు, 16 ఎఫ్ఐఆర్, 84 అవగాహ న సదస్సులు నిర్వహించారు. 254 గ్రామాల్లో షీటీ మ్ సభ్యులు పర్యటించారు. నాలుగు బాల్య వివా హాలను అడ్డుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో నాలుగు పోక్సో కేసులు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు.. మహిళలు, యువతులు, విద్యార్థినులను పోకిరీలు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు షీటీమ్ సెల్:8712659953 నంబర్పై సంప్రదించాలి. స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. షీటీమ్ ద్వారా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
కలెక్టర్కు సన్మానం
కైలాస్నగర్: సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్లో రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, సమష్టి కృషితోనే అవార్డు సాధించగలిగా మని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరంకై లాస్నగర్: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని, వాటి ప్రాముఖ్యతపై మహిళలు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లిపాల వారోత్సవాలు, పోషకాహార దినోత్సవ అవగాహన ప్రచార పో స్టర్లను కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈనెల 7వరకు తల్లిపాల వారో త్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి పా లలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయన్నారు. ఇందులో అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా సంక్షేమాధికారి మిల్కా,డీఆర్డీవో రాథోడ్రవీందర్పాల్గొన్నారు. -
వినతుల వెల్లువ
● పింఛన్, ‘ఇందిరమ్మ’ అర్జీలే అధికం ● ప్రజావాణికి 112 దరఖాస్తులు కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 112 అర్జీలు అందాయి. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల మంజూరుకు సంబంధించిన వే ఉన్నాయి. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. అధికారుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి ప్రజావాణికి కలెక్టర్ ఉదయం 10.30 గంటలకే హాజరయ్యారు. అర్జీలకు సంబంధించి ఆయా శాఖ ల అధికారులను పిలువగా అందుబాటులో లేకపోవడంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ అధికారులెక్కడ అంటూ అక్కడే ఉన్న జిల్లా అధి కారుల సంఘం అధ్యక్షుడు మనోహర్ను ప్రశ్నించారు. వచ్చేవారం నుంచి సకాలంలో హాజరయ్యేలా చూస్తామని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులు హుటాహుటిన హాజరయ్యారు. అయితే చాలామంది 11.30గంట ల సమయంలో గ్రీవెన్స్కు రావడం కనిపించింది. -
టీచర్ల తీరు మారలే!
● ఫేషియల్ అటెండెన్స్ వచ్చినా అదే పరిస్థితి ● సమయపాలన పాటించని ఉపాధ్యాయులు ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయుల హాజరుపై ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది తీ రు మాత్రం మారడం లేదు. ఇదివరకు బయోమెట్రి క్ ఉండగా కొందరు సమయపాలన పాటించారు. మరికొంత మంది వివిధ సాకులతో తప్పించుకున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల ఫేషియల్ అటెండెన్స్ను అమలులోకి తీసుకొచ్చింది. అయినా పలువురు తమ తీరు మార్చుకో వడం లేదని తెలుస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో డీఈవో పరిధిలో 691 పాఠశాలలు ఉండగా, 3,288మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇంకా 230 మంది టీచర్లు యాప్ డౌన్లోడ్ చేసుకోకపోవడం గమనా ర్హం. మొదటి రోజు 63 శాతం మంది యాప్ ద్వారా హాజరు వేసుకున్నారు. సోమవారం ఉపాధ్యాయు ల హాజరును రాష్ట్రవిద్యాశాఖ అధికారులు పరిశీ లించారు. ఇందులో పలువురు సమయపాలన పా టించలేదని తెలిసింది. జిల్లాకేంద్రంతో పాటు మా రుమూల మండలాల్లో ఉపాధ్యాయులు పాఠశాల కు ఉదయం 9.30 తర్వాత వెళ్లగా, మధ్యాహ్నం 3.30 గంటలకే ఇంటి ముఖం పట్టినట్లు తెలుస్తోంది. మరికొంత మంది 10గంటలు, 11 గంటలకు, 12గంటలు,ఒంటి గంటవరకు వెళ్లగా..మధ్యాహ్నం 3 గంటలు, 3.45 గంటలలోపే యాప్లో అటెండెన్స్ నమోదు చేసి ఇంటి ముఖం పట్టారని తెలు స్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆ రిపోర్టు ను పంపించగా అందులో పలువురి సమయపాలన వివరాలు ఇలా నమోదయ్యాయి. తిప్ప పాఠశాలకు చెందిన టీచర్ మధ్యాహ్నం 3.45 గంటలకు, అంకో లి ఉపాధ్యాయుడు ఉదయం 10.12 గంటలకు, రాంపూర్కు చెందిన ఉపాధ్యాయుడు 10గంటలకు, చాందాకు చెందిన ఉపాధ్యాయుడు మధ్యాహ్నం 1.31 గంటలకు, యాపల్గూడకు చెందిన ఉపాధ్యాయుడు 11.06 గంటలకు, కచ్కంటికి చెందిన టీచర్ మధ్యాహ్నం2.53గంటలకు, ఖిల్లాకు చెందిన టీచర్ మధ్యాహ్నం 1.37 గంటలకు, కేజీబీవీ మావలకు చెందిన సీఆర్టీలు ముగ్గురు 11.45, మరొకరు 12 గంటలకు, సరస్వతీనగర్కు చెందిన టీచర్ మధ్యాహ్నం1.05గంటలకు ఫేషియల్ అటెండెన్స్లో న మోదు చేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు సమయపాలన పాటించలేదని తెలుస్తోంది. ప్రస్తు తం ట్రయల్రన్కొనసాగుతుండగా, రెండు మూడు రోజుల తర్వాత ఈ అటెండెన్స్ పకడ్బందీగా అమలు చేయనున్నట్లు రాష్ట్రశాఖ అధికారులు పేర్కొన్నా రు. దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇక నుంచి సమయపాలన పాటించని వారికి హైదరాబాద్ నుంచే మెమోలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అటెండెన్స్ షీట్ విడుదలతో సమయపాలన పాటించని ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. -
‘మధ్యాహ్న’ కార్మికుల సమ్మె
కై లాస్నగర్: పెండింగ్ వేతనాలు,బిల్లులు విడు దల చేయాలనే డిమాండ్తో ఏఐటీయుసీ అ నుబంధ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. సోమవారం విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటా ల రాములు మాట్లాడుతూ.. ఏడాదిగా మధ్యా హ్న భోజన పథకానికి సంబంధించిన బి ల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వేతనాలు కూడా ఆరు నెలలుగా అందడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వంట చేయడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందులో సంఘ నాయకులు శ్రీదేవి, రాంబాయి, పు ష్పలత, సంతోష్, నాందేవ్, లక్ష్మి పాల్గొన్నారు. -
● అవగాహన కల్పిస్తున్న ‘సాధన సమితి’ ● మేము సైతం అంటున్న విద్యార్థులు, యువత ● ఆందోళనలకు సమాయత్తం ● ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చేలా ప్రణాళిక
ఆదిలాబాద్టౌన్: విశ్వవిద్యాలయం ఏర్పాటే లక్ష్యంగా యూనివర్సిటీ సాధన సమితి వడివడిగా అడుగులేస్తోంది. ఓ వైపు మేధావులు, రాజకీయ పార్టీల నాయకులను కలుస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులు, విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ‘మేము మీ వెంట ఉన్నాం.. మీరు మా వెంట రండి.. మీ భవితకు బాటలు వేసుకోండని సూచిస్తున్నారు. సంఘటితంగా పోరాడితే లక్ష్య సాధన సులువేనని అంటున్నారు. వర్సిటీ ఆవశ్యకతను వివరిస్తూ.. యూనివర్సిటీ ఆవశ్యకతపై సాధన సమితి సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రంథాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఓయూ, కేయూలు దూరంగా ఉండడంతో ఈ ప్రాంత విద్యార్థులు ఏవిధంగా నష్టపోతున్నారు.. అదే ఇక్కడ వర్సిటీ అందుబాటులోకి వస్తే ఒనగూరే ప్రయోజనాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే అందులో విద్యారంగం పాత్ర కీలకమని చెబుతున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి, కోకన్వీనర్ గొడిసెల రమణగౌడ్, సలహాదారులు, చిట్యాల సుహాసిని రెడ్డి, సభ్యులు నరేందర్రెడ్డి, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సూరజ్ సింగ్, లెక్చరర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ సాధనకు తోడ్పాటునందించాలని కోరారు. ఉద్యమాలకు ప్రణాళిక సిద్ధం.. వర్సిటీ సాధన సమితి ఉద్యమాలకు సిద్ధమవుతోంది. జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సుల అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, సభలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి పోరాటంలో భాగస్వాములు కావాలని, అసెంబ్లీ, పార్లమెంట్లో విషయాన్ని ప్రస్తావించాలని విన్నవిస్తామని, సీఎంతో పాటు ఆయా శాఖల మంత్రులను కలుస్తామని సమితి సభ్యులు చెబుతున్నారు. వర్సిటీ సాధించేవరకు నిరంతరంగా ఉద్యమిస్తామని, శాంతియుత పోరాటాలు చేస్తామని పేర్కొంటున్నారు. -
ఎఫెక్ట్..
ఆ ఉపాధ్యాయుల వివరాలు పంపండి.. ఆదిలాబాద్టౌన్: జిల్లాలో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఆయా పాఠశాలలకు కేటాయించిన ఉపాధ్యాయులు విధుల్లో చేరడం లేదని సోమవారం ‘‘సర్దుబాటు’ ఆదేశాలు బేఖాతరు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన డీఈవో శ్రీనివాస్రెడ్డి సర్దుబాటు ప్రక్రియలో భాగంగా కేటాయించిన కొత్త పాఠశాలలకు చేరని టీచర్ల వివరాలు వెంటనే పంపించాలని ఎంఈవోలు, సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల ఆధారంగా వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లాకేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాల యంలో సోమవారం నిర్వహించిన గ్రీ వెన్స్కు జిల్లా నలుమూలల నుంచి 38 మంది హాజరై దరఖాస్తులు అందజేశారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధి కారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ పాల్గొన్నారు. -
‘వర్సిటీ’ ఆవశ్యకతపై అవగాహన
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోయూనివర్సిటీ ఏర్పా టు చేయాలని ఆదిలాబాద్ యూనివర్సిటీ సా ధన సమితి జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. వర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లైబ్రెరీలో ఆదివారం అ వగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడంతో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చ దువుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నా రు.ఆర్థికంగా లేనివారు మధ్యలోనే ఆపేస్తున్నా రన్నారు. విద్యార్థినులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక డిగ్రీకే పరిమితమవుతున్నారని పేర్కొన్నా రు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం విద్యాపరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.విద్యార్థులంతా వర్సిటీ సాధన కోసం ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కోకన్వీనర్ రమణాగౌడ్, సుహాసినిరెడ్డి, ఉదారి నారాయణ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
గాడితప్పిన పల్లె పాలన
● ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు ● విధులకు డుమ్మా కొడుతున్న కార్యదర్శులు ● పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా అస్తవ్యస్తం కై లాస్నగర్: పంచాయతీ ప్రత్యేకాధికారులు పల్లెల ముఖం చూడటం లేదు. గ్రామాలను విధిగా సందర్శిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పర్యవేక్షించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా తమకేం సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న పలువురు కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో పంచాయతీ పాలన పూర్తిగా గాడి తప్పింది. సంతకాల కోసమే అన్నట్లుగా.. పంచాయతీ పాలకవర్గాల గడువు గతేడాది జనవరి 31న ముగిసింది. దీంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యమైంది. జిల్లాలో 123 మంది వివిధ శా ఖ ల గెజిటెడ్ అధికారులను పంచాయతీ స్పెషలా ఫీసర్లుగా నియమించారు. ఇందులో ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, ఎంఈవోలు, పీఆర్ఏఈలు, సూపరింటెండెంట్లు, ఏంఏఓలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, వాటర్గ్రిడ్ ఏఈలు వంటి అధి కారులున్నారు. కొన్ని మేజర్ పంచాయతీలకు జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు పంచాయతీల ముఖమే చూడటం లేదు. నెలలో కనీసం ఒకటి, రెండు సార్లు సందర్శించిన దాఖలాలు సైతం కనిపించడం లేదు. జిల్లా కలెక్టర్ పర్యటించిన సమయాల్లో మాత్రమే ఆ గ్రామాలకు వస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం సంతకాల కోసం మాత్రమే ఉన్నారన్నట్లుగా వీరు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువై పంచాయతీ పాలన గతితప్పుతోంది. విధులకు కార్యదర్శుల డుమ్మా .. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు కా ర్యదర్శులు విధులకు గైర్హాజరవుతున్నారు. ఉదయ మే గ్రామానికి చేరుకుని పంచాయతీ మానిటరింగ్ యాప్లో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఫొటో అప్ లోడ్ చేసి అటెండెన్స్ నమోదు చేయాలి. కానీ జిల్లాలో చాలామంది విధులకు వెళ్లకుండానే వెళ్లినట్లుగా ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. తమ ము ఖాలకు బదులు పంచాయతీలోని కుర్చీలు, బీరువా లు,టేబుళ్లు,పంచాయతీ పరిసరాలు నమోదు చేస్తూ అధికారులను తప్పుతోవ పట్టిస్తున్నారు. విధులకు రాకుండా ప్రైవేట్ దందాలు నిర్వహిస్తున్నారు. వీరి హాజరును పర్యవేక్షించాల్సిన ఎంపీవోలు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. ఫలితంగా పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పడం లేదు. తొమ్మిది మంది ఎంపీవోలు.. 26 మంది కార్యదర్శులపై చర్యలు విధులకు రాకున్నా వచ్చినట్లుగా తప్పుడు హాజరు నమోదు చేసిన కార్యదర్శులపై పంచాయతీరాజ్ క మిషనరేట్ చర్యలు చేపట్టేదాకా జిల్లా అధికారులకు విషయం తెలియదంటే పర్యవేక్షణ ఏ విధంగా ఉందనేది స్పష్టమవుతుంది. జిల్లాలో స్థానిక సంస్థల ప ర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారితో పా టు జిల్లా పంచాయతీ అధికారి, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు ఉన్నారు. ఎంపీవోలు సై తం తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంత మంది అధికారులు ఉండగా కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తుంటే వీరంతా ఏం చేస్తున్నారనే సందేహం క లుగుతోంది. జిల్లాలో 9మంది ఎంపీవోలకు, 21 మంది కార్యదర్శులకు నోటీసులు జారీచేయగా, మ రో నలుగురు కార్యదర్శులకు చార్జీమెమోలు ఇచ్చా రు. అలాగే ఓ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది. లోతుగా విచారిస్తే మరింత మంది బయటపడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లాలో.. గ్రామ పంచాయతీలు : 473 రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు : 417 కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్యదర్శులు : 31 కఠినంగా వ్యవహరిస్తాం పంచాయతీలను సందర్శించి సమస్యలను పరి ష్కరించేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేకాధికా రులపై ఉంటుంది. వారు సందర్శించడం లేద నే విషయం నా దృష్టికి రాలేదు. కార్యదర్శుల పనితీరుపై దృష్టి సారిస్తాం. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
వంద సీట్లు గెలుస్తాం
నిర్మల్/ఖానాపూర్: సంక్షేమమే ప్రధాన ధ్యే యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ధీమా పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుచి మళ్లీ అధికా రంలోకి వస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లూ కైవసం చేసుకుంటా మని ధీమా వ్యక్తంజేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్య వహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తది తరులతో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించా రు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఆరుగ్యారంటీలు,ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి హామీలు అమలు చే స్తున్నామని చెప్పారు. తాముఏసీల్లో కూర్చో కుండా తమనేత రాహుల్గాంధీ చెప్పినట్లు ప్రజల్లో ఉండేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామన్నారు. ఆదివాసీలతో అనుబంధం ఉంది : మీనాక్షి మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఆదివాసీగానే పుట్టాలని కోరుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కరించవచ్చన్న తమనేత రాహుల్గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ప్రభుత్వం పని చేస్తోందని పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. తనకు ఆదివాసీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్తోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలోనూ సర్వోదయ యాత్రలో భాగంగా ఆదిలాబా ద్కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ సమాజం నుంచి మంచితనాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. జల్, జంగల్, జమీ న్ కోసం పోరాడిన ఆదివాసీలే తమకు స్ఫూర్తి అన్న రాహుల్ ఆశయాలతోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీసులు, గిరిజనుల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంద ని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రా ష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరో పించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంద ని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్కు దోచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిలుకపలుకులు పలుకుతున్నారని,గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చి, తెలంగాణకు మొండిచే యి చూపారని ఆరోపించారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదని, దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీ రామ రక్ష అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చె ప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎలా దోపిడీ జరిగిందో, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తోందో ప్రజలకు తెలుపుతూ.. సమస్యలు పరిష్కరించేందుకేజనహిత పాద యాత్ర చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ దోపిడీకి పాల్పడితే, బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రేషన్కార్డులు ఇస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామ ని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పా లనలో జీవోలే తప్పా పైసలు ఇవ్వలేదని, అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఎద్దేవా చేశారు. గత సీఎం కేసీఆర్కు ఎన్నిసార్లు విన్నవించినా సదర్మట్ మినీబ్యారేజీ నుంచి ప్రత్యేక కాలువ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే రేఖానా యక్ మండిపడ్డారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, నా యకులు అల్లూరి మల్లారెడ్డి, ఆడె గజేందర్, కంది శ్రీనివాస్, బొంత రామ్మోహన్, నారా యణరావుపటేట్, పడిగెల భూషణ్, ఎంఏ మజీద్, దయానంద్, తోట సత్యం, చిన్నం సత్యం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రెండోసారి అధికారంలోకి వస్తాం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఖానాపూర్లో ‘జనహిత’ పాదయాత్ర భారీగా తరలివచ్చిన నేతలు, శ్రేణులు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి, పలువురు మంత్రులు హాజరు -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్:ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్పోటీల్లో సత్తాచాటా రు. హన్మకొండ వేదికగా నిర్వహిస్తున్న 11వ తెలంగాణ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో ట్రయత్లాన్–ఏ ఈవెంట్లో ఎస్.చరణ్ స్వర్ణ ప తకం సాధించగా, జావెలిన్ త్రోలో వీ.మహేశ్ కాంస్య పతకం సాధించినట్లు కోచ్ రమేశ్ తెలి పారు. అలాగే జిల్లాకు చెందిన కే.జకేశ్ జావెలి న్ త్రోలో గోల్డ్మెడల్తో మెరువగా,రేస్వాక్లో కార్తీక్, రమ్య కాంస్య పతకాలతో సత్తాచాటిన ట్లు అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి రాజే శ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. -
స్నేహబంధం గొప్పది..
● కలెక్టర్ రాజర్షి షా ఐఐటీ కాన్పూర్లో చదివే రో జుల్లో మేం నలుగురం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. సివి ల్స్కు సన్నద్ధమైన సమయంలో మా స్నేహం మరింత బలపడింది. ఎలాంటి సందేహాలున్నా ఒకరికొకరం చర్చించుకుని పరిష్కరించుకునేవాళ్లం. మా నలుగురిలో ఇద్దరం ఐఏఎస్గా ఎంపికవ్వగా, మరో ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. విధి నిర్వహణ పరంగా దూరంగా ఉన్నప్పటికీ ఫోన్లో మాట్లాడుకుంటాం. యోగాక్షేమాలు అడిగి తెలుసుకుంటాం. శుభకార్యాల్లో కలుస్తూ ఉంటాం. అలాగే నా భార్య, యాపల్గూడ 2వ బెటాలియన్ కమాండెంట్, ఐపీఎస్ నితిక పంత్ నా బ్యాచ్మెట్. పనిలో, వ్యక్తిగత జీవితంలో నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలున్నా చర్చించుకుని ముందుకు సాగుతున్నాం. స్నేహబంధం ఎంతో గొప్పది. ఒక మంచి స్నేహితుడు, స్నేహితుల బృందం ఓ వరం. ఒత్తిడిలేని జీవితం గడపడానికి, లక్ష్యసాధనకు దోహదపడుతారనేది నా అభిప్రాయం. – కై లాస్నగర్ -
క్యూఆర్.. జేబుకు చిల్లు!
నా పేరు శివప్రసాద్. ఆదిలాబాద్ వాసిని. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు మంచిర్యాల నుంచి ఆ డిపోకు చెందిన బస్సులో ఆదిలాబాద్ బయలుదేరా. కండక్టర్ టికెట్ అనడంతో ఫోన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తానని చెప్పా. ఆయన మిషన్లో క్యూఆర్ స్కానర్ను చూయించాడు. అందులో రూ.230 టికెట్ ఖరీదు రాగా ఆన్లైన్ పేమెంట్ చేశా. డబ్బులు నా అకౌంట్ నుంచి డ్రా అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. అయితే మిషన్లో సాంకేతిక సమస్య కారణంగా టికెట్ రాలేదు. దీంతో కండక్టర్ డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాలన్నాడు. ఆన్లైన్ పేమెంట్ తిరిగి వస్తాయని చెప్పాడు. చేసేది లేక డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నాను. శనివారం వరకు కూడా ఆ డబ్బులు జమ కాలేదు. చాలా మంది అవి రావని చెబుతున్నారు. సాక్షి, ఆదిలాబాద్: ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ స్కానర్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్న ప్రయాణికులకు జేబులకు చిల్లుపడుతుంది. ఆన్లైన్ పేమెంట్ అయినా మిషన్ నుంచి టికెట్ రాకపోవడంతో నష్టపోవాల్సిన పరిస్థితి. ఒక వేళ ఆ సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే దిగిపోమ్మంటూ కండక్టర్లు చెప్పేస్తున్నారని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వమెమో ఆర్టీసీలో నగదు రహిత సౌలభ్యం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నా తరచూ ఇలాంటి ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం. ఐ–టిమ్ ద్వారా.. ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇందుకోసం చలో కంపెనీ నుంచి ఐ–టిమ్ మిషన్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ రీజియన్లో గత ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ఏసీ బస్సులు మొదలుకుని సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగుల్లోనూ అమలు పర్చారు. రీజియన్ పరిధిలోని ఆయా డిపోల్లో మొత్తం 520 మిషన్లు ప్రస్తుతం పని చేస్తున్నాయి. అయితే అత్యధిక మిషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ద్వారా డబ్బులు స్కాన్ చేస్తున్న ప్రయాణికులకు చుక్కెదురవుతుంది. డబ్బులు అకౌంట్ నుంచి కట్ అవుతున్నా టికెట్ మాత్రం జనరేట్ కావడం లేదు. దీంతో ప్రయాణికులు కండక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో వివాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అంతే కాకుండా సిగ్నల్ వీక్ ఉన్నచోట ఇవి పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ఆ డబ్బులు తిరిగి వస్తాయని చెబుతున్నారు. పరిశీలన చేస్తాం.. టిమ్ మిషన్లపరంగా ప్రయాణికులు వ్య క్తం చేస్తున్న ఈ సమస్యపై పరిశీలన చే స్తాం. ఒకవేళ అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా అయిన పక్షంలో కండక్టర్లను ఓ నంబర్కు స్క్రీన్ షాట్ పెట్టాలని చెప్పాం. తద్వారా 24గంటల్లో ఆ ప్రయాణికులకు డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తున్నాం. సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తాం. – భవానీప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం -
కలెక్టర్కు మరో అవార్డు
● రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న రాజర్షి షా కై లాస్నగర్: నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నార్నూర్ బ్లాక్ను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కలెక్టర్ రాజర్షి షాను ఇప్పటికే జాతీయస్థాయి అవార్డు వరించగా.. తాజాగా రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)సంపూర్ణతా అభియాన్ సమ్మాన్ సమరోహ్ పేరిట ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నా రు. గోల్డ్మెడల్తో పాటు ప్రశంసాపత్రం అందజేసి వారు అభినందనలు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, ప్రిన్సిపల్ సెక్రటరీలు జ్యోతి బుద్ద ప్రకాశ్, దాన కిశోర్ తదితరులు పాల్గొన్నారు. గుర్తుకొచ్చిన ఆ ముగ్గురు ఐఏఎస్లు.. కాగా ఈ వేదికపై గతంలో ఆదిలాబాద్ కలెక్టర్లుగా పనిచేసిన మరో ముగ్గురు ఐఏఎస్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణారావు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్గా వ్యవహరించారు. అలాగే జ్యోతిబుద్ధప్రకాశ్, దివ్యదేవరాజ న్లు సైతం కొత్త ఆదిలాబాద్కు కలెక్టర్లుగా వ్యవహరించినవారే. ఆ ముగ్గురూ ఇదే వేదికపై ఉండటం జిల్లావాసులకు గత జ్ఞాపకాలను గుర్తు చేసినట్లయింది. అలాగే సమగ్ర గిరిజన అభివృద్ధిసంస్థ పరిధిలో సేవలందించిన ఉ ట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. -
ఏటా కలుసుకుంటున్నాం..
● అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే నా టెన్త్ ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తయింది. మాది 1986–87 బ్యాచ్. అప్పుడు విడిపోయిన మేమంతా ఇరవై ఏళ్ల తర్వాత 2006లో కలుసుకున్నాం. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా మళ్లీ కలుసుకోవడంతో మా స్నేహం తిరిగి చిగురించింది. అప్పటి నుంచి ఏటా వేసవిలో అపూర్వ సమ్మేళనం పేరిట 120 మంది వరకు ఒక్క చోటకు చేరుతున్నాం. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. హోదాలతో సంబంధం లేకుండా మా ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తున్నాం. రీ యూనియన్ రోజు అన్నీ మరిచిపోతాం. ఆ జ్ఞాపకాలను ఆస్వాదిస్తాం. సృష్టిలో స్నేహ బంధం ఎంతో గొప్పది. నిజమైన స్నేహితులను వదులుకోవద్దు. – నేరడిగొండఅవసరాల కోసం స్నేహాలు చేస్తున్న ప్రస్తుత సమాజంలో 50 ఏళ్లుగా ఓ ఇద్దరూ వ్యక్తులు స్నేహానుబంధాన్ని పంచుకుంటూ పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. 1970 దశకంలో మొదలైన వారి సోపతి ఇప్పటికీ ఎలాంటి అరమరికలు లేకుండా సాగుతోంది. వారే పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన కొమ్ము రాజన్న, తిర్పెళ్లి కాలనీకి చెందిన సట్ల అశోక్. వీరి తల్లిదండ్రులు కూడా వీరిలాగే కలిసిమెలిసి ఒకే కుటుంబంలా మెలిగేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరూ కలిసి తీసుకుంటామని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు సందర్శిస్తామని, తాము కలవనిదే రోజు గడవదని చెబుతున్నారు. రాజన్న ప్రస్తుతం డీఎస్ఏలో వాచ్మెన్ విధులు నిర్వహిస్తుండగా, మల్లేశ్ వ్యవసాయం చేస్తున్నాడు. మేము కలిసి చేసిన కష్టమే ఒకరిపై ఒకరికి గౌరవాన్ని పెంచడంతో పాటు బలమైన బంధానికి పునాదులు వేసిందని చెప్పుకొచ్చారు ఈ చెడ్డీ దోస్తులు. – ఆదిలాబాద్ 50 ఏళ్ల దోస్తానా.. -
● బడికి పరుగులు పెట్టిన ఉపాధ్యాయులు
‘ఎఫ్ఆర్ఎస్’తో సమయపాలన ఆదిలాబాద్టౌన్: బడులకు డుమ్మా కొట్టే, సమయపాలన పాటించని పంతుళ్లకు చెక్ పడింది. శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం) అటెండెన్స్ అమలులోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేందుకు పాఠశాలలకు పరుగు పెట్టారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే చేరుకొని ఫేషియల్ అటెండెన్స్ నమోదు వేశారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటలకు హాజరు వేసుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సర్వర్ డౌన్ కారణంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రక్రియతో ఇష్టారీతిన బడికి వెళ్లే ఉపాధ్యాయుల ఆగడాలు ఇకపై సాగని పరిస్థితి. జిల్లాలో డీఈవో పరిధిలో 691 పాఠశాలలు ఉండగా, 3,288 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ ఫేషి యల్ అటెండెన్స్ వర్తింపజేశారు. విద్యార్థులతో పాటు టీచర్లు తమ ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లేవారు ఇదివరకు బస్టాండ్, తెలంగాణ చౌక్, ఠా కూర్ హోటల్, తాంసి బస్టాండ్లలో 9 నుంచి 10 గంటల వరకు కనిపించేవారు. శనివారం ఆ ఉపాధ్యాయులు ఉద యం 8 గంటలకే ఇంటి నుంచి బయల్దేరి నిర్ణీత సమయంలోగానే పాఠశాలలకు చేరుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
శిక్షణ నుంచి మంచి స్నేహితులం
● ఎస్పీ అఖిల్ మహాజన్ 2017లో మసూరిలో ట్రెయినింగ్ నుంచి కలెక్టర్ రాజర్షిషా, ఆయన సతీమణి నితిక పంత్ మంచి స్నేహితులం. శిక్షణ అనంతరం ఇతర జిల్లాల్లో పోస్టింగ్ తీసుకున్నప్పటికీ యోగక్షేమాలు తెలుసుకునేవాళ్లం. అప్పుడప్పుడు కలిసేవాళ్లం. ప్రస్తుతం ముగ్గురం ఆదిలాబాద్ జిల్లాలోనే పనిచేస్తున్నాం. ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఏ విషయాన్నైనా పంచుకునేది స్నేహితులతోనే. సంతోష సమయంలోనే కాదు.. కష్టాల్లోనూ తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. – ఆదిలాబాద్టౌన్ -
టీబీ రహిత సమాజానికి కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: టీబీ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. రిమ్స్లో శనివారం టీబీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జిల్లాలో టీబీ నివారణ కు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జ నరల్ మెడిసిన్, పీడియాట్రిక్తో పాటు ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడారు. దేశంలో టీబీ నివారణ కోసం ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, వైద్యులు సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ కొత్త నాటకం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్: రాష్ట్రంలోని బీసీలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని బీసీ రిజర్వేషన్ల పేరిట కొత్త నాటకానికి హస్తం సర్కారు తెరలేపిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీల వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీ రిజర్వేషన్లను తెరమీదకి తీసుకువచ్చారని ఆరోపించారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఆ పార్టీకి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ముస్లింల ప్రస్తావన లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేంతవరకు ఆ పార్టీని బీజేపీ వెంటాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. -
కాలువల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేదు..
ఏమాయికుంట శివారు గురుదేవ్ చెరువు కింద హీరాపూర్లో నాకు నాలుగెకరాల సాగు భూమి ఉంది. యాసంగిలో పంటలు పండించాలంటే తప్పనిసరి ఆ చెరువు నీళ్లే దిక్కు. అయితే ఇప్పటివరకు నిండకపోవడంతో వచ్చే సాగు ఎలా చేపట్టాలో అర్థం కావట్లే. కాల్వల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి కనిపించట్లే. – పఠాన్ అన్వర్, రైతు, హీరాపూర్, ఇంద్రవెల్లి మండలం చాలా చెరువులు నిండలేదు.. జిల్లాలో ఇంకా అనేక చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. భారీ వర్షాలు కురిస్తే నిండే అవకాశం ఉంది. యాసంగిలో ఆయకట్టు భూములకు నీళ్లందించేలా చూస్తాం. – విఠల్, ఈఈ, నీటిపారుదల శాఖ, ఆదిలాబాద్ -
చాంపియన్లుగా నిలవాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయి వేది కలపై ఓవరాల్ చాంపియన్లుగా నిలవాలని డీౖ వెఎస్వో జక్కుల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో గల జూడో హాలు లో శుక్రవారం నిర్వహించిన సబ్ జూనియర్, కేడేట్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. నిరంతరం సాధన చేస్తేనే గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారినిఈనెల 5నుంచి 7 వరకు వరంగల్ వేదికగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో కోచ్ రాజు, డీఎస్ఏ సిబ్బంది సురేశ్, శిక్షకులు కబీర్దాస్, రమేశ్, శ్రీధర్ తదితరులున్నారు. -
బాలలు బడిలోనే ఉండాలి
● ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం ● 93 మంది బాలకార్మికులకు విముక్తి.. 28 కేసులు నమోదు ● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: బాలలు బడిలోనే ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 93 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామని, 28 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 86 మంది బాలురు, ఏడుగురు బాలికలను రక్షించినట్లు తెలిపారు. 70 మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే 23 మంది పిల్లలను వసతిగృహాలకు తరలించి వారి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కార్మిక, విద్యా శాఖలతో పాటు చైల్డ్ ప్రొటక్షన్, ఎన్జీఓల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ నెలపాటు కాకుండా నిరంతరం సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమష్టి కృష్టితోనే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చన్నారు. పోలీసు ఆధీనంలో ఉన్న వాహనాలను తీసుకెళ్లాలి పోలీసు ఆధీనంలో ఉన్న వాహనాలను వాహనదారులు నిజధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆరు నెలల్లోగా తీసుకెళ్లాలని ఎస్పీ అన్నారు. జిల్లాలోని ఆయా స్టేషన్ల పరిధిలో వివిధ నేరాలకు సంబంధించి, పలుచోట్ల లభ్యమైన వాహనాలు 51 ఉన్నాయని తెలిపారు. 2026 జనవరి వరకు అవకాశం ఉందని, యజమానులు గమనించాలని సూచించారు. గడువు అనంతరం పోలీసు హెడ్క్వార్టర్స్లో మిగిలిన వాటికి బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలిపారు. సందేహాలు ఉంటే రిజర్వు ఇన్స్పెక్టర్ మురళిని 8712659962 నంబర్పై సంప్రదించాలని సూచించారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇంద్రవెల్లి: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నా రు. మండలకేంద్రంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తాతో కలిసి కొత్త రేషన్కార్డులను లబ్ధిదారులకు శుక్రవా రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎలాంటి పైర వీ లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీజేపీ మత రాజకీయాలు మా నుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎస్వో వాజిద్ అలీ, ఆది లాబాద్ ఆర్డీవో స్రవంతి, ఇంద్రవెల్లి మా ర్కెట్ కమి టీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్ర వీణ్కుమార్, ఎంపీడీవో భాస్కర్, కాంగ్రెస్ నాయకులు ఎండీ మసూద్, ఎండీ జహీర్ తదితరులున్నారు.