బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏజీఎం ఫైనాన్స్గా విధులు నిర్వర్తిస్తున్న మురళీధర్ కార్పొరేట్ ఏరియాకు బదిలీ అయ్యారు. బుధవారం అడ్మిన్ భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్టీపీపీ జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ ఆయనను శాలువాలతో సత్కరించారు. మురళీధర్ ఎస్టీపీపీకి అందించిన సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఎంవోఐ ప్రెసిడెంట్ పంతుల, డీజీఎంలు అజాజుల్ల ఖాన్, శివ ప్రసాద్, వేణు గోపాల్, పర్సనల్ డీజీఎం కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


