నస్పూర్: నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్ముల్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా కొట్టె దేవేందర్, కోశాధికారిగా ఎం.గణరాజ్, ఉపాధ్యక్షులుగా ఇ.వెంకటేశ్, ఎన్.సురేందర్, జి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్గౌడ్, రాజేందర్, కమలాకర్, కార్యవర్గ సభ్యులుగా ఈశ్వర్ ప్రసాద్, శ్రీకాంత్, వినయ్యాదవ్, డానియల్ ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్వొకేట్ చుంచు వెంకటేశ్ తెలిపారు. నూతన కార్యవర్గం కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంత ప్రతాపరెడ్డి, ట్రెజరర్ కె.కృష్ణ, ఒలింపిక్ జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ కనపర్తి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


