సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
ఇచ్చోడ: గిరిజన విద్యార్థులు సాంకేతిక పరి జ్ఞానం పెంపొందించుకోవాలని మైండ్ స్పా ర్క్ కోఆర్టినేటర్ కిశోర్ అన్నారు. మండలంలోని రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో నలుగురు విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థుల్లో సాంకేతిక విద్య అభివృద్ధి కోసం సంస్థ పనిచేస్తుందన్నారు. ల్యాప్టాప్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆత్రం భాస్కర్, పాఠశాల సిబ్బంది గజనంద్నాయ క్, శంభు తదితరులు పాల్గొన్నారు.


