గోపాలకృష్ణ మఠం వద్ద కామ దహనం
జిల్లా కేంద్రంలో సోమవారం కామదహనం ఘనంగా చేపట్టారు. పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, మార్వాడి ధర్మశాల, శ్రీశనీశ్వరాలయ ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాన్ని రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామీజీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులపై రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు ప్రమోద్ కుమార్ఖత్రి, ప్రపుల్ వజే, తదితరులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్


