తారాబు జలపాతం (పిట్టలబోర లేదా గుంజివాడ జలపాతం అని కూడా పిలుస్తారు) ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కొమ్మలకొండ అడవుల్లో ఉన్న ఒక అద్భుతమైన, దాగి ఉన్న జలపాతం.
ఇది సుమారు 160 అడుగుల నుండి 250 అడుగుల ఎత్తు నుండి పడుతూ, రాష్ట్రంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
ఇది పచ్చని అడవులు, కొండల మధ్య బాహుబలి వంటి దృశ్యాలను తలపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
తారాబు జలపాతం ఇప్పుడు పర్యాటకులకు ఒక మధురమైన అనుభూతి కంటే ఎక్కువగా, వెన్నులో వణుకు పుట్టించే సాహసంగా మారింది. ఆకాశం నుంచి జాలువారుతున్న పాలధార మాదిరిగా జలపాతం పర్యాటకులను రమ్మని ఆహ్వానిస్తుంది.
అక్కడికి చేరుకునే దారి మాత్రం నరకప్రాయంగా మారింది. జలపాతం అందాలను దగ్గర నుంచి చూడాలంటే, పర్యాటకులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే.
అక్కడ సరైన రహదారి లేదు, మెట్లు లేవు. కేవలం అడవిలో దొరికిన కర్రలతో, తాళ్లతో స్థానికులు ఏర్పాటు చేసిన ఒక తాత్కాలిక కర్రల నిచ్చెనలు మాత్రమే ఏకైక మార్గం.
వర్షాకాలం తర్వాత, శీతాకాలం మరియు వేసవిలో వెళ్ళడం మంచిది.
విశాఖపట్నం నుండి సుమారు 171 కి.మీ. మరియు పాడేరు నుండి 75 కి.మీ. దూరంలో ఉంది.


