ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేల మండలానికి చెందిన పలు గ్రా మాల సర్పంచ్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బీజేపీలో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే గ్రామాల రూపురేఖలను మారుస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అభివృద్ధికి ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో చంపెల్లి సర్పంచ్ సోనే రావు, సదల్పూ ర్ సర్పంచ్ మంగేష్, కొబ్బాయి సర్పంచ్ సత్యపాల్, పిట్ గావ్ సర్పంచ్ భీమ్ రావు ఉన్నారు.


