నిర్మల్ టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధికి సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ కోరారు. సోమవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం వారు పట్టణంలో ఈద్గా ఏర్పాటు చేయాలని, మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లో సౌకర్యాలు మెరుగు పరచాలని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషిని కోరారు.


