సరస్వతికి జాతీయస్థాయి పురస్కారం
ఉట్నూర్రూరల్: ఆదివాసీలకు దక్కాల్సిన అట వీ హక్కులు, మహిళా సాధికారితపై నిరంత రం కృషి చేస్తున్న ఉట్నూరు మండలం లక్కా రం గ్రామానికి చెందిన మర్సుకోల సరస్వతికి జాతీయస్థాయి పురస్కారం లభించింది. ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో ఒడిశా రాజధా ని భువనేశ్వర్లో ‘యాక్షన్ ఎయిడ్ సంస్థ’ నిర్వహించిన ‘ఫారెస్ట్ లైవ్లీ హుడ్ ఐడెంటిటీ’పై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి సరస్వతి పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ సందీప్ చాచ్రా, ఎస్తేర్ సెల్వం చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.


