మద్యం షాపులు బంద్
ఆదిలాబాద్టౌన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణ పరిధిలో మద్యం షాపులు మూ సివేస్తున్నట్లుగా ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు.ఈ మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలోని బార్లు, వైన్స్ షాపులను ఎక్సై జ్ అధికారులు మూసివేయించారు. మున్సి పల్ పరిధిలో మంగళ, బుధవారాల్లో షాపులు బంద్ ఉంచాలని పేర్కొన్నారు. అలాగే ఈనెల 13న కౌంటింగ్ రోజు కూడా పట్టణంలోని 11 బార్లు, 10 వైన్స్లు, తెల్లకల్లు దుకాణాలు బంద్ పాటించాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు షాపులు తెరువవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


