కుమురంభీం కాలనీలో కంటైనర్
పిల్లలకు చదువు చెబుతున్న టీచర్
జిల్లాలో మార్చి ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. కొన్నిరోజులుగా 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు పెద్దలే కాకుండా విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. పట్టణంలోని కుమురంభీం కాలనీలో ఏర్పాటు చేసిన కంటైనర్లో ఇటీవల తరగతులు ప్రారంభమయ్యాయి. మండుతున్న ఎండలతో వారికి అవస్థలు తప్పడం లేదు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్


