ఆదిలాబాద్రూరల్: ఈనెల 15న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న హీరా సుకా జయంతి వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు భారీగా తరలి రావాలని మాజీ ఎంపీ, రాజ్గోండ్ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ కోరారు. ఆదివాసీ పర్ధాన్ కులస్తులు శుక్రవారం ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలంతా ఐక్యంగా ఉంటూ సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మెస్రం శంకర్, గేడం మాధవ్, కుర్సేంగే తానా జీ, సిడాం రాంకిషన్, యాదవ్రావ్, మనోహర్, శివ, శేషారావ్, పురుషోత్తం, దత్తు, భాస్కర్, నిరంజన్, దిలీప్, ఉత్తం, తదితరులున్నారు.


