బరిలో బంధువులు
లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల్లో తీవ్ర పోటీ నెలకొంది. బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ చేస్తున్నారు. ముగ్గురిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందేని చంద్రకళ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాందేని జమున వరుసకు పిన్ని, కూతురు అవుతారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న గడికొప్పుల శీలారాణి జమునకు అత్తమ్మ, చంద్రకళకు వదిన అవుతారు. ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో ఎవరికి ఓటు వేయాలనే సంకోచంలో ఓటర్లు ఉన్నారు.
బరిలో బంధువులు
బరిలో బంధువులు


