ఆత్మీయ సన్మానం
ఉద్యోగ విరమణ పొందిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి దంపతులను జిల్లా అధికార యంత్రాంగం ఆదివారం ఘనంగా సత్కరించింది. పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆమె సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
– కై లాస్నగర్


