కై లాస్నగర్: ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి రాథోడ్ రవీందర్ సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో వైద్యశిబిరం నిర్వహించారు. నిజామాబా ద్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు హాజరై ఉపాధిహామీ లో పనిచేసే ఏపీవోలు, ఈసీలు, టీఏలు, కార్యాల య ఉద్యోగులు, వారి కుటుంబీకులకు ఆరోగ్య పరీ క్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. అడిషనల్ డీఆర్డీవో కుటుంబరావు, ఏవో గంగాధర్, హెచ్ఆర్ మేనేజర్ రషీద్ ఉన్నారు.
ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుడు


